Showing posts with label collection. Show all posts
Showing posts with label collection. Show all posts

Wednesday, November 10, 2021

కవిత: అసత్ సుందరాచారి సేకరణ : కర్లపాలెం హనుమంతరావు

 కవిత: అసత్ 

సుందరాచారి 

సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 


నల్ల రాతికి కలతల యిల్లు గట్టి, జారు కన్నీటి ధారల జలకమార్చి, వేడి నిట్టూర్పు సెకలలో వేల్చి మనసు, ముందు పెట్టితి వై వేద్యమునకు సయ్యు.


అధరపుటములు కదలించి, మధుర మనుచు


ఆరగించెను నా స్వామి; ఆరగించి,


కడుపు నిండకపోయిన కారణమున


కండలూడ్చెను నాలోన కత్తిదూసి, ఎముక లొకకొన్ని మిగులగా నేర్చి పేర్చి, నరములన్నియు నారగా సరులు గూర్చి, పచ్చి నెత్తురు పళ్లెంబు పట్టి పాడి ‘అమరుడైయుండు మోస్వామి!' యంటి నంత.


నిలువు మాసిన దేశాని కలతయేమొ వెలియనేలేదు, గాలిలో కలవరించె, కడుపుచల్లనివానిని కదలనీక కాళ్లు చుట్టును పెనగుచు కలవరించె.


పేద గుండియ పేలగా పీల్చినట్టి రుధిరమదిరమ్ము కడుపులో రొదలు నేయ, మండుగొంతుక తడుపగా మంచినీళ్ళ కరవులోబడి నాస్వామి కలవరించె.


కనకపీఠము ముంగల కప్పురంపు ప్రభలు వెలుగొంద, అగరుధూపాల నెత్తి, మంచిపన్నీటిపాదాలు ముంచి కడుగ పిలుచుచుండియు కలవారు, వెలికిరాడు.


ఏడులోకాల కనుసన్న నేలువాడు ఇరుకు చీకటి గుడిలోన మరగినాడు. నాకు లేనట్టి దేవుడు లోకములకు లేదు, లే డింక పిలిచినా రాడు, రాడు.

- సుందరాచారి 

( సేకరణ : కర్లపాలెం హనుమంతరావు ) 

01-01-2021 

Thursday, April 1, 2021

త్యాగరాజస్వామివారి లౌక్యం! సేకరణః

 

 


స్వామివారి పంచరత్నాలలో చివరగా వినిపించే శ్రీరాగంలోని 'ఎందరో మహానుభావులు.. అందరికీ వందనములు' కృతి సంగీతం రానివారికీ, స్వరలోకంతో సంబంధం లేనివారి చెవులకు కూడా సోకకుండా ఉండని చరణం.

త్యాగయ్యగారి గురువు శొంఠి వేంకట రమణయ్యపంతులుగారు. ఒకానొక సందర్భంలో గురువుగారికి ప్రతినిధిగా సంగీత సభలో పాల్గొనాల్సిన పరిస్థితి స్వామివారి మీద పడిందంటారు.  వయసులో  పిన్నవాడు అయిన కారణంగా త్యాగయ్య సంగీత సామర్థ్యం ప్రశ్నార్థకం అవడమే కాకుండా.. తనను సూచించిన గురువుగారి గౌరవం కాపాడవలసిన అదనపు బాధ్యతా ఆయన భుజస్కంధాలపై పడిన పరిస్థితి.  అయితే ఆ సందర్భానికి తగ్గట్లుగామే త్యాగయ్య  ఈ విచిత్రమైన కృతిన కల్పించి పాడి విమర్శకుల నోళ్లు మూయించినట్లు ఓ కథనం బహుళప్రచారంలో ఉంది.

 

