Showing posts with label celebretaries. Show all posts
Showing posts with label celebretaries. Show all posts

Sunday, December 12, 2021

మానవతావాది చార్లీ చాప్లిన్‌ -కర్లపాలెం హనుమంతరావు

                                           

వదులు పంట్లాం, ఇరుకు కోటు, పెద్ద సైజు బూట్లు, నెత్తిమీద చాలీ చాలని టోపి, ఫ్రెంచ్‌ కట్‌ మీసాలు,  వంకీ కర్ర, వంకరటింకర నడక, బిత్తరచూపులు- చూడంగానే  నవ్వొచ్చే ఆ ఆకారానికి వేరే పరిచయం అవసరమా?  అవును..ఈ విచిత్ర హావభావాల ఏకైక పేటెంట్ హక్కుదారుడు.. మీరూహించినట్లు  చార్లీ చాప్లినే. కనుమరుగై మూడున్నర దశాబ్దాలు గడుస్తున్నా మన మనసుల్లో అతగాడు చిరంజీవి. మురికివాడల్లో పుట్టుక. కఠోర  దారిద్య్రం మధ్య పెంపకం. అషకష్టాలు చాలా చిన్నవి అతను పడ్డ కష్టాల ముందు. కోట్లకు పడగలెత్తిన ఈ హాస్యనటుడికి తల్లి కుట్టు మిషను.  నాటకాలే బాల్యంలో ఆసరా.  తండ్రి ప్రేమ తెలియదు. ఒక నాటకంలో భాగంగా పాట పాడుతుండగా గొంతు జీరబోయిన తల్లిని అభాసు పాలవకూండా కాపాడిన పాటే చాప్లిన్ ఆరంగేట్రం మొదటి ఐటం సాంగ్. ఆనాడు  చిల్లరతో రాలిన నవ్వ్వులనే జీవితాంతం నమ్ముకున్న విశ్వ కళాకారుడు చార్లీ. విధంగా అనుకోని పరిస్థితులు ఐదేళ్ల చాప్లిన్‌ను స్టేజి ఎక్కించాయి. తల్లి ఆర్యోగం పూర్తిగా క్షీణించి మనోవ్యాధికి గురికావడంతో ఆమెను పిచ్చాసుపత్రిలో చేర్పించారు. తల్లితోడు కూడా లేక పోయేసరికి అనాధ శరణాలయంలో పిల్లలను చేర్పించడంతో వారు అక్కడ అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. రెండేళ్ళ తరువాత తల్లి మానసిక వ్యాధి నుండి కోలుకుని చాప్లిన్‌ను ఒక డ్యాన్స్‌ బృందంలో చేర్పించింది. స్వతహాగా కళాకారుల కుటుంబం నుండి వచ్చిన చాప్లిన్‌ నృత్యంతో పాటు అనేక కొత్త రూపాలను ప్రదర్శించేవాడు.

 

బాల్యంలోనే ఇన్ని కష్టాలను చవిచూసిన చాప్లిన్‌ ఎప్పటికయినా నటుడు కావాలన్న లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాడు. పొట్టకోసం అనేక రకాల పనులు చేస్తూ తన లక్ష్య సాధన కోసం కృషి చేస్తూనే ఉన్నాడు. క్రమంలో ఒక నాటక సమాజంలో వచ్చిన అవకాశాన్ని తన సహజమైన నటనా కౌశలం ఉపయోగించి ఆకట్టుకున్నాడు.ప్రపంచంలో అనేక నగరాలలో ప్రదర్శనలిచ్చాడు. 'కీస్టోన్‌ కాప్స్‌' అనే అమెరికా కంపెనీ ఆయన ఆద్భుత నటనకు మెచ్చి హాస్య చిత్రాలలో అవకాశం ఇచ్చింది. అవి మూగ చిత్రాలు, కళ అంటూ ఏమీ ఉండదు. దాన్ని దీన్ని గుద్దుకోవడం తన్నుకోవడం, క్రిందపడటం జనాన్ని నవ్వించడం ఇవి సినిమాల్లో ఉండేవి. ఎవరెక్కువగా నవ్విస్తే వారే హీరోలు, మొదటగా చిత్రాలలో చాప్లిన్‌ నటించారు.ఆయన నటించిన చిత్రాల్లో దేశ దిమ్మరి(1915) ఆయనకు శాశ్వత కీర్తినార్జించిపెట్టింది. చిత్రంలో ఆనాధ బాలుని పెంచటానికి పడ్డ పాట్లు ఎంతగా నవ్విస్తాయో, అంతగా సామాన్యుని బాధామయ జీవితాన్ని చూపిస్తాయి. చిత్రం ఆయనకు ప్రపంచ దేశాల్లో గొప్ప పేరును తీసుకువచ్చింది.

 

ప్రజా కళాకారుడిగా చాప్లిన్‌ నాటి భౌతిక పరిస్థితులకు స్పందిస్తూ తీసిన చిత్రం ''మోడరన్‌ టైమ్స్‌''. చిత్రంలో ఆధునిక కార్మికుడు యంత్రాల కోరల్లో చిక్కుకొని ఎలా నలిగిపోతున్నాడో, కార్మికుల సృజనాత్మకతను దెబ్బతీసి యంత్రంగా ఎలా మారుస్తున్నారో, కార్మికుల రక్తాన్ని ఎలా జలగల్లా పీలుస్తున్నారో వివరిస్తూ చివరకు కార్మికుడికి మిగిలేది. ఆకలి, దారిద్య్రం, మానసిక ఆందోళనలేనని వ్యంగ్యంగా వివరిస్తాడు. దీనితోపాటుగా అన్నం తినే సమయాన్ని కూడా తగ్గించటానికి తిండి తినిపించే ఆధునిక యంత్రాన్ని ప్రవేశపెట్టిన యజమానుల దురాశనూ, కార్మికుల శ్రమ దోపిడీకి వారు చూపే ఆత్రుతను వ్యంగ్యంగా విమర్శించాడు.అమెరికా పెత్తందారీతనం కార్మికులను, కమ్యూనిస్టులనే కాకుండా చార్లెస్‌ను కూడా వదలలేదు. చార్లెస్‌ మోడరన్‌ టైమ్స్‌ ద్వారా ప్రారంభమైన దాడి, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఒక సభలో రష్యన్‌లను సమర్ధిస్తూ, యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడతాడు. దీనితో చార్లెస్‌పై అమెరికా దాడి పెరిగింది. దాడి ఎంతగా సాగిందంటే చివరకు ఆయన ఆదేశాన్ని విడిచిపోవాలని నిర్ణయించుకున్నాడు. అమెరికా ప్రభుత్వం చార్లెస్‌కు కమ్యూనిస్టు ముద్రవేసి రీ-ఎంట్రీ అనుమతి కూడా ఇవ్వలేదు.

 

చార్లెస్‌ తీసిన ప్రతి సినిమాలోనూ మానవతాదృక్పథం, సమకాలీనత, సమస్యలపై స్పందన కనిపిస్తాయి. ఆయన తీసిన ప్రతి సినిమా ప్రజలను ఆలోచింపజేసేదిగా ఉంటుంది. ఒక సినిమాలో (దిగ్రేట్‌ డిక్టేటర్‌) ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ మన విజ్ఞానం మనల్ని అనుమానాల పుట్టలుగా మార్చిందని, మన తెలివితేటలు కఠిన హృదయాలుగా మార్చాయని, మనం ఎంత ఎక్కువగా ఆలోచిస్తున్నామో అంత తక్కువగా స్పందిస్తున్నాం అంటారు.

ప్రపంచాన్ని గడగడలాడించిన రెండవ ప్రపంచ యుద్ధానికి కారకుడైన నరరూప రాక్షసుడు అడాల్ఫ్‌ హిట్లర్‌ను ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టే ఉద్దేశంతో తీసిన సినిమా ''ది గ్రేట్‌ డిక్టేటర్‌''(1937). ఆవిధంగా సామ్రాజ్యవాద వ్యతిరేకిగా, ప్రపంచశాంతి కోసం తపించిన మానవతావాదిగా, దోపిడీకీ వ్యతిరేకంగా పోరాడిన పేదల పక్షపాతిగా, మహా కళాకారుడిగా చార్లెస్‌ నిలిచిపోతాడు.''భౌతిక పరిస్థితులు మారనంతకాలం జీవిత వాస్తవాలు మారవు'' అంటాడు. అందుకేనేమో అతని సినిమాలో ''కళా విలువలు-వాస్తవికత'' రెండూ కనిపిస్తాయి.

