Showing posts with label Languages. Show all posts
Showing posts with label Languages. Show all posts

Monday, December 6, 2021

తెలుగు పాత్రికేయం సమానార్థకాలకు ప్రయత్నలోపం - సి. రాఘవాచారి


తెలుగు పాత్రికేయం

సమానార్థకాలకు ప్రయత్నలోపం

- సి. రాఘవాచారి

తెలుగు పత్రికల భాషాసేవ అనన్య సామాన్యమైనది. వివిధ రంగాల్లోని సమాచారాన్ని పాఠకులకు తెలియజేయడంతో పాటు తెలుగుభాషా వికాసం కూడా పత్రికల కర్తవ్యంలో భాగంగా ఉండేది. వార్తాసంస్థలు ఇంగ్లీషులో పంపించే వార్తలను అనువాదంచేసి, ప్రచురించేటప్పుడు  సాధ్యమైనంతవరకు తెలుగు పదాలే వినియోగించాలని ఒకనియమం స్వచ్ఛందంగానే పాటించడం జరిగేది. దానిని నియమం అనడంకన్నా స్వభాషపట్ల అనురక్తిగా చెప్పడం ఇంగ్లీషు పదాలకు సమానార్థకాలు సృష్టించడం, అవి ప్రజలకు సులభంగా అర్థమయ్యేరీతిలో రూపొందించడం ఆరోజుల్లో సంపాదకవిభాగంలో పనిచేసేవారి ప్రాథమ్యంగా ఉండేది. కొత్తపదం వచ్చినప్పుడు మక్కికి మక్కి కాకుండా అర్ధాన్ని బట్టి, తెలుగులో సులభంగా అర్ధంగ్రహించటానికి వీలయ్యే సమానార్థకాన్నే స్థిరపరచి వాడేవారు. తెలుగును అధికారభాషగా ప్రకటించిన తరువాత ఈ ప్రయత్నంపట్ల ఉండాల్సిన శ్రద్ధాశక్తులు ఏ కారణంతో లోపించినా విచారకరం.


తెలుగుపాత్రికేయుల్లో సంపాదకులతోపాటు అనుభవజ్ఞులైనవారు ఈ విషయమై ఆవేదన పడుతున్నారు. ఆందోళన చెందుతున్నారు. ఇంగ్లీషు అనేకాదు, సంస్కృతం, ఉర్దూ పదాల వెల్లువలో తెలుగుభాష తన స్వరూపాన్ని పోగొట్టుకుంటున్నదా అనే బాధ సహజం. అవసరమైనప్పుడు అన్యభాషా పదాలు బాగా ప్రచారంలో ఉన్నవయితే వాటిని తెలుగుభాష విసర్గ సౌందర్య సౌష్టవాలు చెడకుండా వాడడంలో ఆక్షేపణలకు తావుండరాదు. కానీ, ఇప్పుడు జరుగుతున్నది అదికాదు. పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రమున్నట్లు ఇంగ్లీషుపదాలు శీర్షికల్లోనూ, వార్తల్లోనూ విశృంఖల స్వైరవిహారం చేస్తున్నాయి. సమస్యను పరిష్కరించడానికి పాత్రికేయులతోబాటు విశ్వవిద్యాలయాలు, వివిధ అకాడమీలు (ప్రత్యేకించి ప్రెస్ అకాడమీ) కలిసి ప్రయత్నిస్తే సమానార్థకాలసృష్టి అసాధ్యమేమీకాదు. తెలుగుభాష సమయ సందర్భాలనుబట్టి అన్యభాషాపదాలను స్వీకరించడానికి అనువైనది. ప్రాచీన సాహిత్యంనుంచి నేటి పత్రికలభాష వరకు వెయ్యేళ్ళచరిత్ర ఈ విషయాలను నిరూపిస్తోంది. గతంలో తెలుగుపత్రికలకు తెలుగులోనే వార్తలు పంపాలని విధిగా ఆదేశాలున్నరోజుల్లో సమానార్థకాలకోసం విలేకరి కొంత ప్రయాస పడాల్సివచ్చేది. కానీ ఆ ప్రయాస ఫలప్రదంగా

భాషకు, విలేకరి భాషాభివృద్ధికి తోడ్పడుతుండేది. 


అప్పుడు సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తరువాత కూడా ఇంగ్లీషు పదాల వాడకం పెరగడం ఒక విచిత్రమైన వైవిధ్యం, 

గతంలో వలె పత్రికల్లో రాజకీయాలకు పరిమితం కాకుండా, ఈ రోజు అనేక శాస్త్ర విజ్ఞాన విషయాలకు సంబంధించిన వార్తలను పాఠకులకు అందజేయడం విరివిగా పత్రికల్లో అదాజేయడం జరుగుతున్నది. పత్రికలలో ఉండే సహజమైన వత్తిళ్ల  కారణంగా పారిభాషక పదాలకు సమానార్థకాల ఇబ్బందితో కూడుకున్నప్పటికీ, ఆ కారణంతో అన్యభాషాపదాలను అదేపనిగా ఉపయోగించడం సరైనదికాదు. పరిభాష వెనుకఉండే భావాన్ని - సమానార్థకాలు స్వీకరించే సదవకాశం ఎక్కువ. సోవియట్ యూనియన్ లో గోర్బచెవ్  సంస్కరణలుగా 'గ్లాస్ నోస్త్ ', 'పెరిస్త్రోయికా' అనేపదాలు విరివిగా వార్తల్లో వచ్చేవి.  వాటికి  స్థూలంగా దగ్గరైన  'గోప్యరాహిత్యం', 'పునర్వ్యవస్థీకరణ' అనేపదాలు తెలుగులో వాడినందువల్ల పాఠకులు సులభంగా గ్రహించేపరిస్థితి ఉండేది. ఏదైనా సమానార్థకంకన్నా అన్య భాషా  పదమే పాఠకులకు అర్థమవుతుందనుకుంటే అది వినహాయింపు తప్ప సూత్రం కారాదు.


పారిభాషిక పదాలకు తెలుగులో సమానార్థకాలు రూపొందించడం లక్ష్యంగా తెలుగు అకాడమీవంటి సంస్థలను ఏర్పాటుచేశారు. శాసన, పరిపాలనా సంబంధమైన పదాలకు స్పష్టమైన ప్రసిద్ధమైన సమానార్థకాలు రూపొందించినప్పటికీ వాటివినియోగం పత్రికల ద్వారా ఆశించినంతగా లేకపోవడం బాధాకరమే. ఉదాహరణకు 'టాక్స్'ను తీసుకుంటే దానికి పన్ను' అని రాస్తుంటాం. అంతేగాకుండా సెస్సు, డ్యూటీ, లెవీ అనే బడ్జెట్ పారిభాషిక సాంకేతికార్థం భిన్నంగా ఉంటుంది. అయినా పైసంస్థలు రూపొందించిన పదాలకంటే ఎక్కువగా పాఠకులకు  ఆమోదయోగ్యమైనవాటిని పత్రికలు తమకుగా తాము సృష్టించుకుంటే అభ్యంతరం ఉండరాదు . ఆ ప్రయత్నం లేకపోగా సమానార్థకాలపట్ల అలసత్వం, తేలికభావన చోటుచేసుకోవడం విచారించదగిన విషయం.


జన వ్యవహారంలో అలవాటుపడిన అన్యభాషా పదాలు అన్ని భాషల్లోనూ ఉంటాయి. వాటికి భాషా ఛాందసం జోడించి విశ్వామిత్ర సృష్టితో సమానార్థకాలు రూపొందించాల్సిన పనిలేదు. ఒకవేళ అలా సృష్టించినా అవి ఆమోదయోగ్యత పొందడం కష్టం. తెలుగుమాత్రమేవచ్చి అన్ని రంగాలకు చెందిన సమాచారాన్ని పత్రికలద్వారా తెలుసుకోవాలనుకొనే పాఠకుడు ప్రమాణంగా ఉండాలి. తెలుగు పత్రిక చదవటానికి మరో రెండుభాషల పరిచయం అర్హతగా ఉండాల్సినస్థితి అపహాస్యభాజనం. బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వంలో అధికారభాషాయంత్రాంగం నిర్వహించిన కీర్తిశేషులు పి.వి. నరసింహరావు, పరిపాలనారంగంలో తెలుగు వినియోగంపై శాసనసభలో శ్వేతపత్రం (వైట్‌ పేపర్) ప్రకటించినప్పుడు అందులోని సమానార్థకాలపట్ల పత్రికల్లో పెద్దవిమర్శ సాగింది. 


