Showing posts with label Spiritual. Show all posts
Showing posts with label Spiritual. Show all posts

Monday, December 13, 2021

వ్యాసం స్వామి వివేకానంద -రచన - కర్లపాలెం హనువుంతరావు ( సూర్య సంపాదకీయ పుట ప్రచురణ )



వ్యాసం 

స్వామి వివేకానంద 

 -రచన - కర్లపాలెం హనువుంతరావు 

( సూర్య సంపాదకీయ పుట ప్రచురణ ) 



స్వామి వివేకానంద డాంబిక ప్రదర్శన లేని విరాగి.  ప్రాపంచిక విషయాల తరహాలోనే రాజకీయ వ్యవహారాలనే తామరాకు పైన   తనను  తాను ఓ నీటి బిందువుగా భావించుకున్న ఆధునిక యోగి.  ఆ పరివ్రాజకుడికి ఆ అంటీ ముట్టనితనం   సాధ్యమయిందా?  పరిశీలిద్దాం. 

తన జీవితకాలంలో ఎన్నడూ రాజకీయరంగం దిశగా స్వామి అడుగులు పడిన సూచనలు కనిపించవు.  ఏ రాజకీయ పక్షానికీ ఆయన మద్దతు లభించిన  దాఖలాలూ దొరకవు. తన స్వంత  పరివ్రాజక సంస్థలోనూ రాజకీయరంగ ప్రస్తక్తిని నిషేధించిన స్వామీజీ.. ఆ నిబంధనను అధిగమించినవాళ్లని సభ్యత్వం నుంచి తొలగించేందుకైనా సందేహించినట్లు కనిపించదు. రామకృష్ణ మిషన్ నుంచి నివేదిత రాజకీయ సంబంధిత  కారణాల  వల్ల వైదొలగినప్పటి బట్టి స్వామీజీలో ఈ రాజకీయ విముఖత మరింత కరుడుగట్టినట్లు  భావిస్తారు. వివేకానందుడు నివేదితకు పరివ్రాజక సంఘంలో సభ్యత్వం నిరాకరించడం  ఈ సందర్భంగా గమనించవలసిన ముఖ్యాంశం.  

మనిషి పట్ల స్వామికి ఉండే ప్రేమ, సానుభూతి అపారమైనవి. అయినా సందర్భం వచ్చిన ప్రతీసారీ  వివేకానందుడు రాజకీయాల పట్ల తనకున్న విముఖతను నిర్మొహమాటంగా బైటపెట్టేవారు. స్వామి దృష్టిలో రాజకీయాలు మనిషిని సంకుచిత మార్గంలోకి మళ్లించేవి. రాజకీయం మిషతో ఎదుటి మనిషిని పీడించడమే కాదు, తనను గూర్చి తాను  డాంబికంగా  ఊహించుకునే మానసిక రుగ్మత మొదలవుతుందన్నది  వివేకానందుడి నిరసన వెనక ఉన్న భావన. ప్రస్తుతం నడుస్తున్న రాజకీయ ప్రహసనాలు చూస్తున్నప్పుడు వివేకానందుడి నాటి ఊహలో వీసమెత్తైనా అసత్యం లేదనే అనిపిస్తుంది.  

స్వామి దృష్టిలో ఈ దేశం పుణ్యభూమి. ఇక్కడి అణువణువు అత్యంత పవిత్రమైనది.  రుషులు,  జాతి వివక్షతకు తావీయని పద్ధతుల్లో  సర్వ మానవాళికి  ఉచితంగా  ఆధ్యాత్మిక జ్ఞానసంపదను పంచిపెట్టారు. వారి అనుయాయులదీ అదే సన్మార్గం. భారతీయుల  మానవతావాదం యావత్ ప్రపంచం దృష్టిలో గౌరవనీయమైన స్థానం సాధించుకునేందుకు ఇదే ముఖ్య కారణం. సర్వశ్రేష్టమైన మానవత్వం పట్ల   భారతీయుల ఆధ్యాత్మిక సంస్కృతి కనబరచిన శ్రద్ధాసక్తులు  ప్రపంచం దృష్టికి తేవడమే లక్ష్యంగా చికాగో సర్వమత మహాసభ తాలూకు   వివేకానందుడి తొలి  ప్రసంగం సాగింది కూడా. 

 ప్రపంచం భారతీయ సంస్కృతి ఔన్నత్యం గూర్చి చర్చించడానికి భారతీయులు కేవలం భారతీయుల మాదిరిగానే ఉండి తీరాలని స్వామి ప్రగాఢంగా విశ్వసించారు. కేవలం ఆ కారణం చేతనే మరే ఇతర దేశమో, సంస్కృతో మన దేశం మీదనో,  సంస్కృతి మీదనో పెత్తనం చెలాయించే అత్యుత్సాహం ప్రదర్శించినప్పుడు, చెత్త రాజకీయాల ద్వారా  జోక్యం చేసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు వివేకానందుడు తీవ్రంగా అసహం వ్యక్తపరిచింది.  

ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే భారతీయుల పుణ్యభూమి పై పరాయివారి పాలన కొనసాగకూడదన్నదే స్వామి ప్రగాఢ కాంక్ష. ఆ చింతనాపరుడి ఆలోచనల నుంచి రగిలిన దేశభక్తి భావనలే అప్పటి ఈ దేశపు యువతను తెల్లవారి పాలనకు ఎదురు నిలిచే దిశగా ప్రోత్సహించింది. స్వీయ వ్యక్తిత్వ వికాస నిర్మాణం దిశగా ధ్యాస పెట్టేందుకూ దోహదించిన భావజాలం వివేకానందునిది. ఆ పరివ్రాజకుడి ప్రబోధాల ప్రభావమే మరణానంతరమూ  బ్రిటిష్ దొరల దృష్టిలో స్వామిని  విప్లవకారుడి కింద ముద్ర వేయించింది. 

నైతిక పతనం వల్ల నిజమైన ఆర్థిక స్వాతంత్ర్యం  సాధ్యం  కాదు. రాజకీయాలదే మనిషి పతనానికి చాలా వరకు ప్రధాన బాధ్యత- అన్నది రాజకీయాలపై వివేకానందుని తిరుగులేని సూత్రీకరణ. 'చట్టం, ప్రభుత్వం, రాజకీయాలు మాత్రమే సర్వస్వం కాదు. అవి కేవలం మనిషి జీవన పరిణామ క్రమంలో కొన్ని దశలు మాత్రమే. మానుషత్వ సాధన ఆయా రంగాల ఊహకైనా అందనంత ఎత్తులో ఉంటాయన్న'ది  వివేకానందుడి ఆలోచన. మనిషి అంతరంగ పరంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన నీతి నిజాయితీల  పట్ల రాజకీయాలకు ఎప్పుడూ బొత్తిగా ఆసక్తి ఉండదు’ అన్నది వివేకానందుడి ఫిర్యాదు. కులం, మతం, వర్గం -ఇత్యాదుల పరంగా ప్రజావళిని  విభజనకు గురి చేసే రాజకీయాలు ఈ దేశాన్ని పట్టి వదలకుండా పీడిస్తున్న ప్రధాన రుగ్మతలుగా స్వామి ఆనాడే గుర్తించి గర్హించారు. రెండో ప్రాధాన్యంగా ఉండవలసిన ‘గుడి- మసీదు- చర్చి’ రాజకీయాలు మొదటి స్థానం ఆక్రమించడం స్వామీజీకి బొత్తిగా  గిట్టేది కాదు. మానుషత్వం సంకుచితమయిపోతూ, దేవుళ్లూ దయ్యాలనే భావనల పట్ల వెర్రితనం ప్రబలిపోవడం మనిషికి, మనిషికి మధ్య పూడ్చలేని అగాథాలను సృష్టికేనన్నది ఆయన భావన. రాజకీయక్షేత్ర అనైతిక క్రీడల పట్ల స్వామీజీ క్రుద్ధుడు కాని క్షణం లేదు. 'ఉన్న పరిమిత అనుభవంతో నేను సేకరించిన జ్ఞానం నాకు బోధిస్తున్నది ఏమిటంటే.. మతం మీద మనం ప్రదర్శించే విముఖత్వానికి  మతం అసలు కారణమే కాదు. మనిషిలోని విద్వేషగుణానికి మతాన్ని తప్పు పట్టి ప్రయోజనంలేదు. ఏ మతమూ మనిషిని నిట్టనిలువుగా తగలవేయమని చెప్పదు; సాటి మనిషిని పీడించమనీ రెచ్చగొట్టదు. ఆ తరహా  దుష్కృత్యాలు చెయ్యమని మనిషి మీద వత్తిడి చేసేందుకుగాను మతం పుట్టలేదు. అంతులేని అమానుష కార్యాలన్నిటికి మనిషిని  ప్రేరేపిస్తున్నవి నిజానికి జుగుప్సాకరమైన రాజకీయాలే. కానీ,  ఆ తరహా  అవాంఛనీయ రాజకీయాలనే నిజమైన మతమని జనం నమ్ముతున్నారిప్పుడు! ఈ విషాదకర పరిణామాలకు బాధ్యులెవరో గ్రహించినప్పుడే మనిషికి నిజమైన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లభించేది' అన్నారో సందర్భంలో స్వామి వివేకానంద మతానికి రాజకీయాలకు మధ్య గల అపవిత్ర సంబంధాలను ఎండగడుతూ.  

మతం అసలైన పరిమళం ఆధ్యాత్మికత. నిజమైన ఆధ్యాత్మిక విశ్వాసి దుష్కృత్యాల మీద ధ్యాస పెట్టడు. పరులకు దుఃఖం కలిగే చర్యలు చేపట్టడు.  స్వానుభవం నుంచి వెలికి తీసిన వెన్నముద్దల వంటి సూక్తులు పంచిపెట్టే ఒక సందర్భంలో స్వామి వివేకానందుడు 'మనిషి మేధస్సు చేయదగిన అత్యుత్తమైన ఆరోగ్యకరమైన దారుఢ్య సాధన.. స్వచ్ఛమైన అంతరంగంతో మతాన్ని అనుసరించడం మాత్రమే' అని హితవిచ్చారు.  

జంతువు, మనిషి, దేవుడు- ఈ ముగ్గురికి  ముఖ్య ప్రవృత్తుల సంగమమే మనిషి. అతనిలో అంతుబట్టకుండా దాగి  ఉండి అంతర్గతంగా చెలరేగే రాగద్వేషాల వంటి దుర్లక్షణాలను అణచివేయడం ద్వారా పశుప్రవృత్తిని సాధ్యమైన మేరకు కుదించి మనిషిలో నిద్రాణమై ఉన్న దైవత్వాన్ని తట్టిలేపడమే 'మతం' అసలు లక్ష్యం. 'కాబట్టే  దేశానికి ఒక రాజ్యాంగం ఎంత అవసరమో, మనిషికి మతమూ అంతే అవసరం' అని వివేకానందుడు భావించింది. ఈర్ష్యాసూయలు, క్రోధావేశాలు వంటి విద్వేష భావనలకు మాత్రమే ఆలవాలమైన రాజకీయాలు సర్వమానవళి పట్ల సరిసమానమైన ప్రేమాభిమానాలను పంచవలసిన మనిషికి మేలు చేయవని స్వామి గట్టిగా నమ్మారు. ప్రతికూల దృక్పథ రాజకీయాలతో ప్రపంచమంతా పొంగి పొర్లిపోతున్న సన్నివేశాల మధ్య జీవిస్తున్న స్వామి పౌరుల మనసులు దుర్మార్గమైన ఆలోచనలతో కలుషితం కాక  ముందే, వారి మెదళ్లను అందుకే ఉదాత్తమైన ఆధ్యాత్మిక భావనలతో ముంచెత్తెయ్యాలని  అనుక్షణం ఆరాటపడిపోయింది.  