-కర్లపాలెం హనుమంతరావు

 

Saturday, December 11, 2021

కవిత: బాలగోపాల్, ఓ బాలగోపాల్ - పి.రామకృష్ణ సేకరణ : కర్లపాలెం హనుమంతరావు

 





మాకులాగే  నీకూ ఒక్క బ్రతుకే ఉన్నా 

ఆ ఒక్క బ్రతుకులో 

వంద బ్రతుకులు జీవించావు కదా బాలగోపాల్ 


మాకులాగే నీకూ రెండు కాళ్లూ,  రెండు కళ్లే ఉన్నా 

దేశంలో నీ కాళ్లు నడవని ప్రదేశం లేదు  

నీ కళ్లకు కనిపించని  హక్కుల అణచివేతలేదు 


చీమంత  పని చేసామేమో  

కొండంత అలసటతో కూచున్నాం మేము  

ఇదిగో.. ఈ మరణం దాకా 

నువ్వెప్పుడైనా అలసిపోయావా బాలగోపాల్ 

సీమవాడినని అనుకోవడానికి సిగ్గేసింది 

సీమనీటి వివరాల గురించి  నువు  చెప్పాక

పల్లం నుంచి మిట్టకు కూడా ప్రవహించావు  గదా బాలగోపాల్ 

నమ్మకాన్నీ, అపనమ్మకాన్నీ అంతే ధైర్యంగా 

అంతే నమ్మకంగా ప్రకటించావు గదా బాలగోపాల్ 

మేమైతే  నమ్మకం  మీద అపనమ్మకం కలిగినా 

నమ్ముతున్నట్లే కనిపిస్తూ వుంటాం 

ఇప్పుడు నీ కోసం ఏడ్వాలా 

మాకోసం ఏడ్వాలా 

నీ కోసం ఏడిస్తే, నువ్వింకా ఏదో చెయ్యాలనుకోవడం 

లేదా , ఏదో చెయ్యలేదు అనుకోవడం, వద్దు . 

నువ్వు చెయ్యవలసినవన్నీ చేశావ్ 

ఏసుక్రీస్తు చెప్పినట్టూ  ఇక మా కోసమే ఏడుస్తాం... 

- పి. రామకృష్ణ 


( పి.రామకృష్ణ రచనలు నుంచి ) 

సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

                 22-09-2021 

                  బోథెల్, యూ. ఎస్.ఎ


( బాలగోపాల్ భౌతికకాయం దగ్గర కూర్చున్నప్పుడు కలిగిన ఆలోచనలతో తను కూర్చిన కవిత ( పి. రామకృష్ణ దృ ష్టిలో ఇది కవితకాదు . బాలగోపాల్ ను ఒక కవితలో ఇమడ్చటం కష్టం అంటారాయన )  

 


Wednesday, December 8, 2021

మగువంటే మగవాడి మర-యంత్రమా? - కర్లపాలెం హనుమంతరావు ( సూర్య దిన పత్రిక సంపాదకీయ పుట వ్యాసం)




మగువంటే మగవాడి మర-యంత్రమా?

- కర్లపాలెం హనుమంతరావు 

( సూర్య దిన పత్రిక సంపాదకీయ పుట వ్యాసం) 

 


చెయ్యగా చెయ్యగా పనుల్లో సులువు తెలుస్తుందన్నది  లోక నుడి. మనుషులకే కాదు.. దేవుళ్లకూ ఈ సూత్రం వర్తిస్తుంది. 'విధినా తావభ్యస్తం యావద్స్పుష్టా మృగేక్షణా' అని  ‘సుభాషిత రత్నమాల’ ముక్తాయించడానికి అదే కారణం. లావణ్యంతో ఓలలాడే లలనామణి సృష్టి కోసం లీలామానుషుడు ఎన్నో మగబొమ్మలను తయారుచేసాడన్నది  ఈ శ్లోకం తాత్పర్యం. ఆడవాళ్లను అందుకే ఫెయిర్ సెక్స్ అనడం! 


ఫెయిర్ నెస్ ఎతుంటే ఏం లాభం? చపల చిత్తం మగవాడి బుద్ధి ముందు స్థిత ప్రజ్ఞత పుష్కలంగా ఉన్నా స్త్రీ సునిశిత గ్రహణ శక్తి మొక్కవోతూనే ఉంది. సృష్టి ఆది నుంచి ఇదే బాధ. మగవాడు ఆవులించక ముందే మగువలు వాడి పేగులు లెక్కెట్టేస్తారు!  ‘అందుకే ఆడదంటే మగవాడికంత బెదురు’ అన్నారు హిల్లరీ క్లింటన్ ఓ  సందర్భంలో! అబలగా అన్నింటా మగవాడు చిన్నబుచ్చే  ఆడది నిజానికి జగద్గురు శ్రీ శంకరాచార్యుని భాష్యం ప్రకారం అపర పరాశక్తి.. అతిలోక సుందరి శ్రీ లలితాదేవి.. కూడా! 

పరమేశ్వరి అనే పదానికి పరమార్థమేదో బుర్రకు  తట్టక ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ అంటూ తనకు తానే సర్దిచెప్పుకునే ‘బుద్ధి’తక్కువ శాల్తీ మగవాడు.  అయ్యగారి దృష్టిలో ముద్దరాలు అంటే ముద్దుపళని రాధికాసాంత్వనం మార్కు రాధాదేవి. ‘కంటికి నిద్ర రాదు, విను, కాంతుని బాసిన నాటినుండియున్/వంటక మింపు గాదు..’ టైపు విరహబాధలు తెగ పడిపోయే అష్ట శృంగార నాయికల్లో సందర్భాన్ని బట్టి ఎవరో ఒకర్తె. అందుకే  ఆమెను అందాల భరిణ అంటూ ఉన్నవీ లేనివీ ఊరికే ఊహించుకుని మరీ ‘కురులకు వందనములు తెలి గోము మొగంబునకున్ జోహారు, నీ/ యరుదగు కంబు గంఠమున కంజలి, నీ కుచ కుంభాళికిన్/ కరముల్ మోడ్చెదన్, బెళుకు క్రౌనుకు మ్రొక్కెద, బంచబాణ మం/దిరములకున్ సతీమణి! పదింబదిగా పదివేల దండముల్' అంటూ  దండకాలు రాసుకునేది. నడివయసు దాటినా మిడిమేళపు కవిత్వంతో సడీ సప్పుడు లేకుండా తన మానాన తాను తన పని తాను చూసుకునిపోయే చానను కూడా సామాజిక మాధ్యమ వేదికల మీద కీడ్చి కీచకుడికి మించి రచ్చ చేసేది మగవాడే.  కేస్టింగ్ కౌచ్ లు ఉన్నంత వరకు విరుగుడు తంత్రంగా  ‘మీ.. టూ’ లు పుట్టుకురాక తప్పదు. 

నిజానికి మహిళ ఏనాడూ ‘వాల్మీకి రామాయణం’ పట్టించుకోకుండా వదిలెట్టేసిన ఊర్మిళమ్మలా ఊరికే పడి నిద్రపోయిందిలేదు. అర్జనుడి రాక ముందు నుంచే రాజ్యం దర్జాగా నడిపించిన   ప్రమీల  ప్రజ్ఞే  ప్రమదలది ఎప్పుడూ. నేటి లోకవ్యవహారం కూడా ఆ తీరులోనే  తరుణుల ఆధ్వర్యంలో సాగుతుంటే ఇప్పుడీ మహిళా దినోత్సవాలు గట్రా అంటూ ఆర్భాటాల అక్కరే ఉండేది కాదు.  


15వ శతాబ్దంలో ఇండియా  పర్యటనకని వచ్చిన నికోలో కోంటీ అప్పటి హిందూ రాజ్యాలలో భర్త చనిపోయిన భర్తతో బతికున్న భార్యనూ చితి పైకి ఎక్కించడం చూసి విస్తుపోయాడు.  ఆ కాల్చడాలు అవీ ప్రత్యక్షంగా ఇప్పుడు కనిపించవు. కానీ.. కడుపులో పడ్డ మరుక్షణం నుంచి కాటిచితిలో పడే ఘడియ వరకు ఏదో ఓ దుర్మార్గపు రూపంలో ఆడాళ్లను కాల్చుకు తినడాలు మాత్రం తప్పడంలేదు ఇప్పుడు కూడానూ! 

