Showing posts with label Philosophy. Show all posts
Showing posts with label Philosophy. Show all posts

Sunday, January 31, 2021

పరిచిత అపరిచయం- కర్లపాలెం హనుమంతరావు -



 

ఎక్కడో చూసినట్లే ఉంటుంది.. ఎక్కడో ఠక్కున గుర్తుకు రాదు. ఎప్పుడూ చూస్తూనే ఉంటాం.. ఎప్పటికప్పుడు కొత్తే! ఏమిటి.. మనిషి మెదడులోని ఈ ద్వైదీభావాలకు భాష్యం?

కొంత మంది వ్యక్తులతో కలసిన మొదటి క్షణంలోనే ఒక ఆత్మీయత   ఫీల్ గుడ్ భావన ఏర్పడుతుంది. మళ్లీ కలుసుకోకపోయినా సరే ఆ కలయిక చానాళ్ల వరకు అట్లాగే తాజాగా ఆహ్లాదం కలిగిస్తుంది. కొంతమందితో బంధం కాల పరిస్థితుల కారణంగా కొనసాగించక తప్పదు. అయినా ఆ నడక సాగినంత కాలం ముళ్ల మీద ప్రయాణంలాగా ఇబ్బందికరంగా ఉంటుంది.  

చాలా సంసారాలలో భార్యాభర్తల మధ్య ఉండే బంధం ఏదో సంఘ సంప్రదాయం కోసం కొనసాగిస్తున్నట్లు కనిపించడం గమనించవచ్చు. ఇద్దరి రాశులూ జత కూడలేదని అందుకనే ఈ పొరపొచ్చలని నిరాధారమైన రుజువులు చూపించి బుకాయించే బాపతును పక్కన పెట్టేయండి. సంస్కారపరంగా ఇద్దరూ ఉత్తర దక్షిణ ధృవాలు అయివుండాలి. అయినప్పటికిపెద్దలు కుదిర్చిన వివాహబంధంసమాజం ఎదుట సహచరులమని ప్రకటించుకున్న కారణంగా అభిప్రాయబేధాలు నాలుగ్గోడలు దాటి రాకుండా గుట్టుగా కొనసాగించే సంసారాలకు కొదవుండదు. ఒక భర్త మరో స్త్రీ పట్ల ఆకర్షితుడవడంఒక గృహిణి పరపురుషుని  దర్శనార్థం తపించిపోవడం ఉంటుంది. కానీచలంగారు తన కథల్లో మొత్తుకున్న విధంగా అది పూడ్చిపెట్టిన అనుబంధాల కిందకే వస్తాయి. ఆ రకమైన సన్నివేశాలలలో భర్త ఎదుట ఆ పరపురుషుడిని చూసినా భార్య అపరిచితుడిని చూసినట్లే ప్రవర్తిస్తుంది. తనకు అంతకు ముందు నుంచి అనుబంధం ఉన్న స్త్రీ భార్య సమక్షంలో తటస్తపడితే భర్త ప్రవర్తనా డిటో! ఏతావాతా తేలేదేమంటే పరిచితాలు.. అపరిచితాలు అనే అంశాలు శుద్ధసత్యం కేటగిరీ కిందికి వచ్చేవి కావు. 

మన చుట్టూ ఉన్న గాలిని గురించి మనకేమన్నా సమాచారం ఉంటుందాఉన్నా సమగ్రంగానిర్దిష్టంగా ఉంటుందాపంచభూతాలు గాలినీరునిప్పుఆకాశంభూమి - ఈ ఐదింటిని గురించి ఎంత తెలిసినా తెలియనట్లే ఉంటుంది. ఎంత తెలీనట్లు నటించినా ఎంతో కొంత ఎరిక ఉంటుంది. తెలియడంతెలియచెప్పడం అనే రెండు ప్రక్రియల మీదనే ప్రపంచం సర్వం ముందుకు వెనక్కు ప్రయాణం చేయడం. సర్వజ్ఞులు అన్నది ఒక భావన మాత్రమే. ఆదర్శ భావన. అన్నీ తెలిసినజ్ఞానిఏమీ తెలియని అజ్ఞానీ కంచుకాగడా వేసి గాలించినా ముల్లోకాలలో కనిపించడు. ముల్లోకాలుముక్కోటి దేవతలునాలుగు దిక్కులుఅష్టైశ్వర్యాలు,నవరత్నాలు.. లాగా కొన్నింటికి అన్నీ తెలిసిపోయినట్లు ఒక సంఖ్యకు కుదించి సంతృప్తి చెందుతాము. నవరత్నాలు తొమ్మిదేనా! నవగ్రహాలు అన్నారు నిన్న మొన్నటి వరకు రోదసీతలంలో పరిభ్రమించేవి. ఇప్పుడు కొన్ని గ్రహాలు గ్రహాలే కావు పొమ్మంటున్నారు. న్యూటన్ సిద్ధాంతమే విజ్ఞాన శాస్త్రం మొత్తానికి ఇరుసు వంటిది అని శతాబ్దాల పర్యంతం ఊదరగొట్టి ఇరవై ఒకటో శతాబ్ది వచ్చే సరికి అదంతా తప్పుల తడక అని తేల్చేస్తున్నారు. మనిషి పురోగమనం ఇహ శాశ్వత అమరత్వం వైపుకే అని కోతలు కోసిన శాస్త్రజ్ఞులు ఇప్పుడు ఎదురైన కరోనా మహమ్మారి అంతం చూసేందుకు తలకిందులు అయిపోతున్నారు. అన్నీ పరిచయమే.. అనుకుంటాం గానీఏదీ సంపూర్ణ పరిచితం కాదు. ఏదీ పరిచితం అని నైరాశ్యం ప్రకటించేవారికీ ఇదే సూత్రం. ఎంతో కొంత తెలియకుండా మనుగడ ముందుకు సాగదు. ఆకలి తీర్చుకునేందుకు ఆహారం అవసరమనిదాహం ఆరేందుకు మంచి తీర్థం తప్పదని ఎవరు వచ్చి మనకు పాఠం నేర్పుతున్నట్లుపుట్టక ముందు ఎవరమో తెలీదు,పుట్టిన తరువాత ఎప్పుడు పోతామో ఎవరం ఇతమిత్థంగా చెప్పనూ లేం. ఇంత మాత్రం దానికి నిన్ను నీవు తెలుసుకో.. అంటూ స్వాములార్లు మఠం వేసుక్కూర్చుని బోధించే శుష్కమైన పలుకులు ఆలకించడం శుద్ధ దండుగ . ఎప్పుడు చూసినా కొత్తగా ఉండడంఎప్పుడు చూడకున్నా  చిరపరిచితు లనిపించడం ఏమిటో ముందు తెలుసుకో! అది తెలియాలంటే నిన్ను గురించి నీవు కాదునీ పక్కవాడిని గురించి నీవు తెలుసుకునే ప్రయత్నం చేస్తుండాలి. 

ముఖమే చూడని ఆకారాన్ని ఊహించుకుని జీవితమంతా ఆ మూర్తికి దాసోహం అయిపోతూ స్తోత్రాలుదండకాలు, వల్లించడం మించి మనిషిలోని పరిచిత అపరిచితానికి ఉదాహరణ ఏముంటుందికంటి ముందుండే ఆహారం వదిలేసి కంటికి ఎన్నడూ కనిపించని ఆకారం దర్శంచాలని భక్తి పేరుతో నిరాకారికి జీవితం ధార పోయడమేమిటో ఆ రహస్యం ముందు కనిపెట్టు!  పడుకునేందుకు ఆరడుగుల నేలకడుపు వేడి చల్లబడేందుకు  చేతికి నిండుగా కబళం ముద్దకంటి రెప్పల విరామానికి ఓ ఆరు గంటల నిద్ర,  కష్టసుఖాలు కలబోసుకుంటూ పక్క మనిషితో మసిలే నిశ్చింత.. ఈ మాత్రం భాగ్యానికి ప్రపంచయుద్ధాలు చేసుకున్న మనుషులకు ఏమి తెలుసనిఏమి తెలియదనిమళ్ళీ మళ్లీ సొదపెట్టుకునేందుకు?

- కర్లపాలెం హనుమంతరావు 

బోథెల్; యూఎస్ఎ


Sunday, December 6, 2020



 

Tuesday, January 19, 2021

నాస్తికుడికే రాజకీయం కావాలి -కర్లపాలెం హనుమంతరావు

 



ఆస్తికుడికి ఏ రాముడో, దైవదూతో, అల్లా పురుషుడు ఉంటాడు.. విన్నా వినకున్నా మొరపెట్టుకోవడానికి! దేవుడి ఉనికిని కొట్టిపారేసే నాస్తికుడి నసకు చెవి ఇచ్చే నాథుడు ఎక్కడుంటాడు? ఎవడి గోల వాడిదే.. ఎవడి బతుకు బండికి వాడే సారథి.. అని విశ్వసించే నాస్తికుడి ఈతి బాధల పరిష్కారానికి రాజకీయాలే గతి. ఒక చెంప రాముడో, రహీమో, క్రైస్తవమో  మన దుఃఖ జీవన సాగరం ఆవలి తీరానికి దారి చూపించే మార్గదర్శకులు అంటూ అనునిత్యం ఘోషిస్తూనే, మళ్లా ఆ రాముళ్లను, రహీములను, క్రీస్తూదేవుళ్లను దిక్కులేని వాళ్లుగా చేసేస్తున్నారని ఒకళ్ల మీద ఒకళ్లు నిప్పులు చల్లుకుంటున్నారు ఆస్తికులు. దేవుడు మనిషిని కాపాడుతున్నట్లా, మనిషే దేవుడి రక్షణకు కంచెగా నిలబడ్డట్లా అని అడిగే నిజాయితీ ప్రశ్నకు సజావుగా బదులు ఇవ్వకుండా ముక్కు చుట్టుడు మొక్కుబడి స్పందనేదో వెలిబుచ్చేసి ఆనక దేవుణ్ణి చిన్నబుచ్చేశాడని ఆగడాలకు దిగవచ్చు, అల్లర్లు ఎన్ని ఏళ్లయినా ఎడతెరిపిలేకుండా సందు దొరికినప్పుడల్లా చేసుకొనే సౌకర్యం ఆస్తికులకు కద్దు. నిజాన్ని నిజంగా తప్ప అబద్ధంగా అంగీకరించలేని అర్భకుడు నాస్తికుడికి.. ఏ దేవుడైనా ఎందుకు సాయపదతాడు? ఆ కారణం చేత కూడా నాస్తికుడు స్వంత బాధల పరిష్కారానికి స్వంతంగానే పూనుకోవాలి. పూనుకోవడం అంటే రాజకియం చేయడం అన్న మాటకు ప్రత్యామ్నాయ పదం. ఏతావాతా   నాస్తికులు ఈ భూప్రపంచం మీద రాజకీయాలు ఒక్కటే  నమ్ముకునేందుకు వీలైన దిక్కు. కాకపోతే అతగాడి పొలిటికల్ 'ఔట్ లుక్'.. ఆస్తికుడి 'ఇన్ సైడర్ వేదాంతం' కన్నా విభిన్నంగా , రుజుప్రవర్తనతో కూడుకుని ఉంటుంది. నాస్తికుడుకి  రాజకీయాలెందుకు? అని పెడసరంగా ఆడిగే ప్రబుద్ధులకు 'ఆస్తికుడికి మించి నాస్తికుడికే రాజకీయాలతో  ఎక్కువ సంపర్కం ఉండితీరాలి. ర్రాజకీయం అన్నమాటకు అర్థం రాజ్యానికి సంబంధించి నడిచే వ్యవహారం యావత్తూ.. అయినప్పుడు ఇహలోకం జీవనం మీద చులకన భావం ఉండే ఆస్తికుడికే అవసరమైన రాజకీయం ఈ లోకమే తన అసలు లోకం అని మనసా వాచా కర్మణా నమ్మే నాస్తికుడికి అక్కర్లేదా? ఏం వింత వాదన?

