Showing posts with label column. Show all posts
Showing posts with label column. Show all posts

Sunday, December 12, 2021

క్తి - భుక్తి ( సరాదాకే ) - కర్లపాలెం హనుమంతరావు

 

భక్తి - భుక్తి ( సరాదాకే )

- కర్లపాలెం హనుమంతరావు

 

ఎవరు మాతా నువ్వూ?

నన్నే మరిచి పోయావా నేతా ! భరతమాతనురా ధూర్తా!

పరగడుపునే ఏంటీ ఈ రాక? 

పత్రికల్లో చూశాను తమ నిర్వాకం! రాక తప్పలా!  ఈ మధ్య ఓ జస్టిస్ గారెవరో  సభలో ప్రసంగం చేస్తూ, జాతీయ గీతం నట్లు లేకుండా పాడేవాళ్ళు చేతులెత్తమని అడిగితే ఒక్క చెయ్యైనా  పైకి లేవలేదంట! సిగ్గేయడం లేదుట్రా సన్నాసీ?

వేలాది వేలంపాటలు తల్లీ!   మజ్జెలో నీపాటల గోలేంటి కూ మళ్లీ!  సారొస్తారొస్తారొస్తార్లాంటి  ట్యూన్లంటే ఏదో రింగుటోన్లు  మాదిరివి  డౌన్లోడ్ చేసుకోవచ్చు! తంటాలు పడి ఆనక హమ్ చేసుకోవచ్చు! సారే జహాసే  అచ్ఛా..  ఏంటమ్మా ఇంకా చాదస్తంగా!  పంద్రాగస్టు , జనవరి ఛబ్బీసుక్కూడా వినిపించడం లేదిప్పుడు!

 

చిన్నప్పుడు  బళ్లో వందేమాతరం అంటూ అంతలా  గొంతేసుకు గావు గావు మని  పాడేవాడివిగా!! ఇప్పుడే దూలం గొంతులో గుచ్చుకొందో?

 

పెద్దమనుషులవై పోయాం  తల్లీ  ఇప్పుడు! పద్దస్తమానం  పాచిపళ్ల దాసరయ్యలా అదే సొదంటే! డ్యామిట్ .. ముందడ్డం తిరిగేదిక్కడ మా కథే మామ్! ఎన్నికలొకేపు  తరుముకొస్తూనే ఉండె ఎప్పటి కప్పుడు! ఎవరి విజయగాధలు వాళ్లు మొత్తుకోడానికే ఎక్కడి టైమూ చాల్చాచావడంలా! 'గాహే తవ జయ  గాధా ' అంటూ ఇప్పుడు  కళ్లు మూసుకు ఫ్రీజయిపోయి  నీ విజయగాధలు వినిపిస్తూ నిలబడాలా? సిల్లీ! 'ఫుల్లకు సుమిత ద్రుమ దళ శోభినీం ' నా .. అదేందో పాడు  భాష!  ఫుల్లుగా మందు కొట్టినా నోరు తిరగి చావని హోష! అక్కడికీ ఒలంపిక్కు  ఆటలనో, డైలీ  రేడియో పెట్టంగాననో వినిపిస్తానే ఉన్నాంగదా తల్లీ! అయినా మా టంగులక్కు ఈ ట్విస్టింగ్ టెస్టులేంటి తల్లీ ?  'జయహే జయహే జియహే' అంటూ అన్నిసార్లు చెవి గోసిన మేగకు మల్లే అరవడానికి  తమరిదేవఁన్నా పార్టీ టిక్కెట్టిప్పించేటంత గొప్ప  చరిత్రా?  'పంజాబు సింధు గుజరాట మరాఠాట! ..  ఆ రాసిందెవరో గానీ ..

అదీ తెలీదురా నేతా! ఠాగోరు

ఠాగోరో .. గొంగూరో ! చాకలి పద్దంత పొడుగు జాబితా! సింగిల్ టేకులో ఓకే చేసెయ్యడానికి ఎన్టీఆర్లమా, మోహన్ బాబ్బాబులమా తల్లీ! ఐనా  పాటల కోసమే తీసిన  సినిమాలున్నాయ్! పాటల్తోనే లాగించే  మ్యూజిక్ ఛానెళ్లున్నాయ్! చానాళ్ల నుంచి  వినిపించే ఎఫ్ఫె మ్ రేడియోల రొదిహ చెప్పనే అక్కర్లే! నీ సాంగుల కోసం  అన్నేసి   ఫెసిలిటీసుండంగా.. ఏదో ప్రజాసేవతో  పూటగడుపుకునే   గ్రంథసాంగులం.. మేమే దొరికామా  తల్లీ.. శాడిజం కాకపోతే! ప్రజాస్వామ్యం తల్లీ ఇప్పటి రోజులు. జనాలే మాకు మా రాజులు. యధారాజా తధా ప్రజా!

మీ రాజులు వందేమాతరమన్నా పాడలేరనా నీ అభియోగం భడవా? 

నువ్వే అడిగి చూడు.. ఆన్సరేమొస్తుందో విను! స్టన్నవకపోతే .. కొట్టు.. ఇదిగో కాల్జోడు! వందకు   ఏ మాత్రం గిడుతుందో నుందు  లెక్కచెప్పమంటున్నార్తల్లో తెలివి మీరిన జనమిప్పుడు!  నువ్ సినిమాలు చూడవు కామోసు! ఇది వర్లో మూవీ చివర్లో  తెర మీద మువ్వన్నెల జెండా .. దాంతో జాతీయగీతం పాడ్దం, ఎగరడం గట్రాలుండేవి గదా!  ఇప్పడట్లాంటి గట్రాలు గిట్లాలకు టైమ్లేదెవ్వరికీ. జయహే జయహే జయహే.. అనొస్తుంది కదా ఆఖర్లో! ఆ  మూడో '.. హే' వింటానికి హాల్లో మిగిలుండేది చీపురు కట్టల్తో బరబరా ఊడ్చుకునే బ్రదర్స్ అండ్ సిస్టర్సే! రెహమాన్ కొత్త వరస  జయహేలక్కూడా అదే గతి!    'పొగడరా నీ తల్లి భూమి భారతిని' అంటూ తమరే  ఉద్దేశంతో తరిమి తరిమి రాయించుకున్నారో గాని  తల్లో.. కవుల్ని, కనీసం  అట్లాంటి   పొగడ్తలకైనా సరే  ముందిప్పుడు అర్జంటుగా  ఏ పరాయిగడ్డ మీదకో ఎగిరెళ్ళిపోవాలని  యమ తొందర్లో ఉంది  యువతరమంతా.   'విశాలదేశం మనది .. హిమాలయాలకు నిలయమిది..  విశాల హృదయంతో మెలగాలీ ' ఏందమా అదీ?..  నవ్వొస్తుంది మరీ అన్ని విశాలాలు వినిపిస్తా ఉంటే పాటలో.   విత్ రిగార్డ్స్ మా ఆస్థాన కవి  దాశరథిగారికి.. నేనో మాట చెప్పెయ్యాలా  నీకు?  విదేశాలోళ్ల విశాల దుకాణాలకీ,  అణు విద్యుత్ కేంద్ర సువిశాల నిర్మాణాలకీ సరిపోతాయేమో తల్లో ఆ విశాల, విశాల పదాలన్నీ ఇప్పుడిక్కడ.  నువ్విప్పుడిలా ఆ జడ్జి గారి మాట పట్టుకొనొచ్చి  అర్థాంతరంగా మా మీదిన్ని అభాండాలు వేసేయడం, దేశభక్తి  మీదుండే మా  ఆలాపన ఆసక్తిని శంకించెయ్యడం  ఇదేం బాలే భరత మాతా! మంది  మంద స్వామ్యం అని నీకు  తెలీదా? ముందు నువ్వు నిల్దీయాల్సింది మమ్మల్నా? మమ్మల్నిట్లా నేతల్ని చేసి నెత్తికెక్కించేసుకున్న గొర్రెల మందల్నా?

 

భరత మాతకు అప్పటిగ్గాని  తొందరపాటులో తను చేసిన తప్పు తెలిసింది కాదు. తప్పు సరిదిద్దుకునేందుకు ముందుకు కదిలిందా దేశమాత.

 ***

'ఏందీ!  మా తెలుగు తల్లికి మల్లెపూదండా? బావుంది తల్లో సంబడం!  మల్లెపూలు మూర ఎంత మండుతుందో తెలుస్తుందా నీకు ? ' ఒక ఇల్లాలి మూతి  మూడు వంకర్లు తిప్పింది 'తెలుగు తల్లి’ పాట పాడి వినిపించమని తెలుగు తల్లి అడిగిన పాపానికి.

 

'సడిపాయ!  మామూలు తల్లులకే అతీ గతీ లేదిక్కడ బిడ్డా! కాలు మడమ కాస్త జారినా చాలు, నేరుగా  కాట్లోకి తీసుకెళ్లి కుదేసేస్తోంది  తల్లో ఇప్పటి సంచు! నీ పాట్లోని   మంగళారతులు ఏట్లో కలవ! ముందు మా పాట్లు చూసే దేవుడెక్కడా అని అల్లాడి  చస్తున్నామీడ’ ఓ ముసలమ్మ కళ్లల్లో నీళ్లు తెలుగుతల్లి పాటేమైనా పాడమన్న పుణ్యానికి!

పాటలోని'కడుపులో బాంగారు'  అనే ముక్క పట్టుకుని 'ఇప్పుడా బంగారాలు .. సింగారాలు ఎందుకమ్మా తల్లీ ? కంచంలోకి చారు నీళ్లయినా రేపు దొరుకుతాయోలేదోనని  కంగారు పడి ఛస్తుంటేనూ' అంటూ ఓ మధ్య తరగతి సంసారి ఘోష పెట్టేశాడు.

 

ఎవరికమ్మా కావాల్సిందిప్పుడా కరుణలు.. శ్రీలు పొంగిన జీవగడ్డలో వరదనీరు పొంగి పొర్లుతున్నప్పుడు! నీ పాటలోని ఆ  'కనుచూపు'లో కనీసం రుణం మాఫీ కైనా హామీ దొరికితే అదే పదేలు?' అంటూ అన్నదాత ఆక్రోశం.

 

' మురిపాలు ముత్యాలు - అమరావతీ శిల్పాలు' ? హుఁ!  భలే  కల్పించారు తల్లీ నీ తెలుగు తల్లి పాటలో! కవులూ, కళాకారులకే ఆ ముద్దులూ .. మురిపాలు; కవనాలు కల్పనలు! పాడుకాలంలో వచ్చి మమ్మల్నిలా పాడమని అడుగుతున్నవే.. నువ్వు నిజంగామా తెలుగు తల్లివేనా!' అంటూ ఓ కళాకారుడి ఆక్రందన!  

 

పోయారు కనక బతికిపోయారు గానీ.. జీవించి గనకే  ఉండుంటే త్యాగయ్య గొంతులోనైనా సరే ఆనాటి  నాదాలు తారాడటం డౌటే !’ అంటూ మరో కళాకారుడి వెటకారాలు!

 

తన రాంగ్ టైమింగ్ అప్పటిగ్గానీ తెలిసి వచ్చింది కాదు తెలుగుతల్లికి.  జనాలు భుక్తి కోసం అల్లాడే సమయంలో దేశభక్తిని గూర్చి చర్చకు పెట్టడం ఎంత పెద్ద తప్పిదం!

 

'చెక్కెరే చేదెక్కిపోయిన కర్కశ కాలంలో తిక్కయ్య కలంలోని తియ్యందనాలు ఆశించడం అత్యాశ అవుతుందేమోనన్న శంక అప్పుడు మొదలయింది తెలుగుతల్లికి| నాటి రుద్రమ్మంత భుజశక్తి నేటి దుర్గమ్మ కలిగి వున్నప్పటికీ  ఇంత సంసార భారం మోసేందుకు సిద్ధంగా లేదన్న సత్యమూ అప్పుడామె తలకెక్కింది.   మల్లమ్మ తరహా పతిభక్తి గుండె  నిండా పండి  ఉన్నంత మాత్రాన,   ఇల్లు గడిచే భుక్తి కై అల్లాడకుండా ఉండగలదా నిజమైన ఏ ఇల్లాలు అయినా? ఇంత సింపిల్ లాజిక్ తాను మిస్సయినందుకు తెలుగుతల్లికి సిగ్గనపించింది.  

