Showing posts with label muslim. Show all posts
Showing posts with label muslim. Show all posts

Thursday, December 30, 2021

మహమ్మదీయ మహాయుగంలో గ్రంధాలయాలు




 


మహమ్మదీయ మహాయుగంలో గ్రంధాలయాలు 


5. భోజరాజు గ్రంథాలయము. క్రీస్తుశకము పండెండవళతాబ్దికి చెందిన కవిపోషకు డగు భోజరాజు గ్రంథ భాండారమే రాజనిర్మిత భాండా గారములలో మనకు తెలిసినవానిలో మొదటిది. కవి పోషకుడగుటయేగాక ఈ మహారాజు స్వయము కవి; పండితుడు. ఎంజనీరింగు, ఆర్కిటెక్చరు మున్నగు కళలను గూర్చినదగు 'సమరంగన' మనుపుస్తకము అతని రచనము. గైక్వాడువారి ఓరియంటల్ సీరీసులో కొలది వత్సరములకు పూర్వము ప్రచురించు భాగ్యము నాకు గలిగేను. సిద్ధరాజను పేరుగల చాళుక్యరాజు ఈభోజ రాజు రాజ్యమును జయించి ఈతని గ్రంథాలయమునుతన రాజధానీనగరమగు అహిల్ వాడునకు గొనిపోయి తన గ్రంథ భాండాగారమున కలుపుకొనేను. ఈ ఆన్ హిల్ వాడు నేడు పేటన్ అను నామమున శ్రీ గైక్వాడ్ మహారాజానారి సంస్థానమున ఒక నగరమైయున్నది.


5. ముహమ్మదీయుల దండయాత్రలు. గజనీముహమ్మదు దండయాత్రలతో హిందూ దేశ చరిత్రమున హిందూమహాయుగమునకు ఆశ్వాసాంత మైన జనవచ్చును. గజనీముహమ్మదు దేవాలయము లను నాశనముచేసెను, అర్చకులను తన క్రూరఖడ్గము నకు బలియిచ్చెను. అట్టిస్థితిలో అర్చకులు, పండితులు తమకు సాధ్యమైనన్ని గ్రంథములను గైకొని టి బెట్టు, నేపాళము మొదలగు దూరదేశములకును, ఎడారినడుమ నుండి దుర్గమమైన కౌసల్ మియరు మొదలగు తావుల


గము : గ్రంధాలయములు


కును, తదితర ప్రదేశములకు పారిపోయిరి. ఇక ముహమ్మదీయయుగమునందలి భారత దేశ గ్రం థాలయముల చరిత్రను గూర్చి తెలిసికొనవలసియున్నది.


9. ముహమ్మదీయులు:


హిందూసాహిత్య విజ్ఞానము. సాహిత్య


దండెత్తి వచ్చిన ముహమ్మదీయులు క్రమముగ దేశ పాలకులు నిచ్చట నిలిచిపోయిరి. పాలకులు పాదు కొనినపిదప వారికి సాహిత్యవిజ్ఞానాభివృద్ధివి వయమున శ్రద్ధవహించు:ుకు సావకాశము సమకూడెన. అపుడు వారు మసీదులను కట్టించిరి; ముహమ్మదీయ మతవ్యాప కమునకై పాఠశాలలు పెట్టించిరి; ముహమ్మదీయ విజ్ఞాన ప్రచారపరిశోధనలకై కళాశాలల నిర్మించిరి. కాలక్రమ మున వారిదృష్టి హిందువులు మతగ్రంథముల పైగూడ ప్రసరింప నారంభించెను. హిందువుల ధర్మగ్రంథములు వారియాజమాన్యమున పారశీక భాషలోనికి అనువదింప బడుటకు శుభారంభము జరిగెను. 3. ఢిల్లీ నగరము.


బానిసరాజుల కాలమున ఢిల్లీ నగరము విద్యాశాలలకు విఖ్యాతినందెను. పలువురు విద్యాసంతు లానగరమునకు చేరిరి. బానిసరాజులు విద్యాగోష్ఠియందు బహుప్రీతిని చూపిరి. కవులు, పండితులు తాము రచియించిన నూతన కావ్యములను, గ్రంథములను చదువుచుండ వినుటను ఆరాజులును, ప్రధానులును ఘన కార్యముగా భావించిరి. ఖిల్జీ రాజ్యసంస్థాపనాచార్యుడగు జలాలుద్దీన్ పండిత  


రత్నమును, కవిరాజును అగు అమీర్ ఖుస్రు అనువాని రాజభాండారపాలకుని నియమించి అతనికి కొరాన్ పరిరక్షకుడు అను బిరుదమిచ్చి అతని యుద్యోగ ము నాకు మంచివేతనమును ఏర్పఱచెను. గ్రంథ భాండాగ పాలకులలో ఈ అమీర్ ఖుసుకు జరిగినంత గౌరవము మఱి యెవరికిని జరిగి ముండ లేదనుట అతిశయోక్తి గాదు.


1. చక్రవర్తి ఫిరోజ్ టూగ్లక్. మొగలాయి చక్రవర్తులకు పూర్వులైన ముహమ్మ


దీయ చక్రవర్తులలో ఫిరోజ్ టూగ్లక్ నామము భారత దేశ గ్రంథాలయోద్యమ చరిత్ర కారునకు పూజనీయ మైనది. ఫిరోజ్ స్వయము పండితుడు; విశేషించి పండితపోషకుడు. విదేశములనుండి పండితులను రప్పించి వారితో సద్దో సలుపుటకు ఆతడు ముచ్చటపడు వాడు. అల్లు వచ్చిన పండితులు ఆవాసమునకు గాను అతను రాజభవనము నొకదానిని ప్రత్యేకించెను. విద్యావంతు డగు ఈ ప్రభువు హైందవపండితులను రాజసేవలో నియమించెను. హిందువుల సారస్వతముతో పరిచయ ముసంపాదింప తన మతస్థులను హెచ్చరించెను. నాగ ర్కాట్ నందలి దేవాలయమున ఒక చక్కని సంస్కృత గ్రంథ భాండాగారముండుటను తెలిసికొని పారశీక భాష నేర్చిన హిందూపండితుల నట కార్యను లుగ నియమించి ఆచ్చటి అపూర్వ గ్రంథములను కొన్ని ని రశీక భాషలోనికి అనువదింపజేసెను. Que మరణానంతరము భారత దేశ గ్రం థాలయోద్యమము కొంత కాలముకుంటువడినదని చెప్పవచ్చును. ఈ కాల మున తైమూరు హిందూదేశముపై ఎత్తిచ్చి ఢిల్లీనగర మును కొల్లగొట్టెను.


5. మఱికొన్ని చిన్న రాజ్యములు. మొగలుల కాలమునాటి భారత దేశ గ్రంథాలయో ద్యమచరిత్రను వివరించుటకు పూర్వము ఈ కాలము నాటి మఱికొన్ని చిన్న రాజ్యములు గ్రంథాలయోద్యమ విషయమున ఎట్లు కృషి చేసినవో తెలిసికొనవలసియు 8. అహమ నగరమున బహమనీ రాజులు ఒక న్నది. చక్కని గ్రంథ భాండారమును నిర్మించి క్రమముగ నిర్వ హించిరని తెలిసికొనుట కావందముగ నున్నది. ఆ రాజులు దీనికి ఒసగిన పోషణము అనంతమును,


అత్యంతశ్లాఘాపాత్రమును ఆయినదే అయినను పదు నేనవశతాబ్దిలో వారికడ మంత్రిగనుండిన ముహమ్మదు గవాను చేసినదానము ముందు అది డిందుపాటు నొందు చున్నది. డక్కనునందలి భాండాగారములందు అక్కడ క్కడ అతని పద్యమాలికలు నేటికిగూడ మనకు దొరు కుచున్నవి. అతడు కోటికి పడగ ఎత్తినధనవంతు డేయ య్యు చేతికి ఎముక లేని నెఱ దాతగుటచే మరణకా లమునాటికి ఆతని బొక్కసమున లెక్క కాసులుమాత్ర ముండెను. ఉన్నతభావములుగల పోడిమీ జీవితమున ఆతడు ఋషివలె దినములు గడపెరు. అతని ధనమం తయు మసీదులు కట్టుటకు, పండితులను పోషించుటకు, గ్రంథ భాండాగారములను నిర్మించుటకు న్యాయపఱుప బడెను. బీజపురమున ఆదిల్ షాహి వంశపురాజులుగూడ నొకచక్కని భాండాగారమును నిర్వహించిరి. ఆ గ్రంథాలయమునందలి పలుగ్రంథములను ఔరంగజేబు ఢిల్లీ నగరమునకు గొనిపోయినను పందొమ్మిదవ తాబ్దిని అగ్రంథాలయమును సందర్శించిన డాక్టరు ఫెర్గుసన్ దాని మంచిదినములలో ఆ గ్రంథాలయము బ్రహ్మాండ మైనదైయుండవలెనని అభిప్రాయపడినాడు. వంగ దేశ మును రిపాలించిన తొలిజట్టు ముహమ్మదీయ ప్రభువు లలో క్రీస్తుశకము 1282 మొదలు 1825 వఱకు పరిపా లనము సాగించిన నాదిర్షా భారత దేశ గ్రంథాలయో ద్యమచరిత్రకారుల ఎల్లరచే స్మరింపదగినవాడు. ఇంగ భాషలోనికి మహాభారతము ప్రథమమున భాషాంతరీక రింపబడుటకు ఆతనిఆజ్ఞయే కారణము .


