Showing posts with label rachana. Show all posts
Showing posts with label rachana. Show all posts

Sunday, December 12, 2021

గోపాలం బావి – కథానిక -కర్లపాలెం హనుమంతరావు

 

గోపాలం బావి - కథానిక

-కర్లపాలెం హనుమంతరావు

 (రచన మాసపత్రిక ప్రచురితం)

మౌళి సికింద్రాబాద్ స్టేషన్ ముందు ఆటో దిగే వేళకు కృష్ణా ఎక్స్ప్రెస్ బయలుదేరడానికి సిద్ధంగావుంది. ఆటోవాడి చేతిలో వందనోటు పడేసి చిల్లర కూడా అడక్కుండా ఫ్లాట్ ఫామ్ మీదకు జంపయిపోయి కదిలే ట్రైనెక్కేశాడు ఎట్లాగైతేనేం.

బండి వేగం పుంజుకుంది. ఖాళీగా ఉన్న ఓ కార్నర్ సీట్లో కూలబడి విండో గ్లాస్ పైకెత్తి బైటికి చూశాడు.

'బస్సులూ బళ్లూ బైకులూ.. పనిపాటలకెళ్లే జనాలూ.. బండెడు పుస్తకాల బరువు భుజాన మోస్తూనే బండిలోని ప్రయాణీకులకు ఆనందంగా టాటా.. బైబైలు చెప్పేస్తున్న చిన్నారులూ!' .. ఇహ వీళ్లందర్నీ చూడ్డం ఇదే చివరి సారి కాబోలీ జన్మకు!' అనిపించింది మౌళికి.

ఇంకీ లోకానికీ తనకూ రుణం తీరినట్లేనని నిశ్చయించుకుని  ఈవేళ్టికి రెండు రోజులు. ఇది మూడో రోజు పగలు. ఈ రాత్రే తనకు చివరి రాత్రి. మళ్లీ తెల్లారి అమ్మనూ, అమ్మనబ్రోలునూ చూడకూడదని డిసైడయిన తరువాతనే కదా తనా ఉత్తరం ఇంటికి  రాసింది! అమ్మ అది చదివించుకొనే టయానికి తను ఈ లోకంలో ఉండడు.. ఉండకూడదు కూడా.

ఉత్తరంలోని సంగతులు మళ్లీ మళ్లీ గుర్తుకొస్తున్నాయి '..అమ్మా! నేనిక్కడేమీ దొరబాబులా వెలిగిపోడంలా. ఓ కెమేరా మెన్ గాడి దగ్గర క్రేన్ ఆపరేటర్ గా గాడిద  చాకిరీ. రోజుకు రెండొందలొస్తే గొప్ప. అదీ లేనప్పుడు ఫుల్ డే పస్తే! మంచిరోజులు వస్తాయొస్తాయని చూసి విసిగెత్తిపోయిందే అమ్మా! ఇహ నా వల్ల కాడంలేదు.  పేద్ధ సినిమా స్టారయిపోదామని నిద్దట్లో కూడా కలలు కనేవాణ్ణి. నువ్వు ఉడుకుడుకు నీళ్లు మీద దిమ్మరించినప్పుడైనా బుద్ధొచ్చి చచ్చింది కాదు. ఊరొదిలి పారిపోయి నిన్నెంత క్షోభపెట్టానో అప్పట్లో! తెలిసి తెలిసీ తిరిగొచ్చి ఈ పుండును కెలకాలనుకోడం లేదమ్మా మళ్లీ ! ఇప్పుడొచ్చేది ఈ లోకం నుంచీ వెళ్లిపోయే ముందు నీ చేతి గోరుముద్దలు రెండు చప్పరించాలనీ, రజనీ చేతిగాజులు రెండూ తిరిగిచ్చెయ్యాలనీ. నా చావుకు ఎవరూ బాధ్యులు కాదని ముందు పోలీసులు తెలుసుకోడం ముఖ్యం ఈ రోజుల్లో! అందుకోసమైనా ఈ ఉత్తరం భద్రంగా దాచుంచుకో!..' టీసీ రాకతో ఆలోచనల చైన్ తెగిపోయింది.

బండి వెళ్లిపోతోందన్న హడావుడిలో టిక్కెట్ తీసుకోలేదన్న సంగతి అప్పుడు గుర్తుకొచ్చింది. ఒంగోలు దాకా పెనాల్టీ కట్టి సీటులో నిస్త్రాణగా పడుకుండిపోయాడు మౌళి.

ఆడపిల్ల గాజులు కొట్టేసినందుకు యమలోకంలో ఏ శిక్ష పడుతుందో! ఒక్క అమ్మనే కాదు.. నమ్ముకున్న అమ్మాయికీ అన్యాయం చేసిన పాపి కదా తను! శిక్ష రెట్టింపని హూంకరిస్తాడేమో యముండు!

దుర్గ కళ్లలో మెదిలింది. మహా అభిమానం గల పిల్ల. ఎవరినీ హద్దు మీరి దగ్గరకు రానిచ్చేదే కాదు. ఆపరేటర్ పాపారావు గాడి కన్ను దాని మీదెందుకు  పడ్డదో.. ఖర్మం! తన మొహానో వెయ్యి కొట్టి  గెస్ట్ హౌసుకు మళ్లించుకు రమ్మన్నప్పుడే  తను దుర్గను ఎలర్ట్ చేసుండాల్సింది. మందు కొట్టి తను రూంలో గమ్మున పడుండిపోయాడు. అందు వల్లనే అన్యాయంగా దుర్గ బతుకు  ఆగమాగమైపోయింది. దౌర్జన్యం చేసిన పెద్దమనుషులంతా దర్జాగా తప్పుకుంటిరి! ఏ సంబంధం లేని తానొక్కణ్ణి  మాత్రం కేసులో  ఇరకబెట్టిరి! పోలీసు మాయ! వాళ్లు కళ్లు కప్పి సుల్తాన్ బజార్  'చిచ్చా' దగ్గర కుదవ పెట్టిన గాజులు విడిపించుకొని ఈ బండిట్లా ఎక్కడానికి ఎన్ని బ్రహ్మప్రళయాలయ్యాయో!.

ఊరెళ్లినా సేఫ్టీ ఉండదని తెలుసు. తను బతికుంటే అమ్మకింకా క్షోభే! పై కెళ్లిపోడమే బెటర్! అప్పుడే అందరి ప్రాణాలకీ తెరిపి! 'మీల్స్.. మీల్స్' అనే కేకలతో ఈ లోకంలోకి వచ్చిపడ్డాడు  మౌళి.

బండి చినగంజాం స్టేషంలో ఆగివుంది. ఎడం చేతి మీద అన్నం ప్లేటు దొంతర్లుగా పెట్టుకుని క్యాంటిన్ కుర్రాడొకడు మహచలాకీగా దున్నేస్తున్నాడు కంపార్ట్ మెంటంతా. పరీక్షగా చూస్తే  మడం దాకానే ఉంది చెయ్యి!

అన్నం ప్లేటు కళ్లబడగానే ఆకలి ఉవ్వెత్తున ఎగసిపడింది.  అయినా ఆర్డరీయ బుద్ధికాలే. ఇంకో గంటాగితే ఇంటికే పోవచ్చు. అమ్మ చేతి అమృతం ముద్దలు కమ్మంగా లాగించచ్చు.

కాలే పొట్టకు నీళ్లు పట్టిద్దామని బండి దిగి పంపు దగ్గరకు పరుగెత్తాడు మౌళి.  

'సార్సార్! ఈ కాలకూటం తాగితే నేరుగా కైలాసానికే డీలక్స్ జర్నీ! నా దగ్గర అచ్చమైన గంగామృతముంది మాష్టారూ. గ్లాసు రెండే రూపాయలు. ఓన్లీ టూ రుపీస్!' అంటూ ఓ లోటాడు నీళ్లల్లో రెండు  ఐస్ ముక్కలేసి గిలక్కొట్టి అడక్కుండానే చేతికందించేశాడో గడుగ్గాయ్. ఆ బాలుడి మొహం ఎక్కడో చూసినట్లుంది. ఇల్లొదిలి ఏడేళ్లయింది. పదేళ్లయినా నిండని ఈ బుడతణ్ణి  చూసే ఛాన్సెక్కడుంటుందీ!

 వాడి మాటల్లానే వాడిచ్చిన వాటరూ మహతియ్యగా చల్లగా ఉంటంతో మరో మూడు లోటాలు కడుపు నిండా పట్టించేసి పది రూపాయల నోటొకటి వాడి చేతిలో పెట్టి గబగబా కదిలే బండెక్కేశాడు మౌళీ. చిల్లర ఇవ్వడం కోసం కాబోలు పాపం ఆ పసోడు  ఊపందుకున్న  బండి వెంట బడ్డాడు శాయశక్తులా.

బండి అమ్మనబ్రోలు ఔటర్ సిగ్నల్ దగ్గర తిష్ఠేసింది.. స్టేషన్ క్లియరెన్సు కోసం దాని తిప్పలు! పావు గంట గడిచినా మోక్షం లేకపోడంతో.. ఓపిక నశించి బండి దిగి పొలాలకడ్డం బడి ఊళ్లోకి బైలుదేరాడు మౌళి.

పచ్చని పైర గాలి తగిలి వళ్లు పులకరించింది చానాళ్లకు. అదో రకమైన ఉద్యేగం! కొన్ని అనుభూతులకు నిర్వచనాలు కుదరవు.

'ఏడేళ్లాయ తన ఊరి నీళ్లు తాగి! ఈ కొద్ది కాలంలోనె ఎన్ని పోకిరి పోకడలు! జట్కాలకు బదులు ఆటోలు.. కంకర రాస్తా మీద తారు పూతలు!

రోడ్డుకు రెండేపులా ఉన్న  సిరిమావిడి, నేరేడు చెట్లలో  మాత్రం ఏ మార్పూ లేదబ్బా. చిన్నప్పట్లానే దోస్తును గుర్తుపట్టి హుషారుగా విజిల్సేస్తూ మహా ఊగిపోతున్నాయి! వాటి  మానులకు కట్టిన సెట్ బాక్సులను చూసిం తరువాత గాని ఊరి బలుపు మౌళి బుర్రకెక్కిందికాదు.

బయట నుంచి వచ్చే అతిథులను తన గలగలతో పలకరించే చెరువు మాత్రం బాగా చిక్కిపోయుంది. చెరువుకు చుట్టూతా కట్టున్న ముళ్ల కంచెల బారు చిక్కిశల్యమయిన అమ్మ ఆ రోజుల్లో కట్టుకునే చీకిపోయిన చీరెను గుర్తుకు తెచ్చింది.  చెరువు మధ్యలో ఏదో భారీ నిర్మాణమే లేస్తోంది. అమ్మ పొట్ట మీద  ఎన్నటికీ మాయని పుండొకటుండేది ఎప్పుడూ. దానికి మించి వికారం కలిగించిందీ కట్టుబడి మౌళీ కళ్లకు. 

చెరువు గట్టు మీది గోపాలం బావి మాత్రం అప్పట్లానే ఇప్పుడూ సందడిగా ఉండటం కొద్దిగా ఊరటనిచ్చే ముచ్చటబ్బా ప్రస్తుతానికి. ఊరు మొత్తానికి అదొక్కటే మంచినీళ్ల బావి మొదట్నుంచి. 'ఆ బావి జల వంటికి తగిలితే చాల్రా.. ఎంత లావు మొండిరోగమైనా ఇట్టే  లొంగొచ్చెయ్యాల్సిందే! పుణ్యాత్ముడ్రా  మీ నాయన.. అంతా ఆయన చలవ' అనేవారెప్పుడూ వెంకట్రావ్ మేష్టారు. అరవైతొమ్మిదుల్లో వచ్చిన ఉప్పెనకు చెరువు నీరు చప్పలకు తిరిగితే గట్టు మీద నాయన ఈ బావిని తవ్వించాడంటారు! 'ఏ కాలంలోనూ బావిలోని ఊట వట్టిపోవడం ఎరగం.  కొబ్బరి బోండాలు లేని లోటు ఊరుకు తీర్చింది మన  గోపాలం బావే' అనే వారు వెంకట్రావ్ సారు! నాయన పేరు మీదనే బానిని  'గోపాలం బావి' అని ఊరు గౌరవంగా పిలుచుకునేది మొదట్నుంచి.