ఒక ప్రసిద్ధసంపాదకుడు అయితే ధారావాహిక సంపాదకీయాల్లో భూరాజసము (ల్యాండ్ రెవిన్యూ) లాంటి పదాలను ఉటంకించి ప్రత్యాఖ్యానం వెలువరించారు. దీనికి స్పందించి నరసింహారావుగారు తెలుగురాక మరిన్ని భాషలు చదివినవారు తెలుగు భాషాభివృద్ధికి ఆటంకమని చెప్పినదాంట్లో అతిశయోక్తి ఉండవచ్చేమోగానీ ఇప్పటి స్థితినిబట్టి ఎంతో కొంత సరైన ప్రతిస్పందన అనిపిస్తోంది.


ప్రస్తుతం తెలుగు పత్రికల్లో, ప్రసార మాధ్యమాల్లో అవసరంలేకున్నా ఇంగ్లీషుపదాలు వాడటం ఎబ్బెట్టుగా తోస్తోంది. అచ్చమైన తెలుగుమాట దేవుడెరుగు, అసలు ఇంగ్లీషుమాటలు వాడితేనే అదేదో శ్రేష్ఠమన్న భావన చోటు చేసుకున్నది. ఒక పత్రికలో గతంలో పతాకశీర్షికల్లో కూడా భారత్ బదులు ఇండియా అని వాడేవారు. అది అప్పుడు చివుక్కుమనిపించినా ఇప్పటి పరిస్థితుల్లో కొంత మేలేమో అనిపిస్తోంది.  ప్రాంతీయ ప్రత్యేకతలను బట్టి భాషలో అక్కడికక్కడే అర్థమయ్యే పదాలు ఇతరత్రా వాడినందువల్ల గందరగోళం తప్ప మరేమీ

ఉండదు, 

కోస్తా ప్రాంతాల్లో వెలువడే ఎడిషన్లలో 'షురూ' అనే ఉర్దూ పదం కనిపిస్తోంది. ఏమైనా ఏ భాషపట్ల వ్యతిరేకత అక్కర్లేదుగానీ, మనభాషను సుసంపన్నం చేసుకోవడం అభిలషణీయం. ఈ అంశంపై పాత్రికేయుల్లోనే ఆత్మపరిశీలన అవకాశం కల్పించడం ద్వారా మిత్రులు టంకశాల అశోక్ ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో జర్నలిస్టులు, ప్రెస్ అకాడమీ, వివిధ విశ్వవిద్యాలయాల్లోని జర్నలిజం శాఖలు భాగస్వాములైతే ఆ ఫలితం అందరికీ చెందుతుంది.

( ' వార్త' 15-06-05- ఆధారంగా ) 

- సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

                   07-11-2021 


Thursday, September 30, 2021

తెలుగు భాష ప్రాచీనత విశిష్టతలపై రాజకీయాలు -కర్లపాలెం హనుమంతరావు



రాజ్యాంగబద్ధంగా చూసుకుంటే  రాజ్యాంగంలో పొందుపరిచిన అన్ని భాషలకు ఒకే తరహా హోదా ఉంటుంది. ఒక భాషకు ప్రాచీనత దృష్ట్యానో, మరే ఇతరేతర కారణాలతోనో 'క్లాసికల్' బిరుదు తగిలించబూనుకోవడం రాజ్యాంగ రీత్యానే సమ్మతం కాదు. కాని, ఉత్తర భారతం పెద్దన్న పాత్ర  పెత్తనం కారణంగా హిందీకి లభించే ఆదరణ దక్షిణాదిన ఏ ద్రవిడ భాషకూ దక్కడం లేదు. అందులోనూ తెలుగు భాష పరిస్థితి నానాటికి తీసిపోవు నాగం బొట్లు సామెతలా తయారయింది.

తమిళ భాషకు మాత్రమే క్లాసికల్ హోదా దక్కడం ద్రవిడభాషా రాజకీయాలలోనూగల పక్షపాతం ఇందుకు నిదర్శనం. తమిళనాట రాజకీయాలు ప్రారంభం నుండి భాషతో సమ్మిళితమయివుండటం, కేంద్రంలోని ప్రభుత్వాలను   తమిళ  పక్షాలు ప్రభావితం చేయగలగడం వంటివి ఉపరితలంలో కనిపించే కొన్ని రాజకీయ, సాంస్కృతిక కారణాలు. అందుకు భిన్నమైన పరిస్థితులు తెలుగుభాషకు శాపంగా మారాయి.

తమిళుల తరహాలో తెలుగువారికి స్వీయభాషకు సంబంధించిన భాషాఉద్యమాలు, బలమైన సాంస్కృతిక ఆకాంక్షలు లేవు. పేరులో తెలుగు ఉన్నప్పటికి తెలుగుదేశం ఒక రాజకీయపక్షంగ  తెలుగు భాష సమున్నతి కోసం నిజాయితీతో చేపట్టిన చర్యలు శూన్యం. గతంలో కేంద్రంలో ఎన్.డి.ఎ ప్రభుత్వ పాలనలో తెలుగుదేశం నిర్వహించగల ప్రముఖ పాత్ర వుండీ, భాష కోసమై  చేపట్టిన ఒత్తిడి కార్యక్రమాలు  ఏవీ  లేవు. రాజకీయపార్టీలను తప్పుపట్టి ప్రయోజనం లేదు. ఓటర్ల మనోభీష్టాలకు అనుగుణంగా ఎదగడం ద్వారా అధికారం చేపట్టే లక్ష్యంతో పనిచేయడమే  రాజకీయపక్షాల స్వాభావిక లక్షణం.

 

ఇక్కడగల మరో విచిత్రం గమనించాలి. 'క్లాసికల్ లాంగ్వేజ్' అనే పదాన్ని తెలుగులో ప్రాచీనభాషగా  తర్జుమా చేసుకుని భాషకు సంబంధించిన వయస్సు నిర్ధారణపై పేచీలకు దిగడం చూస్తున్నాము. న్యాయానికి క్లాసికల్ అనే ఆంగ్లపదానికి విశిష్టత, శ్రేష్టత సమానార్థకాలుగా చెప్పుకోవాలి. కాబట్టి ఒక భాష క్లాసికల్ లక్షణం కేవలం ఆ భాష వయసును బట్టే కాక, ఆ భాషకు ఉండే విశిష్టత ఆధారంగా కూడా నిర్ధారించడం ఉచితం.

విశిష్టతకు భాష సుసంపన్నత ఒక్కటే కారణం కాబోదు. అంతకు మించి భాషకు ఉండే స్వతంత్ర ప్రతిపత్తి, మరింత వివరంగా చెప్పాలంటే పునాది కూడా గణనకు తీసుకోవాలి. ఆంగ్లభాష ఎంత సుసంపన్నమైనప్పటికి యూరపులో గ్రీకు భాషతో సమానమైన హోదా సాధించలేకపోవడం గమనార్హం. వేరొక సంప్రదాయం నుండి ఉద్భవించినప్పుడు, ఎంత సుసంపన్నమైనప్పటికి భాషకు స్వతంత్ర ప్రతిపత్తి లభించదు. సంగమ సాహిత్యంలో తమిళభాషకు సుమారు 1000, 1500 సంవత్సరాల వెనుకనే స్వతంత్ర సాహిత్య అస్థిత్వం ఉంది. క్లాసికల్ భాష సరితూగే ప్రమాణమే అది.

 

వాస్తవ దృష్టితో పరిశీలిస్తే అసలు ఈ 'క్లాసికల్' అనే పదమే దేశీయమైనది కాదు,  యూరపు సంబంధితం. అక్కడ వారు పైన చెప్పిన కారణాలతో ఆంగ్లానికి కాక గ్రీక్ భాషకు క్లాసికల్ హోదా కట్టబెట్టారు. మనం మన భాషా సంస్కృతులకు వేరే ప్రమాణాలు నిర్ధారిచుకోవలసిన అగత్యం ముందు గుర్తించాలి. ప్రస్తుతమున్న ప్రమాణాలను బట్టి చూసుకున్నా క్లాసికల్ హోదా సాధించిన తమిళ భాషకు మించి వయసు, విశిష్టతల దృష్ట్యా సంస్కృత భాషకు ఈ హోదా దక్కడం సబబు. అందుకు భిన్నంగా తమిళభాషకు ప్రాచీన హోదా పట్టం కట్టడం వెనుక ఇంతకు ముందు చెప్పుకున్నట్లు రాజకీయాలే ప్రధాన కారణం.