వేదాల కాలంలో  స్త్రీ పురుషులిద్దరిలో గొప్ప ఎవరన్న  వాదమే వినిపించింది కాదు. జనకుడి  విద్వత్మహాసభలో గొప్ప తర్కతో తనను తలకిందులు చేసినప్పుడు మహాజ్ఞాని యాజ్ఞవల్క్య మహర్షి  మొహమాటం లేకుండా  మైత్రేయి ముందు మోకరిల్లినట్లు  మనకు కథలున్నాయి.  ఎప్పుడు రాజుకుందో గాని ‘అహం’ అనే ఈ నిప్పు రవ్వ.. ఇప్పటి  మగవాడి మనస్సులో  ‘అహం బ్రహ్మోస్మి’ అన్న అగ్నిని తెగ ఎగదోసేస్తోంది. మగవాడి ఆధిపత్య జ్వాలలకు సుకుమారమైన బతుకులు ఎన్నెన్ని  కాలి బూడిదయిపోతున్నాయో ప్రతీ రోజూ! మరి ఉద్యమం వద్దంటే ముద్దరాలు మొద్దులా ఓ మూల పడివుంటుందా?    


సృష్టిధర్మ రీత్యా పురుషుడి దేహం స్త్రీ శరీరం కన్న దృఢం అయితే కావచ్చును. అంత మాత్రం చేతనే అన్నింటా అతగాడు అధికుడు ఐపోతాడా? నాగరికత ఆరంభ యుగాలలో ఆడదే కుటుంబానికంతటికీ తిరుగులేని పెద్ద. పితృస్వామ్యవాదం బలిసి పెత్తనం రుచి మరిగిన తరువాత మగవాడో మహారాజు.. ఆడది అతగాడి ఇష్టారాజ్యానికి ఆడి పాడే మరబొమ్మగా మారిపోవడం. 


బాల్యం నుంచే బాలికల ఊహలు మహా సునిశితంగా సాగుతుంటాయంటారు.  తన మొద్దు బుర్రకు అందని ఊహల  ఆడదాని చేతిలో ఓటమి  అంటే ఊహూఁ మగవాడికి మరి మండదా! సాటి మగవాళ్లల్లోఎంత నామర్దా!  అందుకే అడ్డదారుల్లో అయినా ఆడదానిని మగవాడు  లొంగదీసుకునేది. కానీ ఆడదాని మనసు ఊరుకుంటుందా? ‘జీవితమనే మాయాజూదంలో మగవాడిదేనా ఎప్పుడూ గెలుపు?/ అంటే ఖాయంగా అది కనిపించని శకుని విసిరే పాచికల ఆటే’ అనుకుంటుంది ప్రముఖ  తమిళ స్త్రీవాద రచయిత్రి ఉమా నారాయణ్ ‘కల్చరల్ డిస్లొకేషన్స్: ఐడెంటిటీసి, ట్రెడిషన్స్ అండ్ థర్డ్ వరల్డ్ ఫెమినిజమ్ ‘ చదివిన తరువాత.


వాస్తవానికి మానవ జీవనకావ్యంలో స్త్రీ పురుషులిద్దరూ  రఘువంశ కర్త కాళిదాసు బాషలో చెప్పాలంటే వాగర్థాలు! ఆదిదంపతులకు మల్లే వాళ్లిద్దరూ చెరో సగంగా సమన్వయంతో నిభాయిస్తే తప్ప జగత్ అనే ఈ మహారథం సక్రమంగా ముందుకు సాగదు!  'న శివేన వినా దేవీ, న దేవ్యాచ వినా శివః' ! అమ్మ లేకపోతే అయ్య లేడు. అయ్య లేని పక్షంలో ‘అమ్మ’ ఉండదు. వేటూరివారి పాటలో ఇంకా వివరంగా చెప్పాలంటే మానవ జీవితం ‘నర నారీ సంగమ మృదంగం/ గంగమ జంగమ సంగీతం’.  ‘ఆమె’ ధరకు జారిన శివగంగ తరంగం.  ఆడది అంటే ఇహ చిన్నచూపు ఎందుకో మగవాడికి?


తరతరాల వెలుగు తాలుపులైనా, తరుగెరుగని ఇలవేలుపులైనా నేల మీదకు కాలు మోపే ముందు ఓ అమ్మ కడుపులోనే  ముందు నునుపు తేలేది! లోకాదర్శ జీవనుడు శ్రీరామచంద్రుడు భూమ్మీదకు  అవతరించింది కౌసల్యామాత గర్భంలో నవ మాసాలు రూపుదిద్దుకున్న తరువాత మాత్రమే! స్త్రీ జన్మ మహిమ రహస్యం ఆ త్రిశంకు  స్వర్గ ద్రష్ట  విశ్వామిత్రుల దృష్టి దాటక పోబట్టే బాలరామయ్యను మేలుకొలుపుతూ సుప్రజా రాముడి కన్న   ముందు ‘కౌసల్య’ మాతను తలుచుకున్నది. అమ్మ కడుపు చల్లంగా ఉన్నంత కాలమే ఏ అయ్యల కలలైనా నిండుగా పండేది. మగాడు ఈ సింపుల్ లాజిక్ మరుగున పెడుతున్నందు  వల్లనే  స్త్రీలోకంలో  ఇంతలా అల్లకల్లోలం.


కోవెల వంటిదీ లోకం అన్నది కోమలి కోమల భావన.  కానీ ‘మగవాడి దృష్టిలో ఆమె తనువుకు మాత్రమే ఓ వెల! తాను కని పెంచిన మగవాడే  తన పాలిట సైతానుగా మారుతున్నందుకు  ఆ మాత  వెత. ఆ కలత వల్లనే నెలతలంతా  'ఏ జన్మకీ స్త్రీ జన్మ నీ కొద్దు నా చిట్టి తల్లీ!' అంటూ అంతలా తల్లడిల్లిపోతున్నది అప్పుడూ.. ఇప్పుడు కూడా! 


భారతీయుల దృష్టిలో ఆడవాళ్లకు ఉండే పూజ్యభావన ఎంత  గొప్పగా ఉంటుందో చెప్పడానికని   ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః’ అంటూ ఎప్పుడూ ఒకే శ్లోకాన్ని వల్లెవేస్తాడు బడుద్ధాయి మగవాడు. వేదాలల్లో స్త్రీని దేవతలుగా చూపించడమూ, విద్య, ధన, ధైర్యాలకు స్త్రీలనే దేవతామూర్తులుగా చిత్రీకరించుకోవడమూ మహా బడాయిగా ఎత్తిచూపిస్తాడు కూడాను. రామాయణంలో రావణాసురుడి కన్న ముందు రాముడిని కష్టాల పాల్చేసింది ఆడవాళ్లే.. కైకేయి, మందర, శూర్పణఖ.. అంటూ  తన చిన్ని బుద్ధికి తోచిన కుతర్కం ప్రదర్శిస్తాడు కూడాను!మరి కాస్త కావ్య శాస్త్రజ్ఞానం వంటబట్టి ఉంటే ప్రబంధాల నుంచి కూడా ఎంచుకున్న పద్యాలతో లెక్చర్లు  దంచికొట్టచ్చు. ‘సుబ్బరంగా చదువుకోవడానికని వచ్చిన పిల్లోడు చంద్రుడిని చెడగొట్టింది  తార అనే  స్త్రీనే కదా! కృష్టుణ్ని అష్టకష్టాల పాల్చేసిన దుష్టజాతిలో పూతన వంటి స్త్రీ జాతి పాత్రా ఎంతో కొంత ఉంది కదా!  ఆడజాతి అంతా పులుకడిగిన ముత్యాలల్లే బిల్డప్పులు ఇస్తే ఎట్లా?  ఏదో ప్రకృతిని చూసి పరవశించిపోదామని వచ్చిన పిచ్చి బ్రాహ్మడు ప్రవరాఖ్యుడిని వరూధిని వశం చేసుకోడానికి అంతలా  వేపుకుని తినాలా? ఆవటా అంటూ  అంటూ- సొంటూ లేని శుంఠ  ప్రశ్నలు లేవదీస్తాడు. జరిగాయో జరగలేదో, జరిగితే ఎంత వరకు నిజంగా నిజాలే  ప్రచారంలోకి వచ్చాయో.. ఇతమిత్థంగా నిర్థారణ కాని కట్టు కథలను పట్టుకుని కొట్టుకు చావడం తప్పించి.. వర్తమానం కట్టెదుట ఆడదానికి అన్ని మతాలలో వాస్తవంగా జరుగుతున్న అన్యాయం గురించి నోరు విప్పడు! 