యూరోపియన్ మేధావుల సదస్సులో ఉటంకించిన భావాలను పునరాలోచిస్తే వివేకానందుడికి భారతీయ సోషలిజమ్ పట్ల ఎంత  చక్కని  అవగాహన ఉందో అర్థమవుతుంది. 'భారతదేశంలోనూ సోషలిజమ్ ఉంది. కానీ  అదీ యూరోపియన్ తరహా ద్వంద్వ విధానం కన్నా విభిన్నంగా ఉంటుంది. అద్వైతమనే అఖండ జ్యోతుల వెలుగుల్లో కళాకాంతులీనే సాంఘిక వ్యవస్థ మాది. యూరప్ లో ప్రాచుర్యంలో ఉన్న సోషలిజమ్ భావనలో మాత్రమే ఆర్థిక సోషలిజమ్. అర్థికపరమైన  కోణంలో చూడడమే అందులోని ప్రధాన  లోపం. బైటకు  వ్యక్తివాదానికి చోటిచ్చే వ్యవస్థగానే  కనిపించినప్పటికీ,  వాస్తవానికి అది వ్యక్తిలోనే నిత్యం సంఘర్షించే రెండు పరస్పర విరుద్ధమైన శక్తుల(మనసు, మెదడు)ను పరిగణలోకి తీసుకునేపాటి శ్రద్ధ చూపించలేదు’ అని స్వామి కుండబద్దలు కొట్టినట్లు చెప్పిన మాట. మార్క్సిజమ్ ఒక  రాజకీయ భావజాలంగా యూరప్ నంతటా ముంచెత్తుతున్న దశలో, దాని తాకిడి హిందూదేశపు ఎల్లలలను కూడా తాకుతున్న నేపథ్యంలొ వివేకానందుడు నిర్భీతిగా వెల్లడించిన మనసులోని మాటలు ఇవి. ఆ నాటి రాజకీయ యుగసంధిలోని పరిణామాలన్నింటిని బాగా ఆకళింపు చేసుకున్న ఆధ్యాత్మిక చింతనాపరుడు కాబట్టే వివేకానందుడు సోషలిజమ్, మార్క్సిజమ్ వంటి సాంఘిక చైతన్య భావజాలాలలోని  'సామాన్యుణ్ణి ఉద్ధరించే లక్ష్యం'  వైపుకు ఆకర్షితుడై తనను తాను ఒక 'ఆధ్యాత్మిక సోషలిష్టు'గా ప్రకటించుకున్నాడు. ఒక పరివ్రాజకుడు సోషలిజమ్ పట్ల ఆకర్షితుడవడం వరకు నిజంగా ఒక అద్భుత సన్నివేశమే! కాని ఆ పోలిక అక్కడి వరకే సరి.

సోషలిజమ్ లోని శ్రామిక పక్షపాతం స్వామిని బాగా ఆకర్షించిన సద్గుణాలలో ఒకటే కానీ, అదే సమయంలో పీడితుని బాధా విముక్తికై సోషలిజమ్ సూచించిన మార్గమే సమగ్రమైనదిగా భావించడానికి ఆయన సమ్మతించలేదని కూడా గమనించడం ముఖ్యం. సోషలిజమ్ భావనను ఆయన 'సగం ఉడికిన ఆహారం'గా భావించారు.  

అంతర్గతంగా దాగిన లోపాల వల్ల ఉన్నవారికి, లేనివారికి మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చే  శక్తి సోషలిజానికి చాలదన్న భావన వివేకానందుడిలో ఉంది.  సోషలిజమ్ ప్రవచించే మేధావుల మధ్య గల అభిప్రాయ భేదాలనూ ఆయన గుర్తించకపోలేదు.

 సోషలిజమ్ అన్న భావన ఆధునిక ప్రపంచానికి సైంట్ సైమన్ (1760 -1825), ఫ్యూరర్ (1772 -1832), రాబర్డ్ ఓవెన్ (1804 -1892) ద్వారా పరిచయం చేయబడింది.  త్రిమూర్తుల ద్వారా ప్రవచితమైన ఈ సామాజిక సూత్రాలు  ఎవరి వల్లా నమ్మదగిన స్థాయిలో సవ్యంగా నిర్వచించబడలేదన్నది ఒక ఫిర్యాదు. 'ఎవరి శక్తిని బట్టి వారికి దక్కవలసిన భాగం, ఎవరి అవసరాన్ని బట్టి వారికి దక్కవలసిన భాగం' అన్నది మార్క్స్ భావజాలమయితే,  విభేదించిన లెనిన్ మహాశయుడు దాని స్థానే  'ఎవరి శక్తిని బట్టి వారికి దక్కవలసిన భాగం.. ఎవరికి శ్రమను బట్టి వారికి దక్కవలసిన భాగం' అని కొత్త నిర్వచనం వెలువరించాడు. బెర్నార్డ్ షా ఆ ఇద్దరినీ ఖండిస్తూ ' సోషలిజమ్ మీద స్వామీజీ  చేసిన అధ్యయనమే సరళంగా, సవ్యంగా, సూటిగా సాగింద'ని  కితాబిచ్చాడు.  పారిశ్రామిక దేశాలు కాకపోయినప్పటికీ రష్యా, చైనాలలో కమ్యూనిస్టు విఫ్లవాలు చెలరేగడమే స్వామి పరిశీలనలోని సంబద్ధతకు నిదర్శనం' అని జి.బి.షా భాష్యం. 1897 సంవత్సరంలోనే  'మరో అర్థ శతాబ్దానికి భారతదేశం సంపూర్ణ స్వాతంత్ర్యం సాధిస్తుంద'ని స్వామి చెప్పిన జోస్యం సత్యం కావడం బట్టి  ఆయన పరిశీలనలోని బుద్ధినైశిత్యం వెల్లడవుతుంది. ఆ రోజుల్లో అసంభవమనిపించిన భారతదేశ స్వాతంత్ర్య హోదా స్వామి చెప్పిన విధంగానే సరిగ్గా 1947లో సాకారం కావడం మిడతంభొట్టు జోస్యమైతే కాదు గదా! నిశిత పరిశీలనా ప్రజ్ఞ గల ఘటికులే ఈ విధమైన నిర్దుష్ట ప్రతిపాదనలు ధైర్యంగా ముందుకు తెచ్చి ‘ఔరా!’ అనిపించుకోగలిగేది. 

స్వామి ప్రస్థానించిన 1902 కి అర్థ శతాబ్ది తరువాత భూగోళ   రాజకీయం పూర్తిగా గందరగోళ పరిస్థితుల్లో పడిపోయింది. అధికారం కోసం, అర్హతలతో నిమిత్తంలేని పెత్తనాల కోసం ప్రపంచదేశాలు  ప్రదర్శించే అత్యంత హీనమైన దౌర్జన్య రాజకీయరంగాలు ప్రపంచాన్ని పేలబోయే అగ్నిగుండంగా  మార్చేసాయన్న మాట నిజం. 

 సామ్రాజ్యవాదం, జాతీయవాదం, ఉగ్రవాదాలకు తోడు నియంతృత్వ పోకడలు ప్రబలి నేరాలకు, మూకుమ్మడి హత్యలకు అణచివేతలకు అంతమనేది లేకుండా కొనసాగుతున్నది ప్రపంచ రాజకీయమంతా.  రెండు సోషలిష్టు విప్లవాలు బలిగొన్న రక్తపాతం ఎంతో లెక్కలు అందనంత గాఢమైనది.  రెండు ప్రపంచయుద్ధాలు, అణుబాంబు విస్ఫోటాలు, ట్రేడ్ సెంటర్ దాడి వంటి దుర్ఘటనల వల్ల మానవత్వానికి జరిగిన చెరుపుకు  లెక్కలు కట్టడం ఎవరి తరమూ కాదు. అత్యంత సూక్ష్మ దార్శనిక దృష్టి గల స్వామి వివేకానందుడు అందుచేతనే ఈ తరహా దుర్ఘటనలు చోటు చేసుకోవడానికి చాలా ముందు నుంచే ' ప్రపంచం అగ్ని పర్వతం అంచున నిలబడి ఉంది. అది ఏ క్షణంలో అయినా భగ్గుమని పేలి సర్వమానవాళికి పూడ్చలేనంత నష్టం  కలిగించే అవకాశం ఉంది' అంటూ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ వచ్చారు. ఈ తరహా కష్టనష్టాల భారం తగ్గించే దిశగా అందుకే స్వామి యూఎన్ఓ వంటి  అంతర్జాతీయ స్థాయిలో సంస్థలు ఏర్పాటయి చురుకుగా పనిచేయాలని అభిలషించింది. 

కొన్ని దశాబ్దాల కిందట వరకు జాతీయ స్థాయిలో ఏర్పడ్డ సమస్యలను  జాతీయ స్థాయి సంస్థలే సమన్వయించి  సర్దిచెప్పేవి. పరిస్థితి మారింది. రెండు దేశాల పిట్టగోడ సరిహద్దు వివాదాలు కూడా ఊహించడానికైనా  సాధ్యం కానంత ఉత్పాతాలకు దారితీసి ప్రపంచదేశాలన్నింటిని  రచ్చలోకి ఈడ్చుకొస్తున్నాయి. ఇదంతా గామనించిన స్వామి ఆ తరహా సమస్యల పరిష్కారం అంతర్జాతీయ స్థాయిలో ఏర్పడ్డ  సంస్థల ద్వారానే సుసాధ్యమౌతుందన్న మాట వాస్తవం. అంతర్జాతీయ సంస్థలు, అంతర్జాతీయ కూటములు, అంతర్జాతీయ న్యాయచట్టాల ఆవశ్యకత నానాటికి పెరగక తప్పదు' అని ముందుగా గుర్తించి  ప్రకటింనిన వాస్తవిక రాజకీయ పరిశీలకుడు స్వామి వివేకానంద.   

నేటి మనిషి జీవితంలో రాజకీయాలు అంతర్గత విభాగాలవక తప్పడంలేదు.  రాజకీయాలతో నిమిత్తంలేని బతుకులు సాధ్యం కాదన్న పచ్చి వాస్తవం స్వామి అనుభావానికేమీ అందకుండా పోలేదు ఎప్పుడూ. అందు చేతనే సామాన్య గృహస్తును రాజకీయాల నుంచి దూరంగా ఉండమని ఆయన ఏనాడూ కోరలేకపోయివుండవచ్చు. కానీ రాజకీయాలతో అనుసంధానం ఏర్పరుచుకునే విధానంలోనే కొత్త పుంతలు తొక్కమని మాత్రం  ప్రబోధించేందుకు ప్రయత్నం చేసారాయాన. ‘భారతీయ వేదాంతం రాజకీయాలలో తెచ్చే సగుణాత్మకమైన మార్పులను  ఊతం చేసుకోకుండా ఇంగ్లాండ్ దేశానికి  నేను మతం  అగత్యాన్ని గురించి ప్రబోధించలేకపోయాను. ఇక్కడ ఇండియాలో కూడా సంఘసంస్కరణలు ప్రవేశపెట్టే ముందు  ఆధ్యాత్మిక రంగం  మానవాళికి చేకూర్చే మేళ్ళను గురించి ముందు  చర్చించవలసిన అగత్యం ఉందని మాత్రం హెచ్చరిస్తున్నాను. రాజకీయ భావజాలాన్ని ప్రబోధించే సమయంలోనూ అది భారతదేశానికి అవసరమైన ఆధ్యాత్మిక సంపదలో ఏ మేరకు అభివృద్ధి  సాధించగలదో ముందు చెప్పాలి.'  అన్నది  రాజకీయాల  వరకు చివరకు స్వామి వివేకానందుడు తీసుకున్న వైఖరి.  

వివేకానందుడి స్వంత వ్యక్తిత్వానికి సంబంధించినంత వరకు రాజకీయ ప్రభావానికి అతీతమైన రాజకీయ పరిశీలకుడు ఆయన. ఏ జాత్తీయ, అంతర్జాతీయ రాజకీయాలకూ ఆయన మనస్తత్వాన్ని మార్చే శక్తి చాలదు. కానీ స్వామి రాజకీయ పరిశీలన అర్థవంతంగా ఉంటుంది.  నిర్దుష్టత శాతం ఎక్కువ. నైపుణ్యంతో కూడిన సునిశితత్వంతో, సూక్ష్మ పరిశీలనతో  నిరపాయకరంగా సాగే వివేకానందుని ప్రసంగాలంటే అందుకే మానవ జీవితంలోని అన్ని పార్శ్వాల మేధావులు అత్యంత శ్రద్ధగా ఆలకించడానికి ఇష్టపడేది. ఆఖరుకు అవి రాజకియ సంబధమైన  ప్రసంగాలైనా సరే.. మినహాయించడానికి వీలులేనివి!  

