Showing posts with label Short Stories. Show all posts
Showing posts with label Short Stories. Show all posts

Monday, February 22, 2021

వల - కథానిక -కర్లపాలెం హనుమంతరావు - ఆంధ్రభూమి ప్రచురితం






 

శారద ఆ టైములో రావడం ఆశ్చర్యం అనిపించింది.

ఇంట్లో ఎవరూ లేరు. సుమతి కాలేజీకి వెళ్లిపోయిందిరఘు పొద్దున్నే డ్యూటీకి వెళ్లిపోయాడుతను చేసేది ఆలిండియా రేడియోలో ఉద్యోగం

నేనూ ఆఫీసుకు బయలుదెరే హడావుడిలో ఉన్నాను. 'ఇదేమిటమ్మా! ఈ వేళప్పుడు వచ్చావ్?' అనడిగాను భోజనానికి కూర్చోబోతూ

మాట్లాడలేదుతలొంచుకు కూర్చుంది అక్కడే ఉన్న కుర్చీలోమాటి మాటికీ కళ్లు తుడుచుకోవడం  గమనించాను

విషయమేదో సీరియస్సే.

రెండు నిమిషాలు వెక్కిళ్లు పెట్టి చెప్పింది చివరికి 'వాడీ మధ్య ఆడపిల్లలతో తిరుగుతున్నాడన్నయ్యా!'

'వాడంటే ఎవరూ?'

'మురళి'

మురళి నా మేనల్లుడుకంప్యూటరింజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడిప్పుడుమనిషి మంచి చురుకుకారెక్టర్ కూడా మంచిదేనే! కానీఇదేమిటీకన్నతల్లే ఇట్లా చెబుతోంది.. వాడేదో తప్పు చేసినట్లు?!'

ఆడపిల్లలతో స్నేహం చేస్తేనే తప్పు పట్టేటంత సంకుచితంగా ఉండవే మా కుంటుంబాలలో ఆలోచనలు! ఇంకేదో ఉంది

'విషయమేంటో చెప్పు! నా కవతల ఆఫీసుకు టైమవుతుందిఅన్నాను గాభరా అణుచుకుంటూ

బట్టలు మార్చుకుని తన ఎదురుగా వచ్చి కూర్చున్న తరువాత చెప్పింది శారద 'ఈ టైములో అయితే ఇంట్లో ఎవరూ ఉండరని తెలిసి వచ్చానురా! మరీ లేటనుకుంటే ఓ గంట పర్మిషన్ తీసుకోరాదూ! ప్లీజ్.. నా కోసం! నీకు కాక ఇంకెవరికి చెప్పుకోవాలీ బాధ?' అంటూ మళ్లీ కళ్ల నీళ్లు పెట్టుకుందదిఆఫీసుకు ఫోన్ చేసి వచ్చి కూర్చున్నాను 'ఇప్పుడు చెప్పు! మురళి మీద నీకు డౌటెందుకొచ్చిందసలు?' పొద్దున వాడి రూము సర్దుతుంటే వాడి పుస్తకాల మధ్య  దొరికిందన్నయ్యా!అంటూ  పింక్ కలర్ కవరొకటి అందించింది శారద

విప్పి చూస్తే ఉత్తరంతో పాటు ఓ  ఫొటోఫొటో వెనక 'నీ శశిఅని రాసి కనిపించింది.ఉత్తరం ఆ శశి రాసిందని అర్థమవుతూనే ఉంది. దాన్నిండా లేటెస్ట్ మార్క్ శృంగారం ఒలకపోతే

'ఎవరీ శశి?' అనడిగాను

'నాకూ తెలీదురాఅడ్రస్ ఉందిగా! ఒకసారెళ్లి నాలుగు  వాయించి వద్దామనుకుంటున్నా! నువ్వూ తోడు రావాలిఅందు కోసమే వచ్చా!'అంది

'బావగారికేమీ చెప్పలేదా?' అనడిగాను

'చెప్పాలనే చూశా! ఎవాయిడ్ చేస్తున్నారెందుకో! ఎంత సేపటికీ .. తనూ.. తన హాస్పిటలూ.. ఈ మనిషికిఈ రోజుల్లో ఇవన్నీ మామూలే! అని కొట్టిపారేస్తున్నారు కూడాఅందామె కళ్ళు మరోసారి తుడుచుకుంటూ

'అదీ ఒక రకంగా నిజమేనేమో! నువ్వు వూరికే మురళి మీద అపోహ పడుతున్నావేమోనే!'

'కొన్ని రోజులుగా మురళిలో చాలా మార్పు వచ్చిందన్నయ్యా! ఇంటి పట్టున సరిగ్గా ఉండటం లేదుఉన్నా ఎంత సేపటికీ ఆ గదిలోనే మగ్గడం! ఎప్పుడు ఎవరితోనో ఫోనులో గుసగుసలు! వచ్చే ఫోన్లు కూడా అట్లాగే ఉంటాయిఫోన్లతోనే కాలమంతా గడచిపోతోందిచదువు మీద శ్రద్ధ తగ్గిందిఇట్లాగయితే కెరీరేం గాను?అడిగితే ఊరికే కస్సుబుస్సుమంటున్నాడుచెల్లి ప్రీతితో ఎంతో ప్రేమగా  ఉండేవాడుఇప్పుడైతే దాని పొడే గిట్టటం లేదన్నయ్యా! డబ్బు బాగా దుబారా చేసేస్తున్నాడురాత్రిళ్లు కూడా లేటుగా ఇంటికి రావడంఒక్కోసారైతే వాళ్ల నాన్నగారి కన్నా లేటుగా వస్తున్నాడుఅయినా ఆయనేమీ అడగడం లేదునాకు పిచ్చి పట్టినట్లుంటోదీ మధ్య!వెక్కి వెక్కి ఏడిచే శారదను చూసి బాధేసింది

'ఈ కాలంలో కుర్ర సజ్జంతా అంతేనమ్మాయ్! మా రఘుగాడితో మేమూ పడ్డాం కొన్నాళ్లువాళ్లమ్మ కూడా ఇదిగో ఇట్లాగే బెంబేలు పడిపోయిందప్పట్లో! ఇప్పుడంతా సర్దుకుపోలేదూ! ఇదీ అంతేనేమోలే!సముదాయించడానికని ఏదో చెప్పాను

'ముందు నేనూ అట్లాగే అనుకున్నానురా! కానీ రోజు రోజుకూ పెడసరితనం పెరుగుతున్నదే కాని .. తగ్గుముఖం పట్టే సూచనల్లేవుతల్లిని.. నా మనస్సెట్లా ఊరుకుంటుంది చెప్పు! ఈ ఉత్తరమొక్కటే అయితే అదో దారిరా...' అని కొద్దిగా తటపటాయించి ఇంకో కవరిచ్చింది నా చేతికి. 'ఖర్మ! తల్లి నయినందుకు ఇవన్నీ భరించాలి కాబోలుఇప్పుడు కాదుతర్వాత చూసుకో.. నేను పోయిన తర్వాత'  అంది

అప్పటికే ఆమె ముఖమంతా ఎర్రగా అయిపోయింది అవమానభారంతో

చేత్తో తడిమితే అర్థమయింది.. అది నిరోధ్ పాకెట్!

'పొద్దున మురళి గాడి టేబుల్ సొరుగులొ దొరికిందిఇక ఉండబట్ట లేక  నీ దగ్గరకు పరుగెత్తుకొచ్చాఅని భోరుమందిమురళీగాడు చాలా దూరం వెళ్లాడే! బావగారేమీ పట్టించుకోకపొవడం ఆశ్చర్యంగా ఉందిచెల్లెలి కుటుంబాన్ని ఆదుకోవడం అన్నగా నా బాధ్యత అనిపించింది. 'రెండు రోజుల్లో నేను మేటర్ సెటిల్ చేస్తాగా! నువ్వురికే బాధ పడవాక' అన్నాను.

ఆ ఆశతోనే ఇక్కడికొచ్చిందన్నయ్యా!'అని లేచి నిలబడింది శారదశారదను వాళ్లింట్లో డ్రాప్ చేసి నేనాఫిసుకు వెళ్లిపోయాను

సుబ్రహ్మన్యమనీ నా బాల్య స్నేహితుడుఆప్త మిత్రుడు కూడాకమర్షియల్ ఆర్ట్ లైన్లో ఉన్నాడుసాయంత్రం వాడిని కూర్చోబెట్టి వివరంగా అంతా చెప్పి సలహా ఆడిగానురెండు నిమిషాలు ఆలోచించి 'రేపు.. ఆదివారంమనిద్దరం ఒకసారి ఆ  పిల్ల ఇచ్చిన అడ్రస్ కు వెళ్లి వద్దాంరా' అన్నాడు సుబ్రహ్మణ్యం. 

ఉత్తరంలోని అడ్రస్ కనిపెట్టడం కాస్త కష్టమయిందిఇల్లు ఒక సన్నటి సందులో ఉందిపెంకుటిల్లులోవర్ మిడిల్ క్లాస్ వాతావరణంఇంట్లో ఎవరెవరో ఉన్నారుమేం వెళ్లి కూర్చున్న పది నిమిషాలకు గాని ఆ అమ్మాయి ఊడిపడలేదుమా ముందుకు రావడానికి శ్రద్ధగా అలంకరణ చేసుకోవడానికి ఆ టైము పట్టినట్లు అర్థమయింది

ఏ మాటకామాటే పిల్ల నదురుగా ఉందిమురళి లాంటి వయసులో ఉన్న మగపిల్లలు ఆమె వలలో పడ్డంలో ఆశ్చర్యం లేదుఆ అమ్మాయి చొరవ చుస్తే అట్లాగుంది మరి

'మీ మురళీని చూస్తే నాకు జలసీగా ఉంది గురూ!అన్నాడు చిన్నగా ఆమె కాఫీలకని లోపలకు వెళ్లినప్పుడు సుబ్రహ్మణ్యం

'నీ బొందముందు వచ్చిన పని చూడు!అని నేనే మందలించా వాడిని

 'నేనో  టీ.వీ సీరియల్ చేస్తున్నానుఅందులో హీరోయిన్ రోలుకు మీరయితే బాగుంటుంది అనిపించిందిఅన్నాడు సుబ్రహ్మణ్యం శశి కాఫీ కప్పులతో తిరిగొచ్చింతరువాత.