కామసూత్రాలను శాస్త్రీకరించి బహిరంగంగా  ప్రబోధించినందుకు మహానుభావుడని  మనం  నెత్తికెత్తుకుంటున్న  వాత్సాయనుడు..  ఆయన అదే కామకళల్లో భర్తల పెత్తనాన్ని ఎట్లా భార్యలు చచ్చినట్లు ఒప్పుకుతీరాలో ఉదాహరణలతో సహా నొక్కి చెప్పిన నిజం ఎవరికీ చెప్పరు ఈ మగవాళ్లు. భర్త తినకుండా భార్య తింటే దోషమన్న దుర్మార్గపు సిద్ధాంతం మొదట లేవదీసిన రుషి ఆ మహాశయుడే! దాన ధర్మాల నుంచి ఏ ఇంటి పని (వంట పని తప్పించి) వరకైనా స్వతంత్రించి చేసుకునే హక్కు ఆమెకు చరిత్రలో ఏ దశలోనూ దఖలు పడిందిలేదు . ఒక్క  భర్తనే కాదు భర్త బంధువులను, మిత్రులను, ముఖపరిచయస్తులనయినా సరే ఇంటికి వచ్చినప్పుడు నెత్తిన పెట్టుకు సకల సపర్యలతో ఒప్పించని పక్షంలో ఆమె ఉత్తమమైన ఇల్లాలు కానేరదు కదా.. కొండొకచో శాపతాపాలకూ  గురి అయిన  కథలూ పురాణాలలో బొచ్చెడున్నాయ్. వాటి ప్రస్తావన ఏ మగవాడూ చెయ్యడు. భర్త మోజుపడి మరో వివాహం చేసుకున్నా .. వివాహం కుదరని పక్షంలో ఇంటికే తెచ్చేసుకుంటే ఆ సవతితో సఖ్యంగా ఉండాలి తప్పించి కయ్యానికి కాలుదువ్వే సాహసం ధర్మపత్ని అయినా చేసిన  పక్షంలో పుణ్యస్త్రీ వంటి  బిరుదులన్నీ  వెనక్కి పీక్కోబడతాయని బెదిరింపులు  ఈ తరహా మొగవాళ్ల   నుంచే!

ప్రపంచంలోని అతి పెద్ద మతం క్రైస్తవానికి సైతం స్త్రీ పట్ల బొత్తిగా సదుద్దేశం లేదు. 'స్త్రీ పుట్టుకతోనే పాపి. పాపహేతువు. కేవలం పురుషుడి సుఖ సంతోషాలే ఆ నీచ ప్రాణి  సృష్టి పరమార్థం. స్త్రీని బానిసగా దేవుని వాక్యం భావించిన దానికి ఏ మాత్రం తిసిపోని విధంగా పురుషుడి అన్ని కష్టాలకు మూలకారణం  క్రైస్తవంలో లాగా ఇస్లాం మతమూ గాఢంగా విశ్వసించింది. 


స్త్రీకి బురఖా ఇస్లాం ప్రసాదమే! ప్రార్థనాలయాల ప్రవేశం ఆమెకు నిషిద్ధం. భర్త కోరితే సంగమానికి సిద్ధం కాకపోవడం పాపహేతువు. ఎంత వయసు వచ్చినా భార్యను  శిక్షించే హక్కు భర్తకు ధారాదత్తం చేసింది  ఇస్లాం మతం. భర్త తలాడించకుండా తనకు పుట్టిన బిడ్డకు అయినా సరే పాలిచ్చే అధికారం భార్యకు కల్పించింది కాదీ మతం. విడిపోయినా సరే భర్త అనుమతి తప్పనిసరి అనడం కన్నా ఘోరం ప్రపంచంలో మరొకటి ఉంటుందా? 


ప్రపంచంలోని దాదాపు అన్ని మతాలలో స్త్రీలు వ్యామోహ కారకులు. వారి మీద సదా  ఓ కన్నేసి ఉంచడం పురుషుల  తప్పనిసరి బాధ్యతల్లో ఒకటి. ఆడవాళ్లు దున్నబడే భూములతో సమానం. భూముల మీదుండే హక్కు భుక్కుల నియమాలన్నీ స్త్రీలకీ వర్తిస్తాయి కొన్ని మతాలల్లో. లేబుల్ ఏదైనా, కాలం ఎప్పటిదైనా, ప్రాంతం ఎక్కడిదైనా, వైవిధ్యాలు, వైరుధ్యాలు, అంతర్వైరుధ్యాలు ఎన్ని ఉన్నా  స్త్రీలకు అవ్యాయం  చేసే అంశంలో అన్ని మతాలు అన్నదమ్ముల వలెనే సహకరించుకున్నాయి.. సహకరించుకుంటున్నాయి కూడా!


హోలీ బైబిల్  రెండో ఛాప్టర్ ప్రకారం నిద్ర పోయే మగాడి డొక్కలో నుంచి ఓ పక్కటెముక పీకి  ది గ్రేట్ లార్డ్ గాడ్ సృష్టించబడినది  ఆడజీవి. ఆ తరహా  భావజాలమే మన ముత్తాతలది కూడా. మనువులాంటి మగ మహానుభావులంతా చేరి  'న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి' అంటూ  సిద్ధాంతాలు చేయబట్టే  మగవాడు  ఆ చొప్పదంటు సూత్రాలను పట్టుకుని  తోడు నీడుగా ఉందామని వచ్చే సాటి జీవి ఆడదానిని అన్ని ఆటలు ఆడిస్తున్నది! శేషం వేంకటకవి ‘శశాంక విజయం’లో కోరిక తీర్చమని తన దరి చేరిన గురుపత్ని తారతో ‘వికల చరిత్రు డైన, ముది వెంగలి యైన, గురూపి యైననున్, త్రికరణ శుద్ధిగా మగడె దేవు డటం చని నిశ్చయించి, యొండొక డెటువంటివా డయిన నొప్పదు కోరగ నింతి, కి’ అంటూ చంద్రుడు ద్వారా చెప్పిన నీతి సూక్తులన్న్నీ నిజానికి మగాడి మనసులో యుగాల బట్టి జెండా పాతుకుపోయి ఉన్నవే! ఆడదంటే ఒక్క తనువే అన్నట్లు మనువు  లాంటి దుష్ట మేధావులు ఈ తరహా  ధర్మపన్నాలు పదేపదే వల్లించడ వల్లనే ఆడవాళ్లకు  ఏ దశ లోనూ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు   బొత్తిగా లేకుండా పోయిందన్నది  స్త్రీవాదుల మండిపాటు. 

మరను, యంత్రాన్ని  కనిపెట్టక ముందే ‘మర-మనిషి’ని కనిపెట్టింది ప్రపంచం. మగప్రపంచం కనిపెట్టిన ఆ మర-మనిషి పేరు ఆడది. ఆడదిగా పుట్టినందుకు, చీరె కట్టడం నేర్చిందాకా పుట్టింటికి గొడ్డులా చాకిరీ చేయడం, ఓ మగాడొచ్చి మెడలో పలుపు కట్టగానే  తలొంచుకొని వెళ్లి అతగాడి వంశానికి   జీతం బత్తెం లేని ఊడిగం ఎల్లకాలం చేసుకుంటూ పడివుండటం!' మల్లాది సుబ్బమ్మగారి వంటి  స్త్రీ జనాభ్యుదయవాదులు పద్దాకా తిట్టిపోసేదీ మగవాడిని తమకు పగవాడిగా మారుస్తున్న ఈ తరహా పెడవాదనలను..   ఇప్పటికీ వాటిని గుడ్డిగా నమ్ముతూ  కఠినంగా అమలుచేస్తూ, ముమ్మరంగా ప్రచారం చేసే మూఢమతులను!