'స్వామి వివేకానందుని సంపూర్ణ మేదోశక్తిని ఒకే చోట పోగేసి పరిశీలించేవారికి నోటమాట  రాకపోవడం సాధారణంగా జరిగే అనుభవమే. జాతీయవాదానికి, అంతర్జాతీయవాదానికి  మధ్య మరేదో నూత్న భావజాలంతో నిండిన మానవతావాదంలా పరమ ఆకర్షణీయంగా ధ్వనింపచేయడమే వివేకానందుని ప్రసంగాలలోని ప్రధాన ఆకర్షణ' అంటారు  'గుడ్ బై టు బెర్లిన్' రచయిత క్రిస్టోఫర్ ఐషర్ వుడ్. భారతీయుల చరిత్ర, భాషా సాహిత్య సంస్కృతులలో లోతైన అధ్యయనం చేసిన ప్రముఖ ఇండాలజిస్ట్ ప్రొఫెసర్ ఎ.ఎల్. భాషమ్  'రాబోయే కొన్ని శతాబ్దాల వరకు స్వామి వివేకానంద  ఆధునికి ప్రపంచ నిర్మాతల వర్గంలోని చింతనాపరులలో ఒక ప్రముఖునిగా గుర్తుండిపోవడం ఖాయం' అని స్వామీజీ రచనలు అన్నీ సుదీర్ఘ కాలం అధ్యయనం చేసిన తరువాత వెలిబుచ్చిన ఆఖరు మాట. కాదని మనం మాత్రం ఎట్లా అనగలం!

*** 

                                            

-రచన - కర్లపాలెం హనువుంతరావు 

( సూర్య సంపాదకీయ పుట ప్రచురణ ) 

Sunday, December 12, 2021

మనసు మీద నిగ్రహం ఉంటేవచ్చే ఫలితం ఎక్కువగా ఉంటుంది-Tచిట్టి కథ

 


ఒకరోజు అక్బర్ బాదుషా ఒక అడవిలో తపస్సమాధిలో ఉన్న రుషివర్యుణ్ణి చూసి ఆకర్షితుడయాడు. ఆ జ్ఞానసంపన్నుడి దారిద్ర్యాన్నిచూసి బాధపడ్డాడు. ఏదైనా సాయం చేయాలనుకొన్నాడు.
‘స్వామీ మీరు మా నగరానికి పావనంచేస్తే సకల సౌకర్యాలున్న మంచి భవంతి నిర్మించి ఇస్తాను’ అన్నాడు.
‘రాజా! ఈ మనోహరమైన వనసీమను వదిలి నేను ఆ రాళ్లమధ్య ప్రశాంతంగా జీవించలేను. క్షమించండి!’ అన్నాడు.
‘పోనీ.. శరీరం మీద కౌపీనంతో అనునిత్యం మారే వాతావరణంలో బాధలు పడటమెందుకు? దయచేసి పట్టుపీతాంబరాలు స్వీకరించి మమ్మల్ని పావనం చేయండి!’అని ప్రాదేయపడ్డాడు చక్రవర్తి.
‘దైవం ప్రసాదించిన దుస్తులు కదా ఆత్మమీది ఈ శరీరం. ఆ దుస్తులకు మరిన్ని దుస్తులా! మన్నించండి! నాకు ఇలా ఉండటమే సౌకర్యంగా ఉంటుంది’ అన్నాడు రుషివర్యుడు చిరునవ్వుతో.
కనీసం మీరు తాగేందుకైనా ఈ స్వర్ణపాత్రను గ్రహించి మమ్మల్ని సంతోషపెట్టండి సాధుమహారాజ్!’అన్నాడు అక్బర్.
‘దోసిలి ఉండగా వేరే పాత్రలు ఎందుకు? దండగ్గదా! అన్యథా భావించకండి రాజా!’ అని మహర్షి సమాధానం.
‘పోనీ.. సుఖంగా శయనించేందుకు ఒక పర్యంకం అయినా తెప్పించమంటారా?’ రాజుగారి ప్రార్థన.
సాధువుది మళ్ళా అదే సమాధానం. ‘ప్రకృతి ప్రసాదించిన ఇంత చక్కని పచ్చిక బయలుండగా వేరే శయ్యాసుఖాలు నాకెందుకు మహారాజా!’ అని నిరాకరించాడు రుషివర్యుడు.
రుషి నిరాడంబర సాధుజీవనానికి విస్మయం చెందాడు అక్బరు మహారాజు. సాధు మహారాజుకి ఏదైనా సరే ఒకటి సమర్పించి తీరాలని పంతం పెరిగింది అక్బరు చక్రవర్తికి. ‘ఇప్పుడంటే ఇలా ఉన్నారు. భవిష్యత్తులో తమరికి ఏది కావాలన్నా నిస్సంకోచంగా మాకు కబురు చేయండి! అడగడానికి మొహమాటమైతే ఈ అగ్రహారం మీకు రాసి ఇస్తున్నాం. యధేచ్చగా అనుభవించండి’ అంటూ రాజుగారు రుషికి సమాధానం ఇచ్చే వ్యవధానంకూడా ఇవ్వకుండా నిష్క్రమింఛారు.
‘స్వామీ! సర్వసంగ పరిత్యాగం అంటే ఏమిటో నాకు ఇప్పుడర్థమయింది’ అన్నాడు అప్పటిదాకా అక్కడే నిలబడి అంతా చూస్తున్న శిష్యపరమాణువు భక్తి ముప్పిరిగొనగా.
‘సర్వసంగ పరిత్యాగమా నా బొందా! రాజుగారి మొదటి కోరికనే మన్నించి ఉంటే నాకేమి మిగిలేదిరా శిష్యా! మన్నుతో కట్టిన నాలుగ్గోడల భవనం. ఇప్పుడు అలాంటి భవనాలు వంద కట్టించగలను. పట్టు పీతాంబరాలు, స్వర్ణమయ పాత్రలు, హంసతూలికా తల్పాలు ఎన్నైనా ఏర్పాటు చేసుకోగలను ఒకరిని యాచించకుండా! చివరి కోరికవరకు మనసుమీద అదుపు సాధించానే .. దీన్నే అంటారు నువ్వుఅ అనుకొంటున్న ‘ఆత్ననిగ్రహం’ అని! అర్థమయిందా?’ అన్న గురువు బోధను విని నోరువెళ్లబెట్టాడు శిష్యపరమాణువు.
-కర్లపాలెం హనుమంతరావు


అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష!

అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష! నిజమే! కనీసం కథానికల వరకు!

'అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష!' అనే డైలాగ్ కన్యాశుల్కం కర్త గురజాడవారి పుణ్యమా అని బహుళ ప్రచారంలోకి వచ్చిన పలుకుబడి. నిజమే; కానీ ఆ రావడం వెనక ఉన్న ఉద్దేశంలో కొంత వెక్కిరింతా ఉంది. 

 

నిజానికి వేదాలలో అన్నీ ఉన్నాయో లేదో ఎవరికైనా తెలిసే అవకాశం తక్కువే. అలా తెలియలంటే ముందుగా ఆ వేదాలలో అసలు ఏముందో కొంతైనా అవగాహనకు తెచ్చుకోవడం సబబు. 


ఆ సంగతి అట్లా ఉంచి కథానికలుగా మన ఆధునికులు చెప్పుకునే రూపాలు వేదకాలం నుంచే ఉన్నాయన్న    వాదనా  ఒకటి పండితలోకంలో  ప్రచులితంగా ఉంది. ఆ ప్రతిపాదనకు అనుకూలత ప్రకటిస్తో  డాక్టర్ కె.కోదండరామాచార్యులు '50 వసంతాల వావిళ్ల వాజ్ఞ్మయ వైజయంతి' సావనీర్ లో 'వేదవాజ్ఞ్మయంలో కథానికలు ఉన్నవి' అంటూ ఒక చిరువ్యాసంలో ప్రతిపాదించారు.(పు.117 -125). 


అధ్యయానికి అంతంటూ లేదు. సదరు భావనకు ఊతం ఇచ్చే ఒకానొక చిన్నకథను సైతం ఈ సందర్భంగా ఆయన  చెప్పుకొచ్చారు. 'భరద్వాజో హ త్రిభిరాయుర్భిర్బ్రహ్మచర్యము వాస.. ఏషా ఏవ త్రయీ విద్యా' అనే తైత్తరీయ బ్రాహ్మణకం తాలూకు మూడో అష్టకంలో కనిపించే పదో ప్రపాఠకం పదకొండో అనువాకాన్ని ఉదాహరణగా ఆచార్యులు తీసుకున్నారు.  నేడు కథానిక లక్షణాలుగా విమర్శక లోకం గుర్తించిన సంక్షిప్తత, సమగ్రత, సంభాషణల సొగసు, ఉపదేశం, పరిమితమైన పాత్రలు.. ఈ చిన్నకథలోనూ ఉండడం గమనార్హం. 


భరద్వాజుడు మూడు ఆయుర్దాయ భాగాలను వరంగా పొందిన ఒకానొక రుషి.  జీవితకాలమంతా బ్రహ్మచర్య దీక్షతో వేదాధ్యయనానికే మీదు కట్టి చివరి దశలో వార్థక్యం చేత శక్తి సన్నగిల్లి శయనావస్థలో ఉన్న దశలో ఇంద్రుని దర్శనభాగ్యం రుషికి లభిస్తుంది. 'నాలుగో ఆయుర్దాయ భాగం సైతం వరంగా ప్రసాదించేందుకు నేను సిద్ధం. కాని  ఆ  వరంతో నువ్వు ఏమి చెయ్యదల్చుకొన్నావో ముందు చెప్పు' అంటూ ఇంద్రుడు ప్రశ్నిస్తాడు. 'మునుపటి మాదిరే వేదాధ్యయనాన్ని కొనసాగిస్తాన'ని భరద్వాజుని బదులు. 


రుగ్, యజు, సామ వేదాల వంక చూపుడు వేలు చూపించి 'మహా పర్వతాలుగా కనిపించే  అవేమిటో తెలుసునా? వేదాలు మహానుభావా!  నీకింత వరకు దక్కిన జీవితకాలంలో వాటి నుంచి నీవు గ్రహించింది కేవలం ఇంత మాత్రమే సుమా!'అంటూ మూడు సార్లు పిడికెళ్లను తెరిచి  చూపిస్తాడు ఇంద్రుడు. 'నిజంగా నీకు ఇంకా వేదాధ్యయన ఫలం మీద బలమైన కోరిక మిగిలుంటే సావిత్రాగ్నిని ధ్యానించు! ఆపైన ఆదిత్యుని సాయుజ్యం పొందు!' అనీ సూచిస్తాడు. అందు మీదట ఇంద్ర ప్రసాదితమైన  నాలుగో జీవిత భాగం కేవలం వేద విద్యాధ్యయనానికి మాత్రమే వినియోగించక,  సాధించిన  జ్ఞాన కాంతి పుంజం సాయంతో పరిసరాలను సైతం తేజోవంతం చేసి విద్య అంతిమ పరమార్థాన్ని రుషి ప్రపంచానికి చాటినట్లు కథ.  


ఈ కథ పరిణామంలో, ప్రక్రియ పరంగా. లక్ష్య నిర్దేశన పరంగా  తాజా కథానికలకు ఏ మాత్రం తీసిపోనిదని డాక్టర్ కె. కోదండరామాచార్యులవారి వాదన. కాదనగలమా?

-కర్లపాలెం హనుమంతరావు

10, డిసెంబర్, 2019 


Monday, June 14, 2021

ధూమకేతువు చెప్పే నీతిపాఠం -కర్లపాలెం హనుమంతరావు



దేవుళ్ళు తాము చంపిన రాక్షసుల పేర్లు బిరుదులుగా తగిలించుకోడం సరదా కోసం కాదు. పూజించే భక్తులను రాక్షసత్వంతో ప్రవర్తించవద్దని హెచ్చరించడం కోసం. వినాయకుడిని 'ధూమకేతవే నమః' అని కీర్తించడంలో కూడా ఇట్లాంటి ఓ గట్టి హెచ్చరికే దాగివుంది.చెడ్డపనులు చేస్తే మళ్లీ రాక్షస ప్రవృత్తితో జన్మ ఎత్తాల్సొస్తుందనే బెదురు  గతంలో బాగా ఉండేది. కానీ అట్లా ఎత్తిన జన్మలో కూడా  కొన్నైనా మంచి పనులు  చేస్తే ఈ  దుర్జన్మ పీడా వగదిదుతుందన్న  ఊరటా పురాణేతిహాసాల తాలూకు కథలలో కనిపిస్తుంటుంది.  ఈ సందర్భంగానే ధూమాసురుడు అనే దుర్మార్గుడిని గురించి కొంత చెప్పడం.