'ఎందరో మహానుభావులు.. అందరికీ వందనములు'అంటూ మొదలయ్యే ఈ కృతిలో  'చందురు వర్ణుని అందచందమును హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించువారు..' అనే అనుపల్లవి ఒకటి వినిపిస్తుంది. శ్రీరామచంద్రుని అంద చందాలను వర్ణంచే ఈ కృతిలో 'చందురు వర్ణుడు' అనే విశేషణం చొరబడటమే విడ్డూరం అనిపిస్తుంది కదా సాధారణ శ్రోతలకు! రాముడు నీలి మేఘ శ్యాముడు. నల్లటి మబ్బు రంగు   ఆ మహానుభావుడి మేని ఛాయ . మరి రామచంద్రుని వర్ణానికి, చంద్రుని వర్ణానికి సాపత్యమేంటి?  పోలిక ఎంత అపసవ్యంగా ఉంది అనిపిస్తుంది సహజంగానే! మిడి మిడి జ్ఞానులు ఈ రంధిలో పడి కొట్టుకుంటుండగానే త్యాగయ్య తన గానచాతుర్యంలో నిజమైన శ్రోతలను మెప్పించేసి శభాష్ అనిపించుకొన్నాడని ఎక్కడో చదివిన గుర్తు. కాకపోతే శ్రీ నూకల సత్యనారాయణగారు తన పుస్తకంలో దీనికి సంబంధించి చక్కని వివరణ ఇచ్చున్నారు కనక ఆ విశేషం తెలియచేసి ముగిస్తా.

 'వర్ణో ద్విజాది శుక్లాది యజ్ఞే గుణ కధాసు చ వర్ణమంటే బ్రాహ్మణుల్లాంటి కులాలు, తెలుపు లాంటి  రంగులు, యజ్ఞం, గుణం-ఇన్ని అర్ధాలున్నాయి మరి. శ్రీ రామచంద్రుడు చంద్రుడికి మల్లే చల్లని చూపులతో ప్రకాశవంతంగా ఉంటాడు కాబట్టి అట్లా పోల్చడంలో కించిత్తైనా అన్వయదోషం లేనే లేదు అని భాష్యం చెప్పుకోవచ్చు.   పురాణపురుషుడిగా తీర్చిదిద్దిన రుషి వాల్మీకి కూడా రాముణ్ణి సోమవత్ ప్రియదర్శనః” అని కీర్తించాడన్న విషయం మరపుకొస్తేనే మరి ఈ తరహా చిన్ని చిన్ని సందేహాలు మనసుల్ని  సతాయించేది. .

ఇహ ఇక్కడ త్యాగరాజస్వామి గడుసుతనం ఏమిటంటే.. ఇట్లాంటి పదప్రయోగం ఒకటి సభలోకి వదిలేస్తే సంగీత పండితుల్లో  మధన మొదలవడం ఖాయం. అర్థ విద్వాంసుల ధ్యాసను కొద్దిగా ఆ దిక్కుకు మళ్ళించేస్తే తాను తన విద్వత్ పరీక్షలో గట్టెక్కడం సులువవుతుందన్నది ఆ సంగీత వైతాళికుడి గడసరితనం.

 సాధారణంగా విద్వత్సభల్లో నెగ్గుకురావడం తాడిచెట్టుకు ఎదురు దేకడమంత క్లిష్టం. మిడిమిడి జ్ఞానంతో అంతా తమకే తెలుసన్న అహంభావుకత అదికంగా ఉండే పండితులు అన్ని కాలాల్లో అన్ని స్థలాల్లో తారసపడుతూనే ఉంటారు. ఎదుటి మనిషిలోని తప్పులు ఎక్కడ దొరుకుతాయా.. ఎప్పుడు వాళ్ల ప్రతిభను కించపరుద్దామా అని రంధ్రాలు వెతికే బాపతు అర్థజ్ఞానులను బోల్తాకొట్టించడమే ధ్యేయంగా బహుశా త్యాగయ్యరాజస్వామి ఆనాటి పండిత సభలో ఆ పదప్రయోగ చేసివుండచ్చు.

వివాదాన్ని పెరగనిచ్చి చివర్లో సరైన సమాధానం ఇచ్చి ఈర్ష్యాపరుల నోళ్లు మూయించే గడసరితనాన్ని తప్పుపట్టలేం.   త్యాగరాజస్వా,మి 'చందురు వర్ణుని' పదప్రయోగం ఈ లక్ష్యంతోనే సాగిందనుకోవాలి. పాండిత్యమే కాకుండా లౌక్యం నేర్చుకున్నప్పుడే లోకంలో రాణింపుకొచ్చే మాట.

-సేకరణ

కర్లపాలెం హనుమంతరావు

 

 

 

 

Sunday, February 21, 2021

ఆత్మనిగ్రహం- చిట్టి సరదా కథ- సేకరణ కర్లపాలెం హనుమంతరావు



ఒకరోజు అక్బర్ బాదుషా ఒక అడవిలో తపస్సమాధిలో ఉన్న  రుషివర్యుణ్ణి చూసి. ఆ జ్ఞానసంపన్నుడి దారిద్ర్యాన్నిచూసి బాధపడ్డాడు. ఏదైనా సాయం చేయాలనుకొన్నాడు.