'ఎంత రుచి ఆ నిషిద్ధ ఫలానికి/ ఎంత వడి ఆ విముక్త హృదయానికి' అంటారు సినారె  విశ్వంభర ఖండకావ్యంలో నారీ నార సంగమ సుందర దృశ్యాన్ని అభివర్ణిస్తూ! ఇద్దరూ కలసి ఒకే తీరులో  ఆనుభవించే  ఆ సంగమ కార్యపు  తీయని రుచి మగవాడికి  ఒకానొక అనుభూతితో సరి. ఆడదానికి మాత్రం  మంచి.. చెడు..  అనుభవాలన్నీ  అక్కడి నుంచే  మొదలు! గర్భం ధరించింది మొదలు ప్రసవం అయే వరకు కాబోయే అమ్మ పడే యాతనలేమిటో వాయుపురాణం తిరగేస్తే విశదంగా బోధపడుతుంది. ‘గర్భస్య ధారణే విషమే భూమి వర్త్ముని/ తస్య  నిష్క్రమణార్థాయ , మాతృపిండం దదమ్యాహం' (గర్భం ధరించడమే కష్టం. ఎగుడు దిగుడు నేలల మీద నడవడం అందుకు అదనపు కష్టం. ఆ కష్టం కలిగించినందుకు నీ మాతృపిండాన్ని నేను నీకు నమస్కరిస్తున్నాను) అంటూ ఎదిగొచ్చిన తరువాత  సంతానం తమ తల్లుల ముందు తోచిన  విధంగా  మోకరిల్లవచ్చు.  తన బిడ్డ పుట్టుక కోసం యమద్వారం ముందుండే మహాఘోరమైన వైతరణీ నదినైనా తరించేందుకు  సాహసించిన స్త్రీ అప్పట్లో నష్టపోయిన జీవితానుభవాలకు పరిహారం చెల్లించేదెవరూ? 


భావుకతను రేకెత్తించే కవిత్వాలకేం గానీ.. వాస్తవంగా చూస్తే దేశంలోని స్త్రీ పురుష జనాభా నిష్పత్తి లెక్కలే ఆడవారి పట్ల మగజాతి ప్రదర్శించే ద్వంద్వవిలువల  వ్యాపార దృక్పథాలకు వికృత ఉదాహరణలు. పుట్టాలంటేనే 'చావు గండం' నుండీ గట్టెక్కాల్సిన గడ్డు దుస్థితి ఒక్క ఆడ గుడ్డుకే ఈ గడ్డన ఇప్పటికీ! తప్పీ దారీ భూమ్మీద పడ్డా.. తప్పుదారిలో నడిచే మగప్రపంచాన్నుంచి ఎప్పటికప్పుడు తెలివిగా తప్పించుకునే దారులు దేవులాడుకోవడమే తప్పించి నేటికీ ఇంటా బైటా వయసుతో నిమిత్తం లేకుండా ఆడది ఎదుర్కోక తప్పని దైన్యస్థితులు ఎన్నెన్నో! 


తన జీవితాన్ని తనకై  తానుగా అచ్చంగా   మగవాడి హక్కులతో సరిసమానంగా బతికే మంచి రోజులు ఆడదానికి ఎప్పుడు లభిస్తే అప్పుడే ఏటేటా జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు అంతిమ లక్ష్యానికి సార్థకత ! 


- కర్లపాలెం హనుమంతరావు 

( సూర్య దిన పత్రిక సంపాదకీయ పుట వ్యాసం) 

 


Tuesday, February 23, 2021

లియో టాల్ స్టాయ్-కౌంటు బిరుదు ఎలా వచ్చింది?- - సేకరణ :

 

""


 




జార్ ప్రభువుల కాలంలో 'కౌంట్' అనేది ఒక రకమైన రాజగౌరవ చిహ్నం.ఇప్పటి మన మిలటరీ హోదాలాగా. విఖ్యాత చక్రవర్తి పీటర్ కాలంలో టాల్ స్టాయ్ వంశం వారికి అలాంటి 'కౌంటు' బిరుదు దక్కింది.  ఆ బిరుదు వచ్చిన విధానాన్ని గురించి ఒక తమాషా కథ ప్రచారంలో వుంది.

జారు చక్రవర్తిని కలుసుకోవాలని ఒకసారి ఒక ఉన్నత వంశం తాలూకు పెద్దవ్యక్తి(ఆ దేశంలో అటువంటివాళ్లను 'ప్రభువు' అంటారు)వేళకాని వేళలో అంతఃపురానికి వచ్చాడు. ద్వారం దగ్గర కాపలాకాసే సైనికుడు ఆ ప్రభువును అడ్డగించాడు. ఆ ప్రభువుకి ఆ సమయంలో లోనికి ప్రవేశించడానికి అనుమతి లేదు. ఒక మామూలు ద్వారపాలకుడు తనని అడ్డగించడం ఆ ప్రభువుకు ఆగ్రహం తెప్పించింది. "నేనెవరో తెలిసే అడ్డగిస్తున్నావా?" అని గర్జించాడు ఆ ప్రభువు. "చిత్తం. మిమ్మల్ననే కాదు  ఎవర్నైనా సరే.. ఈ సమయంలో లోనికి అనుమంతించడానికి నాకు ఆదేశాలు లేవు. మీరు దయచేసి రేపు తగిన అనుమతితో రండి. తప్పక లోపలికి వెళ్ళవచ్చు" అన్నాడు ద్వారపాలకుడు వినయంగానే. ఐనా ఆ ప్రభువుకి ఇది ధిక్కారంలాగే అనిపించింది. "నీ అహంకారానికి బహుమానమేమిటో తెలిసే అలా మాట్లాడుతున్నావా?" అని హూంకరించాడు. ద్వారపాలకుడినుంచి మౌనమే సమాధానం.

ప్రభువుకి కోపం కట్టలు తెగింది. చేతిలోని కొరడాతో ఆ సైనికుడిని వళ్ళంతా రక్తాలు కారేటట్లు కొట్టటం మొదలు పెట్టాడు.

నొప్పులన్నీ మౌనంగా భరింస్తున్నాడే కానీ ఎదురు తిరగలేదు.అలా అని  దొరను లోపలికి అనుమతించనూ లేదు ఆ సైనికుడు.

అదే సమయంలో పీటర్ మహారాజు అటుగా వస్తూ ఈ దృశ్యం చూశాడు. ఏం జరుగుతుందో ముందు అర్థం కాలేదు. తెలిసిన తరువాత అంతులేని ఆశ్చర్యం ఆగ్రహం కలిగాయి. ద్వారపాలకుడితో "ఆ ప్రభువు నిన్ను అలా గొడ్డులా మోదుతుంటే ఒక సైనికుడివి అయి వుండీ  మౌనంగా భరిస్తావా! ఇదిగో కొరడా.. ఇప్పుడు నీ ప్రతీకారం యథేచ్చగా  తీర్చుకోవచ్చు" అని కొరడా అందించాడు.

ఆ మాటకు ప్రభువు అభ్యంతరం చెప్పాడు "మహారాజావారు విడ్డూరంగా మాట్లాడుతున్నారు. అతనొక తుచ్చ సైనికుడు. నేనేమో ప్రభువును. ఎలా దండిస్తాడు?"

"అదే అభ్యంతరమైతే నేనతన్ని ఈ క్షణమే జనరల్ చేస్తున్నాను" అన్నాడు పీటర్.

"జార్ చక్రవర్తులు క్షమించాలి. ఒక గొప్ప వంశస్థుడ్ని ఒక క్షుద్ర సేద్యగాడు శిక్షించడం మన సంప్రదాయం ఏమాత్రం ఒప్పుకోదు" అన్నాడు మళ్ళీ పెడసరంగా.

పీటరు చక్రవర్తికి అతని దుష్ప్రవర్తన సహించరానంతటి క్రోధం తెప్పించింది.

"ఈ ద్వారపాలకుడికీ తక్షణమే 'కౌంట్' బిరుదు ప్రసాదిస్తున్నాను. నా పాలనలో కౌంటులు ఆత్మగౌరవం లేనివారిగా ప్రవర్తించడం నాకు అవమానం" అని ఉరిమి చూసాడు ద్వారపాలకుని వైపు.

అంతే.. రాజుగారి సమక్షంలోనే రాజావారి కొరడాతోనే రాజగౌరవం నిలబడేటట్లు కొత్త కౌంటు ఆ ప్రభువుని మళ్ళీ లేవలేని విధంగా  దండించి వదిలిపెట్టాడు.

మర్నాడే ఆ కౌంటుకు 'జనరల్' పదవి కూడా  ఇస్తున్నట్లు ప్రకటన వెలువడింది.

'కౌంట్' బిరుదూ రాజుగారి స్వహాస్తాలతో ప్రసాదించబడింది.

'వార్ అండ్ పీస్' లాంటి ఎన్నీ అత్యున్నమైన మానవతావాదాన్ని బలపరిచే రచనలు చేసిన గొప్ప రచయిత  లియో టాల్ స్టాయ్ కి కౌంట్ బిరుదు  అలా వారసత్వంగా వచ్చిందే.

