Showing posts with label short-story. Show all posts
Showing posts with label short-story. Show all posts

Monday, December 27, 2021

చిన్న కథ మనసులోని మాట రచన - పిళ్లా సుబ్బారావు శాస్త్రి ( ఆంధ్రపత్రిక - వా - 02- 07 - 1956 ) సేకరణ - కర్లపాలెం హనుమంతరావు

 


చిన్న కథ 

మనసులోని మాట 

రచన - పిళ్లా సుబ్బారావు శాస్త్రి 

( ఆంధ్రపత్రిక - వా - 02- 07  - 1956 ) 


సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

                  26-12-2021 

                   బోథెల్, యా. ఎస్.ఎ



ఆ నగరంలో మంచి పేరున్న వ్యాపారి నారాయణ్ సేఠ్ . అతని తాతల కాలం నుంచీ వస్తున్న వ్యాపారం. నమ్మకస్తుడు . అతను అమ్మే సరుకు ఎప్పుడూ వివాదం కాలేదు. 


సేఠ్ దగ్గర గుమాస్తా మోహన్ లాల్ . బీదవాడు. సేఠ్ కు అతని మీద నమ్మకం జాస్తి . మోహన్ రాసే లెక్కలు తనిఖీ చేయడం గానీ, తాను లేనప్పుడు అతను కొట్లో కూర్చున్నప్పుడు గానీ ఏ ఫిర్యాదుబా ఉండేవి కాదు. మోహన్ లాల్ నిజంగా డబ్బు అవసర పడ్డప్పుడు సేఠ్ కు చెప్పి ఒప్పించుకుని మాత్రమే తీసుకునేవాడు . 


ఎన్నేళ్లు గడిచినా గొర్రెకు బెత్తెడే తోక అన్నట్లు మోహన్ లాల్  కూడబెట్టుకున్నది ఏదీలేదు . పిల్లవాడి  చదువుకు ఖర్చులు పెరుగుతున్నాయి , ఆడపిల్ల పెళ్లీడు కొస్తున్నది .. ఆలోచించరా? ' అని భార్య సతపోరడం మొదలుపెట్టింది. 


సేఠ్ ఇచ్చే జీతం ఇంటి ఖర్చులకే సరిపోతుంది. ఆయనకు మీ మీద నమ్మకం ఎక్కువా కదా! ఆలోచించండి .. అదనంగా ఎట్లా రాబట్టాలో ! ' అంది ఆ ఇల్లాలు . 


భార్య సలహా విని ఇంతెత్తున లేచాడు మోహన్ లాల్ ' నమ్మిన వాడిని మోసం చెయ్యడం మా ఇంటా వంటా లేదు . చాటుగా సేఠ్ సొమ్ము కొట్టేయడం .. అనే ఆలోచన రావడమే పాపం '  అంటూ . 


అన్నాడే కానీ, రోజా భార్య పెట్టే సోది కారణంగా క్రమంగా మోహన్ లాల్ మనసు కూడా మారడం మొదలు పెట్టింది. బిడ్డ చదువు, కూతురు పెళ్లి . . ఖర్చులు కొండల్లా ఎదురు నిలబడి ఉండేసరికి మోహన్ లాల్ మనసు పూర్తిగా మార్చేసుకున్నాడు. 


అదను కోసం ఎదురు చూసే మోహన్ లాల్ కు అవకాశం రానే వచ్చింది. తప్పుడు లెక్కలు రాసి కనీసం ఐదు  వేల రూపాయలైనా కొట్టేయాలని అనుకున్న రోజునే అదృష్టం కలిసొచ్చినట్లు సేఠ్ దుకాణం వదిలి బైటకు వెళ్లిపోయాడు.  


సేఠ్ వెళ్లంది ఎక్కడికో కాదు, రోజూ ఇంట్లో భార్య పోరు పెడుతుంది ' ఎంత నమ్మకం ఉన్నా యజమాని కింది ఉద్యోగి మీదపూర్తిగా భరోసా ఉంచడం ప్రమాదం. మోహన్‌ లాల్ పాతికేళ్ల బట్టి మన దగ్గర పని చేస్తున్నాడు. మీ పేరు చెప్పుకొని బైట ఎంతసొమ్ము వసూలు చేసుకుంటున్నాడో? ఒకసారి మన కాతాదారులు కొంత మందినైనా విచారించి రండి! చేతులు కాలాకఆకులు పట్టుకుని లాభం ఉండదు ' ఆవటా అని . అర్థాంగి మాటలలోనూ సబబు ఉందనిపించింది. ఈసారి సేఠ్ కి అందుకే బైట తనిఖీకి బైలుదేరాడు. 


ఇక్కడ గుండె నిబ్బరం చేసుకొని... ఐదు వేల రూపాయలూ ఇనప్పెట్టినుంచి తీశాడు మోహన్ లాల్ . చేతులు వణికినయ్! ఏదో భయం వేసింది! మనసులో ఆలోచనలు తిరగటం మొదలు పెట్టాయి .' సేఠ్ కి నేనంటే ఎంతో నమ్మకం! పాతికేళ్ళ బుట్టి , కొట్లో పని చేస్తూ, సేఠ్ డబ్బు తిని సేఠ్ కి ద్రోహం చెయ్యడం ద్రోహం. అంతకు మించి నీచం మరొహటి లేదు. సేఠ్ ఒక వేళ  లెక్కలు అడి గితే  తాను తప్పక దొరికిపోతాడు !పాతికేళ్ల నుంచీ యీ దొంగపని చేస్తున్నానని సేఠ్ కి అనుమానం కలుగుతుంది ! నన్ను పనిలో నుంచి తొలిగిస్తే మళ్లీ తిరిగి యిటువంటి పెద్దమనిషి దగ్గరే నాకు కొలువు అవుతుందన్న  భరోసా కూడా లేదు. ఇంత వయస్సు వచ్చిన తర్వాత కోరి పాపాన్ని తెచ్చు కున్న వాణ్ని అవుతాను. ఈ పని యీజన్మలో చెయ్యను. లక్ష్మీ దేవి తోడు| అనుకుంటూ తీసుకున్న  ఐదు వేలు తిరిగి  ఇనప్పెట్టెలో పెట్టేశాడు!


సేఠ్ కు సగం దూరం వచ్చిన తరు వాత ఆలోచన వచ్చింది . ' మోహన్ లాల్ ని నేను పాతికేళ్ల  నుంచి లెక్కల పనిలో ఉంచుకున్నాను. ఇంత వరకు తాను  లెక్కలు అడిగి ఎరుగడు. అయినా ఎక్కడి నుంచి ఏ ఫిర్యాదు కూడా వచ్చింది కాదు. తనే దొంగతనం చేసేవాడు అయితే చిన్న చిన్న ఖర్చులకు కూడా తనను అడిగే ఎందుకు తీసుకుంటాడు. ఇవాళ హఠాత్తుగా లెక్కలు అడిగితే లాల్ బాధపడకుండా ఉంటాడా ? ఆత్మాభిమానం దెబ్బతింటే  తన దగ్గర చేసే కొలువు మానేసే ప్రమాదం ఉంది.  తనకు మళ్లీ  అంత నమ్మ కస్తుడు దొరకడం అసంభవం.  ' అనుకుని వెనక్కి తిరిగి వచ్చేశాడు. భర్తకు అటువంటి తప్పుడు సలహా ఇచ్చినందుకు సేఠ్ భార్యలో తరువాత బాధ కలిగింది. 


" ఇన్నాళ్లు మన దగ్గర గొడ్డులా పని చేస్తున్నాడు.  అంత విశ్వాసంగా పనిచేసే ఉద్యోగుల మంచీ చెడు చూసుకోవడం మంచి యజమాని ధర్మం. అతనికీ పిల్లలు ఉన్నారు. ఎదుగుతున్నారు, చదువులకు, పెళ్లిళ్లకు చేతిలో సొమ్ము ఆడాలి. వెంటనే పిలిచి ఒక ఐదు వేలన్నా అతని చేతిలో పెట్టండి! ' అంది సేఠ్ భార్య . 




మోహన్ లాల్ డబ్బు ఇనప్పెట్టె లో పెట్టేశాడు! సేఠ్ బండీవి యింటికి తిప్పించేశాడు.……తిరిగి వాళ్ళు నుంచీ నేటివరకూ లాల్ కి అటు వంటి కోరికలు కలుగనూ లేదు ! నేఠ్ లెక్కలు చూడనూ లేదు !! *


నారాయణ్ సేఠ్ తనను దగ్గరికి పిలిచి ఇనప్పెట్టె నుంచి ఒక ఐదు వేలు కట్టతీసి చేతిలో పెడుతుంటే మోహన్ లాల్ కళ్లల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. 


రచన - పిళ్లా సుబ్బారావు శాస్త్రి 

( ఆంధ్రపత్రిక - వా - 02- 07 - 1956 )


సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

                  26-12-2021 

                   బోథెల్, యా. ఎస్.ఎ



Tuesday, December 21, 2021

ఈనాడు - చిన్న కథ - హాస్యం - వ్యంగ్యం మీటమీద రాతలు.. రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 07-05-2009 )


 


ఈనాడు - చిన్న కథ - హాస్యం - వ్యంగ్యం 


మీటమీద రాతలు.. 


రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 07-05-2009 )


పట్టువదలని ఓటరు విక్రమార్కుడు ఆటకమీది నుంచి పాత పత్రికలని  దించి ఏ పార్టీకెక్కవ ఓట్లు, సీట్లు వస్తాయో లెక్కలు వేస్తూ కూర్చున్నాడు. 


ఓ పత్రికలోని బేతాళుడు ' ఓటరయ్యా!  దేశమంతా ఇంకా ఎన్నికల యాగం జరుగుతూనే ఉంది. అప్పుడే నీకి  లెక్కల యావ ఎందుకు? నీలాంటి ముగ్గురు  పెద్దమనుషులు తమ పార్టీల స్కోరు తెలుసుకునేందుకు పడిన తాపత్రయం గురించి చెబుతా విను' అంటూ ఇలా చెప్పసాగాడు.


రాష్ట్రంలో రెండు దశల ఎన్నికలూ పూర్తయ్యాయి. 


తమ తలరాత ఎలా మారబోతుందోనన్న దిగులుతో నేతలకు నిద్దర కరవైపోయింది. 


ఓపిక బొత్తిగా లేని ఓ ప్రధాన పార్టీ పెద్ద నాయకుడు చీకట్లో ఓటింగు యంత్రందాకా పోయి, స్కోరు తెలుసుకుందామని మీట నొక్కబోయాడు. 


యంత్రంలోనుంచి భూతం అమాంతం బైటికొచ్చి అడ్డం పడింది. 


' ఎన్నికల కోడ్ ఉంది . మే పదహారు దాకా ఆగటం అందరికీ మేలు' అని హితవు చెప్పింది. 


' నన్నెవరూ ఆపలేదు. అపాలనుకున్నవాళ్లు అయిపు లేకుండా పోయారు. ఆపైన నీ ఇష్టం' అని బెదిరింపులకు దిగారు ఆ రాజుగారు. 


భూతం తన భవిష్యత్తునూహించుకుని స్వైన్ ఫ్లూ  వచ్చినట్లు వణికి పోయి అంది ' సరే రాజా ! ఐదు ప్రశ్నలు అడుగుతాను. నిజాయతీగా సమాధానాలు చెబితే ఈ యంత్రం నిజం స్కోరు చెబుతుంది.' 