రాజకీయం అంటే మనుషుల సంక్షేమం కన్నా ముందు దేవుడి బాగోగులు చూడాలన్న వాదన కాదు. దేవుడు మనుషుల్ని సృష్టించాదన్నది కేవలం ఏ ఆధారం లేని పరంపరగా వస్తోన్న ఓ విశ్వాసం మాత్రమే. తాము చేసే ఏ ప్రకటనకు నమ్మదగ్గ రుజువులు చూపించలేని ఆస్తికుడి మల్లే కాదు నాస్తికుడు. దేవుణ్ని మనిషే సృష్టించాడన్న వాదానికి సవాలక్ష ఉదాహరణలు చూపించగలడు. అన్నీసజీవమైనవి, మన కళ్ల ముందు కళకళలాడుతో కనిపించవి. నిజ జీవితంలో నిజంగా ఏదన్నా  కష్టమొచ్చి నమ్ముకున్న దేవుడు ఎలా కాపాడతాడో తరుణోపాయం చెప్పమంటే అమాయకమైన భక్తుడిని అదే  పనిగా అన్నహారాలు గట్రా మానేసి (ఉపవాసాలు) భజనలు, సంకీర్తంలు, ప్రార్థనలు, నమాజులు చేసుకోమని చెప్పుకొస్తారు ఆయా మతపెద్దలు. ఈ తరహా పలాయనవాదాన్ని ప్రోత్సహించే జిత్తులు కాకుండా నాస్తికుడు 'నీ కష్టాలకు మూలం కూడా నువ్వే. నీ పిరికితనమో, లొంగుబాటో, అత్యాశో, తాహతకు మించిన కోరికో, సమాజం ఒప్పని నీతో, నిష్కారణమైన కడుపుమంటో, ఏ ప్రయోజనమూ సాధించలేని నిరాశో, పని చేసేందుకు బుద్ధిపుట్టని బద్ధకమో, తేరగా లబకం ఊడిపడలేదన్న దుఃఖమో, అర్హత లేని గౌరవం దక్కడం లేదన్న ఉక్రోషమో, చులకనగా చూసే వస్తువు శక్తివంతంగా మారి నిలదీస్తుందన్న కసో, పక్క శాల్టీ పైకి ఎదుగుతుందన్న కుళ్లుబుద్ధో.. ఏదో అయివుంటుంది. తీరికగా కూర్చుని, ఓపికగా తరచి చూసుకుని ఆ లోపాన్ని సరిచేసుకుంటే ఏ కష్టమూ నిన్ను బాధించదు. నీవు కొని తెచ్చుకున్న రొచ్చులోకి లేని దేవుడిని  లాక్కువస్తే నీ సమస్య ఎన్నడికీ తీరదు. అంతా ఆ పైనున్న వాడే చూసుకుంటాడని  నీకు మెట్టవేదాంతం బోధించే స్వాములవారు కడుపునొప్పి వస్తే ఆ భారం భగవంతుడి ఒక్క డి మీదనే ఒదిలేయటం లేదు కదా! భక్తుల ఖర్చు మీదనో, ప్రభుత్వ పెద్దల సహకారంతోనో ఏ అమెరికా వంటి పెద్ద దేశాలకు వెళ్లి భారీ బిల్లులు చెల్లించి నయంచేయించుకుంటున్నారు కదా! ఈ లోకం కష్టాలకు ఇక్కడే పరిష్కారం అని చేతలతో చూపించే స్వాములార్ల డొల్ల వేదాంతపు మాటలు నమ్మి కాళ్లుజాపుకు కూర్చోబట్టే కష్టాలు ఎన్నటికీ తీరడం లేదు.

రాజకీయాలంటే నిజానికి ఏమిటీ? రాజ్యానికి సంబంధించిన వ్యవహారాలు. ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు. అంటే మనమే రాజులం. మనకు చెందిన సంగతులన్నీ రాజకీయాలకు అవసరమే. ఆలాంటి నేపథ్యంలో 'దేవుడు లేడు. అదంతా నీ ఊహ' అన్నవాస్తవం చెప్పిన పాపానికి రాజకీయాలకు దూరంగా ఉండాలా నాస్తికుడు?  ఎంత 'నాస్ సెన్స్' గా ఉంది వాదన! వాస్తవానికి అన్నీ దేవుడు చూసుకుంటాడన్న బీరాలు పలికే ఆస్తికులే రాజకీయాలకు దూరంగా ఉండాలి. ఏ దండకారణ్యాలకో వెళ్లి ముక్కు మూసుకుని తాము పరితపిస్తున్నట్లు నటించే మోక్షం కోసం నిక్షేపంగా అన్నహారాలు మానేసి జపతపాలు చేసుకోవాలి. నగరం నడిబొడ్డున ప్రభుత్వాలు దయచేసే అత్యంత ఖరీదైన భూముల్లో భక్తుల సొమ్ముతో విలాసవంతమైన వైభోగం తాము ఆనుభవిస్తూ అడుగడుగునా రాజకియాలలో జోక్యం జనాలకు అన్యాయం చేస్తున్నది ఎవరు?

నాస్తికులందరిదీ ఒకే అభిప్రాయం .. ఎప్పుడైనా.. ఎక్కడైనా!

'నీ జీవితానికి నీవే కర్తవు.. కర్మవు. కనక క్రియా పరంగా కూడా నీ చర్యలే సమస్యలకు పరిష్కారాలు అవుతాయన్నది ఆ  అభిప్రాయం. ఆస్తికుల మధ్యనే సవాలక్ష అభిప్రాయ భేదాలు. 'నా దేవుడు గొప్ప' అని ఒకడంటే.. 'నా దైవం అధీనమే ఈ జగత్ సర్వం' ఇంకొకడి వాదన. మా భగవంతుడికి అపచారం కలిగితే లోకాలన్నీ భగభగమని మండిపోవాల్సిందే!'అని ఒక ఆస్తికుడు బెదిరిస్తే.. మా మూలపురుషుడు లేచి వచ్చేస్తే సర్వం అనంతంలో బుడుంగుమని మునిగిపోవాల్సిందే!' అని సవాళ్లు! నిరాకారుడని చెప్పుకునే దేవుడికి కోపతాపాలు ఎందుకు వస్తాయో,  శాంతి కాముకుడని కోసే భగవంతుడు ఊచకోతలు ఎందుకు ప్రోత్సహిస్తాడో? నిరంజనుడైన ఆదిదేవుడికి అన్నేసి వేల మంది స్త్రీలతో సరసాలా? తృణప్రాయమైన జీవితాలకు బంగారు గొడుగులు, హంగు ఆర్భాటాలతో ఊరేగింపులా? నిజం చెబితే నిష్ఠురం గానీ.. దైవం పేరుతో దుష్ప్రచారమయ్యే  మత విబేధాలు, కులవివక్షల వల్ల కాదూ  మనిషి బతుకు  అవుతున్నది ఇవాళ వల్లకాడు?

రాజకీయాలంటే ఉన్న దూరూహవల్లనే ఇవాళ నాస్తికుడికి రాజకీయాలతో ఉండే సంబంధం ప్రశ్నకు గురవుతున్నది. వాస్తవానికి రాజకీయం అంటే రాజ్య పాలనా నిర్వహణ. ఈ ప్రభుత్వ నిర్వహణ మూడు దశలుగా సాగడం చరిత్రలో మనం చూస్తున్నాం. రాజపాలన,  నియంతృత్వం, ప్రజలు నిజమైన పెత్తందారులుగా నడిచే ప్రజాస్వామ్యం.

రాజరికంలో ప్ర్రజలు ఎలా నడుచుకోవాలో శాసించేది శాసనాల ద్వారా రాజు. నియంతల పాలనలో ఆ పని నియంతది. ఇక్కడ ప్రజల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకపోయినా పాలకులు పెద్ద నష్టమేమీ లేదు. ఎదురుతిరిగిన బలహీనుణ్ణి, బలమైన వాడైతే బలహీనుణ్ణి చేసి ఆనక ఆడ్డు తొలగించుకొనేందుకు బోలెడంత సాధన సంపత్తి, మందీ మార్బలంతో సిద్ధంగా ఉంటాడు. ఈ రెండు వ్యవస్థలల్లో సామాన్యుడి గతి బ్రహ్మాస్త్రాన్ని చూసి అణిగుండే పిచ్చుక తీరే. రాజకు రాజ వంశంలో వాడే ప్రత్యామ్నాయం. నియంతకు తాను అనుకున్న మరో నియంత ఆ లోటు భర్తీ చేస్తాడు. ప్రజాస్వామ్యంలో నిజానికి నిర్వచనం ప్రకారం ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన సాధ్యమయ్యే పాలన- అనే కాని.. నిజానికి ఆ ప్రజలు ఎవరు అన్నదే కీలకమైన ప్రశ్న. డబ్బు ఉన్నవాడు, మతం మీద పెత్తనం కలవాడు, జబ్బసత్తువ ఉన్నవాడు .. ఇలా ఎవరికి వాళ్లు తామే అసలైన ప్రజలం అని ప్రచారం చేసుకుంటూ తమకు సానుకూల పడే పనులు మాత్రమే ముందుకు సాగేందుకు దోహదపడుతుంటారు. విచిత్రమేమంటే.. ఏ సమాజంలో అయినా అత్యధిక శాతంగా ఉండేది ఆర్థికంగా అంత వెసులుబాటు లేనివాళ్లే! అయినా వాళ్ల ప్రయోజనాలు, జీవితాల అభివృద్ధి ఎవరికీపట్టవు. అందుకు వేరెవరినో నిందించాలని పనిలేదు. తమ లోపల ఉండే ఎన్నో బలహీనతలు, చాపల్యాలు, కల్పనలు, మూఢవిశ్వాసాలు, అనైతిక బంధాల పట్ల మోజు వంటి దుర్గుణాల సంకెళ్లయి ముందుకు కదలనీయవు. ఇట్లాంటి బంధనాలను అన్నింటినీ ఛేదించుకుని స్వంత జీవితాలలో ఎవరికీ అభ్యంతరకరం కాని పద్ధతిలో సుఖంగా జీవించే శక్తి నాస్తికుడికి ఉంటుంది. రాజకీయాలతో సంబంధమే కాదు.. రాజకీయాలను శాసించగల శక్తీ నిజానికి నాస్తికుడికే.