'స్వామీ మీరు మా నగరానికి పావనంచేస్తే సకల సౌకర్యాలున్న మంచి భవంతి నిర్మించి ఇస్తాను' అన్నాడు.

'రాజా! ఈ మనోహరమైన వనసీమను వదిలి నేను ఆ రాళ్లమధ్య ప్రశాంతంగా జీవించలేను. క్షమించండి!' అన్నాడు.

'పోనీ.. శరీరం మీద కౌపీనంతో అనునిత్యం మారే వాతావరణంలో బాధలు పడటమెందుకు? దయచేసి పట్టుపీతాంబరాలు స్వీకరించి మమ్మల్ని పావనం  చేయండి!'అని ప్రాదేయపడ్డాడు చక్రవర్తి.

'దైవం ప్రసాదించిన దుస్తులు కదా ఆత్మమీది ఈ శరీరం. ఆ దుస్తులకు మరిన్ని దుస్తులా! మన్నించండి! నాకు ఇలా ఉండటమే సౌకర్యంగా ఉంటుంది' అన్నాడు రుషివర్యుడు చిరునవ్వుతో.

కనీసం మీరు తాగేందుకైనా ఈ స్వర్ణపాత్రను గ్రహించి మమ్మల్ని సంతోషపెట్టండి సాధుమహారాజ్!'అన్నాడు అక్బర్.

'దోసిలి ఉండగా వేరే పాత్రలు ఎందుకు? దండగ్గదా! అన్యథా భావించకండి రాజా!' అని మహర్షి సమాధానం.

'పోనీ.. సుఖంగా శయనించేందుకు ఒక పర్యంకం అయినా తెప్పించమంటారా?' రాజుగారి ప్రార్థన.

సాధువుది మళ్ళా అదే సమాధానం. 'ప్రకృతి ప్రసాదించిన ఇంత చక్కని పచ్చిక బయలుండగా వేరే శయ్యాసుఖాలు నాకెందుకు మహారాజా!' అని నిరాకరించాడు రుషివర్యుడు.

రుషి నిరాడంబర సాధుజీవనానికి విస్మయం చెందాడు అక్బరు మహారాజు. సాధు మహారాజుకి ఏదైనా సరే ఒకటి సమర్పించి తీరాలని పంతం పెరిగింది అక్బరు చక్రవర్తికి. 'ఇప్పుడంటే ఇలా ఉన్నారు. భవిష్యత్తులో తమరికి ఏది కావాలన్నా  నిస్సంకోచంగా మాకు కబురు చేయండి! అడగడానికి మొహమాటమైతే ఈ అగ్రహారం మీకు రాసి ఇస్తున్నాం. యధేచ్చగా అనుభవించండి' అంటూ రాజుగారు రుషికి సమాధానం ఇచ్చే వ్యవధానంకూడా ఇవ్వకుండా నిష్క్రమింఛారు.

'స్వామీ! సర్వసంగ పరిత్యాగం అంటే ఏమిటో నాకు ఇప్పుడర్థమయింది' అన్నాడు అప్పటిదాకా అక్కడే నిలబడి అంతా చూస్తున్న శిష్యపరమాణువు భక్తి ముప్పిరిగొనగా.

'సర్వసంగ పరిత్యాగమా నా బొందా! రాజుగారి మొదటి కోరికనే మన్నించి ఉంటే నాకేమి మిగిలేదిరా శిష్యా! మన్నుతో కట్టిన నాలుగ్గోడల భవనం. ఇప్పుడు అలాంటి భవనాలు వంద కట్టించగలను. పట్టు పీతాంబరాలు, స్వర్ణమయ పాత్రలు, హంసతూలికా తల్పాలు ఎన్నైనా ఏర్పాటు చేసుకోగలను ఒకరిని యాచించకుండా! చివరి కోరికవరకు మనసుమీద అదుపు సాధించానే .. దీన్నే అంటారు  నువ్వుఅ అనుకొంటున్న 'ఆత్ననిగ్రహం' అని! అర్థమయిందా?' అన్న గురువు బోధను విని నోరువెళ్లబెట్టాడు శిష్యపరమాణువు.