' అడుక్కో అడిగినన్నీ  చెబుతాను.. అడగనివీ  చెబుతాను. ఐతే మీడియా మాత్రం ఉండకూడదు' అన్నారు రాజుగారు. 


' సరే సార్!  అధికారంలోకి రాగానే మీరు ముందు సంతకం చేసేది  దేనిమీద ? ఉచిత కరెంటు ఫైలుమీదా, బకాయిల మాఫీ పత్రం మీదా? ' 


' రెండింటి మీదా  కాదు.  ప్రమాణ స్వీకార పత్రం మీద' 


' నిజంగానే మీది దేవుని పాలనేనా? ' 


' జగన్ మీద ఒట్టు .  'జగన్' అంటే దేవుడునేగా అర్ధం! '


'భయమంటే ఏమిటో కూడా తెలీదా? ' 


' తెలుసు . కేవిపి  లేకుండా ఒకసారి ఢిల్లీ వెళ్లాను. చాలా భయపడ్డాను' 


చంద్రబాబు, చిరంజీవి, కెసిఆర్ ఎదురుగా ఉన్నారనుకోండి .  రెండుసార్లు


తిట్టమంటే, ఎవరిని వదిలేస్తారు? ' 


' చిరంజీవిని .. కెసిఆర్ ని ' 


గ్రీన్ లైటు వెలిగింది.


' సార్!  మీ సమాధానాలన్నీ మిషనుకి తెగ నచ్చాయి. లోపలికి పోయి మిషన్‌   మీట నొక్కండి. ఈ ఎన్నికల్లో మీ పార్టీకొచ్చే సీట్ల సంఖ్య మీకే తెలు స్తుంది. చీకటి .. జాగ్రత్త' అంది భూతం. 


లోపలికెళ్ళొచ్చిన రాజావారి మొఖం మతాబులాగా వెలిగిపోతోంది.


' కాంగ్రెస్ .. కాంగ్రెస్'  అంటూ పంచ సవరించుకుంటూ ఆ పెద్దమనిషి


అటు వెళ్లాడో లేదో భూతం ఎదుట బాబుగారు ప్రత్యక్షం. 


 అంతా చూస్తూనే వున్నాము. ఈ అన్యాయాన్నెంత మాత్రం సహించే సమస్యే లేదు. నా ఆఖరి చివరి రక్తపు బొట్టు వరకూ... '


'బాబుగారూ అంత పెద్దమాటలెందుకు సార్ ! మిమ్మల్నీ ఓ ఐదు ప్రశ్నల


అడుగుతాను. మనసులోని మాట మాత్రమే చెప్పండి! ' 


వ్యూహాత్మకంగా ముందుకడుగు వేసింది భూతం.


' మేము సిద్ధం. మరి మీడియావారు సిద్ధంగా ఉన్నారా?' 


' వస్తారుగానీ.. ముందీ ప్రశ్నకు జవాబు చెప్పండి!  పులిరాజావారికి  ఎయిడ్సొస్తుందా? ' 


' కచ్చితంగా వస్తుంది. పులివెందుల రాజావారికి రోజుకి కోటి రూపాయల ఎయిడ్ వస్తుందని  మేం రికార్డులతోసహా ప్రూవుచేయటానికి సిద్ధంగా ఉన్నామని మనవి చేసుకుంటున్నాను'


' సార్, సార్! అడిగిందానికి మాత్రమే సమాధానం చెప్పాలి. మీ రెండో ప్రశ్న . 


' రాజశేఖరరెడ్డి'  నారా.... అంటే మీరు, నారాయణ, రాఘవులు, కె. చంద్రశేఖర రావు..  వీళ్లల్లో కామన్‌గా వున్నది ఏది? చిరంజీవిలో లేనిది ఏది? స్పష్టతా? అనుభవమా? రెండూనా? ఇంకేమన్నానా? ' 


' అన్నీ. అన్నింటికన్నా ముఖ్యమైనది ' రా ' అనే అక్షరం .. అని మన .. 


' .. అర్జంటుగా జవాబు చెప్పండి! బాలకృష్ణ మీ పార్టీలోనే ఎందుకు చేరాలి? ' 


' కాంగ్రెసులో చేరితో  వట్టి  కృష్ణ. ప్రజారాజ్యంలో చేరితే మెంటల్ అవుతాడు.  కనక ' 


కలరు టీవీ, తెలంగాణా,  మూడో కూటమి.. ఈ మూడింటినీ ఒక్క వాక్యంలో చెప్పండి! ' 


' కొంచెం ఇష్టం.. చాలా కష్టం'


' ఎవరు అధికారంలోకొచ్చినా ఏమీ చేయలేనిది ఏది?' 


' హైదరాబాదులో ట్రాఫిక్ కంట్రోల్' 


గ్రీన్ రైటు వెలిగింది. 


భూతం నోరు విప్పేలోగానే ' తెలుసు.  ఆ చీకట్లోకి పోయి మిషనెక్కాలి. మీట నొక్కితే మా పార్టీ కొచ్చిన సీట్ల సంఖ్య తెలిసిపో తుంది. అంతేగదా! ' అంటూ లోపలికెళ్ళి క్షణంలో బైటికొచ్చేశాడు బాబుగారు .. రెండు చేతులూ గాల్లోకెత్తి రెండేళ్ళు అపకుండా ఆడించేస్తూ. 


దబ్బుమని శబ్దం. 


భూతం ఎదురుగా మెగాస్టార్. '  సారీ:. ' మార్పు'  కోసం గోడ దూకి వచ్చా . నేరుగా మేటర్లోకొచ్చేద్దాం. కమాన్ ; విసురు నీ మొదటి ప్రశ్న!  ఇరగదీస్తా! '  


భూతం భయాన్ని దాచు కుంటూ అడిగింది.


'మీద బిసి పార్టీనా? ఏసి పార్టీనా? ' 


'మనలో మన మాట. బైట బి. సి .. లోపల ఏ.సి . నెక్స్ట్  క్వశ్చన్? ' 


' సీఎం అయితే ముందు మీరు చేసే ఘనకార్యమేంటి? ' 


'  సింగిల్ టేకులో ప్రమాణస్వీకారం చించేస్తా' 


' వైయస్ పాలన స్వర్ణయుగమా? ' 


' యస్ ఇసకతో కూడా బంగారంలాగా బిజినెస్ చేసేశారు గదా! ' 


' రైలు ఇంజను గుర్తు దేనికి గుర్తు? అది రాకపోతే మీ ఆల్టర్నేటివ్ గుర్తు? 


' రైలు . ఆల్వేస్ లేటుకి. అందుకే లేటుగా వచ్చింది మా పార్టీ . నీ రెండో ప్రశ్నకు జవాబు వీణ ' 


' సమాధానాల్లో స్పష్టత లేదే! ఓకే!  మీ పార్టీలో నెంబరు వన్ మీరా? మీ అరవిందా?' 


'నేనే' అంటూ ముఖం ముసుగు తీసేశాడు అరవింద్. '  సారీ! ప్రచా రంలో మా బావ గొంతు జీరపోయింది. అందుకే నేనొచ్చింది' అంటూ భూతం చెప్పకముండే చీకటి గదిలో కెళ్ళి వచ్చాడు. 


అంత చీకట్లోనూ. అతని ముఖం వెలిగిపోతోంది.


--- 


' ఓటరూ కథ విన్నావు కదా ! రాజావారికీ , చంద్రబాబుకూ,  చిరంజీవికీ .. ముగ్గురికీ ఓటింగ్ మిషన్‌ 160.. 160.. 160 .. చూపించింది . అసెంబ్లీలోని మొత్తం సీట్లు 234. మూడు పార్టీలకూ కలిపి నాలుగొందల ఎనభై ఎలా వచ్చాయి? సమాధానం తెలిసీ చెప్పకపోయావో బియ్యం ధర కిలో ఇంకో ఇరవై రూపాయలు పెరిగినంత ఒట్టు! ' అంది భూతం బెదిరింపుగా,


'ఇందులో తెలీకపోవటానికేముంది? వాళ్ళు చీకట్లో నిద్రమత్తులో ఎక్క నొక్కిన మిషన్ డమ్మీ ఓటింగు యంత్రం . పాల్‌ గారొచ్చినా , జేపీగారొచ్చి ఎక్కి నొక్కినా, బిజెపి ఎక్కి నొక్కినా ..  అది చెప్పే జవాబు ఒక్కటే. నూటఅరవయ్యే!  


' మే పదహారు తరువాత బైటపడేదే ఒరిజినల్ ఓటింగ్ తేల్చే స్కోరు '  అన్నాడు ఓటరు. 


బేతాళుడు  మళ్లీ పాత  పేపర్లో దూరేశాడు! 


- రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 07-05-2009 ) 


Saturday, December 18, 2021

కథానిక వేలంపాట ( రచయిత పేరు నమోదు కాలేదు ) ( 26 -11 -1952 - నాటి ఆంధ్ర పత్రిక ఇలస్ట్రేటెడ్ వీక్లీ ) సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 18 -11-2021



పాత బంగారం 


కథానిక 

వేలంపాట 

 

( రచయిత పేరు నమోదు కాలేదు )  

( 26 -11 -1952 - నాటి ఆంధ్ర పత్రిక ఇలస్ట్రేటెడ్ వీక్లీ ) 

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

                 18 -11-2021 

                 


కన్నప్పని చూస్తే ఎవరికైనా సరే నవ్వు రాకుండా ఉండదు. 


చదువుకుంటున్న చిన్న పిల్లల దగ్గర్నుంచి ముసలివాళ్ళదాకా అతన్ని ఏవిధంగానైనాసరే ఏడిపించంది వదలరు. కాదు. 


కన్నప్ప వము ఫ్ఫై సంవత్సరాల క్రిందట మూడో క్లాసు మూడేళ్లు వరసగా ఫేలయి, ఆఫీసులో గుమాస్తాగా చేరాడు. ఎకౌంట్సు డిపార్టుమెంట్ లో !. 


అతన్ని అందరూ ఏడిపిస్తారంటే కారణం లేకపోలేదు. తెలిసిన వారందరి కంటే తను ఎంతో తెలివయినవాడినని అనుకుంటాడు. కాని అన్ని విషయాల లోనూ పప్పులో కాలు వేస్తాడు. ముప్ఫై సంవత్సరాల క్రిందట కొన్న చేతివాచి అహర్నిశలు చేతికి తగిలించుకునే ఉండేవాడు కన్నప్ప. ఒక వేళ అది చెడిపోయినా, ఆగిపోయినా దాన్ని తన చేతినుంచి విడదీసేవాడు కాదు. 


నాలుగు రోజులై వరసగా గడియారం నడవడం లేదు. అందుకు కన్నప్పకి చాలా కోపం వచ్చింది. దానికితోడు హనుమంతరావు ఆలోచన మందులా పని చేసింది. 


హను మంతరావు కన్నప్ప తోటి గుమస్తా. అందరి కన్నా కన్నప్పకి హనుమంతరావుమీద ఎక్కువ అభిమానం. గడియారాన్ని వేలం యించాలని హనుమంతరావు చెప్పిన ఆలోచన కన్నప్పకి బ్రహ్మాండంగా తోచింది. వేలం వేయించడానికి సంసిద్ధుడయాడు. 