5. మొగలాయి చక్రవర్తుల కాలము. మొగలాయి చక్రవర్తుల కాలమున భారత దేశ గ్రం థాలయోద్యమము హుటాహుటినడలతో సాగినదని చెప్పవచ్చును. మొగలాయి చక్రవర్తులు, రాణులు, రాజకుమారులు కళాసాహిత్యములందు మంచి అభిరుచిని, అభినివేశమును చూపిరి. మొగలాయీల మూలపురుషుడగు తైమూరు రచియించిన స్వీయ చరిత్ర నేడును ఉపలబ్ధమగుచున్నది. ఈ తైమూరువలె నీతిని వంశీయులును స్వయము గ్రంథకర్తలై విలపిల్లిరి. వెంగ లాయి రాజవంశసంస్థాపకుడుగు బేబరు గొప్ప విద్వాం సుడు. 'బేబర్ నామా' అను పేరుగల ఆతని స్వీయ


చరిత్ర ఆతరగతివాఙ్మయములో ఎన్నదగినదై నేటి కిని ప్రకాశించుచున్నది. పుస్తకములలో చిత్రములను రచియించు ఆచారమునకు బేబరు ఆద్యపురుషుడన వచ్చును. పుస్తకములు సచిత్రముగ ప్రచురించు పద్ధతి కనుగొనినది మొగలులకు కీర్తిదెచ్చిన విషయము గా నేటికిని మనము చెప్పుకొనుచున్నాము. బేబరు తన గ్రంథములయం దన్నిటియందును చిత్రములను చేర్చు వాడు. బేబరు అనంతరము మొగలాయిసామ్రాజ్యము నగు నియంతయైన ఆతని తనయుడు హుమాయూను తాను జైత్రయాత్రలకు పోవు నవసరమునగూడ కూడ నొకపుస్తకభాండాగారమును తరలించుకొని పోవు వాడు. చరిత్రకు అందిన ప్రథమసంచార గ్రంథాలయ మిదియేయని నిస్సంశ తముగ చెప్పుకొనవచ్చును. ఈ సందర్భమున నెపోలియనును గూర్చిన ఒక సంగతి సాదృ శ్వనిబంధనమున జ్ఞప్తికి వచ్చుచున్నది. నెపోలియను పుస్తకములనిన చెవికోసికొనువాడు. మంచి పుస్తకములు నెంచి ఆతడు అందు ఒక్కొక్క గ్రంథమును జేబునం దిముడు చిన్న సైజున ముద్రింపించి సుందరముగ బైండు చేయించియుంచుకొని ఈ గ్రంథసంచయమును తాను ఎచ్చటికిపోయిన అచ్చటకు గొనిపోవువాడు. హుమా యూను గ్రంథాలయాభిమానము మిక్కిలి మెచ్చదగి నది. ఆతడు తన విలాసమందిరమును ఒక గ్రంథాల యముగ మార్చిపై చెను. గ్రంథాలయ ప్రియుడగు ఈ రాజొక సారి గ్రంథాలయముననుండగా కాలుజారి మేడ మెట్లపైనుండిపడి అప్పుడు తగిలిన దెబ్బలు కారణము గా మరణించెను. హుమాయూన్ తనయుడు అక్బరు పాదుషా ఒక గొప్పగ్రంథ భాండాగారమును కూర్చెను. తాను జయించిన ఒక గుజరాతు దేశపురాజుయొక్క మునుగూడ నీతడు తన స్వాధీనము లోనికి తెచ్చికొ నేను. తనకడ మంత్రిత్వమువహించి యున్న ఫెయిజి అను వాని గ్రంథ సముదాయమును సయితము అక్బరు తన సొంత గ్రంథ సముచ్చయమున చేర్చికొ నేను. ఈ పుస్తకములన్నియు మూడుభాగ ములుగ విభజింపబడెను. పద్యము, వైద్యము, జ్యోతి షము, సంగీతము అను విషయములకు చెందిన గ్రంథము లన్నియు మొదటి విభాగమున చేర్చబడెను. భాషా


తత్త్వము, వేదాంతము, మతము, ఖగోళశాస్త్రము, రేఖాగణితము అను విషయములకు చెందిన గ్రంథము అన్నియు రెండవ విభాగమున చేర్పబడెను. వాఖ్యాన ములు, వంశ చరిత్రలు, న్యాయశాస్త్రము అను విషయము లకు చెందిన పుస్తకములన్నియు మూడవవిభాగమున చేర్పబడెను. పుస్తకములలో చిత్రములను చేర్చు ఆచా రము ఈతనికాలమున బాగుగ పెంపొందెను. పుస్తక ములను సంకరతరముగ బైండింగు చేయు విషయమున ఈచక్రవర్తి హయాను. లో అతిశ్రద్ధ చూపబడెను. మొగలాయిచక్రవర్తులు స్వయముగా గ్రంథములను ప్రోవుచేయుటయందు అత్యుత్సాహమును చూపు పోయే గాక తమపూర్వులు ఏర్పఱచిన గ్రంథ భాండారములను కంటవతీడుకొని పరిరక్షించుట యందును విశేషాభి మానము చూపిరి. ఇంతటిదీక్షతో, ఇంతటిశ్రద్ధతో మొగలాయిచక్రవర్తులు సంతరించిన గ్రంధ సముదాయ మంతయు క్రీస్తుశకము 1739 వ సంవత్సరమున ఢిల్లీ నగ రముపై ఎత్తివచ్చి దానిని కొల్లగొట్టిన పారశీకుడు నాదిర్షా చేతులలో బడెను. 5. ఇతరరాజుల గ్రంథభాండాగారములు.


దక్షిణ భారత దేశపు సుప్రసిద్ధులగు రాజ నొడగు టిప్పుసూల్తాను బహుళ గ్రంథములను సేక రించెను. 1799-వ సంవత్సరమున శ్రీరంగ పట్టణము పట్టు కొనబడినపుడు ఈగ్రంథ సముచ్చయమంతయు నాశ నము చేయబడెను, లక్నో స్నే పట్టణము పట్టుకొనబడినపుడు 1884వ సంవత్సరమున అయోధ్యనబాబు గ్రంథా లయముకూడ నిప్లేయయ్యెను. కాని పలువురు రాజుల భాండాగారములు కాలపురుషుని నాశనఖడ్గమునకు ఎదురొడ్డి నిలచినవి. నేపాళము, కాశ్మీరము, మైనూ రు, జయపురము, జోధపురము, భోపాల్, ఆళ్వారు రాజ్యములందు పురాతన గ్రంథ భాండాగారములు నేటి కిని సుస్థితీయందున్నవి. ఆయాభాండాగారము లందలి గ్రంథములకు నేడు మంచిమంచి కెటలాగులు తయారు చేయబడియున్నవి. తంజావూరు ప్రభువుల గ్రంథభాం డారము మదరాసు ప్రభుత్వము వారి పరిరక్షణము నంది ప్రజోపయోగకరమైన సంస్థయై ప్రకాశించుచున్నది.


( బరోడా సంస్థానంలోని గ్రంథాలయ శాఖాద్యక్షులు కీ.శే న్యూటన్ మోహన్ దత్తా గారి ఆంగ్ల వ్యాసం ఆధారంగా ) 

( ఆంధ్రభూమి - వార- అక్టోబర్ 1938 సంచిక నుండి సేకరణ ) 


Sunday, December 12, 2021

తెలుగు సాహిత్యంలో ముసల్మాన్ కవులు - కర్లపాలెం హనుమంతరావు ( సూర్య దినపత్రిక ప్రచురితం)

 తెలుగు సాహిత్యంలో ముసల్మాన్ కవులు

 

- కర్లపాలెం హనుమంతరావు 

( సూర్య దినపత్రిక ప్రచురితం) 


' మాతృదేవి యొకటి,మాతృభూమి యొకండు

మాతృ భాష యొండు మాన్యము గదా

మాతృ శబ్దము విన మది పులకింపదా?

వినుత ధర్మశీల తెనుగు బాల' 

ఈ పద్యం ప్రత్యేకత రచన చేసిన కవి ఒక ముస్లిమ్ మతానుయాయుడు. ఇది   'తెనుగుబాల' శతకంలోని ఒక నీతి పద్యం. రాసింది ముహమ్మద్‌ హుస్సేన్‌ . 


పేర్లు ప్రత్యేకంగా చెప్పకపోతే  తెలుగు కవుల సృజనే అని మురిపించే సాహిత్యం  తెలుగునాట ముస్లిం కవులు, రచయితలు  సృష్టించిన మాట వాస్తవం.   వినుకొండ వల్లభరాయుడి 'క్రీడాభిరామం' తలలేని రేణుకాదేవి విగ్రహం ముందు నాటి ఊరి వెలుపలి వాడ ఆడపడుచులు నిర్వస్త్రంగా వీరనృత్యాలు చేయడం వర్ణించింది అద్భుతంగా. అదే పంథాలో అజ్మతుల్లా సయ్యద్ అనే ఓ ముసల్మాన్ కని దేవరకొండలో జరిగే జాతర దృశ్యాలను నాటి సాంఘిక పరిస్థితులు కళ్లకు కట్టేవిధంగా వర్ణించాడు.(చాటు పద్య రత్నావళి. పు. 126) 

సర్కారు ప్రకటించిన స్థలంలో జరిగే సంతలో  డబ్బున్న ఆడంగులు రకరకాల వస్త్రవిశేషాలు సందడిగా కొనుగోలు చేసుకుంటుంటే దమ్మిడీ చేత లేని లంబాడీ ఆడంగులు తమ దరిద్రానికి ఏడుపులు మొదలుపెట్టారుట. లంబాడీ తండాల ఆక్రోశానికి ధనికవర్గాలు నవ్వుకుంటుంటే  ఉడుక్కుంటూ 'మాకీ జూసి నగ్తర్/మీకీ తలిదండ్రి లేవె మీ నే తు/ప్పాకీ తీస్కొని  కొడ్తే/మాకీ పాపంబిలేద్రె..'అంటూ  ఆ బీద మహిళలు షష్టాష్టకాలకు దిగడం చదివితే నవ్వు వస్తుంది.. ఆనక  మనసుకు కష్టమేస్తుంది. తమ మతస్తులను అన్యమతానుయాయులు అవహేళన చేసే అవలక్షణాన్ని అన్యాపదేశంగా నిరసించే  కవి ప్రతిభకు జోహార్లు చెప్పాలనీ అనిపిస్తుంది.  


'సాయిబులకు తెలుగు సరిగా రాదు' అంటూ ముస్లిం పాత్రలకు 'నీకీ.. నాకీ' అంటూ తెలుగు  నాటకాలు, చిత్రాలు తరచూ హేళన చేస్తుంటాయి ఇప్పుడు కూడా.  నిజానికి నిత్య వ్యవహారంలో తెలుగు నేలల మీద.. ముఖ్యంగా దక్షిణాదిన ఏ ముస్లిమ్ మతస్తుడూ ఆ తరహా వెకిలి యాసతో మాట్లాడడు. ఏదైనా కొంత మాటలో తేడా కనిపించినా అది భాషాభేదం  వల్ల కాదు. సంస్కృతుల మధ్య ఉండే సన్నని తారతమ్యపు   పొర కారణంగా సంభవించేది. చిత్రాలలో చూపించేటంత విడ్డూరమైన ఉచ్ఛారణ  వినోదం కోసమైనా మంచి అభిరుచి అనిపించుకోదు కదా!  