'మీరు నన్నెక్కడ చుశారు?' అని ఆశ్చర్యంగా అడిగిందా అమ్మాయి

'డాక్టర్ కరుణాకర్ గారి హాస్పిటల్లోనేను అక్కడ ట్రీట్ మెంట్ కని వచ్చినప్పుడు మిమ్మల్ని ఛూశానువాళ్లే ఇచ్చారు ఈ అడ్రస్ఇతను నా పార్ట నర్రామచంద్రరావు.మిమ్మల్ని చూపించినట్లుంటుందిమీరు ఒప్పుకుంటే అతని ఎదుటే టర్మ్స్ మాట్లాడుకున్నట్లూ ఉంటుందని నేనే వెంటబెట్టుకొచ్చానుఅన్నాడు సుబ్రహ్మణ్యం

సుబ్రహ్మణ్యం వడుపుగా విసిరిన వలలో పడినట్లే ఉంది చేప్పిల్ల. 'మీ టర్మ్స్ ఏమిటో చెప్పండి ముందుఅంది ఆమె కుతూహలంగా

'మీ పెద్దవాళ్లను కూడా పిలవండి! మాట్లాడుకుందాం!అన్నాడు సుబ్రహ్మణ్యం

'అక్కర్లేదులేండినేనేం చేసినా మా అమ్మా నాన్నా కాదనరు.  నిజానికి నాకు నాలుగు రాళ్లు ఎక్కువ వస్తాయంటే ముందు సంతోషపడేదీ వాళ్ళే! ఏట్లా వచ్చాయని కూడా అడగరుఅంత నమ్మకం నా మీద' అంది శశి. 

అక్కడే మంచం మీద పడుకొని ఉన్నాడామె తండ్రిదగ్గుతున్నాడు ఉండుండీఏదో జబ్బులాగా ఉందికాఫీ కప్పులు తీసుకువెళ్లదానికని వచ్చిందామె తల్లికూతురు చూపులను అనుసరించి తహతహలాడుతూ ఆమె తిరగడాన్ని బట్టే అర్థమవుతుంది.. శశి ఆ ఇంట్లో పూర్తిగా స్వతంత్రురాలని

'మీరు హాస్పిటల్లో చేసే ఉద్యోగానికి కొంత కాలం సెలవు పెట్టాల్సి వస్తుందిఅన్నాడు సుబ్రహ్మణ్యం

'నో ప్రాబ్లం'

'డాక్టర్ గారు ఒప్పుకుంటారా?’

'ఒప్పుకుంటారు సాధారణంగాఒప్పుకోకపోతే ఆ నర్స్ జాబ్ కి  రిజైన్ చెయ్యడానికైనా నేను రెడీనే!అందామె దృఢంగా

'బంగారంలాంటి ఉద్యోగాన్ని వదులుకోవడమెందుకులీవ్ తీసుకోండి.. సరిపోతుంది!'

'ఇలాంటి ఉద్యోగాలు వస్తూ ఉంటాయిపోతు ఉంటాయి సార్! ఇది నా మొదటి ఉద్యోగం కాదుఇదే చివరిదీ కాబోదునాకు నా కెరేర్  ముఖ్యం'

కెరీర్ కోసం ఏమైనా చేసే తెగువ ఆమెలో కనిపిస్తూనే ఉందిసుఖం కోసంపై అంతస్తు కోసం పరితపిస్తున్నది కనకనే మురళి లాంటి హోదాగాల ఇంటి కుర్రాడికి వల విసిరింది

మళ్లీ ఆదివారం కలుస్తామని చెప్పి వచ్చేశాం

సుబ్రహ్మణ్యానికి నిజంగానే టీ.వీ సీరియల్ తీసే ఆలోచన ఉన్నట్లు అప్పుడు తెలిసింది నాకు. 'శశిని నిజంగానే బుక్ చేద్దామనుకుంటున్నానురాఅన్నాడు బైటికొచ్చిన తరువాత

'షూటింగ్ కోసం బైట ఎక్కడెక్కడో తిరగాలి ఓ రెణ్ణెల్లుఈ లోపు ఆ పిల్ల మీ మురళిని పూర్తిగా మర్చిపోతుందిలే. నాదీ గ్యారంటీఅని హామీ కూడా ఇచ్చేశాడు

ఈ చల్లని కబురు శారద చెవిలో వేశాను

'ఈ రెండు నెలలు మురళిని క్లోజ్ గా వాచ్ చెయ్యి! వాడు మళ్లీ మనుషుల్లో పడేటట్లు చూసే బాధ్యత నీదే! ఆ పిల్ల కాంటాక్ట్ లోకి రాకుండా చూసే పూచీ సుబ్రహ్మణ్యానిదిఅలాగని వాడు హామీ ఇచ్చాడు కూడా!'అన్నాను. 'సుబ్రహ్మణ్యంగారికి నా తరుఫున థేంక్స్ చెప్పరా!అంది శారద సంబరంగా

సుబ్రహ్మణ్యం షూటింగ్ మొదలుపెట్టాడువారం రోజుల్నుంచి వాళ్ళు అరకులో ఉన్నారు గానీ ఆచూకీ బైటవాళ్లకు తెలీకుండా జాగ్రత్తపడ్డాడు సుబ్రహ్మణ్యం.. 

ఒకరోజు సుబ్రహ్మణ్యం నుంచి ఓ కవరొచ్చిందిచింపి చూస్తే ఉత్తరంతో పాటు కొన్ని కాగితాలు

'శశి దొరకడం నిజంగా చాలా అదృష్టంరా! బాగా యాక్ట్ చేస్తోందిమీ బావగారి హాస్పిటల్ని పూర్తిగా మర్చిపోయిందినిజంగా మీ బావగారికిది పెద్ద షాకే! దీంతో పాటే పంపించిన లవ్ లెటర్లు చూడు! నీకే తెలుస్తుందంతా! అడిగితే శశే ఇచ్చేసింది ఉత్తరాలుఇప్పుడు నేనేమడిగినా ఇచ్చే నిషాలో ఉందిలే ఈ అమ్మాయిఇవి ఈ పిల్ల దగ్గరుండడం డేంజరని నీకు పంపిస్తున్నా!' అని ఫోనులో చెప్పాడు సుబ్రహ్మణ్యం.

అవన్నీ ప్రేమలేఖల్లాంటి ఉత్తరాలే! శశికి మురళి రాసినవి కావుమురళి తండ్రి డాక్టర్ కరుణాకర్ శశికి రాసినవిపేరు లేకపోతేనేం.. దస్తూరీని బట్టి సులువుగా పోల్చుకోవచ్చు

తన దగ్గర పనిచేసే నర్సును ప్రేమ పేరుతో లోబరుచుకోవాలనుకునే బావగారు.కెరీర్ కోసం ఎంతకైనా తెగించే ఆ అమ్మాయి.. 

'పాపం.. శారద!అనిపించింది నాకా క్షణంలో

'ఇట్లాంటి సంగతులు అమ్మకెట్లా చెప్పాలో తెలీకే నేనో దొంగ ఉత్తరం సృష్టించి నా రూములో అమ్మ కంట పడేటట్లు పెట్టింది మామయ్యా! అమ్మకు తెలిస్తే ఎట్లాగూ ఊరుకోదుఆ రాక్షసిని వెళ్లగొట్టే దాకా ఏదో ఒకటి చెయ్యకుండా ఉండదని తెలుసు కనకనే ఇట్లా చేశాం నేనూ ప్రీతీ! అమ్మ వైపు ఉన్నట్లుంటూనే నేను చెప్పినట్లు నాటకం రసవత్తరంగా నడిపించింది చెల్లి. లేకపోతే నాకా దయ్యంతోనా  గిల్లికజ్జాలు! నెవ్వర్!అన్నాడు మురళి విడిగా నేను పిలిపించి ఆడిగినప్పుడు.. భళ్ళున నవ్వేస్తూ! నేను షాక్!

తేరుకుని 'ఈ సంగతి ఇప్పుడు మీ అమ్మకు తెలిస్తే..'

'ఏడుస్తుందిఅమ్మ అట్లా ఏడవకూడదనేగా ఇంత దరిద్రమైన నాటకానికి తెరలేపింది.. సారీ.. మామయ్యా ,, నాన్నను పూర్తిగా దారిలోకి తేవాలి ముందు. దానికి.. నీదీ నీ ఫ్రెండుదీ సహకారం ఎంతో అవసరం!అన్నాడు మురళి. ఆప్యాయంగా  దగ్గరకు తీసుకున్నా చెల్లి కొడుకును.

-కర్లపాలెం హనుమంతరావు

(ఆంధ్రభూమి సచిత్రమాస పత్రిక, అక్టోబర్, 2002 సంచికలో ప్రచురితం)


 

 

Saturday, February 13, 2021

చిన్న కథః ఉరుము కథ -కర్లపాలెం హనుమంతరావు

  



దేవుడు, మనిషిదానవుడు అని బ్రహ్మదేవుడికి ముగ్గురు కొడుకులు.

దేవుడు ఒక రోజు తండ్రి దగ్గరకు వచ్చి 'జీవితంలో ఉపయోగించే ఏదైనా మంచి మాట ఒకటి చెప్పమ'ని ప్రార్థించాడు. 

