Showing posts with label Travel. Show all posts
Showing posts with label Travel. Show all posts

Saturday, December 11, 2021

విదేశీయాత్రిక చరిత్ర ; కుటుంబసమేతంగా వచ్చిన నికోలో కోంటీ

విదేశీయాత్రిక చరిత్ర ; 

కుటుంబసమేతంగా వచ్చిన నికోలో కోంటీ


15వ శతాబ్దంలో ఇండియాలో పర్యటించిన పాశ్చాత్యులందరిలో నికోలోకోంటి ప్రముఖుడు. ఆనాటి ఇండియా గురించి ముఖ్యమైన సమాచారం విస్తారంగా  గ్రంథస్తం చేసిన విదేశీయాత్రికుడు నికోలో  కోంటీ. 


కొంటీ ఇటలీకి చెందిన వెనీస్ నగరపు ధనిక వ్యాపారి. వెనీస్ నగరం ఆనాటికే  గొప్ప వర్తక కేంద్రం. సముద్ర వ్యాపారాల కేంద్ర స్థానం కూడా. సముద్రాంతర యాత్రలకు ప్రొత్సాహం కలిపించింది ఈ కేంద్రమే.  


నికోలోకోంటి సాహసయాత్ర సకుటుంబంగా సాగింది. తన భార్యా పిల్లలతో కలిసి 1419న  యాత్ర ప్రారంభించాడు. డెమోస్కస్ నుండి తూర్పు దిక్కుకు ప్రయాణం. 600 మంది వర్తకులతో  కలసి అరేబియన్  యడారుల గుండా  ప్రయాణించిన సాహసికుడు నికోలో కోంటీ. 


బాగ్దాద్ చేరిన తరువాత తూర్పు దిక్కుకు ప్రయాణించి  అరబ్బుల ఓడరేవు ఓర్ముజ్ను చేరి  కొంత కాలం పర్షియన్ భాష నేర్చుకునే నిమిత్తం అక్కడే ఉండిపోయాడు.  


అక్కడి నుంచి అరేబియా సముద్రంలో నౌకాయానం ద్యారా ఇండియా పశ్చిమ తీరంలో ఉన్న  కాంబేనగరంలో అడుగుపెట్టాడు.


అక్కడి నుంచి దక్షిణ దిక్కుకి ప్రయాణం చేసి 300 మైళ్ల దూరంలో ఉన్న  విజయనగరం సందర్శించాడు.  విజయనగర రాజ్యం గురించి పాశ్చాత్యులకు సమాచారం అందించిన మొదటి విదేశీయాత్రికుడు నికోలో కోంటీ.


తరువాత ఇంకా దక్షిణానికి - మలియాపూర్ వెళ్ళి సెయింట్ థామస్ సమాధిని చూశాడు. తరువాత శ్రీలంకను, సుమత్రాను, బెంగాల్ను చూసి మరలా తూర్పుగా బయలుదేరి ఆరకాన్, ఇర్రావదీ, ఆద, పెగూ, జావా, సుంచావాలు వరకు వెళ్లి తిరుగు పయనం చేసి మరల సిలోన్ మీదుగా ఇండియా పశ్చిమ తీరానికి వచ్చి క్విలన్, కొచ్చిన్, కాలికట్లను దర్శించాడు.


కాంబే ప్రాంతంలో సతీసహగమనం ప్రబలంగా వుందనీ, కాలికట్ ప్రాంతంలో బహుభర్రుత్వం వుందనీ గమనించాడు.


కాంబే నుండి తిరుగు పయనం చేసి ఈజిప్టు గుండా వెళ్లాడు. కానీ వారి స్వదేశానికి దగ్గరలో వుండగానే అతని భార్య, ఇద్దరు పిల్లలు చనిపోయారు. కోంటి 1444లో తన వూరు వెనిస్ చేరాడు.


అప్పటి వరకూ తన పర్యటనను గురించి ఏమీ వ్రాసుకోలేదు. సముద్రయాత్రలో వుండగా ఒకసారి తన భార్యాబిడ్డల్ని రక్షించుకోవడానికి క్రిస్టియన్ మతాన్ని విడనాడాల్సి


చ్చిందట. ఆ తప్పదం అతన్ని వెంటాడుతూనే వుంది. ఆ పాపం నుండి బయటపడాలని ఈనాటి పోప్ యుజిని వద్దకు వెళ్లి వివరం అంతా చెప్పి పశ్చాత్తాపబడి తనకు పాపవిముక్తి చేయమని విన్నవించుకున్నా.


ఆ సందర్భంగా ఈయన యాత్ర విశేషాలు విన్న పోప్ గారు తన సెక్రటరీ సాయో బ్రాచ్చిమోలిని"ని వ్రాతకుడుగా నియమించి కోంటి చెప్పే విశేషాలన్నింటినీ _వ్రాయమన్నాడట. వారిద్దరి కృషి ఫలితంగా ఆ యాత్రా విశేషాలన్నీ గ్రంథస్తం అయ్యాయి. చరిత్రకొక మేలు జరిగింది. కోంటి నిశిత పరిశీలనా, పొగ్గియో మేలయిన రచనా శైలీ కలిపి లాటిన్ భాషలో “డి వెరైటేటి ఫార్చ్యునే” అనే గ్రంథం రూపొందింది.


కొండల మధ్యలో వున్న విజయనగరం చుట్టుకొలత 60 మైళ్లుంటుందని అందులో నివశిస్తున్న సైనికులే 90 వేల మంది వుంటారనీ వ్రాశాడు. ఇది ఎప్పుడు సంగతి? శ్రీ కృష్ణ దేవరాయల పరిపాలన నాటి కంటే వంద సంవత్సరాల పూర్వం సంగతి. అప్పటికే ఆ నగరం వందేళ్లయింది. క్రీ.శ 1336లో విజయనగరం ఏర్పడిందని చరిత్ర చెబుతోంది. వందేళ్లలోనే ఆ నగరం అంత అభివృద్ధి చెందిందన్నమాట!