తెలుగువారి హిందీ, ఇంగ్లీషు, మరే తెలుగేతర భాషలలో  కనిపించే ఉచ్ఛారణలోనూ ఓ విధమైన యాస సాధారణగా కనిపించే తీరే. వాస్తవానికి తెలుగుదేశాలలో శతాబ్దాల బట్టి తెలుగువారి సంస్కృతీ సంబంధాలలో పాలలో తేనెలాగా కలగలసిపోయిన ఘనత ఇస్లాం మతానుయాయులకు దక్కుతుంది. 


నల్లగొండ జిల్లా చిత్తతూరు గ్రామానికి చెందిన ఇమామల్లీ సాహెబ్ అని ఒక కవిగారికి కులమతాలనే వివక్ష లేదు. కవి అని తనకు తోచిన ప్రతీ సాహిత్యజీవికి అంతో ఇంతో సాయంచేయడం  ఆయన అలవాటు.  మరో సాటి కవి ఎవరో  (చమత్కార.పు.15)  సాహెబుగారి ఔదార్యాన్ని 'అల్లాతుంకు సదా యతుం సె ఖుదచ్ఛచ్ఛాహి ఫాజత్కరే/ఖుల్లాహాతుగరీబు పర్వరినిగా ఖూబస్తునాం మైసునే/అల్లాదేనె మవాఫికస్తుహర్ దూస్రే కోయి నైహై ఇమా/ మల్లీ సాహెబ్ చిత్తలూరి పుర వాహ్వా దోయిలందార్బలా ' అంటూ  ఉర్దూ మిశ్రిత ఆంధ్ర ఛందోపద్యంలో శ్లాఘిస్తాడు. 


ఆంధ్రప్రదేశ్  ముస్లిం జనాభాలో అధిక శాతానికి ఉర్దూ పలుకు నోటి వరకే పరిమితం. అందులోనూ తెలుగువారిలాగా మాట్లాడేవారే ఎక్కువమంది. రాయడం దగ్గరకొచ్చేసరికే ముస్లిముల పాత్ర అటూ ఇటూ. తెలుగు సంస్కృతితో గట్టి అనుబంధం ఉన్నప్పటికీ వాజ్ఞ్మయంలో   ఆ మేరకు బంధం ఎందువల్ల బలపడింది కాదో?!  పరిశోధకులే  నిగ్గుతేల్చవలసిన చారిత్రకాంశం  ఇది.  


ఈ సాధారణ సూత్రానికి మినహాయింపుగా ముస్లిం కవులు తెలుగులో  సాహిత్య సృజన చేసిన మాట కొట్టిపారవేయలేం. రాసిలో కాకపోయినా వాసిలో తెలుగు  సాహిత్యంతో పోటికి దిగగల సత్తా ఈ సాహిత్యానికి కద్దు. 


మరుగున పడ్డ ముస్లిం కవులను గురించి  మరుపూరు కోదండరామరెడ్డిగారు మరువలేని అంశాలు కొన్ని ప్రస్తావించారు.  దావూద్  అనే ఇస్లామిక్ కవి 'దాసీ పన్నా'  అనే కవితా ఖండిక దొరకబుచ్చుకుని చదువుకునే దొరబాబులకు ముస్లిం కవులు సాహిత్య సృష్టిలో ఒక్క ఆలోచనాధారలో మినహాయించి తతిమ్మా అన్నిటా  సమవుజ్జీలేనని అంటారు. ఒప్పుకోక తప్పదు .  


రాజపుత్రుడి రక్షణ కోసం, పన్నా తన పుత్రుణ్ని బలికావించింది. లోకపాపాల కోసం తన బిడ్డను బలి ఇచ్చానని చెప్పుకుంటున్న యొహోవా దేవుడికే ఇది పెద్ద సవాల్! ఎందుకంటే ఆయన చచ్చిపోయిన వాళ్లను కూడా బ్రతికించే శక్తి గలవాడు . కాబట్టి మూడో రోజుకయినా తన బిడ్డను సమాధిలోంచి తిరిగిలేపి తీసుకురాగలిగాడు.కాని పాపం , పన్నాకి ఆ శక్తిలేదు! అయినా పుత్ర త్యాగానికి వెనుకంజవేయలేదు. అందుకే ఆమె త్యాగమే గొప్పదని శ్లాఘిస్తూ దావూద్ హుస్సేస్ రాసిన ఈ కవిత ఎంతో కరుణరసార్ద్ర౦గ  ఉంటుంది. 

' సతత వాత్సల్యంబు జాల్వార్చి పోషింప/ 

తలపు గొన్నట్టి నీ తల్లిలేదు/ 

అఖిలార్ద్రతను నీకు నర్పించి/ 

మమతలం దలడిల్లునట్టి నీతండ్రిలేడు/

ఆత్మరక్తమై తమ్ముడంచు మించిన ప్రేమ/

నరసి పాలింప నీ అన్నలేడు/ 

రాజపుత్రుడితండు రక్షణార్హుడటంచు/ 

పరికించు పాలిత ప్రజయు లేదు/ దిక్కుదెసగలవాడవై దిక్కుగనక/

శోకసంతప్త భావనిస్తులత తోడ/ 

శత్రువుల మధ్య జిక్కిన సాంగపుత్ర/ 

నిన్ను పన్నాయె రక్షించు నిక్కమింక!'   అంటారు కవి. ఎవరి మాటలు ఏ విధంగా సాగినప్పటికీ ..  బలి అయిన   ఆ అభాగ్య బాలుడిని అడిగితే ఏమని ఉండేవాడు? అని ఆయనే మానవతా హృదయంతో కంపించి ప్రశ్నించుకుంటూ ఆ మృతబాలుడి మనోభావాలనూ కవిగా తానే వెల్లడిస్తాడు


'మీ మీ స్వార్థాల కోసరంగా నోరులేని నన్ను బలిచేశార'ని  వాదించడా? అని నిలదీస్తాడేమోనని సందేహిస్తాడు. మానవత్వం సహజలక్షణంగా లేని వ్యక్తులకు ఈ తరహా భావనలు మదిలో మెదిలే అవకాశమే లేదు.  దావూద్  సాహెబ్ కవి ముస్లిం మతానుయాయుడు అయినంత మాత్రాన మనిషిలో ఉండవలసిన అనుకంపన లేకుండా పోయిందా? 


మానవతా విలువలకు మతాలను అడ్డుపెట్టుకుని వ్యాఖ్యానించడం ఎంత పెద్ద తప్పు! అదే ఇప్పుడు దేశంలో విచ్చలవిడిగా సాగుతున్న  అరాచకం ! ఆ దుర్మార్గాన్ని ప్రశ్నించిన ఆలోచనాపరుల పైన దేశద్రోహం అభియోగం రుద్దే జుగుప్సాకరమైన ప్రయత్నమూ యథేచ్ఛగ సాగుతున్నది! షేమ్ ఆన్ అవర్ పార్ట్! సిగ్గు పడవలసిన అమానుషత్వం!

 

ఇంత విపులంగా ఇక్కడ చెప్పుకురావడానికి కారణం ఈ పద్య గద్య సాహిత్యంలో ఎక్కడైనా మన  తెలుగు సినిమాలు హేళనచేస్తున్న లోపం కనిపిస్తున్నదా?  ఈ పుస్తకం రాసింది ఒక ముస్లిం మతానుయాయి అన్న వాస్తవం చెవినబడితే విస్తుపోమా ? పుట్టింది ముస్లిం సంప్రదాయం అనుసరించే కుటుంబంలలోనే అయినా.. దావూద్ సాహెబ్ తరహాలో  ఇస్లాం సంప్రదాయంలో నాని, హిందూ వేదాంతంలో ఊరిన ఎందరో ముసల్మాన్ కవులు చరిత్ర విస్మృతి పొరల్లోకి వెళ్లిపోయినట్లు మరుపూరివారి ఆరోపణ. ఇరవైయ్యొకటో శతాబ్దిలోకి అడుగు పెట్టినప్పటికీ  అదే వివక్ష కొనసాగడం హర్షణీయమా?


కర్నూలు ఉస్మానియా కళాశాలలో తెలుగు- హిందీ పండితులుగా విద్యాబోధన చేస్తూనే తెలుగు భాషాభివృద్ధే  ధ్యేయంగా నిరంతరం కార్యక్రమాలను నిర్వహించారు. తెలుగులోకి పలు ఇతర బాషా గ్రంథాలను అనువదించి ప్రచురించారు. చివరి దశ వరకు తెలుగులో రచనలు గావించారు. ఆదర్శము  లాంటి నవలలు , అబ్దుల్ ఖాదర్ జిలాని దివ్య చరిత్రము, నాగూర్ ఖాదర్ వలీ చరిత్రము వంటి  మహాపురుషుల జీవితచరిత్రలు, ఆజాద్  చరిత్రము లాంటి దేశ చరిత్రలు, ఆఖరుకి అభినవ తిక్కన కవితా సమీక్ష వంటి లోతైన సాహిత్య విమర్శనలు సైతం ముస్లిం కవి అయినప్పటికీ  ఆయన  చేతుల మీదుగానే ఏ తెలుగు పండితుడి రచనకూ  తీసిపోని రీతిలో రూపుదిద్దుకున్నాయి! 


సాహిత్యం పట్ల  అభిరుచి అంటూ ఉండటం ఒక్కటే ముఖ్యం. ఆ ప్రధానమైన దినుసు మనదై ఉంటే దావూద్ సాహెబ్  లా రూపాయిన్నర పెట్టుబడితో  పెట్టుకొన్న కిళ్లీ బడ్డీకొట్టు కూడా మనిషిలోని అక్షర తృష్ణను రెచ్చగొడుతుంది. ఏ మతం, ఏ కులం ఆ అభినివేశపు పురోగతికి అడ్డు  కాలేవు.     

