Showing posts with label miscellaneous. Show all posts
Showing posts with label miscellaneous. Show all posts

Tuesday, December 14, 2021

గల్పిక - ఈనాడు ఆచార్యదేవోభవ! నేడు ఉపాధ్యాయ దినోత్సవం - రచన: కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు- ప్రచురితం - o5-o9-2009)

గల్పిక - ఈనాడు 


ఆచార్యదేవోభవ! 

 నేడు ఉపాధ్యాయ దినోత్సవం

- రచన: కర్లపాలెం హనుమంతరావు

 ( ఈనాడు- ప్రచురితం - o5-o9-2009)



' గురువూ, దేవుడూ ఒకేసారి కనిపిస్తే ముందు నేను గురువుకే నమస్కారం చేస్తాను. దేవుడిని నాకు ముందు చూపించినవాడు గురువే కదా!' అంటాడు షిర్డీ సాయిబాబా.  

యుద్ధరంగం మధ్య విషాదయోగంలోపడ్డ అర్జునుడికి 'సుఖదుఃఖే సమైకృత్వా' అంటూ గీతోపదేశం చేసిన శ్రీకృష్ణుడిని మనం 'జగద్గురువు'గా భావిస్తాం. అద్వైతబోధ చేసిన ఆదిశంకరులు మరో జగద్గురువు. రాయికి రూపం ఇచ్చేవాడు శిల్పి. శిష్యుడికి రూపం తెచ్చేవాడు గురువు. 'గు' అంటే చీకటి, 'రు' అంటే పోగొట్టేది. అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేవాడు గురువే కనకే, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తరవాత పూజనీయుడవుతున్నాడు. గురువును పరబ్రహ్మ స్వరూపంగా సంభావించే సంప్రదాయం మనది. 

అధర్వణ వేదంలోని శిష్టాచార సంప్రదాయం ప్రకారం- చదువుకు కూర్చునే ముందు శిష్యుడు ఇష్టదేవతా ప్రార్థన తరవాత 'స్వస్తినో బృహస్పతిర్దదాతు' అంటూ గురువును స్మరించే విధానం ఉంది. మహాభారతం అరణ్యపర్వంలో యక్షుడు 'మనిషి మనీషి ఎలాగవుతాడు?' అనడిగినప్పుడు- 'అధ్యయనం వలన... గురువుద్వారా' అని సమాధానం చెబుతాడు ధర్మరాజు.  అందరూ ప్రణామాలు చేసే ఆ శ్రీరామచంద్రుడు కూడా విశ్వామిత్రుడి ముందు చేతులు జోడించి నిలబడి ఉండేవాడు. సమాజంలో గురుస్థానం అంతటి ఘనమైనది కనకనే శ్రీకృష్ణుడు చదువుచెప్పిన సాందీపునికోసం అతని మృతశిశువును తిరిగి తెచ్చేందుకు అంత లావు శ్రమ తీసుకున్నది!.

 గురువును గౌరవించటం రానివారు జీవితంలో రాణించలేరనటానికి కౌరవులే ప్రబల  తార్కాణం.చిన్నతనంలో విద్యాబుద్ధులు చెప్పిన గురువును ఔరంగజేబుకూడా చక్రవర్తి అయిన తరవాత దారుణంగా అవమానించాడు. 

క్రీస్తు పుట్టుకకు మూడు శతాబ్దాల ముందే మహామేధావి అరిస్టాటిల్‌ ఏథెన్స్‌లో ఒక పెద్ద విశ్వవిద్యాలయన్నే స్థాపించి అలెగ్జాండర్‌లాంటి విశ్వవిజేతను తయారుచేశాడు. అదేదారిలో చంద్రగుప్తుడిని తీర్చిదిద్దిన మహాగురువు మన కౌటిల్యుడు.  కృష్ణదేవరాయలుకు తిమ్మరుసు మామూలు మంత్రేకాదు, గురువు కూడా. మనిషి భూమిమీద పడిననాడే బడిలోపడినట్లు లెక్క. ఇంటివరకూ తల్లే ఆది గురువు. తల్లితండ్రులు ప్రేమపాశంచేత కఠిన శిక్షణనీయలేరు గనక గురువు అవసరం కలిగింది. గురుకుల సంప్రదాయంలో మహారాజు కుమారుడైనా కౌమారదశలో గురుకుల విద్యాభ్యాసం చేయవలసిందే! మహాచక్రవర్తి అయిన హిరణ్యకశిపుడు కూడా చెక్కిట పాలుగారే ప్రహ్లాదుడిని మంచి విద్యాబుద్ధులు నేర్పించమని చండామార్కులవారికి అప్పగించాడు.  పాటలీపుత్రాన్ని ఏలే సుదర్శనుడు తన బిడ్డలు విద్యాగంధంలేక అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉన్నారనే గదా వారిని విష్ణుశర్మ అనే పండితుడి వద్దకు విద్య నేర్చుకోవటానికి సాగనంపింది! నాటి చదువులు నేటి విద్యలంత సుకుమారంగా ఉండేవికావు. వేదాధ్యయనం తరవాత పరీక్షలు మరింత కఠినంగా ఉండేవి. నింబ, సారసమనే రెండు పరీక్షలు మరీ సంక్లిష్టం. సామవేదం సంగీతమయం. తలూపకుండా వల్లించటం తలకు మించిన పని. బోడిగుండుమీద నిమ్మకాయ పెట్టుకుని అది దొర్లకుండా వల్లింపు పూర్తిచేస్తేనే పరీక్ష అయినట్లు, అది నింబ పరీక్ష. మెడకు రెండువైపులా సూదులుతేలిన నారసంచుల్ని కట్టి సామగానం చేయమనేవాడు గురువు. తల కదిలితే సూదులు నేరుగా గొంతులో దిగుతాయి! అది నారస పరీక్ష. గురువు మాట వేదవాక్కుగా సాగిన కాలం అది.