 

'పాలు పారిన భాగ్య సీమయి వరదలీనినది యీ  భరత ఖండం.. భక్తి పాడరా తమ్ముడా!!’ అంటూ బిడ్డల మీదంతలా వత్తిళ్లు తెచ్చి పాడించుకున్నంత మాత్రాన వచ్చిపడే  సంతృప్తిలో అర్థమేముంటుంది?    'బోలో భరత్ మాతా కీ జై ! ' అంటూ నినాదాలివ్వమంటే బోళా శంకరయ్యలు కూడా తిరగబడే రోజులిప్పుడు మరి! జనంలోని  అసంతృప్తి స్వరం గుర్తించడంలోని తాత్సారం ఇప్పుడు  అర్థమయింది తెలుగు తల్లికి.

 

ఇన్ని అనర్థాలకు అసలు మూలకారణమెవరు?  ముందు జనం  తెలుసుకోవలసిన అవసరం వుంది! తిరంగీ జండాను సైతం తిరగేసి ఎగరేసే తింగరయ్యల అసలు  రంగు బైటకు తేలినప్పుడే మూడు రంగుల జండా మునుపటంత సగర్వంగా ఎగరగలిగేది! 'సుహాసినీం సుమధుర భాషిణీం సుఖదాం వరదాం మాతరం ' అంటూ చెవులు రింగుమనే దాకా 'నీ అటలే ఆడుతాం .. నీ పాటలే పాడుతాం ! ' అంటూ జనగణాలు జిందాబాదులు కొట్టుకుంటూ జాతీయగీతాలు ఏవైనా సరే ఆలపించాలంటే   ముందు జనం కడుపు నిండవలసి ఉంది.   

భుక్తి కడుపు నిండా దొరికినప్పుడే  భక్తి .. దేహం మీద లాగే  దేశం మీద అయినా! '

తత్వ  తెలిసివచ్చి దేశమాత వచ్చిన దారి పట్టింది.

జనం మత్తు వదిలి మేల్కొనే మంచి పథకం వెదకడం ఇప్పుడు మొదలయింది దేశమాత మేధస్సులో!

చూద్దాం! ముందు ముందు దేశంలో  మంచి మార్పులు తొంగిచూడబోతున్నాయని ఆశిద్దాం!

- కర్లపాలెం హనుమంతరావు

04 - 04- 2021

Thursday, December 9, 2021

ధనమూలం ఇదం జగత్

 


కహానీలు : కర్లపాలెం హనుమంతరావు 

( రియల్ ఎస్టేట్స్ : కాలమ్ - మాసపత్రిక - ధన్ మూలమ్ ఇదం జగత్ ) 


పావలా శక్తి!


నేల మీద పడింది చెల్లని పావలా బిళ్లయినా సరే... వంగి తీసుకోకుండా ఉండలేరు. నడుము నొప్పి ఉన్నవాళ్లయినా సరే!


7


తెలుగు మార్క్ !


భూమిలోన పుట్టు భూసారమెల్లను

తనువులోన పుట్టు తత్వమెల్ల

శ్రమలోన పుట్టు సర్వంబు ధనమౌను

విశ్వదాభిరామ వినురవేమ !


అచ్చ తెనుగులో ఉన్న దీన్ని వివరించాల్సిన పనిలేదు. శ్రమలోన పుట్టు సర్వంబు ధనమౌను' అంటూ మారి కన్నా ఎంతో ముందుగా మన వేమన చెప్పటమే ఇక్కడ విశేషం.


'ఏడు(పు)


ఏదైనా లెక్కించేటప్పుడు గత తరంవాళ్లు ఒకటికి బదులు లాభం అంటూ మొదలు పెట్టేవాళ్లు. ఏడు అంకెకు బదులు ఆరున్నొక్కటి అనేవాళ్లు. ఏడు అంటే అశుభం ధ్వనిస్తుందని భావించేవారు మరి. లెక్కల్లోనయినా ధనలక్ష్మికి ఇష్టం లేని మాటలను ఉపయోగించటం మంచిది కాదని మన పెద్దవాళ్ల ఆలోచన. తథాస్తు దేవతలుంటారని భయం పాపం!


జోకాభిరామాయణం


ఉపాధ్యాయుడు : 

మన దేశంలోనే అప్పులు ఎందుకు ఎక్కువగా ఉన్నాయిరా? 


విద్యార్థి : తీసివేతలు నేర్పే రోజుల నుంచీ మాకు. చిన్న అంకెలో నుంచి పెద్ద అంకె పోకపోతే పక్క స్థానం నుంచి అప్పు తెచ్చుకోవటం నేర్పుతుంటారు గదా సార్! అందుకూ!

- కర్లపాలెం హనుమంతరావు 

03-11-2021 


( REAL ADVISER - DECEMBER 2011) 


Monday, February 8, 2021

కన్నయ్యకు విన్నపం - కర్లపాలెం హనుమంతరావు - (చోరకళావారసులు - ఈనాడు సంపాదకీయ పుట ప్రచురితం)

 



రారా కృష్ణయ్యా! రారా కృష్ణయ్యా! మా మొరలు  ఆలకించ రారా కృష్ణయ్యా! దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించుతావనే  కదా నిన్నంతా దుష్టదురిపాలకా.. శిష్టపరిపాలకా అని పిలిచేదీ.. కొలిచేదీ! బుడి బుడి అడుగులతో నువ్వలా కిలకిలలాడుతో నడిచి వచ్చినప్పుడల్లా 'మా చల్లనయ్య' వంటూ ప్రేమతో పదే పదే పొగిడేది! ఆ వల్లమాలిన ఆనందం ఇప్పుడు నీ భక్త జన సందోహంలో కంచు దివిటీ వేసినా కనిపించడం లేదు.  ఎందుకో  గమనించావా దీనజన బాంధవా?

మన్ను తిన్న నోటితో తినలేదని నువ్వు ఏ పరమార్థంతో  అమ్మ ముందు బొంకావో! భువన భాండాలని సైతం అవలీలగా  మింగేసే బకాసురులందరికీ ఇప్పుడు ఆ  బుకాయింపుల పర్వంలో నువ్వే ఆదర్శం! కిరాయి మనుషులను పెట్టి మరీ గోవర్థన గిరులను ఎత్తించేస్తున్న విఐపిలే విచారణల కమిటీల నుంచి స్వీయ రక్షణార్థం తులాభారంలో తులసీ దళానికి తూగిన నీ కన్నా ఎక్కువ అమాయకత్వం నటించేస్తుంటిరి కన్నయ్యా!. అస్మదీయులందరికీ పద్మనయనాలతో నయనానందకరంగా దర్శనమిచ్చే రాజకీయం సామాన్యుడినిప్పుడు  సహస్రాధిక క్రూర దంష్ట్రాల బలిమితో నమిలి  పిప్పిచేస్తున్నది బలరామ సోదరా!

మహాత్మా! నీవు లేకుండా మహాభారతమన్నా నడిచి ఉండునేమో కాని.. నీ వారసులమని చెప్పుకు ఊరేగే ఈ జోకరు నేతాగణ జోక్యం వినా చివరికి తిరుమల వెంకన్న దేవుడి దర్శన భాగ్యమైనా దొరికే అదృష్టం లేకుండా ఉన్నది!


దైవమంటే పెద్దలు ఎందరికో పన్ను కట్ట నవసరం లేని ఓ బడా ఖజానా! దేవాలయ అదాయాలు అనేక మందికి కడుపుకు నిండా తిన్నప్పటికీ తరగని వెన్నముద్దల వంటివి. నీ 'ధర్మ సంస్థాపనార్థాయ' థియరీ నీ  వారసులమని చెప్పుకు తిరిగే దొంగలు ఎందరికో 'ధనసంపాదనార్థాయ'గా మారిందయ్యా ముకుందా! 

నీ కాలపు రాజకీయం వర్ణం, వాసన, రుచి సంపూర్ణంగా మార్చేసుకున్నదిపుడు దేవకీ నందనా! 'గోపి' అంటే మెజారిటీకి నీవు కాదు నీరజాక్షా..  'గోడ మీద పిల్లి' మాత్రమే ముందు పటం కట్టు చిత్రం! కృపారసం పై జల్లెడివాడు పై నుంటే చాలు..   ముష్టి యములాడికని యేమిటిలే.. ఐటి,  ఇడి.. ల వంటి  యాంటీ ప్రజాహిత శాఖలెన్ని దాడిచేసినా  దడవనవసరమే లేదు కాలకేయులు తనుజ మర్దనా! చట్టసభల్లో బిల్లులు చెల్లిపోవడానికైనా, చట్టం ముందున్న కేసులు కుళ్ళిపోవడానికైనా కొత్త బాదరాయణ సంబంధాలు బోలెడు ఇప్పుడు పుట్టగొడుగులకు మించి పుట్టుకొస్తున్నాయి బదరీ నారాయణా! 

'భజగోవిందం.. '  అంటూ పదే పదే  పాడుకోడం మూఢమతం  నేడు.  సమయం బహు విలువైనది..  పాడుచేసుకునే 'మూడ్' లో లేడే ప్రజానాయకుడు.  భజనలూ, కీర్తనలూ, దండకాలూ, అష్టోత్తర నామావళులూ గట్రా ఎక్స్ట్రాలన్నీ బుల్లి బుల్లి దేవుళ్ల వరకు  మళ్లిపోయాయయ్యా యెపుడో యాదవేంద్రా! గురువాయూరుకు మించి పరమ పవిత్ర దేవాలయాలిప్పుడు హస్తినలో అమరావతిలో, భాగ్యనగరుల్లో వెలసి వర్థిల్లు రోజులు! జనార్దనా! పాదరక్షలు  బైట ఓ మూలన వినయంగా వదిలి పెట్టి మూలవిరాట్టుకో నమస్కారం కడు భయభక్తులతో కొట్టి, వీపు చూపనంత విధేయతతో వెనక్కి వెనక్కి నడిచొచ్చేస్తే చాలు.. గొప్ప వడుపు చూపినందుకు సదరు  భక్తశిఖామణులకే ముందుకు దూసుకెళ్లే  మొట్టమొదటి ఛాన్స్! 

ఆత్మకథల నిజాలనైనా తొక్కి పెట్టి తగలెట్టడమే నేటి పచ్చి పారదర్శకతకు  కచ్చితమైన నిర్వచనం. నార్కో 'అణా'లసిస్ పరీక్షల్లో కూడా నాలిక మడత  ప్డడ్న్పని మెళుకువ చూపడమే నేటి నేతకు ఉండదగ్గ మొదటి గొప్ప  లక్షణము.

సర్వ లోకాలను  ఏలే  సామర్థ్యం ఉన్నా ధర్మసంస్థాపన కోసమని   గుర్రాలను తోలే పనికి ఒప్పుకున్న వెర్రివి  నువ్వు! విదురుడంతటి ఘనుడు అరటిపండు ఒలిచి తొక్క చేతికిచ్చినా బెదరకుండా ఆరగించిన మాలోకానివీ నువ్వే! రాజసూయ యాగంలో ఎంగిలాకులు ఎత్తిన వినయ  సంపన్నుడివి. 'కుయ్యో మొర్రో' మన్నది ఓ ఆఫ్ట్రాల్  బోడి కరిరాజమయినప్పటికీ అప్పటికప్పుడు  సిరికైనా చెప్పనంత హడావుడిగా భువికి దిగివచ్చిన  ఆర్తత్రాణ పరాయణత్వం నీది! నిస్సహాయులను కాపాడే నీ ఆత్రం మరి నీ భక్తులమని చెప్పుకు ఊరేగే నేతలకు ఎన్నికలప్పుడు మాత్రమే గెలిపించే సూత్రం!   

గోవర్థన గిరిని ఎత్తడం కాదయ్యా గొప్ప ఇప్పుడు మాధవయ్యా! పెరుగుతున్న ధరవరలను మా కోసం కిందికి దింపి చూపించు! మానినీ మాన సంరక్షకుడివని  వనితల  మంగళ హారతులవీ అందుకొనుడు కాదు మగతనం! నిస్సందేహంగా నీలో ఇంకా ఆ ఇంతుల జాతి పై పిసరంత పక్షపాతం ఉందంటే.. ఏదీ! సందునో దుశ్సాసనుడు శాసిస్తున్నాడీ కలికాలంలో! ఆ కేసులకు బెదరకుండా ఆ కీచకుల  పీచమణచు!  ఒక్క పసిబిడ్డ పాలలోనే ఏం ఖర్మ పరంధామా! బక్క మనిషి తినే ప్రతి గడ్డి పరకలోనూ విషం కలిపే పూతనలే  ఎక్కువ లాభాలు గడిస్తున్నదిప్పుడు.  ఆ కల్తీ శాల్తీల   పనిపట్టగల చేవ చూపెట్టగలవా చూడామణీ? పంచ భూతాల పాలిటి పగటి భూతాలుగా మారి జగతి సర్వాన్ని సైడు కాలువ సరుకుగా చేసే కాళీయుల మాడు మీదెక్కి ముపటి మాదిరిగా మళ్లీ మా కోసం తాండవమాడి చూపించవయ్యా  తామస హర మనోహరా!  