పుట్టింది రాక్షస జాతిలోనే అయినా ధూమాసురుడు వేదాలను మొత్తం కంఠోపాఠం చేశాడు. చదివిన చదువుకు.. నడిచే తీరుకు బొత్తిగా సంబంధం ఉండదనడానికి ఈ దుర్మార్గుడి దుష్ప్రవర్తనే సరైన దృష్టాంతం. శివుడికి భక్తుడు అయివుండీ భృగువుతో సంవాదం చేసే పాటి పాండిత్యం సాధించినా రజోగుణం ప్రబలినప్పుడు మాత్రం యుద్ధాలు చేయాలని, దేవతలనే వాళ్ళు ఎక్కడున్నా వెదికి మరీ చీల్చి చెండాడాలని అణుచుకోలేనంత కుతిగా ఉండేది అతగాడికి. అట్లాంటి తీటలు తీరడం కోసం జైత్రయాత్రలు చేయడం, దేవతలను చెండుకు తినడం రాక్షస జాతికి సహజమే అయినా, దేదేవతలకు మాత్రం  పద్దాకా ఏదో ఓ రాక్షసాధముడి కారణంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి.

ధూమాసురుడి దెబ్బకు తట్టుకోలేక ఎప్పట్లానే శివుడిని ఆశ్రయిస్తే, ఆయనా ఎప్పట్లానే ఆశ్రితులను కాపాడే పని పెద్దకొడుకు వినాయకుడికి పురమాయించాడు.

తండ్రి ఆజ్ఞ! తప్పుతుందా! ఏం చేద్దామా అని బొజ్జ గణపతయ్య బుర్ర బద్దలు చేసుకొనే సమయంలో తరుణోపాయంగా మాధవుడు అనే బ్రాహ్మడి కుటుంబం తాలూకు తంటా ఒకటి తెలియవచ్చింది. సంతానవతి కాని  కారణాన  మాదవుడు  భార్య సుముదను  వదిలేస్తానని తరచూ బెదిరిస్తుంటాడు. ఆమెకు మరో దారి లేక నారాయణుడిని ఆశ్రయించడం, ఆ సందు చూసుకుని వినాయకుడు ఆమె గర్భంలో జొరబడ్డం జరిగిపోతుంది.

యుద్ధానికని  బయలుదేరే  ధూమాసురుణ్ణి ఈసారి ఆకాశవాణి గట్టిగానే హచ్చరిస్తుంది. 'చావు మూడే రోజు దగ్గర్లోనే ఉంది. ఇట్లా  సుముదమ్మ కడుపులో జీవం పోసుకొంటోంది' ఆవటా అని. ఎంత రాక్షసుడికైతే మాత్రం ఎదుటి వాళ్లను ఏడిపించి చంపడం సరదా గానీ, స్వయంగా  చావును కావులించుకోవడానికి సరదా ఎందుకు పుడుతుంది? అందరికి మల్లేనే ఆ రాక్షసుడూ మృత్యుభయంతో యుద్ధాలు గిద్ధాలు కట్టిపెట్టి ఇంచక్కా దక్కిన రాజ్యాన్ని చక్కగా   'రామరాజ్యం' మోడల్లో 'ధూమాసుర రాజ్యం' గా సుప్రసిద్ధం చేద్దామని సిద్ధమయిపోయాడు.   అందుక్కారణం అతగాడి కొలువులో కనీసం ధర్ముడు అనే ఒక్క మంచి మంత్రైనా ఉండి రాజుకు హితబోధ చేయడం. తతిమ్మా కొలువు కూటానికి ఇది మహా కంటకంగా మారింది. ధర్ముడు లేని సందు చూసుకొని ధూమాసురుణ్ని రెచ్చగొట్టేస్తారు.

అటు ధర్ముడు ఇటు దుర్మార్గులైన తతిమ్మా మంత్రులు.. దోళాంళనల మధ్య ఊగిసలాడే ధూమాసురిడి వికారాలకు అమృతంలా అనిపించే సలహా ఎవరిస్తారో తెలీదు కానీ.. ఇస్తారు. ఆ వికృత  ఆలోచన కార్యరూపమే సుమద కడుపులో ఎదిగే వినాయకుణ్ణి సంపూర్ణాకారం తీసుకోక ముందే సఫా చేసేయడం.

ధూమకాసురుడి ప్రయత్నం వృథా అయిందని,   దుర్మార్గుడే వినాయకుడి చేతిలో చివరికి ఖతమయ్యాడని వేరే చెప్పక్కర్లేదు కానీ, ఇక్కడ చెప్పవలసిన అసలు ముఖ్యమైన మాట మరోటి ఉంది.  చరిత్ర ఎటూ మనకు పట్టదు.  కనీసం మనం నెత్తికెత్తుకొని నిత్యం పూజించే పురాణాలు, ఇతిహాసాలలో కనిపించే ఈ తరహా నీతికథలనయినా  మన సో కాల్డ్ ప్రజానేతలు  సమయ సందర్భాలను బట్టి ఖాతరు చేస్తుంటే ఎన్నుకునే సమయంలో ప్రజలు పెట్టుకున్న నమ్మకం వమ్ముకాకపోను.  ఇప్పుడు జరుగుతున్న 'రఘు రామరాజు  కారాగార  కఠిన దండన' కథా కమామిషు వింటుంటే మంచి పాలకులు మనకు ఇక సంప్రాప్తించే యోగం ఉందా' అని బాధేస్తుంది. 

మనుషుల .. ముఖ్యంగా రాజకీయాలలో నలిగే పెద్దమనుషుల మతిమరుపు  రోగం బాగా ఎరిక కాబట్టేపాపం వినాయకుడు దుర్మార్గుడైన ధూమాసురుడిని మళ్లీ కనిపించకుండా శిక్షించినా..  తన పేరులో అతగాడి   పేరు దూర్చుకుని 'ధూమకేతువు'ను అని కూడా  గుర్తు చేయడానికి పదే పదే ప్రయత్నిస్తున్నాడు. పాలకుల పెడబుద్ధులు సరిచేయడం భగవంతుడి తరమైనా అవుతుందా? చూద్దాం!

- కర్లపాలెం హనుమంతరావు

12 -06 -2021

Monday, February 15, 2021

అజ్ఞాన సమ్ 'ఉపార్జన’- సరదాగా - కర్లపాలెం హనుమంతరావు

 



" 'అజ్ఞానం' అంటే ఏంటి గురువా?"

" 'జ్ఞానం' అంటే ఏంటో తెలుసునా శిష్యా?"

"తెలియదు కనకనే కదా స్వామీ.. తమరి  దగ్గరికీ రాక!"

"ఆ తెలియక పోవడమే 'అజ్ఞానం' అని తెలుసుకో నాయనా"

"ధన్యుణ్ని. ఆ అజ్ఞానం స్వరూపం ఎలా ఉంటుందో కూడా కాస్త సెలవివ్వండి స్వామీ!’

" 'స్వ'  అనవద్దు బాలకా! అజ్ఞానం అవుతుంది.  ఆ విశేషణం నీ సొంతానికి వర్తించేది.   రాజకీయాలల్లో ఉంటే  మినహా డాంబిక పదప్రయోగాలు  హాని చేస్తాయ్. ఆ  తెలివిడి లేకపోవడం కూడా 'అజ్ఞానమే'"

"చిత్తం స్వామీ! ఆ 'అజ్ఞానం' ఎక్కడ ఉంటుందో  కూడా తమరే  వివరించి పుణ్యం కట్టుకోండి స్వామీ!"

గురువుగారు గడ్డం నివురుకున్నారు.

గురువుగారి గుబురు గడ్డంలో అజ్ఞానం  దాగుందని శిష్యుడికి అర్థమైపోయింది. అందుకే కాబోలు..  అంతుబట్టని ప్రశ్న ఎదురు పడ్డప్పుడల్లా గురువుగారిలాంటి బుద్ధిజీవులు గడ్డాలు గోక్కుంటుంటారు! సీదా సాదా జీవులకు మల్లే బుర్రలు గోక్కోరు, 

"గురూజీ! 'అజ్ఞానం' అంటే గాడిద గుడ్డు వంటిదని  ఎవరో  స్వాములవారా మధ్యో టీ.వీలో ప్రవచిస్తుండంగా  విన్నాను. అదెంత వరకు నిజం?"

" 'గాడిద' నిజం. 'గాడిద గుడ్డు' అబద్ధం. నిజం నుంచి పుట్టేన అబద్ధానికి 'గాడిద గుడ్డు' ఒక సంకేతంరా శుంఠా!  ఆ స్వామి వారన్న  మాట నూటికి నూటొక్కపాళ్లు  నిజమే!"

"మరి ఆ 'ఆజ్ఞానం' రుచికూడా ఎలా ఉంటుందో విశదపర్చండి గురూజీ?"

"'ఇంద' 

చిటికెడు పంచదార అప్పటికప్పుడు  గాలిలోనుంచి సృష్టించి శిష్యుడి నాలిక మీద వేసి 'రుచి చెప్పు!' అన్నారు స్వామీజీ.

"తియ్యగా ఉంది స్వామీ!"

"ఇప్పుడు ఈ లోటాలోని కాఫీ ఓ గుక్కెడు  తాగి దాని రుచీ ఎలాగుందో చెప్పు!" అన్నారు. 

ఎప్పుడు ఎలా వచ్చాయో కాఫీ..!

కప్పు పెదాలకందించుకుని "కషాయంలాగా ఉంది స్వామీ!" అని  ముఖం చిట్లించాడు శిష్యుడు.

"'ఇంద" 

 ఈ సారి ఇంకో చిటికెడు ఉప్పు సృష్టించి శిష్యుడి నాలిక మీద వేసి 

“ఈ సారి కాఫీ రుచి చూడు! ఆదేశించారు గురువుగారు.

"భలే ఉంది స్వామీ!  కానీ ఏ రుచో చెప్పలేను"

"ఆ చెప్పలేక పోవడాన్నే అజ్ఞానంగా తెలుసుకోరా సన్నాసీ!"

ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్డం శిష్యుడి వంతయింది. 

''అయితే స్వామీ…"

"..అర్థమయింది. వాసన గురించే కదా నీ నెక్ట్స్ క్వశ్చన్? ఉనికిలో ఉన్నదానికైతే వాసనంటూ ఏదైనా ఉంటుంది కానీ.. అసలు ఉనికేలేని అజ్ఞానానికి  వాసనేముంటుందిరా అజ్ఞానీ!"అన్నారు గురూజీ!

శిష్యుడికి మెల్ల మెల్లగా బోధపడుతోంది  అజ్ఞానసారం. అయినా ఇంకా ఏదో ఇతమిత్థంగా తేలని సందేహం. 

"స్వామీ! ఆఖరి ప్రశ్న. జ్ఞానం సంపాదించేందుకు ఎంతో మంది ఎన్నో విధాలుగా తంటాలు పడుతుంటారు. కొందరు ఒంటికాలు మీద  జపం చేస్తుంటారు. నా వంటివాళ్ళు  మీ బోటి జ్ఞానుల పాదాల చెంత  చేరి తత్త్వబోధనలు వింటుంటారు. ఇంకొందరు గ్రంధపఠనం,  మరికొందరు ప్రపంచ పర్యటన.. ఇలా ఎవరికి తోచిన పద్ధతులు   వాళ్లు ఆచరిస్తుంటారు. జ్ఞానం వల్ల ఏదో మేలు లేకపోతే మరి ఇన్నేసి తంటాలు అవసరమా స్వామీ?"

''మంచి చెడ్డా.. లాభం నష్టం.. ఉచితం అనుచితం తెలుస్తాయి  కాబట్టి ఆ యాతనలేవో వాళ్లు అలా నిత్యం తలో రూపంలో పడుతుంటారురా బాలకా!"

"మరి అజ్ఞానం వల్ల ఏం ప్రయోజనం ఉందని  స్వామీ.. ఇంతమంది ఈ లోకంలో జ్ఞానసముపార్జనకు ఏ ప్రయత్నమూ చేయకుండా  మూర్ఖవర్గంలోనే ఉండిపోడానికి కొట్టుకు ఛస్తున్నారూ? ముఖ్యంగా మన రాజకీయ నాయకులు?"