వేలం పాడేందుకు వేరే ఒక గుమాస్తాని నియమించాలని, ఆ గుమాస్తాకి వేలం పాటలో అయిదు రూపాయలు ఇచ్చి వేయాలని నిర్ణయించాడు హనుమంత రావు. దానికి కన్నప్ప వప్పుకున్నాడు. 


గడియారం వేలం వేయబడే వార్త ఆఫీసులో  అందరికీ అందజేశాడు హనుమంత రావు. ఆఫీసు గుమస్తా లందరికీ సాయం కాలం అయిదు గంటలకు ఆఫీసుకు ఎదు రుగా నున్న మైదానంలో చేరుకోవాలని నోటీసు పంపించడమయింది. 


ఆనాడు జీతాల రోజు బట్టి వేలంపాట పోటీ బాగుంటుందని కన్నప్ప గట్టిగా నమ్మాడు. హనుమంతరావు ఒక్కడే తన శ్రేయోభి లాషి అని ఆనాడు పూర్తిగా దృఢపరుచుకో గలిగాడు.


సాయం కాలం అయిదు గంటలకి గుమస్తాలందరూ మైదానంలో హాజరయారు. 


గడియారం చేత్తో పట్టుకుని వేలంపాట పాడ్డానికి ఒక గుమస్తాని ఎన్నుకున్నారు. 


"కన్నప్ప గారి రిష్టువాచి వేలంపాట ఖరీదు ఒక్క అయిదురూ పాయిలే” అని వేలంపాట మొదలు పెట్టాడు గుమస్తా. ఆమాంతంగా గుండె ఆగిపోయినట్లయింది కన్నప్పకి. కాని వేలం అని జ్ఞాపకా నికి రాగానే మనసు కుదుటపడ్డది. 


'' కన్నప్ప గారి బంగారు ముద్దలాంటి చేతి గడియారం పదిరూపాయిలు. ఇరవై రూపాయిలు ! ఇరవై అయిదు రూపా యిలు” 


కన్నప్ప హృదయం ఆనందంతో ఊగిసలాడింది. దమ్మిడీకి పనికిరాని వాచిఅయిదు నిమషాలలో పాతిక రూపాయిల విలువగలది అయింది. హనుమంతరావు అతని కళ్ళల్లో దేముడయాడు.  


" ముఫ్ఫై రూపాయిలు. "


హనుమంతరావు కన్నప్ప చెవిలో అన్నాడు. "కన్నప్ప గారూ మీ వాచీ ఖరీదయిందిలా ఉంది. లేకపోతే పోటీ ఇంత జోరుగా ఉంటుందా? ఇంతమంచిది. వేలం వేయడం నాకేమీ నచ్చలేదు  సుమండీ . " 


కన్నప్ప మెదడులో ఆలోచనలు పరుగులెత్తాయి  " అవునోయ్ నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అసలు ఇటు వంటి వాచీలు ఈ రోజుల్లో లేవంటేనమ్ము . కాని . . ఏం చేస్తాం ?ఇంతదాకా వచ్చిన తరువాత  ఇప్పుడు వేలం లేదంటే నోట్లో గడ్డిపెడ్తారు " అని కన్నప్ప తన విచా రాన్ని తెలియబర్చాడు. 


" ముఫై అయిదు రూపాయిలు” 

" నల భైరూపాయలు" 

"నలభై అయిదురూపాయిలు" .. వేలంపాట పోటీ జోరుగావుంది


" మీకు మళ్లీ మీ వాచీ కావాలంటే ఒక్కటే ఒక్క ఉపాయం ఉంది. అలా చేస్తే మీ వాచీ మీకు దక్కుతుంది '' అన్నా డు హనుమంతరావు. ఈ మాటలు కన్నప్పలో ఉత్సాహాన్ని రేకెత్తించాయి .


"ఆ ఉపాయం ఏమిటో వెంట నే చెప్పవోయ్,” అని ఆ రాటంతో అన్నాడు . 


“స్వయంగా మీరే ఏ  యాభైరూపాలో పాడి వాచీ తీసుకోండి." అని ఊదాడు హను మంతరావు.


"నా వాచీకి నేనే..." 


"నే నున్నానుగా పాడండీ" అని అన్నా డు హనుమంతరావు. 


" ఏభై రూపాయిలు” అ చేశాడు కన్నప్ప. 


 గుమస్తాలు ఒక్కరొక్కరేజారుకున్నారు.


"ఏ భైరూపాయిలు ఒకటి, ఏభైరూపా యిలు రెండు ; ఏ భైరూపాయిలు మూడు." అన్నాడు గుమాస్తా. 


కన్నప్ప దగ్గర ఏభై రూపాయిలు తీసుకుని గడియారాన్ని అతనికి ఇచ్చేశాడు — వేలం చేసి న గుమస్తా.


కన్నప్పకి గుండె ఆగిపోయినట్లయిపోయింది. 


“మరి నా డబ్బో" అని ఏడుపుముఖంతో హనుమంతరావుని అడిగాడు. 

" మీ డబ్బు మీదే. వేలం వేసిన అతనికి అయిదు రూపాయలు ఇస్తానని వప్పుకున్నారు కదూ మీరూ ? ఇదుగో ఏభై రూపాయలకి మీ వాచి వేలంలో మీరు పాడుకున్నారు. దీంట్లో అయిదు రూపాయలు పోగా నలభై అయిదు రూపాయలు ఇవిగో తీసుకోండి" అని హనుమంత రావు 45 రూపాయల కన్నప్పకి ఇచ్చి వేశాడు. అయిదు రూపా యలు పోతే పోయాయికొని తన గడి యారం పోలేదని సంతోషించాడు కన్నప్ప . 


మర్నాడు హనుమంతరావు సెక్షన్లో అందరికీ పకోడీ, టీ ఇప్పించాడు - కన్నప్పకి కూడా.


ఎందుకో అర్థం అయింది కాదు కన్నప్పకి. 


 కాని తరువాత తెలిసింది అతనికి - తనదగ్గర అయిదు రూపాయలు కొట్టేయడానికే హనుమంతరావు వేలం పాట ఏర్పాటు చేశాడని. కాని అతన్ని ఏమీ అనలేకపోయాడు కన్నప్ప, కారణం తన తెలివితక్కువ తనమే అని అతనికి  తెలుసు . 

( రచయిత పేరు నమోదు కాలేదు > 

( 26 -11 -1952 - నాటి ఆంధ్ర పత్రిక ఇలస్ట్రేటెడ్ వీక్లీ ) 

సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

                 18 -11-2021 

Thursday, December 16, 2021

చందమామ కథ పరీక్షా ఫలితం రచన - బి. లక్ష్మణాచారి ( చందమామ - మాసపత్రిక - అక్టోబర్ - 1964 సేకరణ : కర్లపాలెం హనుమంతరావు

చందమామ కథ 


పరీక్షా ఫలితం 

రచన - బి. లక్ష్మణాచారి 

( చందమామ - మాసపత్రిక - అక్టోబర్ - 1964 

సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

              

సింధుదేశాన్ని మలయకేతు మహారాజు పాలిస్తూ ఉండేవాడు. ఆయన ఏకైక పుత్రిక వనజముఖి పరమ సుందరిగా కీర్తికెక్కింది. ఆమెను పెళ్ళాడాలని అనేక మంది రాజ కుమారులు వచ్చారు గాని, రాజకుమారి పెట్టిన పరీక్షలో నెగ్గలేకపోయారు. ఈ పరీక్ష గురించి వాడవాడలా తెలిసిపోయింది.


తనను పెళ్ళాడేవాడు ధైర్యవంతుడూ, వీరుడూ, యుక్తిపరుడూ అయి ఉండాలనే ఉద్దేశంతో రాజకుమారి ఈ పరీక్ష ఏర్పాటు చేసింది. ఆమె వచ్చిన వారి నందరినీ పరీక్షకు పెట్టలేదు; వారి వయసూ, అంద చందాలూ తనకు నచ్చిన మీదటనే ఆమె వారికి పరీక్ష ఇచ్చింది.


ఆ పరీక్ష ఈవిధంగా ఉన్నది: రాజభవనానికి ఉత్తరాన ఒక తోటా, దానికి ఉత్తరాన చిన్న అరణ్యమూ ఉన్నాయి. ఆమెను పెళ్ళాడ గోరినవాడు ఆ అరణ్యంలో ప్రవేశించి, అందులో దారి తప్పకుండా  తిరిగి రాజభవనానికి రావాలి. అరణ్యంలో ఒక పులి ఉన్నది. దాన్ని నిరాయుధుడై జయించి రాజ ముందుకు వచ్చి, తోటలో ప్రవేశించాలి. ఆ  తోటలో ఒక భయంకరమైన పక్షి ఉన్నది;  అది ఎవరినన్నా చూడగానే మీదికి వచ్చి కళ్ళు రెండూ పొడిచేస్తుంది. దాన్ని కూడా తప్పించుకుని రాజభవనం కేసి వస్తే తోటకూ, రాజభవనం ఆవరణకూ మధ్యగా ఒక బురద కందకం ఉన్నది. అందులో  గొంతు లోతు బురద ఉంటుంది. ఆ కందకంలోకి దిగి రాజభవనం చేరుకోగానే, రాజ మె కుమార్తె తన స్వహస్తాలతో లోటాడు నీళ్ళి స్తుంది. ఆ లోటాడు నీళ్ళతోనే బురద అంతా పోయేలాగు కడుక్కోవాలి. ఈ పరీ క్షలో నెగ్గినవాణ్ణి ఆమె పెళ్ళాడుతుంది. 


ఆమెను పెళ్ళాడ వచ్చిన వారిలో కొందరు పులి చేత చచ్చారు. మరి కొందరు పులి బారి నుండి తప్పించుకుని, భయంకర పక్షి మూలాన కళ్ళు పోగొట్టుకున్నారు. పులినీ, పక్షిని జయించి బురదలో దిగి వచ్చినా, లోటాడు నీటితో ఒళ్ళంతా కడుక్కోవటం ఎలా సాధ్యమవుతుంది?


ఈ అసాధ్యమైన పరీక్ష గురించి నాగావళి  రాజకుమారుడు ప్రతాపుడనేవాడు విన్నాడు. అతను సింధుదేశపు రాజధానికి వచ్చి, రాజ భవనానికి ఉత్తరాన ఉన్న అరణ్యాన్ని ఒక సారి చుట్టి వచ్చాడు. అరణ్యం చుట్టూ బలమైన కంచె వేసి ఉన్నది. ఆ కంచెలోనే ఉత్తర భాగంలో ఒక ద్వారమున్నది. చుట్టూ కంచె ఉండటమే గాక, రాజభవనానికి దగ్గిరిగా కూడా ఉన్నందున, ఆ అరణ్యం సహజమైనది కాదనీ, కృత్రిమ మైనదనీ, అందులో ఉండే పులి కూడా మనుషులు పెంచేదే అయి ఉంటుందనీ అతను ఊహించాడు.