మన పురాణాలు, ఉపనిషత్తులు, చరిత్రల్లోనే కాదు- ప్రపంచవ్యాప్తంగా కూడా గురుప్రసక్తి లేని, గురుప్రశస్తి చేయని సంస్కృతులే లేవు. జార్జి చక్రవర్తి తన కొడుకు 'ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌' చదివే పాఠశాలకు వెళ్ళి కొడుకు ఎలా చదువుతున్నాడో చూడాలని ఉబలాటపడ్డాడు ఒకసారి. చక్రవర్తి వస్తున్నాడని తెలిసి ఆ పాఠాలు చెప్పే పంతులుగారు 'మహాప్రభో! మీరు రావద్ద'ని కబురు చేశాడు. 'ఎందుకయ్యా?' అనడిగితే 'తమరు వస్తే నేను మర్యాదపూర్వకంగా నా తలపాగా తీసి, లేచి నిలబడాలి. ఇంతవరకూ నా విద్యార్థుల దృష్టిలో నేనే పెద్దను. నాకంటే పైన మీరొకరున్నారని తెలిసిపోతే, నా మాట విలువ తగ్గిపోతుంది. అది వారి భవిష్యత్తుకు మంచిది కాదు!' అని విన్నవించుకున్నాట్ట. రాజుగారు మన్నించి అటువైపు వెళ్లటం మానుకున్నారు. అదీ ఆ రోజుల్లో గురువుకిచ్చిన విలువ!

దేవతలకూ గురువున్నాడు బృహస్పతి. రాక్షసులకు శుక్రాచార్యుడు గురువు. మృతసంజీవనీ విద్య అతనికొక్కనికే తెలుసు. కచుడు ఆ తంత్రం తెలుసుకునేందుకే శిష్యరికం చేయటానికి వచ్చి చచ్చి బతికిన కథ మనకు తెలుసు. 'ద్రోణ' పేరుతో గురువులకు ఇవాళ బిరుదులిస్తున్నారు. ఆ ద్రోణాచార్యుడి దగ్గర విలువిద్య నేర్చుకోవాలని తంటాలుపడి భంగపడినా ఆయన పిండి విగ్రహం ముందు పెట్టుకుంటేగాని ఏకలవ్యుడికి ఆ శాస్త్రరహస్యం పట్టుబడలేదు. 

బలి అమాయకంగా వామనుడి రూపంలో వచ్చిన విష్ణువుకు సర్వం ధారబోసే ప్రయత్నంలో ఉండగా, శిష్యవాత్సల్యంతో అడ్డుపడి కన్నుపోగొట్టుకున్నాడు గురువు శుక్రాచార్యుడు.

 

గురుస్థానం అంత గొప్పది కనకనే మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం దేశాధ్యక్షుడి పదవికన్నా బడిపిల్లలకు పాఠాలు చెప్పటానికే ఎక్కువ మక్కువ చూపుతున్నాడు. ఓ తమిళ పత్రికలో బాలలకు ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో ఓ చిన్నారి 'చిన్నతనంలో మీరు చాలా కష్టాలు పడి ఓ పెద్ద శాస్త్రవేత్త, ఉపాధ్యాయుడు, రాష్ట్రపతి అయ్యారుగదా! మీ విజయానికి కారణం అదృష్టమా?' అని అడిగితే 'అవును. చిన్నతనంలో నాకు మంచి దారిచూపించే ఉపాధ్యాయులు దొరికిన అదృష్టం' అని బదులిచ్చాడు కలాం. అలాంటి గురువుకి నేటి మన సినిమాల్లో పడుతున్న గతిని చూస్తుంటే దిగులు కలుగుతుంది. 

'గురువు' అంటే గుండ్రాయి కాదు అంటాడు ఓ సినిమా కవి. కాదు గుండ్రాయే! మనిషి అజ్ఞానాన్ని, మొండితనాన్ని చితక్కొట్టే గుండ్రాయే నిజమైన గురువు. తాను ఆనాడు 'గోడకుర్చీ' వేయించాడు గనకే మనమీనాడు ఓ 'కుర్చీ'లో కూర్చుని గొప్పగా పనిచేసుకోగలుగుతున్నాం.

 గురువులు అష్టవిధాలు.

అక్షరాభ్యాసం చేయించినవాడు, 

గాయత్రి ఉపదేశించినవాడు, 

వేదాధ్యయనం చేయించినవాడు, 

శాస్త్రజ్ఞానం తెలియజెప్పేవాడు, 

పురోగతి కోరేవాడు, 

మతాది సంప్రదాయాన్ని నేర్పించేవాడు, 

మహేంద్రజాలాన్ని విడమరిచి చెప్పేవాడు, 

మోక్షమార్గాన్ని చూపించేవాడు 

అని పురాణజ్ఞానం తెలియజేస్తున్నా వాటిని పట్టించుకొనే శిష్యులు ఇప్పుడు లేరు. గురువుకు నామాలు పెట్టే శిష్యులు తయారవుతున్నారు. 

దొంగలపాలు కానిది, దొడ్డకీర్తిని తెచ్చేది, పరమ సౌఖ్యానిచ్చేది, భద్రతనిచ్చేది, యాచకులకిచ్చినా రవంత తరగనిది, గొప్ప నిధి అయిన జ్ఞానాన్ని ఇచ్చే గురువును లఘువు చేయకుండా ఉంటేనే ఏ జాతికైనా మేలు జరిగేది. 


- రచన: కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు- ప్రచురితం - o5-o9-2009)


Wednesday, November 10, 2021

అమ్మల పండుగ - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ఆదివారం సంపాదకీయం )

 సాహిత్యం : 

అమ్మల పండుగ

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ఆదివారం సంపాదకీయం ) 