'మాట కాదు. ఒక శబ్దం చెబుతాను.. అర్థం చేసుకుని ఆచరణలో పెట్టు!’ అంటూ 'అనే శబ్దం బోధించాడు బ్రహ్మ దేవుడు. దేవుడికి పరమానందమయింది." '' అంటే దమగుణం.. అనేగా నీ భావం తండ్రీ! నాకు దమగుణం(చెడును అణిచే గుణం) లేదనేగా నీ ఫిర్యాదు! అది  అలవర్చుకోమన్న మీ సలహా అవశ్యం పాటిస్తాను!'అని వెళ్ళిపోయాడు దేవుడు

మనిషీ బ్రహ్మదేవుణ్ణి సమీపించి అదే విధంగా జీవితానికి పనికొచ్చే మంచి్ముక్క ఏదైనా  చెప్పమని ప్రార్థించాడు. 'దేవుడికి చెప్పిందే నీకూను. ‘ద’ శబ్దం అంతరార్థం అర్థంచేసుకుని ఆచరించు!అని యథాప్రకారం  సలహా ఇచ్చాడు బ్రహ్మదేవుడు. మనిషికీ మహాసంతోషమయింది. '' అంటే దానగుణం అనేగదా తండ్రీ మీ భావం? తప్పకుండా  దానగుణాన్ని అలవర్చుకుంటాను. తండ్రికి తగ్గ బిడ్డగా పేరు తెచ్చుకుంటానుఅని ప్రమాణం చేసి వెళ్ళిపోయాడు మానవుడు. 

ఈ సారి దానవుడి వంతు వచ్చింది. 'దానవా! నీ అన్నల్లాగా నువ్వూ 'శబ్దం భావం బాగా  గ్రహించి  ఆచరణలో పెట్టు! అభివృద్ధిలోకి రా!’అని బోధించాడు బ్రహ్మదేవుడు. 'చిత్తం తండ్రీ!' మీఆజ్ఞ! 'శబ్దానికి దయాగుణం అనేగదా తమరి అర్థం? తప్పకుండా ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నిస్తానుఅని తండ్రికి వాగ్దానం చేసి నిష్క్రమించాడు దానవుడు. 

వాగ్దానాలైతే చేసారు గాని.. కాలక్రమేణా వాటిని మర్చిపోయారు బిడ్డలంతా. బ్రహ్మదేవుడికి అంతులేని దుఃఖం ముంచుకొచ్చింది. ఆ దుఃఖమే అప్పుడప్పుడూ కురిసే వర్షం. మధ్య మధ్యలో  'ద.. ద.. దఅంటూ  కన్నబిడ్డలకు వాళ్ళు మర్చిపోయిన దమదానదయా గుణాలనిగూర్చి  బ్రహ్మదేవుడు గుర్తుచేయడానికి చేసే ప్రయత్నమే ఉరుములు! ***

కర్లపాలెం హనుమంతరావు

(బృహదారణ్యకోపనిషత్తు సప్తమాధ్యాయం- ద్వితీయ బ్రాహ్మణం ఆధారంగా చెప్పిన పిట్టకథ)

 

పాప ఇచ్చిన సందేశం చిన్న కథ - కర్లపాలెం హనుమంతరావు

 



ఉమ్మడి కుటుంబం లో అత్తారింట్లో పెట్టే ఆరళ్ళు తల్లికి చెప్పుకుందామని పుట్టింటి కొచ్చింది కల్పన కూతురు తో సహా.అపిల్లకి ఏడేళ్ళు. తల్లితో మాట్లాడనీయకుండాఒకటే అల్లరి చేస్తుంది.

ఆ గోల భరించ లేక గోడ మీడున్న ప్రపంచ పటం తీసి ముక్కలు ముక్కలు గా చించి "వీటినన్నింటిని మళ్ళి ఒక షేపు లోకి తీసుకొంచ్చిన దాక నా జోలికి రావద్దు" అని పని పురమాయించింది. ఆ రాకంగానయినా కాస్సేపు తల్లితో ప్రశాంతంగా మాట్లాడనిస్తుందేమోనని ఆశ. 

ఐదు నిముషాలు కూడా కాకుండానే పాప అతికించిన పటం పట్టుకొచ్చేసింది.

అంత తొందరగా ఎలా పెట్టింది?!

ఆ మాటే పాపను అడిగితే "ఇందులో ఏముందే అమ్మా! పటం వెనక నువ్వ్వు ఇదివరకు వేసిన పాప బొమ్మ ఒకటుంది కదా!..దాన్ని బట్టి టకటక పెట్టేసా" అనేసింది.

ఆలోచనలో పడింది కల్పన.

'ఆరళ్ళు పెట్టే అత్తగారు తనకు వంట్లో నలతగా వుంటే ఆసుపత్రికి తీసుకుని వెళ్ళిన దాక కొడుకుతో దెబ్బలాడటం గుర్తుకొచ్చింది .తంటాలు పెడుతుందనుకునే తోడికోడలు తాను పది రోజులు ఆసుపత్రిలో వుంటే వేళ తప్పకుండ పథ్యం తయారుచేసి స్వయంగా ఆసుపత్రికి తెచ్చి తిన్న దాక దగ్గ్గర నుంచి కదలక పోవటం గుర్తు కొచ్చింది. అస్తమానం అల్లరి పెట్టే ఆడపడుచు అవసరానికి రక్తం ఇచ్చి ఆదుకోవటం గుర్తుకొచ్చింది.ఊరునుంచి వచ్చి మూడు రోజులు కూడా కాకుండానే ఇంటికి పోదామని పాప ఎందుకు మారాం చేస్తుందో ఇప్పుడు అర్ధమయింది కల్పనకు. 

ఏ విషయాన్నయినా పాజిటివ్ కోణం లో చూడాలనే సందేశం పాప నోటితో చెప్పకుండానే పటం ద్వార చూపించినట్లయింది.

తల్లికి ఇక తన గొడవలు చెప్ప  దలుచుకోలేదు. 

ఆ సాయంత్రమే అత్తగారింటికి బయలు దేరింది. 

- కర్లపాలెం హనుమంతరావు 

బోథెల్ ; యూఎస్ఎ 

15 -02-2021  


 

 

 


Monday, February 8, 2021

ట్రాజెడీ ఆఫ్ ఎర్రర్స్- కామెడీ కథ - కర్లపాలెం హనుమంతరావు

 


టీఈ సీరియల్ కమర్శియల్ బ్రేక్ లో రాంబాయమ్మగారికి గుండెపోటొచ్చిందిఎపిసోడయిందాకా కదలనని మొండికేయడం వల్ల గుండెకొచ్చిన ప్రమాదం మరింత హెచ్చింది

ఐదు నక్షత్రాల ఆసుపత్రిఅనుభవజ్ఞులైన వైద్యులు.. సంగతెలా ఉన్నా టీవీ uసోపులమీదున్న  అకుంఠిత అభిమానం ఆమె ప్రాణాలని నిలబెట్టింది

ఆపరేషన్ టేబుల్ మీదున్నప్పుడు  రాంబాయమ్మగారికి దేవుడితో చిన్న భేటీ అయిందిదైవ దర్శనం కాగానే ఆమె దేవుణ్ణి అడిగిన మొదటి ప్రశ్ననాకింకా ఎంతకాలం భూమ్మీద నూకులున్నాయ'ని

'నలభై మూడేళ్ల రెండునెల్ల మూడురోజులమీద నాలుగ్గంటలా ఐదు నిమిషాల ఐదు సెకన్లుఅన్నాదు దేవుడుదేవుడిమాటమీద గురితోనే రాంబాయమ్మగారు ఆపరేషను సక్సెసయిందనిపించి ప్రాణాలతో లేచికూర్చున్నారు

'ఎలాగూ  మరో అర్థశతాబ్దం బతకబోతున్నాం గదాఇంకా ఈ ముడతలుబడ్డ ముఖంబాన కడుపుముగ్గుబుట్ట జుట్టుబోసి నోరువంగిన నడుంతో ముసిల్దానిలాగా ఎందుకు బతుకు నిస్సారంగా గడపాలిమానవజన్మ మళ్ళీ మళ్లీ రాబోతుందాఅందులోనూ ఆడజన్మే దొరుకుతుందన్న గ్యారంటీ ఉందాఅన్నీ ఉండి అనుభవించేందుకు కట్టుకుపోయినంత ఆస్తి తనకుమాదిరిగా ఎంతమందికి ఉందిఅడ్డుచెప్పే కట్టుకున్నవాడూ భూమ్మీదలేని అదృష్టం  తనది.' అన్నివిధాలా అచ్చొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న దృఢనిశ్చయానికొచ్చింది రాంబాయమ్మగారు.

గుండాపరేషనైన ఆసుపత్రిలోనే ఫేస్ లిఫ్టింగ్ఫ్యాట్ సక్కింగ్ప్లాస్టిక్ సర్జరీడెంటల్ రికవరింగ్హెయిర్ ట్రాన్స్ ప్లాంటింగ్.. వగైరా వగైరా ఓ పది లక్షలు పారేసి  టోటల్లీ బాడీ రీమోడలింగు చేయించేసుకుంది రాంబాయమ్మగారుపది లక్షలు పోతే పోయాయిగాని.. రాంబాయమ్మగారిప్పుడు  రంభను తలదన్నే మోడల్ గా మెరిసిపోతోంది.

ఆ ఉత్సాహంలో ఆఖరి ఆపరేషన్ కూడా  విజయవంతంగా ముగించుకుని ఆసుపత్రి బైటకొచ్చి రొడ్డు దాటుతుండగా లారీ ఒకటి దూసుకొచ్చి రాంబాయమ్మగారిని లేపేసింది.