'ఇంకా నయం! చెరువుతో సహా  ఈ బావి మీదా కబ్జాగాళ్ల  కన్ను పడిందికాదు' అనుకున్నాడు మౌళి కొద్ది సంబరంగా.

శివాలయం వెనక గుండా అడ్డదారిన బడి పోస్టాఫీసు ముందుండే రోడ్డెక్కాడు మౌళి. పోస్టాఫీసు ఇంకా అట్లాగే ఉంది వెలిసిపోయిన మొండి గోడలతో! చువ్వల గుండా పద్దాకా  ఉత్తరాలు సార్ట్ చేస్తూ కనిపించే  పోస్ట్ మేన్ సుబ్బారావు లేడివాళ. వాడు గాని తనను చూస్తే గుర్తుపట్టి గోల చేయడం ఖాయం. ఏ గోలా గబ్బూ లేకుండా ప్రశాంతంగా పోవాలని కదా.. తానింత దూరం పడుతూ లేస్తూ వచ్చిచావడం!

తలొంచుకుని గబగబా రెండే అంగల్లో తూర్పు వీధి చివర్లోని తన ఇంటి ముందు కొచ్చిపడ్డాడు మౌళి.

కంపగేటు తీస్తుంటే గుండెలు గుబగుబలాడాయి. పూరింటి వసారా బోసిగా ఉంది. రాటకు కట్టేసున్న లేగ దూడ తల్లి కోసం కాబోలు అంగలారస్తా ఉంది.  గుడిసె తడికతలుపు బైటకు తాళమేసి ఉండటంతో అరుగు మీదున్న కుక్కిమంచంలో నిస్త్రాణగా వాలిపోయాడు మౌళి. నీరసంతో కళ్లు మూతపడిపోతున్నాయి.

'తాను ఊరు వదిలి వెళ్లే ముందు అమ్మకు నూట నాలుగు డిగ్రీల జొరం. ఓ పూట లేస్తే ఓ పూట పడక ఆ రోజుల్లో అమ్మ వంటి తీరు. ఏడేళ్లయింది.. ఇప్పుడెట్లా ఉందో..ఏంటో!' ఆ మగతలోనే మౌళీకి ఏవేవో పిచ్చి పిచ్చి ఆలాపనలు.

గలగలా మాటలు చెవినబడుతుంటే మెలుకువొచ్చింది మౌళికి. ఆ కంచు కంఠం అమ్మదే! చీరె కొంగుతో మొగం తుడుచుకుంటూ తడికతలుపు తీస్తోన్న తల్లిని చూసి తటాలున లేచి నిలబడ్డాడు మౌళి.

చెట్టంత కొడుకు హఠాత్తుగా కట్టెదుట అట్లా నిలబడే సరికి ఆదెమ్మ మొదట్లో  నివ్వెరబోయింది. ఆనక 'నువ్వా!' అనబోయింది కానీ, ఆ షాక్ నుంచి తేరుకునే లోపే ఉక్రోషం తన్నుకొచ్చేసింది. తడిక తలుపు ధడాల్న తోసి లోపలికి దూసుకెళ్లిపోయింది.

మౌళికి ఆ క్షణంలో ఏం చెయ్యాలో తోచిందికాదు. లోపల్నుంచి తిట్ల వర్షం ఆగకుండా కురుస్తా ఉంది. 'చచ్చానో బతికానో చూడ్డానికొచ్చావా కొడకా! ఏం తక్కువ చేసాన్రా నాయనా నీకు! తండ్రిలేని బిడ్డవని గారాబం చేశా, అదీ నా తప్పు. ఊరి పిల్లోళ్లకు మల్లే వీడి మెడకూ ఓ కాడి తగిలించేసి మడిసెక్కలోకి తోసుంటే తెలిసుండేది. ఎంత కొవ్వెక్కకపోతే ఆడపిల్ల చేతిగాజులు  అట్లా నూక్కెళతావ్రా నువ్వూ! ఒంటాడదాన్ని ఊరి దిక్కుకొదిలేసి ఏడేడకో బోయి ఏందేందో ఊడబొడుస్తాడంటండీ! ఎళ్లాడూ.. ఇప్పుడేవైందంటా!  దేభ్యం మొగమేసుకుని దిగబడ్డానికి సిగ్గూ శరమూ ఉండక్కర్లా! మగ పుటక పుట్టాడూ ఎందుకూ!..'

'..ఇంకా పురాణం ఆపవే తల్లీ.. నీకు పుణ్యముంటది! మూడ్రోజుల్నుంచీ ముద్ద మింగలే. తింటానికింతేమైనా ఉంటే ముందు పెట్టవే! ఆనక నీవెన్నైనా తిట్టు.. పడ్డానికి రడీ.. అందుకనేగా నేనొచ్చిందీ!' ఆప్యాయంగా తల్లి చేతుల్ని తన  చేతుల్లోకి తీసుకోబోయాడు కొడుకు.

విదిల్చి కొట్టిందా చెయ్యిని ఆదెమ్మ ఛీత్కారంగా. 'పోరా! నన్నంటుకోబాక.. దొంగ సచ్చినోడా! వళ్లంతా మంటలు పెట్టినట్లుండాది నిన్నిట్లా చూస్తావుంటే! నువ్వు చేసి పోయిన గనకార్యానికి నా గుండెల్లో ఎన్ని అగ్గి గుండాలు రగులుకున్నాయో తెలుసంట్రా నీకు! ఊరంతటికీ న్యాయం చెప్పే మీ నాయనకు నువ్వెంత గనకీర్తి తెచ్చిపెట్టావో ఎదవా నీకెన్నడైనా తోచిందా కుంకా? నువ్వు చేసి పోయిన ఉద్ధరింపుకు ఊరంతా నా మొహానింత వుయ్యలేదంటే .. అందుక్కారణం మీ నాయన ఊరోళ్ల మజ్జె నిలబెట్టుకున్న పెద్దరికం! అట్లాంటి తండ్రికి ఇట్లాంటి బిడ్డ!' గుండెల మీద చెయ్యేసుకున్నది ఆదెమ్మ.  ఆవేశం ఆగడంలే! 'అయినా నిన్ను కాదులే అనాల్సింది! నిన్ను కన్నందుకు నన్నూ. నీకింత విషం కాక గోరుముద్దలు తినిపించాయే ఈ చేతులూ.. ముందు వీటికి కొండ్రు కాల్చి పెట్టాల వాతలు' అంటూ అమాంత మండే మండే పొయ్యిలోని కట్టెల్లో నుంచి ఓ పేడు లాగి రెండరచేతుల మీదా దబా దబా రుద్దేసుకొంటోంది ఆదెమ్మ. ఊహించని ఈ హఠాత్పరిణామానికి షాకయ్యాడు మౌళి. క్షణంలో తేరుకొని అమాంతం తల్లిని అట్లాగే చేతుల మీద ఎత్తుకునెళ్ళి బైట కనిపించే నీళ్ల తొట్టిలో దిగ్గున వదిలేశాడు.

వేడి వేడి బొబ్బల మీద అమాంతం చల్లటి నీళ్లు పడేసరికి ఆ నొప్పికి తాళలేక రంకెలేయడం మొదలెట్టింది ఆదెమ్మ. గగ్గోళ్లకు నలుగురూ చేరిపోవడంతో మౌళి రాక క్షణాల్లో ఊరంతా గుప్పుమంది.

ఆచారిగారొచ్చి రెండరచేతులకూ చందనం పట్టీలా వేసి నొప్పి తెలీకుండా రెండు అల్లోపతి బిళ్లలిచ్చిపోయే వేళకు మునిమాపు చీకట్లు దట్టంగా కమ్ముకున్నాయి.

చలికాలం కావడాన ఊరంతా ఆ సరికే  మాటుమణిగింది. మాత్రల ప్రభావంతో.. ఆదెమ్మ అట్లాగే కొట్టేసినట్లు మంచంలో పడుంది మూలుగుతా. బుడ్డి దీపం కూడా ఎక్కడుందో తెలీక చీకట్లో అట్లాగే వసారా చవుడు గోడకానుకుని ముంగిలా కూర్చుండిపోయాడు మౌళి.

ఊరిజనాలు మధ్యాహ్నం ఇంట్లో గుమికూడినప్పుడు అనుకున్న మాటలే చెవుల్లో   గింగురుమంటున్నాయింకా. ‘ఆదెమ్మ బతుకు హాయిగా వెళ్లమారిపోతావుంది ఇప్పటి దాకా. ఇదిగో శనీశ్శెరుడు..  దాపురించాడు! మొదట్రోజే  రామాయణం మొదలూ!..'

తల్లికిట్లా అయిందని తెలవగానే చూడ్డానికని వచ్చిన వెంకట్రావ్ మేష్టారు అన్నమాటలు ములుగర్ర కన్నా ఎక్కువగా పొడుస్తున్నాయ్ 'ఏడేళ్ల కిందటి  రోగిష్టి తల్లి కాదురా ఇప్పుడు మీయమ్మ! నువ్విల్లొదిలి పోతే నెల్రోజులు మంచం పట్టింది. అట్లాగే  పోతుందనుకున్నామందరం. తిప్పుకుంది. ఇప్పుడు ఊరంతటికీ నీ తల్లే తల్లి. ఊరు కోసం  మళ్లీ మీ నాన్నయింది మళ్లీ. ద్వాక్రాలనీ, అవనీ, ఇవనీ ఆడంగులందరికి మీ అమ్మేరా ఇప్పుడు అండా.. దండా! యానాదయ్య సారాయంగడి మూతేయించిందాకా ఆదెమ్మ కంటిరెప్ప మూతపడితే ఒట్టు. నీకేం తెలుస్తాయీ ఇట్లాంటి కథలన్నీ? నీ సినిమా కథల కన్నా ఎంతో ఉత్తేజం రగిలిస్తాయివి జనాలల్లో! చిలకలయ్యకు చెరువును పూడ్చేసి పేకాట క్లబ్బు కట్టాలని చాలా రోజుల్నుంచి మాలావు యావ.  దాన్నెట్లాగయినా ఆపించాలని కోర్ట్ల చుట్టూ తిరుగుతా ఉంది మీ అమ్మ ఈ వయసులో ఓపిగ్గా! ఎన్నికలొస్తోన్నాయిరా.. నీకు తెలుసునో లేదో! బలిసిన మోతుబర్లంతా కక్ష కట్టున్నారు ఊరి బక్క జనం మీద. వాళ్ల తరుఫున  ఎదురొడ్డి నిలబడి పోరాడే శక్తి ఒక్క  ఆదెమ్మకే   అనుకుంటున్నదిప్పుడు ఊరంతా. ఇదిగో ఇంతలో నువ్వూడిపడ్డావు. మొదట్రోజే ఇంత భాగోతమయింది! ముందు ముందింకెన్ని కురుక్షేత్రాలు చూడాల్నోనని  జనాలకు భయం పట్టుకుందిరా ఇప్పుడు' అంటూ నిష్ఠురాలింకా చాలానే పోయారు వెంకట్రావు మేష్టారు.

'చెప్పాపెట్టకుండా ఆ రోజట్లా ఇల్లొదిలి మాయమై బాధపెట్టాడు తల్లిని. అడగా పెట్టకుండా ఇప్పుడిట్లా  తిరిగొచ్చి   ఆ నొప్పిని రెట్టింపు చేస్తున్నాడా? తన వల్ల తల్లికి ఎప్పుడూ దుఃఖమేనా?   అప్పుడంటే  తెలీక చేసిన తప్పది. ఇప్పుడిహ తెలిసి తెలిసీ తప్పిదం చేస్తే ఎట్లా? బతికున్నన్ని నాళ్లూ అమ్మకు రవ్వంతైనా లాభం కలిగించని తాను.. కనీసం చచ్చయినా ఏదో ఓ ప్రయోజనం సాధించి పెట్టాలి!   ఎక్కడి దాకానో  పోయి ఏ ఏట్లోనో పడి చావడమెందుకు?  ఆ చావేదో ఊరి జనాల ముందు ఇక్కడే ముగించుకుంటే పాయ1  అమ్మకు ఆ సానుభూతు ఓట్లన్నా ప్లస్సవచ్చు' ఉత్సాహమొచ్చింది మౌళికి అంత నీరసంలో కూడా.