లొంగుబాటు ఆస్తికుడి తత్వం. బానిస ప్రవృత్తికి ఎక్కువ ఆస్కారం కల్పించే ఆస్తికులకు అందుకే రాజరికపాలన మీద, నియంతల కర్రపెత్తనం మీద మనసులో ఉండే  మోజు అప్పుడప్పుడు మాటల్లో వెల్లడవుతుంటుంది. 'ఎవరన్నా నియంత వస్తే గాని మన బతుకులు బాగుపడవు' అని ప్రకటించే ఆస్తికవాదిని చూడవచ్చును గాని ఆ పంథాలో ఆలోచించే నాస్తికుడిని ఎక్కడా చూడబోం. నాస్తికుడు అంటేనే స్వీయ శక్తి మీదనే అపారమైన విశ్వాసం కలవాడు. వాడి వల్ల కాకపోతే మరి ఆస్తికుల వల్ల మేలైన  ప్రజాస్వామ్యం సాధ్యమవుతుందా? ఆస్తికుడి రాజకీయాలు స్వార్థప్రయోజనాలు సిద్ధింపచేసుకోవడం కోసం. నాస్తికుడి రాజకీయాలు ఖాయంగా జనహితంగా ఉండేటందుకు మాత్రమే సాగే వ్యూహాలు. నాస్తికత్వం అంటేనే స్వతంత్ర బుద్ధి.  లొంగుబాటుకు ఛస్తే లొంగని మనస్తత్వం. రాజరికం, నియంతృత్వం అంటే అసహనం ఉంటుంది కనక.. అతగాడి రాజకియాలు ఎప్పుడూ ప్రజాస్వామ్య వికాసానికి మాత్రమే తోడుపదేవి.

పుర్వకాలపు రాజరికాలు, నియంతల రాజాలు ఇప్పుడు ఎక్కువగా కనిపించవు. ఆ కారణం చేత సమాజంలో నాస్తికుల సంఖ్య గణనీయంగా పెరిగిందనడానికి నిదర్శనం అనుకుంటే పప్పులో కాలేసినట్లే! ఆస్తిక లక్షణం లొంగుబాటు తత్వమే అయినా ప్రజలలో క్రమేపీ పెరుగుతున్న నాస్తిక భావనలు మెల్లగా రాజరికపాలనలు అంతమవడానికి దోహదపడుతున్నాయి. అయినా ప్రజాస్వామ్య దేశంలో ఉన్న ప్రజలలో అధికశాతం నాస్తికులన్న నిర్ణయానికి రాకూడదు. ప్రభుత్వ నిర్మాణంలో ప్రధాన భూమిక వహించే సామాన్యుడు ఈ ఆస్తిక, నాస్తిక ద్వైధీభావజాలం మధ్య  ఊగిసలాదుతున్నాడని మాత్రమే మనం చెప్పగలం. మనసులో నాస్తిక భావనలు ముప్పిరిగొంటున్నా బహిరంగా అంగీకరించేందుకు సిద్ధపడని హిపోక్రసీనే ప్రస్తుతమున్న ప్రపంచవ్యాప్త రాజకీయ వాతావరణం.

మన దేశంలోని పరిస్థితి ఈ  మూడ్(mood)కి ముమ్మూర్తులా అద్దం పడుతుంది. పేరుకే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నప్పటికి, వాస్తవంగా సామాన్యుడు తన జీవితాన్ని తానే సరిదిద్దుకునే స్థితిలో లేడు. ఎన్నికలు వచ్చిన సందర్భంలో ఏదో ప్రజాస్వామ్య వాతావరణంలో ఉన్నట్లు ఊరట కలిగినా, ఒకసారి ఫలితాలు వచ్చి ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత ఓటరు మహాశయుడు నేరుగా రాజకీయ జోక్యం చేసుకొనే పరిస్థితి బొత్తిగా లేదు. కోరుకున్న పార్టీలకు తట్టుకుని నిలబడే శక్తి ఉండదు. బరిలో నిలబడిన పార్టీలలో అయినా జనం కోరుకోని వ్యక్తులే అధికంగా కనిపించే దుస్థితి. ఎవరో ఒకరు గెలవాలి కనుక గెలుస్తారు. ఒకసారి గెలుపొందిన తరువాత  విజేతకు ఇక మళ్లీ ఎన్నికలొచ్చిపడే వరకు జనంతో సంపర్కం ఉండనక్కర్లేని వ్యవస్థలు ఇప్పటివి.

నిజమైన నాస్తికవాది నిజమైన ప్రజాస్వామ్యప్ర్రేమిగా ఉండటం తప్పనిసరి. దిగాలుబడి కార్యంలేదు. నిందిస్తూ కూర్చున్నా  శౌర్యం అనిపించుకోదు. ఎవరూ కలసిరావడం లేదన్న నిరాశ నాస్తికుని మనస్తత్వానికి సరిపడదు. సమస్య ఏదైనా వర్ణిస్తూ కూర్చున్నందువల్ల తెమిలే వ్యవహారం కాదు. పరిష్కరించే దిశగా చర్యకు పూనుకోవాలి. అదీ తక్షణమే. ఆ భారం మరెవరి మీదనో వేసి నిబ్బరంగా ఉండకుండా మొదటి అడుగు తనదిగా ఉండేలా చూసుకోవడమే ఆసలైన నాస్తికుడి ప్రజాస్వామిక రాజకీయం.

నిజానికి నాడు స్వాతంత్ర్య సాధన దీక్ష దైవసంకల్పంతో సాగింది కాదు. మనం ఒప్పుకోం కానీ.. ఆసేతు హిమాచలం  కులమతాల తారతమ్యాలన్నింటిని తోసిరాజని మానవ సంకల్పంతో సాధించింది మాత్రమే దేశస్వాతంత్రం. స్వాతంత్ర్యం సిద్దించగానే అలవాటు బడ్ద ఆస్తికత్వంలోకి మళ్లీ తిరిగొచ్చేశాడు భారతీయుడు. బానిసత్వ లక్షణాలు తిరిగి పొడగట్టేసరికి  సరికొత్త నియంతలు ప్రజాప్రతినిధులపేరున  నెత్తికెక్కారు.  నిజమైన ప్రజాస్వామిక ప్రభుత్వాలనే మనం కోరుకుంటే ఆస్తికత్వ భావనలను పూజగది గడప దాటి రానీయవద్దు.

ప్రతి వయోజనుడి దగ్గర ఓటు అనే ఆయుధం ఒకటి ఉన్నా.. పేదరికం, బానిసత్వం వారసత్వపు ఆస్తులుగా వస్తూ ఉన్నాయి. చేతిలోఉన్న ఓటుతో కోరుకున్న జీవితం సాధించుకునే వీలున్నా దృష్టిని మళ్లించే ఆస్తికభావాలు నిత్యావసరాల జాబితోలో లేని కులాల, మతాల  మీదకు మళ్లిపోతున్నాయి.. మళ్లీ మళ్లీ! పేద జీవి ఓటు నిరుపయోగం చేసే బానిస భావాలను తొలగదోసుకుంటే తప్ప  సుఖమయ జీవితానికి అతి ప్రధానమైన విద్య, ఉపాధులు, సంక్షేమం, సౌభాగ్యం స్థానే కులం, మతం, వర్గం, వర్ణం, జాతి, నీతి వంటి అడ్డుగోడలు కూలిపోవు. చేతిలో అధిక ఓట్లు కలిగివుండీ పేరుకు పరిపాలకులే అయినా పేదలు తరాల తరబడి బానిసలుగా సమసిపోవడం, ఆస్తికవాదం బోధించినట్లు  తలరాతల వల్ల కాదు, పూర్వజన్మల ప్రారబ్దం వల్ల అంతకన్నా కాదు. గోరంతైనా ఆధారం చూపించ సాధ్యం కాని మాయామిథ్యావాదాలు కూరుతూ   చలనశీల మేధస్సును చక్కభజనల పాల్చేసుకోవడం వల్ల. పరలోక పథం పట్టిపోయిన ప్ర్రజాస్వామిక రథాన్నిప్పుడు ప్రజాకోటి భుజం మీదుగా  భూమార్గం పట్టించడమే అసలు సిసలు నాస్తిక రాజకీయ దృక్పథం. నాస్తికుల  ప్రజాస్వామికమే నిజమైన ప్రజాస్వామికం. సర్వ  మానవ సమానత్వం స్వేచ్ఛగామి ప్రజాప్రభుతకు మచ్చఅంటని  అద్దం. బానిసలు కనబడని ప్రజారాజ్యం నాస్తికుల భావజాలంతో మాత్రమే అందుకు సాధ్యం. సమానత, ప్రజాస్వామికత కలసి రావాలంతే నాస్తికుల భావ దృష్టి  పౌరలందరికీ ముందు అలవడాలి.

-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్, యూ ఎస్ ఎ

19 -01 -2020

 

 

 

Saturday, August 15, 2020

స్వామి వివేకానంద- రాజకీయాలు -కర్లపాలెం హనుమంతరావు- సూర్య దినపత్రిక ఆదివారం సంపాదకీయపుట ప్రచురితం