"ఇదేరా భడవా.. అసలు సిసలు  అజ్ఞానభాండరమంటే! పొరుగువాడిని ప్రేమించు! నిత్యం సత్యమును మాత్రమే వచించు! ఆడవారిని తోబుట్టువులవలె గౌరవించు! పెద్దలమాట చద్దిమూటగా మన్నించు. ఆడి తప్పకుము. దొంగతనము చేయకుము. అహింస పరమ ధర్మము. జంతుహింస అమానవీయము. దుర్భాషలాడబోకుము! నీతి మార్గం వదలబోకుము!' వంటి మంచి సూక్తులన్నీ వింటూ కూర్చుంటే లోకంలో మనం ఎవరికీ  ఏ మంచీ చేయలేం. మనక్కూడా మనం ఏ మేలూ చేసుకోలేం. అడ్డదారిలో  గడ్డి కరిస్తేనే కదరా  బిడ్డా.. ఆదాయానికి మించిన ఆస్తులేవైనా  కూడబెట్టే  పట్టు దొరికేది! కొడుకులను.. కూతుళ్లను.. అల్లుళ్ళను.. కోడళ్ళను అందలమెక్కించకుండా అలా గాలికి వదిలేస్తే వాళ్లు అజ్ఞానం వల్ల చేసే అల్లరి చిల్లర్లతో సొంత ఇమేజి డేమేజవుతుంది కదా శిశువా?   పెద్దతనంలో  ఏ రోగమో రొప్పో వచ్చి   మంచాన పడ్డాక నీ ఏ మంచీ.. మన్నుగడ్డా పక్కగుడ్డలు మార్పించే  నాధుణ్ని రాబట్టలేదు. ఎక్కడెక్కడి రాబందులో సహేలీలు.. స్నేహితులంటూ  సంబంధాలు కలుపుకొని పొయస్ గార్డెన్లలోక్కూడా వచ్చి పాగా వేస్తారు.  సంపాదించుకున్న మంచి పేరుకు  తూట్లు పడతాయ్! సొంతానికంటూ ఆస్తులేవో పది రకాలుగా  కూడబెట్టుకుంటేనే కదరా అమాయకుడా ..  కోట్లు లక్షలు ఖర్చయ్యే ఎన్నికల గోదాట్లోకి దూకినప్పుడు గట్టెక్కగలిగేది! ఈదే పాదసేవకులకు సాయపడేదీ?  అక్రమార్కుడి మార్కు ప్రత్యర్థి అజ్ఞానుల్ని  పడగొట్టాలన్నా  చెడ్డదారి  తొక్కడం మినహా  మంచి మార్గం మరోటేమన్నా ఉందా మూర్ఖా?   ఇందాక నువ్వన్నావే.. ఆ  జ్ఞానం  గన్నీ బ్యాగులు ఎన్ని గుట్టలు  గడించినా  జీవితంలో  సాధించింది సున్నా.  ఇలా వివిధ   మంచి చెడ్డలను  తర్కిస్తూ   భావి చరిత్రకారుల దయాదాక్షిణ్యాల కోసం దేబిరించటం కన్నా.. పదవుల్లో    పచ్చగా  ఉన్నప్పుడే చరిత్ర పుటల్లో  పేర్రాయించుకునే దారులు వెదుక్కోవడం మేలు. ధనమూలం ఇదం జగత్! డబ్బుతో దెబ్బేయలేనిదేదీ లేదీ లోకంలో! జ్ఞానసముపార్జన ధనసంపాదన కాళ్లకడ్డంరా శుంఠా! ఏ ఎన్నికల కోడి ఎప్పుడు కూస్తుందో ఎవడికీ తెలియని రోజుల్లో  ఎన్నికల సంఘం కోడులకు జడుస్తూ కూర్చుంటే చివరికి మిగిలేది గోడుగోడుమనే ఏడుపులూ.. మొత్తుకోళ్లే! అజ్ఞానమే ఓటర్ల తత్త్వంగా తయారైనప్పుడు వాళ్ళు బుట్టలో పడటానికి తొక్కలోని   జ్ఞానమార్గం నమ్ముకుంటే  అంతకు మించిన అజ్ఞానం మరోటి ఉండదు. ఇప్పుడు చెప్పు! జ్ఞానానికా? అజ్ఞానానికా నీ ఓటు?" 

శిష్యుడు అప్పుడే మొలుస్తున్న గడ్డం నిమురుకోవడం మొదలు పెట్టాడు."కళ్లు తెరిపించారు గురూజీ! ధనమూలం ఇదం జగత్. సందేహం లేదు. కాబట్టే సర్వసంగపరిత్యాగులై ఉండీ తమబోంట్లు ఒక్కొక్క   ప్రశ్నకే  లక్ష చొప్పున భక్తుల నుంచి నిర్మొహమాటంగా గుంజుతున్నారు!   తమరి సంపాదనకు దొంగలెక్కలు రాయలేక నా రెక్కలు గుంజున్నాయి. ఏ శిష్యుడికైనా గురువు దారే అనుసరణీయం. అజ్ఞానుల వర్గంలో పోటీ తాకిడి మరీ ఎక్కువగా ఉంది స్వామీ! మరీ ముఖ్యంగా పొలిటికిల్ సర్కిల్లో.  నా బిడ్డలకూ బారెడు  గడ్డాలూ మీసాలు పెరిగి నాలుగైదు ఆశ్రమాలు.. టీ వీ ఛానెళ్లు  దొరికిందాకా.. చారెడు రూకలు సంపాదించుకోవాలి కదా! తమరిలాగా  అజ్ఞాన సమ్ 'ఉపార్జన'కే  నా ఓటు కూడానూ!" సభక్తిపూర్వకంగా చేతులు జోడించి  నిలబడ్డాడు శిష్యపరమాణువు.. 

***

కర్లపాలెం హనుమంతరావు 

16 -02 - 202| 

బోథెల్ ; యూఎస్ఎ


Friday, February 12, 2021

ధూర్తమానవా శతకము- కీ.శే త్రిపురనేని రామస్వామి చౌదరి - కర్లపాలెం హనుమంతరావు



దేవుడి పేరు చెప్పి తోచిన పిచ్చి కూతలు కూసుకుంటూ అమాయకులైన లోకులను భక్తి భావన  వంకన భయభ్రాంతులను చేసి స్వార్థ లాభం కోసం నిలువుదోపిడీ చేసే దుష్టబుద్ధుల మీద కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి 'ధూర్తమానవా శతకము'  పేరుతో కొంత పద్య రచన చేసారు. ఈ పద్యాలలోని అన్ని భావాలలో ఎక్కడా అతిశయోక్తి మచ్చుకైనా కనిపించదు. నిర్మలమైన మనసుతో తమ తమ జీవికలను నడుపుకునే లౌకికులను నిందించడమూ కనిపించదు. లేని దేవుడిని ఉన్నాడని బుకాయించే పెడసర బుద్ధిగల గడసరి మనుషులపై ఆ 'దేవుడి' చేతనే దుడ్డుకర్ర తిరగేయించిన ఈ శతకంలోని పద్యాలు సులభ శైలిలో చదవగానే అర్థమయే రీతిలోనే ధారగా సాగడం విశేషం. పద్యాలు చదువుతున్నప్పుడు కపట జీవుల పట్ల దేవుడు  విసిరే విసుర్లు భక్తిభావం మెండుగా కలవారికీ నవ్వు తెప్పిస్తాయి. కారణం.. దేవుడు ఈ పద్యాలలో గద్దించిన  దుర్మార్గపు జాతిలో వాళ్లు ఒక భాగంగా లేకపోవడం!

సచ్చీలవంతులు ఎవరినీ ఇంచుకైనా నొప్పించని విధంగా కవిరాజు ఈ పద్యాలు అల్లిన విధానం హర్షింపదగినది. ఆలోచించదగినది. అన్ని పద్యాలు విస్తరణ భీతి చేత ఇవ్వడం కుదరక.. కొన్ని పద్యాలు మాత్రమే ఉదాహరణ కింద కింద ఇస్తున్నాను. చదివి ఎంజాయ్ చెయ్యండి. నచ్చితే మిత్రులతో నిశ్చింతగా పంచుకోండి!

-కర్లపాలెం హనుమంతరావు

12 -02 -2020


 

ఏ నొకజాతికూడు భుజి-యించుచు మిక్కిలి తక్కుజాతులన్‌

హీనముగాగఁ జూతునని-యెవ్వరు సెప్పిరి నీకు వంచకా!

మానవు లందఱున్‌ సరిస-మానులు గారొకొనాకు? మాయురే!

మానక నీవ యిట్టి యవ-మానముఁ జేతువె ధూర్తమానవా!

***

త్వరపడకుండ సంజపడు-దాఁకను తప్పుపనుల్‌ పొనర్చి పై

బొరుగున నున్న తోఁటలను-బూవులు మ్రుచ్చిలి కోసి తెచ్చి నా

శిరమునఁ బోసినంతటనె-చేసిన పాపము లొక్కసారిగా

మఱచెడునట్టి వెంగలినె-మానక యిట్టివి ధూర్తమానవా!

***

మరణపు శయ్యమీఁద నొక-మారయినన్‌ నను దప్పకుండ సం

స్మరణము చేసినంతటనె-స్వర్గము వచ్చునటందు, వేగతిన్‌

బొరయును? నిట్లె నీ వెపుడు-బొంకుచునుందువు దీనికై నినున్‌

గఱకఱ గొంతు కోసెదను-కానివి చెప్పకు ధూర్తమానవా!

***

బొచ్చు నొసంగి యెట్లు పరి-పూర్ణమనోరథసిద్ధిఁ బొందగా

వచ్చును? బిచ్చివాఁడనని-భావమునం దలపోయుచుంటివా?

పుచ్చును నీదు పాపములు-పోరచి మానుము యిట్టి వానినిన్‌;

బొచ్చెము లిట్లుచెప్పి ప్రజ-మోసము చేయకు ధూర్తమానవా!

***

బిడ్డలకోసరమ్ము విల-పించెడి యా జవరాండ్రతోడుతన్‌

బిడ్డలు తప్పకుండఁ బ్రభ-వించెదరంచు సమాదరంబునన్‌

గడ్డముపట్టి "గర్భగుడి"-గర్భముఁ జేర్చుదువట్టెరేల నో

వెడ్డరి! నాకు మంచి పని-వెట్టితి వింతకు ధూర్తమానవా!

***

వాజను మానకున్న నప-వాదులు; తప్పవు శృంగభంగముల్‌;

రోజులు నీకుఁ జాల విసి-రో! జులుమింతకు మానకున్నచోఁ

బాజివియౌదు వీవు నగు-బాటు ఘటిల్లును; నింక మీఁద నీ

పోజును జూచి మోసపడి-పోవుట గల్గదు ధూర్తమానవా!

(ధూర్తమానవా శతకము- కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి)

Sunday, January 31, 2021

అన్నమయ్య కృష్ణతత్వం -కర్లపాలెం హనుమంతరావు


 


అన్నమయ్య అనగానే కళ్ల ముందు కనబడేది ఆ ఏడుకొండలవాడి మంగళకర స్వరూపం.  వేంకటాద్రిరాయడి కొలువు కూటమికి అంతకు ముందు నుండే కొండలు నెలవై  ఉండినా, కలియుగ అవతార పురుషునిగా  భక్తజన సందోహం గుండెల మీదకు చేదిన ఘనత మాత్రం నిశ్చయంగా తాళ్లపాకవారి సంకీర్తన గానామృత వైశిష్ట్యానిదే! అడుగడుగులవాడిని ఎన్నిందాల ప్రదర్శించ తగునో, అన్నిందాలా హుందాగా ప్రదర్శించి చూపించిన ప్రతిభా ప్రాగల్భ్యం  అన్నమయ్య ఘంటానిది, కంఠానిది. అయ్యతో పాటూ అమ్మకూ  స్వరార్చనాసేవలు సరిసమానంరగా అందడం అయ్యవారి ఆనాటి అభ్యుదయ భావాలకు అద్దంపడుతుంది.  ఆచార్యులవారి కీర్తిని అజరామరం చేసిన వేలాది సంకీర్తనల్లో కృష్ణ సంబంధమైన సంకీర్తన గానామృతం ఓ గుక్కెడు సేవించడమే  ఇక్కడ ముఖ్యోద్దేశం. 

తాళ్లపాకవారి రాగిరేకులు తడవని రసరహస్యం లేదనడం అతిశయోక్తి కాబోదు. అయ్యవారి కృష్ణతత్వం గురించి చేసిన గానప్రస్తావనాలను గాని గాఢంగా పరిశీలిస్తే భజగోవింద కర్త  శ్రీశంకర భగవత్పాదులు భావించిన ఆ 'ఏదో తెలియని నీలిరూప తత్వం' అన్నమయ్యనూ వదలకుండా వెన్నంటి వేధించి మరీ తన్మయత్వ అగాధంలో ముంచి తేల్చిందని చెప్పుకోవాలి.  జయదేవుని అష్టపదులకు దీటైన పాదపంక్తులను ఆ పారవశ్య పరమార్థ చింతనతోనే అన్నమయ్య అత్యద్భుత్వంగా తీర్చిదిద్దినట్లు ఒప్పుకోవాలి. 