 

తమిళానికి మూలం సంగమ సాహిత్యం. దాని వయసు సుమారు క్రీ.శ అయిదో శతాబ్ది వరకు విస్తరించినట్లు పరిశోధకులు చెప్పే మాట. (ప్రముఖ భాషా పరిశోధకుడు డాక్టర్ కె.ఎ. నీలకంఠ శాస్త్రి వాదన ప్రకారం తమిళ భాష ప్రాచీనత క్రీ.శ. 300 శతాబ్ది అయినా కాదు.) అత్యంత ప్రాచీనత తన ప్రత్యేకతగా  చెప్పుకునే తమిళానికి ఉన్న స్వతంత్ర పునాది ఏమిటో, దానికి సమానమైన లేదా మించిన వయసు, విశిష్టతలు తతిమ్మా భాషలకు ఎందుకు లేవో.. ఎక్కడా ప్రమాణపూర్వకమైన ప్రయాగాల ద్వారా నిర్దారణ కాలేదు.  కాని  తమిళభాషకు ప్రాచీన హోదా కల్పించారు! కేవలం రాజకీయ కోణం మాత్రమే దీని వెనుక అన్నది సర్వే సర్వత్రా భాషాపండిత లోకంలో వినవస్తున్న మాట. కాదనగలమా?

(తెలుగు భాష ప్రాచీనత, విశిష్టత - కల్లూరి భాస్కరంగారి పరిశోధన వ్యాసం ఆధారంగ)

-కర్లపాలెం హనుమంతరావు

01 -09 -2021

బోథెల్, యూ.ఎస్.ఎ

 

 

 

Saturday, July 3, 2021

ఆంధ్ర'భాషాపదం- చరిత్ర పరంగా -కర్లపాలెం హనుమంతరావు

 



క్రీస్తుకు పూర్వం పదో శతాబ్దం దాకా 'తెలుగు' అనే పదమే కనిపించదు. ఈ పదం మొదటిసారి ప్రత్యక్షమవడం తమిళ, కన్నడ శాసనాలలో, ఆంధ్రకర్ణాటక వాజ్ఞ్మయంలో! అదీ 'తెలుంగు, తెలుంగ, తెలింగ' తరహా రూపాలలో!

జాతికా? భాషకా? ఈ ‘తెలుగు’ పదం దేనికి సూచకం? అన్న ప్రశ్నకు ‘రెండింటికీ’ అన్నది  సరిపోయే సమాధానం. ఈ రెండింటికే కాకుండా మూడోది, ముఖ్యమైనది ‘స్థాన’ సూచకంగా కూడా వాడుకలో ఉండేది ఒకానొకప్పుడు. 'తెలుంగ నాడొళగణ మాధవియకెఱెయ' అంటూ 'తెలుగుదేశంలోని 'మాధవియకెఱెయ' అనే ఊరి పేరు 'దేశ'పరంగా ప్రస్తావించిన తొలినాటి శాసనమే ఇందుకు ఆధారం.  ‘తెలుగు’ అనే పదం  భాషకు చేసే సేవనే  ఆంధ్రతిలింగ, తెలింగ అనే రెండు పదాలు అప్పటికే  చక్కబెడుతున్నాయి.

ఇట్లా దేశపరంగా 'తెలుగు'  పదం ప్రాచుర్యంలోకి రావడం క్రీ.శ పదో శతాబ్దం తరువాత. కానీ ఆ తెలుగు పదం   'తెలుంగు, తెలింగ' లాంటి రూపాలలో కనిపించేది.  పదకొండో శతాబ్ది నాటి  చాళుక్య రాజరాజు నరేంద్రుడి ఆస్థాన కవి నన్నయభట్టు కాలం నాటికి  తెలుగుకు 'తెనుగు' అనే మరో భాషారూపం కూడా జతపడింది.  పన్నెండో శతాబ్దపు  నన్నెచోడుడి చలవతో ఆ 'తెనుగు' అనే పదం  భాషకు సంబధించిందన్న భావం గట్టిపడింది. పదమూడో శతాబ్దిలో మహమ్మదీయ చరిత్రకారులు కూడా 'తిలింగ్' అన్న పదం వాడేసి  'తిలింగ' అన్న రూపానికి సాధికారత కల్పించడం విశేషం! ఏతావాతా తేలేది ఏమిటి? తిలింగ, తెలుంగు, తెలింగ, తెనుగు తరహా పదాలు కూడా అంతకు మునుపట్లా కేవలం, ప్రాంతానికి.. జాతికే  కాకుండా  'భాష'ను సూచించే పదాలుగా కూడా సామాజిక ఆమోదం పొందాయని. అప్పటికి వరకు వాడుకలో ఉన్న ‘ఆంధ్ర’  పదానికి ఈ 'తిలింగ, తెలుంగు, తెలింగ, తెనుగు' తరహా పదాలు ప్రత్యామ్నాయాలు అయ్యాయన్నమాట.  బొత్తిగా శబ్ద సాజాత్యం లేకుండా ‘ఆంధ్ర’ పదానికి ఎట్లా   ప్రత్యామ్నాలయాయీ? అంటే అదే చిత్రం!

ఇక తెలుగు, తెనుగు పదాల వ్యుత్పత్తి పుట్టుక అంతకు మించిన విచిత్రం. వివాదాస్పదం కూడా.  క్రీ.శ 14 వ శతాబ్ది ప్రథమార్థంలో ఓరుగల్లును ఏలిన కాకతి చక్రవర్తి ప్రతాపరుద్రుడి ఆస్థానంలో ఉండే దుండిన విశ్వనాథకవి తన  ప్రసిద్ధ 'ప్రతాపరుద్రీయం' లో 'యై ర్దేశ స్త్రిభి రేష యాతి మహతీం ఖ్యాతిం త్రిలింగాఖ్యయా/యేషాం కాకతిరాజకీర్తివిభవైః కైలాస శైలః కృతః/తే దేవాః ప్రసర త్ప్రసాదమధురాః శ్రీశైల కాళేశ్వర/ద్రాక్షారామనివాసినః ప్రతిదినం త్పచ్ఛ్రేయసే జాగ్రతు' అంటూ చేసిన ప్రార్థనలో 'త్రిలింగ' అనే పదం  వాడాడు. అందుకు ఆ కవి చెప్పిన కారణం తిరుగులేనిది కావడంతో  ‘ఆంధ్ర’కు  అదే సరైన పదంగా భాషలో స్థిరపడిపోయింది.

కళింగం తప్పించి తతిమ్మా యావదాంధ్రం  కాకతి ప్రతాపరుద్రుడి స్వాధీనంలో ఉండటంతో శివక్షేత్రాలుగా ప్రసిద్ధమైన శ్రీశైల, కాళేశ్వర, దాక్షారామాలను ఉజ్జాయింపు ఎల్లలుగా చెప్పి ఆయా క్షేత్రాలలోని శివలింగాల పట్ల భక్తితోనే  ఈ ప్రాంతాన్ని 'త్రిలింగం' అన్నాను పొమ్మన్నాడు సోమనాథుడు గడుసుగా. నిజానికి కవి ఇక్కడ చేసింది సాహిత్యపరమైన చమత్కారం. అయినా అప్పటి వరకు ఆంధ్రపథంగా ప్రసిద్ధిలో ఉన్న ప్రాంతం కాస్తా 'త్రిలింగ' దేశంగా మారికూర్చుంది. కాకతీయులు శైవులు. వారు పాటించిన  శైవమతానికి అతికినట్లు సరిపోయే ఈ కావ్య చమత్కారానికి 'ఆంధ్ర' అనే పాత పదం పాపం, ఇంకేం బదులిస్తుంది? మొత్తానికి మహాదేవుడి  మూడు శివలింగాల చలవతో చివరకు ఆంధ్రులమంతా ‘త్రిలింగులు’గా మారిపోవడం మహాచిత్రం! 