చీకటి గుడిసెలోకి పాక్కుంటూ వెళ్లి అతి కష్టం మీద అగ్గిపెట్టె వెతికి పట్టుకున్నాడు.  బుడ్డి దీపం వెలిగించి ఆ మసక వెల్తురులోనే కుండలోని అన్నం కరళ్లు రెండు కంచంలో పెట్టుకుని కనిపించిన ఆదరువుతో కలిపి ఓ రెండు   ముద్దలు మింగాననిపించాడు. మంచి నీళ్లు రెండు లోటాలు పట్టించేసరికి ఆత్మారాముడు కొంత శాంతించాడు . ఏడేళ్ల కిందట తాను  దొంగిలించిన రజని బంగారు గాజులు తల్లి తలగడ కిందకు తోసి ఆమె  మొహాన్నోసారి ఆప్యాయంగా చూసి తటాలున బైటకొచ్చేశాడు మౌళి.

 

చీకట్లో చూడక కాలు నిద్రలో ఉన్న బర్రె డొక్కలో  పడింది. అది బాధతో  చేసిన అలికిడికి తల్లి లేవక ముందే కంప కంచెతలుపు గభాలున లాగి ఒక్కుదుటున రోడ్డు మీదకొచ్చి పడ్డాడు మౌళి.

చలిగాలికి ఊరంతా అప్పటికే ముడుచుకుని పడుకునుండిపోయి ఉంది. బజారులో నరసంచారం లేదు. మెయిన్ రోడ్డు గుండానే శివాలయం వెనకున్న గోపాలం బావి గట్టుకు చేరుకున్నాడతగాడు.

బావిలోకి తొంగిచూస్తే చీకటి మినహా మరేమీ కనిపించింది కాదు . తన జీవితానికి నకలుగానే ఉందా చీకటి కూడా! ఏడేళ్ల కిందట ఈ చీకటి గహ్వరమే తన అనుంగు స్నేహితురాలు రజనిని ఆవురావురుమని మింగేసింది.

పదమూడేళ్ల రజని తన  తోడును బాగా ఇష్టపడ్డం..  మేష్టారూ నమ్మి రజని ఎక్కడికెళ్ళినా  తననే తోడిచ్చి నిశ్చింతగా పంపించడం.. అవన్నీ గుర్తుకొచ్చాయి మళ్లీ మౌళీకిప్పుడు.

రోజుట్లానే ఆ రోజూ  రజని దైవదర్శనానికని వచ్చి గోపాలం బావి గట్టు మీదెక్కి కూర్చుని ముచ్చట్లే ప్రపంచంగా కేరింతలు కొట్టేస్తోంది తనతో కలసి. తన దృష్టంతా  ఆమె ముంజేతి  బంగారు గాజుల మీదనే. వాటితో భాగ్యనగరం చెక్కెయ్యాలని ప్లాను. బంగారు గాజులు   గుంజుకునే  కంగారులో స్నెహితురాలు  అప్పుడెట్లా నీళ్లలోకి జారిపడిపోయిందో ఇప్పటికీ అర్థం కాని చిక్కు ప్రశ్నే!

తనూ ఇప్పుడు అట్లాగే బావి నీళ్లలోకి జారిపోవాలి ముందు. తెల్లారక ముందే నీళ్ల కోసమొచ్చే జనాల కళ్లబడే తన విగత శరీరమే..  'బిడ్డను పోగొట్టుకున్న తల్లి' ముద్రతో  ఎన్నికల్లో అమ్మను అఖండ విజయం తెచ్చిపెట్టేది.  బతికుండి ఎన్నడూ తల్లికి సాయమందించని  తనకు కనీసం చచ్చిన తరువాతైనా  ఆ లోటు పూరించుకునే అవకాశం దక్కినందుకు చచ్చే అనందంగా ఉంది.. అనుకున్నాడు మౌళి అర్థంపర్థంలేని భావోద్వేగంలో పడి కొట్టుకుపోతున్న కారణంగా.  

గుడి వంకో సారి, ఇల్లున్న వీధి వంకో సారి చూసి రజనిని తలుచుకుని, అమ్మని తల్చుకుంటూ చేంతాడు కట్టిన కాలితో అదే తాడు చుట్టి బావి వర మీద ముందే పెట్టుకునున్న బండరాయిని  గట్టు మీద నిలబడి కాలిబంతిలా తిన్నగా బావిలోకి తన్నేశాడు.. మౌళి!

---

మౌళి కళ్లు తెరిపిడి పడేసరికి మొహంలో మొహం పెట్టి కన్నీళ్ల  తెరల గుండా రెప్పయినా కొట్టకుండా ఆబగా  చూస్తోన్నది తల్లి ఆదెమ్మ! చుట్టూ గుమికూడి ఉన్న జనం! తన  చావు ప్రయాస విఫలమయిందని అర్థమవడానికి ఆట్టే కాలం పట్టలేదు మౌళికి.  సిగ్గుపడి తల పక్కకు తిప్పేసుకున్నాడతగాడు.

'ఇప్పుడు సిగ్గుపడి ఏం లాభమంటా? ఆ ఇంగితం దూకే ముందుండాల! ఊరికి మీ నాయన ఇచ్చిపోయిన వరాలలో చివరికి మిగిలింది  'గోపాలం బావి' ఒక్కటే! దీన్నీ ఊరికి కాకుండా చేయాలనేనా నీ కిక్కడ దాకా వచ్చి  చావాలనే దుర్బుద్ధి పుట్టింది!'  ఆదెమ్మ మాటల్లోకి అదే పదును వచ్చిపడింది మళ్లీ. 

'ఇప్పుడా మాటలన్నీ అవసరమా ఆదెమ్మా!' పెద్దరికంతో అడ్డుకోబోయారు వెంకట్రావు మేష్టారు.

'అవుసరమే సారూ! అక్కడ ఆ ఛండాలప్పని చేయబట్టి కాదూ  ఇక్కడి కొచ్చి  వీడిట్లాంటి చావు చావాలనుకోడం?  వీడిప్పుడు ఇందులో పడి చస్తే  నీళ్లు మైలపడ్డాయని సాకు చూబెట్టి బావిని పూడ్పించెయ్యరా త్రాష్టులంతా కల్సి! ఆ గ్యానం లేనప్పుడు  వీడికీ ఇగ ఆ త్రాష్టులకూ తేడా ఏముండాదంట?'

'ఇక వూరుకో అత్తమ్మా! మౌళిని గురించి మరీ అంత అన్యాయంగా మాట్లాడద్దు!' అడ్డుపడింది అక్కడే ఉన్న ఓ అమ్మాయి.  'పొరపాట్లు జరగడం సహజం  ఎవరికైనా. తప్పు తెలుసుకుని మన్నించాలని కాళ్లట్టుకోడానికొచ్చాడు నీ కొడుకు. అదే గొప్ప ఈ రోజుల్లో! జరిగినవాటన్నిటికీ మౌళి ఎంత బాధ పడతున్నాడో నాకు తెలుసు' 

ఏడేళ్ల కిందట తనతో  చివరి సారి బావి గట్టు మీద కూర్చుని కాళ్లాడించుకుంటూ కులాసాగా కబుర్లు చెప్పిన స్నేహితురాలు రజని ఆమె! 

నివ్వెరపోయాడు మౌళి  చందమామ లేని  ఆకాశంలా  బోసిపోత్తున్న ఆమె నుదురు చూసి. మాంగల్య సౌభాగ్యానికి అమె దూరమైనట్లు అర్థమవడానికి ఆట్టే సమయం పట్టింది కాదు .

రజనిని ఆనుకుని తడిసిన బట్టలతో వజవజా వణుకుతూ నిలబడున్నాడో బుడ్డోడు. పరీక్షగా  చూస్తే గుర్తుకొచ్చింది.. నిన్న చిన్నగంజాం రైలుస్టేషనులో అమృతం తాగించిన బాలజగన్మోహనుడు ఈ భడవానే! వీడికి రజని  పోలికలు ఉండబట్టే ఎక్కడో చూసినట్లనిపించింది నిన్న.

---

'బావి నీళ్ల కోసం నేనూ బాలూ తెల్లారగట్లే చెరువు దగ్గరికొచ్చాం.. మౌళీ! లోపల్నుంచీ మూలుగులు వినిపిస్తా ఉంటే వీడిని దింపించా..' అంది రజని ఇంటి దగ్గర.

'ఈ బుడ్డోడు కనక ఆ సాహసం చేయకపోయుంటే నువ్వు ఇక్కడా ఆ హైదరాబాదుకు మల్లే..' వెటకారం చేయబోయింది ఆదెమ్మ! అడ్డుకుంది రజని 'అందరూ  అనుకుంటున్నట్లు మౌళీ తెలిసి ఏమీ తప్పు  చెయ్యలేదత్తమ్మా  ఎక్కడా! ఒక అమ్మాయిని రక్షించ గలిగే స్థితిలో ఉండీ తనా పని చేయలేదన్న దిగులుతో కుమలడమే తప్పించి. ఆ బెంగలోనే నిన్ను చూడాలని ఇక్కడిదాకా పరుగెత్తికొచ్చింది.నువ్వేమో... '

'ఇంతలా వెనకేసుకొస్తున్నావేంటి తల్లో! అంతా నీకే తెల్సన్నట్లు ..' ఆదెమ్మ కోపం ఇంకా తగ్గనే లేదు.

'తెలుసు అత్తమ్మా! మౌళి నీకని రాసిన ఉత్తరం నేనే చించి చదువుకుంది ముందు! అందుకే వీడిక్కడికొచ్చి ఏదో చేసుకోబోతున్నాడన్న అనుమానం వచ్చింది. నేనే మా బుడ్డోడిని ఓ కంట కనిపెట్టి ఉండమని పురమాయించా!' అంది పిల్లవాడిని చూపిస్తూ.

రజనికి మాష్టారు చేసిన సంబంధం మంచిది కాదని చేసిన తరువాత గాని తెలిసిరాలేదుట. బిడ్డ పుట్టిన తరువాత తాగుడు మరీ ఎక్కువై లివర్ జబ్బుతో పోయాట్ట రజని మొగుడు. అతగాడి బ్రాంచ్ - పోస్టాఫీస్ పని రజనీ పరమయిందందుకే ఇప్పుడు. కాబట్టే మౌళి ఉత్తరం ఆమెకు ముందుగా చదివే అవకాశం కలిగింది.

 వేణ్ణీళ్లకు చన్నీళ్లుగా శని ఆదివారాలలో తన పిల్లవాడిని ఇట్లా స్టేషన్లో మంచినీళ్ళు అమ్మించే పనికి రజని ప్రోత్సహించడం వెంకట్రావు మేష్టారి శిక్షణలో అబ్బిన  సంస్కారం వల్లనే. 

 వాడి  సాదర ఖర్చులకన్నా ఇట్లా సంపాదించుకోమని నేనే ప్రోత్సహిస్తున్నా మౌళీ! వీడిదేముంది గానీ,  ఈ ఊళ్లో చాలా మంది మీ నాయన గోపాలం బావి ప్రసాదించే అమృతం మీదనే అధారపడి జీవనం సాగిస్తున్నారు. తెలుసా నీకు!  నువ్వా బావినే నీ అఘాయిత్యానికి లక్ష్యంగా ఎంచుకుంటివి.. తెలీక! అందుకే అత్తమ్మకు  అంత కోపం తన్నుకొచ్చింది! అత్తమ్మిప్పుడు ఊరి మనిషి' అని సర్దిచెప్పింది రజని.  

 అమ్మ  చెప్పిన మీదట  మౌళీనే స్వయంగా  బంగారు గాజులు తిరిగిస్తూ   క్షమాపణలు అడిగినప్పుడూ మందలిస్తూ అట్లాగే పెద్దరికం చూపించింది రజని  'ఛఁ.. ఛఁ! నువ్వు  నా లైఫ్ లో మా నాన్న తరువాత అంత  క్లోజెస్ట్ ఫ్రెండువిరా! నాకు క్షమాపణలు  చెప్పడేమేంటి నాన్సెన్స్ కాకపోతే!  రియల్ లైఫేమన్నా నువ్విష్ట పడే రీల్ లైఫా?  నువ్విచ్చినా నాకు ఈ బంగారు గాజులు పెట్టెలో పెట్టి పూజించుకోడానికి తప్ప మరెందుకూ పనికిరావు కానీ, ఒక పని చేద్దాముట్రా మౌళీ  ఇద్దరం కలసి! అత్తమ్మ ఆధ్వర్యంలో మట్టి చట్లు ఎట్లాగూ తయారవుతున్నాయి ఊళ్లో!  బైటకు కదల్లేని ఆడంగులు.. వికలాంగులు వాటి ద్వారానే నాలుగు రాళ్లు కళ్ల చూస్తున్నారీ మధ్యన  ఊళ్లో! వాళ్ల వస్తువులను ఓపెన్ మార్కెట్లకు పరిచయం చేసే  ఉపాయేలేమైనా ఉన్నాయేమో.. ఎక్స్ప్లోర్ చేద్దామా ఓ మార్కెటింగ్ ఏజెన్సీలాంటిది ఏదైనా పెట్టి.'