నువ్వా ద్వాపరాన చంపింది ఏదో నీ ఒక్క మేనమామ కంసుడిని మాత్రమే కదా కన్నయ్యా! ఆ దుష్టుడి వారసులు ఈ కలియుగం ఇంకింత మంది! ప్రతి అడుగులో   అణగారిన వర్గాలను  ఇంకా  అణగదొక్కడమే వారి పని! వంద తప్పులు  వరకు సహించే ఓపిక పరమాత్ముడివి కనక నీ కుంది గాని ముకుందా! మానవ మాత్రులం మేమీ కుందులు ఇక ఏ మాత్రం  ఓర్వలేని దుస్థితికి చేరుకున్నాం! ఆత్మకు చావు లేదు. నిజమే! కానీఅది ధరించే దేహానికి ఆకలిదప్పులు తప్పవు కదా? ఎంత కట్టి విడిచే దేహమయితేనేమి! విడవక కట్టుకునేందుకైనా ఓ గోచీపాతకు నోచుకోనిది మా లేమి.   చిటికంత  చినుకు రాలినా చాలు.. ఊళ్లకు ఊళ్లు వరద గోదావరులు!  తమదంటే హాయిగా  వటపత్ర శాయి బతుకు. ఒక్క గోవులను ఉద్ధరించినంత మాత్రానే గొప్ప దేవుడి వయిపోతావా గోపాలా? ఆబాలగోపాలం లబలబలాడుతున్నదీ  భూగోళంలో! బక్క జీవులకు దిక్కైనా మొక్కైనా ఎప్పుడూ నువ్వొక్కడివే చక్రధారీ! జనం కష్టసుఖాలకు  చెక్ పెట్టు దారి ముందు చూడు మురారీ!  

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు - సంపాదకీయ పుట 01 -09 -2010 ప్రచురితం)


Saturday, February 6, 2021

తిట్టు!.. తిట్టించు! -సరదా వ్యాసం -కర్లపాలెం హనుమంతరావు

 


వాదన పూర్వపక్షం చేసే పాయింట్ ఓ పట్టాన దొరకనప్పుడు వాడుకొనే 'వాడి' గల ఆయుధం- కోపం. 'పేదవాడి కోపం పెదవికి చేటు' అన్న వేమన వెర్రికాలం కాదిప్పటిది. 'పేదవాడి కోపం పెద్దమనుషుల పదవికి చేటు' అన్నట్లుగా  సాగే  ప్రజస్వాముల వాదం.  లక్షన్ల పీడాకారం తగులుకున్నప్పుడల్లా తలనొప్పి ఓటర్లకు దేవతాపీఠాలు దక్కడానికీ   ఆగ్రహాయుధమే ప్రధాన కారణం.  

ఎన్నికలయిన తరువాత సాగే  గెలుపు బెట్టింగులంత గడబిడలుగా ఉండవు  ఓటర్ల బెట్టుసర్లు. రాజ్యాంగం అంటే ఏదో ఆ ఆధికరణ, ఈ సవరణలంటూ ఇండియన్ ఇంకుతో గిలికేసారు గాని ఎలక్షన్ల రంగంలో ఓటరు గొట్టంగాడు వీరంగానికి దిగితే  సాక్షాత్తూ  ఆ రాసిన పెద్దసార్లయినా సరే తట్టుకోడం కష్టం!

తిరుపతి వేంకటకవుల కృష్ణరాయబారం నాటకంలో శ్రీకృష్ణుడు ‘అలుగుటయే యెరుంగని మహామహితాత్ముడు/ అజాత శత్రుడే అలిగిన నాడు’ ఏవేవో సాగరములన్నీ ఏకమయిపోతాయని, నమ్ముకున్న కర్ణులు పదివేలమంది వచ్చినా చస్తార’ని బెదరగొట్టేస్తాడు. దుర్యోధనుడికి దూరాలోచన లేక  బాదర్ అవలేదు. కానీ ఇండియన్ నేతకు ఓటరు అజాతుశత్రుత్వం మీద ఆట్టే నమ్మకంలేదు.   తలనొప్పి తద్దినమంతా  ఎందుకులెమ్మనే నాయకులంతా ఎన్నికల తుమ్ములు వదిలే వరకూ ‘ఓటర్లే దేవుళ్లు’ అంటూ అష్టోత్తరాలు, సహస్రనామాలు  అందుకునేది! నిజానికి దేవుళ్లతో పోల్చడమంటే ఓటరు స్థాయిని ఓ మెట్టు కిందికి దిగలాగడవేఁ!

కాసుల పురుషోత్తమం అని ఓ కవి మహాశయుడు, పనిమాలా ఘంటసాల దాకా వెళ్లి  శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువును  పట్టుకుని దులిపేశాడు. 'నీ పెళ్లాం భూదేవి అన్ని బరువులూ మోస్తుంటే..  ఆ నిర్వాకం నీదే అన్నట్లుగా పెద్ద బిల్డప్పులా! కోరింది ఇచ్చేది నీ కోమలి ఇందిరమ్మో అయితే, నువ్వే ఏదో  కామితార్థుడివన్నట్లు వీర పోజులా! కష్టమైన సృష్టి కార్యం చూసేది నీ కొడుకు బ్రహ్మగారయితే ఇంటి పెద్దనంటూ కుంటి సాకుతో ఆ క్రెడిటంతా నువ్వే కొట్టేసుకుంటివి కదా! పొల్యూషన్ కంట్రోలు పనిలో పాపం గంగమ్మతల్లి తలకమునకలయి ఉంటే, పని సాయానికి పోని   నీకు ఎందుకయ్యా  పతితపావనుడుల్లాంటి   బిరుదులసలు? పెళ్లాంబిడ్డల మూలకంగా వచ్చే పేరే తప్పించి మొదట్నుంచి నువ్వు పరమ  దామోదరుడివవే(పనికిమాలినవాడివి) సుమా!’ అంటూంటే.. అది తిట్టో.. మెప్పో తెలీక  ఆ దేవుడు గుళ్లోని రాయికి మల్లే  గమ్మునుండిపోయాడు!

దేవుడికి భక్తుడొక్కడే దిక్కు. భక్తులకు ముక్కోటి దేవుళ్ల ఆప్షన్ ఉంది. ఏ ఒక్క దేవుడు ముక్కోపం తెప్పించినా మరో పక్కదేవుడి దిక్కు నుంచి భక్తుడికి ఠక్కున ఆఫరొచ్చే  జంపింగ్ జమానా ఇది మరి!

 ఆపదమొక్కులవాడి కోపతాపాలనంటే మొక్కులు, పొర్లుగింతల ట్రిక్కుల్తోనో  మటుమాయం చేసుకోవచ్చు.  ఓటరుకార్డు చేత బట్టిన డిప్పకాయలిప్పుడు మరీ పాతకాలం నాటి నాటురథాలను మాత్రమే నమ్ముకుని ఉత్సాహపడే ఉత్సవ విగ్రహాలు కాదిప్పుడు! డెమోక్రసీ ఎదగడం మాట ఎటు పోయినా.. ఓటు మిషను మీట నొక్కే మనిషి కసి మాత్రం వామనుడు సిగ్గుపడే సైజులో పెరిగిపోతున్నది. ఓటుకు ఓ పదినోటు ఇస్తానన్నా  పుచ్చుకునేందుకు  పది సార్లు పస్తాయించే చాదస్తం నుంచి హీనపక్షంగా పది, పదిహేనువేలన్నా చేత పెట్టందే పట్టరాని ఆగ్రహంతో ఊగిపోయే  పరిపక్వత సాధించింది. ముష్టి మున్సిపాలిటీ ఎలక్షన్లక్కూడా ఎస్టేట్లు అమ్ముకుని మరీ కుస్తీపట్లకు దిగే బస్తీనేతలే ఓటర్ని ఈ ‘స్టేటు’ దాకా ఎగదోసింది. మసిపూసి మారేడుకాయ చేసే మాయాజాలం మరి ఇంకెంతకాలమో గాని, కడుపు మండితే  ఓటరే ఉల్ఫాగా ఊరేగే నేతల ముఖాన కసి కొద్దీ బుడ్ల బుడ్ల సిరా పూసి సీన్లు ఖరాబు చేసే  రోజులు! వీధినేత కేజ్రీవాలే ఆఫీసు ఫోర్ వాల్సుకు బుద్ధిగా కట్టుబడ్డం ఓటరు సిరా బుడ్డి దెబ్బకు దడ పుట్ట బట్టే!  

పాలిటిక్స్ అంటేనే పది రకాల దరిద్రాలకు వంద వెరైటీల చిట్కాలు! షాహీన్ బాగ్ చూసాం కదా! అన్నదాతల ఆగ్రహమూ చూస్తున్నాంగా! పాపిష్టి అసంతృప్తుల ముఠాల్లోకి   చొప్పించే కోపిష్టి ముఠాను నేతలే ఇప్పుడు  స్వయంగా ఎందుకు తయారుచేసుకుంటున్నట్టు?  తిట్టి పోసిన వర్గాల మీదనే ఏ అయోథ్య రామయ్యను మించిన వరాల జల్లులు! చిల్లర పైసలు కొన్ని వదిలినా అల్లరీ ఆగం లేకుండా ఎన్నికల యాగం ఏకపక్షం చేసుకునే స్కీములు ఇట్లాంటివి లక్షా తొంభై ఇప్పుడు. ఇహ  బోడి మల్లయ్యల  తిట్లంటారా?  చెవుల్లో దూరకుండా  దూదుండల సదుపాయానికి సర్కారు అధికార దండం దక్కినాక ఖజానా అండ ఉండనే ఉంటుంది కదా!  అయినా, తిట్లక్కూడాట్లు తెగే సత్యకాలమా.. మన  పిచ్చిగానీ?

అన్ని జాతర్లలో ఉత్సవ విగ్రహాలు పూజలే అందుకుంటున్నాయా? కొన్ని సంబరాలల్లో  అంబలను భక్తులు అడ్డమైన తిట్లు తిట్టడం ఆచారం!  ఒద్దికతో లక్ష్మి  వున్నది చాలక.. భూదేవి కూడె నీ బుద్ధిశాలి!/ తన కూతురుటంచు ఎన్నక.. భారతిని కోరడే ఈ నీతికోవిదుడు!/అర్థాంగి యుండగ అవ్వ.. గంగను దాల్చె నీ నియమవరుడు!’ అంటూ చెడ  తిట్టిపోసినా  దేవుళ్ళకూ చీమ కుట్టినట్లైనా నొప్పుండటంలేదిప్పుడు !  కులం వంకన దూషించారనో, మతం మిషతో అవమానించారనో,   జాతి పేరుతో నోరుజారారనో,  లైంగిక దృష్టితో చూసి వేధించారనో మనిషెంత మధనపడ్డాఅ.. యుద్ధకాండ సిద్ధపడ్డా .. నో బడీ కేర్స్!  కోర్టు బోనుల్లో నిలబడాల్సినవాళ్ళే కోర్టు జోన్ల తరలింపు మీద ప్రకటనలిచ్చేస్తున్నారు! ఎక్కడైనా శాపనార్థాలు వినపడుతున్నాయా? ‘దండుకునే సమయం’ దండగ కాకూడదన్నదే ప్రజాభిప్రాయంగా కూడా  ఉంటున్నదిప్పుడు!

దూర దూరంగా తగలడితే తూలనాడుకొనేటంత పగే ఊండదు. ఒకే చూరు కింద పది పూటలు చేసిపోయే పిచ్చి కాపురాలల్లోనే సవతుల మధ్యన సవాలక్ష ముటముటలు, ముక్కు తిప్పుళ్లు! నూట ముప్పై కోట్ల మందిమి మనం. జానా బెత్తెడు భరత భూమి. మూడు వేల చిల్లర పార్టీలు. ఎవరికీ పెత్తనం ఎకసెక్కం కాదు. మరి మాటా మాటా రాదా? ఏ మాటా మోటుగా రావద్దంటే ఎట్లా?  రామాంజనేయయుద్ధంలో  రాముడికి..  ఆంజనేయుడికి మధ్యనే గలాటా జరిగి మాటలు రువ్వుకుంటే.. వింటూ ఎంజాయ్ చేసిన మనం  ఈ నేలబారు నేతల కారుకూతలు  ఏమంత ఎబ్బెట్టనిపిస్తాయనీ.. నీతిమంతుల పిచ్చి గానీ!   