ఓ మారు వ్యవహారంలోకంటూ వచ్చేసిన తరువాత  ఉచ్చారణలో తొణికిసలాడే గాంభీర్యం.. వ్యుత్పత్తి వివరణ- పదానికి దగ్గరగా ఉండటంతో ఈ 'త్రిలింగ' పదం జనం నాలుకల మీద సునాయాసంగా స్థిరపడిపోయింది. దేశపరంగా ‘త్రిలింగదేశం’ అట్లా స్థిరపడిందే! ఆ త్రిలింగదేశ వాసులం కనక మనం 'త్రిలుంగులు' గా మార్పుచెందాం. మనం మాట్లాడే భాష 'త్రిలింగ భాష'గా మారిపోయింది.  కాలక్రమేణా  తిలింగ భాష, తెలింగ భాష, తెలుంగు భాషగా రూపాంతరం చెందుతూ చెందుతూ  'తెలుగు భాష'గా గుర్తింపు పొందే దశలో ఉంది  ప్రస్తుతం.   

'తెలుగు' పదానికి  వ్యుత్పత్తి చెప్పటంలో విద్యానాథుడు అనుసరించిన విధానాన్నే అతని తరువాతి కాలపు తెలుగు లక్షణవేత్తలూ అనుకరించారు. ఆ తరహా లాక్షణికులలో మొట్టమొదటివాడు 15వ శతాబ్ది పూర్వార్థానికి  చెందిన  విన్నకోట పెద్దనకవి. ఆయన తన  కావ్యాలంకార చూడామణిలో 'ధర శ్రీపర్వత కాళే/శ్వర దాక్షారామ సంజ్ఞ వఱలు త్రిలింగా/కర మగుట నంధ్రదేశం/బరుదారఁ ద్రిలింగదేశ మనఁజనుఁ గృతులన్' అన్నాడు.

'తత్త్రిలింగపదము తద్భవం బగుటచేఁ/దెలుఁగుదేశ మనఁగఁ దేటపడియె/వెనుకఁ దెనుఁగుదేశమును నండ్రు కొంద'రని అప్పటి వరకు  వ్యవహారంలో ప్రసిద్ధంగా ఉన్న తెనుగుదేశానికి సమన్వయం కూడా ఇచ్చాడు. ఎదురు బదులివ్వగలరా ఇంకెవరైనా! 17వ శతాబ్ది నాటి అప్పకవీ దీనినే అనువదించాడంటేనే ఈ వ్యుత్పత్తి పదం సత్తా ఏంటో అర్థమవటంలేదా!.  

 

ఇక, పాల్కురికి సోమనాథుడు ఈ త్రిలింగదేశాన్ని 'నవలక్ష తెలుంగు' (తొమ్మిది లక్షల గ్రామాలకు పరిమితమైన తెలుగు)గా తన ‘పండితారాధ్యచరిత్ర’లో కొత్తగా నిర్వచించాడు.  ఆనాటి మహమ్మదీయ చరిత్రకారుడు ఈసామీ సైతం ఈ మాటను పట్టుకునే 'నౌ లాఖ్ తిలింగ్' (తొమ్మిది లక్షల తిలింగ్) అని నిర్ధారించడం అదో తమాషా. 14వ శతాబ్దం పూర్వార్థం నాటి శాసనాలు ఈ ‘నవలక్ష తెలుంగు’లోని తెలుంగునే 'తిలింగ' దేశంగా మార్చేశాయి. 'తైలింగ ధరణితలం'గా వ్యవహృతమవడమే ఇందుకు ఉదాహరణ.  అదే శతాబ్దం నాటి ఒకానొక శాసనం 'తిలింగదేశం'  అనే పదాన్ని ‘పశ్చా త్పురస్తా దపి యస్య దేశౌ/ఖ్యాతౌ మహారాష్ట్రకలింగ సంజ్ఞౌ;/అవా గుదక్పాండ్యక కాన్యకుబ్జౌ/దేశ స్స్మతత్రాస్తి తిలింగనామా’ అంటూ నిర్వచించింది.

ఇట్లా కవులు, వైయాకరణులు,  లాక్షణికులు, చరిత్రకారులు వివిధకాలాలలో ఒకే రకంగా చేసిన ఎల్లల ప్రస్తావనల చలవ వల్ల అంతిమంగా ఆంధ్రదేశం త్రిలింగ దేశం(తెలుగుదేశం)గా స్థిరపడిందనుకోవాలి. 'తెలుగు' ఆంధ్ర’ పదానికి దేశపరంగా, జాతిపరంగా, భాషపరంగా కూడా   పర్యాయపదం అయింది.

ఇంత హంగామా జరిగినా,  ఇప్పటికీ 'తెలుగు' అనే పదానికి  శాస్త్రీయంగా వ్యుత్పత్తి అర్థం కాని, ఆ పదం ఎప్పుడు మొట్టమొదటగా వాడుకలోకి వచ్చిన వివరాలు కానీ, ఆ రావడం  దేశవాచకంగానా, జాతివాచకంగానా, భాషావాచకగానా రావడమని గానీ.. ఏవీఁ ఇతమిత్థంగా తెలీటం లేదు. జాతివాచకమో,  భాషావాచకమో అయితే ఆదిమకాలంలో అంధ్రులు, తెలుగువారు ఒక్కరే అయివుండాలి  మరి. ఏ చారిత్రిక పరిశోధనా ఈ దశగా సాగి వాదనలు వేటినీ నిర్ధారించినట్లు కనిపించదు! శబ్దపరంగా పొంతనకైనా ఆస్కారంలేని  ఈ రెండు పదాలు మధ్యనా ఎట్లా ఒకదానికి ఒకటి  పర్యాయపదాలు అనే బంధం బలపడిందో! ఇదీ ఓ  పెద్ద వింత.  భాషాపరిశోధకులు నిగ్గు తేలిస్తే తప్ప ప్రామాణీయకమైన సత్యాలుగా తేలని అనేక భాషాంశాలలో ఈ ఆంధ్ర -తెలుగు పదాల పరస్పర పర్యాయబంధ రహస్యం కూడా ఒకటి. నన్నయ కాలం నుండి తెలుగు, ఆంధ్రం ఒకదాని కొకటి పర్యాయ పదాలయ్యాయని కేవలం నమ్మకం మీద మాత్రమే చెప్పుకోవడం!  

 

ఇవాళ ఆంధ్రులు అంటే  తెలుగువాళ్ళే కానీ, తెలుగువాళ్లంతా ఆంధ్రులు అంటే ఒప్పుకోని పరిస్థితిలు నెలకొనివున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలుగా సమైక్య ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తరువాత  సంభవించిన మరో ప్రధానమైన మార్పు నవ్యాంధ్రప్రదేశ్    నివాసులు మాత్రమే ఆంధ్రులుగా పరిగణింపబడటం! తెలంగాణా రాష్టవాసులు తమను తెలుగువారుగా చెప్పుకుంటారు కానీ 'ఆంధ్రులు'గా గుర్తింపు పొందేందుకు మాత్రం సిద్ధంగా లేరు!

-కర్లపాలెం హనుమంతరావు

03 -07 -2021

 

 

Thursday, February 18, 2021

మాటలతో ఆటలు- సరదా వ్యాసం - కర్లపాలెం హనుమంతరావు



ఎవరో ఒకరు పుట్టించకపోతే భాష ఎలా పుడుతుందిఅంటాడు మాయాబజారు సినిమాలో ఎస్వీఆర్ ఘటోత్కచుడి అవతారం ఎత్తేసిభాష అంతస్సారం రాక్షసజాతికే వంటబట్టగా లేనిదిజీవకోటిలో ఉత్కృష్టమైందని గొప్పలు పోయే మనిషి బుర్రకు తట్టకుండా ఉంటుందాఇహఆవుకు కూడా 'కొమ్ము' తగిలించే మన తెలుగుభాషలోని మాటల తమాషాసంగతిః.. కాస్సేపు.. బుర్రకు తట్టినవి.