కౌసల్య తన 'పేరేమిటో' చెప్పమంది. 'రా' అనే అక్షరం, 'డు' అనే అక్షరం పలకడం రాని చిన్నారి రాముడు 'లాములు' అంటాడు. 'నాన్న పేరేమిటి నాన్నా?' అని అడుగుతుందీ సారి. 'దాచాతమాలాలు' అంటాడు బాలుడు ముద్దుగా. 'మరి నా పేరో?' రెట్టించిన ఉత్సాహంతో మరో ప్రశ్న. అమ్మతోనే కానీ.. ఆమె పేరుతో పనేంటి చంటి పిల్లలకి? 'అమ్మగాలు' అంటాడు బాలరాముడు అత్యంత కష్టం మీద. 'కౌసల్య తండ్రీ' అని బిడ్డడ్ని సరిదిద్దబోయి అప్పటికే నాలుక తిప్పటం రాని రాముని కళ్ళలో చిప్పిల్లిన నీరు చూసి తల్లి గుండె చెరువైపోతుంది. 'కౌసల్యను కానులేరా నాన్నా!.. 'వట్టి అమ్మనేరా నా చిట్టి రామా !' అంటో అమాంతం ఆ పసికందుని తల్లి గుండెలకు హత్తుకునే రమణీయ దృశ్యం విశ్వనాథ వారి 'రామాయణ కల్పవృక్షం'లోది. నవ మాసాలు మోసి రక్త మాంసాలను పంచి కన్న పాప- 'కనుపాప కన్న ఎక్కువ' అనటం 'సుమధుర భావనామృత సుశోభిత మాతృ హృదంతమ్ము'ను తక్కువ చేయడమే. సంత్ జ్ఞానానంద యోగి ప్రవచించినట్లు తాయి 'సంతతి సంతత యోగ దాయి.' 'చల్లగ కావు మంచు మనసార పదింబది దైవ సన్నిధిన్ మ్రొక్కుచునుండు' మాత వాత్సల్యాన్ని ప్రసిద్ధ ఆంగ్ల రచయిత రాబర్ట్ బ్రాల్ట్ మాటల్లో చెప్పాలంటే 'తల్లి నివేదనకన్నా ముందుగా బిడ్డ కామన చేరగలిగే ప్రార్థనాస్థలి సృష్టి మొత్తం గాలించినా ఎక్కడా దొరకదు'. గణాధిపత్యం కోసం శివపుత్రులిద్దరి మధ్య స్పర్థ ఏర్పడింది. మయూరవాహనుడికి సర్వ తీర్థాలలో తనకన్న ముందుగా అన్న మూషికారూఢుడై సందర్శనమివ్వడం ఆశ్చర్యం కలిగిస్తుంది. తల్లి కామన వల్లే సిద్ధివినాయకుడికా విజయం సిద్ధించిందన్న ధర్మసూత్రం వల్లీనాథుడుడికి అప్పుడు కాని బోధపడదు. వానలో తడిసి వస్తే తడిసినందుకు నాన్న తిడతాడు. అదే అమ్మైతే? 'ఈ పాడు వాన నా బిడ్డ ఇంటికి వచ్చిందాకా ఆగకూడదా' అంటో వాననే శాపనార్థాలు పెడుతో బిడ్డ తలతుడుస్తుందిట. అమ్మ అంటే అది. హిందువులు సంధ్యావందనంలో 'తల్లిలా కాపాడమని' జలదేవతను ప్రార్థించేది అందుకే.


ఏడాదికి పన్నెండు మాసాల పర్యంతం వారంలో ఒక్క రోజైనా విశ్రాంతి లేకుండా ఇరవై నాలుగ్గంటలపాటూ అనుక్షణం బిడ్డమీద వాత్సల్యం కురిపించినా తృప్తి చెందనిది సృష్టిలో అమ్మ ఒక్కతే. 'తండ్రిం జూడము తల్లి జూడము యశోదాదేవియున్ నీవు మా/తండ్రిందల్లియు నంచు నుండుదుము.. యింతటివారమైతిమి గదా తత్త ద్వయోలీలలన్' అంటో రెండు చేతులూ జోడిస్తాడు ముకుందుడంతటి వాడు నందుని సందర్శనార్ధమై రేపల్లె వచ్చిన సందర్భంలో భాగవతంలో. ఈశుడు ఓంప్రథమంగా సృష్టించిన ఈశానాం ( లక్ష్మీ దేవి ) ఈశిత్రి ( జగత్తు) ని అమ్మలా పాలిస్తుంటుందని పరాశరబట్టర్ ద్వయ మంత్రశ్లోక సారంశం. అమ్మతో కూడున్నవేళ ఆ భగవానుడు చేసే జగత్పాలనా విలక్షణంగా ఉంటుందని ఆళ్వారుల నమ్మకం. 'జగన్నాథుడిని అలా తీర్చి దిద్దే శక్తి అమ్మదే. నాయన గొప్ప సంపద అమ్మే' అని కదా శ్రీస్తవ స్తోత్రం ! సర్వ భూతాలలో ద్యోతకమయ్యే దివ్యశక్తిని మాతృరూపిగానే సంభావిస్తుంది దుర్గా సప్తశతి కూడా. 'తల్లుల చల్లని ప్రేమలు,/పిల్లల మాటలు, నగవులు, ప్రియమగు పాటల్/ ఫుల్ల ధవళ కుసుమ సరము/లల్లా తెల్లని మనసున కతి ముదము నిడున్' అని అల్లాచల్లని దయమీదో చక్కని అష్టకం ఉంది. అకాళికమూ, అసాయి, అనల్లా, అనేసు అనేవి ప్రేమలోకంలో చెల్లవు. దుర్గా, ఫాతిమా, యేసు తల్లి మేరీ, బుద్ధుని మేనత్త గోతమి, బహాయీల తాయి తాహిరి, మహావీరుని తల్లి త్రిషాల.. మాతృ ప్రేమకు కులమతాల దేశకాలాల ఎల్లలే ముంటాయి? గ్రీకులకు వార్షిక వసంతోత్సవాలలో దేవతల తల్లిని ఆరాధించడం ఆనవాయితీ. ప్రాచీన రోమన్లు హీఠారియా పేరిట దేవతామూర్తి సిబెల్ను మాతృపీఠం ఎక్కించారు. యేసు తల్లి గౌరవార్థం ప్రాచీన క్రైస్తవులు మాతృదినోత్సవం జరుపుకునే వారు. ఇంగ్లాండ్ తల్లులందరికీ 'మదరింగ్ డే' పేరిట ఆటవిడుపు. అదే రోజునుఅమెరికా దేశమూ 'తల్లుల దినోత్సవం'గా ఆమోదించి వచ్చే ఏటికి శతాబ్దం. ప్రపంచీకరణ ప్రభావం..ఇవాల్టి రోజును మరెన్నో దేశాలూ తల్లికి నివాళులిచ్చే ఓ సంబరంగా జరుపుకుంటున్నాయి. ప్రేమాభిమానాల పాలు భారతీయులకూ అధికమే. మాతృదినోత్సవం మనకూ ఓ ముఖ్యమైన పండుగవడంలో అబ్బురమేముంది?