***

సేకరణ ! కర్లపాలెం హనుమంతరావు 

-కర్లపాలెం హనుమంతరావు

( నా నోట్ సునుంచి సేకరించినది. సోర్సు తెలియదు)

 

 


Monday, February 8, 2021

స్త్రీ మనస్తత్వం- కర్లపాలెం హనుమంతరావు సేకరించిన చిన్న కథ



ఇప్పుడే ఒక  తమాషా బైబిలు కథ చదివాను. చిన్నదే కానీ చమత్కారం పాలు ఎక్కువ.

ఏదెను ఉద్యానవనంలో నడుస్తుండగా పాము ఒక ఆపిల్  ఇచ్చి 'తిను! నీ ప్రియుడికి నీవు మరంత అందంగా కనిపిస్తావు".అంటుంది.

ఈవ్ తల అడ్డంగా ఆడించి"ఆ అవసరం  లేదు.  నా వాడి జీవితంలో నేను ఒక్కర్తెనే మహిళనుఅంది. పాము  నవ్వి "ఆదాము జీవితంలో మరో  స్త్రీ కూడా ప్రవేశించి ఉంది. గుహలో దాచిపెట్టాడు. చూపిస్తా.. రమ్మం’టూ"ఒక నీటి గుంట దగ్గరకు తీసుకు వెళ్లి తొంగి చూడమంది. 

నీళ్లల్లో తొంగి చూసిన తరువాత ఈవ్ ఆపిల్ తినడానికి ఒప్పుకుంది. 

- సేకరణ by కర్లపాలెం హనుమంతరావు 

Wednesday, February 3, 2021

వర్ధమాన రచయితలకు శ్రీవాత్సవ లేఖ- కర్లపాలెం హనుమంతరావు

                                                     


 

అఖిలభారత తెలుగు రచయితల 2వ మహాసభ 1963, జనవరిలో రాజమండ్రిలో జరిగిన సందర్భంలో ఒక సావనీర్ తెచ్చారు.సుమారు 200పేజీలకు పైనే ఉంటుందా ప్రత్యేక సంచిక. పి.వి.నరసింహారావు గారు "ఉన్నత లక్ష్యాలతో రచనలు సాగించాల"ని ఉద్భోధిస్తూ చేసిన ప్రసంగపాఠం ఉంది అందులో. విశ్వనాథవారి నుంచీ కాశీ కృష్ణమాచార్యుల వారి దాకా... మధునాపంతుల, సినారె, సోమంచి యజ్ఞన్నశాస్త్రి, దాశరథి, తిలక్, మధురాంతకం, సంపత్కుమార, పిలకా, పురిపండా వంటి  ప్రముఖుల వ్యాసాలు, రచనలు ఎన్నో ఇందులోకనిపిస్తాయి.

ప్రముఖ విమర్శకులు శ్రీవాత్సవ- వర్ధమాన రచయితలను ఉద్దేశించి  లేఖారూపంలో ఒక మూడుపుటల  చక్కని రచన చేశారు. ఆ వ్యాసం మొత్తాన్నీ మళ్ళీ ఇక్కడ ప్రస్తావించడం కుదరదు కాని కొత్తగా రచనలు చేసే ఔత్సాహికులకు ఈ నాటికీ పనికొచ్చే చాలా విషయాలు ఇందులో ఉన్నాయి.కొన్ని భాగాలను క్లుప్తంగా ఇస్తాను.చూడండి!

రచయితలు అష్టకష్టాలుపడి  రాసిన తమ రచనలకు ఎందుకో(బహుశా సరదావల్లో..మోజుతోనో) కలంపేర్లు పెట్టుకుని ప్రచురించుకుంటుంటారు. మళ్ళా ఆ రచన ప్రచురింపబడ్డప్పుడు ఆ రాసింది తామే అని నలుగురికీ తెలియచెప్పటానికి నానాతంటాలు పడుతుంటారు. ఇంచక్కా సొంతపేరుతో ప్రచురించుకుంటే ఈ తిప్పలుండవు కదా అని శ్రీవాత్సవ అభిప్రాయం. సరే..అదేమంత పెద్ద  విషయం కాదుకానీకాస్త అలోచించదగిన సంగతులు ఇంకా  కొన్ని ఉన్నాయి.