అసల తట్ట అంటేనే వెదురును ముక్కలు ముక్కలుగా చేసి కళ ఉట్టిపడేటట్లు  అల్లే ఒక పదార్థంతాటాకు చెట్టు నుంచి వస్తుంది కాబట్టి తట్ట అయిందేమోవిజ్ఞులొక పరి  మా జ్ఞానం పట్ల కూడా గౌరవముంచి ఆలోచించాలిమింగే లక్షణం గలది కాబట్టే తిమింగలం అయిందన్నది మా మిత్రుడొకడి పరిశోధనలో తేలిన అంశంకేస్ట్ కౌచింగ్ మీద  ఆ మధ్య పెద్ద దుమారమే రేగింది తెలుగు సినీపరిశ్రమలో  .. గుర్తుందిగదాఈ గొడవలు ఇట్లా ముందు ముందు తగలడతాయాన్న కాలజ్ఞానం మస్తుగా ఉండుండబట్టే పద్మిని అనే బాలివుడ్ కథానాయికి తాను 'పడుకోనిపద్మిని అని పుట్టీపుట్టంగనే ప్రకటించేసుకుంది

చౌ ఎన్ లై కి చాయ్ తాగేటప్పుడైనా ఎనలైట్మమెంటు కింద 'లైస్' (అబద్ధాలు)పకుండా చెప్పే పని తెలీని  రాజకీయనేతగా ప్రసిద్ధిఎన్ టి రామారావును కాంగ్రెసోళ్లు పాలిటిక్సులోకి వచ్చిన  ఎమ్టీ (ఖాళీరావు’ అని ఎద్దేవా చేసేవాళ్లుచివరకు పాపం కాంగిరేసువాళ్లకే ఆ పార్టీ తరుఫున నిలబడితే ఎన్నికల 'రేసులో కనీసం ధరావత్తులు కూడా 'రావు'  అనే దుస్థితి  వచ్చిపడింది. సోనియమ్మ గారాబాల బిడ్డ రాహుల్ గాంధీతరచూ ఊహించని క్షణాలలో తిరగబడ్డం ఆ బాబీ హాబీఆందుకే ఆ గారా’ బాల   రాగా(రాహుల్ గాంధీ)బాల గా మాధ్యమాలకు ఎక్కిందిగీర్వాణం అంటే సంస్కృతభాష. ఆ వాణిలో నాలుగు ముక్కలు ముక్కున పట్టీ పట్టంగానేగీరపోయే పండితులే దండిగా ఉండటం సర్వసాధారణంసో అ 'గీర వాణంపేరు గీర్వాణానికి చక్కగా అతికిపోతుందిబా అన్నా వా అన్న ఒకే శబ్దం బెంగాలీబాషలో. ‘ 

పో’  అని ఆ శబ్దానికి అర్థం. ఇష్టం లేని అక్క మొగుడు ఎవడో ఒంటరిగా ఉండడం చూసి కమ్ముకొచ్చినప్పుడు 'పో.. పో' అంటూ  కసిరికొట్టి ఉంటుంది వయసులో ఉన్న ఏ మరదలు పిల్లో. ఆ మాటే చివరకు అక్క మొగ్గుళ్లందర్నీ 'బా.. వాలుగా సుప్రసిద్ధం చేసేసింది మన తెలుగుభాషలో. 

కాల్షియం సమృద్ధిగా ఉంటేనే మనిషిలో పెరుగుదల సక్రమంగా ఉండేదంటారు  ధన్వంతురులు. ఆ ధాతువు అధిక పాళ్లలో దొరికేది కాబట్టే పెరుగుపెరుగు అయింది. ధన్వంతురుల అన్న మాట ఎలాగూ వచ్చింది  కాబట్టి ఒక చిన్న ముచ్చట.  ధనం మాత్రమే తన వంతన్న దీక్షగా  చికిత్స చేసే వైద్యనారాయణులు కొంతమంది కద్దు. ఆ మహానుభావులకు  ఆ పేరు చక్కగా సూటవుతుంది. ఆయుర్వేదం చేసే వైద్యుల కన్నా అల్లోపతి చేసే ఫిజీషియన్లకు ఆ పదం అద్దినట్లు సరిపోతుంది. అన్నట్లు  ఫీజు తీసుకుని వైద్యం చేసే ఫిజీషియన్ ని  ‘ఫీజీషియన్ ‘ అనడమే సబబు. 

బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం అస్తమానం కమ్మని కలలు కనేవాళ్లు తల్లిదండ్రులుకనకే అమ్మానాన్నా 'కన్నవాళ్లు' గా ప్రసిద్ధమయారు

కలసి ఆడే కర్రల ఆట కాబట్టి కోలాటం 'కో'లాటం అయిందిరైయ్యిమని దూసుకుపోతుంది కనక రైలుబండి అయినట్లు.  మనిఅన్నా 'షి' అన్నా పడిచస్తాడు కనక  మనిషి 'మని-షి'గా తయారయ్యాడు. తతిమ్మా జంతుకోటితో కలవకుండా తానొక్కడే  మడి కట్టుకున్నట్లు విడిగా ఉంటాడు కాబట్టి 'మడి'సి కూడా అయ్యాడనుకోండి

'కీఉండని చిన్న టిక్కీ కాబట్టి  కిటికీ.  

రాసి రాసి గుర్తింపు లేక  నీరసం వచ్చేసిం తరువాత  కవులు కట్టే గ్రూపు అ-రసంవిచ్చలవిడితనంతో ఇష్టారాజ్యంగా  రాసే కవుల గుంపు వి-రసం’ ఒక ముఠా కవులు మరో గ్రూపు కవుల మీద ముటముటలాడుతూ  విసుర్లు వేసుకునేవారు ముఠాలు కట్టిన ప్రారంభంలో

ఆ రంభ వచ్చినా ఆరంభంలో మగవాడికి ఏం చెయ్యాలో తెలిసిరాలేదు.ఆడమన్నట్లా ఆడేది మొదట్లో ఆడదిఅందుకే ఆమె ఆరంభంలో ఆడది అయింది. మగువను చూస్తే 'గాడు' (తీపరం)  పుట్టే జీవి కావడం మూలానవయసు కొచ్చిన మగాడు మగాడు అవుతాడు. క్షీరధార రుచిని మరిపించే  కవిత్వం కురిపించే  కవులు ఉంటారు. ఆ కవులే  అసలు సాహిత్యంలోని  'కౌ'లు.  మెరికలు పోగయ్యే దేశం గనక అది అమెరికాగా ప్రసిద్ధిపొందింది. ఆయిల్ ఫ్రీ లీ అవైలబుల్ గనక ఆఫ్రికా అయిందేమో తెలీదు. అట్లాగని ఆస్ట్రేలియాలో అంతా స్ట్రే’  డాగ్సులా తిరుగుతారనుకోవద్దు. అట్లా చేస్తే స్టేలు కూడా దొరకని క్రిమినల్  కేసుల్లో బుక్కయిపోతారు. అట్లాగే అరబ్బు కంట్రీసు కూడా. పేరును చూసి 'ఐ రబ్ విత్ ఈచ్ అండ్ ఎవ్విరిబడీఅంటూ మన బ్లడీ ఇండియన్ ఫిలాసఫీలో బలాదూరుగా  తిరిగితే..సరాసరి పుచ్చెలే ఎగిరిపోవచ్చునేతిబీరకాయల్లోని నేతిని మన గొనసపూడి పూసల నేతితో  అన్నోయింగ్లీ కంపేరు చేసేసుకుని సెటైర్లకు దిగెయ్యడం మన దేశంలో కాలమిస్టులకు అదో అమాయక లక్షణంన ప్లస్ ఇతి ఈజ్  ఈక్వల్ టు   ‘ నేతి’ రా  నాయనల్లారా! ‘-ఇతి’  అంటే  'ఇది కాదు' తెలుగర్థం.  ఆ దాన్ని పట్టుకునొచ్చి నేతి బీరకాయలో అది లేదని ముక్కు చీదుకోడం చదువు మీరిన వాళ్ల చాదస్తం

ఎలుక కు చిలుకకు ఒక్క పేరులో తప్ప పొంతన బొత్తిగా   ఉండదు. టమోటోకి టయోటాకి మాటలో తప్ప రేటులో  పోలికే  తూగదు. పదాలున్నాయి కదా పదార్థాల కోసం దేవులాడితే వృథా ప్రయాసే! ‘ఎలాగూ’  లో ఏ లాగూ కోసం వెతికినా దొరకదు కాక దొరకదు. మైసూర్ బజ్జీలో మైసూరు కోసం వెదికి ఉసూరు మనకు!  అన్ని పదాలు కలుస్తాయని కాదు. కలవకూడదనీ కాదు.

ఇట్లా పనికిమాలిన పదాలను పట్టుకుని ఎన్ని ఆటలైనా అలుపూ  సొలుపూ  లేకుండా ఆడేయడానికి అసలు కారణం..నాకు ఏ పనీ పాటా లేకుండా తిని కూర్చునే లక్షణం పుష్కలంగా ఉండడం. దయచేసి  ఇక్కడ ఏ ‘లంగా’  కోసం వెతక్కండి మహాప్రభో! ఖాయంగా దొరకదు గాక దొరకదు దొరలూ .. దొరసానులూ! 