కాలం సనాతనమైనా.. అధునాతనమైనా అమ్మ పాత్రలో మాత్రం మారని అదే సౌజన్యం. బిడ్డ కోరితే గుండైనా కోసిచ్చే త్యాగం. కోటి తప్పిదాలనైనా చిరునవ్వుతో క్షమించేయగల సహనం. గుళ్లోని దేవుణ్ని అడిగాడు ఓ సత్యాన్వేషి 'అమ్మ' అంటే ఏమిటని? 'తెలిస్తే ఆమె కడుపునే పుట్టనా ! 'అని ఆయనగారి ఉత్తరం. భిక్షమడిగే బికారి నడిగాడీసారి. 'బొచ్చెలోని పచ్చడి మెతుకులేన'ని సమాధానం. మానవులతో కాదని చివరికి పిల్లిపిల్లను చేరి అడిగితే.. కసిగా కరవబోయిందా పిల్లతల్లి. నడిచే దారిలో ఓ రాయి తాకి తూలి పడినప్పుడు కాని తెలిసి రాలేదా సత్యాన్వేషికి తన పెదాల మీద సదా 'అమ్మా'లా దాగుండేదే అమ్మని. విలువ తెలియని వారికి అమ్మ అంటే 'ఇంతేనా?' తెలుసుకున్న వారికి 'అమ్మో..ఇంతనా!' అనిపిస్తుంది. 'ఆపద వచ్చినవేళ నారడి బడినవేళ/పాపపువేళల భయపడిన వేళ/ వోపినంత హరినామమొక్కటే గతి..' అని అన్నమాచార్యుల వారన్న ఆ ఒక్క హరినామానికి అమ్మపదమొక్కటే ఇలలో సరి. అద్దాలనాటి బిడ్డలకి గడ్డాలు మొలుచుకొచ్చి ఆలి బెల్లం.. తల్లి అల్లమతున్న రోజులివి. కాలమెంతైనా మారనీ.. పెరటి తులసి వంటి అమ్మలో మాత్రం మార్పు లేదు. రాబోదు. అందుకేనా చులకనా? బిడ్డను చెట్టులా సాకేది తల్లి. ఆ తల్లికే కాస్తంత చెట్టునీడ కరవా? జీవితం పంచి ఇచ్చిన ఆ తల్లికి 'జీవించే హక్కు' ఇప్పుడు ప్రశ్నార్థకం ! తల్లి కన్నీటికి కారణమైనాక బిడ్డ ఎన్ని ఘనకార్యాలు ఉద్ధరించినా నిరర్ధకమే. కన్నీటి తడితో కూడా బిడ్డ మేలు కోరేది సృప్తి మొత్తంలో తల్లి ఒక్కతే. 'అమ్మకై పూదండ/లల్లుకుని వచ్చాను/అందులో సగభాగ/మాశ పెడుతున్నాను/ మా యమ్మ మాకిత్తువా దైవమా ! /మాలలన్నియు నిత్తురా!' అని మాతృవిహీనుడైన ఓ కవిగారి మొత్తుకోలు. అమ్మ పాదాలు దివ్య శోభాకరాలు, పరమ కృపాస్పదాలు, సకల భయాపహాలు, అమ్మ పాదాలు.. కొండంత అండ! స్తోత్రాలు సరే. 'అమ్మ పండుగ' ఏడాదికి ఒక్కనాడే. నిండు మనసుతో బిడ్డ ఆదరించిన ప్రతిక్షణమూ అమ్మకు నిజమైన పండుగే. ఈ 'అమ్మల పండుగ' నుడైనా చాలు.. అమ్మ మేలుకు బిడ్డలు మళీ నాంది పలికితే అదే పదివేలు.

***

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ఆదివారం సంపాదకీయం ) 

Saturday, July 17, 2021

జీత భత్తేలు -కర్లపాలెం హనుమంతరావు

 


సమాఖ్య ప్రభుత్వ వ్యవస్థలో ప్రధాని అత్యంత శక్తివంతమైన వ్యక్తి. అదే విధంగా ముఖ్యమంత్రి తన రాష్ట్రానికి  శక్తివంతమైన నాయకుడై ఉంటాడు. దేశంలో అత్యధిక వేతనం రాష్ట్రపతికి,  ఆ తర్వాత  ప్రధానమంత్రికి.. అని ప్రజలు సాధారణంగా నమ్ముతుంటారు. వాస్తవంలో అట్లాలేదు. చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రుల జీతాలు ప్రధాని జీతం కన్నా ఎక్కువ.

దేశం స్వతంత్రమయే సందర్భంలో ప్రధాని జీతం నిర్ణయం కాలేదు. దేశ ప్రథమ ప్రధానిగా ఎన్నికయినా జవహర్ లాల్ నెహ్ర్రూ  ఈ జీతబత్తేల మీద మనసు పెట్టలేదు. బ్రిటిష్ వారి పాలన కాలంలో  ప్రధాని జీతం అతని  క్యాబినెట్ మంత్రుల  జీతం కంటే రెట్టింపు ఉండేది. ఇక  ఇతర ప్రయోజనాలు సరే సరి.  స్వతంత్ర  భారతదేశంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగి ఉండాలి న్యాయంగా అయితే. ఆ సమయంలో కేంద్ర కేబినెట్ మంత్రుల జీతం నెలకు రూ .3,000 గా అనుకున్నారు. అయినా నెహ్రూజీ తను ప్రధానిగా రెట్టింపు జీతం తీసుకొనేందుకు ఇష్టపడలేదు. తన మంత్రులతో సమానంగా మాత్రమే జీతం తీసుకునేందుకు మొగ్గుచూపారు. ఇక ప్రస్తుతానికి వస్తేః

ఇప్పటి ముఖ్య మంత్రులందరిలో తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట చంద్రశేఖరరావు నెలకు 4 లక్షల 10 వేల రూపాయలు జీతం కింద పుచ్చుకుంటున్నారు. దేశంలోని ముఖ్యమంత్రుల జీతాలన్నింటిలో ఇదే ఎక్కువ.  ఆ తరువాతి స్థానం దిల్లీ సి.యం ది. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ సి.యం గా అందుకుంటున్న జీతం 3 లక్ష 90 వేల రూపాయలు. గుజరాత్ సిఎం జీతం రూ.3.21 లక్షలు. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రుల జీతాలు నెలకు రూ.3 లక్షలు.

రూ.2 లక్షలకు పైగా సంపాదించే ముఖ్యమంత్రుల జాబితాలో హర్యానా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, గోవా, బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులు ఉన్నారు.

ఒక లక్ష 5 వేల రూపాయలు తీసుకునే త్రిపుర సిఎం అతి తక్కువ ముఖ్యమంత్రి జీతగాడు.

దేశంలో అత్యధిక జీతం ఇచ్చే జీతం ప్రయివేట్ కంపెనీలలో టెక్ మహీంద్రాది మొదటి స్థానం. ఆ కంపెనీ  సీఈఓ జి.పి.గుర్నాని  ప్రస్తుతం రూ.165 కోట్ల వార్షిక వేతనంతో పుచ్చుకుంటున్నారు. చీఫ్ లేదా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు రూ.15 కోట్ల నుంచి రూ.165 కోట్ల వరకు జీతాలు ఇచ్చే కంపెనీలు మనదేశంలో చాలా ఉన్నాయి.