తరువాత ప్రతాపుడు రాజకుమార్తెను సందర్శించాడు. అతను పరీక్షకు నిలబడ టానికి ఆమె సమ్మతించింది. ఎందుకంటే అతను యువకుడూ, అందగాడూనూ. అతను మనిషి ముఖాన్ని పోలి ఉండేటట్టుగా ఒక ముఖ కవచం చేయించుకున్నాడు. అది ధరించినట్టయితే, కళ్ళూ, ముక్కూ, గడ్డమూ, నుదురూ మొదలైన వాటితో కూడి, అచ్చగా మనిషి ముఖాన్ని పోలి ఉంటుంది, కాని అది లోహంతో చేయబడినది. ఈ కవచాన్ని చంకన పెట్టు కుని, చేతిలో మాంసం మూటగట్టి పట్టు కుని, ప్రతాపుడు ఉత్తర ద్వారం కుండా అరణ్యంలో ప్రవేశించాడు.


అరణ్యంలో అతను కొద్ది దూరం వెళ్ళే సరికి గాండ్రిస్తూ పులి ఎదురయింది. అతను మాంసం మూట విప్పి పులిముందు పడేసి తన ముఖానికి కవచం ధరించుకుని ముందుకు సాగాడు. పులి మాంసం తినటంలో నిమగ్నమై పోయి అతని గొడవే పట్టించుకోలేదు.


ప్రతాపుడు అరణ్యం దాటి తోటలో ప్రవేశించగానే భయంకర పక్షి వచ్చి, అతని ముఖ కవచంలోని కళ్ళను పొడిచి తన దారిన తాను పోయింది. అతను ముఖ కవచాన్ని తీసి దూరంగా పారేసి, తోటకూ రాజభవనం ఆవరణకూ మధ్య ఉండే బురద కందకంలోకి దిగి, పైకి వచ్చి, రాజ భవనాన్ని చేరుకున్నాడు.


రాజకుమారి లోటాడు నీళ్ళతో సిద్ధంగా ఉన్నది. ప్రతాపు డామెతో, "ఈ పరీక్షలో రెండు అంశాలలో నెగ్గాను. ఈ మూడవ దానిలో నెగ్గించే బాధ్యత అంతా నీ పైన ఉన్నది," అన్నాడు.


"ఈ లోటాడు నీటితో ఒంటి బురద అంతా కడుక్కోవలిసినవాడవు నీవేగదా?” అన్నది రాజకుమారి.


" అలాగే కడుక్కుంటాను. కాని ఆ నీరు పొయ్యవలిసిన పని నీది. జాగ్రత్త, ఒక్క చుక్క కూడా నేలపై పడకూడదు. అలా పడిన ప్రతి చుక్కకూ ఒక్కొక్క బిందెడు నీరివ్వవలిసి ఉంటుంది,” అన్నాడు ప్రతాపుడు.


"పరీక్షలో నెగ్గాపులే. స్నానం చేతువుగాని పద!" అన్నది రాజకుమారి. తరవాత వారిద్దరికీ వైభవంగా పెళ్ళి జరిగింది.


- బి. లక్ష్మణాచారి 

( చందమామ - మాసపత్రిక - అక్టోబర్ - 1964 

సేకరణ : 

కర్లపాలెం హనుమంతరావు 

16 - 11-2021

బోథెల్ ; యూఎస్ఎ 

Sunday, December 12, 2021

ఫ్యామిలీ- చిన్న కథ - కర్లపాలెం హనుమంతరావు

ఫ్యామిలీ- చిన్న కథ 

- కర్లపాలెం హనుమంతరావు 

 

నాన్నా!

ఏంట్రా చిన్నా?

రోజుకు నువ్వెంత నాన్నా సంపాదించేది?

ఉలిక్కిపడ్డాడు   నాన్న.  చుర్రుమని కాలింది. వేలెడంత లేడు. వీడేందీ.. పిచ్చి ప్రశ్నలు!   బదులివ్వదలుచుకోలేదు. అయినా చిన్నా  వదలదలుచుకోలేదు తండ్రి. 

'చెప్పు నాన్నా! పోనీ గంటకు ఎంతిస్తారో ఆఫీసులో అదన్నా చెప్పు. అప్పుడే నేను పోయి పడుకునేది'

రెండు పెడ్దామనిపించింది .  అతి కష్టం మీద ఆపుకొంటూ 'గవర్నమెంటాఫీసుల్లో రోజూ జీతాలిస్తార్రా? నెలకో అరవై వేలొస్తాయేమో! ఇహ ఫో! తొమ్మిదవుతుంది. పోయి పడుకో!' గట్టిగానే గసిరాడీసారి తండ్రి.  

అయినా చిన్నా వదల్లేదు 'ఒక్క రోజుకు ఎంతొస్తుందో అది  చెప్పు నాన్నా! అప్పటి దాకా నేను పడుకునేదే లేదు గ్యారంటీ!'

బిడ్డ మొండితనం తండ్రికి ఎరికే. ఏదో ఒహటి చెప్పేదాకా   వదిలే రకం కాదు. అయినా ఇవాళేందీ పిలగాడు ఇట్లా జీతాల మీద తగులుకున్నాడు! 'రోజుకో రెండొందల చిల్లరొస్తుందేమోరా నాయనా! అయినా.. వేలడంత లేవు నీకెందుకురా ఈ వెధవారాలన్నీ! వెళ్లి పడుకో ఫో! మళ్లీ బైటికెళ్ళే పనుంది నాకు!' 

చిన్నా తండ్రి చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు 'నాన్నా! ప్లీజ్ నాకో ట్వంటీ రూపీస్ అప్పివ్వవా అర్జంటుగా? కావాలంటే వడ్డీ తీసుకో పెద్దయింతరువాత!'

ఉలిక్కిపడ్డాడు తండ్రి. ఇరవై రూపాయల అప్పా? దానికీ వడ్డీ చెల్లింపులా? వీడు పెద్దయిందాకా ఆగి తాను వసూలుచేసుకోవాలా?' వళ్లు మండిపోయింది తండ్రికి ఒక్క ఊపులో వచ్చిన వీరావేశానికి. 'ఎల్కేజీ కుంకగాడివి. డబ్బుల్తో నీకేంట్రా పనసలు? స్కూల్లో ఏం చేస్తున్నావు? ఏం జరుగుతుందీ ఇంట్లో.. ముందు నాకు తెలియాలి ?' అంటూ విసురుగా వంటింటి వైపుకు దూసుకెళ్లిపోయాడా నాయన వక్కసారిగా ముంచుకొచ్చిన వెర్రావేశంతో. 

ఆ దురుసుగా పోవడంలో కిందపడి ఏడిచే పసిబిడ్డ సంగతి కూడా పట్టించుకునే మూడ్ లో లేకుండాపోయింది తండ్రికి. 

***

 అరగంట గడిచిన తరువాత ఆవేశాలు చల్లారాయి ఇంట్లో. తన దురుసు ప్రవర్తనకు తండ్రిలో పశ్చాత్తాపం మొదలయింది. చిన్నా పడుకొన్న గది వైపు చూసాడు. దుప్పటి కప్పుకుని కప్పు వంక చూస్తూ తల్లి పక్కనే పడుకుని ఉన్న పదేళ్లు కూడా నిండని కొడుకును చూసి తండ్రి గుండె చెరువయింది. గిల్టీగా చిన్నా పక్కలోకి చేరాడు నాన్న. ' సారీరా! బుజ్జిగా! ఇందాక నేను నీతో అట్లా  మాట్లాడకుండా ఉండాల్సింది.తోసేసానేమో కూడా కదా! వెరీ సారీ రా కన్నా! ఇదిగో నువ్వడిగిన ఇరవై రూపాయలు. ఇప్పుడు  నువ్వు హ్యాపీనే గదా?'

ఇరవై నోటు చేతిలొ పడగానే గభాలున లేచి కూర్చున్నాడు చిన్నా. అప్పటిదాకా ఏడ్చినట్లు వాడి లేతబుగ్గల మీద చారలు కట్టిన కన్నీళ్లే తెలియచేస్తున్నాయ్. ఇప్పుడవేమీ పట్టించుకునే మూడ్ లో లేడు చిన్నా! తండ్రి ఇచ్చిన ఇరవై నోటును  దిండు కింద దాచిపెట్టుకుని ఉన్న మరికొన్ని అట్లాంటి నోట్లతోనే కలిపి లెక్క   పెట్టేపనిలో పడిపోయాడు. చిన్నా దిండు కింద నోట్లు చూసిన తండ్రికి మళ్లీ కోపం తన్నుకురాబోయింది. 

కానీ అదే క్షణంలో చిన్నా.. గభాలున తండ్రిని గట్టిగా కౌగలించుకుని అన్నాడు 'థేంక్యూ పాపా! థేంక్యూ వెరీ మచ్! ఈ ఇరవైతో  రెండొందలు సరిపోయింది. ఇవన్నీ అచ్చంగా నీవే ఇక నుంచి!' చిల్లర నోట్లన్నీ తన   గుప్పెట్లో కుక్కి మూసేసే చిన్నా వంక అయోమయంగా చూసాడా తండ్రి. ' 'రేపు అమ్మ బర్త్ డే డాడీ !  నువ్వచ్చంగా ఇంట్లోనే ఉంటున్నావ్. అమ్మతో, నాతో కలిసి గుడికి సినిమాకి వస్తున్నావ్!  ఫుల్ డే ఆఫీసుకు డుమ్మా. నీ  జీతం రెండొందలు ఇచ్చాగా!  నువ్వూ హ్యాపీనేగా!' 

ఉత్సాహంగా చిన్నా అన్న ఆ మాటలకు  బిత్తరపోయిచూడడం నాన్న వంతయింది. 


-కర్లపాలెం హనుమంతరావు 

07- 04 -2021 

చిన్నపిల్లల కోసం : శాస్త్రం - వ్యవహారం - సేకరణ : కర్లపాలెం హనుమంతరావు

ఒక ఊరికి నలుగురు ఉద్దండులు వెళ్ళారు - ఆ ఊరి మోతుబరిని  మెప్పించి, పారితోషికాలను పొందాలనే ఆశతో.

తిన్నగా ఆ ఊరి సత్రపు యజమానిదగ్గరకు వెళ్ళి తమకు బస, భోజన సౌకర్యం వగైరా ఇవ్వమని అడిగారు. వారి మాటల్లో స్వోత్కర్షగా మాట్లాడడం, కొంత అహంకారం వంటివి కనిపించాయి ఆ సత్రపు నిర్వాహకుడికి. అంతేగాక, వాళ్ళలో ‘ముఖ్యమైనదేదో’ తక్కువ అనిపించింది కూడా!  అందుకని ఆయన వాళ్ళకు చిన్న పరీక్ష పెట్టాలనుకున్నాడు.


“అయ్యా! చిన్న ఇబ్బంది కలిగింది. బసకి ఏమీ ఇబ్బంది లేదుగానీ, మీకు భోజనాలు వండడానికీ, వడ్డించడానికీ సిబ్బంది లేరు. కాబట్టి, కావలసిన డబ్బు ఇస్తాను గానీ మీరే వండుకోవలసి ఉంటుంది.

మీరు తలకొక పని చేసుకుని, ఈ రోజుకి గడిపేయాలి” అన్నాడాయన.

"సరే" అన్నారు వీళ్ళు.


ఆయన ఒప్పజెప్పిన పనులు:


తార్కికుడు (logician) ఊరిలోకి పోయి నేయి తీసుకురావడం. 