అలాంటి రాజచిహ్నాలు ప్రజాస్వామ్యవాది అయిన టాల్ స్టాయికి ఇష్టముం
డేవి కాదు. వాటిని తొలగించుకోవడాని  తరువాత చాలా తంటాలు పడ్డాడనుకోండి..అది వేరే కథ

***

 సేకరణః కర్లపాలెం హనుమంతరావు

Friday, November 8, 2013

Saturday, February 13, 2021

చలంగారి వేదాంతం- పిట్ట కథ - కర్లపాలెం హనుమంతరావు

 



గురు శిష్యుల మధ్య అద్వైత సిద్ధాంతాన్ని గురించి గంభీరమయిన చర్చ జరుగుతున్నది. 
ఓ రాజు గారు అ సమయంలోనే ఏనుగు మీద ఊరేగుతూ అటుగా వెళుతున్నారు.
"ఏమిటండీ అది?" అని ఎప్పట్లానే అడిగాడు శిష్యుడు .
"కనబడటంలేదుటరా...రాజు గారు ఏనుగు మీద ఊరేగుతున్నారు ." అన్నారు  గురువు గారు .
రాజు గారంటే ఎవరండీ? ఏనుగు అంటే ఏమిటండీ ?" అని అడిగాడు శిష్యుడు.
"పయిన వున్నది రాజు ...క్రింద వున్నది ఏనుగురా మూర్ఖుడా!" అన్నారు గురువుగారు చిరాకుగా.
"పయిన అంటే ఏమిటండీ ?...క్రింద అంటే ఏమిటండీ?" అని మళ్ళీ శిష్యుడు సందేహం.
గురువు గారికి వళ్ళు మండి అమాంతం ఎగిరి శిష్యుడి భుజాలమీద కెక్కి కూర్చుని"నేను ఉన్నది పైనా, నువ్వు వున్నది క్రిందా ...అర్ధమయిందా?" అనడిగారు.
శిష్యుడు తొణకలేదు. "నేను అంటే ఏమిటండీ?..మీరు అంటే ఏమిటండీ?" అని అడిగాడు .
గురువు గారు గభాలున క్రిందకు దిగి శిష్యుడి కాళ్ళు పట్టుకున్నాడు "పైన వున్నది నువ్వూ..క్రింద వున్నది నేనురా " అన్నాడు.
"అర్ధమయింది "  అన్నాడు శిష్యుడు .
ఇంతకీ పాఠం నేర్చుకున్నది శిష్యుడా? గురువా?
(భగవద్గీత కు ముందు మాటలో చలం గారు రాసుకున్నది) 

-కర్లపాలెం హానుమంతరావు 
బోథెల్, యూఎస్ ఎ
 
*****


Friday, February 12, 2021

ధూర్తమానవా శతకము- కీ.శే త్రిపురనేని రామస్వామి చౌదరి - కర్లపాలెం హనుమంతరావు



దేవుడి పేరు చెప్పి తోచిన పిచ్చి కూతలు కూసుకుంటూ అమాయకులైన లోకులను భక్తి భావన  వంకన భయభ్రాంతులను చేసి స్వార్థ లాభం కోసం నిలువుదోపిడీ చేసే దుష్టబుద్ధుల మీద కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి 'ధూర్తమానవా శతకము'  పేరుతో కొంత పద్య రచన చేసారు. ఈ పద్యాలలోని అన్ని భావాలలో ఎక్కడా అతిశయోక్తి మచ్చుకైనా కనిపించదు. నిర్మలమైన మనసుతో తమ తమ జీవికలను నడుపుకునే లౌకికులను నిందించడమూ కనిపించదు. లేని దేవుడిని ఉన్నాడని బుకాయించే పెడసర బుద్ధిగల గడసరి మనుషులపై ఆ 'దేవుడి' చేతనే దుడ్డుకర్ర తిరగేయించిన ఈ శతకంలోని పద్యాలు సులభ శైలిలో చదవగానే అర్థమయే రీతిలోనే ధారగా సాగడం విశేషం. పద్యాలు చదువుతున్నప్పుడు కపట జీవుల పట్ల దేవుడు  విసిరే విసుర్లు భక్తిభావం మెండుగా కలవారికీ నవ్వు తెప్పిస్తాయి. కారణం.. దేవుడు ఈ పద్యాలలో గద్దించిన  దుర్మార్గపు జాతిలో వాళ్లు ఒక భాగంగా లేకపోవడం!

సచ్చీలవంతులు ఎవరినీ ఇంచుకైనా నొప్పించని విధంగా కవిరాజు ఈ పద్యాలు అల్లిన విధానం హర్షింపదగినది. ఆలోచించదగినది. అన్ని పద్యాలు విస్తరణ భీతి చేత ఇవ్వడం కుదరక.. కొన్ని పద్యాలు మాత్రమే ఉదాహరణ కింద కింద ఇస్తున్నాను. చదివి ఎంజాయ్ చెయ్యండి. నచ్చితే మిత్రులతో నిశ్చింతగా పంచుకోండి!

-కర్లపాలెం హనుమంతరావు

12 -02 -2020


 

ఏ నొకజాతికూడు భుజి-యించుచు మిక్కిలి తక్కుజాతులన్‌

హీనముగాగఁ జూతునని-యెవ్వరు సెప్పిరి నీకు వంచకా!

మానవు లందఱున్‌ సరిస-మానులు గారొకొనాకు? మాయురే!

మానక నీవ యిట్టి యవ-మానముఁ జేతువె ధూర్తమానవా!

***

త్వరపడకుండ సంజపడు-దాఁకను తప్పుపనుల్‌ పొనర్చి పై

బొరుగున నున్న తోఁటలను-బూవులు మ్రుచ్చిలి కోసి తెచ్చి నా

శిరమునఁ బోసినంతటనె-చేసిన పాపము లొక్కసారిగా

మఱచెడునట్టి వెంగలినె-మానక యిట్టివి ధూర్తమానవా!

***

మరణపు శయ్యమీఁద నొక-మారయినన్‌ నను దప్పకుండ సం

స్మరణము చేసినంతటనె-స్వర్గము వచ్చునటందు, వేగతిన్‌

బొరయును? నిట్లె నీ వెపుడు-బొంకుచునుందువు దీనికై నినున్‌

గఱకఱ గొంతు కోసెదను-కానివి చెప్పకు ధూర్తమానవా!

***

బొచ్చు నొసంగి యెట్లు పరి-పూర్ణమనోరథసిద్ధిఁ బొందగా

వచ్చును? బిచ్చివాఁడనని-భావమునం దలపోయుచుంటివా?

పుచ్చును నీదు పాపములు-పోరచి మానుము యిట్టి వానినిన్‌;

బొచ్చెము లిట్లుచెప్పి ప్రజ-మోసము చేయకు ధూర్తమానవా!

***

బిడ్డలకోసరమ్ము విల-పించెడి యా జవరాండ్రతోడుతన్‌

బిడ్డలు తప్పకుండఁ బ్రభ-వించెదరంచు సమాదరంబునన్‌

గడ్డముపట్టి "గర్భగుడి"-గర్భముఁ జేర్చుదువట్టెరేల నో

వెడ్డరి! నాకు మంచి పని-వెట్టితి వింతకు ధూర్తమానవా!

***

వాజను మానకున్న నప-వాదులు; తప్పవు శృంగభంగముల్‌;

రోజులు నీకుఁ జాల విసి-రో! జులుమింతకు మానకున్నచోఁ

బాజివియౌదు వీవు నగు-బాటు ఘటిల్లును; నింక మీఁద నీ

పోజును జూచి మోసపడి-పోవుట గల్గదు ధూర్తమానవా!