-కర్లపాలెం హనుమంతరావు 



 


Monday, February 8, 2021

నాలుగు ను గురించి నాలుగు ముక్కలు - కర్లపాలెం హనుమంతరాను


 . 


నలుగురూ నాలుగు చేతులూ వెయ్యండి. నలుగురితో నారాయణ. నలుగురు పోయే దారిలో నడవాలి. నలుగురూ నవ్వుతారు... ఇవీ నిత్యం మనం వినే మాటలు. అనే కార్థంలో ‘నలుగురు’ మాటను వాడుతుంటాం. ఇలా జన వ్యవహారంలో నాలుగు సంఖ్య తరచుగా వినిపిస్తుంది.

మనకు సంఖ్యాశాస్త్రం ఉంది. అంకెలకు సంబంధించి నమ్మకాలు ఉన్నాయి. కొందరు కొన్ని సంఖ్యల్ని తమకు అదృష్ట సంఖ్యలుగా భావిస్తుంటారు. కొన్ని ప్రయోజనాలకు తమకు నచ్చిన సంఖ్య రావాలని తపన పడుతుంటారు. ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉన్న సంఖ్యలు ఒకదాని కంటే ఒకటి పెద్దదిగా మనం భావించినా సహజంగా అన్ని సంఖ్యలూ వాటికవే విశిష్టమైనవి. నాలుగు సంఖ్యను చాలామంది ఉత్తమమైనదిగా పరిగణించరు. ఎవరి నమ్మకం ఎలా ఉన్నా నాలుగంకెకు ఆధ్యాత్మిక ప్రశస్తి ఉంది.

సృష్టికర్త బ్రహ్మను చతుర్ముఖుడన్నారు. సృష్ట్యాదిలో బ్రహ్మ నలుగురు మానస పుత్రుల్ని సృష్టించాడు. వారే సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు. వేదాలు నాలుగు. ధర్మార్థ కామమోక్షాలు నాలుగు. పురుషార్థాలూ ఆశ్రమ విధానాలు నాలుగింటిని చెప్పారు. అవి బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసాశ్రమం. చాతుర్వర్ణ వ్యవస్థనూ వేదవాంగ్మయం పేర్కొన్నది. యుగాలు నాలుగు- కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు. మానవ జీవిత దశలనూ బాల్య, యౌవన, కౌమార, వార్ధక్యాలనే నాలుగింటిగా విభజించారు.

దిక్కులు నాలుగు. మూలలూ నాలుగే. తూర్పు దిక్కు ఋగ్వేద సంబంధమైనది. సూర్యోదయానికి ఆధారభూతం గనుక పూజ్యమైనది. దక్షిణం యజుర్మంత్రాలకు, పశ్చిమం అధర్వమంత్రాలకు స్వాభావికమైనవని, ఉత్తర దిక్కు సామవేద సంబంధి అని తెలిపే శ్రుతి ప్రస్తావనలున్నాయి.

మండూకోపనిషత్తులో నాలుగు అవస్థలు చెప్పారు. జాగృదవస్థలోని అనుభవాలకు కారణం జాగరిణి. ఈ అవస్థలోని జీవాత్మ విశ్వుడు. స్వప్నానుభవకర్త సూక్ష్మశరీరధారి అయిన జీవుడు. వాడిని స్వప్నంలో ప్రేరేపించేవాడు తైజసుడు. గాఢనిద్రను అనుభవించే సుఖజీవిని ప్రాజ్ఞుడంటారు. ఈ అవస్థకు కారకురాలైన పరమేశ్వరి ప్రాజ్ఞ. పై మూడు స్థితులకు అతీతమైన స్థితి ‘తుర్య’. ఈ మూడు అవస్థల్లో లేని స్థితిని పరదేవత కలిగిస్తుందంటారు.

మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష- నాలుగు వాసనలు. ఇవి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే నాలుగు అంతఃకరణలకు సంబంధించినవి. స్నేహితులతో మైత్రి మనసు లక్షణం. ఆర్తులపట్ల కరుణ బుద్ధి లక్షణం. పుణ్యకర్మల్ని ఆనందించడం చిత్త లక్షణం. సజ్జనుల్ని బాధించడం అహంకార లక్షణం. వాక్కుకు నాలుగు రూపాలు. పరా, పశ్యంతి, మధ్యమ అనే మూడు అంతరంగంలో ఉండే వాక్కులు; బహిర్గతమయ్యేది వైఖరి.

మృత్యువు నాలుగు రూపాలని వేదం చెబుతోంది. అవి సూర్యుడు, వాయువు, అగ్ని, చంద్రుడు. సూర్యుడు రోజూ ఉదయ సాయంత్రాల ద్వారా ఒకరోజు జీవుల ఆయుర్దాయాన్ని గ్రహిస్తూ, మృత్యువుకు కారణమవుతాడు. వాయుసంచారం దేహంలో సరిగ్గా లేనప్పుడు ఊపిరితిత్తుల వ్యాధుల ద్వారా మరణానికి అవకాశాలెక్కువ. శరీరంలోని జఠరాగ్ని సరిగ్గా లేకపోతే తిన్న ఆహారం జీర్ణంకాక ఆకలిదప్పులుండక చనిపోయే అవకాశమూ ఉంది. చంద్రుడు పంటలకు కారకుడు. పంటలు పండకపోతే ఆహారం లేక మనిషి ఆరోగ్యం క్షీణిస్తుంది.

మేఘం, మెరుపు, పిడుగు, వృష్టి (వాన)- నీటికి నాలుగు రూపాలు. రాజ్యరక్షణకు అవసరమైన చతురంగ బలాలు- రథ, గజ, తురగ, పదాతి దళాలు. సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యాలు చతుర్విధ ముక్తులు. సామ, దాన, భేద, దండోపాయాలు రాజనీతికి సంబంధించిన చతురోపాయాలు. ఇలా చెప్పుకొంటూపోతే ఇంకా ఎన్నో... అందుకే నాలుగంకె కూడా ఘనమైనదే!