వైయాకరణి (grammarian) మజ్జిగ కొనడం. 

జ్యోతిష్యుడు (astrologer) - విస్తరాకులకోసం చెట్టెక్కి, వాటిని కోసుకొచ్చి, తరవాత పుల్లలతో కుట్టడం. 

గాయకుడు (singer) - అన్నం వండడం. 


వీరందరూ అక్కడికి వెళ్ళినది 10 గంటలకు. 

‘2 గంటలయేసరికి మీ భోజనాలన్నీ అయిపోయి, కాస్త విశ్రమించవచ్చు’ అన్నాడతను వాళ్ళతో.


సరేనని వీరందరూ తలొక వైపుకు  బయలుదేరారు.


తార్కికుడు  నెయ్యి కొన్నాడు. సత్రానికొచ్చే దారిలో ఆయనకు ఒక అనుమానం వచ్చింది - ‘చెంబుకు నేయి ఆధారమా? నేతికి చెంబు ఆధారమా?’ అని (ఏది ఆధారం? ఏది ఆధేయం?). బాగా ఆలోచించినా సమాధానం దొరకలేదు! ‘పోనీ ఒంపి చూస్తే సరి!’ అనుకుని చెంబును తలకిందులు  చేశాడు. సమాధానం దొరికిందిగానీ, నేయి నేలపాలైంది.  ఏం చేయాలో తెలియక బిత్తరచూపులు చూస్తూ అక్కడే చతికిలబడ్డాడు! 


ఇక వైయాకరణి - ఎందరో గొల్ల స్త్రీలు మజ్జిగను అమ్ముకుంటూ ఆయనకెదురుగా పోతున్నారు. “చల్ల” అని దంత్య చకారాన్ని ఎవరూ పలకటంలేదు . ప్రతీ స్త్రీ కూడా “సల్ల” అనే భ్రష్టరూపాన్నే పలుకుతోంది! ఆయనకు చాలా కోపం వచ్చింది. ‘ఔరా! ఈ ఊరిలో ఈ అపభ్రంశపు శబ్దాలను వినలేకపోతున్నాను. సరియైన ఉచ్ఛారణ పలికే మనిషి దొరికేవరకూ నేను మజ్జిగను కొనను' అని భీష్మించుకుని ఒకచోట కూర్చుండిపోయాడు!


ఇక జ్యోతిష్యుడి సంగతి:

ఊరి చివర్లో ఉన్న ఒక మోదుగచెట్టునెక్కి, ఆకులను కోసుకుని, కిందకు  దిగబోతోంటే ఒక తొండ కనిపించిందాయనకు. ఏవో లెక్కలు వేసుకుని చూస్తే, అది దుశ్శకునమనీ, అది అక్కడే ఉంటే గనుక మరొక 4 గంటలవరకూ  చెట్టు  దిగడం దోషమని నిర్ణయించుకున్నాడు! ఆ తొండ ఈయనను  చూచి బెదిరిందో, ఏమో - అది అక్కడ, ఈయన పైన ఉండిపోయారు!


ఇక, గాయకసార్వభౌముడి విషయానికొస్తే - ఆయన ఎసట్లో బియ్యం పెట్టాడు. కుండలోని నీళ్ళు మరుగుతున్నాయి. ఆవిరికి మూత పైకీ క్రిందకీ పడిలేస్తోంది. ఈయన తాళం వేయసాగాడు . ఆదితాళం- ఉహూఁ, రూపక- ఉహూఁ, జంప-   ఉహూఁ --- ఏ తాళానికీ రావట్లేదు. అశాస్త్రీయమైన ఆ తాళానికి విసుగొచ్చి, ఆయన ఆ కుండమీద ఒక రాతిని విసిరేశాడు! ఇంకేముంది! అన్నం నేలపాలయింది. మరి ఈయన వంటగదిలోనే!


వీరందరూ ఏవో అవకతవకలు చేస్తారని ముందే ఊహించిన సత్రపు నిర్వాహకుడు. కొందరు మనుషులను పంపి, ఎక్కడెక్కడో చతికిలబడ్డ వారినందరినీ ఒకచోటికి చేర్చాడు.


'నాయనలారా! మీకందరికీ ఎప్పుడో వంటలు చేయించే ఉంచాను, భోజనాలకు లేవండి. 

దయచేసి నా మాటలు రెండు వినండి. మీరు మీ  శాస్త్రాలలో గొప్పవాళ్ళే అయుండచ్చు. కానీ మరొకరిని తక్కువచేసే విధంగా ఉండకూడదు మీ శాస్త్రజ్ఞానం వల్ల కలిగిన అహంభావం . మరొకటేమిటో మీకు చెప్పనక్కరలేదనుకుంటా. శాస్త్రజ్ఞానం ఒక్కటే  చాలదు జీవితంలో. దానితోపాటు కొంత వ్యవహారజ్ఞానం కూడా ఉండకపోతే కష్టమని మీకు మీరే నిరూపించుకున్నారు కదా!' అని వాళ్ళను సున్నితంగానే మందలించాడు.

- సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

18 -09- 2021 

( ఎప్పుడో.. ఎక్కడో  విన్న కథ) 

బోథెల్ ; యూ . ఎస్.ఎ 

Wednesday, December 8, 2021

చూసేదంతా.. !- కథానిక -కర్లపాలెం హనుమంతరావు

 

ఖరీదైన ఆ భవంతిలో ఆధునాతనమైన సౌకర్యాల  మధ్య విశ్రాంతి దొరికినప్పుడు లోకంతీరును గురించి ఎన్నో కథలు, నవలలు అల్లి ఓ గొప్ప రచయిత్రిగా  పేరు  గడించింది శ్రీమతి రమాదేవి అతి పిన్నవయసులోనే.

ఆ రమాదేవికి పెళ్లయి ఇప్పుడో పది నెలల పసిపాప. భర్త రమణారావు ప్రాఖ్యా కంపెనీ పేరుతో సొంతంగా మాధాపూర్ మెయిన్ సెంటర్లో కంప్యూటర్ సొల్యూషన్ సంస్థ ఒకటి నడుపుతూ నిత్యం బిజినెస్ పనుల్లో బిజీగా ఉంటాడు. ఎక్కువ కాలం విదేశీ టూర్ల మీదనే గడపాల్సిన వ్యాపారం అతగాడిది. ఇంట్లో పని సాయానికని, భార్య ఒంటరితనం తగ్గించాలన్న ఉద్దేశంతో తానే బాగా విచారించి సీత అనే ఒక పేద మహిళను ఫుల్ టైం హౌస్-మెయిడ్ కింద కుదిర్చిపెట్టాడు రమణారావు.

 

సీత ఓ అనాథ మహిళ. పెళ్లయితే అయింది కాని, భర్త ఊసెత్తితే మాత్రం ఆట్టే సంభాషణ పొడిగించదామె. తల్లి లేనందున రోగిష్టి తండ్రిని తన దగ్గరే ఉంచుకుని సాకే ఆ మహిళకు చంకలో ఓ బిడ్డ .. చంక దిగిన ఇంకో ఇద్దరు పిల్లలు! ఇన్ని సంసార బాధ్యతలు  లేత వయసులోనే  నెత్తి మీద పడటం చేత పరాయి ఇంట్లో ఆయాగా కుదురుకోక తప్పని దైన్య స్థితి సీతది.

సీత మంచి అణుకువగల మనిషి. పనిమంతురాలు కూడా. అన్ని సుగుణాలు ఒకే చోట ఉన్నవాళ్లకే లోకంలో అదనంగా పరీక్షలంటారు! ఆమె  జీవితం మీద ఓ జాలి కథ కూడా రాసి కథల పోటీలో బహుమతి పొందిన ఘనత రచయిత్రి రమాదేవిది.

 

'అలాంటి సీత ఇలాంటి నీచమైన పని చేస్తుందంటే నమ్మ బుద్ధి కావడం లేదు?!' ఇప్పటికి ఏ వంద సా్లర్లో అనుకుని ఉంటుంది రమాదేవి.  ముందు రోజు మధ్యాహ్నం తన గది కిటికీ గుండా  ఆమె చూసిన దృశ్యం అంతగా డిస్టర్బ్ చేసేసిందా రచయిత్రిని. గతంలో ఏవో కథల్లో, సినిమాలలో కల్పించి రాసుకున్న సన్నివేశాలు ఇప్పుడు అంతటా నిజమవుతున్న తీరు రచయిత్రయి ఉండీ ఆమే జీర్ణించుకోలేని పరిస్థితి!

ఎదురు డాబాఇల్లు లాయరుగారిది. ఆయనగారి పడగ్గదిలో.. పడక మీద సీతను చూసింది ముందు రోజు అపరాహ్నం పూట! ఈమె అటు తిరిగి పడుకొని.. వంటి మీది పై భాగపు దుస్తులను  స్వయంగా తన చేతులతోనే విప్పేసుకుంటోన్నది!   సిగ్గూ ఎగ్గూ లేని ఆ లాయరు మహానుభావుడు ఇటు వైపు  వంగి నిలబడి ఏదో తొంగి చూస్తున్నాడు! ఇంకాసేపట్లో ఆ మహాతల్లి పడక మీదకే నేరుగా చేరివుంటాడేమో కూడా! జుగుప్సతో అప్పటికే రమాదేవి టకాల్మని తన కిటికీ రెక్కలు మూసేసుకుంది. 

కిటికీ రెక్కలనైతే మూయగలిగింది గాని.. మనసు ఆలోచనా ద్వారాలను ఎలా మూయాలీ తెలియక సతమయిపోతున్నది నిన్నటి నుంచి రమాదేవి. కాలం గడిచే కొద్దీ ఊహల ఉధృతి పెరిగిపోసాగింది. అక్కడికీ అదుపు చేసుకునేందుకు డాక్టర్ గారిచ్చిన టాబ్లెట్ రెండు మింగింది కూడా. వాటి ప్రభావమూ అంతత మాత్రమే ఈ సారి.

‘అవ్వఁ! పట్ట పగలు! అదీ మిట్ట మధ్యాహ్నప్పూట! ఎంత తలుపులు మూసుకుంటే మాత్రం ఏ  కిటికీ సందుల గుండానో సంబడం బైటపడకుండా ఉంటుందా? ఎదిగారు ఇద్దరూ తాడి మానులకు మించి.. ఎందుకూ! ఇంగితమన్న మాట పక్కన పెట్టేసిన తరువాత ఏ కిటికీలు, తలుపులు వాళ్లనా మదపిచ్చి చేష్టల నుంచి కట్టడి చెయ్యగలవు!

అతగాడి  భార్య పోయి ఇంకా రెండు వారాలైనా పూర్తిగా నిండ లేదు. ఆయనింట జరిగిన అరిష్టానికి  ఇక్కడ పేట పేటంతా అయ్యో పాపం అని ఆక్రోశపడుతుంటే.. అక్కడ మాత్రం  ఆ సిగ్గూ శరంలేని పెద్దమనిషికి అప్పుడే ఒక ఆడతోలు కావాల్సొచ్చిందా! కక్కుర్తిలో ఆయనకూ, ఆయనింట్లో పెరిగే ఆ కుక్కలకూ ఇక తేడా ఎక్కడేడ్చింది! మగవాడు వాడికి నీతి లేకపోతె మానె.. ఆడపుటక పుట్టిన ముండకు దీనికైనా బుద్ధీ జ్ఞానం ఉండాలా.. అక్కర్లేదా?