(ధూర్తమానవా శతకము- కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి)

Saturday, February 6, 2021

ఆవుల సాంబశివరావుగారి అభిమాన సాహిత్యం గురించి.. కొద్దిగా! - కర్లపాలెం హనుమంతరావు

 




 

పది సంవత్సరాల వయసులో బుద్ధుని చరిత్ర క్లాసు పుస్తకంలో కేవలం పాఠం లాగా మాత్రమే కనిపించినా ప్రముఖ హేతువాది ఆవుల సాంబశివరావుగారి జీవన శైలి మీద పుస్తక పఠనం ప్రభావం చూపించడానికి ఆ తరగతి పాఠమే నాందీ పలికింది. ఒకానొక పత్రికకు వ్యాసం రాస్తూ తన జీవితాన్ని ప్రభావితం చేసిన మహామహులను ఆయన ఒక వరసలో తలుచుకున్నారు. వేమన, తెలుగుభాష తీపిదనం మరిగిన తరువాత వరస పెట్టి వదలకుండా చదివిన మంచి పుస్తకాలలో మరీ మంచివి అంటూ ..పోతన భాగవతం, భారతం, ఆముక్తమాల్యద, వసుచరిత్రలను అయనే స్వయంగా ఎంచి చూపించారు. అవ్యక్తమైన మానసిక స్వేచ్ఛ కోసమై తపించే కృష్టశాస్త్రి  కృష్ణపక్షం తన భావసరళిని తీవ్రం చేసిందని చెబుతూనే.. తనలో హేతువాద బీజాలను నాటిన  మహిమాన్వితుల పుస్తకాలను తలుచుకున్నారు. త్రిపురనేని రామస్వామిగారి కురుక్షేత్రం, సూతపురాణం, పలుకుబడి గలిగిన నమ్మకాలను ఎట్లా నిలదీస్తుందో అర్థం చెసుకున్నట్లు చెప్పుకొచ్చారు.  విషయం పురాతనమైనదైనా సరే స్వతంత్ర బుద్ధితో ఆలోచించవలసిన అవసరాన్ని నొక్కిచెప్పే వీరేశలింగంగారి రచనలు యావత్తూ చదివినట్లు చెప్పుకొచ్చారు. దురాచారాలు మనుషులను మానసికంగా ఎంతలా బలహీనపరుస్తాయో తెలుసుకునేందుకు గాను గురజాడ అప్పారావుగారి కన్యాశుల్కం  దొహదం చేస్తుందన్న  విషయం విపులంగా  వివరించుకొచ్చారు. ఒక పక్క చలం, మరో పక్క శ్రీ శ్రీ .. ఒకరు స్త్రీని గురించి, మరొకరుఉ దేశాన్ని గురించి ఎంత నూతనంగా ఆలోచించవలసిన అగత్యం ఉన్నదో కొత్త కొత్త కోణాలలో వివరిస్తుంటే ఉత్తేజితమయిపోయేటంతగా వారి భావజాలంతో మమేకమయినట్లు సాంబశివరావుగారు వివరించారు. ఉన్నవ లక్ష్మీనారయణగారి మాలపల్లితో తన సాంఘిక దృష్టి కోణం దిశ మారిందని స్వయంగా ఒప్పుకున్నారు ఆ లోకాయుక్త. మార్క్స్  ఎంగెల్స్ తో కలసి రాసిన దాస్ కాపిటల్, కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టో,  ముందే చదివేసి ఉడటం వల్ల

 హెగెల్స్, కాంటు రచనలు చదివి జీర్ణించుకోవడం సులభమైందన్నది సాంబశివరావుగారి భావన. కొత్తగా అబ్బిన బావుకత వల్ల పరిణతి చెందిన మనసుతో రష్యన్ విప్లవ పాఠాల సారాంశం సరైన మోతాదులోనే వంట పట్టినట్లు చెప్పుకొన్నారు . పదహారు, పదిహేడు శతాబ్దాలలో ఇంగ్లండులో జరిగిన పారిశ్రామిక విప్లవం ప్రజాస్వామిక విప్లవానికి ఎట్లా మార్గదర్శకం అయిందో అవగాహన చేసుకునే పాటి విశ్లేషణాత్మక బుద్ధి, అమెరికన్ స్వాతంత్ర్య యుద్ధం,   ప్రజల హక్కుల కోసం .. స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం  ఫ్రెంచి విప్లవం, ఎట్లా సర్వం తెగించి పోరుకు దిగిందో తెలుసుకునే పాటి అవగాహన, థామస్ జఫర్ సన్, రూసో మొదలైన రచయితలు, భావుకులు ఆయా సంఘటనలలో ఎట్లా వైతాళిక పాత్ర పోషించారో ఆ వాతావరణం అంతా మనసుకు ఎక్కించుకునే పాటి బుర్రా బుద్ధీ పెరగడానికి ఎన్నో ఉద్గ్రంథాలు ఎట్లా ఉపకరిస్తూ వచ్చాయో..  ఒక చిరు వ్యాసంలో  స్మృతి రూపంలో వివరించారు. ఏ ఉద్యమంలోనూ ఆర్థిక సమానత్వం  ఎజండా కాకపోవడం ఆవులవారి సునిశిత దృష్టి నుంచి జారిపోకపోవడం  విశేషం.. ఆయన ఉద్దేశంలో ఆర్థిక సమానత్వం భవిష్యత్తులో రాబోయే ప్రగతిశీల ఉద్యమాలకు ఉత్ప్రేరకం మాత్రమే. ఇరవయ్యో శతాబ్ద్దంలో జరిగిన రష్యన్ విప్లవమే సాంఘిక వ్యవస్థను, అందులోని ఆర్థిక ప్రాతిపదికను సమూలంగా మార్చేందుకు ఉపయోగపడిన మొదటి ఉద్యమంగా సాంబశివరావుగారు భావిస్తారు. మార్క్స్ కు  లెనిన్ రాసిన భాష్యం ఈ క్రియానుగతమైన మానవోద్యమాలన్నిటికి  అద్దంపట్టినట్లు ఆవులవారి అభిప్రాయపడుతున్నారు. వీటిని మనసు పెట్టి చదివిన విజ్ఞుడు మానవ స్వేచ్ఛాప్రియత్వానికి, ఆ తరహా స్వేచ్ఛకు ఆర్థిక సౌలభ్యం ప్రధాన భావమవుతుందన్న మూల వాస్తవం తెలుసుకుంటాడన్నది లోకాయుక్త పదవి సమర్థవంతంగా నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన ఆవుల సాంబశివరావుగారు ముక్తాయింపు.

 అప్పటి వరకు సంపన్నుల, సమాజంలో ఉన్నత తరగతుల వారి వ్యవహారంగా సాగుతూ వచ్చిన భారత స్వాతంత్రోద్యమం గాంధీజీ రాకతో ఒక్కసారి దేశప్రజలందరి ఉద్యమంగా స్వరూపం మార్చుకున్న విషయం ఆవులవారి దృష్టిని దాటిపోలేదు. సామాన్య ప్రజల హృదయాలలో కూడా స్వాతంత్ర్య పిపాసను బాపూజీ ఎట్లా రేకెత్తించగలిగారో వెలూరి శివరామ శాస్త్రిగారు బాపూజీ ఆత్మకథను అతిచక్కని సరళ శైలిలో చేసిన అనువాదం చదివి తాను అర్థం చేసుకున్నట్లు సాంబశివరావుగారు చెప్పుకొచ్చారు. గాంధీజీ నిర్మలమైన వ్యక్తిత్వం  సామాన్యుడికైనా అవగాహన అయే తీరులో రాసిన పుస్తకం అది అని ఆవులవారి ఆలోచన. మహాత్ముల జీవితాల పట్ల భక్తి విశ్వాసాలు ఉండే సామాన్య ప్రజకు బాపూజీని మాహాత్మునిగా మలిచి చూపించిన అనువాదం అని ఆవులవారి ఉద్దేశపడ్డారు. ఆసేతు హిమాచల పర్యంతం జన హృదయం మీద బాపూజీ ఎట్లా పీఠం వేసుకు కూర్చున్నారో ఆ పుస్తకం చదివితే తెల్సుస్తుందని ఆయనే ఒకానొక సందర్భంలో ప్రసంగవసాత్తూ చెప్పుకొచ్చిన మాట.. వేలూరివారి పత్రికా రచనలోని పదును పాఠకుల మనసుల్లోకి సూటిగావెళ్లే విధంగా ఉంటుందంటారు ఆవులవారు. స్వాతంత్రోద్యమంలో పాలుపంచుకోకుండా ఉండుంటే జవహర్ లాల్ నెహ్రూ  ఒక గొప్ప ప్రపంచ స్థాయి రచయిత అయివుండేవారని ఆవులవరి ఆలోచన. అంతగా ఆయన రాసిన 'గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ'ని సాంబశివరావుగారు మధించారన్నమాట!