సాధారణంగా రైళ్ళలోనో..బస్సుల్లోనో ప్రయాణంచేస్తూ ప్రేమలో పడిపోయే మధ్యతరగతి యువతనో, నిత్యనీరసంగా ఉండే సతీపతికుతూహల రహస్యాలనో ఇతివృత్తాలుగా తీసుకుని కాలక్షేపం రచనలు చేస్తే వచ్చే ప్రయోజన మేముంది? అంటారు శ్రీవాత్సవ. మన చుట్టూ...  జీవితాలతో నిత్యం సంఘర్షిస్తూ అంతులేని పోరాటం చేసే జనావళి అశేషంగా  కనపడుతుంటే  వాళ్ళ జీవితాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఎక్కడో..ఎప్పుడో.. కదాచిత్ గా కనిపించే అసాధారణమైన అద్భుత సంఘటనలను గ్లోరిఫై చేసే రచనలు చేయడం ఎంతవరకు సబబు? అలాంటి రాతలు తాత్కాలికంగా సంతృప్తినిస్తాయేమో గానీ.. కలకాలం నిలిచుండేవి మాత్రం కావని శ్రీవాత్సవ అభిప్రాయపడతారు ఆ వ్యాసంలో..

మరీ ముఖ్యంగా మనలోని కొందరు రచయితలు అవినీతిని ఆకర్షణీయంగా చిత్రించే ధోరణికీ పాల్పడుతుంటారు. మనచుట్టూ ఇంత అవినీతి పెరిగిపోతూసామాన్యుడి బతుకును అతలాకుతలం చేస్తుంటే..అదేమీ పట్టించుకోకుండాసంఘాన్ని మరింత  దిగజార్చే  నిమ్న వాంచల్నీ, నికృష్ట తత్త్వాల్ని, దుర్మార్గాన్నీ, దుర్నీతినీ, సౌఖ్య వాంచల్నీ,  కామోద్రేక్తలనీ సమర్ధించే సమ్మోహన విద్యను రచయిత ఉపయోగిచడం ఎంత వరకు ధర్మం? రచయిత అన్నవాడు మనసులో దాగున్న మధురాత్మను మేల్కొలిపి మహనీయమైన కార్యాలు చేయడానికి పురికొల్పే స్థితిలో ఊండాలి. మంచి రచనలతో మనిషిలోని మంచితనాన్నితట్టి లేపవచ్చు అన్నది శ్రీవాత్సవ ఉద్దేశం..

కవిత చెప్పినా,  కావ్యం అల్లినా,  పాట పాడినా, పద్యం పలికినా, కథ వినిపించినా.. మానవతలోని తరగని విలువలను వెలికి తీసేవిగా ఉండాలి. పదిమందీ పదే పదే పలుమారు తలుచుకునే రీతిలో  రచన సాగాలంటే.. మన ముందు తరం రచయతలు తొక్కిన దారేమిటో తెలుసుకోవాలి. ఆ దారిలో మనం నడిస్తే.. మన అడుగుజాడలు తరువాత తరం వారికి అనుసరించేవి అవుతాయని ఆ లేఖలో శ్రీవాత్సవ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పుకొచ్చారు..

ఈ రచనఽఅయన చేసి ఇప్పటికి సుమారు అర్థశతాబ్దం దాటిపోయింది. అయినా ఈ కాలానికీ శ్రీవాత్సవ చెబుతున్న విషయాలు కొత్త రచయితలు సరిగ్గా అతికినట్లు సరిపోతాయి.

ఆశ్చర్యం కలిగించడం లేదు కాని, ఆ దారిలో ఎక్కువ మంది నడవనందుకే బాధంతా!

-కర్లపాలెం హనుమంతరవు

03 -02 -2021

 

 

Thursday, November 26, 2020

కాఫీ అయ్యర్ -హాస్య కవిత - గుండిమెడ వేంకట సుబ్బారావుగారు

 



 

సర్వసర్వంసహావ్యాపి  సర్వజీవ- జీవనాధారుడగు నొక్క దేవుడెవడో

కల డనగ  విందు గాని నిక్కం బెరుంగ!- వాడదృశ్యుండు మాకేల వాని గోల?

చండార్క కిరణప్రకాండముల్ చొరలేని దండకారణ్య మధ్యమున నీవు!

పేరు చెప్పినమాత్ర నీరు గడ్డలు గట్టు తుహినాచలాగ్రమందునను నీవు!

కడలేని జలరాశి గర్భమందు నడంగి కనరాని దీవులందునను నీవు!

దిగ్దిదిగంతశ్రాంత దేశదేశములందు గల యూళ్ల వాడవాడలను నీవు!