మళ్ళీ దేవుదిగారితో భేటీ తప్పింది కాదుభగవంతుణ్ణి చూడంగానే భగభగ మండింది రాంబాయమ్మగారికికడుపులోని కోపాన్నంతా వెళ్లగక్కుతూ 'నలభైముడేళ్లకు పైగా ఆయుర్దాయం ఉదంటివే?మీ  దేవుళ్ళూ మా లోకంలోని రాజకీయ నాయకులకు మల్లే మాటమీద నిలబడకపోతే ఎలాగయ్యాముల్లోకాలకింకేం గతి?' అని ఎడపెడా వాయించడం మొదలుపెట్టింది దేవుడు కంటపడీ పడకముందే రాంబాయమ్మగారు.

'సారీ!రాంబాయమ్మగారూలారీ గుద్దింది ఎవరో రంభననుకున్నాను.. రాంబాయమ్మగారిననుకోలేదుఅని నాలిక్కరుచుకున్నారు దేవుడు గారు!

- కర్లపాలెం హనుమంతరావు 

( చతుర్ మాసపత్రిక ప్రచురణ ) 

***

Friday, December 11, 2020

శ్రీ సి. ఎన్. చంద్రశేఖర్ - ' విశ్వం ' - కథానిక ; ఈనాడు ఆదివారం అనుబంధం 16 నవంబర్ 2008 సంచికలో ప్రచురించిన కథ పై నా పరామర్మ


శ్రీ సి. ఎన్. చంద్రశేఖర్ - ' విశ్వం ' - ఈనాడు ఆదివారం అనుబంధం 16 నవంబర్ 2008 సంచికలో ప్రచురించిన కథ అప్పటి కాలానికి సంబంధించిన ఆఫీసుల కంప్యూటరైజేషన్ అనే ఇతివృత్తం చుట్టూ తిరుగుతుంది. 

రచయిత కథలో ప్రదర్శించిన ' ప్రీ - కంప్యూటరైజేషన్ ' వాతావరణం మానవ సంబంధాలలోని  తళతళలు కనిపిస్తాయి. ఆఫీసుల యంత్రీకరణ  -  ఆర్థిక పరమైన భారం కుదించుకునే ఉద్దేశంతో యాజమాన్యాల వైపు నుంచి  కొత్త శతాబ్ది ఆరంభంలో మొదలైన ప్రణాళిక. ప్రారంభంలో జాతీయ బ్యాంకులు ఈ విధానం వైపు మొగ్గు చూపాయి. అప్పటికే లెక్కకు మించిన వసూలుగాని మొండి  బకాయిల భారంతో కుంగివున్న బ్యాంకులు రుణగ్రహీతలు ఉన్నత వర్గాలకు చెందిన కారణంగా సక్రమంగా లిటిగేషన్లు నడపించలేక .. నిర్వహణ ఖర్చులు తగ్గించుకునే నిమిత్తం అధిక మొత్తంలో జరిగే సిబ్బంది జీతభత్తేల చెల్లింపులను తగ్గించుకునే నిమిత్తం స్వచ్ఛంద పదవీ విరమణ స్కీమును ప్రవేశపెట్టట౦ జరిగింది. ప్రాథమికంగా సిబ్బంది వర్గాల నుంచి ఎంతో కొంత ప్రతిఘటన  చవిచూసినప్పటికీ యాజమాన్యాలు వాలంటరీ రిటైర్ మెంట్ స్కీమును దిగ్విజయంగా అమలు చేసాయి. ఈ పరిణామాల అనంతరం సిబ్బందిని తగ్గించుకునే పద్ధతులను దాదాపు అన్ని ప్రభుత్వ ప్రయివేట్ సంస్థలు ముమ్మరం చేసిన నేపథ్యంలో నడిచినదీచంద్రశేఖర్ గారి  ' విశ్వం' కథ. 

రచయిత కథలో ప్రధానంగా చెప్పదలుచుకున్నది యంత్రీకరణ ముందు కార్యాలయాలలో సిబ్బంది మధ్య నెలకొన్న సానుకూల మానవసంబంధాల పార్శ్వం మాత్రమే. క్రమశిక్షణకు కట్టుబడి సిబ్బంది ఆఫీసుపని ఎట్లా చేసుకుపోవాలని బైటి ప్రపంచం అభిలషిస్తుందో రచయిత విశ్వం అనే ఆదర్శ పాత్ర ద్వారా చెప్పుకుంటూ వచ్చారు. విశ్వం పనికి కట్టుబడి ఉండడమే  కాకుండా, సాటి ఉద్యోగుల మంచి చెడుల పట్ల చక్కటి 'కన్సర్న్' ఉన్న ఉద్యోగి. పనే అతనికి ప్రాణం . అయినప్పటికీ ఇంటిని నిర్లక్ష్యం చేసే తత్వం కాదు. ఇంటిపట్టునా భార్యా బిడ్డల పట్ల ఎంతో బాధ్యతగా ప్రవర్తించే విశ్వం బంధుమిత్రుల అవసరాలకు ఆదుకునేందుకు అందుబాటులో ఉండే నిమిత్తం ప్రతిభ, అవకాశం దండిగా ఉండీ  పదోన్నతులకు ఎగబడడు. స్వంత పనుల నిమిత్తం ఆఫీసు వనరులు దుర్వినియోగం చేయని ఆ చిరుద్యోగి ఆఫీసు  అవసరాలు తీర్చడం కోసం సొంత డబ్బులు వెచ్చిస్తుంటాడు ! అంతటి మంచి మనసు గల విశ్వం హఠాత్తుగా 'వాలంటరీ రిటైర్ మెంట్' కు దరఖాస్తు చేసుకుని ఆశ్చర్యం కలిగిస్తాడు. అవసర పడినప్పుడు పనిగంటలు మించి ఉచితంగా పనిచేసే విశ్వం మరో ఐదేళ్ల పదవీ కాలం మిగిలున్నా స్వచ్ఛందంగా విధుల నుంచి తప్పుకోవాలనికి కారణం అందరూ ఊహించినట్లు పెరిగిన పని వత్తిడి ఒక్కటే కారణం కాదు ;  కార్యాలయంలో కంప్వూటర్ల ముందు కాలం నాటి మంచి వాతావరణం లేకపోవడం .. ఉద్యోగుల మధ్య సున్నితమైన  మానవసంబంధాలు మృగ్యమవడం ! - అంటారు రచయిత! 

ప్రభుత్వ,ప్రయివేట్ కార్యాలయాలలో కంప్యూటర్లు  ప్రవేశించిన అనంతరం కూడా పెరుగుతున్న తాత్సారాలు, పనిచేసే సిల్బుంది దురుసు ప్రవర్తనలు, సరిచేయడానికి వీలులేనంత భారీ మొత్తాలలో దోషాలు వంటివే ఎక్కువగా వినిపించే ఈ కాలంలో రచయిత విశ్వం పాత్ర ద్వారా పాఠకుడికి చెప్పదలుచుకున్న సందేశం ఏమిటి? అన్న సందేహం కథంతా చదివిన పాఠకుడికి కలగడం సహజం. 

ఉద్యోగ విరమణ అనంతరం మానసికంగా కుంగిపోయిన విశ్వం పాత్రలో తిరిగి ఉత్సాహం నెలకొల్పేందుకై  రచయితకు తట్టిన పరిష్కారం మరీ అబ్బురం కలిగిస్తుంది. జీతభత్తేలతో నిమిత్తం  లేకుండా ఆఫీసులో పనిచేసుకునేందుకు విశ్యం పాత్ర అర్జీ పెట్టుకోవడం! యాజమాన్యం అంగీకారం మీద విశ్వం తన పని రాక్షసత్వాన్ని సంతృప్తి పరుచుకోవడం! 


ముక్తాయింపుగా నా ఉద్దేశం ఏవిటంటే కథ మొత్తాన్ని ఒక ఫీల్ గుడ్ వాతావరణంలో నడిపించే ఉద్దేశంతో రచయిత ఎత్తుకున్న కథ ఆ కోణంలో వంద శాతం విజయం సాధించింది. కంప్యూటర్ల ముందు - కంప్యూటర్ల తరువాత అన్నట్లుగా చీలిపోయిన మానవ సంబంధాల వాతావరణంలో ఒక బ్యాంకు ఉద్యోగిగా పని చేసిన నాకు రచయిత అన్నీ పచ్చినిజాలే చెప్పినందుకు అభినందించాలనిపిస్తుంది. 

కానీ, విశ్వం లాంటి ఆదర్శ పాత్రల సృష్టే వాస్తవానికి చాలా దూరంగా ఉందన్నది పాఠకుడిగా నా అభియోగం.

రచయిత బహుశా ' మంచినే బోధించుము ' అన్న సూత్రానికి కట్టుబడి కథ అల్లుదామని ప్రణాళిక వేసుకున్న చందంగా ఉంది. అభినందనీయమే ! కానీ ఆ బోధించే 'మంచి'  అంతిమంగా ఏ  వర్గానికి ఎక్కువ మేలు చేస్తుంది ? అన్న అంశం మీదా రచయిత దృష్టి పెట్టి ఉండవలసింది! 

విశ్వం అనే ఒక మానవీయ  పాత్ర సృష్టి వరకు రచాయిత శ్రీ ' సి. ఎన్. చంద్రశేఖర్ నిశ్చయంగా అభినందనీయులే! 