స్వామి వివేకానంద డాంబిక ప్రదర్శన లేని విరాగి.  ప్రాపంచిక విషయాల తరహాలోనే రాజకీయ వ్యవహారాలనే తామరాకు పైన   తనను  తాను ఓ నీటి బిందువుగా భావించుకున్న ఆధునిక యోగి.  ఆ పరివ్రాజకుడికి ఆ అంటీ ముట్టనితనం   సాధ్యమయిందా?  పరిశీలిద్దాం.
తన జీవితకాలంలో ఎన్నడూ రాజకీయరంగం దిశగా స్వామి అడుగులు పడిన సూచనలు కనిపించవు.  ఏ రాజకీయ పక్షానికీ ఆయన మద్దతు లభించిన  దాఖలాలూ దొరకవు. తన స్వంత  పరివ్రాజక సంస్థలోనూ రాజకీయరంగ ప్రస్తక్తిని నిషేధించిన స్వామీజీ.. ఆ నిబంధనను అధిగమించినవాళ్లని సభ్యత్వం నుంచి తొలగించేందుకైనా సందేహించినట్లు కనిపించదు. రామకృష్ణ మిషన్ నుంచి నివేదిత రాజకీయ సంబంధిత  కారణాల  వల్ల వైదొలగినప్పటి బట్టి స్వామీజీలో ఈ రాజకీయ విముఖత మరింత కరుడుగట్టినట్లు  భావిస్తారు. వివేకానందుడు నివేదితకు పరివ్రాజక సంఘంలో సభ్యత్వం నిరాకరించడం  ఈ సందర్భంగా గమనించవలసిన ముఖ్యాంశం. 
మనిషి పట్ల స్వామికి ఉండే ప్రేమ, సానుభూతి అపారమైనవి. అయినా సందర్భం వచ్చిన ప్రతీసారీ  వివేకానందుడు రాజకీయాల పట్ల తనకున్న విముఖతను నిర్మొహమాటంగా బైటపెట్టేవారు. స్వామి దృష్టిలో రాజకీయాలు మనిషిని సంకుచిత మార్గంలోకి మళ్లించేవి. రాజకీయం మిషతో ఎదుటి మనిషిని పీడించడమే కాదు, తనను గూర్చి తాను  డాంబికంగా  ఊహించుకునే మానసిక రుగ్మత మొదలవుతుందన్నది  వివేకానందుడి నిరసన వెనక ఉన్న భావన. ప్రస్తుతం నడుస్తున్న రాజకీయ ప్రహసనాలు చూస్తున్నప్పుడు వివేకానందుడి నాటి ఊహలో వీసమెత్తైనా అసత్యం లేదనే అనిపిస్తుంది. 
స్వామి దృష్టిలో ఈ దేశం పుణ్యభూమి. ఇక్కడి అణువణువు అత్యంత పవిత్రమైనది.  రుషులు,  జాతి వివక్షతకు తావీయని పద్ధతుల్లో  సర్వ మానవాళికి  ఉచితంగా  ఆధ్యాత్మిక జ్ఞానసంపదను పంచిపెట్టారు. వారి అనుయాయులదీ అదే సన్మార్గం. భారతీయుల  మానవతావాదం యావత్ ప్రపంచం దృష్టిలో గౌరవనీయమైన స్థానం సాధించుకునేందుకు ఇదే ముఖ్య కారణం. సర్వశ్రేష్టమైన మానవత్వం పట్ల   భారతీయుల ఆధ్యాత్మిక సంస్కృతి కనబరచిన శ్రద్ధాసక్తులు  ప్రపంచం దృష్టికి తేవడమే లక్ష్యంగా చికాగో సర్వమత మహాసభ తాలూకు   వివేకానందుడి తొలి  ప్రసంగం సాగింది కూడా.
 ప్రపంచం భారతీయ సంస్కృతి ఔన్నత్యం గూర్చి చర్చించడానికి భారతీయులు కేవలం భారతీయుల మాదిరిగానే ఉండి తీరాలని స్వామి ప్రగాఢంగా విశ్వసించారు. కేవలం ఆ కారణం చేతనే మరే ఇతర దేశమో, సంస్కృతో మన దేశం మీదనో,  సంస్కృతి మీదనో పెత్తనం చెలాయించే అత్యుత్సాహం ప్రదర్శించినప్పుడు, చెత్త రాజకీయాల ద్వారా  జోక్యం చేసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు వివేకానందుడు తీవ్రంగా అసహం వ్యక్తపరిచింది. 
ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే భారతీయుల పుణ్యభూమి పై పరాయివారి పాలన కొనసాగకూడదన్నదే స్వామి ప్రగాఢ కాంక్ష. ఆ చింతనాపరుడి ఆలోచనల నుంచి రగిలిన దేశభక్తి భావనలే అప్పటి ఈ దేశపు యువతను తెల్లవారి పాలనకు ఎదురు నిలిచే దిశగా ప్రోత్సహించింది. స్వీయ వ్యక్తిత్వ వికాస నిర్మాణం దిశగా ధ్యాస పెట్టేందుకూ దోహదించిన భావజాలం వివేకానందునిది. ఆ పరివ్రాజకుడి ప్రబోధాల ప్రభావమే మరణానంతరమూ  బ్రిటిష్ దొరల దృష్టిలో స్వామిని  విప్లవకారుడి కింద ముద్ర వేయించింది.
నైతిక పతనం వల్ల నిజమైన ఆర్థిక స్వాతంత్ర్యం  సాధ్యం  కాదు. రాజకీయాలదే మనిషి పతనానికి చాలా వరకు ప్రధాన బాధ్యత- అన్నది రాజకీయాలపై వివేకానందుని తిరుగులేని సూత్రీకరణ. 'చట్టం, ప్రభుత్వం, రాజకీయాలు మాత్రమే సర్వస్వం కాదు. అవి కేవలం మనిషి జీవన పరిణామ క్రమంలో కొన్ని దశలు మాత్రమే. మానుషత్వ సాధన ఆయా రంగాల ఊహకైనా అందనంత ఎత్తులో ఉంటాయన్న'ది  వివేకానందుడి ఆలోచన. మనిషి అంతరంగ పరంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన నీతి నిజాయితీల  పట్ల రాజకీయాలకు ఎప్పుడూ బొత్తిగా ఆసక్తి ఉండదు’ అన్నది వివేకానందుడి ఫిర్యాదు. కులం, మతం, వర్గం -ఇత్యాదుల పరంగా ప్రజావళిని  విభజనకు గురి చేసే రాజకీయాలు ఈ దేశాన్ని పట్టి వదలకుండా పీడిస్తున్న ప్రధాన రుగ్మతలుగా స్వామి ఆనాడే గుర్తించి గర్హించారు. రెండో ప్రాధాన్యంగా ఉండవలసిన ‘గుడి- మసీదు- చర్చి’ రాజకీయాలు మొదటి స్థానం ఆక్రమించడం స్వామీజీకి బొత్తిగా  గిట్టేది కాదు. మానుషత్వం సంకుచితమయిపోతూ, దేవుళ్లూ దయ్యాలనే భావనల పట్ల వెర్రితనం ప్రబలిపోవడం మనిషికి, మనిషికి మధ్య పూడ్చలేని అగాథాలను సృష్టికేనన్నది ఆయన భావన. రాజకీయక్షేత్ర అనైతిక క్రీడల పట్ల స్వామీజీ క్రుద్ధుడు కాని క్షణం లేదు. 'ఉన్న పరిమిత అనుభవంతో నేను సేకరించిన జ్ఞానం నాకు బోధిస్తున్నది ఏమిటంటే.. మతం మీద మనం ప్రదర్శించే విముఖత్వానికి  మతం అసలు కారణమే కాదు. మనిషిలోని విద్వేషగుణానికి మతాన్ని తప్పు పట్టి ప్రయోజనంలేదు. ఏ మతమూ మనిషిని నిట్టనిలువుగా తగలవేయమని చెప్పదు; సాటి మనిషిని పీడించమనీ రెచ్చగొట్టదు. ఆ తరహా  దుష్కృత్యాలు చెయ్యమని మనిషి మీద వత్తిడి చేసేందుకుగాను మతం పుట్టలేదు. అంతులేని అమానుష కార్యాలన్నిటికి మనిషిని  ప్రేరేపిస్తున్నవి నిజానికి జుగుప్సాకరమైన రాజకీయాలే. కానీ,  ఆ తరహా  అవాంఛనీయ రాజకీయాలనే నిజమైన మతమని జనం నమ్ముతున్నారిప్పుడు! ఈ విషాదకర పరిణామాలకు బాధ్యులెవరో గ్రహించినప్పుడే మనిషికి నిజమైన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లభించేది' అన్నారో సందర్భంలో స్వామి వివేకానంద మతానికి రాజకీయాలకు మధ్య గల అపవిత్ర సంబంధాలను ఎండగడుతూ. 
మతం అసలైన పరిమళం ఆధ్యాత్మికత. నిజమైన ఆధ్యాత్మిక విశ్వాసి దుష్కృత్యాల మీద ధ్యాస పెట్టడు. పరులకు దుఃఖం కలిగే చర్యలు చేపట్టడు.  స్వానుభవం నుంచి వెలికి తీసిన వెన్నముద్దల వంటి సూక్తులు పంచిపెట్టే ఒక సందర్భంలో స్వామి వివేకానందుడు 'మనిషి మేధస్సు చేయదగిన అత్యుత్తమైన ఆరోగ్యకరమైన దారుఢ్య సాధన.. స్వచ్ఛమైన అంతరంగంతో మతాన్ని అనుసరించడం మాత్రమే' అని హితవిచ్చారు.  
జంతువు, మనిషి, దేవుడు- ఈ ముగ్గురికి  ముఖ్య ప్రవృత్తుల సంగమమే మనిషి. అతనిలో అంతుబట్టకుండా దాగి  ఉండి అంతర్గతంగా చెలరేగే రాగద్వేషాల వంటి దుర్లక్షణాలను అణచివేయడం ద్వారా పశుప్రవృత్తిని సాధ్యమైన మేరకు కుదించి మనిషిలో నిద్రాణమై ఉన్న దైవత్వాన్ని తట్టిలేపడమే 'మతం' అసలు లక్ష్యం. 'కాబట్టే  దేశానికి ఒక రాజ్యాంగం ఎంత అవసరమో, మనిషికి మతమూ అంతే అవసరం' అని వివేకానందుడు భావించింది. ఈర్ష్యాసూయలు, క్రోధావేశాలు వంటి విద్వేష భావనలకు మాత్రమే ఆలవాలమైన రాజకీయాలు సర్వమానవళి పట్ల సరిసమానమైన ప్రేమాభిమానాలను పంచవలసిన మనిషికి మేలు చేయవని స్వామి గట్టిగా నమ్మారు. ప్రతికూల దృక్పథ రాజకీయాలతో ప్రపంచమంతా పొంగి పొర్లిపోతున్న సన్నివేశాల మధ్య జీవిస్తున్న స్వామి పౌరుల మనసులు దుర్మార్గమైన ఆలోచనలతో కలుషితం కాక  ముందే, వారి మెదళ్లను అందుకే ఉదాత్తమైన ఆధ్యాత్మిక భావనలతో ముంచెత్తెయ్యాలని  అనుక్షణం ఆరాటపడిపోయింది. 
యూరోపియన్ మేధావుల సదస్సులో ఉటంకించిన భావాలను పునరాలోచిస్తే వివేకానందుడికి భారతీయ సోషలిజమ్ పట్ల ఎంత  చక్కని  అవగాహన ఉందో అర్థమవుతుంది. 'భారతదేశంలోనూ సోషలిజమ్ ఉంది. కానీ  అదీ యూరోపియన్ తరహా ద్వంద్వ విధానం కన్నా విభిన్నంగా ఉంటుంది. అద్వైతమనే అఖండ జ్యోతుల వెలుగుల్లో కళాకాంతులీనే సాంఘిక వ్యవస్థ మాది. యూరప్ లో ప్రాచుర్యంలో ఉన్న సోషలిజమ్ భావనలో మాత్రమే ఆర్థిక సోషలిజమ్. అర్థికపరమైన  కోణంలో చూడడమే అందులోని ప్రధాన  లోపం. బైటకు  వ్యక్తివాదానికి చోటిచ్చే వ్యవస్థగానే  కనిపించినప్పటికీ,  వాస్తవానికి అది వ్యక్తిలోనే నిత్యం సంఘర్షించే రెండు పరస్పర విరుద్ధమైన శక్తుల(మనసు, మెదడు)ను పరిగణలోకి తీసుకునేపాటి శ్రద్ధ చూపించలేదు’ అని స్వామి కుండబద్దలు కొట్టినట్లు చెప్పిన మాట. మార్క్సిజమ్ ఒక  రాజకీయ భావజాలంగా యూరప్ నంతటా ముంచెత్తుతున్న దశలో, దాని తాకిడి హిందూదేశపు ఎల్లలలను కూడా తాకుతున్న నేపథ్యంలొ వివేకానందుడు నిర్భీతిగా వెల్లడించిన మనసులోని మాటలు ఇవి. ఆ నాటి రాజకీయ యుగసంధిలోని పరిణామాలన్నింటిని బాగా ఆకళింపు చేసుకున్న ఆధ్యాత్మిక చింతనాపరుడు కాబట్టే వివేకానందుడు సోషలిజమ్, మార్క్సిజమ్ వంటి సాంఘిక చైతన్య భావజాలాలలోని  'సామాన్యుణ్ణి ఉద్ధరించే లక్ష్యం'  వైపుకు ఆకర్షితుడై తనను తాను ఒక 'ఆధ్యాత్మిక సోషలిష్టు'గా ప్రకటించుకున్నాడు. ఒక పరివ్రాజకుడు సోషలిజమ్ పట్ల ఆకర్షితుడవడం వరకు నిజంగా ఒక అద్భుత సన్నివేశమే! కాని ఆ పోలిక అక్కడి వరకే సరి.