అయ్యరూ! యింక నీవు లేనట్టి తావు- కలదె పరికింప నెందు భూవలయమందు!

అహహ! యింక సర్వవ్యాప్తి యనగ నెవడు-దేవు డన నింక నెవడోయి నీవుగాక!

సకలవిశ్వస్థకీటకకోటి నీ ఫలహారసామాగ్రియం దైక్యమయ్యె!

ఇడెను ముక్కల కాసబడి కుక్క లిప్పుడు మలభక్షణాసక్తి మానుకొనియె!

వాయసంబులు నేడు వాయుసమ్మార్జన ప్రక్రియల్ మాని నీ పంచ చేరె!

గర్భస్థపిండముఖ్యసమస్తమనుజసంఘమ్ము నీ, కాత్మార్పణ మ్మొనర్పె!

భళిరా! జీవకో ట్లిటుల  జీవనవిరక్తి- మాని, యనురక్తి నీపాద మానియుండె!

సరికదా! యింక జగతిలో సర్వజీవ -జీవనాధారుడెవడోయి నీవుగాక!

అయ్యరూ! పృథ్విలోన మాయామనుష్య-మూర్తియైన యా రఘురామమూర్తివోలె

ఈవు నినుగూర్చి సుంతేని యెరుగనేమొ?- సత్యముగ నీవు దేవాంశసంభవుడవు!

పూర్వ మెపుడొ విష్ణువు జగన్మోహినియయి-అమృతమును పంచెనంట సురాసురులకు!

ఇట జగన్మోహనుండవై యీవు నిడవె= అమృత రూపాంతరం బైనయట్టి కాఫి!!

టీ యని, కో కో యని, కా-ఫీ యని, యెద్దాని వింత పేర్లిడి యమృత

ప్రాయంబుగ గొందురొ, యది- యే  యమృతంబని తలంప రేలనొ జనముల్!

నీవె ప్రత్యక్షదైవంబు!  నిన్ను మించు- దేవు డన్యుండు లేడు పృథ్వీస్థలమున!

కలియుగంబున లోకరక్షణము కొరకు - అయ్యరను  పేర దేవుడే యవతరించె!!

***

(భారతి మాసపత్రిక, 1929, జూన్ సంచికలో ప్రచురితం)

 

Friday, September 11, 2020

పుష్ప వివాదము - శ్రీ యామిజాల పద్మనాభస్వామి 'పుష్ప విలాసము' నుంచి సేకరించినది.

 












(కవులూ పువ్వులూ సమాన ధర్మము కలవారు. పరిసరాలను తమ తత్త్వముతో సుగంధభరితము చేయటమే కర్తవ్యం.  యథాశక్తి  ప్రాకృతిక దీక్షతో సామాజిక సేవాబద్ధులై పదుగురితో  'శభాష్' అనిపించు కొనవలె కాని..తమలోతాము తమ తమ ఆధిక్యతను గూర్చి వృథావాదనలకు దిగి  పలుచనగుట తగదు!

కవులతోనే లోకములు తెలవారుట లేదు. ప్రొద్దు గుంకుట లేదు. ప్రాపంచిక సుఖదుఃఖములను పానపాత్రలో కవుల పాత్ర కేవలము రుచి పెంచు మధుర ఫల రసము వంటిది మాత్రమే!  

 

 

ఇట్టి ఊహలు నాలో ప్రబలముగా  ఉన్న  వేళ   నాకు యాదృచ్ఛికముగా    యామిజాల పద్మనాభస్వామిగారి - 'పుష్ప్ప విలాసము', 1953 నాటి ఉగాది భారతి సంచికలో ప్రచురితమైన కవిత కంటబడినది. నాడూ ఈనాడు వలెనె కవులు వర్గముల   మధ్య ఒక స్పర్థ వాతావరణేమేదో ఉండి ఉండవలె. అందుచేతనే ఆనాటి కోకిల స్వరములోని మందలింపుల ఒక పరి ఆలకింపవలెనన్న లక్ష్యముతో  నేటి యువకవివర్యుల  సమక్షమునకు ఈ చక్కని కవితాఖండికను తెచ్చుటకు  అయినది. హితవైన పలుకులకు పాత-కొత్తల తారతమ్యములెందుకు?!