మట్టి ముంతల్లో నిలవుంచిన నూతి నీళ్లు తాగితే ఎక్కడి మొండి రోగాలైనా లొంగివస్తాయ్ కూడా!' అన్నారు అక్కడే ఉన్న ఆచారిగారు కూడా.  

'నువు చెపితే ఈ మొండాడు  వింటాడమ్మా! అట్లాగైనా వీడు మళ్లీ ఓ దారిలో పడితే నాకన్నా మించి సంబరపడేదింకెవరు తల్లీ!' అని కన్నీళ్ళు పెట్టుకుంది ఆదెమ్మ చాలా రోజుల తరువాత కొడుకును ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని.

'శుభం. అయ్యలాగా ఓ మంచి నీళ్ల నుయ్యి తవ్వించలేకపోయినా ఆ నూతిలోని అమృతజలతో బిడ్డ నలుగురి నాలుకలు తడపబోతున్నాడన్న మాట. ఆశీస్సులు చిరంజీవులు ఇద్దరికీ' అన్నారు అక్కడే ఉండి అంతా వింటున్న వెంకట్రావ్ మేష్టారు.  

-కర్లపాలెం హనుమంతరావు

(రచన మాసపత్రికలో ప్రచురితం)


కోదండం- కథానిక: - కర్లపాలెం హనుమంతరావు ( రచన మాసపత్రిక- కథాపీఠం పురస్కారంతో ప్రచురితం)

కథానిక: 

కోదండం 

- కర్లపాలెం హనుమంతరావు

( రచన మాసపత్రిక- కథాపీఠం పురస్కారంతో  ప్రచురితం) 


శ్రీలక్ష్మీనారాయణ - అది వాడి పూర్తి పేరు.


వట్టి 'లక్ష్మీనారాయణ' అని పిలిస్తే పోట్లాట పెట్టుకునే


వాడు.


'శ్రీ' అంటే వాడికంత ఇష్టం.


'శ్రీ' ఎవరి కిష్టం ఉండదు కనక! కానీ... వాడి ఇష్టం ప్రత్యేకమైనది.


మా ఊరి గడియార స్తంభం సెంటర్లో రామమందిరం వెనకాల ఉండేది వాళ్ల ఇల్లు. రోడ్డు వైపుకి దిగిన పెంకుటిల్లు వసారాలో నాలుగు పాత డబ్బాల వరసల వెనక కాటా ముందు కూర్చునుండేవాడు వాళ్ల నాన్న - శ్రీరాములు.


ముతక బనీను, మోకాలు చిప్పలపై దాకా పంచెకట్టు.. గుళ్లో వినాయకుడికి మల్లే ఎప్పుడు చూసినా అదే ఆయన అవతారం.


వాడి కోసం వెళ్లినప్పుడల్లా ముందు కొట్లో ఈయన ఆపేసేవాడు. నోరారా పలకరించేవాడు.


"సుబ్బారావు పంతులుగారబ్బాయి వచ్చాడ్రా! బైటికిరా!" అని లోపలికి కేకేసేవాడు.


నన్ను మాత్రం ఎప్పుడూ నేరుగా లోపలికి పొమ్మనేవాడు


కాదు. కొట్టు వెనకున్న గదుల్లో ఏముంటుందో!... మాకు అప్పట్లో ఒక పెద్ద సస్పెన్స్,


"వాడిని వాళ్ల నాన్న కోదండం వేయిస్తుంటాడురా! అందుకే ఒక పట్టాన వీడు బైటికి రాడు" అనేవాడు మా కామన్ ఫ్రెండ్ చంద్రశేఖర్.


'కోదండం పేరు వినడమేగానీ... ఎప్పుడూ ఎట్లా ఉంటుందో చూడలేదు.


"రెండు కాళ్లు నడిమికి విరిచి వాటి మధ్యలో నుంచీ చేతులు బయటికి లాగి మెడ చుట్టూ గట్టిగా పట్టుకోనుం డాలి. పోలీస్టేషన్లో మా నాన్న దొంగల్ని అట్లాగే చేయిస్తుం టాడు" అని చెప్పాడు చంద్రశేఖర్.


వాళ్ల నాన్న కానిస్టేబుల్. నమ్మబుద్ధి కాలేదు. నేరుగా ఒకసారి శ్రీలక్ష్మీనారాయణగాడినే అడిగితే అదోలా చూసాడు నా వంక.


రెండు రోజులు నాతో మాట్లాడలేదు.


దొంగలకు పడే శిక్ష వాడికెందుకు వేయాలో అర్థం కాలేదు. తొమ్మిదో ఎక్కం కూడా వెనక నుంచి గడగడా వప్పచెబుతాడు. నోటి లెక్కలు వాడి నాలిక మీదే ఉంటాయి. బుక్కులో ఇచ్చిన లెక్కలయితే వాడికన్నా ముందు చేసి చూపించడానికి చాలా తంటాలు పడాల్సి వచ్చేది మాకు. అట్లాంటి వాడికి మరి ఈ 'కోదండం' ఎందుకో!


హైస్కూల్లో కూడా మా ఇద్దరిదీ ఒకటే సెక్షన్ ప్రతిదానిలో పోటీ ఉండేది మా ఇద్దరి మధ్య.


ఒక్క దాంట్లో మాత్రం వాడి ముందు నేను తేలిపోయే వాణ్ణి.


పైస, రెండు పైసలు, మూడు పైసలు, కొత్త బిళ్లలు ముద్రించేవాళ్ల రోజుల్లో. కొత్త నాణేల కోసం అందరం వెంపర్లాడుతుండేవాళ్లం. వాడు కొట్లో నుంచి కొట్టుకొచ్చిన కొత్త బిళ్లల్ని లాభానికి మారు బేరం చేస్తూండేవాడు. అయిదు పైసలకు మూడు పైసల కొత్త బిళ్ల, మూడు పైసలకి పైస కొత్త బిళ్ల - ఇట్లా సాగుతుండేది 'చిల్లర' వ్యాపారం.


పంతుళ్లకు మాత్రం లాభం చూసుకోకుండా ఇస్తుండే వాడు. వాడి లౌక్యం ముందు 'ముందు నుంచీ' మేం దిగదుడుపే!


మా ఊరి గ్రంథాలయంలో ఒక ఖాన్ మేష్టరుగారు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వాళ్ల పరీక్షలకు పిల్లల్ని తర్ఫీదు చేస్తుండేవారు. ఆడపిల్లలే ఎక్కువ ఆ క్లాసుల్లో. మా అక్కకు తోడుగా వెళ్లే నన్నూ పరీక్షలకు కూర్చోబెట్టేరు మేష్టారు. సెకండ్ ఫారానికే మూడు పరీక్షలు పాసయ్యాను. నన్ను చూసి శ్రీ లక్ష్మీనారాయణ కూడా! ఆడపిల్లలతో కలిసి కూర్చోడం నామోషీ అనిపించి నేను క్లాసులకు వెళ్లడం మానేస్తే... వాడు మాత్రం చదువు కొనసాగించి పదకొండో

తరగతికే 'విశారద' పూర్తి చేసేసాడు.


డిగ్రీ చదువుకి నేను బందరు వచ్చేయడం వల్ల వాడి విశేషాలు తెలియడం మానేసాయి. అప్పుడప్పుడూ చంద్ర శేఖరే ఏవో వార్తలు చెవులో వేస్తుండేవాడు. సెవెంత్ ఫారం పూర్తయింతరువాత వాడు చెన్నై పోయి 'విజయచిత్ర' అనే సినిమా పత్రికలో సబ్-ఎడిటర్గా చేరాడని చెప్పాడొకసారి.


డిగ్రీ అయి ఉద్యోగం కోసం ప్రయత్నించే రోజుల్లో... మా బాబాయికి వంట్లో బాగోలేదంటే చూడటానికి మా ఊరు వెళ్లా. అనుకోకుండా శ్రీరాములు దుకాణం ముందు


నుంచీ వెళ్లాల్సొచ్చింది. దుకాణం అట్లాగే ఉంది.


మా నాన్నగారొకసారి క్లాసులో వాడి వీపు మీద పేం బెత్తం ఆడించారు. పాపం భయంతో లాగూ తడుపుకు న్నాడు. మూడు రోజుల దాకా బడికి రాలేదు. ఏమయిందో కనుక్కుందామని ఇంటికెళితే... అప్పుడూ శ్రీరాములు నన్ను లోపలికి పోనీయనే లేదు. 'రేపొస్తాడులే' అంటూ ఇంత కలకండ ముక్క చేతిలో పెట్టి పంపిచేశాడు.


ఆ సంగతులన్నీ తలుచుకుంటూ సరదాగా గడిపేశాం ఇద్దరం ట్రయినింగ్ వారం రోజులూ.


అదే ముతక బనీను... మోకాలు చిప్పల పై దాకా మాటల సందర్భంలో మా ఫ్యామిలీ హైదరాబాద్లోనే ఉందని తెలుసుకుని చిరునామా అడిగి తీసుకున్నాడు.


పంచకట్టులో కాటా ముందు శ్రీరాములు!


ప్రాణం ఉసూరుమనిపించింది.


 మా బ్యాంకులోనే అధికార భాష (హిందీ) ఆఫీసరుగా చేరి మూడేళ్లయిందిట. హిందీ క్లాసులు తీసుకోవడానికి ఇట్లా ట్రయినింగ్ సెంటర్ కొస్తుంటానని చెప్పాడు.


లంచ్ అవర్లో పిలిచి కూర్చోబెట్టుకుని, “నా క్లాస్మేట్ నన్ను పేం బెత్తంతో బాది ఇంత పెద్దవాడిని చేసిన మాతరగతికే 'విశారద' పూర్తి చేసేసాడు.


డిగ్రీ చదువుకి నేను బందరు వచ్చేయడం వల్ల వాడి విశేషాలు తెలియడం మానేసాయి. అప్పుడప్పుడూ చంద్ర శేఖరే ఏవో వార్తలు చెవులో వేస్తుండేవాడు. సెవెంత్ ఫారం పూర్తయింతరువాత వాడు చెన్నై పోయి 'విజయచిత్ర' అనే సినిమా పత్రికలో సబ్-ఎడిటర్గా చేరాడని చెప్పాడొకసారి.


డిగ్రీ అయి ఉద్యోగం కోసం ప్రయత్నించే రోజుల్లో... మా బాబాయికి వంట్లో బాగోలేదంటే చూడటానికి మా ఊరు వెళ్లా. అనుకోకుండా శ్రీరాములు దుకాణం ముందు నుంచీ వెళ్లాల్సొచ్చింది. 

దుకాణం అట్లాగే ఉంది. 

"వీడు చెన్నైలో మంచి ఉద్యోగమే వెలగబెడుతున్నాడు గదరా! అమ్మానాన్నల్ని తీసుకెళ్లచ్చు గదా!" అన్నాను చంద్రశేఖర్.


"వాడి తల్లి పోయిందిరా పోయినేడాది వచ్చి వారం రోజులు కూడా లేడిక్కడ. ఇంక తండ్రి నేం తీసుకెళతాడు! తెనాలమ్మాయిని చేసుకున్నాడు. ఇప్పుడంతా ఆవిడదే రాజ్యం అంటున్నారు" అన్నాడు చంద్రశేఖర్.


ఇంక వాడి సంగతి తలుచుకోవాలనిపించలేదు.


బ్యాంకులో ఉద్యోగం వచ్చిన తరువాత పెళ్లి చేసు కున్నాను. కావాలనే వాడిని పిలవలేదు. జీవితంలో మళ్లీ కలవాలనీ అనుకోలేదు.


పదేళ్లు గడిచాయి.


మా బ్యాంకు వాళ్లిచ్చే ట్రైనింగ్ ప్రోగ్రాం కోసం హైదరా బాద్ వచ్చినప్పుడు అనుకోకుండా తగిలాడు మళ్లా శ్రీలక్ష్మీ నారాయణ.