ఉపకారంబు చేసినాడ కదా.. ఎన్నో రీతులన్.. నాకే నే/డపకారంబు ఘటంపజూచుటలు మేలా నీకు పార్థా! మహా/విపదబ్ధిన్ వడిదాటి నౌకన్ వెసన్ విధ్యంసమున్ జేయు నీ/ కపటాచార కృతఘ్న వర్తనల లోకంబెందు హర్షించునే?’ అంటూ గయుణ్ని శిక్షించే విషయంలో జోక్యం వద్దని గట్టిగా  కృష్ణుడు మందలిస్తే.. బామ్మరిది కదా అర్జునుడేమన్నా గమ్మునూరుకున్నాడా? 'ఆపదలు మేమె తరయించు అదనుజూచి/ ఉట్టిపడెదవు మమ్మెల్ల ఉద్ధరించు/ఘనుడవని కీర్తి కనెదవు గాని కృష్ణ!/ నీవు లేకున్న మేము రాణింపలేమె?' అంటూ మాటకు మాట ఎదురు పెట్టాడా.. లేదా? బాణప్పుల్లలు వదిలే ముందు పుల్లవిరుపు మాటలు, ఈటెలు గట్రా విసురుకోడానికి ముందు ఈటెపోటుల్లాంటి దెప్పుళ్లు తప్పవని అందరికీ తెలుసు! క్లైమాక్సులో కూడా మాత్ర్రం తిట్టు వాసన తగలద్దంటే ఎంత ఎన్టీఆర్, ఎస్వీఆర్ పాండవవనవాసమైనా ఐమాక్సులో ఫ్రీ-షో వేసినా చూసే నాథుడుండడు! బొక్క.. భోషాణం అంటూ జుత్తెగరేసుకుంటూ తిరిగే నటులూ పొలిటికల్ ఎంట్రీలు ఇచ్చేస్తున్నారిప్పుడు. పోటీగా  నలుగుర్నీ కూడేసుకోడానికి నాయకుడూ  నాలుకకు మరికాస్త పదును నూరుకుంటే తప్పా? తొక్కలో భాషంటూ తిట్టే నేతలెవర్నీ జనం సైతం తొక్కేసే మూడులో లేరిప్పుడు.  ఈ దుస్థితికి ఎవర్నని తిట్టుకోడం?!

 తిట్టే వాడి మీద వెగటు పుట్టటం మాట అటుంచి..తిట్టించుకొనేవాడి మానసిక పరిస్థితి మీద  వెకిలిగా తయారైన నకిలీ వీడియోలు విపరీతంగా వైరలవుతున్నాయిప్పుడు!  వినే ఓటారే తిట్లు  వీనులకు విందనుకునే దశకు వచ్చేశాడు జుట్టూ జుట్టూ పట్టుకునే సీన్లుంటేనే చట్టసభలు సజావుగా సాగినట్లు లెక్క! సమయానికి   సభా ప్రసారాలు సడెన్ గా కట్ అయిపోతే సరదా కోసమా   జనం చిందులేసేదీ?! కారుకూతల వినోదవల్లరి కారుచవుకగా వినే ఛాన్స్ మిస్సవుతుందని కదా కామన్ పబ్లిక్ బాధ!

కమాన్! బాపూజీ చెప్పాడు గదా అని బుద్ధిగా ప్రజాసేవ మాత్రమే చేసుకుని పరమపదిస్తే నరకంలో కూడా ఎవరూ కనీసం మడతమంచాలవీ వేసి హాయిగా బజ్జోమనరు. దిష్టిబొమ్మల వ్యాపారాన్ని తగలేసిన పాపానికి, పాత చెప్పుల గిరాకీపై దెబ్బ కొట్టిన నేరానికి  ముళ్ళ డొంకల మీద పడేసి పడపడా ఈడుస్తారు! నొప్పెట్టి ఏడిస్తే కర్రు కాల్చిన దండంతో మరో రెండు వాతలు అదనంగా  వడ్డిస్తారేమో కూడా.

అయినా బూతుపురాణాలన్నీ ఒక్క  నేతల నోళ్ల నుంచే పొంగొకొచ్చేస్తున్నట్లు ఎందుకా తింగరి కూతలు? కట్టుకున్నోడు మందు కొట్టొచ్చినప్పుడు  తిట్టకపోతే మహా వెలితి  బోలెడంత మంది నెలతలకు. పెళ్లాలు  తిడతారో లేదో.. నిజంగా బైటికి తెలిసే అవకాశం లేని కాపురాలల్లో ఆ వంకన సానుభూతి కోసం వెంపర్లాడే మగమహారాజులు.. ఇదిగో.. ఈ.. తల్లో వెంట్ర్రుకలంత మంది! తిట్టుకు వందిస్తామనండి!  తిరుపతి గుడి క్యూలకు మించి ఎగబడే ఏబ్రాసీ మందలు ఎన్ని కోట్లమందుంటారో  లెక్కతేలుతుంది! పాచిపోయిన లడ్డూలు మాత్రమే ప్రసాదంగా పెట్టించే  పై దేవుళ్ల మీద పెదవి విప్పకుండా    సాటి వాళ్లమనేగా మా మీదిన్ని సూటిపోటీ మాటలు?’ అని వాపోయే నేతలూ తక్కువేం లేరు మరి!

భరతుడు దక్షాధ్వరధ్వంసాన్ని అభినయించే వేళ పశ్చిమం నుంచి బ్రహ్మముఖతః రౌద్రరసం ఉత్పన్నమయిందని శారదాతనయుడి 'భావప్రకాశం' వాదం. పోతనగారి ఆ ఆరభటీవృత్తి దక్షాధ్వర ఘట్ట ధ్వంస రచనకు మించి ఉందా ఏంటి మరీ విడ్డూరం కాకపోతే   కొత్త నేతల  హింస నచణ?  ఉత్తి పుణ్యానికే వేలెత్తి చూపటానికేనా పాపం ఓటుకు అన్నేసి వేలు దోసెట్లో పోసీ ఉపరి.. ఎన్నికల్లో ఓటరుగాడిని మనసులో అడ్డగాడిదనుకుంటున్నా  ‘గాడ్..గాడ్” అంటూ కాళ్లట్టుకు వసుదేవుళ్లకు మించి  నేతలు వేళ్లాడేదీ?

భాగవతం వేనరాజును విశ్వనాథ  శతవిధాలా ఖూనీ చేసాడు. కవిరాజు 'ఖూనీ' రాసి అదేరాజుకు మళ్లీ జీవం పోసాడు. ఎవళ్ల అవసరాలు వాళ్లవి. అవసరాలని బట్టి బట్టీలల్లో తిట్ల తయారీ! 'కఫాదిరోగముల్/దనువున నంటి మేని బిగి దప్పకమున్నె నరుండు మోక్ష సా/ధనమొనరింపగా వలయు'అంటూ సూక్తులు వల్లించేడు కదా  దాశరథీ భక్తుడు  కంచెర్ల గోపన్న! కోపమేమైనా ఇసుమంతైనా మరి పాపభీతి కలిగించిందా చెరసాలలో పడినప్పుడు ఆ రామదాసు మనసుకు? 'కలికితురాయి నీకు పొలుపుగ జేయిస్తి రామచంద్రా/నీవు కులుకుచు దిరిగెద వెవరబ్బసొమ్మని రామచంద్రా!' అంటూ  దాశరథి మీదనే నేరుగా దెబ్బలాటకు ఎందుకు దిగినట్లో?  

 

'మాలిన్యం మనసులో ఉన్నా/ మల్లెపూవులా నవ్వగలగడం ఈ నాటి తెలివి' న్నాడు .. 'కొత్త సిలబస్' అనే కవితలో బాలగంగాధర్ తిలక్.  వింటానికి బానే ఉంటాయ్ కవిత్వాలెప్పుడూ! కానీ  'కొత్త సిలబస్' ఈ కొత్త సెంచరీలో పాతబడిపోయింది.. ఇంకా పాతరేయద్దంటే ప్రగతి ఎట్లా?
బూతు ఉందని దేవుడికి సుప్రభాతమూ వద్దనగలమా? అని మనగలవమా? ఆగ్రహం చుట్టూతానే భూగ్రహమంతా బొంగరంలా గింగుర్లు కొట్టేదిప్పుడు. ఆ గ్రహింపు లేకుండా ‘నిగ్రహం.. నిగ్రహం’ అంటేనే శనిగ్రహం  నిగ్రహం కోల్పోయేది!  స్వగృహం పడగ్గదిలోనయినా సరే చాటుగా ఓ నాలుగు మోటు మాటలు బై హార్ట్ చేసుకునే  బైటికి రావటం బుద్ధిమంతులకు  చాలా బెటర్  ఇప్పుడు! చక్రం తిప్పడమనే చాతుర్యం ఒక్క దాని  మీదే కసి పెంచుకుంటే చాలదీ అధికార కుతి కాలంలో! వక్రమార్గంలో అయినా సరే దానిని సంధించేందుకు ఒక్క క్షణం వెనుకంజ పడకూడదు. పచ్చిబూతులు నోటికి నిండుగా పుక్కిటపట్టక పోతే పుక్కిట పురాణాలలో కూడా చోటు దక్కే పరిస్థితి లేదు ఏ స్థాయి నేతకైనా!.

 ప్రార్థనా పద్యం ఏడో స్థానంలో  ఏదో ''కారం ఏడవబట్టే నన్నయ్యగారి మహాభారతం అరణ్యపర్వంలోనే అర్థాంతరంగా గండిపడిందంటారు.  నన్నెచోడుడూ కుమారసంభవం ఆరంభంలో  స్రగ్ధర గణాల మీద అశ్రద్ధ చూపించ బట్టే  యుద్ధంలో దారుణంగా దెబ్బతిన్నాడని మరో టాక్! తిట్టు వల్ల త్రాష్టుడి ఉట్టీ పుటిక్కన తెగినట్లు లెక్కలు నిక్కచ్చిగా తేలకపోవచ్చు కానీ, తిట్టే తిట్టు  స్పష్టంగా లేకుంటే మాత్రంకుంటి కూత కూసిన వాడికే ముందు గంటె కాల్చినట్లు వాత పడేదీ కాలంలో. నీతుల నెలాగైనా వెనక్కు తీసుకోవచ్చు గానీ, బూతు కూతలకా వెసులుబాటు లేదీ కాలంలో. పెదవి దాటితే పృథివి దాటినట్లే! ఆ హెచ్చరిక గుర్తున్న ఉత్తర కుమారుడెప్పుడూ  ఉత్తుత్తి బీరాల జోలికి పోడు!  ‘బాస్టార్డ్’ లాంటి పాడు కూతల్లో ‘మాస్టర్స్’ చేస్తే తప్ప సింగిల్ సీటున్న ప్రజాసేనలో అయినా టిక్కెట్ దక్కే అవకాశం నిల్!  

అన్నది అన్నట్లు అరక్షణంలో ప్రపంచం చుట్టొచ్చేసే జెట్ యుగం రోజుల్లో జాతి పిత  బాపూజీ మూడు కోతుల నీతిబోధనలు నమ్ముక్కూర్చుంటే  మాజీ ప్రధాని మన్మోహన్ జీ కెరీరుకు మల్లే చాప్టర్ పూర్తిగా పర్మినెంటుగా క్లోజ్! బూత్ పాలిటిక్స్ లో బూతు వద్దనుకోడం.. రామాయణంలో రామా అనే శబ్దం నిషిద్ధమనుకోడమంత అసంబద్ధం.

అనకా తప్పదు.. అనిపించుకోకా తప్పదు.

ఇంత మొత్తుకున్నా ‘తిట్టి తిట్టించుకోవడమా? తిట్టించుకుని తిట్టిపోయడమా? అని  సందిగ్ధమా? ఛఁ! కొంత మందిని ఎన్ని తిట్టీ  నో యూజ్! ఇంకా తిడుతూ కూర్చున్నా  టైం వేస్ట్!

-కర్లపాలెం హనుమంతరావు

06 -02 -2021

బోథెల్, యూఎస్ఎ

(సూర్యదినపత్రిక - ఆదివారం - వ్యంగం)

 

 

                           

Saturday, September 19, 2020

అంతరాత్మే అసలు శత్రువు.. ! - కర్లపాలెం హనుమంతరావు -పెన్ పవర్ దినపత్రిక ఆదివారం ప్రచురితం

 


'ఏం చేస్తున్నావు?' - అడిగింది అంతరాత్మ.