సోషలిజమ్ లోని శ్రామిక పక్షపాతం స్వామిని బాగా ఆకర్షించిన సద్గుణాలలో ఒకటే కానీ, అదే సమయంలో పీడితుని బాధా విముక్తికై సోషలిజమ్ సూచించిన మార్గమే సమగ్రమైనదిగా భావించడానికి ఆయన సమ్మతించలేదని కూడా గమనించడం ముఖ్యం. సోషలిజమ్ భావనను ఆయన 'సగం ఉడికిన ఆహారం'గా భావించారు. 
అంతర్గతంగా దాగిన లోపాల వల్ల ఉన్నవారికి, లేనివారికి మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చే  శక్తి సోషలిజానికి చాలదన్న భావన వివేకానందుడిలో ఉంది.  సోషలిజమ్ ప్రవచించే మేధావుల మధ్య గల అభిప్రాయ భేదాలనూ ఆయన గుర్తించకపోలేదు.
 సోషలిజమ్ అన్న భావన ఆధునిక ప్రపంచానికి సైంట్ సైమన్ (1760 -1825), ఫ్యూరర్ (1772 -1832), రాబర్డ్ ఓవెన్ (1804 -1892) ద్వారా పరిచయం చేయబడింది.  త్రిమూర్తుల ద్వారా ప్రవచితమైన ఈ సామాజిక సూత్రాలు  ఎవరి వల్లా నమ్మదగిన స్థాయిలో సవ్యంగా నిర్వచించబడలేదన్నది ఒక ఫిర్యాదు. 'ఎవరి శక్తిని బట్టి వారికి దక్కవలసిన భాగం, ఎవరి అవసరాన్ని బట్టి వారికి దక్కవలసిన భాగం' అన్నది మార్క్స్ భావజాలమయితే,  విభేదించిన లెనిన్ మహాశయుడు దాని స్థానే  'ఎవరి శక్తిని బట్టి వారికి దక్కవలసిన భాగం.. ఎవరికి శ్రమను బట్టి వారికి దక్కవలసిన భాగం' అని కొత్త నిర్వచనం వెలువరించాడు. బెర్నార్డ్ షా ఆ ఇద్దరినీ ఖండిస్తూ ' సోషలిజమ్ మీద స్వామీజీ  చేసిన అధ్యయనమే సరళంగా, సవ్యంగా, సూటిగా సాగింద'ని  కితాబిచ్చాడు.  పారిశ్రామిక దేశాలు కాకపోయినప్పటికీ రష్యా, చైనాలలో కమ్యూనిస్టు విఫ్లవాలు చెలరేగడమే స్వామి పరిశీలనలోని సంబద్ధతకు నిదర్శనం' అని జి.బి.షా భాష్యం. 1897 సంవత్సరంలోనే  'మరో అర్థ శతాబ్దానికి భారతదేశం సంపూర్ణ స్వాతంత్ర్యం సాధిస్తుంద'ని స్వామి చెప్పిన జోస్యం సత్యం కావడం బట్టి  ఆయన పరిశీలనలోని బుద్ధినైశిత్యం వెల్లడవుతుంది. ఆ రోజుల్లో అసంభవమనిపించిన భారతదేశ స్వాతంత్ర్య హోదా స్వామి చెప్పిన విధంగానే సరిగ్గా 1947లో సాకారం కావడం మిడతంభొట్టు జోస్యమైతే కాదు గదా! నిశిత పరిశీలనా ప్రజ్ఞ గల ఘటికులే ఈ విధమైన నిర్దుష్ట ప్రతిపాదనలు ధైర్యంగా ముందుకు తెచ్చి ‘ఔరా!’ అనిపించుకోగలిగేది.
స్వామి ప్రస్థానించిన 1902 కి అర్థ శతాబ్ది తరువాత భూగోళ   రాజకీయం పూర్తిగా గందరగోళ పరిస్థితుల్లో పడిపోయింది. అధికారం కోసం, అర్హతలతో నిమిత్తంలేని పెత్తనాల కోసం ప్రపంచదేశాలు  ప్రదర్శించే అత్యంత హీనమైన దౌర్జన్య రాజకీయరంగాలు ప్రపంచాన్ని పేలబోయే అగ్నిగుండంగా  మార్చేసాయన్న మాట నిజం.
 సామ్రాజ్యవాదం, జాతీయవాదం, ఉగ్రవాదాలకు తోడు నియంతృత్వ పోకడలు ప్రబలి నేరాలకు, మూకుమ్మడి హత్యలకు అణచివేతలకు అంతమనేది లేకుండా కొనసాగుతున్నది ప్రపంచ రాజకీయమంతా.  రెండు సోషలిష్టు విప్లవాలు బలిగొన్న రక్తపాతం ఎంతో లెక్కలు అందనంత గాఢమైనది.  రెండు ప్రపంచయుద్ధాలు, అణుబాంబు విస్ఫోటాలు, ట్రేడ్ సెంటర్ దాడి వంటి దుర్ఘటనల వల్ల మానవత్వానికి జరిగిన చెరుపుకు  లెక్కలు కట్టడం ఎవరి తరమూ కాదు. అత్యంత సూక్ష్మ దార్శనిక దృష్టి గల స్వామి వివేకానందుడు అందుచేతనే ఈ తరహా దుర్ఘటనలు చోటు చేసుకోవడానికి చాలా ముందు నుంచే ' ప్రపంచం అగ్ని పర్వతం అంచున నిలబడి ఉంది. అది ఏ క్షణంలో అయినా భగ్గుమని పేలి సర్వమానవాళికి పూడ్చలేనంత నష్టం  కలిగించే అవకాశం ఉంది' అంటూ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ వచ్చారు. ఈ తరహా కష్టనష్టాల భారం తగ్గించే దిశగా అందుకే స్వామి యూఎన్ఓ వంటి  అంతర్జాతీయ స్థాయిలో సంస్థలు ఏర్పాటయి చురుకుగా పనిచేయాలని అభిలషించింది.
కొన్ని దశాబ్దాల కిందట వరకు జాతీయ స్థాయిలో ఏర్పడ్డ సమస్యలను  జాతీయ స్థాయి సంస్థలే సమన్వయించి  సర్దిచెప్పేవి. పరిస్థితి మారింది. రెండు దేశాల పిట్టగోడ సరిహద్దు వివాదాలు కూడా ఊహించడానికైనా  సాధ్యం కానంత ఉత్పాతాలకు దారితీసి ప్రపంచదేశాలన్నింటిని  రచ్చలోకి ఈడ్చుకొస్తున్నాయి. ఇదంతా గామనించిన స్వామి ఆ తరహా సమస్యల పరిష్కారం అంతర్జాతీయ స్థాయిలో ఏర్పడ్డ  సంస్థల ద్వారానే సుసాధ్యమౌతుందన్న మాట వాస్తవం. అంతర్జాతీయ సంస్థలు, అంతర్జాతీయ కూటములు, అంతర్జాతీయ న్యాయచట్టాల ఆవశ్యకత నానాటికి పెరగక తప్పదు' అని ముందుగా గుర్తించి  ప్రకటింనిన వాస్తవిక రాజకీయ పరిశీలకుడు స్వామి వివేకానంద.  
నేటి మనిషి జీవితంలో రాజకీయాలు అంతర్గత విభాగాలవక తప్పడంలేదు.  రాజకీయాలతో నిమిత్తంలేని బతుకులు సాధ్యం కాదన్న పచ్చి వాస్తవం స్వామి అనుభావానికేమీ అందకుండా పోలేదు ఎప్పుడూ. అందు చేతనే సామాన్య గృహస్తును రాజకీయాల నుంచి దూరంగా ఉండమని ఆయన ఏనాడూ కోరలేకపోయివుండవచ్చు. కానీ రాజకీయాలతో అనుసంధానం ఏర్పరుచుకునే విధానంలోనే కొత్త పుంతలు తొక్కమని మాత్రం  ప్రబోధించేందుకు ప్రయత్నం చేసారాయాన. ‘భారతీయ వేదాంతం రాజకీయాలలో తెచ్చే సగుణాత్మకమైన మార్పులను  ఊతం చేసుకోకుండా ఇంగ్లాండ్ దేశానికి  నేను మతం  అగత్యాన్ని గురించి ప్రబోధించలేకపోయాను. ఇక్కడ ఇండియాలో కూడా సంఘసంస్కరణలు ప్రవేశపెట్టే ముందు  ఆధ్యాత్మిక రంగం  మానవాళికి చేకూర్చే మేళ్ళను గురించి ముందు  చర్చించవలసిన అగత్యం ఉందని మాత్రం హెచ్చరిస్తున్నాను. రాజకీయ భావజాలాన్ని ప్రబోధించే సమయంలోనూ అది భారతదేశానికి అవసరమైన ఆధ్యాత్మిక సంపదలో ఏ మేరకు అభివృద్ధి  సాధించగలదో ముందు చెప్పాలి.'  అన్నది  రాజకీయాల  వరకు చివరకు స్వామి వివేకానందుడు తీసుకున్న వైఖరి.  
వివేకానందుడి స్వంత వ్యక్తిత్వానికి సంబంధించినంత వరకు రాజకీయ ప్రభావానికి అతీతమైన రాజకీయ పరిశీలకుడు ఆయన. ఏ జాత్తీయ, అంతర్జాతీయ రాజకీయాలకూ ఆయన మనస్తత్వాన్ని మార్చే శక్తి చాలదు. కానీ స్వామి రాజకీయ పరిశీలన అర్థవంతంగా ఉంటుంది.  నిర్దుష్టత శాతం ఎక్కువ. నైపుణ్యంతో కూడిన సునిశితత్వంతో, సూక్ష్మ పరిశీలనతో  నిరపాయకరంగా సాగే వివేకానందుని ప్రసంగాలంటే అందుకే మానవ జీవితంలోని అన్ని పార్శ్వాల మేధావులు అత్యంత శ్రద్ధగా ఆలకించడానికి ఇష్టపడేది. ఆఖరుకు అవి రాజకియ సంబధమైన  ప్రసంగాలైనా సరే.. మినహాయించడానికి వీలులేనివి! 
'స్వామి వివేకానందుని సంపూర్ణ మేదోశక్తిని ఒకే చోట పోగేసి పరిశీలించేవారికి నోటమాట  రాకపోవడం సాధారణంగా జరిగే అనుభవమే. జాతీయవాదానికి, అంతర్జాతీయవాదానికి  మధ్య మరేదో నూత్న భావజాలంతో నిండిన మానవతావాదంలా పరమ ఆకర్షణీయంగా ధ్వనింపచేయడమే వివేకానందుని ప్రసంగాలలోని ప్రధాన ఆకర్షణ' అంటారు  'గుడ్ బై టు బెర్లిన్' రచయిత క్రిస్టోఫర్ ఐషర్ వుడ్. భారతీయుల చరిత్ర, భాషా సాహిత్య సంస్కృతులలో లోతైన అధ్యయనం చేసిన ప్రముఖ ఇండాలజిస్ట్ ప్రొఫెసర్ ఎ.ఎల్. భాషమ్  'రాబోయే కొన్ని శతాబ్దాల వరకు స్వామి వివేకానంద  ఆధునికి ప్రపంచ నిర్మాతల వర్గంలోని చింతనాపరులలో ఒక ప్రముఖునిగా గుర్తుండిపోవడం ఖాయం' అని స్వామీజీ రచనలు అన్నీ సుదీర్ఘ కాలం అధ్యయనం చేసిన తరువాత వెలిబుచ్చిన ఆఖరు మాట. కాదని మనం మాత్రం ఎట్లా అనగలం!
***
-కర్లపాలెం హనుమంతరావు
(సూర్య దినపత్రిక ఆదివారం సంపాదకీయపుట ప్రచురితం)
                                                