ఫ్యాకల్టీ లిస్టులో వాడి పేరును చూసాను గానీ... క్లాసు కొచ్చిందాకా వాడేనని తెలుసుకోలేకపోయాను. ఇద్దరం కలిసి చదువుకున్నాం. ఇప్పుడు విద్యార్థిగా ముందు వరసలో నేను. హిందీ పాఠాలు చెప్పే ఇన్స్ట్రక్టర్ డయాస్ మీద వాడు!


సుబ్బారావు పంతులుగారబ్బాయి” అని తోటి ఫ్యాకల్టీకి సంతోషంగా పరిచయం చేస్తుంటే... నా మనసులో అప్పటి దాకా ఉన్న వ్యతిరేక భావం కరిగిపోయింది.


మా నాన్నగారొకసారి క్లాసులో వాడి వీపు మీద పేం బెత్తం ఆడించారు. పాపం భయంతో లాగూ తడుపుకు న్నాడు. మూడు రోజుల దాకా బడికి రాలేదు. ఏమయిందో కనుక్కుందామని ఇంటికెళితే... అప్పుడూ శ్రీరాములు నన్ను లోపలికి పోనీయనే లేదు. 'రేపొస్తాడులే' అంటూ ఇంత కలకండ ముక్క చేతిలో పెట్టి పంపిచేశాడు.


ఆ సంగతులన్నీ తలుచుకుంటూ సరదాగా గడిపేశాం ఇద్దరం ట్రయినింగ్ వారం రోజులూ.


అదే ముతక బనీను... మోకాలు చిప్పల పై దాకా మాటల సందర్భంలో మా ఫ్యామిలీ హైదరాబాద్లోనే ఉందని తెలుసుకుని చిరునామా అడిగి తీసుకున్నాడు.


వాడి కారులోనే నన్ను మా ఇంటి దాకా వచ్చి దింపి పోయాడు. మా పిల్లలిద్దర్నీ చూసి బాగా ముచ్చట పడ్డాడు.


"రేపాదివారం నువ్వు ఫ్యామిలోతో సహా మా ఇంటికి భోజనానికి రావాలిరా! మా పిల్లలకి మీ పిల్లల్ని చూపిం చాలి" అని ఇంటి అడ్రసిచ్చాడు.


వీడి కోసం కాకపోయినా శ్రీరాములు కోసమన్నా వెళ్లి చూసి రావాలి. చిన్నప్పుడు ఎప్పుడు ఇంటికెళ్లినా నోరారా ఆప్యాయంగా పలకరించేవాడు. ఇంత కలకండ పలుకో, బెల్లం ముక్కో చేతిలో పెట్టకుండా వదిలిపెట్టేవాడు కాదు.


“మీ నాయన దయవల్లే మా బడుద్ధాయికి ఈ మాత్ర మన్నా అక్షరం ముక్క వంట బట్టింది” అంటూ మా నాన్న గారిని తలుచుకోకుండా మాత్రం వూరుకొనేవాడు కాదు.



ఆ ఆదివారం ఫ్యామిలితో సహా శ్రీలక్ష్మీనారాయణ ఇచ్చిన చిరునామా పట్టుకుని వెదుక్కుంటూ వెళ్లా. ఈస్ట్ ఆనంద్బాగ్ రైలుకట్ట కవతల ఎక్కడో ఉందా ఇల్లు. కొత్తగా కట్టుకున్నాడు లాగుంది - పక్కనున్న ఇంట్లో అద్దెకుంటున్నాడు.


ఆటో శబ్దం విని కూడా ఎవరూ బైటకు రాలేదు. కాలింగ్ బెల్ మోగించిన మూడోసారికి మెల్లగా తలుపు తెరుచుకుంది.


ఆమె శ్రీలక్ష్మీనారాయణ భార్య లాగుంది. మా పరిచయం చెప్పుకున్నా పెద్దగా స్పందన లేదు. “కూర్చోండి....” అంటూ సోఫా చూపించి లోపలికి పోయింది.


లోపలనుంచీ ఏవో మాటలు. పది నిమిషాల తరువాత గానీ శ్రీలక్ష్మీనారాయణ బైటికి రాలేదు.

‘‘శ్రీకనకధారస్తవం' చేస్తున్నారా! మధ్యలో లేవడం అరిష్టం. బ్రాహ్మలబ్బాయివి నీకు తెలేనిదేముంది!"


అన్నాడు. తెలివిగా. అప్పుడొచ్చి పలకరించిపోయింది వాడి భార్య. పిల్లలు కనపడలేదు.


“ఏరీ?” అనడిగితే, "ఆదివారం గదా వాళ్ళ మామయ్య వాళ్లింటికెళ్లారండీ! మీరిట్లా వస్తారని తెలిస్తే ఆపి ఉండే దాన్ని" అంది మళ్లా బైటికొచ్చి, ఆమె వాడిని లోపలికి


తీసుకెళుతూ.


ఇద్దరూ లోపల ఏవో మల్లగుల్లాలు పడుతున్నారు. ముళ్ల మీద కూర్చున్నట్లుంది మాకు. మా ఆవిడ మొహం చూడాలి. పిల్లలకు భోజనాల టైము కూడా దాటి పోయింది. వరస చూస్తే భోజనం ఏర్పాట్లేమీ జరిగినట్లు లేవు. మర్యాద కాపాడుకోవడం మంచిదనిపించింది.


వాడిని బైటికి పిలిచి మా చిన్నాడు కడుపులో నొప్పంటు న్నాడురా! వెంటనే వెళ్లి డాక్టరుకు చూపించాలి. మళ్లీ కలు ద్దాంలే తీరిగ్గా” అని ఎట్లాగో బైట పడ్డాను.


మేం తిరిగి వచ్చేటప్పుడు మొగుడూ పెళ్లాల మొహాల్లో కనిపించిన 'రిలీఫ్ ని నేనెప్పటికీ మర్చిపోలేను. “మా కొత్త ఇల్లు చూపించాలనుకున్నానే!" అని వాడూ, "ఇక్కడే ఉంటున్నాడా... ఇంకా?” అనడిగాను



గృహప్రవేశానికి రమ్మనమని ఫోనులో ఆహ్వానం. “టైం ఎక్కువ లేదురా! పర్సనల్గా వచ్చి పిలవలేదని అనుకోవద్దు. కార్డ్ పంపిస్తా. కంపల్సరీగా రావాలి" అంటూ ఇంకోసారి ఇంటి అడ్రెసు అడిగి తీసుకున్నాడు.


కార్డు రాలేదు. వచ్చినా మేము పోదలుచుకోలేదు. ఇంక జీవితంలో వాడిని తలుచుకోదలుచుకోలేదు.


చంద్రశేఖర్ కొడుకు పెళ్లంటే మళ్లా మా ఊరు పోవాల్సొచ్చింది చాలా ఏళ్ల తరువాత.


మాటల మధ్యలో వాడే శ్రీలక్ష్మీనారాయణ ప్రసక్తి తీసు కొచ్చాడు.


వాడి ఇంట్లో మా అనుభవాన్ని గురించి చెప్పాను. “శ్రీరాముల్ని చూస్తావా?” అన్నాడు చెప్పిందంతా ఓపిగ్గా విని చివరకు.










మాటల మధ్యలో వాడే శ్రీలక్ష్మీనారాయణ ప్రసక్తి తీసు కొచ్చాడు.


వాడి ఇంట్లో మా అనుభవాన్ని గురించి చెప్పాను. “శ్రీరాముల్ని చూస్తావా?” అన్నాడు చెప్పిందంతా ఓపిగ్గా విని చివరకు. 

" ఇక్కడే ఉంటున్నాడా.. ఇంకా? " అనడిగాను 

ఆశ్చర్యంగా.


పెళ్ళి హడావుడి తగ్గింతరువాత బైక్ మీద నన్నొక చోటికి తీసుకెళ్లాడు.


బెస్తపాలెం వెళ్లే దారిలో ఉన్న ఆశ్రమం అది. ఊరుకు బాగా బయటగా జీడి మామిడి తోపుల మధ్యలో ఉందది. ‘వృద్ధాశ్రమం' బోర్డు చూసి, "శ్రీరాములు ఉంటుంది ఇక్కడా?" అని నివ్వెరపోయాను.


“మరి!” అన్నాడు చంద్రశేఖర్.


విశాలమైన ఆవరణలో మూడు వైపులా చిన్న చిన్న గదులు మధ్యలో రామమందిరం. దానిని ఆనుకున్న చిన్న తోట. కొంతమంది ముసలివాళ్లు అందులో పనిచేస్తున్నారు. ఇంకొంతమంది గుడి ముందు అరుగుమీద ఎండపొడకు సేద తీరుతున్నారు. ఎక్కడా శ్రీరాములు కనిపించలేదు.


ఆఫీసు గదిలోకి వెళ్ళి అడిగాడు చంద్రశేఖర్.


కంప్యూటర్ ముందు కూర్చోనున్న అమ్మాయి చాలా ప్రశ్నలే అడిగింది. సంతృప్తి పడింతరువాతగానీ లాంగ్బుక్ ఓపెన్ చేయలేదు.


“ఆయనకు చానాళ్లుగా వంట్లో బాగుండటం లేదు. ఎక్కువగా డిస్టర్బ్ చేయకండి" అని సలహా ఇచ్చి ఆ విజిటర్స్ బుక్ మా ముందుకు జరిపింది సంతకాల కోసం. 

అది శ్రీరాములు పర్సనల్ షీట్ లాగుంది - అట్టే విజిటర్స్ సంతకాలు లేవు. శ్రీలక్ష్మీ నారాయణవి మాత్రం నాలుగైదు కనిపించాయి. అదీ ఏడాదికి రెండుసార్లు. శ్రీరాములు చేరి రెండేళ్లయినట్లుంది.







 కిచెన్ పక్కనున్న చిన్న గదిలో ఉన్నాడాయన. 

కట్టు. నిస్త్రాణగా పడుకోనున్నాడు ఐరన్ మంచం మీద. ఏమని పలకరించాలి? పేరు చెబితే గుర్తుపట్టలేడు.


'సుబ్బారావు పంతులు గారబ్బాయి'నని చెప్పుకున్నా. కళ్లల్లోకి కాంతి వచ్చింది.


నోటి వెంట ఏవో శబ్దాలు వచ్చాయిగానీ... మా కర్థం కాలేదు.


పది నిముషాలకు మించి కూర్చోలేకపోయాను. మన సంతా పిచ్చి కాకరకాయను కొరికినంత చేదుగా ఉంది.


‘ఒక్కడే కొడుకు. ఎంత గారాబంగా పెంచుకున్నాడు! ఎప్పుడూ కొడుకు నామస్మరణే! బిడ్డను వృద్ధిలోకి తేవాలని ఆ డొక్కు డబ్బాల వెనక కాటా ముందు కూర్చుని ఎంతలా ఆరాటపడేవాడో!'

తలుచుకుంటే కళ్ల వెంబడి నీరు గిర్రునతిరిగింది. 


"నువ్వు పట్టించుకోలేదు కనక నీకు తెలీదురా! వాడి ప్పుడు బ్యాంకులో లేడు. వి.ఆర్.ఎస్. తీసుకున్నాడు ఎప్పుడో. ఆ వచ్చిన బెనిఫిట్స్తో బావమరిది వ్యాపారంలో షేర్లు తీసుకున్నాడు. మామగారు తెనాలిలో వడ్డీ వ్యాపారం చేస్తుండేవాడుటగదా! బావమరిది ఇప్పుడు దాన్ని హైద్రా బాద్ హైటెక్ లెవెలికి తీసుకెళ్ళాడు. 'మనీ ట్రీ' అని పెట్టారు - చిట్ ఫండ్ కంపెనీ ఒకటి. దానికి వీడే ఇప్పుడు బిజినెస్ ఎగ్జిక్యూటివ్. ఈ మధ్య చీరాలలో బ్రాంచి ఓపెన్ చెయ్యటానికి సర్వేకని వచ్చాడు. తిరుగుళ్ళ మూలకంగా తండ్రిని పట్టించుకోవడం కుదరడంలేదని ఇక్కడికి తెచ్చి పడేశాడు. చూస్తున్నావుగా ఈయన పరిస్థితి!” అంటూ జేబులో నుంచి శ్రీలక్ష్మీనారాయణ వాడి కిచ్చిన విజిటింగ్ కార్డ్ నా చేతిలో పెట్టాడు.


చించి పోగులు పెడదామనుకున్నా ఆ కార్డును. దాని మీద ఫోన్ నెంబరు ఉండటం చూసి పర్సులో పడేశా. వాడిని నేరుగా కడిగి పారేస్తే కాని నా కడుపు మంట చల్లారదు. 