ఇందుకా ఈ మహాతల్లి నాలుగయిదు రోజుల బట్టి ఒకే హైరానా పడ్డం! తాను ఇంకా ఇంట్లో సమస్యలేమోలే అనుకుంటుంది. అడిగింది కూడా! ఎప్పటిలా ఎదురు బదులేదీ? నవ్వేసి ఊరుకుంది నాటకాల మనిషి! ఒకే వేళకు 'బైట కాస్త పనుంది పోయొస్తాన'మ్మా అని  పర్మిషన్ తీసుకుని వెళ్లి ఆలస్యంగా రావడం ఈ ఘనకార్యానికా!

శుచి శుభ్రత, నీతి నిజాయితీ ఉందనే గదా భర్త విచారించి మరీ ఈ మనిషిని నమ్మి ఇంట్లో ఉంచి వెళ్లడం! తను విన్న దానికి తగ్గట్లే ఎంతో మెలుకువగా ఇంటి పనులన్నీ శుభ్రంగా చక్కగా చేసుకుపోయే మనిషే! ఇంతలోనే ఏ పురుగు కుట్టి చచ్చిందో!  భార్య పోయిన మగాడి పడక గదిలో పగలే దూరిపోవాలంటే ఎంత తెగింపు ఉండాలి!

'ఛీఁ..ఛీఁ! ఇట్లాంటి నీచురాలి చేతిలోనా తన బిడ్డ పెరిగి పెద్దవనే కూడదు! భయంతో వణికిపోయింది రచయిత్రి రమాదేవి. ఆ గంట సేపూ!

అది వచ్చీ రాగానే అడగవలసిన నాలుగు మాటలు అడిగి సాగనంపేయాలని ఆ క్షణంలోనే ఒక నిర్ణయానికొచ్చేసింది రచయిత్రి రమాదేవి.  

అరగంట తరువాత  తాపీగా ఇంటి కొచ్చి ఏమీ జరగనట్లే తన పనిపాటల్లో ఎప్పట్లా పడిపోయిన సీతను చూసి ఎట్లా అడగాలో అర్థమవలేదు రమాదేవికి. సాటి ఆడదానితో ఎట్లా ఇట్లాంటి మాటలు మాట్లాడడం!   ఇంత నటనా కౌశలం గల ఈ మనిషి నోటి నుంచి తాను నిజం కక్కించగలదా! భర్త రమణారావు వచ్చిన తరువాత విషయం చెప్పేస్తే ఆయనే చూసుకుంటాడు ఈ చెత్త వ్యవహారాన్ని! అయినా.. వేరే ఎవరి కాపురాల గోలో తనకెందుకు! ముందు ఇది తన కొంపకు నిప్పు రవ్వ రాజేయకుండా ఉంటే చాలు. తాను జాగ్రత్తపడాలి!' అని సర్దిచెప్పుకుంది రమాదేవి.   కథల్లో పాత్రల చేతయితే రకరకాలుగా మాట్లాడించే రచయిత్రి నిజజీవితంలో ఒక దౌర్భాగ్యకరమైన సంఘటన   నిజంగానే ఎదురైతే ఎట్లా డీల్ చేయాలో తోచక   చేష్టలుడిగినట్లయిపోయింది. ఆ పూటకు సీత ఉద్వాసన వ్యవహారం వాయిదా పడింది.  

అ రాత్రి రమణారావు రమాదేవి చెప్పిందంతా విన్నా తేలిగ్గా కొట్టిపారేశాడు

'అనుమానం పుట్టి మీ ఆడవాళ్లు పుట్టారన్న మాట నిజమే అనిపిస్తోందిప్పుడు. ఇంతకాలంగా చూస్తున్నా ఆవిడను, ఎంత ఒద్దికగా తన పని తాను చేసుకుపోతుంది! చిన్న పొరపాటైనా తన వల్ల దొర్లుతుందేమోనని  ఆమె చూపించే శ్రద్ధ నీకు కనిపించడం లేదా? ఏదో విధి బావోలేకనో, మొగుదు చేసిన మోసం వల్లనో ఇట్లా పరాయి ఇళ్లలో పడి చాకిరీ చేసే సాటి ఆడదాని మీద గట్టి ఆధారం లేకుండా అభాండాలు వేయడం దారుణం రమా!  నువ్వేగా.. అమెను దృష్టిలో ఉంచుకుని మహగొప్పగా కథోటి రాసి బహుమతి కొట్టేసింది! ఇప్పుడేమో మతి లేకుండా ఏవేవో అవాకులూ చవాకులూ కూసేస్తుంటివి!' అంటూ ఎద్దేవాకు దిగిన భర్త మీద పీకల్దాకా మండుకొచ్చింది రమాదేవికి.

'స్వయంగా నా కళ్లతో నేను చూసింది చెప్పినా మీకు నమ్మకం కలగడం లేదా? నా కన్నా  దాని మీదే మీకు ఎప్పట్నుంచి నమ్మకం ఎక్కువయిందో! అవును!  మీరూ ఓ మగాడేగా! ఇట్లాంటి ఓ ఆడది ఇంటి పట్టునే ఉంటే గుట్టుగా మోజు తీర్చుకోవచ్చని అశ కలుగుతున్నట్లుందే తమక్కూడా' అంటూ అదుపు లేకుండా రెచ్చిపోయింది ఉక్రోషంలో రమాదేవి.

'కంట్రోల్ యువర్ సెల్ఫ్ రమా! ముందీ టాబ్లెట్ వేసుకో!  ఇప్పుడు ఎన్ని చెప్పినా నువ్వు వినే మూడ్ లో లేవని అర్థమవతూనే వుంది.  మన సమస్యల మధ్య ఇప్పుడు ఈమె భాగోతం కూడా ఎందుకులే! నువ్వు చెప్పినట్లే చేద్దాంలే! మరో మంచి ఆయా దొరికిందాకా కాస్త ఓపిక పట్టు ప్లీజ్!' అంటూ భార్య కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడా మానవుడు అప్పటికి.

మర్నాడు ఎప్పటిలా అదే టైముకు సీత రమాదేవిని పర్మిషన్ అడిగింది. తమ తలాడించగానే బైటికి వెళ్లిన మనిషి మరో రెండు నిముషాలల్లో లాయరుగారి ఇంటి ముందు తేలింది. ఈమె రాకను చూసి అప్పటి వరకు అసహనంగా ఎదురు తెన్నులు చూస్తోన్న లాయరుగారి మొహంలో ఒక మాదిరి రిలీఫ్ కనిపించడం ఇద్దరూ ఇంటిలోకి పోయిన వెంటనే తలుపులు మూతబడడం.. మరో రెండు నిముషాలల్లో సీత లాయరుగారి బెడ్ రూంలో తేలడం రోజుటిలాగే యధావిధిగా సాగిపోయాయి క్రమం తప్పకుండా!

మరో అరగంట తరుతావ తరువాత సీత బెరుకుగా బ్లౌజు గుండీలు సర్దుకుంటూ బైటకు రావడం.. వెండితెర సినిమా అంత స్పష్టంగా కనిపించిందీ సారి.. సూది మొనంతైనా అనుమానానికి సందు లేకుండా!

'ఇప్పుడేమంటారో  శ్రీవారు?' అంది ఎకసెక్కంగా రమాదేవి.

అప్పటికే రమణారావును ఆమె పిలిపించి సిద్ధంగా ఉంచింది.. ఈ దృశ్యం అతనే స్వయంగా చూసి తరిస్తాడని!

రమణారావు ఏదో చెప్పబోయి తటపటాయించడం చూసి చిర్రెత్తుకొచ్చింది రమాదేవికి. నోరింత చేసుకుని  'ఇప్పటికీ  మీ సీతమ్మ తల్లి రామాయణంలోని సీతమ్మవారేనంటారు! ఆ ఎదురింటి పెద్దమనిషి కలియుగ శ్రీరామచంద్రమూర్తా!'

'మైండ్ యువర్ టంగ్ రమా! నిన్నటి బట్టి నీ మాటలు  వినీ వినీ నా సహననం చచ్చిపోయింది. నీకూ ఒంట్లో బావో లేదని   ఓపిగ్గా పడుతున్నా! ఇహ నా వల్ల కాదు! ఇంకొక్క కారుకూత  చెవిన బడ్డా నేనేం చేస్తానో నాకే తెలీదు' 

లక్ష్యపెట్టే స్థితిలో లేదు రమాదేవి 'అహాఁ!  నాకంతా  ఇప్పుడు స్పష్టంగా కళ్లక్కడుతోంది ! మనింట్లో కూడా ఓ మహా రామాయణం నడుస్తోంది. అందులో తమరే కదా  శ్రీరామచంద్రమూర్తి. అందుకే ఆ శూర్పణఖ మీ కంటికి సీతమ్మవారిలా కనిపిస్తోంది..'

'షటప్..' కొట్టేందుకు చెయ్యేత్తేడు ఓర్పు సహనం పూర్తిగా నశించిన రమణారావు.

 

ఎప్పుడొచ్చిందో సీత .. గభాలున దంపతులిద్దరి మధ్యకు  వెళ్లి నిలబడింది. ఆ దెబ్బ సీత ముఖం మీదకు విసురుగా పడ్డం.. బీపీ ఎక్కువైమ రమాదేవి కళ్ళు తిరిగి కిందకు వాలిపోవడం క్షణాల్లో జరిగిపోయాయి!

***

మళ్లీ కళ్లు తెరిచే సరికి ఎదురుగా భర్త.. పక్కనే డాక్టర్ రామానుజం. 'పాపకు ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా తల్లి బ్రెస్ట్ ఫీడింగ్ పనికిరాదు! చెప్పిన జాగ్రత్తలన్నీ స్ట్రిక్టుగా పాటించండి! మళ్లీ మూడు రోజుల తరువాత సేంపుల్సవీ  చూసి కానీ ఏ నిర్ధారణకూ రాలేం' అని వెళ్లిపోయాడు.. డాక్టర్ కిట్ సర్దేసుకుని.

'నా కేమయిందండీ!' అయోమయంగా అడిగింది రమాదేవి .

'నీ పాత ఫ్రీజర్సే! మళ్లీ తిరగబెట్టింది! చూసేవన్నీ నిజాలు కావు. చూడనంత మాత్రాన కొన్ని అబద్ధాలు అయిపోవు.  అందుకే నిన్ను లేనిపోనివి ఊహించుకుంటూ టెన్షన్ పడద్దనడం! పేరుకే పెద్ద రచయిత్రివి.. ప్రశాంతంగా మంచీ చెడూ తర్కించడమే  రాకపాయ ఇప్పటికీ! మూడ్రోజుల్నుంచి ఇట్లాగే బెడ్ మీద పడుంటే నేనూ, పాపా ఏమై పోవాలని'అని మంద్రస్వరంతో మందలించాడు రమణారావు.. భార్య చేతిని తన చేతిలోకి తీసుకుని లాలిత్యం ఉట్టిపదే ప్రేమభావనతో. రమాదేవి కళ్లల్లో నీళ్ళు తిరిగాయి. గిల్టీగా అనిపించింది.  'మూడు రోజుల్నుంచీ ఫ్రీజర్సా! మరి పాపకు పాలు..'