చరిత్రకు , మానవ చరిత్రకు  నూతన దృక్పథాన్ని ఎత్తి చూపెట్టిన 'ఆర్నాల్డ్ టైన్స్' చరిత్ర అంటే కేవలం ఒక పెద్ద కథ కాదని, మానవ సమాజ గమన వివరంగా తెలియపరిచే సమాచార సాహిత్యమన్న  ఆవులవారి మాట ఆలోచించదగ్గది. చరిత్రను కొత్త కోణం నుంచి చూడటం తనకు నేర్పిన ఆ పుస్తకాన్ని గురించి ఆవులవారు సందర్భం వచ్చిన ప్రత్తీసారీ ప్రశంసించకుండా ఉండలేకపోయారు.  ఏ ఏ ఘట్టాలు మనిషిని ప్రభావితం చేస్తూ వచ్చాయో, సమాజ గమనాన్ని మలుపు తిప్పుతూ వచ్చాయో  ఆ పుస్తకం చదివిన తరువాత తాను మరింత పరిణత దృష్టితో చూడడానికి అలవాటు పడ్డారో సాంబశివరావుగారు చెప్పుకొచ్చిన తీరు ప్రశంసనీయం. నెహ్రూజీ ఆత్మకథకూ  ఆయన హృదయంలో గొప్ప స్థానమే ఉంది. అది కేవలం ఒక నాయకుడి జీవిత చిత్రణ మాత్రమే కాకుండా, ఒక మధుర కావ్యం కూడా ఆవులవారి  దృష్టిలో.

సంపదల మధ్య పుట్టినా సున్నితమైన హృదయం, సునిశిత మేధో సంపద, సత్యాన్ని తెలుసుకోవాలన్న జ్ఞానతృష్ణ, నమ్మిన సత్యాన్ని ధైర్యంగా నిర్భయంగా ప్రకటించే సత్యనిష్ఠ -మనిషిని ఎట్లా మహామనీషిగా మలిచెందుకు దోహదపడతాయో తెలుసుకోవాలంటే  నిరాద్ చౌదరిగారి 'ఆటోబయోగ్రఫీ ఆఫ్ యాన్ అన్నోన్ ఇండియన్', యం.సి. చాగ్లాగారి 'రోసెస్ ఇన్ డిసెంబర్', లాంటి పుస్తకాలు చదవాలంటారు  ఆవుల. నిరాద్ చౌదరిగారి కథ భారతదేశాన్ని, భారతీయ జీవితాన్ని గురించి తనలో పలు ఆలోచనలు రేకెత్తించిందని  ఆవులవారి ఉవాచ. చాగ్లాగారి ఆత్మకథయితే ఆనాటి దేశపరిస్థితులకు.. ముఖ్యంగా హిందూ ముస్లిముల మధ్య గల సహృదయతకు, న్యాయ, పరిపాలనా వ్యవస్థలకు ఒక దర్పణం వంటిదని ఆయన అభిప్రాయం. చదివినవారిని ఎవరినైనా సరే తప్ప ఆలోచనల్లో పడవేయకుండా ఉండనీయని గొప్ప స్ఫూర్తిదాయకమైన సాహిత్యంగా  ఆయన కితాబిచ్చిన పుస్తకాలు ఇంగర్ సాల్, బెర్ట్రెండ్ రస్సెల్, వంటి తాత్వికుల పెద్ద రచనల జాబితా!  విశ్వరహస్యాలను, మానవ ప్రకృతిని మౌలికంగా పరిశీలించిన గ్రంథాలు, మనిషిని ప్రధాన వస్తువుగా స్వీకరించిన పుస్తకాలు, తన జీవితానికి తానే కర్త, భర్త అని వాదించే  రచనలు, మానవోన్నతికి భగవంతుని జోక్యం అవసరం లేదని , అసలు అడ్డుగా కూడా దైవభావనలు నిలబడకూడదని, మనిషి పురోగతికైనా, తిరోగతికైనా మనిషే పూర్తి బాధ్యుడని బోధించే రచనలు ఏవైనా సరే ఆవులవారు అమిత ఇష్టంగా చదివి వాటిలోని సారాన్ని వడగట్టి జీవితానికి అన్వయించుకుంటారని అర్థమవుతుంది. ఆ కారణం చేతనే ఆయనకు మానవేంద్ర నాధ్ రాయ్ రచనలు ప్రాణమయ్యాయి.  మౌలికమైన అంశాలనైనా విప్లవాత్మక కోణంలో భావుకత చెదరకుండా సాగిన సాహిత్య ఆవులవారి వ్యక్తిత్వం పై చూపించిన ప్రభావం ఏ కొలతలకూ అందనిది. 

ఆణిముత్యాల వంటి రచనలను జాతికి అందించిన మహామేధావి మానవేంద్రుడన్నది ఆవులవారి ఆలోచన. తాత్విక, రాజకీయ, సాంఘిక, ఆర్థిక సమస్యలన్నింటినీ మునుపెన్నడూ ఎరుగని కొత్త కోణంలో తాత్వికుడు ఎం.ఎన్. రాయ్ నిర్వచించిన పుస్తకాలత గాఢమైన పరిచయం ఏర్పడిన తరువాత ఆవులవారిలోని అసలు మానవతావాదికి నూతన రూపం ఏర్పడడం ఆరంభమయిందనేది ఒక సాధారణ భావన. మానవుడు సమాజంలోని అంతర్భాగమే అయినప్పటికి.. ఆ విశిష్ట జీవి స్వేచ్ఛను, శ్రేయస్సును  కాపాడని పక్షంలో సమాజ నిర్మాణం పరిపూర్ణం కాదన్న ఎమ్.ఎన్.రాయ్ నవ్య మానవవాదం ఆవులవారికి మనసుకు హత్తుకున్నది. అటు వ్యక్తి స్వేచ్ఛకు, ఇటు సాంఘిక శ్రేయస్సుకు సమన్వయం  చేకూర్చే  మానవేంద్ర నాధ రాయ్ బావ సరళితో ఆవులవారు పుర్తిగా మమేకమైనప్పటి బట్టి తెలుగువారికి ఒక లోకాయుక్త లౌకిక పరమైన ఆస్తి కింద సమకూరినట్లయింది.

 రాయ్ రచనలు తన మీద చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదని  సాంబశివరావుగారే  స్వయంగా అనేక సందర్భాలలో తన మనోభావాలను స్పష్టంగా బైటపెట్టిన తరువాత ఆ ఆధ్యాత్మిక  మార్గాన్ని గురించి మీమాంసలకు దిగడంలో అర్థం లేదు. తన లోని హేతువాదికి, బౌతికవాదికి  పురోగమన దృష్టిని కల్పించిందీ ఎమ్,ఎన్.రాయ్ తరహాలో 'సేన్ సొసైటీ' కర్త ఎరిక్ ఫ్రామ్ ది కూడా అని ఆవుల సాంబశివరావుగారు చెప్పుకొచ్చారు. ఎంచుకున్న అంశం ఏదైనా, స్వతంత్ర బుద్ధితో సామాజిక వ్యవస్థ తీరుతెన్నులను సునిశితంగా పరిశీలించడం 'ఫ్రామ్' పుస్తకాల అధ్యయనం వల్ల కలిగిన లాభం అన్నది  ఆవులవారి అభిప్రాయం.

నోబెల్ పురస్కారం అందుకున్న ఆర్థిక శాస్త్రవేత్త మిరడాల్ ప్రసిద్ధ గ్రంథం 'ఏసియన్ డ్రామా' ఆసక్తితో చదివి ప్రాచ్యదేశాల లోతైన ఆలోచనలను అర్థం చేసుకున్నానన్న చెప్పిన ఆవుల సాంబశివరావు గారి అధ్యయన శైలి పరిశీలిస్తే .. ఆ మహామనవతావాది  పఠన పర్వం ప్రాచ్యుల వేదాల దగ్గరే ఆగిపోకుండా,  తాత్వికుల ఉపనిషత్తులు, అస్తిక షడ్దర్శనాల దాకా సాగినట్లు అర్థమవుతోంది.

 పురోగమనం, జీవం.. చేవ గలిగిన మనిషి  అచరించకుండా వదలించుకోకూడని సృజన వ్యాపారాలు- హేతువాదం, మానవతావాదం అన్నది ఆవుల వారి ధృఢాబిప్రాయంగా గుర్తిస్తే .. ఆ విధమైన మావవతావాదం ఆయనలో రగులకొల్పింది ఆరంభంలో వైవిధ్య భరితమైన వివిధ రంగాలకు చెందిన ప్రపంచ సాహిత్యం అన్న వాస్తవం మనకు అర్థమవుతుంది.  

- కర్లపాలెం హనుమంతరావు

21, నవంబర్, 2020.

(నవభావన -  జీవవాహిని శారద -  పుటలు 46 -  55 -ఆధారంగా)

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...