Saturday, July 25, 2020

హేతువాదమే ప్రగతి బాటకు రహదారి! -కర్లపాలెం హనుమంతరావు = సూర్య దినపత్రిక సంపాదకీయ పుట వ్యాసం - కర్లపాలెం హనుమంత్తరావు



చదువుకున్నవాడికీ, చదువులేనివాడికీ మధ్య ఉండే తేడా మనకు విద్యాలయాల ద్వారా సాధించే పట్టాల రూపంలో మాత్రమే చూడడం అలవాటు. ఇప్పుడా విద్యారేఖా అడ్డుగా ఉండని గొడ్డుమోతురోజులు ముంచుకొచ్చేసాయి. ఆక్స్ ఫర్డ్ లో చదివినా అమ్మనా బూతులు కూస్తేనే తప్ప 'పప్పూ కాదురా సోదరా.. పొరపడ్డాం.. మగాడేరా'! నే మెప్పులు పొందే తప్పుడు సమాజంలో మనమిప్పుడు  అతి కష్టం మీద  ఎట్లాగో ఊపిరి పీలుస్తున్నాం.  హేతువును గురించి ఏమన్నా రెండు హితవైన ముక్కలు చెప్పాలన్నా జంకే! ఎక్కడ 'గిరీశం లెచ్చర్ల ' కోవలోకి జారిపోతామోనన్న బెంగతోనే నోళ్లు కుట్టేసుక్కూర్చునే మేధావులే మట్టంగా దర్శనమిస్తున్నా రిప్పుడు సర్వత్రా. విశ్వాసాలకు, మూఢవిశ్వాసాలకు.. జ్ఞానానికి, అజ్ఞానానికి మధ్య ఉండే అడ్డుగీతలు మామూలు చేతులతో స్పర్శిస్తేనో, కళ్లతో దర్శిస్తేనో నిర్ధారణ చేసుకునే వెసులుబాటు ఉండదు. వీక్షణ, ఆలోచన, విశ్లేషణ, వివేచనలతో కూడిన పని ఎవరైనా బుద్ధిశాలి కొద్దిగా ధైర్యం చేసి  కాస్త కూడబలుక్కునైనా   విడమరచి చెప్పే దుస్సాహం చేయబోతే.. ఠక్కున ఏ దిక్కు నుంచైనా పాతచెప్పులు రేకేట్లలా దూసుకొచ్చే ప్రమాదం కద్దు. 
బుద్ధి కర్మానుసారిణి, అంతా విధి చేతుల్లోనే ఉంది.. మనుషులం కేవలం నిమిత్త మాత్రులం .. లాంటి అహేతుక  భావజాలాంధకారంలో పడి విద్యలు నేర్చినవారు, రాజ్యాలు చేసేవారు, జీవితాలు తీర్చిదిద్దే బాధ్యతలు నెత్తికెత్తుకున్నవారు కూడా కొట్టుమిట్టులాడుతుంటే, పొట్ట కూటికై పాకులాడేందుకే ఎక్కడి జీవితకాలమూ చాలని బక్క మనిషి నుంచా  మనం  మంచిబుద్ధి,  సదసద్విచక్షణలు ఆశించేది?! తరతరాలుగా భావదాస్యంలో మునిగి తేలే అక్కచెల్లెళ్లు, అట్టడుగు జాతుల వంటి విస్మృతవర్గాలవారిని తప్పుపట్టి ప్రయోజనం లేదు. ఇంటా బైటా సవాలక్ష ఆంక్షలతో సతమతమయ్యే బక్కజీవి మతి కుదిరి, ఓ మూలను చేరి మంచిచెడులు తీరికగా తర్కించుకునే పాటి సావకాశం పాడు ఆధిక్యతాభావ  ప్రపంచం ఎక్కడ ఏకాలంలో పడనిచ్చింది గనక?! జీవికకు ఏ మాత్రం అక్కరకు రాని  దురభిమానాలు, హెచ్చుతగ్గులు, జాత్యహంకారాలు, కుల మత భేదాలు, అవినీతి, కాముకత్వం వంటి మానసిక జాడ్యాలు నానాటికి పెచ్చుమీరుతున్నాయంటే, అందుక్కారణం  మంచేదో, చేడేదో తర్కింఛుకోవలసిన గత్యంతరం బొత్తిగా లేని అడ్డుగోలు గొడ్డుమోతుతనమే గద్దె మీద చేరి గద్దించి మరీ పనులు సానుకూలపరుచుకునే  కువిధానాల వల్ల.  నాగరికత- పేరుకే ఇరవయ్యకటో శతాబ్దానిది. సంస్కారం- ఒకటో శతాబ్ది కాలాన్నైనా దాటి రాని దుస్థితి. సంఘంలో, ఆర్థిక రంగంలో అశాంతి, అక్రమాలు అంతకంతకు తమ రికార్డులు తామే బద్దలు కొట్టుకుంటున్నాయంటే.. అన్యాయమే రాజకీయగద్దె మీద గజ్జె కట్టి హేతువనే పదానికుండే మూలార్థాన్ని మొదలంటా పెళ్ళగించేందుకు కంకణం కట్టుకోబట్టి కాదూ!
సమాజానికి, కుటుంబానికి కూడా ఎంతో కీలకమయినవి బడుగుల పాత్ర, స్త్రీ పాత్ర. విస్మృతులకు దక్కే హోదా, స్థాయిలే ఆయా సమాజాల ప్రగతి వికాసాలకు కొలమానాలు. తక్కువవర్గాలుగా బావించుకునేవారులోని తతనాన్ని తామే స్వయంగా  గ్రహింపుకు తెచ్చుకుని కలిసొచ్చే సానుకూల శక్తులని తోడు తెచ్చుకునైనా చొరవగా ఒక అడుగు ముందుకు చొచ్చుకుపోకపోని పక్షంలో ఈ సమాజానికి ఇక సమంజసత, సున్నితత్వం, సహేతుకత, సమ్యక్ దృష్టి ఏకమొత్తంగా అలవాటు తప్పిపోయే  పరిస్థితులు దాపురించినట్లే లెక్క.. నిజం చెప్పాలంటే!
సమాజమనే కాదు, వ్యక్తి జీవితంలోనూ ప్రజాస్వామ్యం వెల్లివిరిసిన  వాతావరణం వర్ధిల్లినప్పుడే సర్వే జనా సుఖినో భవన్తు అనే  సూత్రసారం ఆసాంతం సాకారమయే సావకాశం! ఉదాత్తమైన ఆశయాలు, ఉత్తేజకరమయిన ఆలోచనలకు సహేతుకతా తోడయే తప్ప మనిషి ఆలోచనల్లో మంచి మార్పు రాదు. మంచి మార్పు వస్తేనే  ప్రపంచానికి ప్రస్తుతం దాపురించిన దుస్థితుల నుంచి విముక్తయేందుకు  మార్గం దొరికేది.  చార్వాక, కపిల, కణాదుల సిద్ధాంతలతో కూడా బాల్యం నుంచే పరిచయం పెంచుకోవాల్సిన అగత్యంలో ప్రస్తుతం మన సమాజమున్నది. అట్లాగని తిరుగుబాటే మా వేదాంతం అని నినదించాలని కాదు. విప్లవాత్మకమైన ఆలోచనా ధోరణులకు ఎల్లవేళలా స్వాగతపత్రం అందించేందుకు మనసును  సిద్ధం చేసుకొనుంచుకోవాలనేదే.. హితవు.
తిరుగుబాటు వేరు.. విప్లవం వేరు. సిపాయిల తిరుగుబాటు వంటి తిరుగుబాటులకు అన్ని వేళలా సహేతుకమైన కారణాలే ప్రేరణలవుతాయన్న హామీ ఏమీ లేదు. కానీ.. భావవిప్లవం అంటే మాత్రం కణకణ మండే  అఖండ జ్వాలామాల. దానికి ఉత్తేజమనే ఇంధనమందేది మాత్రం అన్ని వేళలా అన్ని వైపులా  హేతుబద్ధమైన వికాసాలోచనల స్రవంతుల నుంచి మాత్రమే! ఆంగ్లసీమలో 1689లో హద్దులెరుగని రాచరికానికి కళ్లెమేసిన తీరులో సాగేదీ విప్లవోద్యమం. ప్రాతినిధ్య అధికారం ఉన్నవారికే పన్నులు విధించే హక్కన్న హేతుబద్ధ ఆలోచనే 1776 నాటి అమెరికన్ ప్రజాస్వామిక విప్లవానికి దారి తీసిన  ప్రేరణ.  స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి ఆదర్శవంతమైన  భావజాలం బలం పుంజుకుని 1789 ప్రాంతంలో  ఫ్రెంచి విప్లవానికి ప్రోద్బలంగా నిలచిన సందర్బం గమనించినా, 'భూమి.. తిండి.. శాంతి' వంటి వాస్తవావసరాల నిమిత్తం హోరెత్తిన 1917నాటి రష్యన్ల విప్లవం పరిశీలించినా, కార్మిక, కర్షక, మధ్యతరగతి, అణగారిన వర్గాల వంటి ఇతరేతర విస్మృత శక్తులు  ఆయా దేశాలలో  సాధించిన అన్ని విజయాల వెనకున్నదల్లా హేతుబద్ధమైన ఆలోచనాక్రమ వికాససరళి వెన్నుదన్నులు మాత్రమే అని అర్థమవుతుంది. 1947 నాటి భారత స్వాత్రంత్ర్యసమరం గాని, మరో రెండు ఏళ్ల తరువాత చైనాలో చెలరేగి విజయం సాధించిన జనచైనా విప్లవం గాని.. లోతైన సునిశిత పరిశీలనకు దిగితే చివరికి తేల్చేవి..  హేతువుతో కూడిన సమ్యక్ దృష్టి సమాజం అట్టడుగు వర్గాల వరకు చేరి ప్రభావితం  చేస్తేనే తప్ప అమానుషత్వం అణగారి సమసమాజ నిర్మాణానికి సానుకూల బాటలు పడబోవని.  
సమాజ పరివర్తనకు, భావగమనానికి అవినాభావ సంబంధం ఉంది. అయితే ఆ భావాలు ఎవరి ద్వారానో ప్రతిపాదితమై ప్రభావితం చేసేవా? మన మెదడులోనే కదలడం మొదలయినప్పటి బట్టి స్వత్రంత్ర బుద్ధితో పెంపొందేవా? అన్న ప్రశ్న ఎదురైనప్పుడు విశ్వవిఖ్యాత ఆలోచనావిప్లవ మేధావి ఎమ్.ఎన్. రాయ్ రెండవదే శిరోధార్యమని బల్లగుద్ది  మరీ చెప్పిన సత్యం మనమిక్కడ స్మృతికి తెచ్చుకోవడం అవసరం.
రాయ్ ఆలోచనా సరళి ప్రకారం, వ్యక్తివాదం, హేతువాదం , మానవవాదం..  అనే మూడు గుణాలతో మనిషి ఆలోచనా క్రమం ప్రభావితం అవుతుంది. తతిమ్మా అన్ని జీవులకు మల్లేనే మనిషి పుట్టుకా ప్రకృతి నుంచే. ప్రకృతి నియమం క్రమబద్ధంగా ఉంటుంది కాబట్టి మానవ వికాసమూ, మనిషి పెరుగుదలా నియమబద్ధంగా.. అంతే హేతుబద్ధంగా సాగుతాయనేది  రాయ్ రేడికల్ హ్యూమనిజం సూత్రం. 
మానవవాదం పురాతనకాలం నుంచి సదాలోచనా పరంపరగా సమాజంలో అంతర్లీనంగా ప్రవహిస్తున్నదే! కదిలే కాలంతో కదా మనిషి సహప్రయాణం చేస్తున్నది!   పెరుగుతున్న మానవ మేధస్సు, నాగరికతల మూలకంగా సమకాలీన భావజాలం సంధించే క్లిష్టమైన ప్రశ్నలు సహజంగానే ఎన్నో పుట్టుకువస్తాయి.  ఎప్పటికప్పుడు మొలకెత్తే కొత్త కొత్త సందిగ్ధాలకు సంబద్ధమైన బదుళ్లిచ్చే క్రమంలో నవ్యమానవవాదం అనే మరో భావధారకు పురుడుపోసిన ప్రజామేధావి ఎమ్.ఎన్.రాయ్.