Saturday, August 1, 2020

పాత సాహిత్యం మీద బ్రౌన్ దొర మోజు - కర్లపాలెం హనుమంతరావు


తెలుగు సారస్వతం తాటాకుల్లో మూలుగుతూ, రక్షించే నాథుడు కరవైన రోజుల్లో విదేశీయుడైన బ్రౌన్ (పుట్టింది భారతదేశంలోనే ఐనా) తెలుగు నేర్చుకుని, పండితులను తన స్వంత డబ్బుతో పోషించి, తాటాకుల్లోని వాజ్ఞ్మయాన్ని కాగితాలమీద రాయించి,అనేక గ్రంథాలకు సంస్కరణ ప్రతులు తయారు చేయించి, వాటికి వ్యాఖ్యానాలు, పదసూచికలు ఏర్పాటుచేసి, కొన్ని గ్రంథాలను ముద్రించి.. ఆంధ్రభాషోద్ధారకుడిగా చరిత్ర ప్రసిద్ధికెక్కాడు.
కోల్ బ్రూక్, విల్కిన్స్, విల్ ఫోర్డ్, విల్సన్ సంస్క్తతభాషావ్యాప్తికి నిస్వార్థంగా పనిచేయాడానికి కారణం వాళ్ళకున్న మత సహనమే అనీ, వాళ్ళు ఒక రకంగా Western Brahmins తో సమానమని కాల్డ్ వెల్ నిర్మొహమాటంగానే అన్నట్లు బంగోరె సంపాదకత్వంలో 1978లో వచ్చిన 'లిటరరీ ఆటో బయోగ్రఫీ ఆఫ్ సి.పి.బ్రౌన్' పుస్తకంలో కనబడుతుంది(పే.87).బ్రౌన్ వాళ్ళకోవలోకి కచ్చితంగారాడు. హిందూమతంమీద ప్రత్యేకమైన గౌరవం ఉన్నవాడేమీ కాదు.మరి తెలుగుభాషనీ రకంగా ఉద్దరించడానికి కారణం ఏమై వుంటుదనే సందేహం తప్పక అందరికీ కలుగుతుంది.
బ్రౌన్ కి స్వతహాగా పురాతనంమీద గాఢాభిమానంట! పాతపుస్తకాలు చదవడం, వాటిమీద రిమార్కులు రాయడం, విసుగు విరామంలేకుండా సమాచారాన్ని సేకరించడం, పనికిమాలిన విజ్ఞానంపైన అతనికి వుండే ఓ రకమైన ప్రత్యెకమైన ఇష్టం,-ఇలాంటి లక్షణాలన్నీ కలగలసి తెలుగు సాహిత్య పునరుజ్జీవానికి అతడిలో ప్రేరణను కలిగించాయంటున్నారు కాల్డ్ వెల్. బ్రౌన్ కి వుండే ఏనుగుజ్ఞాపకశక్తి, పిడివాదం చేస్తూ ఏది అడిగినా 'ఓహ్..నొ' అంటూ చెప్పటం మొదలుపెట్టే గుణం..ఇవన్నీ ఆయన స్వంతానికి ఎంతవరకూ ఉపయోగపడ్దాయో తెలీదుకానీ..వివిధ కారణాల మూలకంగా అంతవరకూ స్తబ్దంగా పడివున్న తెలుగుభాషామతల్లికి మాత్రం ఎనలేని మేలు కలిగించాయనే చెప్పాలి.ఏమంటారు?
-కర్లపాలెం హనుమంతరావు

Tuesday, February 25, 2020

మీర జాలగలడా నా యానతి వ్రతవిధాన మహిమన్!





శ్రీస్వర్గానికి వెళ్ళి, వేయికన్నుల దేవరతో పోరు సలిపి మరీ సాధించుకున్న పారిజాతమూ, ప్రతిష్ఠ రెండూ సవతి ముందు వెలతెలపోతే సత్యభామలాంటి స్వాధీనపతిక ఊరకుంటుందా?  అన్నింటికంటే మిన్న, ఏడేడు లోకాల రేడు అయిన తన పతిని ఐశ్వర్యం ధారపోసైనా దక్కించుకుంటుంది. వ్రతవిధానమహిమ వలన తాను గీసిన గీటు దాటని కృష్ణుని ఊహించుకుని మురిసిపోతుంది.

"మీరజాలగలడా నాయానతి.." అని వ్రతఫలితాన్ని ముందే కళ్ళకు కట్టించుకుని ఆనందించే సత్యభామకు ఎన్నో తెలుసు. అన్నీ తెలుసు. నటన సూత్రధారి తన చేతికే కాదు, ఎవరికీ చిక్కడని ఆమెకు తెలుసు. అయినా సరే.. నోము పూని కట్టేసుకుందామని ఆశ! ఎంత ప్రియమైన పూనికో కదా ఆమెది? అన్నీ తెలిసీ దేనికీ అమాయకత్వం? అదే ఆమెకు కృష్ణునిపై గల గాఢానురాగానికి గీటురాయి.