 

అలనాటి సుప్రసిద్ధ నెల్లూరు కవులు మరుపూరు కోదండరామిరెడ్డి, పిలకా గణపతిశాస్త్రి, బెజవాడ గోపాలరెడ్డివంటి  వుద్దండులు నిత్యం సాయంత్రపు  వేళలలో  తన  ‘సాహిత్య తాంబూల సేవన మంజూషా” (కిళ్లీ కొట్టుకి కవులు పెట్టుకున్న ముద్దు పేరు అది) లో చేరి, తమతమ పద్య రచనా పఠనంపై గోష్టులు గావించడం ముస్లిమైన  దావూదు కవిలో తెలుగు సాంప్రదాయక పద్యరచన పట్ల ఆసక్తిని రేకెత్తించింది . ప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితులు దుర్భా సుబ్రహ్మణ్యశర్మ గారి ఆశ్రయంలో  విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టే సమయానికి దావూద్ సాహేబు ఇరవైరెండు ఏళ్ల  ఆడపిల్ల తండ్రి! 


' సాయిబుకు సంస్కృతం నేర్పుతున్నందుకు రాళ్ల దెబ్బకు సిద్ధంగా ఉండమ'ని ఎన్ని బెదిరింపులు వచ్చినప్పటికీ వెనుకంజ వేయని దుర్భావారి నిర్భీతి ఇప్పుడైనా  ఎంత మందికి ఉంటుంది? 


సంస్కృతాంధ్రాలలో మదరాసు విశ్వవిద్యాలయం  విద్వాన్ పట్టా పుచ్చుకుని  నంద్యాల పురపాలక పాఠశాలలో తెలుగు పండితుడుగా చేరి మొదటి నెల జీతం గురుదక్షిణ కింద మనియార్డరుగా దావూద్ సాహెబ్ పంపిస్తే 'నా సాయిబు శిష్యుడు విసిరిన తొలి రాయి’ అంటూ దుర్భావారు ప్రదర్శనకు పెట్టి మురిసిన మరపురానిరోజులు మళ్లీ వచ్చేనా! చిత్త పరివర్తనము, రసూల్‌ ప్రభువు శతకము, సంస్కార ప్రయాణము, సూఫీ  సూక్తులు, సాయిబాబా మీద దండకంతో సహా  ఓ కావ్యము, ఆజాద్ చరిత్రము, వచనంలో అభినవ తిక్కన కవితా సమీక్ష.. అట్లా దాదాపు అన్ని సాహిత్య ప్రక్రియల్లో తన దైన ముద్రతో తెలుగు సాహిత్యంలో గౌరవనీయమైన స్థానం సాధించిన ఘనత దావూద్ సాహెబ్ కవిది. 

 

ఇస్లాము మతాన్ని విశ్వసించే  సాహిత్య స్రష్టలు సృష్టించినవిగా  చెప్పుకునే తెలుగు శతకాలే సుమారు మూడు పదులు . వికీపీడియాలో కనిపించే ఆ జాబితా ఆసాంతం  పరిశీలిస్తే హిందూ కవుల ధోరణిలోనే ముసల్మాను కవులూ శతక సాహిత్యంలో తమకు సుపరిచితమైన  భక్తి, తాత్విక విశేషాలనే ప్రబోధాత్మక పంథాలో  ప్రకటించినట్లు స్పష్టమవుతుంది. 


ముహమ్మద్‌ హుస్సేన్‌ అనే ముసల్మాన్ కవి   'భక్త కల్పద్రుమ శతకము'పేరుతో ఒక చక్కని శతకం రాసారు. ఈ పేరుతోనే   పదహారణాల తెలుగు కవుల (బత్తలపల్లి నరసింగరావు, మేడవరము సుబ్రహ్మణ్యశర్మ, ఖాద్రి నరసింహ సోదరులు) చేతుల మీదుగా మరో మూడు శతకాలు రూపుదిద్దుకున్నప్పటికీ   హుస్సేన్ కవి శతకం  దానికదే ప్రత్యేకం.  మొక్కపాటి శ్రీర్రామశాస్త్రిగారితో కలసి మొహమ్మద్ హుస్సేన్ రాసిన మరో శతకం 'సుమాంజలి'. హరిహరనాథ శతకము అనుగుబాల నీతి శతకము, తెనుగుబాల శతకము మరి కొన్ని! 


ఆ  దారినే సయ్యద్‌ ముహమ్మద్‌ అజమ్‌ అనే మరో ముసల్మాన్ కవి 'సయ్యదయ్యమాట సత్యమయ్య' మకుటంతో, గంగన్నవల్లి హుస్సేన్‌దాసు 'ధర్మగుణవర్య శ్రీ హుసేన్‌ దాసవర్య'  మకుటంతో 'హుస్సేన్‌దాసు ముస్లిమ్ శతక సాహిత్యం సృష్టించారు. ముహమ్మద్‌ యార్‌ 'సోదర సూక్తులు', తక్కల్లపల్లి పాపాసాహెబ్‌ కవి మతవిభేదాలను విమర్శిస్తూ ' వేంకటేశ్వరుండు, బీబి నాంచారమ్మ బెండ్లియాడి మతమభేదమేదియనె  హరి, ప్రమాణమైన వ్యర్థవాదాలేల? పాపసాబు మాట పైడిమూట' అంటారు. 


షేక్‌ ఖాసిం 'సాధుశీల శతకము'లో  'కులము మతముగాదు గుణము ప్రధానంబు/ దైవచింత లేమి తపముగాదు/, బాలయోగి కులము పంచమ కులమయా,/ సాధులోకపాల సత్యశీల' అంటూ సుద్దిచెప్పే ప్రయత్నం చేస్తారు. షేక్‌ అలీ  గురుని మాట యశము గూర్చుబాట' అనే మకుటంతో 'గురుని మాట' శతకం రాస్తూ 'ఇంగిలీసు బాస ఎంతగ నేర్చిన /పాండితీ ప్రకర్ష పట్టుబడదు/ పరులభాష గాన భాధను గూర్చును/గురుని మాట యశము గూర్చు బాట' అన్నారంటే మతాలతో నిమిత్తం లేకుండానే సమాజ సంస్కరణల పట్ల సాహిత్య ప్రగతిశీలులందరిదీ ఒకే బాట- అన్న మాట ఖాయమైనట్లే కదా! 


సమకాలీన సమాజం  నుంచి వ్యక్తులను, వర్గాలను  రకరకాల సమూహాల  వంకతో వేరు చేసే ప్రయత్నంలోని  రాజకీయ ఎత్తుగడలతో సాహిత్యానికి, సమాజానికి నిమిత్తం ఉండదు. ఎక్కడి సంస్కృతితోనే ప్రభావితమైన శక్తులు ఇక్కడి పరిసరాల కాలుష్యానికి కారణమని దుష్ప్రచారం  నిరాటంకంగా కొనసాగినప్పటికీ లౌకిక సమాజం ఆమోదించదు.  


ముసల్మానుల సాహిత్య ప్రయాస ఇచ్ఛాపూర్వకంగా నిర్లక్ష్యానికి గురవుతున్న మాట అవాస్తవేమీ కాదు కానీ.. ఉనికి పోరాటాలు ఊపందుకున్న 1990 లకు చాలా ముందు నుంచే అన్ని దశల్లోనూ యథాశక్తి   తన వంతు ప్రతిభతో ప్రభావితం చేస్తూనే వస్తోందన్నది మొహమ్మదీయ మతం అన్నది ఒప్పుకోక తప్పని వాస్తవం. 


కుడి  నుంచి కుడి వైపుకు రాసుకు పోయే లిపి ఉర్దూ. ఎడమ  నుండి కుడికి రాయడమంటే ముసల్మానుల దృష్టిలో పెడరాతల కిందే లెక్క. ఆ తరహా రాతలను నిరసించమని వారి మతం నివారిస్తున్నప్పటికీ  పెడచెవినబెట్టి తెలుగు సాహిత్య వర్ణమాలకే గులాబిమాలలు  సమకూర్చి పెట్టిన ఘనత ఇస్లాం కవిశ్రేష్టులది.  


ఉర్దూ మాతృభాషగా ఉన్నప్పటికీ లెక్కకు  మించిన సాహిత్యవేత్తలు   తమ ప్రతిభతో తెలుగు సాహిత్యలక్ష్మికి తొడిగిన సందర్భాలు కోకొల్లలు. తెలుగు పత్రికా రంగంలో తొట్టతొలిగా పాదం పెడుతూ  1842, జూన్ 8 మొదటి 'వర్తమాన తరంగిణి' వారపత్రిక తొలి సంచికలో  'మేము మిక్కిలి ధనవంతులము కాము. ఆంధ్ర భాష యందు మిక్కిలి జ్ఞానము గలవారమూ కాము. హిందువుల యొక్క స్నేహమునకు పాత్రులమై తద్వారా ప్రతిష్ట పొందవలెననే తాత్పర్యము చేత నూరార్లు వ్యయపడి ముద్రాక్షరములు మొదలగు పనిముట్లను సంపాదించి ఈ పత్రికను ఉదయింపజేయడమునకు కారకులమైతిమి' అని రాసుకున్నారు సయ్యద్‌రహమతుల్లా సాబ్!


1891 లో  నరసాపురం నుంచి  మీర్ షుజాయత్ అలీ ఖాన్  గారి ఆధ్వర్యంలో సాగిన   'విద్వన్మనోహారిణి'   తదనంతరకాలంలో వీరేశలింగంగారి 'వివేకవర్ధని' లో కలసిపోయింది. రాజమండ్రి నుండి వెలువడ్డ 1892 నాటి బజులుల్లా సాహెబ్,  'సత్యాన్వేషిణి, 1909 నాటి షేక్ అహ్మద్ సాహెబ్  'ఆరోగ్య ప్రబోధిని'  ముసల్మానుల తెలుగు పాత్రికేయ రంగంలో  చేసిన సేవలకు కొన్ని నిదర్శనాలు. 1944 లో  హైదరాబాదు నుంచి వెలువడ్డ  'మీజాన్‌' దినపత్రికకు తెలుగు ప్రసిద్ధ రచయిత అడవి బాపిరాజు సంపాదకులుగా సహకారం అందించారు.   అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం తెలుగు ఆచార్యుడు షేక్ మస్తాన్ గారి  'తెలుగు సాహిత్యం-1984 వరకు ముస్లిముల సేవ" అనే సిద్ధాంతవ్యాసానికి 1991 లో నాగార్జున యూనివర్శిటీ లో పి.హెచ్.డి వచ్చింది. సయ్యద్ సలీం నవల '  కాలుతున్న పూలతోట' 2010 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు సాధించింది. వేంపల్లె షరీఫ్ కథల పుస్తకం 'జుమ్మా' 2012లో కేంద్రసాహిత్య అకాడెమీ యువ అవార్డు గెల్చుకున్నది.