ఆయన ఆనాటి (1420) బెంగాల్ గురించి యేమీ రాయలేదు గానీ గంగానదీ గట్టమీద అందమైన తోటలతో నగరాలున్నాయని వ్రాశాడు. గంగానదిపై ప్రయాణం చేసి సంపదలతో తులతూగుతున్న 'మారజియా' అనబడే నగరాన్ని చేరాడట.


పేపర్ మనీ వాడుకలో వుందనీ కుతూహలమైన విషయాన్ని కోంటి వ్రాశాడు. వెనీస్ నగరపు బంగారు నాణాలైన డుకౌంటులు కూడా చలామణి అవుతున్నాయట. అవిగాక ఇనుప నాణాలు కూడా వాడుకలో వున్నాయట.


ఇక్కడ హిందువులు పరిపాలిస్తున్న రాజ్యాలలో నేరవిచారణ తతంగాలలో ప్రమాణాలు వాడుకలో వుండటం చూసి విస్తుబోయాడు.


"ఇండియాలో చనిపోయినవారిని దహనం చేస్తారు. బ్రతికి వున్న అతని భార్యల్ని కూడా ఆ మంటలోనే దహనం చేస్తారు. అది చాలా గౌరవంగా భావిస్తారు...” అంటూ ఆ సతీసహగమన తతంగం ఎలా జరుగుతుందో అంతా వర్ణించాడు.


హిందూవులలో ఆత్మార్పణం చేసుకునే భక్తులు కూడా వుంటారనీ విజయ నగరంలో అలాంటి ఆచారం వాడుకలో వుందనీ వివరించాడు కోంటి. ఆ భక్తులు


తమకు తామే తమ శిరసుల్ని నరుక్కుంటారని వర్ణించాడు. దేవుడి రధ చక్రాల క్రిందపడి కూడా చనిపోతుంటారనీ వ్రాశాడు.


మలబారు తీరంలో కాలికట్లో కొంతమంది ప్రజల్లో బహు భర్రుత్వం అమలులో


వుందని వ్రాశాడు.


విజయనగర సామ్రాజ్యం గురించి మరికొంత వివరిస్తూ ఇక్కడి మగవారు ఎంతమంది భార్యలనైనా చేసుకుంటారనీ, వీరి రాజుకు 12 వేల మంది భార్యలున్నారనీ, రాజుగారు ఎక్కడికి వెళ్లినా అతనితో పాటు 4000 మంది భార్యలు కదిలి వెళ్తారనీ, వాళ్లుగాక వంటపనులకూ, సాయుధులైన అశ్వికులు గానూ అనేకమంది మహిళలున్నారని వ్రాశాడు.


విజయనగర సామ్రాజ్యంలోని పండుగల్ని కూడా వర్ణించాడు. అన్ని వయస్సుల జలూ నదులలో స్నానం చేసి, మంచి మంచి దుస్తులు ధరించి మూడురోజులపాటు త్యాలతోనూ, ఆట పాటలతోను గడుపుతారనీ, దేవాలయాల్ని దర్శిస్తారనీ, మరో డుగలో ఇళ్ళన్నీ దీపాల వరుసలతో అలంకరిస్తారనీ, ఇంకో పండుగ రోజున ందంగా రంగులు జల్లుకుంటారనీ వ్రాశాడు.


విజయనగరానికి ఉత్తరంగా 15 రోజుల నడక దూరంలో వజ్రాలు లభించే డ వుందనీ వ్రాశాడు. ఈ గోల్కొండ వజ్రాల గనుల గురించీ, కృష్ణానదీ వుత్తర లో వజ్రాలు లభిస్తాయనీ చాలామంది యాత్రీకులు వ్రాసినదే ఆయన కూడా శాడు.


గుజరాతుకు చెందిన కాంబే నగరం వారు మాత్రమే కాగితాన్ని వుపయోగిస్తున్నారనీ, మిగిలిన వారంతా వ్రాతకు చెట్ల ఆకుల్ని (తాటి ఆకులు) వుపయోగిస్తున్నారని వ్రాశాడు.


ఈదేశాలలో ప్రజలు ఎక్కువనీ, సైన్యాలు కూడా లక్షల సంఖ్యలో వుంటాయనీ వ్రాశాడు. నికోలో కోంటి దక్షిణ ఇండియాలో 1420-21లలో పర్యటించాడని చరిత్రకారులంటారు.


15వ శతాబ్దంలో అనేకమంది విదేశీయులు పర్యటనలు చేశారు. వారంతా మగవాళ్లే ఇండియాకు వచ్చిపోయారు. కుటుంబంతో సహా వచ్చిన సాహసి ఈయనే. కానీ ఆయన కుటుంబానికి ఇండియాలో హిందువుల వలనగానీ, ముస్లింలవలన గానీ ఎలాంటి ఇబ్బందులూ కలుగలేదని ఆయన రచన వలన తెలుస్తున్నది. అలాంటి శాంతి భద్రతలు, నీతి నియమాలూ ఇండియాలో ఆ రోజులలోనే అమలులో వున్నాయనేది నికోలో కోంటీ యాత్ర వలన మనకు అవగతమవుతోంది.

సేకరణ : కర్లపాలిం హనుమంతరావు 

( విదేశీయాత్రికులు అందించిన మనదేశ చరిత్ర - డి.వెంకట్రావ్ ) 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...