'అదిగో మళ్లీ చింతలు మొదలు! నువ్వు నిశ్చింతగా ఉండడం అవసరం రమా! అట్లా ఉండాలనే కదా వెదికి వెదికి నేను సీతను ఎంతో కష్టపడి పట్టుకొచ్చింది!' అన్నాడు రమణారావు నిష్ఠురంగా!

ఉయ్యాలలని పసిపాప కక్కటిల్లుతుంటే  లేచి బైటికి నడిచాడు రమణారావు,

పసిబిడ్డను లాలనగా ఒడిలోకి తీసుకుని గోడ వైపుకు తిరిగి తన దుస్తులు పై భాగం  సడలించుకుంటోంది సీత.

ఆ క్షణంలోనే తాను చేసిన పొరపాటు ఏమిటో  రమాదేవికి అర్థమైంది. లాయరుగారికీ పసిపాప ఉంది. ఆ పాప తల్లి పోయి రెండు వారాలే అయింది!

తన తొందరపాటు ఆలోచనకు చాలా సిగ్గని  అనిపించింది రమాదేవికి. బొజ్జ నిండి కుడిచి, నిద్రకు పడిన పాపాయిని తెచ్చి తన బెడ్ పక్కన ఉన్న ఉయ్యాలలో బజ్జోపెట్టే సీత ఆమె కళ్లకు ఇప్పుడు నిజంగానే అన్నపూర్ణమ్మ తల్లిలా కనిపించింది.

 

 తనను దగ్గరగా పిలిచి రెండు చేతులూ పట్టుకుని కన్నీళ్లు పెట్టుకునే రమాదేవితో అంది సీత ప్రశాంతమైన మనసుతో ''ఛ.. ఊరుకోండమ్మా! తమరు పెద్దోరు! బావోదు. అయినా! ఇదేమైనా నేను మొదటి సారి గాని చేస్తున్నానా? ఉదారంగా చేస్తున్నానా? ఆ లాయరుబాబుగోరి కాడలాగే అయ్యగారి కాడా తీసుకుంటున్నాగా తల్లీ! బైటి కెళ్లేముందు మీకిదంతా చెప్పేసుంటే ఇంత కథే ఉండకపోను! ఆడముండని.. బిడియం అడ్డొచ్చింది తల్లీ!' అంది!

 'న్యాయానికి.. పసిబిడ్డకు చన్నిచ్చి ఇట్లా డబ్బులు తీసుకోడం కూడా పాపమేగా తల్లీ! కానీ.. ఏం చెయ్యాలా? గంపెడంత ఇల్లు గడవాలా!' అంటున్న సీత ఔన్నత్యం ముందు కుచించుకుపోయినట్లున్న తన వ్యక్తిత్వాన్ని చూసుకుని సిగ్గుపడింది  గొప్ప సామాజిక దృక్పథం తన సొంతమనుకుంటూ వస్తోన్న ప్రముఖ రచయిత్రి శ్రీమతి రమాదేవి.  

'చూసేవన్నీ నిజాలు కావు. చూడనంత మాత్రాన కొన్ని అబద్ధాలు అయిపోవు' అంటూ భర్త హమేశా చేసే హెచ్చరిక మరో సారి ఆమె చెవిలో గింగురుమంది.

 ***

-కర్లపాలెం హనుమంతరావు

19 -03 =2021

(ఆంధ్రభూమి- వారపత్రిక 13 నవంబర్, 2008 లో 'కళ్లు చేసే మోసం' పేరుతో ప్రచురితం)








అమ్మమ్మ తల్లి- కథానిక అనుసృజన : కర్లపాలెం హనుమంతరావు

 అమ్మమ్మ తల్లి- కథానిక

అనుసృజన: : కర్లపాలెం హనుమంతరావు

 

మా చిన్నతనంలో మా నాన్నగారి ఉద్యోగరీత్యా కొంతకాలం మేమొక కొండప్రాంతంలో ఉండాల్సివచ్చింది.  ఆ ప్రాంతం పేరు పిచ్చికుంటపల్లిపిచ్చికుంటపల్లికి దగ్గర్లోనే ఒక చిట్టడవి; ఆ చిట్టడవిలో గిరిజనుల ఆవాసాలుండేవి. అడవిలో దొరికే చింతపండు, పుట్టతేనె వంటివి.. ఏ సీజనులో దొరికే సరుకును  ఆ సీజనులో వారానికో సారి జరిగే సంతలకు తెచ్చిఅమ్ముకునేవాళ్ళు. వారానికి సరిపడా కావాల్సిన నిత్యావసర వస్తువులు కొనుక్కుని పోతుండే వాళ్లు.

 పల్లెల్లో తరచూ అంటువ్యాధులు ప్రబలి  ప్రాణహాని జరుగుతుందని జిల్లా కలెక్టరుగారికి ఫిర్యాదులు వెళ్లాయి ఒకసారివాళ్ళకు టీకాలు వేయించే  భాధ్యత మా నాన్నగారి నెత్తిమీద పడింది. ఆయన హెల్త్ డిపార్ట్ మెంట్ లో జిల్లా బాధ్యులు అప్పట్లో.

'ఓస్సోస్! టీకాలే కదా! అదే మంత గొప్ప ఘనకార్యమామనిషి జబ్బ మీద మందులో ముంచిన రొటేటరీ లాన్సెట్ అటూ.. ఇటూ ఓ సారి గిర గిరా తిప్పేస్తేఅని కొట్టిపారేయకండి! పాణిగ్రహణం ఎంత కష్టమో..టీకాలు వేయడానికి ఒప్పించుకుని గిరిజనుల పాణి గ్రహణం చేయడం అంతకన్నా కష్టంఅనుభవించే వాళ్ళకు మాత్రమే తెలిసే అవస్థ అది

 

నౌఖరీ అన్నాక అన్ని రకాల శ్రమదమాదులకూ తట్టుకోక తప్పదు కదాహెల్త్ డిపార్తుమెంటులో పనిచేసే మానాన్నగారూ అందుకు మినహాయింపు కాదు.  

 

రెండురోజులు అడవిలో వుండేందుకు వీలుగా ఓ క్యాంపు కాట్ఇక్ మిక్ కుక్కరు,  హోల్డాలుథెర్మోఫ్లాస్కుమర చెంబు.. వీటినన్నింటినీ మోసుకు తిరిగేందుకు ఒక మనిషిని ఎర్పాటు చేసుకుని మరీ బయలు దేరారు. ఆ తోడువచ్చే మనిషీ అడవిజాతివాడేపేరు 'రఘువా'.

 

రఘువా మాకా ఊరు వచ్చినప్పటినుంచి పరిచయం. చాలా విశ్వాసపాత్రుడు. అతగాడి గూడెంకూడా ఆ అడవిలోనే ఎక్కడో ఉందిముందు ఆ గూడెంనుంచే పని ప్రారంభించాలని మా నాన్నగారి వ్యూహంవాళ్లను చూసి ధైర్యంతో మిగతా గూడేలవాళ్ళు ముందుకొస్తారని ఆయన ఆలోచన.

 

అడవిలోపలి దాకా వెళ్ళి ఒక చదునైన స్థలంలో టెంట్ వేసుకొని.. క్యాంపుకాట్కుక్కరూగట్రాలు సర్దుకుని 'ఆపరేషన్ టీకాఆరంభించబొయే వేళకి బారెడు పొద్దెక్కింది. వెంట తెచ్చుకున్న కిట్లో మందు చాలినంతగా లేదని అప్పుడు చూసుకున్నారుట మా నాన్నగారుఎలాగూ ఇంకో 'బ్యాచ్మందు  పోస్టు ద్వారా వచ్చి సమీపంలోని  పోస్టాఫిసులో వుందని తెలుసు.. కనక బెంగ పడలేదుక్యాంపుకి  ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందా పోస్తాఫిసు. దాన్ని తీసుకుని రమ్మని రఘువా చేతికి చీటీ రాసిచ్చి పంపించి  మంచం మీద కాస్త నడుం వాల్చారుట మా నాన్నగారు.

 

అలవాటు లేని నడక పొద్దుటునుంచీ. అనుకోకుండా కళ్ళు అలాగే మూతలు పడిపోయాయిట. 

 

మెలుకువ వచ్చేటప్పటికి చుట్టూ చీకట్లు కమ్ముకుంటున్నాయి. 

 

అసలే అడవి ప్రాంతంకొత్త చోటుఎటు వైపునుంచి ఏ జంతువొచ్చి మీద పడుతుందో.. అప్పుడేం చేయాలో తెలీదుఉదయం బయలు దేరేటప్పుడు ఇంట్లొ తీసుకున్న అల్పాహారమే! మధ్యాహ్నం క్యాంపులో రఘువా చేత వండించుకుని తిందామని ప్లాన్ఇప్పుడు ఆ రఘువానే ఆజా ఐపూ లేకుండా పోయాడు. ముష్టి ఐదు కిలో మీటర్ల దూరం  పోయి రావడానికి ఇన్ని గంటలాఅందులోనూ నిప్పుకోడిలాగా దూకుతూ నడుస్తాడు రఘువా.

 

ఏం జరిగిందో అర్థం కాలేదుఏం చేయాలో అంతకన్న పాలు పోలేదు మా నాన్నగారికికడుపులో ఎలుకలు పరుగెడుతున్నాయిముందు ఆత్మారాముడి ఘోష చల్లార్చాలిఆనక ఈ రాత్రికి రక్షణ సంగతి చూసుకోవాలి.

 

దగ్గర్లో ఉన్న గూడానికి పోయి వచ్చీ రాని  భాషలో ఏదో తంటాలు పడి తన వెంట ఇద్దరు కోయ యువకులను తెచ్చుకున్నారుట మా నాన్నగారు. తెల్లార్లూ వాళ్ళు టెంటు బైట కాపలా వుంటే.. లోపల పేరు తెలియని జంతువుల అరుపులు వింటూ  మా నాన్నగారి జాగారం.

 

తెల్లవారంగానే ఆయన ముందు చేసిన పని ఒక యువకుణ్ణి టెంటుకి కాపలా పెట్టి.. ఇంకో యువకుడిని తోడు తీసుకుని వెళ్ళి పోస్టుమాస్టరుగారిని  కలవడం.

"మందు ప్యాకెట్టు నిన్నే మీరు పంపించిన మనిషి తీసుకెళ్ళాడు సార్!" అనేసాడుట పోస్తుమాస్టరుగారు తాపీగా.

 

'మా నాన్నగారి గుండెల్లో రాయి పడింది. నిన్ననగా మందు తీసుకున్నవాడు ఇవాళ్టికి కూడా టెంటుకు చేరలేదంటే అర్థమేంటీకొంపదీసి మధ్యదారిలో ఏదన్నా జరగరానిది జరగలేదుగదా!ముచ్చెమటలు పట్టడం మొదలుపెట్టాయిట మా నాన్నగారికి.

 

ఆయన భయానికి మరో ముఖ్యకారణం కూడా ఉంది. రూల్సు ప్రకారం రఘువా ఆ మందు డెలివరీ తీసుకోరాదుఆ అమాయకుడేమన్నా ఈ మందును  ఇంకేదన్నా అనుకుని  దుర్వినియోగం చేసుంటే.. మొదటికే మోసం. మందు సంగతి అలా ఉంచి ముందు మనిషి ప్రాణానికే ముప్పం.