పెన్‌ పవర్  పత్రిక ప్రకాశం ఎడిషన్ కోసం వ్యాసం రాసే పనిలో ఉన్నాను. ఏ అంశం మీద రాద్దామా అని ఆలోచిసున్నా. తెగడంలేదు'

'ఈ మధ్య నీ రాతల్లో కాస్త సీరియస్ నెస్ ఎక్కువయింది. బ్రేకింగ్ గా ఉంటుంది .. ఏదైనా, లైటర్ వీన్ ట్రై  చెయ్యరాదూ ?' అని గొణిగింది అంతరాత్మ.

'ఆ సణుగుళ్లెందుకు. మనసులో ఉన్న మధనేదో బైటికే అనవచ్చుగా!'

చిరాకు పడ్డా. 

ఫక్కుమని నవ్వి అంది అంతరాత్మ 'బాబూ! నేను నీ అంతరాత్మను. అంతరాత్మలక్కూడా మనసులుంటాయా? అక్కడికి మీ మనుషులు అవి చెప్పే మాటలే వింటున్నట్లు.. మహా! నేను జంతువులాంటి దాన్ని. నాకూ వాటికి మల్లే మనసులూ పాడూ ఉండవు.. ముందా సంగతి తెలుసుకోవయ్యా మహానుభావా! రచయితవి ఉండి నీకే తెలీకపోతే ఇహ పాఠకులకు నువ్వేంటి కొత్తగా చెప్పుకొచ్చేది?' 

నవ్వొచ్చింది నాకు.. నా అంతరాత్మ పెట్టే నస చెవినపడగానే. 'మా పాతకాలం తెలుగు సినిమాలలో అంతరాత్మలు శుభ్రంగా ఏ టినోపాలుతో ఉతికిన  ఇట్లాగే ఏ తెల్ల వస్త్రాలో ధరించి అద్దంలో నుంచో, స్తంభంలో నుంచో అడగా పెట్టకుండా వద్దనకుండా ఊరికే తెగ నసపెడుతుండేవి. చాలా సమయాలల్లో ఒకటి కాదు, రెండు  కూడా చెరో పక్కనా చేరి చెండుకు తినడం అదో సరదా వాటికి. పాత్ర  ఎస్వీ రంగారావు సైయిల్లో చేతిలో ఉన్న మందు సీసా విసిరి గొట్టినా అద్దం ముక్కలయి చచ్చేదే కాని అద్దాని నస అన్ని గాజు ముక్కల్నుంచి వెయ్యింతలుగా మారుమోగేది. మళ్లీ ఏ కమలాకర కామేశ్వర్రావు సారో కల్పించుకుంటే తప్ప ఆ అంతరాత్మల ఘోష అంతమయ్యేదే కాదు. కొంపదీసి నువ్వూ ఇప్పుడు ఆ తరహా ప్రోగ్రామేమన్నాపెట్టుకుని రాలేదు కదా! కరోనా రోజులు .. ఎటూ బైటికి పోయే ఛాన్సు నాకుండదీని  గాని పసిగట్టావా ఏందీ!'

'ఆపవయ్యా సామీ ఆ పైత్యకారీ కూతలు. నువ్వేమీ ఎస్వే ఆర్వీ, ఎంటీఆర్వీ కాదులే! వట్టి ఓ మామూలు కెహెచ్చార్ గాడివి . గంతకు తగ్గ బొంత సైజులో నీ స్టేటస్సుకు తగ్గ  మోతాదులోనే నా ఆర్భాటం ఉంటుంది, అసలు  చెప్పాల్సిన మాట డైవర్టయి పోయింది నీ  డర్టీ డైలాగుల డప్పు చప్పుళ్ల మధ్య. మరోలా అనుకోక పోతే ఒక సలహా బాబూ! ఈ కరోనా రాతలు కాస్సేపు పక్కన పెట్టు. పాలిటిక్సు పోట్లు పద్దాకా ఏం పొడుస్తావులే కాని,, ఇంచక్కా ఈ లోకంలో నీకులాగే సమ హోదాతో జీవించే జంతుజాలం గురించి ఏమన్నా ఓ నాలుగు ముక్కలు గిలికిపారెయ్ రాదూ ఈ దఫాకు! సరదాగా అందరు చదువుకుంటారు!'

'జంతువుల గురించా? రాయడానికేమంత ఇంపార్టెంట్ మేటరుంటుందని మహానుభావా  కొత్తగా మన పాఠకులు చదివి ఎంజాయ్ చేసేందుకు?  జిత్తులు, నత్త నడక, సాలెగూడు, కాకి గోల, కోడి నిద్ర, కుక్క బుద్ధి, క్రూర మృగం, హంస నడక, మొసలి కన్నీరు, కోతి చేష్టలు, పిల్లి మొగ్గలు, పాము పగ, ఉడుం పట్టు, గాడిద చాకిరీ గట్రా జంతు సంబధమైన సజ్జెక్టులన్నీ నీ లాంటి అంతరాత్మలు నసలు పెట్టించి మరీ గిలికించేసాయి కదా! ఇహ నాకు కొత్తగా రాసేందుకు ఏం మిగిల్చారు గనక ‘

 

'ఆపవయ్యా రైటర్ ఆ అపవాదులు! అక్కడికి భాషలు, భావాలు మనుషులకే పరిమితయినట్లు ఏమిటా కోతలు! మీ మనుషులున్నారే చూడు .. వాళ్లే  అసలైన జంతువులు. ఏ సాధుశీలి లోపల ఏ మేకవన్నె పులి నిద్రోతుందో, ఏ అరి వీర భీకర మహా విజేత గుండెల్లో 'ఉస్సో ‘  అంటేనే  ఉలిక్కి పడి చచ్చే పిల్లుంటుందో.. అంతరాత్మలకు మాకానువ్వు  కొత్తగా సినిమా కతలు చెప్పి నమ్మించేదీ! ఆ  రొటీన్ టాపిక్కుల గోల మళ్లా ఇప్పుడెందు గ్గానీ, ఊపు కోసం నేనీ మధ్య  వాట్సప్ లో చదివిన వెరైటీ జంతువుల కహానీ ఒకటి చెబుతా.. ముందు విను! ఆనక నీకు యానిమల్స్ జాతి మీదుండే యనిమిటీ, గినిమిటీ మొత్తం వదిలిపోవాలి.’ 

  జంతువులు అసలేవీ  ఆలోచనల్లాంటి సృజనాత్మకమైన పనులు చేయలేవని కదూ  మీ మనుషుల బడాయి ఊహలు!  ఆహారం,  నిద్రా మైథునాల్లాంటి సహజాతాలకు మాత్రమే మొగ్గుచూపే బుద్ధి వాటిదని కదూ మీ మేధావుల వెధవాలోచనలు!  జంతుజాలం భాష నువ్వు డీ-కోడ్ చెయ్యలేవు. కనక కాకి కూతల వెనకుండే రంపపు కోత నీ బుర్రకెక్కదు.  వాటికి అసలు మాట్లాడటమే రాదనుకుంటే .. అది నీ మూఢత్వంరా బేటా!  వాటి మాటల సారం నీకు అర్థమయితేనా! మనిషిగా పుట్టించినందుకు నువ్వా బ్రహ్మయ్య మీదనే నేరుగా దాడికి దిగిపోతావు!’

ఈ సారి ఏ  హిమాలమాల సైడుకో టూరుకని వెళ్ళి నప్పుడు హరిద్వారం , ఋషీకేశం కూడా టచ్ చేసి చూడు! టీ నీళ్ల కోసం నిన్ను వేధించాడని విసుక్కోడమొక్కటే నీకు తెలుసు గాని,   రక రకాల పక్షి కూతలకు, జంతు భాషలకు ఆ గడ్డం బుచోళ్లే అచ్చుపడని పదనిఘంటువులని నీకు తెలియదు.  పక్షులూ, జంతువులతో మాట్లాడ గలగడం వాస్తవానికి ఓ గడసరి విద్య.  మేక కనపడితే గట్టిగా పట్టుకుని మన ఏప్రియల్ మాసం తరువాత వచ్చే నెల పేరేంటో చెప్పమని అడుగు!

'మే' అనకపోతే వాడి పారేసిన నీ చెప్పుల జోడు తెచ్చి  నా మెడకు వేలాడ కట్టు!’ 

'అంతరాత్మలకు మెడలు ఎక్కడేడ్చాయన్న డౌటొచ్చే లోపలే 

'సర్కార్ల పథకాలేవన్నా ప్రజలకు మేలు చేసేవే నంటావా ?' అని కాకి మూకల నడిగి చూడు!  'కావు.. కావు' మనకుండా నోరు మూసుకు నుండిపోదు .. గ్యారంటీ ‘ అంయీ    సోది కహానీలు మొదలుపెట్టేసిందీ వెధవ సూక్ష్మగ్రాహి  అంతరాత్మ! 

గలగల, వలవల, గడగడల్లాంటి  జంటపదాలు మన తెలుగురచయితలకు మల్లే చెత్తచెత్తగా వాడే శక్తి  పద్దస్తమానం 'కిచకిచ'లాడే  పిచ్చుకమ్మకుందని దాని   కోతలు! 'భ' అనే హల్లుకి ఔత్వం ఇస్తే ఏమవుతుందో బోలెడంత డబ్బుపోసి కార్పొరేట్ బళ్లో చదివే మీ బదుద్ధాయికి తెలీకపోవచ్చునేమో కానీ.. ఏ వీధి కుక్క వీపు మీద ఓ రాయి బెడ్డ వేసినా  'బౌ.. బౌ' అవుతుందని బోలెడన్ని సార్లు చెప్పేస్తుందిట!  కప్పల్ని మింగడం తప్ప ఇంకేమీ తెలిదనుకునే పన్నగాలకు అమెరికా అధ్యక్షుల్లో  'బుష్' నామధేయులు ఒకడు కాదు.. ఇద్దరున్నారన్న ఇంగితం బుసలు కొట్టి మరీ బైటపెడుతుందని ఈ అంతరాత్మ ప్రబోధం!  పార్వతీదేవికున్న పర్యాయపదాలల్లో 'అంబ' ఒకటని ఆవు తెలుసును. ఆ జ్ఞానం మనిషి జన్మ మహోదాత్తమైనదని  అనుక్షణం ఉబ్బెత్తు ఛాతీలు తిప్పుకుంటూ తిరిగే మీ మనుషులకే ముందు తెలియాల్సి వుంది. ఏనుగుకి ఆంగ్లంలో నెయ్యిని ఏమంటారో ఏ  క్రాష్ కోర్సులో చేరకముందే ఈజీగా తెలిసిపోయింది.  చెప్పుకుంటు పోతే ఈ జంతు విజ్ఞానానికి ఆదీ.. అంతూ దొరకదు. కానీ ఆఖరుగా ఈ ఒక్క ముక్క చెప్పి ముగించకపొతే  పశుపక్ష్య జాతులకు పూర్తి న్యాయం జరిపించినట్లు కాదు. నెమలీ ! నెమలీ ! ఈ మనిషిని గురించి జంతుజాలం ఏమనుకుంటున్నదో ఒక్క ముక్కలో చెప్పి ముగించమంటే 

'క్రాక్' అంటూ ఇంచక్కా తోకూపుకుంటూ నిలబడుతుంది.' అని ముక్తాయించేసింది నా అంతరాత్మ. 

నెమలిని అడ్డమేసుకుని తన మనసులోని ముక్కని అంతరాత్మ అట్లా బైటకు నెట్టేసిందన్న గుట్టు అర్థమముతూనే  ఉంది.

మనిషికి  తొలి శత్రువు ఎక్కడో లేడు. మన  మనసులోనే ఓ మూల నక్కి  ఉండి   మనతోనే ప్రతిక్షణం దొంగ  తిళ్లు తింటూ మనం కాక్స్ లా వ్యవహరిస్తున్నప్పుడు మాత్రం  గమ్మునుండి పోతున్నాడు. దెబ్బతిని కిందపడితే మాత్రం ఇట్లా బైటికొచ్చి కుక్క మీదా నెమలి మీదా పెట్టి దెప్పుతుంటాడు. ఈ అంతరాత్మ కన్నా  ఏ శత్రువు మాత్రం మనిషికి చేసే చెరుపేముందిక? 