 

"పుష్ప వివాదము"

 

అదొక పూలతోట. పలురకాల పూల జాతులు నవయవ్వనముతో మిసమిస లాడుతున్నవి. ఒక్కొక్క తీగనె పరిశీలన చేసుకుంటో పోయి నేను ఒక తిన్నెపై కూర్చున్నాను. అంతలో మలయమారుత కుమారుని చక్కిలిగింతలతో చెలరేగింది పుప్పొడి దుమారం. చివాలున లేచింది మల్లె. వాదు మొదలైనది.

 

మల్లె

ఏమే! గులాబీ! నిన్న కాక మొన్న వచ్చి నువ్వు తోటివారినందర్నీ ఆక్షేపిస్తున్నావట? ఎందుకా మిడిసిపాటు?

 

తావుల్ జల్లుదువా సుదూరముగ? పంతాలాట సైరింతువా?

ఠీవిన్ నిల్తువ రెప్పపాటయిన? చూడ్కిన్ సైతువా గట్టిగా?

క్రేవన్ బాలసమీరుండు నిలువన్ ప్రేమించి లాలింతువా?

పోవే; నెత్తురు కోతలే కదనె నీ పుట్టింటి సౌభాగ్యముల్.

 

గులాబి మాటపడుతుందా!

సరే వారన్న మాటలు వినవు చూడు!

వలపులు గ్రుమ్మరించి సుమభామల చిక్కని కౌగలింతలం-

దలరెడు తేటిరాజునకు హాయిగ స్వాగతగీతి పాడునా?

వెలువము కర్కశంబు కద; చెల్మి యెరుంగను పాపజాతితో;

తల విలువన్ గణింపవలదా? మరి సంపంగి కన్నె; మల్లికా!

 అంటూ తన వత్తాసుకై మరో ప్రియపుష్ప సేహహస్తాన్ని అందుకున్నది.

 

కేతన

అదలా వుండనీ కానీ అక్కామల్లికా!

ఈ మందార మల్లిక నన్నేమని నిందించిందో విన్నావా?

అంటూ సందు చూసుకుని మరో కేతన తగువు మధ్యకు వచ్చి దూరింది.

 

నీకే చెల్లెనె కేతకీ; కనులలో నిండార దుమ్మోయగా;

తాకిన్ నెత్తురు చింద వ్రేళ్ళు కొరుకన్; సర్పంబుగా నిల్వగా;

ఆ కంఠంబుగ పాపజాతికి శరణ్యంబై మహారణ్య మం

దేశాంతంబుగ రాణివై మెలగ; ఏరీ సాటి నీకిలన్.

అంటూ మందరా మల్లిక ఎత్తిపోసిన తిట్లన్నిటినీ తిరిగి  గుర్తుకు తెచ్చుకుంది.

 

చేమంతిః మూతి మూడు వంకలు తిప్పి అంది

ఓహో! దాని అందానికి అది మురిసిపోవాలిః

పరువంబా! ఎదలోన మెత్తదనమా?భావోల్బణ ప్రక్రియన్ 

గరువంబా!మకరంద గంధ విలసత్ కళ్యాణ సౌందర్యమా?

బిరుసై నిప్పులముద్దమోము కద; యీ పేలాపనంబేల? సం

బరమా? వచ్చిన దాని నోర్చుకొనునా పైపెచ్చు మందారమా?

అనేసింది.

మందార వదనం మరింత ఎర్రబారింది రోషకషాయిత గళముతో

'ఔనౌను నీ శౌభాగ్యనికి నన్నాక్షేపిచ వద్దూ?'

పంతములాడబోకె పయివారలు విన్నను నవ్వుకొందురె;

ఇంతులు దండలల్లకొని యెంతయు ముచ్చటతో ధరింతురం

చెంతువు నీ విలాసము 'లిహీ' యగు మాలతికన్నె ముందు చే

మంతిరొ! ఊక రేకుల సుమంబను పేరది  నీది కాదటే;

అని తగులుకుంది.

(అంతలో చేరువలో నున్న సరోజిని ఫక్కున నవ్వి)

దానికెమిలే! మాలతిలో గర్వమున్నది.

అది రేరాణినటంచు త్రుళ్ళి పడునమ్మా! దాని లేనవ్వులో

పదముల్ పాడునటమ్మ! తుమ్మెదలు; శుబ్రజ్యోత్స్నపైపూతతో

పెదవుల్ నొక్కునటమ్మ! చందురుడు, నన్వీక్షించి బల్ టెక్కుతో

ఎదో అలాపము సేయు మాలతిని నేనిన్నాళ్ళు సైరింతునే?