మనోహరుని చేరుకునేందుకు మమతల వారాశిని ఈదేందుకు తనతో మరెవరూ పోటీ లేరని నొక్కి చెప్తోంది. సత్యభామకు తన ప్యత్యర్థి పేరు పలకడం సైతం ఇచ్చగించ లేదు. "వైదర్భికి.." "అదిగో.. వాళ్ళమ్మాయి ఉందే..!" అని ఈసుగా మాట్లాడినట్టే! సవతిపై ఆ మాత్రం అయిష్టం ఉండాలి మరి! ఉంటేనేగా ఉమ్మడి సొత్తు మీద తనకున్న పట్టుదల, తన ఆభిజాత్యమూ బయటపడేది. ఆఖరికి సత్యాపతి కూడా తనతో వాదులాడి ఆమెను వెనకేసుకురాడని ధీమాగా చెప్తోంది. "సత్యాపతి" అంటూ ఎంత గోటు ఒలకబోస్తోందో!
గీర్వాణమే కానీ ఈ భామ మనసులో ఇంకేం లేదని పొరబడేరు! వ్యయప్రయాసలకోర్చి ఈ నోము దేనికి..? మధుర మధుర మధురాధిపతిని కైవసం చేసుకునేందుకు. కృష్ణుని ప్రణయ సామ్రాజ్యానికి ఆధిపత్యాన్ని కోరుకుని కదూ! ఆ ఊహకే ఆమె మనసు ఎంత మైమరచిపోతోందో.. ఒక్క మధురమైన వాక్యంతో కనులముందు నిలిచే రాసక్రీడ "మధుర మధుర మురళీగాన రసాస్వాదనమున అధరసుధారసమది నే గ్రోలగ.." వేణువల్లే కన్నయ్య పెదవిని చేరి చెంగలించాలనే కాంక్ష!  "నేనంటూ వ్రతమూనాక, నేనంటూ ముద్దుముద్దరలేసాక.. నన్ను వదిలి పోగలడా?" అని అణువణువునా స్థైర్యమే! ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు రూపం సత్యభామ.
"స్థానం నరసింహారావు" రచన, సుమసౌకుమార్యమే కాక కాసంత పొగరూ, వగరూ.. అంతకు మించి ప్రియునిపై పట్టలేని ప్రేమా ఉన్న ప్రియురాలి మనసుకు అద్దం! చలనచిత్రం కోసం వ్రాసిన గీతం కాకపోయినప్పటికీ సినీవినీలాకాశంలో అందాల జాబిల్లి.
మీర జాలగలడా నాయానతి
వ్రతవిధానమహిమన్ సత్యాపతి
నటన సూత్రధారీ మురారీ
ఎటుల దాటగలడో నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
సుధాప్రణయ జలధిన్ వైదర్భికి ఈద తావుగలదే నాతోనిక
వాదులాడగలడా సత్యాపతి
మధురమధుర మురళీగాన రసాస్వాదనమున
అధర సుధారసమది నే గ్రోలగ
మీరజాలగలడా నాయానతి
వ్రతవిధానమహిమన్ సత్యాపతి
(సోర్స్ః కొత్తావకాయ బ్లాగ్)
అయితే ఈ 'మీర జాలగలడా నాయానతి/వ్రతవిధానమహిమన్ సత్యాపతి' పాట పుట్టుకను గురించి ఇదిగో స్థానం నరసింహారావుగారే స్వయంగా తన 'నటస్థానం' లోచెప్పిన ఈ ముక్కలు చదవండి.. ఆసక్తికరంగా ఉంటాయ్!
(సోర్స్ః ఆదివారం ఆంధ్రజ్యోతి- అనుబంధం మొదటి పేజీ- బహుళం -17 ఏప్రిల్ 2011 సంచిక నుంచి)
సేకరణః కర్లపాలెం హనుమంతరావు
25 -02 -2020

Friday, January 24, 2020

వర్ధమాన రచయితకు శ్రీవాత్సవ లేఖ- పాత బంగారం



అఖిలభారత తెలుగు రచయితల 2వ మహాసభ 1963, జనవరిలో రాజమండ్రిలో జరిగిన సందర్భంలో ఒక సావనీర్ తెచ్చారు.సుమారు 200పేజీలకు పైనే ఉంటుందా ప్రత్యేక సంచిక. పి.వి.నరసింహారావు గారు "ఉన్నత లక్ష్యాలతో రచనలు సాగించాల"ని ఉద్భోధిస్తూ చేసిన ప్రసంగపాఠం ఉందందులో. విశ్వనాథవారి నుంచీ కాశీ కృష్ణమాచార్యుల వారి దాకా... మధునాపంతుల, సినారె, సోమంచి యజ్ఞన్నశాస్త్రి, దాశరథి, తిలక్, మధురాంతకం, సంపత్కుమార, పిలకా, పురిపండా వంటి  ప్రముఖుల వ్యాసాలు, రచనలు ఎన్నో ఇందులోకనిపిస్తాయి.
ప్రముఖ విమర్శకులు శ్రీవాత్సవ- వర్ధమాన రచయితలను ఉద్దేశించి  లేఖారూపంలో ఒక మూడుపుటల  చక్కని రచన చేశారు. ఆ వ్యాసం మొత్తాన్నీ మళ్ళీ ఇక్కడ ప్రస్తావించడం కుదరదు కానికొత్తగా రచనలు చేసే ఔత్సాహికులకు ఈ నాటికీ పనికొచ్చే చాలా విషయాలు ఇందులో ఉన్నాయి.కొన్ని భాగాలను క్లుప్తంగా ఇస్తాను.చూడండి!
రచయితలు అష్టకష్టాలుపడి  రాసిన తమ రచనలకు ఎందుకో(బహుశా సరదావల్లో..మోజుతోనో) కలంపేర్లు పెట్టుకుని ప్రచురించుకుంటుంటారు. మళ్ళా ఆ రచన ప్రచురింపబడ్డప్పుడు ఆ రాసింది తామే అని నలుగురికీ తెలియచెప్పటానికి నానాతంటాలు పడుతుంటారు. ఇంచక్కా సొంతపేరుతో ప్రచురించుకుంటే ఈ తిప్పలుండవు కదా అని శ్రీవాత్సవ అభిప్రాయం. సరే..అదేమంత పెద్ద  విషయం కాదుకానీ…కాస్త అలోచించదగిన సంగతులు ఇంకా  కొన్నున్నాయి.
సాధారణంగా రైళ్ళలోనో..బస్సుల్లోనో ప్రయాణంచేస్తూ ప్రేమలో పడిపోయే మధ్యతరగతి యువతనో, నిత్యనీరసంగా ఉండే సతీపతికుతూహల రహస్యాలనో ఇతివృత్తాలుగా తీసుకుని కాలక్షేపం రచనలు చేస్తే వచ్చే ప్రయోజన మేముంది? అంటారు శ్రీవాత్సవ. మన చుట్టూ...  జీవితాలతో నిత్యం సంఘర్షిస్తూ అంతులేని పోరాటం చేసే జనావళి అశేషంగా  కనపడుతుంటే  వాళ్ళ జీవితాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఎక్కడో..ఎప్పుడో.. కదాచిత్ గా కనిపించే అసాధారణమైన అద్భుత సంఘటనలను గ్లోరిఫై చేసే రచనలు చేయడం ఎంతవరకు సబబు? అలాంటి రాతలు తాత్కాలికంగా సంతృప్తినిస్తాయేమో గానీ.. కలకాలం నిలిచుండేవి మాత్రం కావు.
మరీ ముఖ్యంగా మనలోని కొందరు రచయితలు అవినీతిని ఆకర్షణీయంగా చిత్రించే ధోరణికీ పాల్పడుతుంటారు. మనచుట్టూ ఇంత అవినీతి పెరిగిపోతూసామాన్యుడి బతుకును అతలాకుతలం చేస్తుంటే..అదేమీ పట్టించుకోకుండాసంఘాన్ని మరింత  దిగజార్చే  నిమ్న వాంచల్నీ, నికృష్ట తత్త్వాల్ని, దుర్మార్గాన్నీ, దుర్నీతినీ, సౌఖ్య వాంచల్నీ,  కామోద్రేక్తలనీ సమర్ధించే సమ్మోహన విద్యను రచయిత ఉపయోగిచడం ఎంత వరకు ధర్మం? రచయిత అన్నవాడు మనసులో దాగున్న మధురాత్మను మేల్కొలిపి మహనీయ కార్యాలు చేయడానికి పురికొల్పే స్థితిలో ఊండాలి. మంచి రచనలతో మనిషిలోని మంచితనాన్నితట్టి లేపవచ్చు.
కవిత చెప్పినా,  కావ్య మల్లినా,  పాట పాడినా, పద్యం పలికినా, కథ వినిపించినా.. మానవతలోని తరగని విలువలను పైకి తీసేవిగా ఉండాలి. పదిమందీ పదే పదే పలుమారు తలుచుకునే రీతిలో  రచన సాగాలంటే.. మన ముందు తరం రచయతలు తొక్కిన దారేమిటో తెలుసుకోవాలి. ఆ దారిలో మనం నడుస్తే.. మన అడుగుజాడలు తరువాత తరం వారికి అనుసరించేవిగా ఉంటాయి…అంటున్నారు- ఆ లేఖలో శ్రీవాత్సవ.
ఈ రచన చేసి ఇప్పటికి సుమారు అర్థశతాబ్దం గడిచిపోయింది. ఈ కాలానికీ శ్రీవాత్సవ చెబుతున్న విషయాలు కొత్త రచయితలు సరిగ్గా అతికినట్లు సరిపోతుండటమే.. ఆశ్చర్యం.. బాధా కలిగించే విషయం. కదా?
-కర్లపాలెం హనుమంతరావు
24 -01 -2020
బోథెల్, వాషింగ్టన్ స్టేట్, యూ.ఎస్.ఎ