-కర్లపాలెం హనుమంతరావు

26 -11 -2020

***

Wednesday, January 27, 2021

చందన న్యాయం - పదప్రయోగం - పరమార్థం - కర్లపాలెం హనుమంతరావు

చందన న్యాయం - పదప్రయోగం - పరమార్థం - కర్లపాలెం హనుమంతరావు
న్యాయం అంటే న్యాయస్థానాలలో వినిపించే చట్ట సంబంధమైన వ్యవహారం ఒక్కటే కాదు. వ్యవహారానికి, భాషకు సంబధించిన అర్థాలలో కూడా ఈ ప్రయోగాలు కనిపిస్తాయి.
ఎక్కడైనా అన్యాయం జరిగితే 'ఇదేం న్యాయం?' అని నిలదీస్తాం కదా! అక్కడ ప్రశ్నకు గురయే న్యాయం సహజన్యాయం, సామాజిక న్యాయం, వైయక్తిక న్యాయం .. మొత్తానికి నిత్యకృత్య జనవ్యవహారానికి సంబంధించిన న్యాయం.
ఆ అర్థంలో కాకుండా ఇంకో అర్థంలో కూడా 'న్యాయం ' అనే పదం వ్యవహారంలో ఉంది. కాకపోతే అది సాధారణంగా నిత్యకృత్యాలలో కాకుండా ఏ సాహిత్యానికి సంబంధించిన అలంకారం కిందనో వాడుతూ పండితులు, కవులు, చమత్కారులు మెరుగులు పెట్టారు. ఆ తరహా సాహిత్య సంబంధమైన న్యాయం 'చందన న్యాయం'. ఆ సుందరమైన తెలుగు పదప్రయోగం గురించిన కొంత సమాచారం మిత్రులతో పంచుకుందామనే ఈ టపా!
తెలుగే అసలు పెద్దగా వాడకంలో లేని ఈ రోజుల్లో 'చందన న్యాయం' వంటివి చక్కని పదాలే అయినా మూలన పడిపోయి ఎక్కడా వాడుకలో లేనప్పుడు ఎందుకు ఈ చర్చ? అని కొద్దిమంది బుద్ధిమంతుల ఆలోచన కూడా అయివుండవచ్చు! కాని, ఇంచక్కని తెలుగు రాయాలనుకునే ఔత్సాహికులకు కొన్ని కొత్త పదప్రయోగాలు (నిజానికి ఇవి పాతవే.. వాడేవారు కరవై మనకు కొత్తగా అనిపిస్తున్నాయి గాని ఇప్పుడు) వాటి అర్థాలు, తత్సంబధిత ప్రయోగాలు, అన్వయాలు అవగాహనకు వస్తే శోభ ఉట్టిపడే తెలుగుకు మళ్లీ పురుడు పోసిన తల్లులవుతారు కవులు, రచయితలని నా క్షోభ.. ఇక చర్చ తగ్గించి చందన న్యాయం పద ప్రయోగానికి వద్దాం. దాని కన్నా ముందు 'చందనం' అనే మాటను గురించి కొద్దిగా!
చందనం ఈ మధ్య కాలంలో మనకు బాగానే పరిచయం అయిన పదం. ఎర్ర చందనం దొంగ వీరప్పన్ మహానుభావుడి చలవ వల్ల అప్పట్లో ఏ దినపత్రికలో చూసినా చందనం తాలూకు వార్తలు, చర్చలే కనిపించేవి. చంద్రబాబుగారు ముఖ్యమంత్రి అయీ కాగానే (2014) తిరుపతి శేషాద్రి అడవుల్లోకి జొరబడి వచ్చేసి అక్రమంగా ఎంతో విలువైన చందనం దుంగలను మొదలంటా కొట్టుకుపోయి అమ్ముకునే ముఠా తాలూకు దొంగలను ఒక్కపెట్టున ఎన్కౌంటర్ లో ఠా అనిపించి సంచలనం చేసిన కథ గుట్టుగా సాగిందేమీ కాదు.
తెలుగు రాష్ట్రాల తాలుకు ముఖ్యమైన వనరుల్లో అత్యంత విలువైన వాటిలో ఇనుము ఖనిజాన్ని ఒక వంక గాలి జనార్దన రెడ్డి భూగర్భం నుండీ పెళ్లగించి మరీ సొమ్ముచేసుకుపోతే, మరో వంక నుంచి అంతకు మించిన ఖరీదైన చందనం దుంగలను శేషాద్రి అడవుల్లో ప్రాంతాలలో దొరికే శ్రేష్టమైన చందనం శ్రేణి దొంగదారుల్లో దారుణంగా పక్క రాష్ట్రాల గుండా విదేశాలకు తరలిపోయింది. అప్పట్లో అది మన బోటి మధ్య తరగతి చదువుకున్నజీవులకు న్యూస్ పేపర్లలో, టీ.వీలల్లో టీ కాఫీలు చప్పరిస్తూ చదువుకొనే సినిమా కబుర్లకు మల్లే వినోదం మాత్రమే కలిగించింది. తెలుగువాళ్లకు జరుగుతున్న అన్యాయం తెలుగువాడికే పట్టింది కాదు ఎప్పట్లానే! ఆ విలువైన చందనం గురించి ఒక చిన్న 'న్యాయం' ప్రబంధ కావ్యాలలో కనిపిస్తుంది. దాని పేరే 'చందన న్యాయం'.
సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామికి ప్రతీ ఆషాఢ పూర్ణిమలో వేకువజామున సుప్రభాత సేవతో మేల్కొలిపి మంగళ వాయిద్యాల మధ్యన సుగంధ ద్రవ్యాలను మిళితం చేసిన మూడు మణుగుల చందనాన్ని అర్చకులు సమర్పించడం ఒక ఆనవాయితీ. ఉత్సవమూర్తి అయిన గోవిందరాజస్వామికీ విశేషంగా అభిషేకాలు జరిపించి చందనాన్ని కిరీటంగా అలంకరించడం ఒక ఆధ్యాత్మిక సంప్రదాయం. చందనానికి సంబంధించి దాదాపు అన్ని దేవుళ్లకూ ఒకే రీతిలో చర్చలు, నైవేద్యాలు. ఇప్పుడు మన అంశం అది కాదు.
చందనం అనగానే 'జయదేవుని గీత గోవిందం తాలూకు అష్టపదుల్లోని 'చందన చర్చిత నీల కళేబర! పీత వసన! వనమాలీ' అనే అష్టపదుల్లోని పదం కూడా మనసులో మెదిలి తపించే మనసు ఎందు చేతనో కొంత సేదతీరుతుమ్ది. సేదతీర్చే ఔషధ గుణం బౌతికంగా కూడా చందనం ప్రత్యేక లక్షణం. మాటలోనే కాదు.. పూతలో కూడా మనసునూ, శరీరాన్ని చల్లబరిచే అరుదైన పదార్థాలలో చందనం ప్రధానమైనది!
ఇప్పుడంటే రకరకాల ఆయింట్ మెంటులు, స్నోలు, కాస్మొటిక్స్ వాడకంలోకి వచ్చాయి కాని, ఇవేవీ సామాన్య జనానికి అందుబాటులో లేని కాలంలో కాలిన గాయాలకు ముందు చందనం అరగదీసి మందులా అద్దే వారు. అందుకోసం గాను ప్రతి ఇంట్లో చందనం చక్కలు ఉండేవి. వాటి మీద కొద్దిగా నీరు పోసి బొటనవేలుతోనో , మరో చిన్న చందనం పేడుతోనో గట్టిగా పదే పదే రుద్దితే ఆ నీటిలో చందనం కలిసేది, ఆ లేపనాన్ని గాయానికి పట్టించడం ఇప్పటి మన ఫస్ట్ ఎయిడ్ చికత్సలాంటిది. చందనం పీటలు గ్రామ సంతల్లో బాగా అమ్ముడు పోయే గృహ చికిత్స పరికరాలలో ఒకటి.
చందనానికి పవిత్ర గుణం కూడా ఆపాదించడం చేత దేవుడి విగ్రహాలకు చందనం పూతలు ఒక ధార్మిక కార్యక్రమం దేశమంతటా సాగుతుంటాయి. చందన చర్చితం అంటే చందనాన్ని మెత్తని పేస్టులా వంటికి మొత్తం పట్టించడం. వాస్తవానికి మనుషులూ వంటి నిండా చందనం పట్టించుకుని కొన్ని గంటల పాటు ఆరనిస్తే వంట్లో ఉన్న వేడిమి మొత్తం దిగలాగేస్తుంది. కానీ అత్యంత ఖరీదైన చందనం మామూలు మనిషి వంటి నిండుగా ఎట్లా పట్టించుకోగలదు?
గతంలో మహారాజులకు ఆ విధమైన చికిత్సలు జరుగుతుండేవి. ఇక కావ్యాలు రాసే కవులకయితే కదిలితే మెదిలితే విరహ తాపంతో అల్లాడే నాయికల వంటికి సఖుల చేత చందనం పట్టించడమే ముందు గుర్తుకు వచ్చే గొప్ప శృంగార చర్య. ప్రబంధాల నిండా చందనం వంటి సుగంధ భరిత శృంగార పద్యాలే. వాటి ప్రస్తావన మరో సందర్భంలో చేసుకుందాం.
వంటి నిండా పట్టించక పోయినా శరీరంలో ఏ కొద్ది భాగానికి చందనం అలదితే దాని ప్రభావం శరీరం మొత్తానికి పాకి అవయవాలకు తొందరగా స్వాస్థ్యత చేకూరుతుందని ఆయుర్వేదం చెపుతుంది. ఆ విధంగానే బొటన వేలంతైనా ఉందో లేదో, అసలు ఎక్కడుందో కూడా ఉనికి తెలీని మనసు (ఆధ్యాత్మిక వాదుల పరిభాషలో ఇది అంతరాత్మ) ఆరడుగుల శరీరం మొత్తాన్ని ప్రభావితం చేయడం ప్రకృతి విచిత్రం కదూ! ఒక కాలు విరిస్తే పట్టుదల గల మొనగాడు మరో కాలు మీద నడవగలడు. ఒక చెయ్యి విరిగినా రెండో చేతితో పనులు అద్భుతంగా చేసేవారు కద్దు. అసలు చేతులే లేకపోయినా కాళ్లతో చేతులకు మించి చక్కగా పనులు చక్కబెట్టే పట్టువదలని విక్రమార్కులు మనకు అరుదుగానే అయినా కనిపిస్తారు.
శిక్షల కింద కారాగారాలలో పడవేసినా బైటికి వచ్చిన తరువాత సలక్షణంగా తమ ధ్యేయం వైపుకు సాగిపోయిన యోదులకు చరిత్రలో కొదవలేదు కదా!. మనిషిని అచేతనుడిని చేసేందుకు, చైతన్యవంతుడిగా మార్చేందుకైనా మనసు మీద ప్రయోగాలు చేసే వైద్యవిధానాలూ ఉండనే ఉండె! వ్యక్తిగత సుముఖత, విముఖతలు రెండింటికీ మనసు మీద జరిగే ప్రయోగాలు రాటుదేలిన రాజకీయాలలో 'మైండ్ గేమ్' పేరుతో విశ్వవ్యాప్తంగా పరమ ప్రసిద్ధం. ఎక్కడుందో తెలియని ఓటర్ల మైండ్ తో నేతలు గేమ్స్ ఆడటానికి కారణం ఇదిగో ఈ మైండ్ కు ఉండే ఈ ప్రత్యేక శక్తే! శత్రువర్గంలోని బంధుమిత్రులను వధించవలసిన సందర్భం ఎదుట పడేసరికి అంత మహాయోధుడు అయివుండీ పాండవ మధ్యముడు డీలా పడిపోయాడు. ఆ గాండీవుణ్ని మళ్లీ గాడిలో పెట్టడానికి పరమాత్ముడు శ్రీకృష్ణుడి బాడీ ద్వారా కేంద్రీకృతం చేసింది అర్జునుడి మనసు మీదనే అని ఆధ్యాత్మికవాదుల ప్రగాఢ విశ్వాసం. పాండవుల మీద పగ తీర్చుకునేందుకై ఎంతో పట్టుదలగా ఎన్నో విద్యలు నేర్చుకున్న కర్ణుణ్ణి సరిగ్గా యుద్ధక్షేత్రంలో నడిమధ్యలో నిర్వీర్యుదుగా మార్చిందీ అతగాడి రథంలాగే గుర్రాల పగ్గం పట్టుకుని ముందు కూర్చున్న శల్యుడి పుల్లవిరుపుడు మాటలే! రాజకీయాలలో రాటుతేలిన నేతల ధ్యాస కూడా ఎప్పుడూ పాడుచేయవలసిన ఎదుటి వాడి మనసు మీదనే!ఉంటుంది. ఆ వ్యతిరేకార్ధంలో కాకుండా సానుకూల భావంతో చూసుకుంటే చుక్కంత చందనం నుదుటికి దిద్ది శరీరం మొత్తన్ని ప్రభావితం చేసే విధానానికి నకలే ఈ మైండ్ గేమ్ ఎత్తుగడలన్నీఅనిపిస్తాయి కాదా ! గీతలో చెప్పినట్లుగా అంగుష్ఠ ప్రమాణంలో ఉండే ఆత్మ (లౌకికుల భాషలో మనసు)ను ప్రభావితం చేయడం ద్వారా మనిషి మొత్తాన్ని స్వాధీనంలోకి తెచ్చుకునే పద్ధతినే కావ్యపరిభాషలో 'చందన న్యాయం' గా చెప్పుకొచ్చారు అలంకారికులు.
సూక్ష్మ పరిణామంలో ఉండే వస్తువు మీద ప్రయోగాలు చేయడం ద్వారా స్థూల పరిణామంలో ఉండే వస్తువు మొత్తాన్ని ప్రభావితం చేసే విధానానికి 'చందన న్యాయం' అన్న పదం అందుకే వంద శాతం సరయిన అన్వయం.
-కర్లపాలెం హనుమంతరావు
27 -02 -2021
బోథెల్, యూఎస్