నిజమైన మిత్రుడే అయిఉంటే తప్పు చెయ్యక ముందే నచ్చ చెప్పి తిప్పలు తప్పించాలి కదా అంతరాత్మ! అందుకే పాలిటిక్సులో పైకి రావాలనుకునే మొండి నేతలు గుండెల్లోనే ఉండి పద్దస్తమానం ఘోష పెడుతుండే ఈ వెధవ అంతరాత్మలను అప్పోజిషన్ పార్టీ శాల్తీల కన్నా హీనంగా  లెక్క గట్టి పురుగుల్లా చీదరించుకునేది*

- కర్లపాలెం హనుమంతరావు 

( పెన్ పవర్ దినపత్రిక ప్రకాశం ఆదివారం  సంచికలో ప్రచురణ ) 

Saturday, September 5, 2020

స్వామి భక్త కాంగ్రెస్ -కర్లపాలెం హనుమంతరావు - సూర్య దినపత్రిక నా రాజకీయ విశ్లేషణ



కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు కాదు; భారతీయ జనతా పార్టీ కాదు; కనీసం హిందూ మహాసభ అయినా కాదు. ఈ తరహా రాజకీయ పక్షాలకు కొన్ని ప్రత్యేకమైన సిద్ధాంతాలు కద్దు. దేశాన్ని తమ భావజాలానికి అనుకూలంగా మలుచుకునే కొన్ని స్థిరమైన ప్రణాళికలు ఉంటాయి. పాలనా పగ్గాలు చేతికందితే ఏ తరహా సంక్షేమపాలనతో ముందుకు సాగాలో, ప్రతిపక్ష హోదాకు పరిమితమైతే ప్రజాపక్షంగా ఏ ఎత్తుగడలతో ప్రభుత్వాలని ఎండగట్టాలో.. అన్ని రకాల సమస్యలు చర్చించుకునేందుకు బ్లాక్ అండ్ వైట్ రూపంలో డ్రాఫ్టింగుల నిత్యం సిద్ధమవుతుంటాయి. పార్టీలలోకి సభ్యులను తీసుకునే ముందు అయా వ్యక్తుల ఆలోచనాధార, నడవడిక, గతచరిత్ర తాలూకు వివరాలు గట్రా గట్రా తమ తమ పార్టీల భావజాలానికి అనుకూలమైన పంథాలో ఉన్నాయో లేదో తైపార పట్టిచూడడం తప్పనిసరి అభ్యాసంగా ఉంటుంది క్రమశిక్షణకు గట్టి ప్రాముఖ్యతనిచ్చే పార్టీలకు. (నరేంద్ర మోదీ చేతికి చిక్కే దాకా భాజపా కార్యాచరణ సైతం చక్కని క్రమశిక్షణ కలిగి ఉండేదే). ప్రతీ రాజకీయపక్షానికి కచ్చితంగా నడుచుకొనే నియమ నిబంధనల చట్రం ఉన్న విధంగానే భారతీయ కాంగ్రెస్ పార్టీకీ విధి విధానాలు, నియమ నిబంధనలు లేకపోలేదు. కానీ అవి కాగితాలకు మాత్రమే పరిమితం అన్న భావన సర్వే సర్వత్రా అనాదిగా ఉంది. ఆచరణకు, అమలుకు మధ్య ఆమడదూరం ఉండడటమే ఈ దేశాన్ని ఎన్నో దశాబ్దాల పాటు ఏదో ఒక రూపంలో అవిచ్ఛన్నంగా పరిపాలించిన జాతీయ కాంగ్రెస్ పార్టీ విలక్షణత.
దేశానికి స్వాతంత్ర్యం రాక ముందు నుంచే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆచరణీయ సూత్రం ఏకవ్యక్తి పాలన కింద చిత్తశుద్ధితో పనిచేయడం! అధినేత వ్యక్తిగత ఇష్టాఇష్టాలను అనుసరించి పార్టీ కార్యకలాపాలు కొనసాగడం, అందుకు అనువుగా సభ్యులు అత్యంత సులువుగా స్వీయాభిప్రాయాలను సైతం మార్చేసుకొనేందుకు కించిత్తైనా జంకకపోవడం కాంగ్రెస్ గంగలో మునిగి తేలే ప్రతీ భక్త శిఖామణీ నరనరానికి వంటబట్టించుకునే విశిష్ట లక్షణం. ఒక్క ముక్కలో చెప్పాలంటే కాంగెస్ పార్టీ ప్రధాన లక్షణం జర్మన్ పరిభాషలో నాయకుడి నియంతృత్వానికి ప్రతీకగా వాడే ఫ్యూరర్ ప్రిన్జిప్(Führerprinzip). అధినేత నోటిమాటే అన్ని నియమనిబంధనలను కొట్టవతల పారేసే ఆఖరి వేదవాక్కని ఈ పదానికి అర్థం. ’77- '79 ల మధ్య కాలంలో ఈ తరహా ఫ్యూరర్ ప్రిన్జిప్ అత్యున్నత దశను మనం కాంగ్రెస్ పార్టీలో స్పష్టంగా చూడవచ్చు.
1977 ఎన్నికలలో ఇందిరా గాంధీ ఘోరమైన ఓటమిని చవిచూసారు. పార్టీలోని పెద్దకాపులందరూ అందరూ ఆమె పని ఇక అయిపోయినట్లుగానే భ్రమపడ్డారు. ఇందిరమ్మకు సైతం కొంత కాలం కాంగ్రెస్(కె)..['కె' అక్షరం కాసు బ్రహ్మానందరెడ్డికి సంకేతం] ఛత్రం కిందనే స్తబ్దుగా ఉండపోవలసి దుస్థితి. సమయం బిగువును కొంత సడలనిచ్చి క్రమంగా ఇందిర పార్టీ పగ్గాలకై మళ్లీ పట్టుబట్టడం ప్రారంభించింది. కాసువారి తరహాలో ఖద్దరు అంగీ, గాంధీ టోపీలతో కనిపించే సీనియర్లు చాలామంది ఆరంభంలో ఆమె కోరికను ఆట్టే పట్టించుకోని మాట నిజమే. ‘77 డిసెంబర్ 31.. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశాలు జరుగుతున్న సందర్భం. సరిగ్గా ఆ ముహూర్తానికి ముందు అర్థ రాత్రి ఆమె సభాప్రాంగణం నుంచి హఠాత్తుగా నిష్కమించింది. వెళ్లే ముందు కలవదలచినవారికి తాను ‘గ్లాస్ హౌస్’ పాయింట్ వద్ద లభ్యమవుతానని ప్రకటించడం విశేషం. ‘గ్లాస్ హౌస్’ అప్పట్లో బెంగుళూరు మొత్తంలో ముఖ్యమైన ఫోకల్ పాయింట్లలో ఒకటి! కొద్ది సేపటికే యూ.పి కి చెందిన కమలాపతి త్రిపాఠి, వెస్ట్ బెంగాల్ ప్రముఖ నేత సుబ్రతోముఖర్జీ, మరొక ఇద్దరు ముఖ్యమైన సీనియర్ నేతలు వెళ్లి ‘మేడమ్ గాంధీ’ జట్టులో చేరిపోయారు. ఇందిరమ్మ నేతృత్వంలో వెంటనే కాంగ్రెస్ (ఐ) ఉనికిలోకి వచ్చినట్లు ప్రకటన జారీ అయింది. ఆనాటి రాజకీయ గందరగోళ వాతావరణంలో మళ్లీ చురుకుగా ముందుకు చొచ్చుకు వచ్చేందుకు ఇందిరాకాంగ్రెస్ కు ఆట్టే సమయం కూడా పట్టింది కాదు. 1980 ఎన్నికలకు చాలా ముందుగానే చాలామంది సీనియర్లు తిరిగి ఇందిరా గూటికి వచ్చేశారు. కాంగ్రెస్ (కె) అంతర్ధానమయి, దాని స్థానంలో కొత్తగా కాంగ్రెస్ (ఎస్) [ఎస్‌-సోషలిష్ట్ కు సంకేతం] పుట్టుకొచ్చినా దాని ప్రభావం నాస్తి. ఇంత తతంగం చూసింది కాబట్టే అప్పట్లో మాధ్యమాలు సైతం కాంగ్రెస్ పార్టీని 'నేతలున్న చోట ఉండే పార్టీలా కాకుండా, అధినేత కూర్చున్న చోట పడివుండే పార్టీగా' అభివర్ణించింది. అవే పరిస్థితులు ఈనాటికీ నెలకొనివున్నాయన్న మాట ప్రత్యక్షంగా కనిపిస్తున్న సత్యమే కదా! 1974 లో ఇందిరాకాంగ్రెస్ అధ్యక్షుడు దేవకాంత్ బారువా 'ఇందిరే ఇండియా! ఇండియానే ఇందిర' అనే నినాదం సృష్టించాడు. ఆ నినాదం అప్పటికప్పుడు ఎదురు తన్నినా, ‘80ల నాటి ఎన్నికల్లో మళ్లీ ఇందిరమ్మకు తిరుగులేని విజయాన్ని కట్టబెట్టింది కదా! అప్పటి నుంచి 1984 హత్యోదంతం వరకు ఇందిరా గాంధీ ప్రభకు తిరుగులేదన్నట్లుగా పార్టిలోనే కాదు, పార్టీ బైటా హవా సాగింది. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా కాంగ్రెస్ అంటేనే ఏకవ్యక్తి పాలనకు ఏకైక పర్యాయపదం! 1917 నాటి రష్యన్ల విప్లవం విజయవంతమయిన తరువాత బోల్షవిక్ పార్టీలో వ్లాడిమర్ లెనిన్ ఈ తరహా ఏకఛత్రాధిపత్యం కోసమే వెంపర్లాడింది. అక్కడ అది ఎంత వరకు సాధ్యమయిందో లెక్కకట్టే సమాచారం లేదుకానీ, ఇక్కడ ఇండియాలో మాత్రం కాంగ్రెస్(ఐ) పుణ్యమా అని సహజసిద్ధ ప్రజాస్వామ్యం పేరుతో కాంగ్రెస్(ఐ)కి.. దేశానికి మధ్య భేదమే లేదన్నంత హేయమైన నియంతృత్వపాలన సాగిన మాటైతే వాస్తవం!
పూజ్య బాపూజీ జమానాకు వద్దాం. 1920 మొదలు మరణించిన 1946 చివరి క్షణం వరకు మేకపాలు తాగుతూనే ఉక్కు పిడికిలితో కాంగ్రెస్ ను శాసించిన మహాయోధుడు గాంధీజీ. బాపూజీ ప్రియశిష్యుడు పట్టాభి సీతారామయ్య. ఆయన మీద అఖండమైన మెజారిటీతో నేతాజీ గెలుపొందిన ఆలిండియా కాంగెస్ ఎన్నికలే బాపూ ఏకపక్ష ఆధిపత్య ధోరణికి తిరుగులేని ఉదాహరణ. గతంలో అధ్యక్షుడిగా నేతాజీ ప్రవర్తించిన తీరు బాపూజీకి బొత్తిగా మింగుడుపడింది కాదు. ఆ కారణంగా బోసు అధ్యక్ష హోదాలో సక్రమంగా కుదురుకునే వాతావరణం కల్పించనే లేదన్నది బాపుజీ మీద అభియోగం. 21 మంది సభ్యులతో కార్యనిర్వహణా సమితి ఆరంభించవలసిన సిడబ్ల్యుసి అసలు ఆకారమే ఏర్పరుచుకోవడం అసాధ్యమయ్యే రీతిలో గాంధీజీ ప్రవర్తించిన తీరును చూస్తే నిజమే అనిపిస్తుంది. మహాత్ముని విముఖత దృష్ట్యా ఒక్క సభ్యుడు కూడా నేతాజీ వత్తాసుకు వెళ్లే సాహసం చూపించలేదని, ఆ కారణం చేతనే విరక్తి చెందిన సుభాష్ చంద్రబోస్ ఏకంగా అధ్యక్షపదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పట్టు నుంచి విముక్తిపొందారన్న వాదన ఉంది.