 

సయ్యద్ నశీర్ అహ్మద్ 'అక్షర శిల్పులు' పేరుతో 333 మంది తెలుగు ముస్లిం కవులు, రచయితల వివరాలతో 2010 లో సమాచార గ్రంథం వెలువరించడం .. తెలుగు సాహిత్య లోకంలో ఉర్దూకవుల పాత్రను తగ్గించి చూడలేమని చెప్పడంగా అర్థం చేసుకోవడం మేలు.

'సారే జహాఁసె అచ్ఛా - హిందూసితాఁ హమారా హమారా/హమ్ బుల్ బులేఁ హైఁ ఇస్‌కీ యే గుల్ సితాఁ హమారా, హమారా'('సమస్త ప్రపంచములలో  ఉత్తమైనది  మన హిందూస్థాన్.. ఇది మనదే.. మనదే!మనం దీని బుల్ బుల్ పిట్టలం సుమా!ఈ దేశం ఈ దేశమే మన ఉద్యానవనం మిత్రమా!) సెప్టెంబర్ 23, 1964 నాటి మహమ్మద్ ఇక్బాల్ పాట అయినప్పటికీ ముస్లిమ్ సోదరసోదరీమణుల మనోరథం ఇప్పటికీ ఇదే! దేశం లౌకిక తత్వానికి సంకేత సూచకంగా ఈ గీతాన్నీ  మనం మన జాతీయగీతాలలో  ఒకటిగా మలుచుకున్న లౌకిక భావం  మర్చిపోతున్నామా? 'పదవీ వ్యామోహాలు, కులమత భేదాలు, భాషాద్వేషాలూ చెలరేగే నేడు' అంటూ  మహాకవి శ్రీశ్రీ  వాపోయాడు  వెలుగు నీడలు సినిమాలో. అరైవై ఏళ్లనాటికన్నా అధ్వాన్నంగ  ఉంది ఈనాటి పరిస్థితి!


' లుచ్ఛా జమానా ఆయా/అచ్ఛోంకో హాథ్ దేనా హర్ ఏక్ సికా/ అచ్ఛా జమానా ఫిర్ కబ్ / వచ్చేనా  చెప్పవయ్య వల్లీసాబు!' (చెడ్డవాళ్ల కాలం వచ్చింది. చెయ్యివ్వడమే ప్రతివాడు నేర్చేసుకుంటున్నది. మంచిరోజులు ఎప్పుడు వస్తాయో చెప్పవయ్యా వల్లీసాహెబూ? అని ఓ శాస్త్రులుగారు  పోయిన వాపోతకు  ఆ వల్లీసాహెబుగారు 'బందేనవాజ్ బుజురుగ్ /జిందా హై ఆజ్ తో న జీతే హమ్ ఖుదా/ బందాహి జానె వహాసబ్/గందరగోళం జమాన ఖాజాసాబూ! (దేశసేవకులు, పుణ్యపురుషులు (చేసిన మంచి పనుల వల్ల) శాశ్వతంగా ఉన్నారు. మనం అట్లా జీవించలేం. దైవభక్తుడు, సేవకుడు ఆ విషయం తెలుసుకోడం మేలు. ఇప్పడు వచ్చిందంతా గందరగోళంగా ఉండే కాలం కదా ఖాజాసాబూ?) అంటూ ఆ వల్లిసాబుగారు జవాబు ఇచ్చారని ఓ సరదా కవిత్వం.  అల్లికలో సరదా కనపడుతున్న మాట నిజమే కానీ, పద్యాలలో ప్రస్తావించిన దైన్య స్థితి మాత్రం ఈ హిందూ- ముస్లిమ్  మత భేదాల కారణంగా దేశంలోని సామరస్య వాతావరణం దెబ్బతింటుందోన్న వాస్తవం అందరం ఒప్పుకోవాలి. 


మెహబూబ్ నగర్ జిల్లా మొదటి పేరు పాలమూరు జిల్లా. కరువుకాటకాలకు ఆ జిల్లా మారుపేరు. పనిపాటలు చేసుకుని పొట్టపోసుకునే జనాభా అధికంగా ఉండేదీ అక్కడే! అనావృష్టి పరిస్థితులకు అక్కడి జనాభా తరచూవలసబాట పట్టే పరిస్థితులను కదలిపోయి 'తూఫాను వానలే తుదికి గతియాయె/ఋతుపవనాలెల్ల గతిని దప్పె/చెఱువులు కుంటలు దొరువులు జాలులు/ఇంకి నెఱ్ఱెలు వారె బంకమట్టి/వర్షాలు కురియక కర్షకులెల్లరు/ బ్రదుకుదెరువు బాసి బాధపడుచు/గొడ్డు గోదముల నెల్ల గడ్డి గాదెము లేక/దుడ్డుదమ్మిడికమ్మి దుఃఖపడుచు/లేబరై గుంపుగుంపుగ లేవసాగె/తాళములు వేసి ఇళ్లకు తల్లెచెంబు/కుదువబెట్టుచు కూటికై వదలి రిపుడు/పల్లెలెల్ల లబోమని తల్లడిల్లె' అంటూ ధుఃఖంతో జహంగీర్ మహమ్మద్ అనే ముసల్మాన్ కవి అచ్చమైన తెలుగు పలుకుబడిలో వెళ్లగక్కిన ఆవేదన ఏ ముస్లిమేతర  కవి సాధించగలిగేది ? 


కదిలితే తెలుగు కవిత, మెదిలితే తెలుగు మాటగా బతికిన ముసల్మాన్ కవుల జాబితా కదిలించాలే గాని హనుమంతుని తోకంత! విందుకు పిల్చి రోసెన్న అనే పెద్ద మనిషి పాచి అన్నం పెట్టినందుకు విస్తరి ముందు నుంచి లేచిపోతూ హుస్సేన్ మహమ్మద్ అనే రాయలసీమ కవి 'అయ్యవ! మియ్యవ!కొయ్యవ!/చయ్యన చల్దన్నమేసి సరిపుచ్చెదు రో/శయ్యా పిన్నలు పెద్దలు/కుయ్యోమనుచున్న యిట్టి గోడును గనవా!' తిట్టిపోసాడు. ఆ సందర్భంలో హుస్సేన్ సాబ్ నోటి నుంచి వెలువడిన ఆవేదన 'అక్కట దయలేదా మరి/బుక్కెడు కూటికిని కటకటంబుట్టించితిరో!/కుక్కవొ నక్కవొ తిక్కవొ!/చిక్కడు నీ వంటి లోభి సిద్ధము వినరా!' అనే ఆవేదన ఇప్పటి వాతావరణంలో ఆ మైనారిటీ జాతి ఎదురుకొనే అవమానాలకు  దర్పణం పట్టినట్లనిపిస్తుంది కదూ!   'భక్త కల్పద్రుమ శతకము కర్త మహమ్మదు హుస్సేన్ ఈ హుస్సేస్ సాబ్ అవునో కాదో తెలియదు.  సాహేబు ఎన్ని సుభాలేలినా బేగమునకు కుట్టుపోగులే! అన్నట్లుంది దేశంలో ఉర్దూ పౌరుని దైన్య స్థితి.   


-కర్లపాలెం హనుమంతరావు

23 - 99-2021 

బోధెల్ ; యూ. ఎస్.ఎ 

 

 


 

 


Thursday, August 26, 2021

ఇస్లాం మతం -కర్లపాలెం హనుమంతరావు

 పుట్టింది కేవలం 1500 ఏళ్ల కిందట. కానీప్రపంచ జనాభాలో ఆరో శాతనికన్న కొంచెం ఎక్కువగా ఇప్పుడు విశ్వసిస్తున్నది ఇస్లాం మతం. ప్రపంచ జనాభా 652 కోట్లు అని లెక్కవేసిన 2004లో ముస్లిం మత విశ్వాసుల సంఖ్య 152 కోట్లు. ఇండొనేశియాలో మెజారిటీ మతం ఇస్లాం 21 కోట్ల 60 లక్షలు. సౌదీ అరేబియా, బహ్రేన్, వెస్ట్రన్ సహారాలలో వంద శాతం ముస్లిములే! టర్కీ, ఒమాన్, గాజా, యూ.ఎ.ఇ, సోమాలియా, ఇరాన్, అల్జీరియా, ట్యునీషియా, లిబియా, గాజాస్ట్రిప్, కతర్, సెనెగల్, సిరియా, గాంబియా, మాలి లాంటి దేశాలు ఇంకా చాలా చిన్నవి పొన్నవీ ఉన్నాయి.. వాటిలో నూటికి తొంభై మంది ముసల్మాన్ మతస్తులే! భారతదేశంలో 109 కోట్లుగా ఉన్నప్పుడు ముస్లిం జనాభా15 కోట్ల 30 లక్షలు. జనాభాలో  ఏడో వంతు. (పాకిస్తాన్ జనాభా మరో 70 లక్షలు మాత్రమే అధికం). ఇవన్నీ కొత్త శతాబ్దం తొలి దశకం అంచనా. తతిమ్మా అన్ని మతాల కన్నా ముస్లిం జనాభా అత్యంత వేగంగా పెరుగుతున్నట్లు అంతర్జాతీయ గణాంకాలు లెక్కలు వేసుకుని చెబుతున్నాయి. 