విషయమంతా విని మా ఆవిడ అంది.


"ఇందులో వింతేముంది? ఆ రోజు మనం వాళ్ళింటి కెళ్ళినప్పుడే నా కర్థమయింది. అసలా ముసలాయన్నా ఇంట్లో ఉంచుకున్నారన్నది కూడా నా కనుమానమే! ఆమెను చూస్తే అర్థం కావడం లేదా! మనం ఆటోలో వెళ్ళినందుకు భోజన యోగం లేకపోయింది. మీరు మన పిల్లల్ని గురించి బాగా డప్పు కొట్టుంటారు ఆయనతో. మనమొస్తున్నామని తెలిసే కావాలని ఆమె వాళ్ళ పిల్లల్ని తప్పించేసింది. గృహ అదే ముతక బనీను.. మోకాలి చిప్పల పైదాకా పంచ ప్రవేశానికి పిలిచారు కానీ... నిజంగానే ఎక్కడ వెళతామో నని కార్డు కూడా పంపకుండా జాగ్రత్త పడ్డారు”



“ఛ.... వాడిని గురించి మరీ అంత దారుణంగా మాట్లా డకోయ్. చిన్నతనం నుంచీ తెలుసు నాకు. డబ్బుకు గడ్డి కరుస్తాడేమోగానీ, స్నేహానిక్కూడా విలువ ఇస్తాడు" అన్నాను బాధగా మరీ ఆవిడ అంతలా విమర్శిస్తుంటే వినలేక.


“నేనంటున్నది పూర్తిగా మీ ఫ్రెండుగారిని గురించే కాదు మహానుభావా! మీకు లోకం తీరు అర్థం కావడం లేదింకా. ఇంత సంపాదిస్తున్నా తండ్రినట్లా దిక్కులేని వాడిలాగా వదిలే సారంటే మరేమిటర్థం? ప్రేమ ఆయనకుండవచ్చు. ఆమె కుండాలని రూలేమన్నా ఉందా? లోకం తీరే అట్లా నడుస్తుం దిప్పుడు. ప్రత్యేకంగా మీరిప్పుడేమీ ఫోన్లు చేసి ప్రవచనాలు చెప్పాల్సిన పనిలేదు. మనకు బిల్లు ఖర్చు తప్ప... పెద్దాయనకు ఒరిగేదేమీ ఉండదు” అని దులిపి పారేసరికి ఫోను ఆలోచన విరమించుకున్నాను.


'శ్రీలక్ష్మీనారాయణ తల్లి ఎప్పుడో పోయి బ్రతికి పోయింది. తండ్రి బ్రతికుండి చచ్చిపోతున్నాడు' అనిపిం చింది.


ఇంక వాడి ఆలోచన పూర్తిగా చాలించడం మంచిదని పించింది కానీ, టీవీల్లో, పేపర్లలో 'మనీ ట్రీ' ప్రకటనలు చూసినప్పుడల్లా ముందు 'శ్రీరాములే' మనసులో మెదులుతున్నాడు.


ఆ రోజు టీవీలో వచ్చిన 'బ్రేకింగ్ న్యూస్' చూసి షాకయ్యాను. 'మనీ ట్రీ' బోర్డు తిప్పేసిందిట!


ఐదేళ్ల బట్టీ ఆంధ్రప్రదేశ్ అంతటా యాభై శాఖల ద్వారా మూడొందల కోట్ల టర్నోవర్తో లక్షమంది ఖాతాదారులకు సేవలందిస్తున్న చిట్ ఫండ్ కంపెనీ రాత్రికి రాత్రే దివాలా తీయడం నమ్మదగ్గ న్యూస్ కాదు. చిట్లు పాడిన వాళ్లందరూ హ్యాపీనేగానీ... వాళ్లలో చాలామంది కంపెనీ డైరక్టర్ల బినామీ లనీ పోలీస్ విచారణలో తేలిందిట. చిట్ హోల్డర్సందరూ గగ్గోలు పెడుతున్నారు. పెద్ద ఎత్తున అరెస్టుల పర్వం సాగు తోంది. శ్రీలక్ష్మీనారాయణ బావమరిది విదేశాల్లో ఉండటం వల్ల ప్రస్తుతం సేఫ్. కొడుకులిద్దర్నీ వీడు ఎప్పుడు ఈ రొంపి లోకి దింపాడో... పార్టనర్స్ అరెస్టయిపోయారు. శ్రీలక్ష్మీ నారాయణ పేరు మాత్రం ఎక్కడా వినిపించకపోవడం కొంత రిలీఫ్ కలిగించే అంశం. కానీ వాడు ముచ్చటపడి కొడుకులిద్దరికీ పెట్టుకున్న శ్రీనివాస్, శ్రీనాథ్ పేర్లలోని 'శ్రీని వత్తి వత్తి పలుకుతూ టీవీ వాళ్లు చేస్తున్న వెటకారపు వ్యాఖ్యా నాలకు మనసంతా ఏదో చేదు కాకరకాయ కొరికినట్లుగా తయారయింది.


చంద్రశేఖర్ ఇచ్చిన విజిటింగ్ కార్డులోని నెంబరుకు చాలాసార్లు రింగ్ చేసాను. రెస్పాన్సు లేదు. మూడు రోజులుగా అదే పరిస్థితి.


నా అవస్థ చూసి, “పోనీ.. ఒకసారి పర్శనల్గా వెళ్లి పలకరించి వద్దాం పదండి. పాపం, ఆవిడ కూడా ఎంతలా కుమిలిపోతుందో బిడ్డల పరిస్థితి చూసి” అంది మా శ్రీమతి. 

విజిటింగ్ కార్డులోని రెసిడెన్షియల్ అడ్రసు పట్టుకుని వెళ్లాం. శ్రీనగర్ కాలనీలో ఉందా ఇల్లు.


అది ఇల్లా! ఇంద్రభవనంలాగుంది.


పోలీసు పహరాలో ఉంది. 

ప్రవేశానికి అనుమతి లభించక తిరిగి వచ్చేసాం. 


నెల రోజుల తరువాత అనుకుంటా... మా అన్నయ్య కొడుక్కి వంట్లో బాగోలేదంటే చూడటానికి వెళ్ళాం. వాడికి నిండా పాతికేళ్లు లేవు. కీళ్ల నొప్పులు - ఉన్నట్టుండి వళ్లంతా కర్రలా బిగుసుకుపోతుంది. జాయింట్స్ విపరీతంగా వాచి పోయి... కదిలితే చాలు... విపరీతమైన నొప్పులు. బాధకు ఓర్చుకోలేక కేకలు పెడుతుంటే వినేవాళ్ళం తట్టుకోలేము. ఎంతమంది డాక్టర్సుకు చూపించినా... ఎన్నిరకాల మందులు మింగినా బాధకు తాత్కాలిక ఉపశమనమేగాని... శాశ్వత పరిష్కారం దొరకడం లేదు.


'వినయాశ్రమం ప్రకృతి చికిత్సాలయం'లో ఉన్నాడంటే చూడటానికి వెళ్లాను.


చికిత్స చేసే యోగాచార్యులు ఒక విచిత్రమైన విషయం చెప్పారు.


"కీలు బందుల్లోని రాపిడికి షాక్ అబ్జార్బర్సుగా పనిచేసే గుజ్జు పదార్థం చాలినంత ఉత్పత్తి చేయలేని దేహాల్లో ఇలాంటి రుగ్మతలు సంభవిస్తుంటాయి. ఇలాంటి వ్యాధి ఉన్నవాళ్లు చిన్నతనం నుంచే కొన్ని కఠినమైన ఆసనాలు. సాధన చేస్తూ ఉండాలి" అంటూ కొన్ని ఆసనాలు చూపిం చారు.


అందులో ఒకటి రెండు కాళ్లు నడిమికి విరిచి వాటి మధ్యలో నుంచి చేతులు బయటికి లాగి మెడ చుట్టూ


గట్టిగా బంధించి ఉంచే ఉత్తాన కూర్మాసనం వంటి ఆసనం. చంద్రశేఖర్ చెప్పిన కోదండం' గుర్తుకొచ్చింది ఎందుకో. వాడి మాట నిజమే అయితే శ్రీలక్ష్మీనారాయణకు రోజూ ‘కోదండం' పడేది... ఈ రకం కీళ్ల జబ్బు ముందు ముందు ముదరకుండానేమో!


ఇప్పుడు గుర్తుకొస్తుంది. వాడికా జబ్బు ఉన్నట్లే ఉంది. మా నాన్నగారు పేంబెత్తం వీపు మీద ఆడించినప్పుడల్లా విరుచుకుపడిపోతుండేవాడు. మా అన్న కొడుకూ అట్లాగే  


విరుచుకు పడిపోయేవాడు - 'ఎమోషనల్'గా 'ఇంబేలన్స్' అయినప్పుడల్లా. ఒకసారి ఎటాక్ వస్తే కనీసం మూడు రోజుల దాకా మంచం దిగలేని పరిస్థితిట!


ఆ లెక్కన ఇప్పుడు శ్రీలక్ష్మీనారాయణ పరిస్థితి!? 'మనీ ట్రీ' మునిగి కొడుకులిద్దరూ జైలు పాలయితే ఎంతటివాడయినా ‘ఇంబేలన్స్' అవకుండా ఉండగలడా!?


రెండు కాళ్ళూ మడిచి వాటి గుండా చేతులు బయటకు తీసి మెడచుట్టూ బంధించి పట్టుకుని 'కోదండం' వేసి ఉన్నాడు శ్రీలక్ష్మీనారాయణ.


వాడినెట్లాగైనా ఒకసారి చూడాలి. ఎంతయినా చిన్ననాటి 

నుంచీ మిత్రుడు. 

చంద్రశేఖరికి కాల్ చేసాను.


కూల్గా సమాధానం చెప్పాడు వాడు.


"వేటపాలెం కూడా వచ్చిపో! మన చిన్ననాటి సస్పెన్స్ కూడా విడిపోయినట్లవుతుంది. గొప్ప జీవిత సత్యం తెలుసు కుంటావు" అన్నాడు.


వెంటనే వేటపాలెం బైలుదేరాను.


బస్టాండులోనే నన్ను  పట్టుకున్నాడు చంద్రశేఖర్. "మన శ్రీలక్ష్మీనారాయణని చూపిస్తా పద!" అంటూ గడియార స్తంభం సెంటర్ వెనకాలున్న రామమందిరం

దగ్గర శ్రీరాములి పెంకుటింటికి తీసుకెళ్ళాడు. పాత డొక్కు డబ్బాల వెనక కాటా ముందు ఎప్పటిలాగానే వినాయకుడిలాగా ముతక బనీను... మోకాలి చిప్పల పైదాకా ధోవతి కట్టులో శ్రీరాములు ! 


ఈసారి మమ్మల్ని బైటే ఆపలేదు. లోపలి గదిలోకి తీసుకువెళ్ళాడు.


రెండు కాళ్ళూ మడిచి వాటి గుండా చేతులు బయటకు తీసి మెడచుట్టూ బంధించి పట్టుకుని 'కోదండం' వేసి ఉన్నాడు శ్రీలక్ష్మీనారాయణ.


ఆసనం మధ్యలో లేవకూడదని బైటికి తీసుకొచ్చేసాడు శ్రీరాములు.

తిరిగొస్తూ ఉంటే కలకండ ముక్క చేతిలో పెట్టలేదు కానీ... అంతకన్నా ముఖ్యమైన జీవిత సత్యాన్ని ఒకటి వినిపించాడు శ్రీరాములు.


“మనీ ట్రీ వ్యవహారం మీకు తెలుసుగా! మనవళ్లిద్దరూ జైలు కెళ్లారు. బావమరుదులు తప్పుకున్నారు. వీడు విరుచు కుపడిపోయాడు. కోడలు గోడు గోడున ఏడుస్తూంటే ఇక్కడకు తీసుకొచ్చాను. బిడ్డ దివాలా తీసి జబ్బుతో బాధ పడుతుంటే అక్కడ వృద్ధాశ్రమంలో కూర్చోబుద్ధికాలేదు. పరిస్థితులు కాస్త బాగుపడేదాకా మళ్లీ నాకీ 'దుకాణం సంత' తప్పదు” అన్నాడు.


నిజంగా శ్రీరాములులోని తండ్రికి మనస్ఫూర్తిగా ఓ దండం పెట్టాలనిపించింది.