Monday, January 6, 2020

రాజధాని ఎట్లా ఉండాలి?- కర్లపాలెం హనుమంతరావు




"ధన్వదుర్గం మహీదుర్గ మబ్దుర్గం వార్క్షమేవ వా।
నృదుర్గం గిరిదుర్గం వా సమాశ్రిత్య వసేత్సురమ్॥"
ఐదు యోజనాల వరకు నీరు లేని మరుదుర్గం, రాళ్లతోగాని ఇటుకలతో గాని పన్నెండు బారల ఎత్తుండి యుద్ధం తటస్తిస్తే కూడా పైన తిరగేందుకు వీలైనంత వైశాల్యంతో ప్ర్రాకారం కట్టుకోడానికి పనికొచ్చే భూదుర్గం, చుట్టూతా లోతైన నీరున్న జలదుర్గంచుట్టూతా మరో యోజన దూరం దట్టమైన చెట్టూ చేమా ఉన్న వృక్షదుర్గం, చతురంగ బలాలతో పరిరక్షితమైన మనుష్యదుర్గం, నాలుగు దిక్కులా కొండలతో చుట్టి ఉండి, లోతైన నదులు, సన్నటి ఇరుకైన మార్గం ఉండే గిరిదుర్గం.. ఇవన్నీ రాజధానికి ఉండే అర్హతలేట. అన్నీ కాకపోయినా వీటిలో కనీసం ఏ కొన్నైనా ఉండే ప్రాంతంలో ముఖ్యపట్టణం కట్టుకోవడం రాజుకు క్షేమం అని మనుస్మృతిలో మనువు నిర్దేశించిన రాజధాని ప్రధానలక్ష్యణాలు. అన్నింటిలోకి గిరిదుర్గం అత్యుత్తమైనది అని కూడా ఆయన అదనపు సలహా!
మరుదుర్గాన్ని మృగాలు, మహీ దుర్గాన్ని ఎలుకలు సంతతి జీవులు, జలదుర్గాన్ని మొసళ్ళు, వృక్షదుర్గాన్ని కోతులు, నృదుర్గాన్ని మనుష్యులు, గిరిదుర్గాన్ని దేవతలు.. ఆశ్రయించి ఉంటారు. కాబట్టి రాజు జోలికి రావాలంటే ముందు ఈ జాతులు అన్నింటితో పెట్టుకోవాలి శత్రువులు అని మనువు ఆలోచన.
గిరిదుర్గాన్ని ఆశ్రయించిన రాజును శత్రువులు హింసించడం చాలా కష్టం. అక్కడ ఒక నేర్పుగల విలుకాడిని నిలబెడితే కింద ఉన్న వందమంది శత్రువులకు సమాధానం ఇచ్చేపాటి శక్తి అమరుతుంది. ఆ లెక్కన వందమంది విలుకాళ్లను పెడితే పదివేల మంది శత్రు యోధులకు పెడసరి కొయ్యలుగా మారే అవకాశం కద్దు.
ఏదేమైనా దుర్గం  రాజులకు అత్యవసరం. ఆ దుర్గం కూడా వట్టి యుద్ధ సాధనాలతో నింపి కూర్చుంటే ప్రయోజనం సున్నా. ధనం, ధాన్యం, వాహనాలు, బ్రాహ్మణులు(ముహూర్తాలు గట్రా పెట్టడానికి కాబోలు), నిర్మాణ శిల్పులు, యంత్రాలు, నీళ్లు,.. ముఖ్యంగా మట్టి (కసవు అన్నాడు  మనువు)నిండి ఉండకపోతే పేరుకే అది రాజధాని.  మనుధర్మశాస్త్రం -పుట  116).
రాజులూ యుద్ధాలూ .. నాటి కాలం కాదు కదా ఇది! ప్రజాస్వామ్యం! ప్రజలు ముచ్చటపడి ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామని ఆలోచించినా చాలు.. రాజుకు మించిన అధికారం చేతికి అందివచ్చే కాలం. 21వ శతాబ్ది మార్క్ రాజులకు మనువు చెప్పిన కోటలు గట్రాలతో రాజధానులు కట్టకపోయినా మునిగిపోయేదేమీ లేదు కానీ.. ఎన్నికల్లో ఎడపెడా పోసిన లక్షల కోట్లు రాబట్టుకోవాలంటే ఆర్థికదుర్గాలు   వంటివి మాత్రం తప్పనిసరి. సందర్భం వచ్చింది కాబట్టి మనువు తన స్మృతిలో ఈ రాజధానుల పితలాటకాన్ని గూర్చి ఏమన్నాడో .. జస్ట్.. ఆసక్తి ఉన్నవాళ్ళు తెలుసుకుంటారనే ఈ రాత!
-కర్లపాలెం హనుమంతరావు
06 -01 -2020

                                                

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...