గాంధీజీ మరో ప్రియతమ శిష్యుడు జవహర్ లాల్ నెహ్రూ గురించీ అదే కథ! ఆరంభంలో ఆయన బాపూజీకి పెట్ గా తప్ప కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం ఆమోదయోగ్యమైన అభ్యర్థిగా లేడంటారు. క్విట్ ఇండియా ఉద్యమం చివర్రోజుల్లో జాతీయ నేతలు జైళ్ల నుంచి విడుదలయిన నాటి సంఘటన ఒకటి గుర్తుచేస్తారు. రాబోయే ఆరేళ్ల కాంగ్రెస్ అధ్యక్ష పదవీ కాలానికి అందరూ డాక్టర్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఎన్నికవుతారని భావించారు. అతితొందరలోనే దేశానికి స్వాతంత్ర్యం ప్రకటింపబడే అవకాశం ఉన్నందున ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న నేతకు మాత్రమే స్వతంత్ర భారతానికి మొదటి ప్రధాని అయే అవకాశం. నాటి నియమనిబంధనల ప్రకారం జరిగిన సంస్థాగత ఎన్నికల్లో తేలిన ఫలితం.. 16 ప్రదేశ్ కాంగెస్ కమిటీలలో ఒక్కటి మినహా తతిమ్మావన్నీ సర్దార్ వల్లభాయ్ పటేల్ వైపు మొగ్గుచూపాయి. మిగిలిన ఆ ఒక్క ఓటు కూడా జవహర్లాలుకు కాక, ఆచార్య జె.బి.కృపలానీకి దక్కింది. ఏ ఒక్కరి విశ్వాసం సాధించకపోయినా, వల్లభాయ్ పటేల్ ని తొలగిపొమ్మని జవహర్ కే అవకాశం కల్పించారు బాపూజీ! అ విధంగా కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేజిక్కించుకున్న తరువాత మౌంట్ బ్యాటెన్ ఆపద్ధర్మ ప్రభుత్వంలో ముస్లిం లీగ్ తో సమభాగ స్వామ్యం నెహ్రూజీకే దఖలయింది. సహజంగానే జూన్ 3, 1947 నాటి వైస్రాయిగారి ప్రకటనతో పంద్రాగష్టు’47 నుంచి స్వతంత్ర భారతావని తొలిప్రధానిగా పనిచేసే సదవకాశం జవహర్లాలు నెహ్రూ పరమయింది. క్రమశిక్షణ గల నేతగా సర్దార్ వల్లభాయ్ పటేల్ బాపూజీ ఆదేశాల మేరకు ఉపప్రధాని హోదాలో నెహ్రూజీకి మనస్ఫూర్తిగా సహకరించారు. జవహర్ లాల్ నెహ్రూ భారతావని తొలిప్రధాని కావడమే కాదు, మరణించిన 1964 చివరి రోజు వరకు జయాపజయాలతో నిమిత్తం లేకుండా తిరుగులేని కాంగ్రెస్ నేతగా రికార్డు సృష్టించారు కూడా. చైనా పాలసీ వైఫల్యం కారణంగా జాతి ఆత్మాభిమానం దెబ్బతిన్నా, విలువైన దేశభూబాగం నవంబర్ 1962 నాటి ఒప్పందం వల్ల కోల్పోయినా, నెహ్రూజీ దేశానికి ప్రధానిగానే ఉండగలిగారు. కాంగ్రెస్ అధినేతగా అదే చెక్కుచెదరని స్థానంలో పదిలంగా స్థిరపడిపోయారు. కాంగ్రెస్ లోని వీరపూజ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పేందుకు ఈ తరహా ఉదాహరణలు ఎన్నైనా చెప్పుకోవచ్చు. అధినేత మీద ఉండే గాఢాభిమానమే నెహ్రూజీని ఆనాడు కాంగ్రెస్ కు అధ్యక్షుణ్ణి చేసింది. అదే తిరుగులేని విశ్వాసం దోషాలతో నిమిత్తం లేకుండా దేశానికీ ప్రియమైన ‘చాచాజీ’గా మార్చివేసింది.
ఇక ఇందిర విషయం. ప్రారంభంలో ఇందిరా ప్రియదర్శిని ఏకైక అర్హత మాజీ ప్రధాని గారాల కూచి కావడమే! ప్రధానిగా ఆమె ఎన్నిక సైతం చనిపోయిన చాచాజీ పట్ల గల అత్యంత గౌరవాభిమానాలే! లాల్ బహదూర్ శాస్త్రిగారి మంత్రివర్గంలో సభ్యురాలు అయినప్పటికీ ఇందిర సీనియర్ కాంగ్రెస్ నేతల దృష్టిలో రాజకీయాల లోతుపాతులు తెలియని ఒకానొక లేత అమాయిక బాలిక మాత్రమే! నిజానికి సంత్ భింద్రేన్ వాలా, అకాల్ తఖ్త్, పంజాబ్ సమస్యల సందర్భంలో మరొకరికి, మరో పార్టీవారికయితే ఖాయంగా పదవీగండం పొంచి ఉండేదే! కానీ కాంగ్రెస్ కల్చర్ ఇందిర పట్ల కార్యకర్తకుండే అచంచల విశ్వాసాన్ని ఇసుమంతైనా కదల్చలేకపోయింది. ఆమెనే కాదు, మరణానంతరం ఆమె బిడ్డ రాజీవ్ గాంధీని సైతం తమ అధినేతగా నెత్తి మీద ఎక్కించుకునేందుకు సంసిద్ధమయింది కాంగ్రెస్ పార్టీ.
ఇందిర హత్య జరిగే సమయానికి రాజీవ్ వెస్ట్ బెంగాల్ పర్యటనలో ఉన్నారు. రాజకీయాలంటే ఓనమాలైనా తెలియని ఆ యువకుడు తిరిగొచ్చి ‘ఫ్యూరర్’ పదవి చేపట్టే క్షణం వరకు కాంగ్రెస్ పార్టీ మొత్తం ఎంతో అసహనంతో ఎదురుచూసింది! దేశాధ్యక్షులు జ్ఞానీ జైల్ సింగ్ విదేశీపర్యటన అర్థాంతరంగా ముగించుకుని వచ్చి, విమానాశ్రయంలో దిగిన నిమిషాలలోనే ఇందిరా పుత్రుడి చేత ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయించారు! బి.బి.సి ప్రసారాల ప్రకారం తల్లి మరణానంతరం కేవలం ఆరుగంటల లోపే విశాల భారతావనికి ఆమె కన్నబిడ్డ ప్రధాని రూపంలో ప్రత్యక్షమయ్యాడు! దేశాధ్యక్షుడి దేహంలోని సుశిక్షితుడైన మాజీ కాంగ్రెస్ కార్యకర్త - దివంగత అధినేత బిడ్డయిన కారణాన, రాజీవ్ సందర్భంలో ఆరు నెలలోపు చట్టసభకు ఎన్నికవాలన్న నిబంధన విధాయకంగానైనా ప్రస్తావించలేదు! సిరిపెరంబదూరు దురదృష్ట సంఘటన(1991)కు ముందు ‘89 ఎన్నికలలో కాంగ్ర్రెస్ పరాజయం ఎదుర్కొన్నది. ఆ వైఫల్యానికి రాజీవ్ ను బాధ్యుణ్ణి చేయడం కాంగ్రెస్ కలలోనైనా ఊహించలేని దుస్సాహసం. అప్పటికి దుఃఖంలో ఉన్న గాంధీల కుటుంబం పి.వి ని దేశ ప్రధాని కానిచ్చింది.
ప్రభుత్వ స్థాపనకు 50 ఎం.పి సీట్లు తరుగుపడినప్పటికీ అధ్యక్షస్థానంలో ఉన్నందున పి.వి పట్ల ఎవరూ బహిరంగంగా అవిధేయత ప్రకటించలేదు! గాంధీ కుటుంబేతరుడైనా సరే, పి.వి ని ప్రధానిగా ఉండనీయడానికి కారణం, కాంగ్రెస్ కార్యకర్త నర నరాలలో ఇంకివున్న స్వామిభక్తిపరాయణత్వం. స్వామి ఎవరన్నది కాదు.. స్వామి స్థానం పట్ల విశ్వాసంగా ఉండటం ప్రధానం కాంగ్రెస్ పార్టీ వీరభక్తులకు. పి.వి ప్రధాని అయిన కొద్ది రోజులకే నెహ్రూ మార్క్ ‘50ల నాటి అవాడి సీజన్ సోషలిజమ్ తలకిందులయే ప్రమాదం పొడసూపింది. మరో రెండేళ్లకే రావుగారు సెక్యులరిజానికీ మంగళం పాడే పనిలో ఉన్నట్లు సూచనలు అందడం ఆరంభమయాయి. గాంధీ ప్రవచించిగా, నెహ్రూ ప్రోత్సహించిన సోషలిజమ్ సారం ఆ సెక్యులరిజమ్! బాబ్రీ మసీదు విధ్వంసంలో పాములపర్తివారి పరోక్ష హస్తముందని ముస్లిం మైనార్టీలు గట్టిగా విశ్వసించారు. అయినప్పటికీ ఆయన ప్రధాని పదవి 1996 వరకు ఏ ఢోకా లేకుండానే నడిచింది కదా! తిరిగి గాంధీ కుంటుంబంలోని నేత కోసమై కాంగ్రెస్ పార్టీ వెంపర్లాడుతున్న సమయంలో సోనియా గాంధీ తిరుగులేని మెజార్టీతో దివంగత జితేంద్ర ప్రసాద్ మీద ఆధిక్యత సాధించారు. అప్పటి నుంచి ఇప్పటికీ ఆమను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో, ఆపద్ధర్మ రూపంలోనో.. కాంగ్రెస్ తమ అధినేత స్థానంలో ఉంచుకుని కొలుచుకునేందుకు సమ్మతిస్తూ వస్తున్నది.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్న నాయకత్వ సంక్షోభానికీ.. కాంగ్రెస్ పార్టీ తరహా.. కార్యకర్తల్లోని స్వామిభక్తపరాయణత్వమే అంతిమంగా పరిష్కారం చూపించేది. అదే నిశ్చయం.

-కర్లపాలెం హనుమంతరావు

05 -09 -2020

(సూర్య దినపత్రిక సంపాదకీయపుట ప్రచురణ) 

***

Monday, August 31, 2020

ఇల్లే ఒక పార్లమెంట్ - ఈనాడు దినపత్రిక సరదా వ్యాసం





(ఈనాడు శ్రీధర్ గారికి క్షమాపణలతో, ధన్యవాదాలతో)