స్వభావసిద్ధంగా స్వేచ్ఛాపిపాసి, సత్యాన్వేషి- మనిషి. అతను తన మనుగడ సాగించుకునే క్రమంలో అంతరాత్మ చెప్పే నీతి.. (అదే ఎక్కువ మందికి భగవంతుడు చెప్పే నీతిగా అనిపించేది), ప్రయోజనం కలిగించే నీతి అనే రెండు దోవల నుంచి ప్రేరణ పొందుతాడని, ఈ రెండు దిశలకు ప్రత్యామ్నాయంగా హేతుబద్ధమయిన నీతిమార్గంమాత్రమే మనిషి నడిచే సన్మార్గంగా ఉండాలనేది రాయ్ నవ్యమానవవాద మూల సూత్రం.

రాజకీయాలలో పార్టీలు లేని వ్యవస్థను, ఆర్థికరంగంలో సహకార సంబంధమైన ప్రణాళికా రచనలు ప్రతిపాదించే తీరులోనే,  సాంస్కృతిక రంగంలోనూ స్వతంత్ర బుద్ధితో హేతుబద్ధంగా చేసే ఆలోచనాధారను ప్రోత్సహిస్తుందీ సిద్ధాంతం. సంఘపరంగా సాగే అన్ని రకాల వివక్షలను నిర్ద్వందంగా నిరసిస్తుంది కూడా. కుల, మత, వర్గ, ప్రాంత, భాష, జాతి, దేశ విభేదాల జాబితాలో లింగ విభేదమూ ఉంది. విశ్వజనీనమైన సంస్కృతికి విలువిస్తూనే భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం చూడగల సత్తా ఈ మానవవాదానికి ఉంది. ఆఖరుదే  అయినప్పటికీ అత్యంత ప్రధానమైన అంశం, విశ్వాసాలు మూఢవిశ్వాసాల కిందకు దిగజారడాన్ని నిర్మొహమాటంగా నిరసించే పదునైన ఆయుధం నవ్యమానవవాదం.


ప్రకృతికి మించిన శక్తి మరేదీ లేదు. మనిషి తన మనుగడకు, తన భవిష్యత్తుకు తానే బాధ్యుడు. తన మేలుకు, సాటి మనిషి మేలుకు మధ్య ఘర్షణ లేదని.. ఉండకూడదన్న జీవన సూత్రాలను మాత్రమే సామాజిక పరిస్థితుల మెరుగుదలకు సాధనాలుగా వాడుకునే ప్రయత్నం చేయాలని నవ్యమానవవాదం హితవు చెబుతుంది.
ప్రస్తుతం ప్రపంచ మానవాళి సంస్కృతులే మహాచిక్కుల్లో నలుగుతున్నాయి. మత ప్రాబల్యం, ఫాసిజం తరహా ఎన్నో ఇతరేతర నియంత్రణ విధానాలు సర్వజనసంక్షేమ కాంక్ష మీద నిప్పులు కురిపిస్తున్నాయి. విజ్ఞానం సహేతుకమైన మార్గంలో అభివృద్ధిచెందడం, మేధస్సు కొత్త పుంతలు తొక్కే ప్రయత్నం చెయ్యడం, సృజనశక్తి సరికొత్త జవసత్తువలు పుంజుకునే నూతన తాత్విక చింతనలకు ప్రాతిపదికలుగా వాతావరణాన్ని మలుచుకోవడం తప్పనిసరి అయిన ఈ తరుణంలో, లోకం రోజురోజుకూ మూఢవిశ్వాసాలు, మూర్ఖాలోచనల రొంపి వైపుకు శరవేగంగా అంగలువేయడం  సామాజిక శ్రేయోకాముకులు ఎవరికైనా అమితాణ్దోళన కలిగించే అంశమే!
పదునెక్కిన నైతిక దృక్పథం మొక్కటే ముందుకు చొరబడి రాక తప్పని తరుణమిది. సమయానుకూలమైన మౌనభంగిమలనే హూందాతనంగా మేధావులు భావిస్తుండవచ్చు. పెద్దరికం ప్రదర్శంచడమంటే ఇతరుల హక్కులకు భంగం వాటిల్లని పద్ధతిలో స్వయం వికాసమార్గాలను అన్వేషించుకునే మార్గాలు వెతికి సూచించడం. అర్థం. క్రమశిక్షణ మిషతో మనిషిని ఒక యంత్రంలా మార్చే విధానాలకు సత్వరమే తిలోదకాలు ఇవ్వడం అవసరం. యాంత్రీకరణ మానవీయ విలువలను.. క్రమంగా మానవతను కూడా ధ్వంసం చేసే మహారక్కసి. తాత్కాలిక ప్రయోజనాల కోసం శాశ్వతమైన, సమగ్రమైన విలువలను ఫణంగా పెట్టే జీవనవిధానాలను చెత్తబుట్టలో వేసి తొక్కేస్తే తప్ప ఆ రక్కసి కర్కోటకం నుంచి నిజమైన విముక్తి అట్టడుగు జీవి వరకు  చేరే అవకాశంలేదు.
వ్యక్తి స్వేచ్ఛ ఆవశ్యకతను తక్కువ చేయలేం.. కాని సమాజశ్రేయస్సు  తరువాతనే దానికి ప్రాధాన్యత. భౌతికపరమైన అవసరాలు తీరే నిమిత్తం పరుల స్వేచ్ఛను హరాయించడం అమానుషమవుతుంది. మానసిక స్వేచ్ఛ, సామాజిక చింతన లేకుండా ప్రగతిని సాధించడం మోచేతి కింది బెల్లం నాలుకతో అందుకోవడంతో సమానం.
నిజం చెప్పాలంటే, మానవవాదంలో పిడివాదానికి, పిడిగుద్దుల సిద్ధాంతానికి  తావేలేదు.  మానవవాదం మరో పేరే వ్యక్తి స్వేచ్ఛ. మారే సమాజానికి అనుగుణంగా అభ్యుదయ పంథాలోనే విధానాల మార్పుకు సౌలభ్యం కల్పించే మౌలిక జీవనసూత్రానికి హేతువాదం కట్టుబడి ఉంటుంది. విజ్ఞాన కాంతిని ప్రపంచశాంతికి వినియోగించే సమన్వయ బుద్ధి సాధించాలన్నా ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొనే సవాలక్ష సవాళ్లకు సహేతుకైన సమాధానాలు  వెతికే మనస్తత్వం బాల్యం నుంచే అలవరచుకోవడం ఒక్కటే గతి.  
-కర్లపాలెం హనుమంతరావు
(26-07 -2020 నాటి సూర్య దినపత్రిక సంపాదకీయపుట ప్రచురితం)


                                                