( శ్రీ సి. ఎన్. చంద్రశేఖర్ - ' విశ్వం ' - ఈనాడు ఆదివారం అనుబంధం 16 నవంబర్ 2008 సంచికలో ప్రచురితం) 

- కర్లపాలెం హనుమంతరావు 

11, డిసెంబర్, 2020 

బోథెల్ ; వాషింగ్టన్ రాష్ట్రం 

యు ఎస్



ఏ 



Thursday, December 10, 2020

తారుమారయింది ! శ్రీ సి.వి.ఎన్. ప్రసాద్ కథానిక ' అబ్బాయి పెళ్లి ' పై నా పరామర్శ ( ఈనాడు – ఆదివారం సౌజన్యంతో )

 

ఒకానొక కాలంలో ఎదిగిన ఆడపిల్ల నట్టింట తిరుగుతుంటే లక్ష్మీదేవి నర్తిస్తున్నంత ప్రసాదంగా ఉండేది ఇల్లంతా. ఆడపిల్ల అనగానే కన్న వారికి మహా మురిపెంగా ఉండటం సహజమే గదా! ' కంటే కూతుర్నే కనాలి ' పేరుతో ఒక పెద్ద హిట్ మూవీ కూడా తీసారు ప్రముఖ దర్శకుడు దాసరి. గడచిపోయిన తమ బాల్యం నాటి కమనీయమైన పాత ముచ్చట్లన్నీ ఆడబిడ్డ రూపేణా మళ్లీ ఉన్నంతలో తీర్చుకోవచ్చని ఆ ఉల్లాసం. ఎన్ని ఆనందోత్సవాలు సంబరంగా చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ చివరికి చిదిపి నట్టింట నిత్యం వెలిగించుకోవలసిన ఆ దీపం మరో ఇంటి జీవన జ్యోతిగ తరలిపోవలసిన తరుణం ఒకటి ఎలాగూ తప్పదు ఎప్పటికైనా . బంగారు తల్లులను ఎంత గారాబంతో పెంచుకున్నప్పటికీ మరో ఇంటికి ధారాదత్తం చేయబోమంటే సమాజమే తప్పు పడుతుంది కూడా . ఆడపిల్లను మరో అయ్య చేతిలో పెట్టే ఆ భారతీయ గృహస్థ జీవన విషాద సౌందర్య ఘట్టాన్ని కాళిదాసు నుంచి కాళ్లకూరి వరకు ఎందరో కవి పండితులు తమ తమ పాండితీ ప్రకర్షలతో తీర్చిదిద్ది సదా మననీయం చేసిపోయారు . కళ్యాణ శోభలో ఆఖరి అంశం అప్పగింతలు.. అది సాకారమవడానికి ముందు కొన్ని దశాబ్దాల కిందటి దాకా చాలా పెద్ద క్షోభ కథే నడిచేది; ముఖ్యంగా సగటు మధ్య తరగతి కుటుంబాలలో.
కాళ్లకూరివారు 1923 ప్రాంతాలలో ఈ ఆడపిల్లల పెళ్లిళ్ల ఇబ్బందులనే ఇతివృత్తంగా ఎంచుకొని 'వరవిక్రయం ' అనే నాటకం సృష్టించారు . ఆ రూపకం మొదటి రంగంలోనే కాళింది, కమల అన్న ఇద్దరు చక్కని చుక్కలను కన్న తల్లి భ్రమరాంబ 'కన్య నొక్కరి కొసగి స-ద్గతులు గాంతు/ మనుచు సంతోషపడు కాల - మంతరించి,/ కట్నములు పోయ జాలక - కన్య నేల/ కంటిమా యని వ్యథపడు - కాల మొదవె!'అంటూ కన్నీరు పెట్టుకుంటుంది. ఒక పెళ్లి , తత్సంబధమైన కట్న కానుకల చుట్టూతానే ఆ నాటకమంతా నడిచినప్పటికీ నిజానికి ఆడపిల్లకు పిండ దశ నుండే ఎన్నో గండాలు ఎదురుగ నిలబడి ఉండేవి ఇటీవలి కాలం వరకు. ఆయా సామాజిక పరిస్థితులను పొల్లుపోకుండా, ఎక్కడా అతిశయం లేకుండా పూసగుచ్చిన చందంగా వివరించిందా ప్రబోధాత్మక నాటకం. ఆ రూపకంలో చెప్పినట్లు ఆడపిల్లల పెళ్లిళ్ల ఈడు దగ్గర పడ్డప్పటి బట్టి కన్నవాళ్ల గుండెల మీద కుంపట్లు రగలడం మొదలయినట్లే .
ఆ తరువాతా కూతుర్ని కట్టుకున్న అల్లుడు దశమ గ్రహ రూపంలో వాయిదాల పద్ధతిలో అత్తింటి వారిని వేపుకు తినడం ఒక సామాజిక హక్కు రూపంలో స్థిరపడ్డ దుస్థితి కలవరపరుస్తుంది. అందుకే కాళ్లకూరి ఇదే రూపకంలో ఆ ఆడపిల్లల తల్లి నోటితోనే - అప్పిచ్చినవాడితోను, ఇల్లు అద్దెకిచ్చినవాడితోను, జీతమిచ్చి పనిచేయించుకునే యజమానితోను , కులం పేరుతో నిందించేవాడితోను, పన్నులు కట్టించుకునేవాడితోను పిల్లను కట్టుకున్న అల్లుడిని పోల్చి మరీ కచ్చె తీర్చుకున్నారు. ఇన్ని బాధలుంటాయి కాబట్టే ఆ బ్రహ్మ విష్ణు రుద్రాదులు కూడా అల్లుళ్లకు హడలి కూతుళ్లను కనడం మానుకొన్నట్లు కవిగారు అంటించినవి చురకలే అయినప్పటికీ, నిత్య జీవితంలో వ్యధకలిగించే పచ్చినిజాల నుంచి పుట్టుకొచ్చినవే ఆ వెటకారాలన్నీ . ఆడదై పుట్టే కన్నా అడవిలో మానై పుట్టడం మేలు - అన్న నానుడి ఉట్రుడియంగా పుట్టుకురాదు గదా! ' తండ్రులకు గట్న బాధయు- దల్లులకు వియోగ బాధయుదమకు నిం-కొకరి యింటిదాస్యబాధయుగల దరి-ద్రపు టాడు బుట్టువే పుట్టరాదని - బుద్ధి నెంతు' అంటూ పురుషోత్తమరావుగారి చిన్న కూతురు కమల ఆకాలంలో పుట్టింది కాబట్టి అట్లా వేదన పడ్డది. ఇప్పడా ఆవేదన పడే తంతు మగవాడి వైపుకు ఎట్లా మళ్లిందో వాస్తవంగా చిత్రించింది ఈ ' అబ్బాయి పెళ్లి ' కథ యావత్తూ.
అవిద్య, అజ్ఞానం, అబలత్వం, సంప్రదాయం, ఆర్థికపరమైన పరాధీనత, సంఘభయం వంటి ఎన్నో సంకెలలు ఇన్ని శతాబ్దాలుగా స్త్రీ జగత్తు పురోగతికి ప్రతిబంధకాలు అవుతూ వచ్చాయి. ఇప్పుడా పరిస్థితిలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మారుతున్న మగవాడి పాత్ర ఆధారంగానే శ్రీ సి.వి.యన్. ప్రసాద్ సృష్టించిన చక్కని చిన్న కథ' అబ్బాయి పెళ్లి ' .
ఆకాశంలో నేనూ సగం - అన్న అంతరంగంలో అణగి పడి ఉన్న స్వాభిమానం బాహ్య ప్రకటన రూపంలో రూపాంతరం చెందే దిశగా స్వతంత్రమైన ఆలోచనలతో నేటి మహిళ అడుగులు ఎంతలా వేగంగా పడుతున్నాయో ప్రపంచం అంతటా ప్రస్తుతం విస్తృతంగా చూస్తున్నాం.
నూతన శతాబ్దిలో అంది వచ్చిన అత్యద్భుతమైన సాంకేతిక జ్ఞానం సాయంతో తన స్థాయి ఏమిటో తెలిసొచ్చి ఇప్పుడిప్పుడే స్పృహలోకొస్తున్న మహిళకు .. అంత: చైతన్య శక్తి కూడా అదే స్థాయిలో వికసిస్తున్న వేళ మునుపెన్నడూ లేనంత పెనువేగంతో మగజాతిని క్రమంగా అధిగమిస్తో ప్రగతి పథం దిశగా స్ఫుత్నిక్కుల వేగంతో దూసుకెళుతున్న వాస్తవం కాదనలేం. ఆ పెనుమార్పుల తాలూకు ప్రభావం సంస్కృతీ సంప్రదాయాలలో సైతం సృష్టంగా కనిపిస్తోంది కూడా . ప్రపంచమంతటా సంభవిస్తోన్న ఈ సాంస్కృతిక పునరుజ్జీవన పరిణామ క్రమానికి భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకూ మినహాయింపుగా కనిపించక పోవడమే ఈ చిన్నకథ ప్రధాన ఇతివృత్తం.
శీలహననం జరిగితే మానమార్యాదల కోసమై నిశ్శబ్దంగా లోలోపలే శిథిలమయ్యే సర్దుబాటు ధోరణి నుంచి దుర్మార్గం నుంచి రక్షణ కోసం గానూ నిర్భయంగా, బహిరంగంగా, కలసికట్టుగా ఎలుగెత్తి ఉద్యమించే చైతన్యం సంతరించుకునే దశ దాకా ఎదిగింది ఇప్పుడు మగువ. గృహాంతర పాలన నుంచి గ్రహాంతరయానం దాకా ఎదిగిరాగల శక్తి సామర్ధ్యాలలో ఆమె తన అసమాన ప్రతిభా పాటవాలతో ఢీ కొంటున్న వైనం మగజాతిని దిగ్భ్రాంతికి గురి చేస్తున్న మాట కాదనగలమా? ఇన్ని శతాబ్దాలుగా.. పుట్టుక, పెంపకం , బాధ్యతలు , హక్కులు, ఆస్తులు పంపకాల వంటి అనేక ముఖ్య జీవితాంశాలలో సమ భాగస్వామ్య విషయకంగా జరుగుతున్న అన్యాయాలను ఇకపై సహించబోయేది లేదంటూ అనేక రకాలుగా ఏకకంఠంతో సంకేతాలను అన్ని కార్యక్షేత్రాల నుంచి బలంగా పంపుతున్నది కూడా ఇప్పటి ఇంతి. ఈ యుగసంధిలో జరుగుతున్న లైంగిక పాత్రల నిర్వహణ తారుమారులో భాగంగానే గత రెండు దశాబ్దాల బట్టి మనదేశంలోనూ మహిళల పరంగా పొడసూపుతున్న పెనుమార్పులు మగలోకపు ఊహలకు ఇప్పటి వరకు అందకుండా మును ముందుకు సాగుతునే ఉన్నాయి .
అర్ధిక క్షేత్రంలో స్వాతంత్ర్యం సముపార్జించుకున్న అనంతరం .. మునుపటి మానసిక బలహీనతలనూ తొలగ తోసుకునే తీవ్ర ప్రయాసలో నేటి మహిళ వివాహబంధం వరకు వచ్చేయడం సమాజంలో స్పష్టంగా కనిపించే విస్తుగొలిపే మార్పు .
నిన్నటిదాకా పెళ్లిని ఒక క్రీడగా భావించే లోకంలో మగవాడిదే మొదటి ఎత్తు-గా ఉండటం చూసాం. ఆ తరహా వ్యవస్థకు అలవాటూ పడిపోయాం. ఆ భావనకు ఇప్పుడు కాలం చెల్లిందంటుంది ఈ ' అబ్బాయి పెళ్లి ' కథ . నచ్చిన జీవిత భాగస్వామిని ఎంచుకోవడం, కాదనుకుంటే మధ్యలో తుంచుకోవడం, మనసు పుడితే మరో భాగస్వామిని అదనంగా ఉంచుకోవడం, యధేచ్ఛగా కోరిక తీర్చుకునే హక్కును ఇదేమని నిలదీసే స్వాభిమానితో బంధం తెంచుకోవడం వగైరా వికృత పోకడలన్ని గతంలో మాదిరి మగవాడికి పుట్టుకతో అబ్బిన హక్కులు కావిప్పుడు. పెళ్లి బజారులో గతం మాదిరి మగాడిప్పుడు అదనపు కట్న కానుకలు, పెట్టు పోతలు పేరుతో చెట్టుసురులకు దిగడం కుదరదు. సరికదా అసలు డౌరీ పేరెత్తే సాహసమే మగపెళ్లివారి నుంచి కనిపించడం అరుదైన సందర్భాలు అబ్బురం కలిగిస్తున్న మాట వాస్తవం .
పెళ్లిచూపుల వంకతో కాబోయే ఇంటి కోడళ్లకు కాదీ కాలంలో శల్య పరీక్షలు. . మగవాడికి ఆ శిక్షలు! అతగాడి నాలుగంకెల జీతానికి గతంలో మాదిరి క్యూలు కట్టడం లేదీకాలపు ఆడపిల్లలు ఎక్కడా ! ఐదొందల నోటొకటి వదిలితే చాలు .. ఆరేడు రకాల డిష్టులతో అప్పటికప్పుడు ఏ డీలక్సు రెస్టరెంటో లగ్జోరియస్ లంచ్ ప్యాక్ చిటికేసే లోపు డెలివరీ చేసే కాలంలో .. వంటొచ్చా ?అని ప్రశ్నేసే మగాడిని అసలు మగాడుగా ఒప్పుకునే మూడ్ లోనే ఉండటం లేదీ మోడరన్ వుడ్ బి బ్రైడ్ . చాకలి పద్దుల చదువులు, హారుమొనీ మెట్టు రాగాలు, అత్తగారి కాళ్లొత్తే వినయాలు, మామగారికి కళ్లెదుట పడలేని బిడియాలు .. టైపు ఆడపిల్లలను కలలోనైనా ఉహించడం కుదరదు. ఆస్తిపాస్తులుండటమే కాదు.. చేసుకునే పిల్లకు తోబుట్టువు లెవరూ ఉండని సంబంధాలకై ఆనాడు మగపెళ్లివాళ్లు వెంపర్లాడినట్లే .. తల్లిదండ్రులు దగ్గరుండని పెళ్లి కొడుకుల కోసం ఆడపిల్లలు ఇప్పుడు ఆరాట పడుతున్నారు! ఆ కధా కమామిషు అంతా సూచ్యార్థం శైలిలో మినోదం ముదరకుండా సహజభాషలో చెప్పుకుపోతుందీ ప్రసాద్ గారి 'అబ్బాయి పెళ్లి ' కథ.
కాలం తన మాయాజాలంతో సంసారమనే నాటకంలో పాత్రల నైజం ఎంతవింతగా తిరగరాసేస్తుందో ఆకళింపు చేసుకొనేందుకైనా ఈనాడు ఆదివారం ప్రత్యేక అమబంధం 30, ఆగష్టు, 2010లో ప్రచరించిన శ్రీ సి.వి.ఎన్. ప్రసాద్ కథానిక ' అబ్బాయి పెళ్లి ' చదివితీరాలి.
పెళ్లికెదిగిన మగపిల్లలు కళ్ల ముందు తిరిగే కన్నవారు చదివితే ఎంతో సహజంగా ఉంది అని నిట్టూర్పు విడుస్తారు. ఆ తరహా గుండెల మీద కుంపట్లు రగలుతుండని అదృష్టవంతులు చదివితే మాత్రం ' మరీ అతిశయంగా ఉంది ' అని పెదవి విరవడమూ ఖాయమే ..
పదేళ్ల కిందటి నాకులాగే!
ముక్తాయింపు: కాలంలో జరిగే మార్పులను యధోచితంగా కళా నైపుణ్యాలకు కొదువ లేకుండా నమోదు చేసే సాహిత్యంలోని ఏ ప్రక్రియ రచన అయినా ఆ ప్రక్రియ వరకు ఉత్తమ శ్రేణిలో కుదురుకున్నట్లే లెక్క. ఆ కొలమానం ప్రకారం సి.వి. ఎన్. ప్రసాద్ గారి ఈ ' అబ్బాయి పెళ్లి ' కథానికకు గుర్తుంచుకోదగిన కథల జాబితాలో స్థానం దక్కాలి న్యాయంగా ! అవకాశం ఉండీ హాస్యం కోసం ఎక్కడా అతిశయాలంకార ప్రలోభాలకు లొంగని నిగ్రహ శిల్పం కథను పాఠకుడికి మరింత దగ్గరకు చేరుస్తుంది. శ్రీ ప్రసాద్ ఇందుకు ప్రత్యేకంగా అభినందనీయులు.
☘️
రచయితకు మనసారా అభినందనలు
🙏🏻🙏🏻👏👏
- కర్లపాలెం హనుమంతరావు
08 - 12 - 2020
బోథెల్ ; యూయస్ఏ