- కర్లపాలెం హనుమంతరావు 

( రచన మాసపత్రిక- కథాపీఠం పురస్కారంతో  ప్రచురితం) 




Thursday, December 9, 2021

కోదండం - కర్లపాలెం హనుమంతరావు ( రచన మాసపత్రిక- కథాపీఠం పురస్కారంతో ప్రచురితం)

 కథానిక: 








కోదండం 






- కర్లపాలెం హనుమంతరావు

( రచన మాసపత్రిక- కథాపీఠం పురస్కారంతో  ప్రచురితం) 


శ్రీలక్ష్మీనారాయణ - అది వాడి పూర్తి పేరు.


వట్టి 'లక్ష్మీనారాయణ' అని పిలిస్తే పోట్లాట పెట్టుకునే


వాడు.


'శ్రీ' అంటే వాడికంత ఇష్టం.


'శ్రీ' ఎవరి కిష్టం ఉండదు కనక! కానీ... వాడి ఇష్టం ప్రత్యేకమైనది.


మా ఊరి గడియార స్తంభం సెంటర్లో రామమందిరం వెనకాల ఉండేది వాళ్ల ఇల్లు. రోడ్డు వైపుకి దిగిన పెంకుటిల్లు వసారాలో నాలుగు పాత డబ్బాల వరసల వెనక కాటా ముందు కూర్చునుండేవాడు వాళ్ల నాన్న - శ్రీరాములు.


ముతక బనీను, మోకాలు చిప్పలపై దాకా పంచెకట్టు.. గుళ్లో వినాయకుడికి మల్లే ఎప్పుడు చూసినా అదే ఆయన అవతారం.


వాడి కోసం వెళ్లినప్పుడల్లా ముందు కొట్లో ఈయన ఆపేసేవాడు. నోరారా పలకరించేవాడు.


"సుబ్బారావు పంతులుగారబ్బాయి వచ్చాడ్రా! బైటికిరా!" అని లోపలికి కేకేసేవాడు.


నన్ను మాత్రం ఎప్పుడూ నేరుగా లోపలికి పొమ్మనేవాడు


కాదు. కొట్టు వెనకున్న గదుల్లో ఏముంటుందో!... మాకు అప్పట్లో ఒక పెద్ద సస్పెన్స్,


"వాడిని వాళ్ల నాన్న కోదండం వేయిస్తుంటాడురా! అందుకే ఒక పట్టాన వీడు బైటికి రాడు" అనేవాడు మా కామన్ ఫ్రెండ్ చంద్రశేఖర్.


'కోదండం పేరు వినడమేగానీ... ఎప్పుడూ ఎట్లా ఉంటుందో చూడలేదు.


"రెండు కాళ్లు నడిమికి విరిచి వాటి మధ్యలో నుంచీ చేతులు బయటికి లాగి మెడ చుట్టూ గట్టిగా పట్టుకోనుం డాలి. పోలీస్టేషన్లో మా నాన్న దొంగల్ని అట్లాగే చేయిస్తుం టాడు" అని చెప్పాడు చంద్రశేఖర్.


వాళ్ల నాన్న కానిస్టేబుల్. నమ్మబుద్ధి కాలేదు. నేరుగా ఒకసారి శ్రీలక్ష్మీనారాయణగాడినే అడిగితే అదోలా చూసాడు నా వంక.


రెండు రోజులు నాతో మాట్లాడలేదు.


దొంగలకు పడే శిక్ష వాడికెందుకు వేయాలో అర్థం కాలేదు. తొమ్మిదో ఎక్కం కూడా వెనక నుంచి గడగడా వప్పచెబుతాడు. నోటి లెక్కలు వాడి నాలిక మీదే ఉంటాయి. బుక్కులో ఇచ్చిన లెక్కలయితే వాడికన్నా ముందు చేసి చూపించడానికి చాలా తంటాలు పడాల్సి వచ్చేది మాకు. అట్లాంటి వాడికి మరి ఈ 'కోదండం' ఎందుకో!


హైస్కూల్లో కూడా మా ఇద్దరిదీ ఒకటే సెక్షన్ ప్రతిదానిలో పోటీ ఉండేది మా ఇద్దరి మధ్య.


ఒక్క దాంట్లో మాత్రం వాడి ముందు నేను తేలిపోయే వాణ్ణి.


పైస, రెండు పైసలు, మూడు పైసలు, కొత్త బిళ్లలు ముద్రించేవాళ్ల రోజుల్లో. కొత్త నాణేల కోసం అందరం వెంపర్లాడుతుండేవాళ్లం. వాడు కొట్లో నుంచి కొట్టుకొచ్చిన కొత్త బిళ్లల్ని లాభానికి మారు బేరం చేస్తూండేవాడు. అయిదు పైసలకు మూడు పైసల కొత్త బిళ్ల, మూడు పైసలకి పైస కొత్త బిళ్ల - ఇట్లా సాగుతుండేది 'చిల్లర' వ్యాపారం.


పంతుళ్లకు మాత్రం లాభం చూసుకోకుండా ఇస్తుండే వాడు. వాడి లౌక్యం ముందు 'ముందు నుంచీ' మేం దిగదుడుపే!


మా ఊరి గ్రంథాలయంలో ఒక ఖాన్ మేష్టరుగారు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వాళ్ల పరీక్షలకు పిల్లల్ని తర్ఫీదు చేస్తుండేవారు. ఆడపిల్లలే ఎక్కువ ఆ క్లాసుల్లో. మా అక్కకు తోడుగా వెళ్లే నన్నూ పరీక్షలకు కూర్చోబెట్టేరు మేష్టారు. సెకండ్ ఫారానికే మూడు పరీక్షలు పాసయ్యాను. నన్ను చూసి శ్రీ లక్ష్మీనారాయణ కూడా! ఆడపిల్లలతో కలిసి కూర్చోడం నామోషీ అనిపించి నేను క్లాసులకు వెళ్లడం మానేస్తే... వాడు మాత్రం చదువు కొనసాగించి పదకొండో

తరగతికే 'విశారద' పూర్తి చేసేసాడు.


డిగ్రీ చదువుకి నేను బందరు వచ్చేయడం వల్ల వాడి విశేషాలు తెలియడం మానేసాయి. అప్పుడప్పుడూ చంద్ర శేఖరే ఏవో వార్తలు చెవులో వేస్తుండేవాడు. సెవెంత్ ఫారం పూర్తయింతరువాత వాడు చెన్నై పోయి 'విజయచిత్ర' అనే సినిమా పత్రికలో సబ్-ఎడిటర్గా చేరాడని చెప్పాడొకసారి.


డిగ్రీ అయి ఉద్యోగం కోసం ప్రయత్నించే రోజుల్లో... మా బాబాయికి వంట్లో బాగోలేదంటే చూడటానికి మా ఊరు వెళ్లా. అనుకోకుండా శ్రీరాములు దుకాణం ముందు


నుంచీ వెళ్లాల్సొచ్చింది. దుకాణం అట్లాగే ఉంది.


మా నాన్నగారొకసారి క్లాసులో వాడి వీపు మీద పేం బెత్తం ఆడించారు. పాపం భయంతో లాగూ తడుపుకు న్నాడు. మూడు రోజుల దాకా బడికి రాలేదు. ఏమయిందో కనుక్కుందామని ఇంటికెళితే... అప్పుడూ శ్రీరాములు నన్ను లోపలికి పోనీయనే లేదు. 'రేపొస్తాడులే' అంటూ ఇంత కలకండ ముక్క చేతిలో పెట్టి పంపిచేశాడు.


ఆ సంగతులన్నీ తలుచుకుంటూ సరదాగా గడిపేశాం ఇద్దరం ట్రయినింగ్ వారం రోజులూ.


అదే ముతక బనీను... మోకాలు చిప్పల పై దాకా మాటల సందర్భంలో మా ఫ్యామిలీ హైదరాబాద్లోనే ఉందని తెలుసుకుని చిరునామా అడిగి తీసుకున్నాడు.


పంచకట్టులో కాటా ముందు శ్రీరాములు!


ప్రాణం ఉసూరుమనిపించింది.


 మా బ్యాంకులోనే అధికార భాష (హిందీ) ఆఫీసరుగా చేరి మూడేళ్లయిందిట. హిందీ క్లాసులు తీసుకోవడానికి ఇట్లా ట్రయినింగ్ సెంటర్ కొస్తుంటానని చెప్పాడు.


లంచ్ అవర్లో పిలిచి కూర్చోబెట్టుకుని, “నా క్లాస్మేట్ నన్ను పేం బెత్తంతో బాది ఇంత పెద్దవాడిని చేసిన మాతరగతికే 'విశారద' పూర్తి చేసేసాడు.


డిగ్రీ చదువుకి నేను బందరు వచ్చేయడం వల్ల వాడి విశేషాలు తెలియడం మానేసాయి. అప్పుడప్పుడూ చంద్ర శేఖరే ఏవో వార్తలు చెవులో వేస్తుండేవాడు. సెవెంత్ ఫారం పూర్తయింతరువాత వాడు చెన్నై పోయి 'విజయచిత్ర' అనే సినిమా పత్రికలో సబ్-ఎడిటర్గా చేరాడని చెప్పాడొకసారి.


డిగ్రీ అయి ఉద్యోగం కోసం ప్రయత్నించే రోజుల్లో... మా బాబాయికి వంట్లో బాగోలేదంటే చూడటానికి మా ఊరు వెళ్లా. అనుకోకుండా శ్రీరాములు దుకాణం ముందు నుంచీ వెళ్లాల్సొచ్చింది. 

దుకాణం అట్లాగే ఉంది. 

"వీడు చెన్నైలో మంచి ఉద్యోగమే వెలగబెడుతున్నాడు గదరా! అమ్మానాన్నల్ని తీసుకెళ్లచ్చు గదా!" అన్నాను చంద్రశేఖర్.


"వాడి తల్లి పోయిందిరా పోయినేడాది వచ్చి వారం రోజులు కూడా లేడిక్కడ. ఇంక తండ్రి నేం తీసుకెళతాడు! తెనాలమ్మాయిని చేసుకున్నాడు. ఇప్పుడంతా ఆవిడదే రాజ్యం అంటున్నారు" అన్నాడు చంద్రశేఖర్.


ఇంక వాడి సంగతి తలుచుకోవాలనిపించలేదు.


బ్యాంకులో ఉద్యోగం వచ్చిన తరువాత పెళ్లి చేసు కున్నాను. కావాలనే వాడిని పిలవలేదు. జీవితంలో మళ్లీ కలవాలనీ అనుకోలేదు.


పదేళ్లు గడిచాయి.


మా బ్యాంకు వాళ్లిచ్చే ట్రైనింగ్ ప్రోగ్రాం కోసం హైదరా బాద్ వచ్చినప్పుడు అనుకోకుండా తగిలాడు మళ్లా శ్రీలక్ష్మీ నారాయణ.


ఫ్యాకల్టీ లిస్టులో వాడి పేరును చూసాను గానీ... క్లాసు కొచ్చిందాకా వాడేనని తెలుసుకోలేకపోయాను. ఇద్దరం కలిసి చదువుకున్నాం. ఇప్పుడు విద్యార్థిగా ముందు వరసలో నేను. హిందీ పాఠాలు చెప్పే ఇన్స్ట్రక్టర్ డయాస్ మీద వాడు!


సుబ్బారావు పంతులుగారబ్బాయి” అని తోటి ఫ్యాకల్టీకి సంతోషంగా పరిచయం చేస్తుంటే... నా మనసులో అప్పటి దాకా ఉన్న వ్యతిరేక భావం కరిగిపోయింది.


మా నాన్నగారొకసారి క్లాసులో వాడి వీపు మీద పేం బెత్తం ఆడించారు. పాపం భయంతో లాగూ తడుపుకు న్నాడు. మూడు రోజుల దాకా బడికి రాలేదు. ఏమయిందో కనుక్కుందామని ఇంటికెళితే... అప్పుడూ శ్రీరాములు నన్ను లోపలికి పోనీయనే లేదు. 'రేపొస్తాడులే' అంటూ ఇంత కలకండ ముక్క చేతిలో పెట్టి పంపిచేశాడు.


ఆ సంగతులన్నీ తలుచుకుంటూ సరదాగా గడిపేశాం ఇద్దరం ట్రయినింగ్ వారం రోజులూ.