Sunday, February 9, 2020

హేతువాదం -కర్లపాలెం హనుమంతరావు



మనిషి ఆరంభంలో హేతువాదే! తెలిసిన విషయాలతో తెలీని విషయాలను తర్కించుకుంటూ సంతృప్తికరమైన సమాధానాలు దొరికే వరకు అన్వేషణ కొనసాగించడం అతని నైజంగా ఉండేది. చేతనయింది తాను  సృష్టించుకుంటున్నట్లుగానే తనకు చేతగాని వాటిని ఎవరో తన కోసం సృష్టించి పెడుతున్నారని భావించడమూ తర్కం విభాగం కిందకే కదా వచ్చేది? ఆ అదృశ్య శక్తిని అతడు దేవుడుగా భావించాడు. ఆ దేవుడి చుట్టూతా మతం అల్లుకోవడం, అదే ఒక వ్యవస్థగా వేళ్లూనుకోవడం, క్రమంగా దానిలో మౌఢ్యం ప్రవేశించడం, దానిని ఎదుర్కొనేందుకు చైతన్యంతో ప్రతిస్పందించడం.. ఈ మొత్తాన్ని ఒక ముద్దగా చూస్తే అదే మనిషి పురోగతి అనిపిస్తుంది. మౌఢ్యాన్ని ప్రశ్నించడానికి మనిషి ఎన్నుకున్న ప్రక్రియా అనాదిలో ఆరంభంలో అనుసరించిన ప్రశ్న పధ్ధతే అని మనం మర్చిపోరాదు. 'ప్రతి వస్తువును ఎవరో ఒకరు సృష్టించాలన్న సిధ్ధాంతం ప్రకారం తనకోసం సృష్టించిన వాడినీ ఎవరో ఒకరు సృష్టించి ఉండాలి కదా?' అన్నది తర్కం కిందకే వస్తుంది కదా! ఆ ప్రశ్నకు జవాబు దొరకని మతం అలా పదే పదే ఎదురు తిరిగి ప్రశ్నించేవాళ్ల మీద 'మౌఢ్యం' ముద్ర వేయకపోతే మరింత మంది బుద్ధిమంతులు ఆ ప్రశ్ననే కొనసాగించి సమాజాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెడతారని 'మతం' బెదురు. మొదటి తర్కంలో నుంచి పుట్టిన మతాన్ని అక్కున చేర్చుకున్నవారే రెండో తర్కానికి మూఢత్వం అనే లేబుల్ అంటగట్టడం.. విచిత్రం! 'ఆస్తికత్వం' అనే పదాన్ని దేవుడు పరంగా 'ఉన్నాడు'అన్న అర్థంలో తప్ప మరో విధంగా భావించడం రాని భావదాస్యత 'ఆ ఉన్నాడు అంటున్నవాడు ఎక్కడున్నాడో.. ఎలా ఉంటాడో.. చెప్పండి.. అలా చెప్పలేక పోయినా.. పోనీ ఫలానా విధంగా ఉన్నాడన్న రుజువులైనా కొద్దిగా చూపించండ'ని ఆడుగుతుంటే సంతృప్తికరమైన జవాబు ఇచ్చే పరిస్థితుల్లో లేక  'నాస్తికత్వం' అన్న పేరు తగిలించి సంఘబహిష్కరణ చేసే విఫల ప్రయత్నాలు విశ్వవ్యాప్తంగా అన్ని కాలాల్లోనూ జరుగుతున్న అకృత్యమే!
సత్యాన్వేషణకు కట్టుబడ్డ ఎంతోమంది శాస్త్రవేత్తలు.. సామాజిక తత్వవేత్తలు తమ నిబద్ధత కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు చరిత్ర నిండా బోలెడన్ని.
జిజ్ఞాస, తర్కం సృష్టిలో మనిషి విశిష్టతలు. ఆ రెండింటినీ అణగదొక్కడమంటే మానవజాతిని జంతుప్రాయంగా జీవించమని నిర్బధించడమే!
తెలుగు సమాజంలోని అనేకమైన లోటుపాట్లను బట్టలు విప్పదీసి మరీ ప్రదర్శించిన ప్రశ్నవేత్త యోగి వేమన. కులభేదాలతో కుళ్లిన సమాజాన్ని సంస్కరించే సదుద్దేశంతో సామూహిక భోజన కార్యక్రమాన్ని సాహసంతో తలపెట్టిన గొప్ప సంస్కర్త బ్రహ్మనాయుడు. వీరిద్దరు చూపించిన వైజ్ఞానికి, సామాజిక తర్కవాదం దారిలోనే తదనంతర దశల్లో మరిన్ని అడుగులు జాతిని ముందుకు నడిపించిన హేతువాదులు.. కొమర్రాజు లక్ష్మణరావు, కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావులు.. వారి అనుయాయులూ త్రిపురనేని రామస్వామి చౌదరి, గుర్రం జాషువా(భగవంతుడు ఉన్నాడన్న భావన ఉన్నా నిర్భయంగా నిలదీసిన ప్రశ్నవాది). రాజారామ్మోహన్ రాయ్  బ్రహ్మసమాజం, దయానంద సరస్వతి ఆర్యసమాజం, అనీబిసెంట్ దివ్యజ్ఞాన సమాజం, రాజకీయ, ఆర్థిక రంగాల పరంగా కమ్యూనిజం.. వంటి భావజాలాల మూలకంగా భారతదేశంలో హేతువాదానికి ఎప్పటికప్పుడు కొత్త జవసత్వాలు పుట్టుకొస్తూనే ఉన్నాయ్! ఎం.ఎన్.రాయ్ రాడికల్ హ్యూమనిజం దారిలోనే గోరా హేతువాద ఉద్యమం ముందుకు సాగింది. హేతువాదానికి మరో ఉద్యమ రూపంగా సమాజంలో తనదైన ప్రత్యేక ముద్ర వేయించుకొన్న గోరాని గురించి ఎంత చెప్పినా ఇంకొంత మిగిలే ఉంటుంది.
కాకినాడ పిఠాపురం రాజావారి కళాశాలలో  చేసే చేసే ఉద్యోగాన్నుంచి ఉద్వాసన పలకాల్సొచ్చింది గోరాగారికి 1933లో హేతువాదాన్ని విద్యార్థుల్లో ప్రచారం చేస్తున్నారన్న నెపంతో. బందరు హిందూ కళాశాలలో  ఏ ప్రతిబంధకాలు లేని కారణంగా విశాఖపట్నం హిందూ పఠన మందిరంలో ఏకంగా నాస్తికత్వం మీద బహిరంగ నిర్వహించారు. ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ ప్రకటించుకొని, కృష్ణా జిల్లాల్లో నాస్తిక కేంద్రం స్థాపించారు గోరా. 'నాస్తికత్వం లేక దేవుడు లేడు' అనే పుస్తకం ద్వారా ఆలోచనాపరులను కదిలించారు. హేతువాద దృష్టికి ఒక వ్యవస్థీకృత స్థాయి ఆంధ్రదేశంలో ఏర్పడేందుకు ఆ కాలంలోనే ఊపందుకొన్న ఎం.ఎన్.రాయ్ హ్యూమనిజం భావజాలం కూడా ఒక ముఖ్యమైన కారణమే!
స్వాతంత్రోద్యమం, తెలంగాణా విమోచనోద్యమాలలో నాస్తికుల పేరునే మేధావులు కొందరు పాలుపంచుకొన్నారు. స్వతంత్రం వచ్చిన తరువాత గోరాగారు విజయవాడలో నాస్తిక కేంద్రం ఏర్పాటు చేసుకొన్నారు. అక్కణ్నుంచే 'సంఘం' పేరుతో వారపత్రిక ప్రచురణ జరిగేది. అదే పంథాలో తెనాలి నుంచి రాడికల్ హ్యూమనిజం భావప్రచారానికి 'సమీక్ష' పేరుతో  మరో వారపత్రిక వెలువడుతుండేది.
మూఢనమ్మకాలను ప్రశ్నించడం, దైవాంశసంభూతులని డబ్బాలు కొట్టుకునేవాళ్ల మహిమలను బహిరంగా సవాలు  చెయ్యడం, బాబాల  అద్భుతాలుగా కొనియాడే గమ్మత్తులను నాస్తికకవాదులుగా తామే బహిరంగంగా ప్రదర్శించి చూపించడం.. ఆనక ఆ మహిమల వెనుక ఉన్న మర్మాలను  వివరించడం వంటి  చర్యల ద్వారా అభూత కల్పనలకు అడ్డుకునే ప్రయత్నాలు నిరంతరాయంగా కొనసాగుతుండేవిచర్చల సందర్భంలో మొహం చాటు చెసే సాధారణ పౌరులలో తార్కికమైన ఆలోచనలను రేకెత్తించడమే ఇలాంటి చర్యల ప్రధాన ప్రయోజనం. గోరాగారు ఒక వ్యక్తిగా కాకుండా సకుటుంబంగా ఈ హేతువాద ఉద్యమంలో పాలుపంచుకోవడం మరన్ని హేతువాద కుటుంబాలు ఏర్పడేందుకు దోహదపడింది.
నార్ల వేంకటేశ్వర్రావు, ఆవుల గోపాలకృష్ణమూర్తి, డాక్టర్ త్రిపురనేని వెంకటేశ్వర్రావు, గౌరిబోయిన పోలయ్య, రావిపూడి వెంకటాద్రి, మల్లాది సుబ్బమ్మ వంటి మేధావుల కార్యకలాపాల కారణంగా హేతువాద ఉద్యమం  బహుళ వ్యాప్తిలో ఉండేది. ఉంటోంది.
గోరాగారు మహాత్మాగాంధీతో చేసిన చర్చలు 'An Athiest with Gandhi' పేరుతో పుస్తక రూపంలో వెలువడి.. తదనంతర కాలంలో ఆంగ్ల తర్జుమా కూడా సంఘం పత్రికలో  వెలువడింది. నాస్తికవాద ప్రచారానికి ప్రపంచ పర్యటనకు పూనుకున్న గోరా 1970లో ప్రపంచ నాస్తిక మహాసభలు సైతం విజయవాడలో నిర్వహించారు. అదే దశకంలో ఆంధ్రదేశంలో హేతువాద సంఘం, విశాఖ వేదికగా  మార్క్సిస్టు భావజాలంతో భారత నాస్తిక సమాజం ఎర్పడ్డాయి. శిక్షణా తరగతులు, అధ్యయన తరగతులు జిల్లాల వారీగా నిర్వహించేవారు. తెలుగునాట ఉధృతమవుతున్న హేతువాద ఉద్యమానికి ఆకర్షితులయే శ్రీ లంక ప్రొఫెసర్ డాక్టర్ కోవూర్ అబ్రహాం మూడు సార్లు ఇక్కడ పర్యటించారు. దైవాంశ సంభూతల మహిమలకు వ్యతిరేకంగా ఉద్యమించే డాక్టర్ పి. ప్రేమానంద్ ఇక్కడ అనేక శిక్షణా తరగతులు నిర్వహించారు.
గోరా మరణం తరువాత వారి కుమారుడు డాక్టర్ లవణం అంతర్జాతీయ హ్యూమనిష్టు ఉద్యమంలో అంతర్భాగమయారు.  ఎన్నో పర్యాయాలు ప్రపంచం చుట్టి రావడమే కాకుండా.. రెండవ నాస్తిక మహాసభలూ నాస్తిక కేంద్ర స్వర్ణోత్సవాల సందర్భంలో  ఘనంగా నిర్వహించారు. సర్ హార్మన్ బోండి, జాన్ ఎడ్వర్డ్స్, జిం హెర్రిక్. హేరి స్టోప్సరో, లెవీ ఫ్రాగెల్, ఫ్రాంక్ షూట్, ఎరిక్ హార్టికైనన్, డాక్టర్ నిహాల్ కరీం, రాయ్ బ్రౌన్, అజం కమ్గుయాన్.. లాంటి ఎందరో నాస్తిక ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అనేక నాస్తిక మహాసభల్లో, హేతువాద ఉద్యమాలలో పాలుపంచుకున్నారంటే.. ఆ ఘనత గోరా కుటుంబం మొత్తం  ఓ క్రతువుగా సాగించిన  హేతువాద, నాస్తికవాద  ఉద్యమాల ప్రభావం వల్లనే! ఆంధ్రదేశం నుంచి ఇతర దేశాలలో జరిగిన హేతువాద, నాస్తిక సభలు సమావేశాలకు హాజరయిన ప్రముఖులలో ఎన్. ఇన్నయ్య, రావిపూడి వెంకటాద్రి,  బాబు గోగినేని వంటి వారు ఇప్పటి తరానికీ సుపరిచితులే!
ఆంధ్రుల నాస్తిక, హేతువాద ఉద్యమాలు ప్రపంచంలోని మరే ఇతర దేశాల ఉద్యమాల ముందూ తీసిపోనంత ఉధృతంగా సాగుతున్నవే! మనిషిని ఆలోచించమని కోరడమంటే తన అనుభవాల నుంచి, అవగాహనలో నుంచి ఆలోచించమని కోరడమే! అందరి ఆలోచనలు ఒకేలా ఉండనప్పటికీ వ్యక్తి స్వేచ్ఛ, పరస్పర గౌరవం వంటి మౌలికమైన మానవ విలువులలో మార్పు ఉండదు. హేతువాదులేమీ మూసపోత ఆలోచనా విధానాన్ని ప్రోత్సహించరు. వైరుధ్యం తలెత్తని విభిన్నత్వాన్ని, వైవిధ్యాన్నే ఆలోచనాపరులైన నాస్తికులైనా, హేతువాదులైనా ప్రోత్సహించేది.
వంద సంవత్సరాల కిందటి వరకు నాస్తికత్వం, హేతువాదం ఒక పెడవాదంగా హేళనకు గురయిందన్న వాస్తవం మనం మర్చిపోరాదు. చాలా నాగరిక దేశాలలో క అలా చెప్పుకునేవారికి ఇబ్బందులు  ఎదురయేవి. అంతటి ప్రతికూల పరిస్థితుల నుంచి నాస్తిక, హేతు భావజాలాలు ఇవాళ ఒక గౌరవనీయమైన మానవవాదాల జాబితాలో చేరి మేధావుల మన్ననలు అందుకుంటోన్నది. ఈ కృషిలో మన తెలుగువారు నిర్వహించిన పాత్రా అనల్పమైనదని మరో మారు గుర్తు చేసేటందుకే ఈ చిన్న ప్రయత్నం.
రాబోయే తరాల ప్రగతి బాట నిర్మాణంలో ఎవరు వద్దన్నా, కాదన్నా నాస్తిక, హేతు భావజాలాల పాత్రా తప్పక ప్రాముఖ్యం వహిస్తుందని జ్ఞప్తికి చేసేందుక్కూడా ఈ చిరువ్యాసం.
***
(ఆంధ్రప్రదేశ్ అవతరణ స్వర్ణోత్సవాల నేపథ్యంలో శ్రీ మండలి బుద్ధ ప్రసాద్, శ్రి గుత్తికొండ సుబ్బారావు, డా॥జి.వి. పూర్ణచంద్ గార్ల సంపాదకత్వంలో  విక్టరీ పబ్లికేషన్స్ వారు ప్రచురించిన 'తెలుగు పసిడి'- ఆంధ్రప్రదేశ్ లో 50 సంవాత్సరాల నాస్తిక, హెతువాద ఉద్యమం - శ్రీ లవణం- పు.367 - 371)

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...