ఇస్లాం అనే పదం అరబిక్ భాషలోని 'స్లం' అనే అక్షరం నుంచి పుట్టింది. మనసుని బుద్ధిని భగవంతుని పరం చేసి సాధించే శాంతిని 'స్లం' అంటారు. ముస్లిం అంటే బుద్ధిని సర్వేశ్వరుని పరం చేసిన వ్యక్తి. ఖుర్ ఆన్ వీరి పవిత్ర గ్రంథం. ఇందులోని సూక్తులన్ని స్వయంగా భగవంతుడు ప్రవక్తకు అందించినవి. ఇస్లాం ప్రవక్త పుట్టించిన మతం కాదని.. సృష్టి ఆది నుంచి ఉన్న మతాన్నే ప్రవక్త ద్వారా ప్రపంచానికి తెలియచేసాడని మత పెద్దలు భావిస్తారు. తన ముందు వచ్చిన ప్రవక్తలకు మల్లే ఇస్లాం మత సూత్రాలని ఏ కొద్దిమందికో కాకుండా ప్రపంచమానవాళి మొత్తానికి అందించిన కారణంగానే మహమ్మద్ ప్రవక్తకు ఎక్కువ ప్రాచుర్యం లభించినట్లు చెబుతారు.  తాము నమ్ముతూ వస్తున్న మత భావాలకు విరుద్ధంగా హేతుబద్ధమైన సూత్రాలతో ప్రపంచాన్ని వేగంగా ఆకర్షించే మహమ్మదు ప్రవక్త మీద ఆ మత పెద్దలకు కినుక. కినుక ఎక్కువ అయితే హింసా ఎక్కువవుతుంది. మహమ్మదు మీదా, అతని అనుచరల మీదా హింసాకాండ పెచ్చు మీరడంతో మక్కాను వదిలి రెడి సీ మీదుగా అబిసీనియా(ఇప్పుడది ఇథియోపియా) చేరుకున్నాడు  మహమ్మద్. ప్రవక్తను అనుసరించిన నూటొక్క మంది అనుచరులలో 83 మంది పురుషులు, 18 మంది స్త్రీలు. అయినా మక్కాలో మహమ్మద్ కుటుంబాన్ని సంఘబహిష్కర చేసి హింసించింది మక్కా  మతపెద్దల గుంపు. ప్రవక్తకు అండగా ఉంటూ వచ్చిన పినతండ్రి  అబూ తాలిబ్, భార్య ఖదీజా మరణించిన విషాద కాలాన్ని ముసల్మానులు అముల్ హుజ్న్ (విషాద సంవత్సరం) పరిగణిస్తారు. ఆ తరువాతా హింస తగ్గని వాతావరణంలోనే మక్కావాసుల  భక్తి విశ్వాసాలను క్రమంగా పెంచుకుంటూ బహిష్కరణ తరువాత పదమూడవ ఏట ఎస్రిబ్ నగరంలో భగవంతుని వాణిని వినిపించేందుకు సిద్ధమయాడు మహమ్మద్.  అక్కడ అంతకు ముందున్న విరోధి వర్గాల మధ్యన సయోధ్య కుదిర్చి శాంతి వాతావరణం కలిపించి తిరిగి వెళ్లే సమయంలో రాత్రి వేల హంతకుల మూఠా ఆయనను మట్టుపెట్టే ప్రయత్నం చేసింది. ప్రవక్త స్థానంలో ఆలీ అనే అనుయాయి ఉండిపోవడంతో ప్రాణగండం తప్పింది. ప్రాణమిత్రుడు అబూ బకర్  ఒక్కడినే వెంటపెట్టుకుని మదీనా చేరడంతో ఇస్లా చరిత్రలో నూతన శకం 'హిజ్రీ శకం'  ఆరంభమయింది. ప్రవక్త మక్కా నుంచి మదీనా వలసవెళ్లడం 'హిజ్రల్ ' చరిత్రలో ప్రసిద్ధం.  ప్రవక్త రాకతో ఎస్రిబ్ 'మదీన్నతుబీ' (ప్రవక్త నగరం)గా పేరు మారిపోయింది. ప్రవక్త రాకతో ఎస్రిబ్ నగరవాసులు ఎందరో ఇస్లాం మతంలోకి చేరిపోయారు. బహుదేవతారాధకులకు/అవిశ్వాసులకు.. ఇస్లాం మతానుయాయులకు క్రీ.శ 624 నుంచి 627 దాకా మూడు యుద్ధాలు జరిగాయి. మక్కా మదీనాలకు మధ్యన నైరుతీ దిశలో సుమారు 136 కి.మీ దూరంలో ఉన్న బద్ర్ అనే స్థలంలో హిజ్రీ శకం ఆరంభం అయిన రెండో ఏడాది (క్రీ.శ 624)లో జరిగిన యుద్ధం ఇస్లాం చరిత్ర గతిని మార్చేసిన ఘట్టం. ముస్లిములు ఈ యుద్ధంలో ఓడిపోతే ప్రపంచంలో ఇప్పుడు ఇస్లాం అన్న ఒక మతమే ఉండేది కాదు. ఈ మాట స్వయంగా మహమ్మద్ ప్రవక్త యుద్దసమయంలో అల్లాకు చేసుకున్న విన్నపం. తక్కువ సంఖ్య  ఉన్నాఇస్లాం పక్షం విజయం సాధించడానికి అల్లా ఆశీర్వాదమే కారణమని ముస్లిములంతా భావిస్తారు.తరువాతి  రెండు ఏడాళ్లూ ఉహుద్ కొండప్రాంతంలో మదీనా పరిసరాల ప్రాంతంలో జరిగిన యుద్ధాల విజయాల కారణంగా  మక్కా కూడా ఇస్లాం మతం స్వీకరించడంతో విగ్రహాలు అక్కరలేని 'కాబా' పూజా విధానం ప్రపంచమంతటా ఆల్లుకునేందుకు పునాది వేసినట్లయింది. ప్రపంచ ముస్లిములకంతా ఇప్పుడు హజ్ ఇప్పుడు జీవితంలో ఒక్కసారైనా దర్శించుకుని తీరవలసిన పుణ్యస్థలి. క్రీ.శ 632, జూన్ 8 న (హిజ్రీ శకం 11 వ సంవత్సరం, రబీవుల్ అవ్వల్ నెల 11వ తేదీ) మహమ్మద్ తన 23 ఏళ్ల ప్రవక్త జీవితాన్ని చాలించుకుని బౌతికంగా కనుమరుగయినప్పటికీ.. ఆయన  ప్రసాదించిన జ్ఞాన సంపదలు ఖుర్ ఆన్, సున్నత్ ప్రపంచగతిని ప్రతీ దేశంలోనూ అనుకూలంగాగానో, ప్రతికూలంగానో మొత్తానికి తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయ్!

ఖుర్ ఆన్ ముస్లిముల పవిత్ర గ్రంథంగా మనందరికీ తెలుసును. సున్నత్ ప్రవక్త నెలకొల్పిన సంప్రదాయాల సంకలనం. ఆఖరి రోజుల వరకు ఆయన  చేసిన బోధనలు 'హదీసు' పేరుతో సుప్రసిద్ధం. సమాధులను, గోరీలను పూజాలయాలు చేయవద్దన్నది మహమ్మది ప్రధాన ఆదేశం.

అల్లా ధర్మమని భావించిన దానినే తాను 'హలాల్' గా , అధర్మని భావించిన దానినే 'హరామ్' గా బోధించినట్లు చెబుతూనే దేనినీ తనకు వ్యక్తిగతంగా ఆపాదించే ప్రయత్నం చేయవద్దని సూచించారు. దురదృష్టం కొద్దీ ఇప్పుడు ఇస్లాం మత పేరున చెలరేగుతున్న  అనుకూల, ప్రతికూల  సంఘటనలన్నీ మహమ్మద్ ప్రవక్త రూపంలో బోధించిన తీరులో సాగడంలేదు. విచారకరం!

(అంతర్జాలంలో సేకరించిన సమాచారం ఆధారంగా రాసిన వ్యాసం. రచయితకు ఏ తరహా ఉద్దేశాలు ఆపాదించవద్దని ప్రార్థన) .

- కర్లపాలెం హనుమంతరావు 

25 -08 -2021 


Monday, December 7, 2020

ఓ డోలోడు - కథానిక – రచయిత పేరు తెలియదు)- సేకరణ ః కర్లపాలెం హనుమంతరావు

 చేస్తున్న పని ఆపి కాలుతున్న చుట్టను ఒక దమ్ము లాగి మళ్లా పక్కనే పెట్టాడు సుబ్బులు. నడుముకు వారుతో తగిలించుకున్న వంకీతో డోలుకున్న వారు పట్టెల్ని మరోమారు లాగాడు. నిలబెట్టుకున డోలు కుడి మూతను నాలుగైదు సార్లు తట్టి  శృతి చూసుకున్నాడు. మళ్లా చుట్ట చేతిలోకి తీసుకుని రెండు మార్లు దమ్ములాగాడు. చుట్ట అయిపోవడంతో దూరంగా విసిరేశాడు. అదెళ్లి టెంకాయ చెట్టు మొదట్లో పడి అక్కడున్న నీళ్ల తడికి సుయ్యిమంది.

డోలును ఎడం మూత పైకి వచ్చేటట్లు తిప్పాడు. డోలు పుల్ల తీసుకుని దాని మీదా కొట్టి చూశాడు. అనుకున్నట్లు మోగలేదేమో 'ఛీ! దీనమ్మ' అనుకుంటూ డోలును మళ్లీ వంకీతో లాగడం మొదలుపెట్టాడు. కుడి మూత రంధ్రం నుంచి డోలు కర్ర మీదుగా ఎడం మూత రంధ్రంలోకి దూర్చుతూ డోలు కర్ర పట్టీ చుట్టూ ఉన్న వారుపట్టీలను లూజు లేకుండా బిర్రుగా లాగాడు.

సుబ్బులకు గొంతు కింద పోస్తున్న చెమట గుండె మీద నుంచి నడుం వరకు కారుతోంది. నల్లటి శరీరానికి నిమ్మచెట్ల మీద నుంచి వచ్చే గాలి తగలడంతో హాయిగా అనిపించింది. పక్కనే ఉన్న పై కండువాతో శరీరాన్ని తుడుచుకున్నాడు.