Wednesday, January 20, 2021

తెలుగుతక్కువతనం -కర్లపాలెం హనుమంతరావు

 





అచ్చుతప్పుల నుంచి అనవసర ఆంగ్ల పదాల చొరబాటు దాకా, సంకర వంకర భాష నుంచి అశ్లీల విశృంఖల వర్ణనల వరకు ఎన్ని తలబొప్పులు పాపం నేటి తెలుగుతల్లికి? పిచ్చి పిచ్చి పదప్రయోగాల పరంగా ప్రసార, ప్రచురణ మాధ్యమాల మధ్య ప్రస్తుతం పిచ్చపోటీ! ఒకటి కృతకమయితే, మరోటి వికృతం. జంటగా పుట్టిన పిచ్చి పదాలనే పాపాయిలను ఎట్లా పెంచి పోషించడమో దిక్కుతోచని తాజా దుస్థితి నేటి తెలుగుతల్లిది. అసుంటా పెట్టవలసిన జాడ్యాలన్నింటిని పిలిచి మరీ అంటించుకుంటున్న వెర్రి మొర్రి భాషకు ఏ మందు వేసి మళ్లీ మంచి దారికి మళ్లించుకోవాలో దారి తోచని  దయనీయ స్థితి కూడా తెలుగు భాషామతల్లిదే!

అభివృద్ధి కోసమై మంచి దారిన ప్రయాణించే కన్నబిడ్డ కడుపు మధ్యదారిలో కూడా ఎన్నడూ నకనకలాడకూడదు అన్నది తల్లిభాష ఆరాటం. అందుకోసం గాను మూట కట్టి ఇచ్చిన మంచి మాటల మూటను మురిక్కాలవలో విసిరి డొక్కుపదార్థాలతో డొక్కను నింపుకునే బిడ్డను చూస్తే ఏ తల్లి కడుపు తరుక్కుపోదు? అమ్మభాషను కాదని అన్యభాషను ఆశించే బిడ్డను చూసి ఎంత వద్దన్నా  కన్నతల్లి  తల్లడిల్లక మానదు.  బిడ్డను సంస్కారవంతుడిగా తీర్చిదిద్ది, సభ్యసమాజంలో గర్వంగా తలెత్తుకు తిరిగేందుగ్గాను అంతర్గంతంగా ఆరాటపడుతూ పరాయి భాషాపదాల నుండే  ఎంతో ఓపికగా ఇంటి రుచి తగ్గకుండా వండి వారుస్తుంది అమ్మభాషఅయినా,  తల్లి మాట అల్లంలా బిడ్డకు తోచడం.. ఏంటో తెలుగు నాలుక కెప్పుడూ ఈ దౌర్భాగ్యం! మంచి బిడ్డకు  అమ్మమాటే పరమావధిగా ఉంటుందంటారుపొరుగింటి తల్లి అవసరానికి మాత్రమే ఆదుకునే ఆసరా. ఇంటి చూరును వదిలేసి పద్దాకా ఆ చూరూ ఈ చూరూ పట్టుకు వేళ్లాడే బిడ్డలో ఇంకేం మంచిని చూడాలి? ఈనాటి  తెలుగుపిల్లడి జోరు ఆ తీరులోనే సాగుతున్నది మరి! సబబైన దారికి బాబును తిరిగి తెచ్చే ధ్యాసే లేదు బాధ్యులైన పెద్దలకు! అది కదా మరీ విచారకరం! తల్లిభాషకు పట్టుకొమ్మలుగా ఉండవలసిన తెలుగు పత్రికలు, ప్రసార మాధ్యమాల  పద విన్యాసం చూస్తే తెలుగు తల్లి మనసు ఎంతలా క్షోభిస్తుందో? 