Monday, December 7, 2020

ఓ డోలోడు - కథానిక – రచయిత పేరు తెలియదు)- సేకరణ ః కర్లపాలెం హనుమంతరావు

 చేస్తున్న పని ఆపి కాలుతున్న చుట్టను ఒక దమ్ము లాగి మళ్లా పక్కనే పెట్టాడు సుబ్బులు. నడుముకు వారుతో తగిలించుకున్న వంకీతో డోలుకున్న వారు పట్టెల్ని మరోమారు లాగాడు. నిలబెట్టుకున డోలు కుడి మూతను నాలుగైదు సార్లు తట్టి  శృతి చూసుకున్నాడు. మళ్లా చుట్ట చేతిలోకి తీసుకుని రెండు మార్లు దమ్ములాగాడు. చుట్ట అయిపోవడంతో దూరంగా విసిరేశాడు. అదెళ్లి టెంకాయ చెట్టు మొదట్లో పడి అక్కడున్న నీళ్ల తడికి సుయ్యిమంది.

డోలును ఎడం మూత పైకి వచ్చేటట్లు తిప్పాడు. డోలు పుల్ల తీసుకుని దాని మీదా కొట్టి చూశాడు. అనుకున్నట్లు మోగలేదేమో 'ఛీ! దీనమ్మ' అనుకుంటూ డోలును మళ్లీ వంకీతో లాగడం మొదలుపెట్టాడు. కుడి మూత రంధ్రం నుంచి డోలు కర్ర మీదుగా ఎడం మూత రంధ్రంలోకి దూర్చుతూ డోలు కర్ర పట్టీ చుట్టూ ఉన్న వారుపట్టీలను లూజు లేకుండా బిర్రుగా లాగాడు.

సుబ్బులకు గొంతు కింద పోస్తున్న చెమట గుండె మీద నుంచి నడుం వరకు కారుతోంది. నల్లటి శరీరానికి నిమ్మచెట్ల మీద నుంచి వచ్చే గాలి తగలడంతో హాయిగా అనిపించింది. పక్కనే ఉన్న పై కండువాతో శరీరాన్ని తుడుచుకున్నాడు.

అలా నాలుగు సార్లు శృతి చూసుకున్నాక మిగిలిన వారును డోలు అడ్డకర్రల పట్టీగా నాలుగైదు వరుసలు చుట్టాడు. సొప్ప తీసుకుని ఎడం మూత కడెంలోకి చొచ్చుకొనొచ్చిన పిచ్చులపై ఆనించి గుండ్రాయితో తడుతూ పిచ్చుల్ని ఇంకా లోపలికి కొట్టాడు. ఎండ తగిలేటట్టు ముందు రోజు తయారు చేసి ఏలాడ గట్టిన బొట్టెల్ని తీసుకొనొచ్చాడు.  మంగలి పొదిలో నుంచి గోరుగాలు తీసుకుని గోగుపుల్లల చుట్టున్న బొట్టెల్ని జాగ్రత్తగా గుండ్రంగా కోసి వాటి నుంచి బైటికి తీశాడు. వాటిని ఎడం చేతి బొటన వేలుకు మినహా అన్ని వేళ్లకు పెట్టుకున్నాడు. గోతం పట్టని సరి చేసి డోలు కొట్టడం మొదలు పెట్టాడు.. పాల వరసల నుంచి .