కన్నయ్య అనగానే మనస్సుకు తటిల్లుమని తట్టేది  ఆ నల్లనయ్య కూనరూప లావణ్యం, చిలిపి చేష్టలు. ఆ యదుబాలుని ముద్దుమురిపాలను  అన్నమయ్య మథించి  మరీ కట్టిన కీర్తనల చల్లపై తెడ్డు కట్టిన వెన్నల తరకల రుచి వట్టొట్టి మాటలతో మనసుకు పట్టించడం ఒక్క నాలుక వల్ల శక్యమయే పని కానేకాదు. 'భావయామి గోపాలబాలం మన/స్సేవితం తత్పదం చింతయేహం సదా' అంటూ  చిన్నికృష్ణుని ముద్దు పాదాలను తాను తలుచుకుంటూనే తప్ప తతిమ్మా దేవుళ్ల సంకీర్తనల పర్వం సవ్యంగా సాగించలేన’ని  స్వయంగా ఆ  చెంగల్వరాయని స్వరసేవకుడే సెలవిచ్చుకున్న సందర్భం గమనీయం.

'కటి ఘటిత మేఘలా ఖచిత మణి ఘంటికా'-బుజ్జి నడుముకి కట్టిన రత్న ఖచితమైన మొలతాడును తలుచుకుని తనలో తానే సంకీర్తనా పరవశుడై మురిసిపోతాడు అన్నమయ్య వందలొందల పర్యాయాలు. 'నిరతరకర కలితనవనీతం  బ్రహ్మాది/ సురనికర భావనా శోభిత పదం' -వెన్నముద్దతో నిండి ఉండే చిన్ని చిన్ని చేతులుండే ఆ బాలగోపాల రూపాన్ని మనసులో భావించుకుంటేనే గాని..  మిగతా దేవతలకు ప్ర్రార్థనలు.. అవీ సవ్యంగా సాగే పని కాదు!'అని అన్నమయ్యే తన కృష్ణతత్వ కాంక్షాపరత్వాన్ని నిర్మొహమాటంగా బైటపెట్టిన సన్నివేశాలు ఎన్నో!  

'చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ/బంగారు మొలతాడు పట్టుదట్టి' అన్న పద్యం నోట బట్టని బాలలు తెలుగునేలల మీద కనిపించడం చాలా అరుదు  నిన్న మొన్నటి దాక. ఆ తరహా వెన్నముద్ద వంటి  కృష్ణ కీర్తననే అన్నమయ్య మన జిహ్వలకు అందించింది. అనుభవిస్తూ ఆలపిస్తే సాక్షాత్తూ ఆ బుజ్జికృష్ణుడే తనకు తానై వచ్చి మన గుండెల మీదెక్కి కూర్చుని ఆడుకుంటున్నంత ఆనందం ఖాయం! బ్రహ్మానంద పారవశ్యం కలిగించే పదబంధాలతో వేలాది సంకీర్తనలు సృజించిపోయిన అన్నమయ్యను ఒక్క నోటితో మాత్రమే పొగిడితే చాలునా? అదే శ్లోకంలో చిట్టచివరన 'పరమపురుషం గోపాలబాలం' అని కృష్ణతత్వాన్ని పరమ క్లుప్తంగా, ఆప్తంగా  ముక్తాయించడం వెనక, స్వరూపానికి స్వల్పుడే అయినప్పటికీ  పరమపురుష తత్వం శ్రీకృష్ణపరంధామునిది    అన్న కృష్ణతత్వం వెలయించడమే అన్నమయ్యవారి పరమార్థం! ఆ వాగ్గేయకారుని ఎన్ని వేల జిహ్వలతో స్తుతిస్తే న్యాయం జరిగినట్లు?  

'చిన్ని శిశువు చిన్ని శిశువు /ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు' అంటూ కృష్ణయ్య ముద్దుమురిపాలు ఒలికే బాలుని స్వరూపాన్ని కళ్లకు కట్టించే ప్రయత్నం చేసాడు అన్నమయ్య అనేక పర్యాయాలు.  అలతి అలతి పదాలతో ఇంత అందమైన వర్ణనలతో మరి  మరో కవి ఇంకెవరైనా   పాలచారలు తెడ్డు కట్టిన కృష్ణయ్య బుజ్జి బొజ్జను గూర్చి కూడా భజించాలన్న బుద్ధిపుట్టిందా? ఏమో..  తెలియదు.  అదే అన్నమయ్యలోని విశిష్టత. అణువు నుంచి బ్రహ్మాండం వరకు, అనంతం నుంచి చింతాకు చిగురు వరకు ఏదీ ఆ వాగ్గేయకారుని  సంకీర్తనల స్వర గాలాలకు తగలకుండా తప్పించుకోలేకపోయింది. 

ఇళ్లలోని పసిపిల్లలు తాగే తాగే పాలను ఒక్కోసారి వంటి మీదకు వంపేసుకున్నప్పుడు  చటుక్కున చూసిన వెంటనే ముందు మనకు తెగ ముద్దొచ్చేస్తారు. బాలుడు భగవంతుడెలాగో.. భగవంతుడూ బాలుడుకు మల్లే అయిపోతాడు కాబోలు ఒక్కో మారు.  సంపూర్ణ సత్యస్వరూపుడైన శ్రీకృష్ణపరమాత్ముడిని ముగ్ధమనోహరమైన ఆ బాల్యస్థాయికి దింపుకొచ్చి భగవంతుని మీది ముప్పిరిగొనే భక్తిభావాన్ని ముద్దుమురిపాల రూపంలో తీర్చుకునే అవకాశం భక్తలోకానికి అందించిన అన్నమయ్య అక్షరాలా ధన్యజీవి. 

దేవకీసుతుడు బాలకృష్ణుడి ఫాలభాగం మీద జారిపడే ముంగురులను పైకి నెట్టి మురిపెంగా సవరించే భాగ్యం యశోదమ్మ తల్లికి దక్కింది చివరకు. అదృష్టమంటే యశోదమ్మదే కదా అని కృష్ణయ్యను అమితంగా కామించే అన్నమయ్యలోని తల్లిహృదయం అసూయచెందే కీర్తనల పర్వం ఇది. 'పాయక యశోద వెంట పారాడు శిశువు' గా వేదోద్ధారకుణ్ణి భావించిన  వైరుధ్య వైదుష్యం తాళ్లపాక అన్నమయ్యలవారిది. ఆ మాటకొస్తే అండ పిండ బ్రహ్మాండ నాయకుడిని ఓ బాల వెన్నదొంగ స్థాయికి దింపి వర్ణించే ఆలోచన అన్నమయ్యకు  కలగడం వాస్తవానికి తెలుగువారి వాగ్గేయసాహిత్య ప్రక్రియ చేసుకున్న అక్షరాల నోముఫలంగా చెప్పుకోవాలి. 

'ఝుమ్మని మడి శృతి గూడగను/ కమ్మని నేతులు కౌగగ చెలగే' ననే ఒకానొక కీర్తనలో 

'పాలు పితుకుచును బానల కేగుల/సోలి పెరుగు త్రచ్చుచు చెలరేగే' నేతులు కాగుతుంటే వెలికొచ్చే ధ్వనులు, గోవుల పొదుగుల కింద చేరి గోపాలురు పాలు పితికే సందర్భంలో పుట్టే సవ్వడులు.. ఇట్లా సర్వం ఝుమ్మనే నాదాల మాదిరి పొంగిపొరలుతున్నట్లు అన్నమయ్య సందు దొరికిన ప్రతీ సందర్భంలోనూ కర్ణపేయమైన ఆ సప్తస్వర మిశ్రితాలను  తాను విని ఇహలోకాలూ తన్మయమయేలా  వినిపించడం వాగ్గేయ సంగీత విభాగానికి ప్రత్యేకంగా కలిసొచ్చిన  స్వరాలవిందు! 

'దది మధన నినాదైః త్యక్త నిద్ర ప్రభాతే/ నిభృత పదమగారం వల్లవానాం ప్రవిష్టః/ముఖ కమల సమీరైః ఆశు నిర్వాప్య దీపాన్/కబళిత నవనీతః పాతు గోపాలబాలాః'- పరగడుపునే పెరుగు చిలికే శబ్దాలు విని లేచి, నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లి దీపం ఆర్పి మరీ వెన్న దొంగిలించే ఆ కొంటె కృష్ణుడికి మనకు లాగా ఆ చౌర్యం పాపహేతువు కాదు. సరికదా, కృష్ణచౌర్య స్మరణం ముక్తిఫలదాయకమని నమ్మి ఎంతో మంది భక్తిభావుకులు దానినో  ఓ తత్వం కింద తీర్చిదిద్దారు. అందులో జయదేవుడు, లీలాశుకుడు, మన తెలుగులో పోతనా.. ఆయనకు తోడుగా  అన్నమయ్య ఇప్పుడు! 

వాస్తవానికి లోకంలో దొంగతనం చేయని జీవి ఎక్కడైనా ఉందా? ముఖ్యంగా మనిషి మౌలిక ప్రవృత్తే చోరబుద్ధి. తల్లి గర్భంలో చేరినప్పటి బట్టి అమ్మకు వంటబట్టిన తిండి సారాన్ని  తస్కరించడం  మరిగిన తండ్రి జీవకణమే కదా నవమాసాల అనంతరం భూమ్మీద మనిషిగా అవతరించడం! కన్నవారి ముద్దుమురిపాలను, రక్తమాంసాల ఫలసాయంతో సహా తోబుట్టువులతో కలసి మరీ దొంగిలించి తినే మనం, తినే తిండి నుంచి పీల్చే గాలి వరకు అనుభవించే అన్నింటా అంతో ఇంతో ఏమిటి.. ఆసాంతం.. ప్రకృతి నుంచి, సాటి జీవజాతికి న్యాయంగా దక్కవలసిన  భాగాన్నుంచి  కాజేసి కదూ మరీ ముదురుతున్నది?  ఇదేమని  ఎదురడిగేవారిని మరేదో కట్టుకథలతో దారి మళ్లించే మనిషితత్వం కృష్ణతత్వంతో కలగలసిపోయి అన్నమయ్య అత్యద్భుత ఆధ్యాత్మిక సంకీర్తనల సారంగా రూపుదిద్దుకొన్నదనిపిస్తుంది. వెన్న కాగుతుంటే తినేందుకని చెయ్యి పెట్టి చుర్రుమంటే చీమ కుట్టిందని చిన్నికృష్ణుడు బుడిబుడి రాగాలు తీసినా, తోడుదొంగలమైనందుకేనేమో మనకూ చీమ కుట్టినంతైనా  కోపం రానిది! కన్నయ్య చిన్ననాటి  కొంటె కథలన్నీ ఇట్లాగే ఉంటాయని అన్నమయ్యలోని భక్తిసాధకుని తన్మయత్వ  భావన. ఆ గోపాలుడి నిద్ర మెలుకువే పాలు చిలికే కవ్వం సవ్వళ్లతో మొదలవుతుంది. తరకలు కట్టే వెన్నముద్దలు దొంగిలించే ఆలోచనతోనే ఆ నల్లనయ్య కళ్లు నులుముకుని మరీ నిద్ర  లేచేదని లీలాశుకుని 'శ్రీకృష్ణకర్ణామృతం' కృష్ణతత్వాన్ని వర్ణించింది  గోపీజన మానస చోరుడుగా  కన్నయ్యకు మరో మనోహరమైన  బిరుదు ఎలాగూ ఉంది. క్రౌర్యం, నైచ్యం వంటి మరెన్నో మానసిక బలహీనతలు అన్నిటిని చౌర్యం చేసైనా సరే మనిషిని శుద్ధిచేయడం భగవంతుని బాధ్యతగా  భాగవతులంతా భావించిన తీరులోనే అన్నమయ్య  భావనా వాగ్గేయమార్గంలో అచ్చమైన తెలుగులో అద్భుతంగా సాగిందనుకోవాలి. 