అలా నాలుగు సార్లు శృతి చూసుకున్నాక మిగిలిన వారును డోలు అడ్డకర్రల పట్టీగా నాలుగైదు వరుసలు చుట్టాడు. సొప్ప తీసుకుని ఎడం మూత కడెంలోకి చొచ్చుకొనొచ్చిన పిచ్చులపై ఆనించి గుండ్రాయితో తడుతూ పిచ్చుల్ని ఇంకా లోపలికి కొట్టాడు. ఎండ తగిలేటట్టు ముందు రోజు తయారు చేసి ఏలాడ గట్టిన బొట్టెల్ని తీసుకొనొచ్చాడు.  మంగలి పొదిలో నుంచి గోరుగాలు తీసుకుని గోగుపుల్లల చుట్టున్న బొట్టెల్ని జాగ్రత్తగా గుండ్రంగా కోసి వాటి నుంచి బైటికి తీశాడు. వాటిని ఎడం చేతి బొటన వేలుకు మినహా అన్ని వేళ్లకు పెట్టుకున్నాడు. గోతం పట్టని సరి చేసి డోలు కొట్టడం మొదలు పెట్టాడు.. పాల వరసల నుంచి .

యుద్ధానికి సిధమయ్యే సైనికుడిలా.. కళను సృష్టించబోయే ముందు కళాకారుడి ఆత్మనివేదనలా.. తదేక దృష్టితో సుబ్బులు దానిలో మునిగిపోయాడు.

ఇంటర్మీడియెట్ చదువుతున్న సుబ్బులు చిన్నకొడుకు కాలేజీ ఫీజుల కోసం కావలి నుంచి వచ్చాడు. సిటికేసర చెట్టు కింద, పొయ్యిలోకి కరతమ్మ పుల్లల్ల్ని చిదుగులుగా కొడుతూ తండ్రి వాయించే డోలుకు తలూపుతున్నాడు.

సుబ్బులు కూతురు అత్తగారింటి నుంచి వచ్చుంది. మళ్లా పంపాలంటే చీరన్నా పెట్టాల్సిందే. దారి ఖర్చులూ ఇవ్వాల్సిందే.

సాయబ్బుల పీర్ల పండక్కి వాయిస్తే ఈ దఫాకి మీ ఇద్దరి గొడవా వదిలినట్లే అన్నాడు వారం రోజుల కిందట సుబ్బులు. కానీ ప్రతి ఏడాదిలా ఈ ఏడు పీర్ల పండగ మేళం సుబ్బులుకు ఊరకే రాలేదు. పెద్ద తిరకాసే జరిగింది.

***

ఆ రోజు సుబ్బులు బస్టాండులో ఉన్నాడు. ఎవరో వస్తే గడ్డం చేస్తున్నాడు. సాయబ్బులపాలెం నుంచి మదర్సా హడావుడిగా వచ్చాడు. 'అరేయ్ సుబ్బులూ! ఈసారి పీర్ల పండక్కి మేళాల కోసం పెద్ద రబస జరిగిందిరా! అన్ని సావిళ్లోళ్ళు ఈసారి పక్కూరి నుంచి పిలిపిద్దాం'అన్నారు. 'కొత్తపట్నం, అలకురపాటి నుంచి తెప్పిద్దాం'అన్నారు.

గడ్డం చేస్తున్నోడల్లా ఆ మాటకు ఉలిక్కిపడ్డాడు సుబ్బులు. 'అవున్రా! మనూరోళ్ల కంటే కొత్తపట్నమోళ్ళు బాగా వాయిస్తన్నారని అంటున్నారు. ఎంత చెప్పినా వింటన్లే!'

'అదేందిరా మదర్సా! మీకు ఒడుగులైనా.. గిడుగులైనా మేమే కదరా వచ్చేది. చిన్నప్పట్నుంచి కలసి మెలసి తిరిగాం. గడ్డమైనా.. క్రాఫైనా ఎంతిస్తే అంతే తీసుకున్నాం. మన సాయబ్బులే.. మనోళ్లే.. అనుకున్నాం. ఇప్పుడేందిరా.. ఇదీ!' అన్నాడు.

'అవున్రా! నేనూ అదే చెప్పా! కానీ .. కుర్రోళ్లు .. ఎదిగొఛ్చారు కదా! ఇంటంలా! మిగతా మూడు సావిళ్లు మా చేయి దాటిపోయింది. మా సావిడి మేళం మాత్రం సుబ్బులన్నే అని గట్టిగా చెప్పొచ్చారా!' అన్నాడు.

సాయిబులపాలెం పెద్దలతో మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది. చివరికి ఆ ఒక్క సావిడీ ఒప్పుకుని బయానా తీసుకున్నాడు సుబ్బులు.

అన్నిసావిళ్ల పని ఒప్పుకుని పక్కూళ్ల నుంచి మేళగాళ్లను తెచ్చి పని జరిపిస్తే కాస్త డబ్బు మిగులుతుంది. అది అందరికి తెలిసిందే. పక్కూరోళ్లను మేళానికి పిలిచినా అట్లాగే చేస్తారు. కానీ ఈసారి సుబ్బులుకు ఆ అవకాశం లేదు. అదే అలవాటుగా మారితే ఈ ఊరు మంగలోళ్ల పరిస్థితి ఏమిటి? మేళాలన్నీ పక్కూరికి పోతే ఈ ఊరి మీద పట్టు పక్కూరికి పోద్ది. అది జరక్కూడదంటే పక్కూరోళ్లకంటే ఈ ఊరే మేలనిపించాలి. తమ సత్తా ఏంటో పీర్ల పండక్కి చూపించాలి అనుకున్నాడు.

గొల్లోళ్ల వెంకన్న దగ్గరికెళ్లి మంచి మేక తోలు తెచ్చి ఆరకొట్టాడు. డోలు కున్న మూతలు విప్పి నానేసి తోలు విప్పాడు. ఆరగొట్టిన కొత్తతోలు కడాలు సైజుకు తగ్గట్లు గోరుగాలుతో కోశాడు. ఎడం మూత రెప్ప కోసం మంచిగా తోల్ని సిద్ధం చేసుకున్నాడు. రెండు రోజులు బక్కెట్లో నానేశాడు. మూడు పూట్ల తొక్కి తోల్ని పొదగడానికి సిద్ధం చేశాడు. చిన్నకొడుకు ఊర్రాముల చిల్లరకొట్టు ఎదురుగా చింతిత్తులు ఏరుకొచ్చాడు. గుండ్రాయితో చిన్నచిన్న ముక్కలుగా చితక్కొట్టి నానేశాడు. సుబ్బులు పెళ్లాం వాటిని మెత్తగా రుబ్బి, వండి, మైదా కలిపి బందన తయారుచేసింది.

సుబ్బులు కడేలుకు బందన పూసి తోలు అతికించాడు. గట్టిగా అతుక్కునేందుకు బిరుసు గుడ్డతో అదిమాడు. ఎడం మూత పొదగడానికి వల్లూరు జగ్గయ్య దగ్గరికెళ్లి మిషను తెచ్చాడు. కడానికి తోలు అతికించి బాగా అత్తుకునేందుకు మిషను బిగించాడు. ఆరపెట్టాడు. రెండు మూతలు ఆరాక చింతగింజలు పెట్టి మధ్య దూరం సమానంగా ఉండేటట్లు చూసి కళ్లు(రంధ్రాలు) కోశాడు. అక్కడ తోలు నానడానికి గుడ్డపీలికతో వాటిని తడుపుతూ రోజంతా ఉంచాడు. ఎడం మూత ఆరాక దానిపై రెప్పను అతికించి మళ్లా పొదిగాడు. డోలు కర్రకు గుడ్డతో నూనె పూసి బాగా సిద్ధం చేసుకున్నాడు. కుడి మూత మధ్యలో నల్లటి బూడిదరాశాడు.

 

సుబ్బులు చిన్నకొడుకు, కూతురు కలసి ఇంట్లో పాత కద్దరు గుడ్డను అంగుళం వెడల్పు ఉండేటట్లుగా పేలికలు పేలికలుగా చించారు. రెండు గోగుపుల్లల్ని జానెడంతవి నరికి సిద్ధంచేసుకున్నారు. సిమెంటు, అన్నం కలిపి మెత్తగా నూరారు. గుడ్డలేలికలకు దానిని పూసి గోగుపుల్లలకి రెండు కొసల దానిని అంటించారు.  వాట్ని ఎండలో ఆరగట్టారు. అవి ఎండాక గోగుపుల్లల్నుంచి విడదీస్తే బొట్టెలు అవుతాయి.

ఆ రోజు సుబ్బులు పొద్దున్నె అన్నిట్నీ ముందేసుకుని కూర్చున్నాడు. డోలు కర్రని నిలబెట్టి కింద కుడి మూత, పైన ఎడం మూత పెట్టి రంధ్రాల గుండా వారు ఎక్కించాడు. మూతలు బిర్రుగా ఉండి, శృతి రావడం కోసం వారు పట్టీలకు వంకీ తగిలించి లాగుతున్నాడు.

లాగుతున్నాడే కానీ, పక్కురోళ్ల గురించి, వాళ్ల డోళ్ల గురించి, సన్నాయిల గురించి,వాళ్లు వాయించే విధానం గురించి ఆలోచిస్తున్నాడు. అంతే కాదు.. సొంతూర్లో పరువు నిలబడాలంటే ఎలా అని ఆలోచిస్తున్నాడు.

వాయించడం అయిపోయాక, అన్నిట్నీ నెమరు వేసుకున్నాక, డోల్ని మరోసారి సరిచూసుకుని పట్టెడ తగిలించాడు. గుడ్డ కప్పాడు. ఇంట్లో దేవుడి మూలనున్న పీటపై పెట్టొచ్చి ప్రశాంతంగా గాలి పీల్చుకున్నాడు. నిప్పెట్టె తీసి చుట్ట అంటించాడు. దమ్ములాగుతూ మార్కెట్లో ఉన్న పంచలోకి వెళ్లి కూర్చున్నాడు.

***

సుబ్బులూ వాళ్ళు నలుగురు అన్నదమ్ములు. పెద్దోడు సన్నాయి, రెండోవాడు .. అదే సుబ్బులు, మూడో వాడు మళ్లీ సన్నాయి, నాలుగోవాడు మళ్లీ డోలు.. వాయిస్తారు. వాళ్లయ్య చస్తూ చస్తూ ఊరిని, వృత్తిని చూపించిపొయ్యాడు. పక్కూరు మంగలోళ్లకు ఈ నలుగురు అన్నదమ్ములంటే హడల్. కాని, డబ్బులు బాగా ఇస్తారని ఈ కొత్తపట్నపోళ్లు, అలకురపోటోళ్లు ఒప్పుకున్నారు. ఈ విషయం నలుగురు అన్నదమ్ములకు తెలుసు. అందుకే వాళ్లు సన్నాయిల్ని కూడా గట్టిగా సిద్ధంచేసుకున్నారు.