యుద్ధానికి సిధమయ్యే సైనికుడిలా.. కళను సృష్టించబోయే ముందు కళాకారుడి ఆత్మనివేదనలా.. తదేక దృష్టితో సుబ్బులు దానిలో మునిగిపోయాడు.

ఇంటర్మీడియెట్ చదువుతున్న సుబ్బులు చిన్నకొడుకు కాలేజీ ఫీజుల కోసం కావలి నుంచి వచ్చాడు. సిటికేసర చెట్టు కింద, పొయ్యిలోకి కరతమ్మ పుల్లల్ల్ని చిదుగులుగా కొడుతూ తండ్రి వాయించే డోలుకు తలూపుతున్నాడు.

సుబ్బులు కూతురు అత్తగారింటి నుంచి వచ్చుంది. మళ్లా పంపాలంటే చీరన్నా పెట్టాల్సిందే. దారి ఖర్చులూ ఇవ్వాల్సిందే.

సాయబ్బుల పీర్ల పండక్కి వాయిస్తే ఈ దఫాకి మీ ఇద్దరి గొడవా వదిలినట్లే అన్నాడు వారం రోజుల కిందట సుబ్బులు. కానీ ప్రతి ఏడాదిలా ఈ ఏడు పీర్ల పండగ మేళం సుబ్బులుకు ఊరకే రాలేదు. పెద్ద తిరకాసే జరిగింది.

***

ఆ రోజు సుబ్బులు బస్టాండులో ఉన్నాడు. ఎవరో వస్తే గడ్డం చేస్తున్నాడు. సాయబ్బులపాలెం నుంచి మదర్సా హడావుడిగా వచ్చాడు. 'అరేయ్ సుబ్బులూ! ఈసారి పీర్ల పండక్కి మేళాల కోసం పెద్ద రబస జరిగిందిరా! అన్ని సావిళ్లోళ్ళు ఈసారి పక్కూరి నుంచి పిలిపిద్దాం'అన్నారు. 'కొత్తపట్నం, అలకురపాటి నుంచి తెప్పిద్దాం'అన్నారు.

గడ్డం చేస్తున్నోడల్లా ఆ మాటకు ఉలిక్కిపడ్డాడు సుబ్బులు. 'అవున్రా! మనూరోళ్ల కంటే కొత్తపట్నమోళ్ళు బాగా వాయిస్తన్నారని అంటున్నారు. ఎంత చెప్పినా వింటన్లే!'

'అదేందిరా మదర్సా! మీకు ఒడుగులైనా.. గిడుగులైనా మేమే కదరా వచ్చేది. చిన్నప్పట్నుంచి కలసి మెలసి తిరిగాం. గడ్డమైనా.. క్రాఫైనా ఎంతిస్తే అంతే తీసుకున్నాం. మన సాయబ్బులే.. మనోళ్లే.. అనుకున్నాం. ఇప్పుడేందిరా.. ఇదీ!' అన్నాడు.

'అవున్రా! నేనూ అదే చెప్పా! కానీ .. కుర్రోళ్లు .. ఎదిగొఛ్చారు కదా! ఇంటంలా! మిగతా మూడు సావిళ్లు మా చేయి దాటిపోయింది. మా సావిడి మేళం మాత్రం సుబ్బులన్నే అని గట్టిగా చెప్పొచ్చారా!' అన్నాడు.

సాయిబులపాలెం పెద్దలతో మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది. చివరికి ఆ ఒక్క సావిడీ ఒప్పుకుని బయానా తీసుకున్నాడు సుబ్బులు.

అన్నిసావిళ్ల పని ఒప్పుకుని పక్కూళ్ల నుంచి మేళగాళ్లను తెచ్చి పని జరిపిస్తే కాస్త డబ్బు మిగులుతుంది. అది అందరికి తెలిసిందే. పక్కూరోళ్లను మేళానికి పిలిచినా అట్లాగే చేస్తారు. కానీ ఈసారి సుబ్బులుకు ఆ అవకాశం లేదు. అదే అలవాటుగా మారితే ఈ ఊరు మంగలోళ్ల పరిస్థితి ఏమిటి? మేళాలన్నీ పక్కూరికి పోతే ఈ ఊరి మీద పట్టు పక్కూరికి పోద్ది. అది జరక్కూడదంటే పక్కూరోళ్లకంటే ఈ ఊరే మేలనిపించాలి. తమ సత్తా ఏంటో పీర్ల పండక్కి చూపించాలి అనుకున్నాడు.

గొల్లోళ్ల వెంకన్న దగ్గరికెళ్లి మంచి మేక తోలు తెచ్చి ఆరకొట్టాడు. డోలు కున్న మూతలు విప్పి నానేసి తోలు విప్పాడు. ఆరగొట్టిన కొత్తతోలు కడాలు సైజుకు తగ్గట్లు గోరుగాలుతో కోశాడు. ఎడం మూత రెప్ప కోసం మంచిగా తోల్ని సిద్ధం చేసుకున్నాడు. రెండు రోజులు బక్కెట్లో నానేశాడు. మూడు పూట్ల తొక్కి తోల్ని పొదగడానికి సిద్ధం చేశాడు. చిన్నకొడుకు ఊర్రాముల చిల్లరకొట్టు ఎదురుగా చింతిత్తులు ఏరుకొచ్చాడు. గుండ్రాయితో చిన్నచిన్న ముక్కలుగా చితక్కొట్టి నానేశాడు. సుబ్బులు పెళ్లాం వాటిని మెత్తగా రుబ్బి, వండి, మైదా కలిపి బందన తయారుచేసింది.

సుబ్బులు కడేలుకు బందన పూసి తోలు అతికించాడు. గట్టిగా అతుక్కునేందుకు బిరుసు గుడ్డతో అదిమాడు. ఎడం మూత పొదగడానికి వల్లూరు జగ్గయ్య దగ్గరికెళ్లి మిషను తెచ్చాడు. కడానికి తోలు అతికించి బాగా అత్తుకునేందుకు మిషను బిగించాడు. ఆరపెట్టాడు. రెండు మూతలు ఆరాక చింతగింజలు పెట్టి మధ్య దూరం సమానంగా ఉండేటట్లు చూసి కళ్లు(రంధ్రాలు) కోశాడు. అక్కడ తోలు నానడానికి గుడ్డపీలికతో వాటిని తడుపుతూ రోజంతా ఉంచాడు. ఎడం మూత ఆరాక దానిపై రెప్పను అతికించి మళ్లా పొదిగాడు. డోలు కర్రకు గుడ్డతో నూనె పూసి బాగా సిద్ధం చేసుకున్నాడు. కుడి మూత మధ్యలో నల్లటి బూడిదరాశాడు.

 

సుబ్బులు చిన్నకొడుకు, కూతురు కలసి ఇంట్లో పాత కద్దరు గుడ్డను అంగుళం వెడల్పు ఉండేటట్లుగా పేలికలు పేలికలుగా చించారు. రెండు గోగుపుల్లల్ని జానెడంతవి నరికి సిద్ధంచేసుకున్నారు. సిమెంటు, అన్నం కలిపి మెత్తగా నూరారు. గుడ్డలేలికలకు దానిని పూసి గోగుపుల్లలకి రెండు కొసల దానిని అంటించారు.  వాట్ని ఎండలో ఆరగట్టారు. అవి ఎండాక గోగుపుల్లల్నుంచి విడదీస్తే బొట్టెలు అవుతాయి.

ఆ రోజు సుబ్బులు పొద్దున్నె అన్నిట్నీ ముందేసుకుని కూర్చున్నాడు. డోలు కర్రని నిలబెట్టి కింద కుడి మూత, పైన ఎడం మూత పెట్టి రంధ్రాల గుండా వారు ఎక్కించాడు. మూతలు బిర్రుగా ఉండి, శృతి రావడం కోసం వారు పట్టీలకు వంకీ తగిలించి లాగుతున్నాడు.

లాగుతున్నాడే కానీ, పక్కురోళ్ల గురించి, వాళ్ల డోళ్ల గురించి, సన్నాయిల గురించి,వాళ్లు వాయించే విధానం గురించి ఆలోచిస్తున్నాడు. అంతే కాదు.. సొంతూర్లో పరువు నిలబడాలంటే ఎలా అని ఆలోచిస్తున్నాడు.

వాయించడం అయిపోయాక, అన్నిట్నీ నెమరు వేసుకున్నాక, డోల్ని మరోసారి సరిచూసుకుని పట్టెడ తగిలించాడు. గుడ్డ కప్పాడు. ఇంట్లో దేవుడి మూలనున్న పీటపై పెట్టొచ్చి ప్రశాంతంగా గాలి పీల్చుకున్నాడు. నిప్పెట్టె తీసి చుట్ట అంటించాడు. దమ్ములాగుతూ మార్కెట్లో ఉన్న పంచలోకి వెళ్లి కూర్చున్నాడు.

***

సుబ్బులూ వాళ్ళు నలుగురు అన్నదమ్ములు. పెద్దోడు సన్నాయి, రెండోవాడు .. అదే సుబ్బులు, మూడో వాడు మళ్లీ సన్నాయి, నాలుగోవాడు మళ్లీ డోలు.. వాయిస్తారు. వాళ్లయ్య చస్తూ చస్తూ ఊరిని, వృత్తిని చూపించిపొయ్యాడు. పక్కూరు మంగలోళ్లకు ఈ నలుగురు అన్నదమ్ములంటే హడల్. కాని, డబ్బులు బాగా ఇస్తారని ఈ కొత్తపట్నపోళ్లు, అలకురపోటోళ్లు ఒప్పుకున్నారు. ఈ విషయం నలుగురు అన్నదమ్ములకు తెలుసు. అందుకే వాళ్లు సన్నాయిల్ని కూడా గట్టిగా సిద్ధంచేసుకున్నారు.