తతిమ్మా రంగాల సంగతులు ఆనక, ముందు బిడ్డకు ఓనమాలు దిద్దించవలసిన విద్యారంగంలో తల్లి భాష స్థితి ఎంత దయనీయంగా మారుతోందో చూస్తున్నాంగా! ఎన్నేళ్లాయ మనం స్వతంత్రులమయి? భావపరంపరగాత సంస్కృతి సంగతి ఆనక, ముందు భాషాపరంగా అయినా స్వతంత్రులమవుతున్నామా? ఆ ప్రయాస చెయ్యాలన్న ప్రయత్నమయినా చేస్తున్నామా? సొమ్ములూ సోకులూ ఎలాగూ లేవుకనీసం అమ్మ కాలికి కట్టే మువ్వల్లోనైనా తెలుగు సవ్వళ్లు  వినిపడుతున్నాయా?  ఏదో  అవసరార్థంగాను ప్రవేశించిన ఆంగ్లభాషకే ఇప్పుడు అంతటా  పట్టాభిషేకం! ఆ మిడిమేళపు దొరతనం  కొలువులో  కనీసం నిలబడేందుకైనా అంగుళం చోటయినా తెలుగమ్మకు లేకుండా చెయ్యాలని ఎందుకు పన్నాగం!  తెలుగమ్మ కళ్లల్లో నీళ్లు చిప్పిల్లుతున్నా   చీమ కుట్టినట్లయినా లేదు ప్రభుత్వాలకు, ప్రజలకు.. అదీ విచిత్రం! తెలుగువాడి తోలుమందానికి ముందు మందేదయినా దొరికితే బావుణ్ణు.

ఏడాదికో సారి, అదీ మరే ఇతర ముఖ్యమైన రాజకీయ ప్రాధాన్యతలవీ ఇవీ పెట్టుకునే అగత్యం లేని సందులో,    సారస్వత పరిషత్సభా సమావేశమో,  ప్రపంచ మహా సభ పేరునో హంగామా ఉత్సవాలో జరిపించేస్తే.. కోల్పోయే  కళావైభవం మళ్లీ అమాంతం  తెలుగుతల్లికి  వచ్చేసినట్లేనా?  ప్రభుత్వాలను కాదనుకునే  ప్రయివేట్ వ్యక్తులదీ అదే తీరు!  పుబ్బకో, మాఘానికో వెలవరించే ప్రత్యేక సంచికల్లో ఘనంగా వ్యాసాలు రాసులు పోసుకుంటే మాత్రం  అమ్మభాష తలరాత గమ్మున మారిపోతుందా? అమ్మభాషంటే అన్ని జాతులవారి  దృష్టి నిరంతరం నిరంతరాయంగా  ఉంచవలసిన ప్రత్యేకాంశమని పదే పదే  నచ్చచెప్పివలసిరావాడమే  అసలు పెద్ద దౌర్భాగ్యం అమ్మభాషకు.

 

ఆంగ్లంతోనే భవిష్యత్తంతా. ఆ జ్ఞానం శూన్యమయితే అంధకారమే  జీవితమంతా!- అనే భావన ఎవరు, ఎందుకు, ఎక్కడ, ఎవరి ప్రయోజనాలు నెరవేరడం కోసం ఆరంభించారో? మురికివాడల్లో  బతుకులు  భారంగా ఈడుస్తూ రోజు గడవడమే పెద్ద పండుగులా సంబరపడిపోయే బడుగువర్గాలకూ  ఇవాళ ఈ ఆంగ్లవ్యామోహం సత్యయుగంలో జగన్మోహిన పంచడంలో  మోసం చేసిన అమృతభాండంలా ఊరిస్తున్నది! 

కారణాలు ఏమైతేనేమిలే గాని, మొత్తానికి ఇవాళ ఇచ్ఛాపూర్వకంగా పెద్దలు, పిన్నలు, ఉన్నత వర్గాలు, నిమ్నజాతుల పేరుతో  నిర్లక్ష్యం చేయబడ్డ అన్ని  వర్గాల వారి దృష్టిలో కూడా నిర్లక్ష్యానికి గురువుతున్న ముఖ్యాంశాలలో అమ్మభాష జాతకానిదే అగ్రస్థానం.  

పేరుకే విద్యాహక్కు చట్టం. కాలం గడుస్తున్న కొద్దీ ప్రభుత్వ పాఠశాలలు కూడా క్రమంగా ఆంగ్లమాధ్యమం కౌగిళ్లలో చిక్కుకుపొవడం ఇవాళ్టి చోద్యం. పది జిల్లాల తెలంగాణా లెక్కలు చూసుకున్నా నాలుగేళ్ల  కిందట(2016-17)ఒక్క విద్యాసంవత్సరంలోనే దాదాపు 4,951 ప్రభుత్వ పాఠశాలలు ఆంగ్ల మాధ్యమంలోకి మారడాన్ని మనం  ఎలా అర్థం చేసుకోవాలి? ఇంగ్లీషు మీడియం నూతిలోకి  తోసేయబడ్డ  విద్యార్థుల సంఖ్య 82,512. ఇదే వరస ఇక ముందు కొనసాగితే,   రాబోయే కాలాల్లో ఏడాదికి సుమారు లక్షమంది తెలుగుబిడ్డలు, ఓనమాల స్థాయిలోనే తెలుగుతల్లి ఒడిలో నుంచి ఆంగ్లమనే ఊబిలోకి జారిపడబోతున్నట్లు లెక్క.  

ఆంగ్ల మాధ్యమంలో జ్ఞానార్జన తప్పని చెప్పడం కాదీ టపా పరమార్థం. ప్ర్రాథమిక దశ నుంచే బిడ్డను పరిసరాలతో  సంబంధంలేని వాతావరణంలోకి నెట్టేస్తే కష్టమని చెప్పడమే ఉద్దేశం. ఆ కారణంగా అయోమయంలో పడే బిడ్డ మెదడు ఎదగవలసినంత ఎదగకుండా పోతుందన్నదే దడ!  అపరిపక్వ స్థితిలో గిడసబారిన మెదడు సరిఅయిన ఆలోచనలు చేయలేవు. ఆ కారణంగానే..   బిడ్డలు గోరంత సమస్యను ఢీకొనలేనంత కొండగా ఊహించుకుని ఉత్తిపుణ్యానికే అటు అస్త్రసన్యాసం చేసేయడమో, ఇటు ఆటగా చూడవలసిన జీవితాన్నుంచి ఓటమి భయంతో నిస్సహాయంగా నిష్క్రియాపరత్వంతో నిష్క్రమించేయడమో జరిగేది! తల్లిభాష నుంచి చిన్ననాటనే దూరమయిన పిల్లల  విపరీత,  విపత్కర మానసిక పరిస్థితుల గురించి  సామాజికశాస్త్ర వేత్తలు వెలిబుచ్చే ఆందోళనలు జనాలకు ఎలాగు పట్టేటట్లు లేవు. మరి ప్రజాప్రభుత్వాలదీ అదే దారి అయితే ఒక్క తల్లిభాషకే కాదు, దానితో  సహా జాతికి మొత్తం  ముంచుకురాక తప్పదు.   కనీసం ప్రాధమిక దశ దాకా అయినా బిడ్డను ఇంటి భాష నుంచి వేరు చేయకండయ్యా అంటూ తల్లిభాష అంతలా వేడుకుంటున్నదే! అయినా వచ్చీ రాని ఆంగ్లం వాడకం మీదనే తగని మోజు! అదేం వేడుకో!

-కర్లపాలెం హనుమంతరావు

20 -01 -2020


 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...