'సా రోహిణి నేల మసూతరత్నం/కృతాస్పదం గోప వధూ కుచేషు' (రోహిణి కృష్ణుడనే నీలిరత్నాన్ని కన్నది. గోపికలు ఎప్పుడూ దానిని తమ వక్షస్థలంలొ ధరిస్తారు) అని లీలాశుకుడు చమత్కరిస్తే, అంతకు రెండాకులు ఎక్కువ చదివినట్లు కృష్ణతత్వం ఆసాంతం నవరత్నాలతో పోల్చదగ్గదని అన్నమయ్య  తెలుగులో చేసిన భావన పరమాద్భుతం. 'ముద్దుగారె యశోద ముంగిట ముత్యము వీడు'సంకీర్తనలో అన్నమయ్య  ఆ నవరత్నాలను పొదిగిన లాఘవం అమోఘం.  యశోదమ్మ ముంగిటి ముత్తెం మరెవరో కాదు.. తిద్దరాని మహిమల దేవకీ సుతుడైన బాలకృష్ణుడే! అతగాడే అంత నింత గొల్లెతల అరచేతి మాణిక్యం; పంతమాడే కంసుని పాలిట  వజ్రం కూడా అతగాడే. ముల్లోకాలకు కాంతులిచ్చే గరుడ పచ్చపూసట చిన్నికృష్ణుడు. రతికేళికి ఎదిగే వేళకు ఆ మదనుడే రుక్మిణమ్మ పాలిటి  పగడంగా మారాడుట! గోవుల గుంపు మధ్య  గోమేధికంలా మెరిసిపోయే నల్లని కృష్ణుడు, శంఖ చక్రాలు ధరించినప్పుడు వాటి సందులో వైడూర్యంలా మెరుపులీనుతాడుట. భక్తజాతికి అంతిమ గతిగా భావించబడే  కమలాక్షుడు కాళింగుడనే సర్పం శిరస్సు మీద కళ్ళు చెదిరే   పుష్యరాగం మాదిరి మిరిమిట్లు గొలుపుతాడని, పాలకడలిలో మెరిసే ఇంద్రనీలం వంటి ఆ శ్రీవేంకటాద్రి పద్మనాభుడే ఆన్నెపున్నేలేమీ ఎరుగని పసిబాలుడి మాదిరి  మన మధ్యనే  పారాడే  దివ్యరత్నమని అన్నమయ్య భావించడం కృష్ణతత్వానికి పట్టిన  అపూర్వ వాగ్గేయ హారతి పళ్లెం.  

- కర్లపాలెం హనుమంతరావు 

బోథెల్  ; యూ ఎస్ ఎ 

30-01. 2021


***

Tuesday, January 19, 2021

నాస్తికుడికే రాజకీయం కావాలి -కర్లపాలెం హనుమంతరావు

 



ఆస్తికుడికి ఏ రాముడో, దైవదూతో, అల్లా పురుషుడు ఉంటాడు.. విన్నా వినకున్నా మొరపెట్టుకోవడానికి! దేవుడి ఉనికిని కొట్టిపారేసే నాస్తికుడి నసకు చెవి ఇచ్చే నాథుడు ఎక్కడుంటాడు? ఎవడి గోల వాడిదే.. ఎవడి బతుకు బండికి వాడే సారథి.. అని విశ్వసించే నాస్తికుడి ఈతి బాధల పరిష్కారానికి రాజకీయాలే గతి. ఒక చెంప రాముడో, రహీమో, క్రైస్తవమో  మన దుఃఖ జీవన సాగరం ఆవలి తీరానికి దారి చూపించే మార్గదర్శకులు అంటూ అనునిత్యం ఘోషిస్తూనే, మళ్లా ఆ రాముళ్లను, రహీములను, క్రీస్తూదేవుళ్లను దిక్కులేని వాళ్లుగా చేసేస్తున్నారని ఒకళ్ల మీద ఒకళ్లు నిప్పులు చల్లుకుంటున్నారు ఆస్తికులు. దేవుడు మనిషిని కాపాడుతున్నట్లా, మనిషే దేవుడి రక్షణకు కంచెగా నిలబడ్డట్లా అని అడిగే నిజాయితీ ప్రశ్నకు సజావుగా బదులు ఇవ్వకుండా ముక్కు చుట్టుడు మొక్కుబడి స్పందనేదో వెలిబుచ్చేసి ఆనక దేవుణ్ణి చిన్నబుచ్చేశాడని ఆగడాలకు దిగవచ్చు, అల్లర్లు ఎన్ని ఏళ్లయినా ఎడతెరిపిలేకుండా సందు దొరికినప్పుడల్లా చేసుకొనే సౌకర్యం ఆస్తికులకు కద్దు. నిజాన్ని నిజంగా తప్ప అబద్ధంగా అంగీకరించలేని అర్భకుడు నాస్తికుడికి.. ఏ దేవుడైనా ఎందుకు సాయపదతాడు? ఆ కారణం చేత కూడా నాస్తికుడు స్వంత బాధల పరిష్కారానికి స్వంతంగానే పూనుకోవాలి. పూనుకోవడం అంటే రాజకియం చేయడం అన్న మాటకు ప్రత్యామ్నాయ పదం. ఏతావాతా   నాస్తికులు ఈ భూప్రపంచం మీద రాజకీయాలు ఒక్కటే  నమ్ముకునేందుకు వీలైన దిక్కు. కాకపోతే అతగాడి పొలిటికల్ 'ఔట్ లుక్'.. ఆస్తికుడి 'ఇన్ సైడర్ వేదాంతం' కన్నా విభిన్నంగా , రుజుప్రవర్తనతో కూడుకుని ఉంటుంది. నాస్తికుడుకి  రాజకీయాలెందుకు? అని పెడసరంగా ఆడిగే ప్రబుద్ధులకు 'ఆస్తికుడికి మించి నాస్తికుడికే రాజకీయాలతో  ఎక్కువ సంపర్కం ఉండితీరాలి. ర్రాజకీయం అన్నమాటకు అర్థం రాజ్యానికి సంబంధించి నడిచే వ్యవహారం యావత్తూ.. అయినప్పుడు ఇహలోకం జీవనం మీద చులకన భావం ఉండే ఆస్తికుడికే అవసరమైన రాజకీయం ఈ లోకమే తన అసలు లోకం అని మనసా వాచా కర్మణా నమ్మే నాస్తికుడికి అక్కర్లేదా? ఏం వింత వాదన?

రాజకీయం అంటే మనుషుల సంక్షేమం కన్నా ముందు దేవుడి బాగోగులు చూడాలన్న వాదన కాదు. దేవుడు మనుషుల్ని సృష్టించాదన్నది కేవలం ఏ ఆధారం లేని పరంపరగా వస్తోన్న ఓ విశ్వాసం మాత్రమే. తాము చేసే ఏ ప్రకటనకు నమ్మదగ్గ రుజువులు చూపించలేని ఆస్తికుడి మల్లే కాదు నాస్తికుడు. దేవుణ్ని మనిషే సృష్టించాడన్న వాదానికి సవాలక్ష ఉదాహరణలు చూపించగలడు. అన్నీసజీవమైనవి, మన కళ్ల ముందు కళకళలాడుతో కనిపించవి. నిజ జీవితంలో నిజంగా ఏదన్నా  కష్టమొచ్చి నమ్ముకున్న దేవుడు ఎలా కాపాడతాడో తరుణోపాయం చెప్పమంటే అమాయకమైన భక్తుడిని అదే  పనిగా అన్నహారాలు గట్రా మానేసి (ఉపవాసాలు) భజనలు, సంకీర్తంలు, ప్రార్థనలు, నమాజులు చేసుకోమని చెప్పుకొస్తారు ఆయా మతపెద్దలు. ఈ తరహా పలాయనవాదాన్ని ప్రోత్సహించే జిత్తులు కాకుండా నాస్తికుడు 'నీ కష్టాలకు మూలం కూడా నువ్వే. నీ పిరికితనమో, లొంగుబాటో, అత్యాశో, తాహతకు మించిన కోరికో, సమాజం ఒప్పని నీతో, నిష్కారణమైన కడుపుమంటో, ఏ ప్రయోజనమూ సాధించలేని నిరాశో, పని చేసేందుకు బుద్ధిపుట్టని బద్ధకమో, తేరగా లబకం ఊడిపడలేదన్న దుఃఖమో, అర్హత లేని గౌరవం దక్కడం లేదన్న ఉక్రోషమో, చులకనగా చూసే వస్తువు శక్తివంతంగా మారి నిలదీస్తుందన్న కసో, పక్క శాల్టీ పైకి ఎదుగుతుందన్న కుళ్లుబుద్ధో.. ఏదో అయివుంటుంది. తీరికగా కూర్చుని, ఓపికగా తరచి చూసుకుని ఆ లోపాన్ని సరిచేసుకుంటే ఏ కష్టమూ నిన్ను బాధించదు. నీవు కొని తెచ్చుకున్న రొచ్చులోకి లేని దేవుడిని  లాక్కువస్తే నీ సమస్య ఎన్నడికీ తీరదు. అంతా ఆ పైనున్న వాడే చూసుకుంటాడని  నీకు మెట్టవేదాంతం బోధించే స్వాములవారు కడుపునొప్పి వస్తే ఆ భారం భగవంతుడి ఒక్క డి మీదనే ఒదిలేయటం లేదు కదా! భక్తుల ఖర్చు మీదనో, ప్రభుత్వ పెద్దల సహకారంతోనో ఏ అమెరికా వంటి పెద్ద దేశాలకు వెళ్లి భారీ బిల్లులు చెల్లించి నయంచేయించుకుంటున్నారు కదా! ఈ లోకం కష్టాలకు ఇక్కడే పరిష్కారం అని చేతలతో చూపించే స్వాములార్ల డొల్ల వేదాంతపు మాటలు నమ్మి కాళ్లుజాపుకు కూర్చోబట్టే కష్టాలు ఎన్నటికీ తీరడం లేదు.

రాజకీయాలంటే నిజానికి ఏమిటీ? రాజ్యానికి సంబంధించిన వ్యవహారాలు. ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు. అంటే మనమే రాజులం. మనకు చెందిన సంగతులన్నీ రాజకీయాలకు అవసరమే. ఆలాంటి నేపథ్యంలో 'దేవుడు లేడు. అదంతా నీ ఊహ' అన్నవాస్తవం చెప్పిన పాపానికి రాజకీయాలకు దూరంగా ఉండాలా నాస్తికుడు?  ఎంత 'నాస్ సెన్స్' గా ఉంది వాదన! వాస్తవానికి అన్నీ దేవుడు చూసుకుంటాడన్న బీరాలు పలికే ఆస్తికులే రాజకీయాలకు దూరంగా ఉండాలి. ఏ దండకారణ్యాలకో వెళ్లి ముక్కు మూసుకుని తాము పరితపిస్తున్నట్లు నటించే మోక్షం కోసం నిక్షేపంగా అన్నహారాలు మానేసి జపతపాలు చేసుకోవాలి. నగరం నడిబొడ్డున ప్రభుత్వాలు దయచేసే అత్యంత ఖరీదైన భూముల్లో భక్తుల సొమ్ముతో విలాసవంతమైన వైభోగం తాము ఆనుభవిస్తూ అడుగడుగునా రాజకియాలలో జోక్యం జనాలకు అన్యాయం చేస్తున్నది ఎవరు?

నాస్తికులందరిదీ ఒకే అభిప్రాయం .. ఎప్పుడైనా.. ఎక్కడైనా!

'నీ జీవితానికి నీవే కర్తవు.. కర్మవు. కనక క్రియా పరంగా కూడా నీ చర్యలే సమస్యలకు పరిష్కారాలు అవుతాయన్నది ఆ  అభిప్రాయం. ఆస్తికుల మధ్యనే సవాలక్ష అభిప్రాయ భేదాలు. 'నా దేవుడు గొప్ప' అని ఒకడంటే.. 'నా దైవం అధీనమే ఈ జగత్ సర్వం' ఇంకొకడి వాదన. మా భగవంతుడికి అపచారం కలిగితే లోకాలన్నీ భగభగమని మండిపోవాల్సిందే!'అని ఒక ఆస్తికుడు బెదిరిస్తే.. మా మూలపురుషుడు లేచి వచ్చేస్తే సర్వం అనంతంలో బుడుంగుమని మునిగిపోవాల్సిందే!' అని సవాళ్లు! నిరాకారుడని చెప్పుకునే దేవుడికి కోపతాపాలు ఎందుకు వస్తాయో,  శాంతి కాముకుడని కోసే భగవంతుడు ఊచకోతలు ఎందుకు ప్రోత్సహిస్తాడో? నిరంజనుడైన ఆదిదేవుడికి అన్నేసి వేల మంది స్త్రీలతో సరసాలా? తృణప్రాయమైన జీవితాలకు బంగారు గొడుగులు, హంగు ఆర్భాటాలతో ఊరేగింపులా? నిజం చెబితే నిష్ఠురం గానీ.. దైవం పేరుతో దుష్ప్రచారమయ్యే  మత విబేధాలు, కులవివక్షల వల్ల కాదూ  మనిషి బతుకు  అవుతున్నది ఇవాళ వల్లకాడు?