పీర్ల పండగ రానే వచ్చింది. మొదట్రోజు సావిట్లోంచి పీర్లను దించడం. మామూలుగానే సాగిపోయింది. సుబ్బులు ఆ ఊరు మంగలోళ్లకున్న పీరు దగ్గరకు వెళ్లి 'మా పరువు నీవే కాపాడాల' అని వేడుకున్నాడు. పెళ్లాంతో కలిసి బొరుగులు, వేగించిన శెనగపప్పు, బెల్లం పీర్లకు ఇచ్చొచ్చాడు. తర్వాతి రోజు గుండం తొక్కడం కూడా అయింది. ఆ తర్వాతి రోజే పీర్ల ఊరేగింపు.

ఆ రాత్రి సాయిబులపాలెంలో ప్రతి సావిడి దగ్గర సినిమాలు, నాటకాలు, రికార్డింగ్ డ్యాన్సులు.. పోటీపడి వేస్తారు. వేకువ జాము మూణ్ణాలుగ్గంటలకు పీర్లు ఊరు చుట్టూ తిరుగుతాయి. ట్రాక్టర్ల మీద డూపు హీరోలు, హీరోయిన్లు ఎగురుతుంటే జనాలకు సందడే సందడి.

పదిగంటలకల్లా పీర్లు ఊరు చుట్టూ తిరుగుతుంటే నీళ్లతో వారు పోసేవాళ్లు పోస్తూనేవున్నారు. అందరు ఇళ్ల నుంచి బయటికొచ్చి చూస్తున్నారు. సాయిబుల పిల్లలు ఎగురుతుంటే దానికి అనుగుణంగా మేళం మోగుతోంది.

పీర్ల ఊరేగింపు తిరుగుతూ తిరుగుతూ ఊరి మధ్యలో ఉన్న రాంసామి మేడ దగ్గరి కొచ్చింది. పీర్లు అన్నీ వరుసగా నిలబడ్డాయి.  ఏ పీరు కాడున్న మేళగాళ్లు ఆ పీరు దగ్గర వాయిస్తున్నారు. సన్నాయిలు శృతిమించి మోగుతున్నాయి. జనాలందరూ విరగబడి చూస్తున్నారు, ఎగిరేవాళ్లు ఎగురుతూనే ఉన్నారు.

అప్పటికే మేళగాళ్లకి మందు సరఫరా అయింది. సుబ్బులుకి, వాళ్లన్నకు మందు అలవాటు లేదు. మిగిలిన పీర్లకాడ వాళ్లు తాగిన మైకంలో వాయిస్తున్నారు. అలకురపాటి ఎంకట్నర్సు రేపు చూసుకుందాం అన్నట్లు సుబ్బుల్ని చూసి తలెగరేశాడు. కొత్తపట్నం సీను సన్నాయిని గుండ్రంగా తిప్పుతూ సై అన్నట్లు చూశాడు. సుబ్బులుకు కోపం నసాళానికి అంటింది.' నా కొడుకులు వాయించేది తక్కువ.. ఊగేది ఎక్కువ' అనుకున్నాడు. నిటారుగా నిలబడి డోలు వాయిస్తున్నాడు. అట్లా పోటీ రంజుగా సాగుతుంటే 'టైం లేదు .. టైం లేదు.. పదండి.. పదండి' అంటూ సాయిబుల్లోని పెద్దలు పీర్లని ముందుకు కదిలించారు.

మరుసటి రోజు గుమ్మటాలు. అదే చివర్రోజు. గుమ్మటాలన్నీ ఊర్లోని పెద్ద బజారుగుండా సముద్రానికి వెళతాయి. అక్కడే వాట్ని కలిపేస్తారు.

ఆరు గంటలకల్లా గుమ్మటాలు సాయిబులపాలెంలో బైలుదేరాయి. ఒక్కో గుమ్మటం దగ్గర జనాలు ఇసకేస్తె రాలనంతగా ఉన్నారు. ఒకచోట ఒకరు చేతిరుమాలును పళ్ల మధ్య బిగించి నాగిని నృత్యం చేస్తుంటే, మరోచోట ఇంకోడు పులి డ్యాన్స్! ఇలా అన్ని గుమ్మటాల దగ్గరా కోలాహలం. ఊరు ఊరంతా కులం, మతం, ఆడ, మగ భేదాల్లేకుండా ల గుమ్మటాల చుట్టూరా ఉంది.

గుమ్మటాలన్నీ జాలమ్మ చెట్టు దగ్గరకు వచ్చాయి. అక్కడ బజారు పెద్దదిగా ఉంటుంది. నాలుగు గుమ్మటాలని వరసగా నిలబెట్టారు. వాటి ముందు మేళగాళ్లు.. వాళ్ల ముందు ఎగిరేవాళ్లు. పోటీ ప్రారంభమయింది అనుకున్నారు చూసేవాళ్లంతా. అప్పటికే వాయించేవాళ్లు తాగున్నారు. ఒక్కొక్కరు మోకాలి దండేసి డోలు కొడుతున్నారు. సన్నాయిని గాల్లోకి తిప్పుతు ఆకాశం కేసి చూస్తూ ఊదుతున్నారు.   రాగాలు, తాళాలు మారుమోగుతున్నాయి. ఎగిరేవాళ్లకు అనుగుణంగా వాయిస్తున్నారు.

సుబ్బులు నిశ్చలంగా నిలబడి ఒక మౌనిలా వాయిస్తున్నాడు. తాళాలన్నీ శృతికి అనుగుణంగా పడుతున్నాయి.

ఎంకట్నర్సు సుబ్బులు వంక చూసి కొత్త తాళం అందుకున్నాడు. అక్కడి సన్నాయిలూ అందుకు అనుగుణంగా మారిపోయాయి. సుబ్బులు కూడా కొత్తతాళం ఎన్నుకున్నాడు. కొత్త కళాసృజన ప్రారంభమయింది.

సుబ్బులు దుమికే జలపాతంలా మారిపోయాడు. జనాలందరూ సుబ్బులు డోలు చూడ్రా! ఎట్టా మోగుతుందో! అంటూ ఆ గుమ్మటం దగ్గరకు వచ్చేస్తున్నారు. వస్తూ వస్తూనే ఊగిపోతూ ఎగురుతున్నారు. డోలు గట్టిగా మోగుతోంది. మోగుతూ మోగుతూ ఒక్కసారిగా శబ్దం ఆగిపోయింది. డోలు కుడి మూత టప్పుమని పగిలిపోయింది. సుబ్బులుఉ నిశ్చేష్టుడైపోయాడు. ముఖాన నెత్తుటి చుక్క లేకుండా పోయింది. గుండె ఆగిపోయిందనుకున్నాడు. యుద్ధం మధ్యలో అస్త్రాలు కోల్పోయిన సైనికుడిలా నిలబడిపోయాడు.

అంతలో సుబ్బులు తమ్ముడు వెంకటేశ్వర్లు తన మెడలో ఉన్న డోలు తీసి సుబ్బులు మెడలో వేశాడు.'నువ్వు ఒక్కడివి చాలు. వాయించన్నా!'అన్నాడు. పక్కనే ఉన్న సుబ్బులు అన్న సన్నాయిలో కొత్తరాగాన్ని ఎత్తుకున్నాడు. సుబ్బులు తనను తాను నిలదొక్కుకున్నాడు. ఎడం మూతపై వేళ్లను సప్తస్వరాలుగా కదిలించాడు. కుడి మూత మీద పుల్లను దానికి తగ్గట్లుగా నర్తింపచేశాడు. ఇప్పుడు మంగలి సుబ్బులు సుబ్బుల్లా లేడు. మ్స్రొ సృష్టి చేస్తోన్న బ్రహ్మలా మారిపోయాడు.

ఆ ధ్వని అందరి మనసుల్లోకి చొచ్చుకునిపోతోంది. వాళ్లల్లో కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తోంది. అందరూ మంత్రముగ్ధుల్లా మారిపోయారు. అన్ని గుమ్మటాల నుంచి జనాలు వచ్చి చూస్తున్నారు. ఎగిరేవాళ్లు కూడా నిశ్చలంగా నిలబడిపోయారు. ఒక తపస్సమాధిలో ఉన్నట్లు సుబ్బులు వాయిస్తూనే ఉన్నాడు.

నిజానికి సుబ్బులు డోలు నేర్చుకోలేదు. తండ్రి వాయిస్తుంటే చూసి నేర్చుకున్నాడు. జవజీవాల్లో నిక్షిప్తమైన కళకు,  నేర్చుకున్న కళకు ఉన్న తేడా సుబ్బుల్ని చూస్తే తెలుస్తుంది.

వెంటనే వెంకట్నర్సు డోలు పక్కన పడేసి సుబ్బులు ముందు కొచ్చి 'అన్నా..' అన్నాడు. మిగతా గుమ్మటాల దగ్గర ఉన్న సాయిబులందరూ కూడా సుబ్బులు దగ్గర కొచ్చారు. మేళం రసపట్టులో ఉన్నప్పుడు ఎదుటివాడు డోలు మీద నుంచి పుల్ల తీయడమే ఒక పెద్ద అవమానం. కానీ, వెంకట్నర్సు 'అన్నా,.. మీ ఊరు మీదే!మా ఊరు మా ఊరే!' అన్నాడు ఉద్వేగంగా.

తర్వాత గుమ్మటాలు నెమ్మదిగా సముద్రం వైపు కదిలాయి. అప్పటికే సమయం రాత్రి తొమ్మిదయింది. సముద్రం నిశ్శబ్దంగా వెన్నెట్లో మెరుస్తోంది.

రచయిత (పేరు - తెలియదు) ;

(ఆంధ్రజ్యోతి ఆదివారం 16,మే, 2010 సంచికలో ప్రచురితం)

సెల్: 9848425039

సేకరణః కర్లపాలెం హనుమంతరావు

07, 12 డిసెంబర్, 2020






*** 

 

 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...