పీర్ల పండగ రానే వచ్చింది. మొదట్రోజు సావిట్లోంచి పీర్లను దించడం. మామూలుగానే సాగిపోయింది. సుబ్బులు ఆ ఊరు మంగలోళ్లకున్న పీరు దగ్గరకు వెళ్లి 'మా పరువు నీవే కాపాడాల' అని వేడుకున్నాడు. పెళ్లాంతో కలిసి బొరుగులు, వేగించిన శెనగపప్పు, బెల్లం పీర్లకు ఇచ్చొచ్చాడు. తర్వాతి రోజు గుండం తొక్కడం కూడా అయింది. ఆ తర్వాతి రోజే పీర్ల ఊరేగింపు.

ఆ రాత్రి సాయిబులపాలెంలో ప్రతి సావిడి దగ్గర సినిమాలు, నాటకాలు, రికార్డింగ్ డ్యాన్సులు.. పోటీపడి వేస్తారు. వేకువ జాము మూణ్ణాలుగ్గంటలకు పీర్లు ఊరు చుట్టూ తిరుగుతాయి. ట్రాక్టర్ల మీద డూపు హీరోలు, హీరోయిన్లు ఎగురుతుంటే జనాలకు సందడే సందడి.

పదిగంటలకల్లా పీర్లు ఊరు చుట్టూ తిరుగుతుంటే నీళ్లతో వారు పోసేవాళ్లు పోస్తూనేవున్నారు. అందరు ఇళ్ల నుంచి బయటికొచ్చి చూస్తున్నారు. సాయిబుల పిల్లలు ఎగురుతుంటే దానికి అనుగుణంగా మేళం మోగుతోంది.

పీర్ల ఊరేగింపు తిరుగుతూ తిరుగుతూ ఊరి మధ్యలో ఉన్న రాంసామి మేడ దగ్గరి కొచ్చింది. పీర్లు అన్నీ వరుసగా నిలబడ్డాయి.  ఏ పీరు కాడున్న మేళగాళ్లు ఆ పీరు దగ్గర వాయిస్తున్నారు. సన్నాయిలు శృతిమించి మోగుతున్నాయి. జనాలందరూ విరగబడి చూస్తున్నారు, ఎగిరేవాళ్లు ఎగురుతూనే ఉన్నారు.

అప్పటికే మేళగాళ్లకి మందు సరఫరా అయింది. సుబ్బులుకి, వాళ్లన్నకు మందు అలవాటు లేదు. మిగిలిన పీర్లకాడ వాళ్లు తాగిన మైకంలో వాయిస్తున్నారు. అలకురపాటి ఎంకట్నర్సు రేపు చూసుకుందాం అన్నట్లు సుబ్బుల్ని చూసి తలెగరేశాడు. కొత్తపట్నం సీను సన్నాయిని గుండ్రంగా తిప్పుతూ సై అన్నట్లు చూశాడు. సుబ్బులుకు కోపం నసాళానికి అంటింది.' నా కొడుకులు వాయించేది తక్కువ.. ఊగేది ఎక్కువ' అనుకున్నాడు. నిటారుగా నిలబడి డోలు వాయిస్తున్నాడు. అట్లా పోటీ రంజుగా సాగుతుంటే 'టైం లేదు .. టైం లేదు.. పదండి.. పదండి' అంటూ సాయిబుల్లోని పెద్దలు పీర్లని ముందుకు కదిలించారు.

మరుసటి రోజు గుమ్మటాలు. అదే చివర్రోజు. గుమ్మటాలన్నీ ఊర్లోని పెద్ద బజారుగుండా సముద్రానికి వెళతాయి. అక్కడే వాట్ని కలిపేస్తారు.

ఆరు గంటలకల్లా గుమ్మటాలు సాయిబులపాలెంలో బైలుదేరాయి. ఒక్కో గుమ్మటం దగ్గర జనాలు ఇసకేస్తె రాలనంతగా ఉన్నారు. ఒకచోట ఒకరు చేతిరుమాలును పళ్ల మధ్య బిగించి నాగిని నృత్యం చేస్తుంటే, మరోచోట ఇంకోడు పులి డ్యాన్స్! ఇలా అన్ని గుమ్మటాల దగ్గరా కోలాహలం. ఊరు ఊరంతా కులం, మతం, ఆడ, మగ భేదాల్లేకుండా ల గుమ్మటాల చుట్టూరా ఉంది.

గుమ్మటాలన్నీ జాలమ్మ చెట్టు దగ్గరకు వచ్చాయి. అక్కడ బజారు పెద్దదిగా ఉంటుంది. నాలుగు గుమ్మటాలని వరసగా నిలబెట్టారు. వాటి ముందు మేళగాళ్లు.. వాళ్ల ముందు ఎగిరేవాళ్లు. పోటీ ప్రారంభమయింది అనుకున్నారు చూసేవాళ్లంతా. అప్పటికే వాయించేవాళ్లు తాగున్నారు. ఒక్కొక్కరు మోకాలి దండేసి డోలు కొడుతున్నారు. సన్నాయిని గాల్లోకి తిప్పుతు ఆకాశం కేసి చూస్తూ ఊదుతున్నారు.   రాగాలు, తాళాలు మారుమోగుతున్నాయి. ఎగిరేవాళ్లకు అనుగుణంగా వాయిస్తున్నారు.

సుబ్బులు నిశ్చలంగా నిలబడి ఒక మౌనిలా వాయిస్తున్నాడు. తాళాలన్నీ శృతికి అనుగుణంగా పడుతున్నాయి.

ఎంకట్నర్సు సుబ్బులు వంక చూసి కొత్త తాళం అందుకున్నాడు. అక్కడి సన్నాయిలూ అందుకు అనుగుణంగా మారిపోయాయి. సుబ్బులు కూడా కొత్తతాళం ఎన్నుకున్నాడు. కొత్త కళాసృజన ప్రారంభమయింది.

సుబ్బులు దుమికే జలపాతంలా మారిపోయాడు. జనాలందరూ సుబ్బులు డోలు చూడ్రా! ఎట్టా మోగుతుందో! అంటూ ఆ గుమ్మటం దగ్గరకు వచ్చేస్తున్నారు. వస్తూ వస్తూనే ఊగిపోతూ ఎగురుతున్నారు. డోలు గట్టిగా మోగుతోంది. మోగుతూ మోగుతూ ఒక్కసారిగా శబ్దం ఆగిపోయింది. డోలు కుడి మూత టప్పుమని పగిలిపోయింది. సుబ్బులుఉ నిశ్చేష్టుడైపోయాడు. ముఖాన నెత్తుటి చుక్క లేకుండా పోయింది. గుండె ఆగిపోయిందనుకున్నాడు. యుద్ధం మధ్యలో అస్త్రాలు కోల్పోయిన సైనికుడిలా నిలబడిపోయాడు.

అంతలో సుబ్బులు తమ్ముడు వెంకటేశ్వర్లు తన మెడలో ఉన్న డోలు తీసి సుబ్బులు మెడలో వేశాడు.'నువ్వు ఒక్కడివి చాలు. వాయించన్నా!'అన్నాడు. పక్కనే ఉన్న సుబ్బులు అన్న సన్నాయిలో కొత్తరాగాన్ని ఎత్తుకున్నాడు. సుబ్బులు తనను తాను నిలదొక్కుకున్నాడు. ఎడం మూతపై వేళ్లను సప్తస్వరాలుగా కదిలించాడు. కుడి మూత మీద పుల్లను దానికి తగ్గట్లుగా నర్తింపచేశాడు. ఇప్పుడు మంగలి సుబ్బులు సుబ్బుల్లా లేడు. మ్స్రొ సృష్టి చేస్తోన్న బ్రహ్మలా మారిపోయాడు.

ఆ ధ్వని అందరి మనసుల్లోకి చొచ్చుకునిపోతోంది. వాళ్లల్లో కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తోంది. అందరూ మంత్రముగ్ధుల్లా మారిపోయారు. అన్ని గుమ్మటాల నుంచి జనాలు వచ్చి చూస్తున్నారు. ఎగిరేవాళ్లు కూడా నిశ్చలంగా నిలబడిపోయారు. ఒక తపస్సమాధిలో ఉన్నట్లు సుబ్బులు వాయిస్తూనే ఉన్నాడు.

నిజానికి సుబ్బులు డోలు నేర్చుకోలేదు. తండ్రి వాయిస్తుంటే చూసి నేర్చుకున్నాడు. జవజీవాల్లో నిక్షిప్తమైన కళకు,  నేర్చుకున్న కళకు ఉన్న తేడా సుబ్బుల్ని చూస్తే తెలుస్తుంది.

వెంటనే వెంకట్నర్సు డోలు పక్కన పడేసి సుబ్బులు ముందు కొచ్చి 'అన్నా..' అన్నాడు. మిగతా గుమ్మటాల దగ్గర ఉన్న సాయిబులందరూ కూడా సుబ్బులు దగ్గర కొచ్చారు. మేళం రసపట్టులో ఉన్నప్పుడు ఎదుటివాడు డోలు మీద నుంచి పుల్ల తీయడమే ఒక పెద్ద అవమానం. కానీ, వెంకట్నర్సు 'అన్నా,.. మీ ఊరు మీదే!మా ఊరు మా ఊరే!' అన్నాడు ఉద్వేగంగా.

తర్వాత గుమ్మటాలు నెమ్మదిగా సముద్రం వైపు కదిలాయి. అప్పటికే సమయం రాత్రి తొమ్మిదయింది. సముద్రం నిశ్శబ్దంగా వెన్నెట్లో మెరుస్తోంది.

రచయిత (పేరు - తెలియదు) ;

(ఆంధ్రజ్యోతి ఆదివారం 16,మే, 2010 సంచికలో ప్రచురితం)

సెల్: 9848425039

సేకరణః కర్లపాలెం హనుమంతరావు

07, 12 డిసెంబర్, 2020






*** 

 

 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...