రాజకీయాలంటే ఉన్న దూరూహవల్లనే ఇవాళ నాస్తికుడికి రాజకీయాలతో ఉండే సంబంధం ప్రశ్నకు గురవుతున్నది. వాస్తవానికి రాజకీయం అంటే రాజ్య పాలనా నిర్వహణ. ఈ ప్రభుత్వ నిర్వహణ మూడు దశలుగా సాగడం చరిత్రలో మనం చూస్తున్నాం. రాజపాలన,  నియంతృత్వం, ప్రజలు నిజమైన పెత్తందారులుగా నడిచే ప్రజాస్వామ్యం.

రాజరికంలో ప్ర్రజలు ఎలా నడుచుకోవాలో శాసించేది శాసనాల ద్వారా రాజు. నియంతల పాలనలో ఆ పని నియంతది. ఇక్కడ ప్రజల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకపోయినా పాలకులు పెద్ద నష్టమేమీ లేదు. ఎదురుతిరిగిన బలహీనుణ్ణి, బలమైన వాడైతే బలహీనుణ్ణి చేసి ఆనక ఆడ్డు తొలగించుకొనేందుకు బోలెడంత సాధన సంపత్తి, మందీ మార్బలంతో సిద్ధంగా ఉంటాడు. ఈ రెండు వ్యవస్థలల్లో సామాన్యుడి గతి బ్రహ్మాస్త్రాన్ని చూసి అణిగుండే పిచ్చుక తీరే. రాజకు రాజ వంశంలో వాడే ప్రత్యామ్నాయం. నియంతకు తాను అనుకున్న మరో నియంత ఆ లోటు భర్తీ చేస్తాడు. ప్రజాస్వామ్యంలో నిజానికి నిర్వచనం ప్రకారం ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన సాధ్యమయ్యే పాలన- అనే కాని.. నిజానికి ఆ ప్రజలు ఎవరు అన్నదే కీలకమైన ప్రశ్న. డబ్బు ఉన్నవాడు, మతం మీద పెత్తనం కలవాడు, జబ్బసత్తువ ఉన్నవాడు .. ఇలా ఎవరికి వాళ్లు తామే అసలైన ప్రజలం అని ప్రచారం చేసుకుంటూ తమకు సానుకూల పడే పనులు మాత్రమే ముందుకు సాగేందుకు దోహదపడుతుంటారు. విచిత్రమేమంటే.. ఏ సమాజంలో అయినా అత్యధిక శాతంగా ఉండేది ఆర్థికంగా అంత వెసులుబాటు లేనివాళ్లే! అయినా వాళ్ల ప్రయోజనాలు, జీవితాల అభివృద్ధి ఎవరికీపట్టవు. అందుకు వేరెవరినో నిందించాలని పనిలేదు. తమ లోపల ఉండే ఎన్నో బలహీనతలు, చాపల్యాలు, కల్పనలు, మూఢవిశ్వాసాలు, అనైతిక బంధాల పట్ల మోజు వంటి దుర్గుణాల సంకెళ్లయి ముందుకు కదలనీయవు. ఇట్లాంటి బంధనాలను అన్నింటినీ ఛేదించుకుని స్వంత జీవితాలలో ఎవరికీ అభ్యంతరకరం కాని పద్ధతిలో సుఖంగా జీవించే శక్తి నాస్తికుడికి ఉంటుంది. రాజకీయాలతో సంబంధమే కాదు.. రాజకీయాలను శాసించగల శక్తీ నిజానికి నాస్తికుడికే.

లొంగుబాటు ఆస్తికుడి తత్వం. బానిస ప్రవృత్తికి ఎక్కువ ఆస్కారం కల్పించే ఆస్తికులకు అందుకే రాజరికపాలన మీద, నియంతల కర్రపెత్తనం మీద మనసులో ఉండే  మోజు అప్పుడప్పుడు మాటల్లో వెల్లడవుతుంటుంది. 'ఎవరన్నా నియంత వస్తే గాని మన బతుకులు బాగుపడవు' అని ప్రకటించే ఆస్తికవాదిని చూడవచ్చును గాని ఆ పంథాలో ఆలోచించే నాస్తికుడిని ఎక్కడా చూడబోం. నాస్తికుడు అంటేనే స్వీయ శక్తి మీదనే అపారమైన విశ్వాసం కలవాడు. వాడి వల్ల కాకపోతే మరి ఆస్తికుల వల్ల మేలైన  ప్రజాస్వామ్యం సాధ్యమవుతుందా? ఆస్తికుడి రాజకీయాలు స్వార్థప్రయోజనాలు సిద్ధింపచేసుకోవడం కోసం. నాస్తికుడి రాజకీయాలు ఖాయంగా జనహితంగా ఉండేటందుకు మాత్రమే సాగే వ్యూహాలు. నాస్తికత్వం అంటేనే స్వతంత్ర బుద్ధి.  లొంగుబాటుకు ఛస్తే లొంగని మనస్తత్వం. రాజరికం, నియంతృత్వం అంటే అసహనం ఉంటుంది కనక.. అతగాడి రాజకియాలు ఎప్పుడూ ప్రజాస్వామ్య వికాసానికి మాత్రమే తోడుపదేవి.

పుర్వకాలపు రాజరికాలు, నియంతల రాజాలు ఇప్పుడు ఎక్కువగా కనిపించవు. ఆ కారణం చేత సమాజంలో నాస్తికుల సంఖ్య గణనీయంగా పెరిగిందనడానికి నిదర్శనం అనుకుంటే పప్పులో కాలేసినట్లే! ఆస్తిక లక్షణం లొంగుబాటు తత్వమే అయినా ప్రజలలో క్రమేపీ పెరుగుతున్న నాస్తిక భావనలు మెల్లగా రాజరికపాలనలు అంతమవడానికి దోహదపడుతున్నాయి. అయినా ప్రజాస్వామ్య దేశంలో ఉన్న ప్రజలలో అధికశాతం నాస్తికులన్న నిర్ణయానికి రాకూడదు. ప్రభుత్వ నిర్మాణంలో ప్రధాన భూమిక వహించే సామాన్యుడు ఈ ఆస్తిక, నాస్తిక ద్వైధీభావజాలం మధ్య  ఊగిసలాదుతున్నాడని మాత్రమే మనం చెప్పగలం. మనసులో నాస్తిక భావనలు ముప్పిరిగొంటున్నా బహిరంగా అంగీకరించేందుకు సిద్ధపడని హిపోక్రసీనే ప్రస్తుతమున్న ప్రపంచవ్యాప్త రాజకీయ వాతావరణం.

మన దేశంలోని పరిస్థితి ఈ  మూడ్(mood)కి ముమ్మూర్తులా అద్దం పడుతుంది. పేరుకే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నప్పటికి, వాస్తవంగా సామాన్యుడు తన జీవితాన్ని తానే సరిదిద్దుకునే స్థితిలో లేడు. ఎన్నికలు వచ్చిన సందర్భంలో ఏదో ప్రజాస్వామ్య వాతావరణంలో ఉన్నట్లు ఊరట కలిగినా, ఒకసారి ఫలితాలు వచ్చి ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత ఓటరు మహాశయుడు నేరుగా రాజకీయ జోక్యం చేసుకొనే పరిస్థితి బొత్తిగా లేదు. కోరుకున్న పార్టీలకు తట్టుకుని నిలబడే శక్తి ఉండదు. బరిలో నిలబడిన పార్టీలలో అయినా జనం కోరుకోని వ్యక్తులే అధికంగా కనిపించే దుస్థితి. ఎవరో ఒకరు గెలవాలి కనుక గెలుస్తారు. ఒకసారి గెలుపొందిన తరువాత  విజేతకు ఇక మళ్లీ ఎన్నికలొచ్చిపడే వరకు జనంతో సంపర్కం ఉండనక్కర్లేని వ్యవస్థలు ఇప్పటివి.

నిజమైన నాస్తికవాది నిజమైన ప్రజాస్వామ్యప్ర్రేమిగా ఉండటం తప్పనిసరి. దిగాలుబడి కార్యంలేదు. నిందిస్తూ కూర్చున్నా  శౌర్యం అనిపించుకోదు. ఎవరూ కలసిరావడం లేదన్న నిరాశ నాస్తికుని మనస్తత్వానికి సరిపడదు. సమస్య ఏదైనా వర్ణిస్తూ కూర్చున్నందువల్ల తెమిలే వ్యవహారం కాదు. పరిష్కరించే దిశగా చర్యకు పూనుకోవాలి. అదీ తక్షణమే. ఆ భారం మరెవరి మీదనో వేసి నిబ్బరంగా ఉండకుండా మొదటి అడుగు తనదిగా ఉండేలా చూసుకోవడమే ఆసలైన నాస్తికుడి ప్రజాస్వామిక రాజకీయం.

నిజానికి నాడు స్వాతంత్ర్య సాధన దీక్ష దైవసంకల్పంతో సాగింది కాదు. మనం ఒప్పుకోం కానీ.. ఆసేతు హిమాచలం  కులమతాల తారతమ్యాలన్నింటిని తోసిరాజని మానవ సంకల్పంతో సాధించింది మాత్రమే దేశస్వాతంత్రం. స్వాతంత్ర్యం సిద్దించగానే అలవాటు బడ్ద ఆస్తికత్వంలోకి మళ్లీ తిరిగొచ్చేశాడు భారతీయుడు. బానిసత్వ లక్షణాలు తిరిగి పొడగట్టేసరికి  సరికొత్త నియంతలు ప్రజాప్రతినిధులపేరున  నెత్తికెక్కారు.  నిజమైన ప్రజాస్వామిక ప్రభుత్వాలనే మనం కోరుకుంటే ఆస్తికత్వ భావనలను పూజగది గడప దాటి రానీయవద్దు.

ప్రతి వయోజనుడి దగ్గర ఓటు అనే ఆయుధం ఒకటి ఉన్నా.. పేదరికం, బానిసత్వం వారసత్వపు ఆస్తులుగా వస్తూ ఉన్నాయి. చేతిలోఉన్న ఓటుతో కోరుకున్న జీవితం సాధించుకునే వీలున్నా దృష్టిని మళ్లించే ఆస్తికభావాలు నిత్యావసరాల జాబితోలో లేని కులాల, మతాల  మీదకు మళ్లిపోతున్నాయి.. మళ్లీ మళ్లీ! పేద జీవి ఓటు నిరుపయోగం చేసే బానిస భావాలను తొలగదోసుకుంటే తప్ప  సుఖమయ జీవితానికి అతి ప్రధానమైన విద్య, ఉపాధులు, సంక్షేమం, సౌభాగ్యం స్థానే కులం, మతం, వర్గం, వర్ణం, జాతి, నీతి వంటి అడ్డుగోడలు కూలిపోవు. చేతిలో అధిక ఓట్లు కలిగివుండీ పేరుకు పరిపాలకులే అయినా పేదలు తరాల తరబడి బానిసలుగా సమసిపోవడం, ఆస్తికవాదం బోధించినట్లు  తలరాతల వల్ల కాదు, పూర్వజన్మల ప్రారబ్దం వల్ల అంతకన్నా కాదు. గోరంతైనా ఆధారం చూపించ సాధ్యం కాని మాయామిథ్యావాదాలు కూరుతూ   చలనశీల మేధస్సును చక్కభజనల పాల్చేసుకోవడం వల్ల. పరలోక పథం పట్టిపోయిన ప్ర్రజాస్వామిక రథాన్నిప్పుడు ప్రజాకోటి భుజం మీదుగా  భూమార్గం పట్టించడమే అసలు సిసలు నాస్తిక రాజకీయ దృక్పథం. నాస్తికుల  ప్రజాస్వామికమే నిజమైన ప్రజాస్వామికం. సర్వ  మానవ సమానత్వం స్వేచ్ఛగామి ప్రజాప్రభుతకు మచ్చఅంటని  అద్దం. బానిసలు కనబడని ప్రజారాజ్యం నాస్తికుల భావజాలంతో మాత్రమే అందుకు సాధ్యం. సమానత, ప్రజాస్వామికత కలసి రావాలంతే నాస్తికుల భావ దృష్టి  పౌరలందరికీ ముందు అలవడాలి.

-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్, యూ ఎస్ ఎ

19 -01 -2020

 

 

 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...