అని రెచ్చగొట్టేసింది మరంత అనంద ప్రదర్శనయో సన్నివేశం రక్తి కట్టిస్తో!

 

మాలతి ముక్కు ఎగబీల్చి

సైరింపక యేమి సేయగలవే? నీ వాడిన మాటలో?

బంగరు కొండపై పసిమి వెన్నెల చిన్నెల బాలభామ రే

ఖంగనవో యటంచును  ఎగాదిగ చూచెద నన్ను; నీవు రే

లం గమనీయ హాస సువిలాస వికాసములొప్పువాని చం

ద్రుంగని మూతి మూసుకొని క్రుంగవొ? నీ బ్రతు కే రెఱుంగరో?

                      *              *                *    

చతురత మీర నిట్టి సరసా లిక చాలును కట్టిపెట్టు నీ

బ్రతుకు భవిశ్యమున్ కడిగివైచెద; నాచున బుట్టి, పీతలన్

కుతకన్ దాల్చి, నీదు కనుగొల్కుల చిమ్ముదు; నీటి పుర్వువై

అతుకులబొంతవై; కసబువాతెర విప్పకుమా సరోజినీ!

అంటూ ఏకంగా మొదటి పుష్పం మందారం మళ్లీ మాటలు అందుకోవడం౿

 

ఇల్లా ఒకరినొకరు ఆక్షేపిచుకుంటూ ఉండగా శ్రుతి మించిందని

కోకిలమ్మ

భళిరా! పువ్వ్వుల కన్నెలార మన సంబంధంబుతో లోకముల్

తెలవారున్, క్షయి సేయు, నవ్వుకొను, ప్రీతిం జెందు; మీ లోన మీ

రలయింపన్ తగవా? యటంచు పగలన్ న్యాయంబుగా తీర్చు రే

ఖిల పో పొండన గూసె 'కో' యని కుగూకారమ్బు తోరంబుగన్.

అంటూ మందలింపులకు దిగిపోయింది!

 

పూలు తమ తొందరపాటుకు సిగ్గ్గుతో తలలు వంచుకున్నవి. ఒకింత సేపు గడవనిచ్చి ఒకరిని చూసి ఒకరు నవ్వుకున్నవి. తిరిగి పువ్వుల తోట నవ్వుల తోటలా మారిపోయింది.

పువ్వులకన్నా  ఘనులమని కదా మనం మన కవులను  మహా గారవించెదము. ఆ అభిమానమును  నిలుపుకొనవలెను గాని.. దురభిమానము పూనగా పూతన బంధువర్గమును మించి ఈ పరస్పర యుద్ధములేమిటికోయి కవిమిత్రులారా! మరువము దండను బోలు సుగంధ పరిమళములు జల్లు మానవతా మాలికలకు చుట్టుకొను పూవులుగా అలరించుడు! చాలించుడిక ఈ ఈశు బుట్టు విసువు మాటల  రాళ్ల బుట్ట బుగ్గిలో బోర్లించుడు!

***

సేకరణః 

కర్లపాలెం హనుమంతరావు

11 -09 -2020

Saturday, August 8, 2020

శిశయిష -శ్రీ మేడవరపు సంపత్ కుమార్ -కవిత

 

ప్రాచీన కాలపు ఫాసిల్స్ అడుగు పొరల

అంతః తమస్సుల్లో

గాథలు లేని అగాధాల్లో

మేధ చొరని మరుగుల్లో

శయనించాలని నా కోరిక

అపుడు

 నా దేహంలోని ధమనుల్లో ప్రశాంతతానందాలు

ఉద్భవిస్తాయి.

ఈ సిరులు, మరులు నా మజ్జ కోపరిచూర్ణితాలు

కళలు, కాంతులు నా అస్థిలో భూస్థాపితాలు

నీతులు, చేతలు నా రుధిరంలో ఆవిరవబోయే

అంభః గణాలు

 జగతి జంఝాటంలో

ఎందుకీ జాగారం

కాదు ఇది మృతావస్థ,

అందరికీ అందని

చ్యుతి లేని అమృతావస్థ!

***

సేకరణః కర్లపాలెం హనుమంతరావు

08 -08 -2020

(శిశయిష= శాశ్వత నిద్రకు ఒరగాలనే కోరిక)

 

 

 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...