 

 ఏం చేయాలో పాలు పోక అక్కడి పోస్టాఫీసు బెంచీమీద అలాగే కూలబడి పోయారుట మా నాన్నగారు.  పాపంపోస్టుమాస్టరుగారే కాసిని చాయ్ నీళ్ళు తాగించి.. ఆనక సలహా కూడా ఇచ్చారుట."సాధారణంగా ఇక్కడి గిరిజనులు చాలా నిజాయితీగా ఉంటారండీ! ఇంకేదో జరిగి వుండాలి. ఏం జరిగిందో తెలుసుకోవాలన్నా ముందు మీరు ఆ రఘువా ఉండే గూడేనికి వెళ్ళి వాకబు చేయాలిఅక్కడి పరిస్థితులను బట్టి అప్పుడు ఏం చేయాలో ఆలోచించుకుందురుగాని.. ముందు బైలుదేరండి" అని తొందరపెట్టి మరీ పంపించాడుట.  రఘువా గూడేనికి వెళ్లే దారికూడా  ఆయనే  చూపించాడుట.

 

ఆరు మైళ్ళు.. డొంకదారుల్లో బడి.. ఎత్తులూ పల్లాలూ దాటుకుంటూ.. రఘువా ఉండే గూడేనికి చేరుకొనేసరికి సూర్యుడు నడినెత్తిమీద కొచ్చేసాడుట.

 

గూడెం పొలిమేరల్లోనే ఒక  ఊరేగింపు ఎదురైందిట వాళ్ళకు. ఆడామగా అట్టహాసంగా చిందులేసుకుంటూ  కోలాహలంగా  వస్తున్నారు  బాజాలూ బంత్రీలూ మోగించుకుంటూ. మధ్యమధ్యలో జివాల బలులు. కోళ్ళని గాల్లోకి ఎగరేసి గొంతులను లటుక్కుమని నోటితో కొరకడం.. చిమ్మేరక్తాన్ని ఊరేగింపు మధ్యలో  ఉన్న దున్నపోతుమీదకు చల్లడం! దున్నపోతుకు చేసిన అమ్మోరి వాహనం అలంకారంలో ఈ రక్తం కలగలిసిపోయి చూపులకే పరమ భయంకరంగా ఉందంట అక్కడి వాతావరణం. అన్నింటికన్న విచిత్రమైన విషయం.. ఆ దున్నపోతు మీద ఊరేగుతున్న పెద్దమనిషి ఎవరో కాదు.. సాక్షాత్తూ రఘువానే! 

 

వాహనం మీద అటో కాలూ ఇటో కాలూ వేసుకుని  వళ్లో ఏదో బుట్టతో దేవుడల్లే  కూర్చోని వున్నాడుట. నుదిటిమీద పెద్ద పెద్ద కుంకుమ బొట్లు.. మెళ్ళో పూలుపూసలు కలగలిపి అల్లిన దండలు.. చేతిలో బల్లెం.. చూడ్డానికి సాక్షాత్తూ యమలోకం నుంచి దిగొచ్చిన  కింకరుడు మల్లే ఉన్నాడుట. 

 

చేతులూ రెండూ కట్టుకుని.. ముంగిలా.. ఎప్పుడూ వెనకెనకే వంగి వంగి నడిచే రఘువాలో ఇన్ని కళలున్నాయా!' ఆశ్చర్యంతో మానాన్నగారి నోటంట మాట రాలేదుట. ఆటైములో.

 

అసలేం జరుగుతుందో అర్థం కాలేదుత ముందాయనకు. వెంటవచ్చిన గిరిజనుడిదీ అదే పరిస్థితి. 'కనుక్కొస్తాన'ని అటుగా వెళ్ళిన మహానుభావుడు.. నీరసంతో శోషొచ్చి మా నాన్నగారు  బండమీద వాలి పోయిందాకా తిరిగి రానేలేదుటఅరగంట తరువాత వచ్చి దగ్గర్లోని చెట్టునుంచి రెండు జాంకాయలు  కోసి తినిపించి అప్పుడు తీరిగ్గా వినిపించాడుట తెచ్చిన సమాచార ఆ గిరిజనుడు.

 

 

 అతగాడు తెచ్చిన సమాచారం ప్రకారం ఇంకో గంటలో ఊరిబైట కొత్తగా గుళ్లో అమ్మమ్మ తల్లి ప్రతిష్టాపన జరగబోతుంది.

'అమ్మతల్లితెలుసు గాని.. ఈ 'అమ్మమ్మ తల్లిఎవరూ?" అని అడిగారుట మానాన్నగారు.

"నాకూ తెలీదు దొరాఎప్పుడూ వినలేదుచూద్దాం పదండి" అని అర్థం వచ్చే వాళ్ళభాషలో ఏదో కూసి ఆ దేవాలయం ఎక్కడ కడుతున్నారో అక్కడికి  నడిపించుకుని పోయాట్త ఆ గిరిజనుడు.

 

ఊరికి ఉత్తరంలో కొత్తగా కాల్సిన మట్టి ఇటుకలతో కట్టిన నాలుగు గోడల గుడి అదిదాని మధ్యలో అరగంట కిందటే ప్రతిష్టించినట్లున్నారు అమ్మమ్మతల్లిని.. బైట ఇంకా పచ్చి ఆరని బల్లుల రక్తం మరకలు.. పసుపు కుంకుమల వాసనలు.. సగం కాలిన అగరవత్తులూ..!

 

అప్పటి దాకా సందడి చేసిన గిరిజనులు.. ప్రతిష్టాపన అనంతరం.. సంబరాలు చేసుకుంటూ ఒక దిక్కుకు వెళ్ళిపోవడం చుసారుట మా నాన్నగారు.

'టీకా మందు తెమ్మ'ని పంపించిన నమ్మకస్తుడు.. అలా అన్నీ మరిచి మందుకొట్తి కొత్త దేవుడి అవతారంలో మందతో కలిసి ఇలా ఆడుతూ..పాడుతూ మొహం కూడా చూపకుండా వెళ్ళిపోతుంటే.. అంత లావు ఆఫీసరు సారయివుండీ..ఏం చేయాలో దిక్కుతోచక అలాగే నిలబడిపోయారుట మానాన్నగారు.

 

"అప్పటికింక చేసేదేమీ లేదు.. తిరిగి మళ్ళీ చీకటి పడేలోపు టెంటుకెళ్ళి బబ్బోవడం తప్పమళ్లీ మందు  తెచ్చుకొని  'ఆపరేషన్ టీకాకంటిన్యూ చేయడమెలాగూ తప్పదు. జరిగిందంతా పై అధికారులకు  వివరంగా చెప్పి పడబోయే పనిష్మెంటుకి తలవగ్గడం ఎలాగూ  తప్పదు.అలా అనుకున్న తరువాత ఇంక వర్రీ అవడం మానేసానుఎలాగూ పోతున్నాము కదా.. ఒక సారి ఈ కొత్త దేవత అమ్మతల్లి ఎలాగుంటుందో చూడాలని కుతూహలం పుట్టుకొచ్చింది" అని చెప్పుకొచ్చారు మా నాన్నగారు తరువాత మా కాకథ చెప్పే సందర్భంలో ముక్తాయింపుగా.  గుర్తున్నంత వరకూ ఆయన మాటల్లోనే చెప్పి ఈ కథ ముగిస్తా.

 

"..అప్పటికే నావెంట వచ్చిన గిరిజనుడు గుడిముందు పడి పొర్లుదండాలు పెట్టేస్తున్నాడు. గుడికి ఇంకా పైకప్పు ఏర్పాటు కాలేదుకాస్త ముందుకు వెళ్ళి లోపలికి తొంగి చూసా!

ఆశ్చర్యం! పీఠంమిద  'టీకా మందుల పెట్తె'! అదే రఘువా పోస్తాఫీసునుంచి విడిపించుకొచ్చింది. దానికి అన్ని వైపులా పసుపూ కుంకుమ బొట్లు పెట్టున్నాయి! ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. మెడిసన్ తొ పాటు ప్రచారానికని సప్లై చేసిన  డిస్ ప్లే మటీరియల్లో ఒక సినిమాతార  కుడిచేత్తో సిరెంజి.. ఎడం చేత్తో అభయ హస్తం ముద్ర పట్టి వున్నట్లు ముద్రించిన పోస్టరు ఒకటుంది.. అది ఆ గుడిగోడ లోపల అంటించి ఉందిఆ సినీతార నుదుటనిండా ఇంత మందాన కుంకుమ బొట్లు.. కాళ్ళకి పసుపు పారాణీ!.. టీకాలు సక్రమంగా  వేయించుకుంటే ఆరోగ్యానికి భద్రతఅన్న నినాదం ఇచ్చే సినిమా తార హఠాత్తుగా  ఈ గిరిజనులకు 'అమ్మమ్మతల్లి'ఐపోయిందన్నమాట!  అలా ఎందుకయిందో..ఎలా ఐందో ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థమై చావలేదు.

మర్నాడు తిరిగి వెళుతూ వెళుతూ దారిలో పోస్టుమాస్టరుగారిని మళ్ళా కలిసి విచారించినప్పుడు గానీ ఆ చిక్కు ముడి విడిపోలేదు.

"మీ రఘువా మందు ప్యాకెట్టూ.. ప్రచార మెటీరియల్ తీసుకుంటున్నప్పుడు 'నన్ను అడిగాడండీ.. ఇదేమిటి దొరా?" అనిఇక్కడి కొండజాతివాళ్ళు 'ఆట్లమ్మా..మశూచికంలాంటి అంటువ్యాధులని 'అమ్మోరుఅని పిలుచుకుంటుంటారుఆ అమాయకుడికి బాగా అర్తమవుతుందన "మీ అమ్మోరుని చంపేసే మందురా" అని చెప్పాసార్!. దాన్నా అమాయకుడు 'అమ్మమ్మ తల్లిగాభావించాడుమీకు తిరిగి తెచ్చిస్తే మిగతా గూడేలకందరికీ పంచేస్తారు కదావాళ్ల గూడెపొళ్ళకి దక్కకుండా పోతుందనుకున్నాడో ఏమో.. నేరుగ్గా గూడేనికే తీసుకెళ్ళి నాయకుడి పరం చేసేసాడు. ఆ నాయకుడూ అంతకన్నా తెలివిమంతుడు లాగున్నాడు. వాళ్ల ఆచారం ప్రకారం ఈ 'అమ్మమ్మ తల్లి'కి ఊళ్ళోనే గుడి కట్టించి పారేశాడు" అని వివరించాడ్దుట పోస్టుమాస్టరుగారు"

 

అదండీ ఆ గిరిజనుల అమాయకత్వం. వాళ్ళంటే అనాగరికులు. చదువుకోని వాళ్ళుఅన్ని చదువులు చదివి ఇంత నాగరీకం వెలగబోసే మనం మాత్రం ఇంతకన్నా తెలివిగా ప్రవర్తిస్తున్నామాఆలోచించుకోవాల్సిన విషయం ఎవరికి వాళ్ళుగా!

అందుకే అప్పటి కథ ఇప్పుడు చెప్పుకొచ్చింది.*

అమ్మమ్మ తల్లి- కథానిక

అనుసృజన : కర్లపాలెం హనుమంతరావు

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...