Saturday, February 13, 2021

చలంగారి వేదాంతం- పిట్ట కథ - కర్లపాలెం హనుమంతరావు

 



గురు శిష్యుల మధ్య అద్వైత సిద్ధాంతాన్ని గురించి గంభీరమయిన చర్చ జరుగుతున్నది. 
ఓ రాజు గారు అ సమయంలోనే ఏనుగు మీద ఊరేగుతూ అటుగా వెళుతున్నారు.
"ఏమిటండీ అది?" అని ఎప్పట్లానే అడిగాడు శిష్యుడు .
"కనబడటంలేదుటరా...రాజు గారు ఏనుగు మీద ఊరేగుతున్నారు ." అన్నారు  గురువు గారు .
రాజు గారంటే ఎవరండీ? ఏనుగు అంటే ఏమిటండీ ?" అని అడిగాడు శిష్యుడు.
"పయిన వున్నది రాజు ...క్రింద వున్నది ఏనుగురా మూర్ఖుడా!" అన్నారు గురువుగారు చిరాకుగా.
"పయిన అంటే ఏమిటండీ ?...క్రింద అంటే ఏమిటండీ?" అని మళ్ళీ శిష్యుడు సందేహం.
గురువు గారికి వళ్ళు మండి అమాంతం ఎగిరి శిష్యుడి భుజాలమీద కెక్కి కూర్చుని"నేను ఉన్నది పైనా, నువ్వు వున్నది క్రిందా ...అర్ధమయిందా?" అనడిగారు.
శిష్యుడు తొణకలేదు. "నేను అంటే ఏమిటండీ?..మీరు అంటే ఏమిటండీ?" అని అడిగాడు .
గురువు గారు గభాలున క్రిందకు దిగి శిష్యుడి కాళ్ళు పట్టుకున్నాడు "పైన వున్నది నువ్వూ..క్రింద వున్నది నేనురా " అన్నాడు.
"అర్ధమయింది "  అన్నాడు శిష్యుడు .
ఇంతకీ పాఠం నేర్చుకున్నది శిష్యుడా? గురువా?
(భగవద్గీత కు ముందు మాటలో చలం గారు రాసుకున్నది) 

-కర్లపాలెం హానుమంతరావు 
బోథెల్, యూఎస్ ఎ
 
*****


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...