ఇల్లొక పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనుకుంటే ఇంటాయన ప్రసిడెంటా? ప్రధానమంత్రా?’
పాకిస్తానయితే ప్రధానమంత్రి.. ఇండియా ఐతే ప్రెసిడెంట్ అనుకోరాదూ?శ్రీమతి  లండన్లో మాదిరి  ప్రధాన మంత్ర్ర్రిగా పవర్ ఫుల్ గా ఉంటేనే  ఉంటేనే ఇంటికి, మగాడి వంటికి మంచిదని నా అభిప్రాయం' అంది  చెంచులక్ష్మి.
చెంచులక్ష్మి పత్రికలలో స్త్రీల పక్షం వహించి ఘాటుగా  రాస్తుంటుంది. హైదరాబాద్ లో మా ఆడపడుచుగారింటికి వెళ్లినప్పుడు ఆవిడ వాళ్ల ఫ్లాట్స్ లోనే ఉంటుందని తెలిసి ఒక మధ్యాహ్నం పూట మా ఆడపడుచుతో కలసి చూడ్డానికి వెళ్లాను. చెంచులక్ష్మి బాగా రాయటమే కాదు.. బాగా మాట్లాడుతుంది కూడా. ఇంటిని పార్లమెంటనడంలోనే గొప్ప పాయింట్ లాగిందావిడ.
'… ఎగువ సభ సభాపతిలా మామగారు, దిగువ సభ ప్రతిపక్షంలా అత్తగారు ప్రతి ఇంట్లోనూ ఉంటారు మామూలే అది . పిల్లలు రకరకాల రాజకీయ పార్టీలు. ఇరుగుపొరుగువారు చైనా పాకిస్తాన్ లాంటి వాళ్లు. మిత్రబృందాలు కల్చరల్ ఎక్ఛేంజికి వస్తుంటారు. వీళ్లందర్నీ పర్యవేక్షించాల్సిన వాళ్లం మాత్రం మనమే కదా చివరికి !'
'లెక్చర్ పిచ్చగా ఉంది. ప్రొసీడ్' అని ఎగదోసింది మా ఆడపడుచు ఆనందం తట్టుకోలేక చప్పట్లు కొడుతూ.  ట్రెజరీ పక్షాల వాళ్లు ప్రధాని మాట్లాడినప్పుడు మధ్య మధ్యలో బల్లలు బాదేస్తారే .. ఆ  మోడల్లో. డైనింగ్ టేబుల్ మీద మోదేస్తూ ఈవిడ ఇలా ప్రోత్సహించడంలో ఇద్దరి మధ్యా ఏదైనా లోపాయికారి ఒప్పందంలాంటివి ఏమన్నా ఉన్నాయేమో! అని నాకు అనుమానం మొదలయిన మాట నిజం సుమా!
చెంచులక్ష్మి రెచ్చిపోతూ 'ఇంట్లో ఏ ప్రాబ్లమొచ్చినా డైనింగ్ టేబుల్ దగ్గర చర్చకు వచ్చి తీరాల్సిందే ఏ కొంపలో  అయినా. దాన్నే మేం ముద్దుగా రౌండ్ టేబుల్ కాన్ఫెరెన్స్ అని పిలుచుకుంటుంటాం ఇంట్లో. మేటరెంత కాన్ఫిడెన్సయినా సరే,  ఎట్లా లీకవుతుందో తెలీదు .. మాకన్నా ముందు పక్కింట్లో చర్చ మొదలయిపోతుంది ఈ మధ్య  ఈ అపార్ట్ మెంట్స్ లో.
'స్వగృహ రహస్యాలను పొరుగిళ్లకు చేరవేసే కోవర్టులు ప్రతీ ఇళ్లలోనూ ఏదో రూపంలో ఉంటారులే’ అని గునిసింది మా ఆడపడుచు  నా వంక చూపులు సాధ్యమైనంత వరకు పడకుండా జాగ్రత్త పడుతూ. ఆవిడగారి నిందార్థాలు బహుశా మా అమ్మ మీద అయివుంటాయని అర్థమయింది.
'మేటర్ మరీ సీరియస్సయితే ఉభయసభలనూ సమావేశపరచి లోతుగా చర్చించ వలసిన అవసరం ఉంటుంది. మా అమ్మాయి ఈ మధ్య రాత్రుళ్లలో వీరప్పన్ ను గురించి ఒహటే కలవరిస్తోంది. దీం దుంపతెగ! పోయి పోయి ఆ దుంగల దొంగ వెధవ వలలో  పడిందేమిటి చెప్మా' అని మా వారు ఉప్మా తింటున్న ప్రతి పరగడుపునా కన్నీళ్లు పెట్టుకొనే సీను చూసి చూసి నాకూ  ఝడుపు జొరం పట్టుకుంటుందేమోనని అనుమానం మొదలయింది. ఒక రోజు పిల్లదాన్ని పట్టుకుని గట్టిగా నిలదీస్తే నిలువుగుడ్లు పడిపోయాయి పాపం పసిదానికి. ఆ బూచాడికి బారెడు మీసాలు మొలుస్తుంటాయి కదా! రెండేపులా గుమ్మడికాయలు నిలబెట్టినా  లొంగనంత ధృఢంగా ఉంటాయి. ఏ చందనం తైలం వాడుతున్నాడో చచ్చినోడు .. కనుక్కోడమెట్లా అని అలోచిస్తూ పడుకుంటున్నానే మమ్మీ! నేరుగా నిద్రలోకే వచ్చి ఆ ఒక్కటి తప్ప మిగతా ముచ్చట్లన్నీ చెప్పి చస్తున్నాడు' అని బావురుమనేసింది. నమ్మక చస్తామా?
'దేశమో వంక తగలడి చస్తోంటే మీసాలకు రాసుకునే సంపెంగ నూనె వివరాలంత అవసరమా దీనికి?' అని మా మగాయన గెంతులేస్తుంటే నేనే గుడ్లురుమి ఎట్లాగో అదుపులో పెట్టా!'
'ఈ కాలం పిల్లకాయలను గురించి ఈ మగాళ్లకేం తెలుసు. కెరీర్ ఓరియెంటెడే కాని.. కాలేజీకి తీసుకెళ్లే కేరేజి ఎలా సర్దుకు చావాలో కూడా కోర్సులో చేరితే తప్ప బుర్రకెక్కని మట్టిముద్దలు. పిల్లల్ని అట్లా పెచుతున్న పాపం నిజానికి మన పేరెంట్సుదే! సరే! మీ మైనస్సును గురించి చెప్పావు. మరి ప్లస్సును గురించి కూడా మా ఆడపడుచుచెవిలో వెయ్యి!' అంది మా ఆడపడుచు.
'యూ మీన్ .. మా అబ్బాయా? అబ్బాయిల్ని ప్లస్సులు, అమ్మాయిల్ని మైనసులు అనుకుని పెంచడానికి మనమేమన్నా సంసారాలని వ్యాపారాలకు మల్లే నడుపుతున్నామా?డెబిటైనా, క్రెడిటైనా రెండు సైడ్లు చివర్లో సమంగా ఉంటేనే అది సరైన బ్యాలన్స్ షీట్ అవుతుందని మా వారెప్పుడూ అదేదో వాళ్ల బ్యాంకు గోలలో ఘోషిస్తుంటారు. నిజం చెప్పాలంటే మా వాడో పెద్ద వాజపేయి. మేథావే గానీ, ఏదీ ఇతమిత్థమని ఒక పట్టాన తెమల్చడు. మొన్నటికి మొన్న పరీక్షలని తెల్లార్లూ చదివి చదివి తీరా పరీక్ష హాలు కెళ్లి తెల్లకాగితం ఇచ్చొచ్చాడు. 'రాయడానికి మరీ అంత బద్ధకమేంట్రా వెధవా?' అని గట్టిగా నిలదీస్తే ' ఈ కింది దానిలో ఏదేని రెండిటికి మాత్రమే సమాధానం వ్రాయుడు!' అని రాసుందట. 'టూ ఓ క్లాక్ దాకా కూర్చునే ఓపిక లేక తిరిగొచ్చేసాను మమ్మీ!' అని దిక్కుమాలిన జవాబు. పిల్లల్ని ఇట్లా చెడగొట్టింది వాళ్ల డాడీ గారాబమే!'
'పవరంతా ఈవిడ చేతిలో పెట్టేసుకుని అప్పోజిషన్ వాళ్లను పి.యం తిట్టినట్లు ఎట్లా తిడుతుందో చూసావా మహాతల్లి! ' అంటూ నా చెవిలో గుసగుసలు పోయింది మా ఆడపడుచు, ఆవిణ్ణి అట్లా పక్కకు పోనిచ్చి.
'అన్నయ్యగారు ఓన్లీ ప్రెసిడెంట్ లాంటి వాళ్లని నువ్వే అన్నట్లు గుర్తు' అ ని మళ్లీ రెచ్చగొట్టే పని మొదలుపెట్టింది మా ఆడపడుచు. '
'ఆడది మొగుడు అడుగుజాడల్లో నడిచి తీరాలని కదండీ మన  శాస్త్రాల నుంచి తెలుగు సినిమాల వరకు అన్నీ ఘోషిస్తున్నది' అని అడిగాను అక్కడికి నేనూ కొద్దిగా లేని ధైర్యం కూడగట్టుకొని.  
'మొగుడు అడుగుజాడల్లో నడిస్తే మన దేశంలో ముప్పావు వంతు మంది ఆడవాళ్లు ఏ బారుల్లోనో, పేకాట క్లబ్బుల్లోనో తేలుండేవాళ్లు.' అని గుర్రుమందావిడ.
'నీ తీరు చూస్తుంటే  నువ్వింట్లో మీ వారి మీద వార్ గ్రూప్ మాదిరి కార్యకలాపాలు సాగిస్తున్నట్లుందే! ఇట్లా అయితే అన్నయ్యగారెప్పుడో 'భాబా’  సంఘంలో చేరిపోతారేమో వదినా! ముందది చూసుకో!' అంది మా ఆడపడుచు.
'భాబా సంఘమా? అంటే?'
'భార్యా బాధితుల సంఘం'
'తలకిందులుగా నడిస్తే నవ్వొస్తుంది కదా అని మగాళ్లే ఇలాంటి తలతిక్క సంఘాలు పెట్టి మన పరువు తీసేది. పత్రికల్లో వచ్చే అప్పడాల కార్ట్యూన్లన్నీ మన ఆడవాళ్ల ఇమేజీని నెగటివ్ గా చూపిస్తున్నాయని నేనంటాను. మనం ఆకాశంలో సగం అంటారు కానీ.. మూడో వంతు వాటా ఇవ్వడానిక్కూడా ఎన్నేసి నాటకాలు ఆడుతున్నారో చూడు! పేరుకెన్ని రిజర్వేషనులుంటే ఏమి? అవన్నీ మొగాడు ఆడదాని ముసుగులో వేసే వేషాలే! హక్కులు దేబిరించి తెచ్చుకుంటే  వచ్చిపడేవా? పోరాడి గెల్చుకునేవి. రాజకీయలనగానే మనకు ఒక్క ఇందిరమ్మ పేరు మాత్రమే ఎందుకు గుర్తుకురావాలి? జయలలితో, మాయావతో, మమతమ్మ  బెనర్జీనో, ఇలా ఏవో ఓ పుంజీడు పేర్లు మాత్రమే పలుకుతున్నామంటే  మనమెంత వెనకబడి ఉన్నామో అర్థంచేసుకోవాలి? 'అర్థరాత్రి పూటయినా ఆడదిస్వతంత్రంగా బైట తిరగ్గలిగే రోజు వచ్చినప్పుడే మనకు నిజమైన్న స్వాతంత్ర్య్యమొచ్చినట్లని బాపూజీ అన్నాడంటే, 'ఆడది అసలు అర్థరాత్రిళ్లు బైటెందుకు తిరగడం' అనేసే మాగాళ్లు. పొట్టపగిలిపోయేటట్లు  అదో జోకన్నట్లు నవ్వి చచ్చే జోకరుగాళ్లు  ఉన్నారంటే  ఆ తప్పెవరిది? 'మగాడు ఎందుకు తిరుగుతున్నాడో అందుకు' అని ఆడది తెగించి జవాబు చెప్పినప్పుడు కదా మనకు నిజంగా స్వతంత్రం వచ్చినట్లు గుర్తు!' అంది చెంచులక్ష్మి ఆవేశంగా.
మేటర్ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉన్నా ఆవిడగారి ఆందోళన అర్థం చేసుకోదగ్గదే! ఎమోషన్లో పదాలేవో అటూ ఇటూ పడతాయి. అది కాదు; విషయం ప్రధానం. రిజర్వడ్ చైర్లకు ఎన్నికైన ఆడవాళ్లలో ఎక్కువ భాగం ఆయా మొగుళ్ల చేతిలో కీలుబొమ్మలుగా పనిచేస్తున్నారని ఒకానొక ప్రముఖ దినపత్రికలో ఆవిడ రాసిన వ్యాసం చదివిన రోజు నుంచి మా ఊరి మహిళామండలి సభ్యురాళ్లందరికీ ఆవిడంటే తగని అభిమానం పుట్టుకొచ్చినమాట నిజం. ఒకసారి చెంచులక్ష్మిగారిని మా ఊరు తీసుకెళ్లి సభ పెట్టిస్తే నాకు మంచి క్రెడిట్ దక్కుతుంది.  ఆ విషయమే అడగడానికి  అసలు ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కూడా.  నా ఆహ్వానం విన్న మీదట నవ్వుతూ 'దాందేముందండీ! మా వారెప్పుడు ఖాళీగా ఉంటారో కనుక్కొని చెబుతాను. ఇద్దరికీ టిక్కెట్లు బుక్ చెయ్యాల్సుంటుంది మరి! ఒక్కదాన్నే అంత దూరం ప్రయాణమంటే ఏమంటారో మరి.. రోజులు అసలే బాగా లేవు కూడా !' అంటూ లేచి నిలబడింది!
'మమ్మీ! ఇంకెత సేపే! డాడీ నిన్ను టిక్కెట్లు తీసుకోమన్నాడు. లేడీస్ క్యూలో అయితే రష్ తక్కువగా ఉంటుందట!' అంటూ పుత్రరత్నం సెల్ చేతిలో పట్టుకుని పరుగెత్తుకుంటు వచ్చేసాడు.
'సినిమాకా?' అని అడిగింది మా ఆడపడుచు. 'అవును ఏడుపు టీవీలు చూడలేక పిక్చర్కే ప్లాన్ చేసారు మా వారు. సీరియల్ అయితే మళ్లీ రేపు కూడా వస్తుందిగా. అందునా మగాళ్లు అడిగినప్పుడు కాదంటే ఇల్లో పార్లమెంట్ అయిపోతుంది' అని హడావుడిగా లోపలికి పరుగెత్తింది. తయారవడానికి కాబోలు !
'ఏం సినిమారా.. చిన్నా?' అని మా ఆడపడుచు అడిగిన ప్రశ్నకు ' రేణుకాదేవి మాహాత్యం' అనేసాడు అభం శుభం తెలియని ఆ ఇంటి పార్లమెంట్ నామినేటెడ్ మెంబర్ భడవా !
-కర్లపాలెం హనుమంతరావు
31 -08 -2020
***
(ఇల్లే పార్లమెంట్ - పేరుతో ఈనాడు దినపత్రిక 17 -02 -2003 లో ప్రచురితం)



మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...