అదే ముతక బనీను... మోకాలు చిప్పల పై దాకా మాటల సందర్భంలో మా ఫ్యామిలీ హైదరాబాద్లోనే ఉందని తెలుసుకుని చిరునామా అడిగి తీసుకున్నాడు.


వాడి కారులోనే నన్ను మా ఇంటి దాకా వచ్చి దింపి పోయాడు. మా పిల్లలిద్దర్నీ చూసి బాగా ముచ్చట పడ్డాడు.


"రేపాదివారం నువ్వు ఫ్యామిలోతో సహా మా ఇంటికి భోజనానికి రావాలిరా! మా పిల్లలకి మీ పిల్లల్ని చూపిం చాలి" అని ఇంటి అడ్రసిచ్చాడు.


వీడి కోసం కాకపోయినా శ్రీరాములు కోసమన్నా వెళ్లి చూసి రావాలి. చిన్నప్పుడు ఎప్పుడు ఇంటికెళ్లినా నోరారా ఆప్యాయంగా పలకరించేవాడు. ఇంత కలకండ పలుకో, బెల్లం ముక్కో చేతిలో పెట్టకుండా వదిలిపెట్టేవాడు కాదు.


“మీ నాయన దయవల్లే మా బడుద్ధాయికి ఈ మాత్ర మన్నా అక్షరం ముక్క వంట బట్టింది” అంటూ మా నాన్న గారిని తలుచుకోకుండా మాత్రం వూరుకొనేవాడు కాదు.



ఆ ఆదివారం ఫ్యామిలితో సహా శ్రీలక్ష్మీనారాయణ ఇచ్చిన చిరునామా పట్టుకుని వెదుక్కుంటూ వెళ్లా. ఈస్ట్ ఆనంద్బాగ్ రైలుకట్ట కవతల ఎక్కడో ఉందా ఇల్లు. కొత్తగా కట్టుకున్నాడు లాగుంది - పక్కనున్న ఇంట్లో అద్దెకుంటున్నాడు.


ఆటో శబ్దం విని కూడా ఎవరూ బైటకు రాలేదు. కాలింగ్ బెల్ మోగించిన మూడోసారికి మెల్లగా తలుపు తెరుచుకుంది.


ఆమె శ్రీలక్ష్మీనారాయణ భార్య లాగుంది. మా పరిచయం చెప్పుకున్నా పెద్దగా స్పందన లేదు. “కూర్చోండి....” అంటూ సోఫా చూపించి లోపలికి పోయింది.


లోపలనుంచీ ఏవో మాటలు. పది నిమిషాల తరువాత గానీ శ్రీలక్ష్మీనారాయణ బైటికి రాలేదు.

‘‘శ్రీకనకధారస్తవం' చేస్తున్నారా! మధ్యలో లేవడం అరిష్టం. బ్రాహ్మలబ్బాయివి నీకు తెలేనిదేముంది!"


అన్నాడు. తెలివిగా. అప్పుడొచ్చి పలకరించిపోయింది వాడి భార్య. పిల్లలు కనపడలేదు.


“ఏరీ?” అనడిగితే, "ఆదివారం గదా వాళ్ళ మామయ్య వాళ్లింటికెళ్లారండీ! మీరిట్లా వస్తారని తెలిస్తే ఆపి ఉండే దాన్ని" అంది మళ్లా బైటికొచ్చి, ఆమె వాడిని లోపలికి


తీసుకెళుతూ.


ఇద్దరూ లోపల ఏవో మల్లగుల్లాలు పడుతున్నారు. ముళ్ల మీద కూర్చున్నట్లుంది మాకు. మా ఆవిడ మొహం చూడాలి. పిల్లలకు భోజనాల టైము కూడా దాటి పోయింది. వరస చూస్తే భోజనం ఏర్పాట్లేమీ జరిగినట్లు లేవు. మర్యాద కాపాడుకోవడం మంచిదనిపించింది.


వాడిని బైటికి పిలిచి మా చిన్నాడు కడుపులో నొప్పంటు న్నాడురా! వెంటనే వెళ్లి డాక్టరుకు చూపించాలి. మళ్లీ కలు ద్దాంలే తీరిగ్గా” అని ఎట్లాగో బైట పడ్డాను.


మేం తిరిగి వచ్చేటప్పుడు మొగుడూ పెళ్లాల మొహాల్లో కనిపించిన 'రిలీఫ్ ని నేనెప్పటికీ మర్చిపోలేను. “మా కొత్త ఇల్లు చూపించాలనుకున్నానే!" అని వాడూ, "ఇక్కడే ఉంటున్నాడా... ఇంకా?” అనడిగాను



గృహప్రవేశానికి రమ్మనమని ఫోనులో ఆహ్వానం. “టైం ఎక్కువ లేదురా! పర్సనల్గా వచ్చి పిలవలేదని అనుకోవద్దు. కార్డ్ పంపిస్తా. కంపల్సరీగా రావాలి" అంటూ ఇంకోసారి ఇంటి అడ్రెసు అడిగి తీసుకున్నాడు.


కార్డు రాలేదు. వచ్చినా మేము పోదలుచుకోలేదు. ఇంక జీవితంలో వాడిని తలుచుకోదలుచుకోలేదు.


చంద్రశేఖర్ కొడుకు పెళ్లంటే మళ్లా మా ఊరు పోవాల్సొచ్చింది చాలా ఏళ్ల తరువాత.


మాటల మధ్యలో వాడే శ్రీలక్ష్మీనారాయణ ప్రసక్తి తీసు కొచ్చాడు.


వాడి ఇంట్లో మా అనుభవాన్ని గురించి చెప్పాను. “శ్రీరాముల్ని చూస్తావా?” అన్నాడు చెప్పిందంతా ఓపిగ్గా విని చివరకు.










మాటల మధ్యలో వాడే శ్రీలక్ష్మీనారాయణ ప్రసక్తి తీసు కొచ్చాడు.


వాడి ఇంట్లో మా అనుభవాన్ని గురించి చెప్పాను. “శ్రీరాముల్ని చూస్తావా?” అన్నాడు చెప్పిందంతా ఓపిగ్గా విని చివరకు. 

" ఇక్కడే ఉంటున్నాడా.. ఇంకా? " అనడిగాను 

ఆశ్చర్యంగా.


పెళ్ళి హడావుడి తగ్గింతరువాత బైక్ మీద నన్నొక చోటికి తీసుకెళ్లాడు.


బెస్తపాలెం వెళ్లే దారిలో ఉన్న ఆశ్రమం అది. ఊరుకు బాగా బయటగా జీడి మామిడి తోపుల మధ్యలో ఉందది. ‘వృద్ధాశ్రమం' బోర్డు చూసి, "శ్రీరాములు ఉంటుంది ఇక్కడా?" అని నివ్వెరపోయాను.


“మరి!” అన్నాడు చంద్రశేఖర్.


విశాలమైన ఆవరణలో మూడు వైపులా చిన్న చిన్న గదులు మధ్యలో రామమందిరం. దానిని ఆనుకున్న చిన్న తోట. కొంతమంది ముసలివాళ్లు అందులో పనిచేస్తున్నారు. ఇంకొంతమంది గుడి ముందు అరుగుమీద ఎండపొడకు సేద తీరుతున్నారు. ఎక్కడా శ్రీరాములు కనిపించలేదు.


ఆఫీసు గదిలోకి వెళ్ళి అడిగాడు చంద్రశేఖర్.


కంప్యూటర్ ముందు కూర్చోనున్న అమ్మాయి చాలా ప్రశ్నలే అడిగింది. సంతృప్తి పడింతరువాతగానీ లాంగ్బుక్ ఓపెన్ చేయలేదు.


“ఆయనకు చానాళ్లుగా వంట్లో బాగుండటం లేదు. ఎక్కువగా డిస్టర్బ్ చేయకండి" అని సలహా ఇచ్చి ఆ విజిటర్స్ బుక్ మా ముందుకు జరిపింది సంతకాల కోసం. 

అది శ్రీరాములు పర్సనల్ షీట్ లాగుంది - అట్టే విజిటర్స్ సంతకాలు లేవు. శ్రీలక్ష్మీ నారాయణవి మాత్రం నాలుగైదు కనిపించాయి. అదీ ఏడాదికి రెండుసార్లు. శ్రీరాములు చేరి రెండేళ్లయినట్లుంది.







 కిచెన్ పక్కనున్న చిన్న గదిలో ఉన్నాడాయన. 

కట్టు. నిస్త్రాణగా పడుకోనున్నాడు ఐరన్ మంచం మీద. ఏమని పలకరించాలి? పేరు చెబితే గుర్తుపట్టలేడు.


'సుబ్బారావు పంతులు గారబ్బాయి'నని చెప్పుకున్నా. కళ్లల్లోకి కాంతి వచ్చింది.


నోటి వెంట ఏవో శబ్దాలు వచ్చాయిగానీ... మా కర్థం కాలేదు.


పది నిముషాలకు మించి కూర్చోలేకపోయాను. మన సంతా పిచ్చి కాకరకాయను కొరికినంత చేదుగా ఉంది.


‘ఒక్కడే కొడుకు. ఎంత గారాబంగా పెంచుకున్నాడు! ఎప్పుడూ కొడుకు నామస్మరణే! బిడ్డను వృద్ధిలోకి తేవాలని ఆ డొక్కు డబ్బాల వెనక కాటా ముందు కూర్చుని ఎంతలా ఆరాటపడేవాడో!'

తలుచుకుంటే కళ్ల వెంబడి నీరు గిర్రునతిరిగింది. 


"నువ్వు పట్టించుకోలేదు కనక నీకు తెలీదురా! వాడి ప్పుడు బ్యాంకులో లేడు. వి.ఆర్.ఎస్. తీసుకున్నాడు ఎప్పుడో. ఆ వచ్చిన బెనిఫిట్స్తో బావమరిది వ్యాపారంలో షేర్లు తీసుకున్నాడు. మామగారు తెనాలిలో వడ్డీ వ్యాపారం చేస్తుండేవాడుటగదా! బావమరిది ఇప్పుడు దాన్ని హైద్రా బాద్ హైటెక్ లెవెలికి తీసుకెళ్ళాడు. 'మనీ ట్రీ' అని పెట్టారు - చిట్ ఫండ్ కంపెనీ ఒకటి. దానికి వీడే ఇప్పుడు బిజినెస్ ఎగ్జిక్యూటివ్. ఈ మధ్య చీరాలలో బ్రాంచి ఓపెన్ చెయ్యటానికి సర్వేకని వచ్చాడు. తిరుగుళ్ళ మూలకంగా తండ్రిని పట్టించుకోవడం కుదరడంలేదని ఇక్కడికి తెచ్చి పడేశాడు. చూస్తున్నావుగా ఈయన పరిస్థితి!” అంటూ జేబులో నుంచి శ్రీలక్ష్మీనారాయణ వాడి కిచ్చిన విజిటింగ్ కార్డ్ నా చేతిలో పెట్టాడు.


చించి పోగులు పెడదామనుకున్నా ఆ కార్డును. దాని మీద ఫోన్ నెంబరు ఉండటం చూసి పర్సులో పడేశా. వాడిని నేరుగా కడిగి పారేస్తే కాని నా కడుపు మంట చల్లారదు. 


విషయమంతా విని మా ఆవిడ అంది.


"ఇందులో వింతేముంది? ఆ రోజు మనం వాళ్ళింటి కెళ్ళినప్పుడే నా కర్థమయింది. అసలా ముసలాయన్నా ఇంట్లో ఉంచుకున్నారన్నది కూడా నా కనుమానమే! ఆమెను చూస్తే అర్థం కావడం లేదా! మనం ఆటోలో వెళ్ళినందుకు భోజన యోగం లేకపోయింది. మీరు మన పిల్లల్ని గురించి బాగా డప్పు కొట్టుంటారు ఆయనతో. మనమొస్తున్నామని తెలిసే కావాలని ఆమె వాళ్ళ పిల్లల్ని తప్పించేసింది. గృహ అదే ముతక బనీను.. మోకాలి చిప్పల పైదాకా పంచ ప్రవేశానికి పిలిచారు కానీ... నిజంగానే ఎక్కడ వెళతామో నని కార్డు కూడా పంపకుండా జాగ్రత్త పడ్డారు”



“ఛ.... వాడిని గురించి మరీ అంత దారుణంగా మాట్లా డకోయ్. చిన్నతనం నుంచీ తెలుసు నాకు. డబ్బుకు గడ్డి కరుస్తాడేమోగానీ, స్నేహానిక్కూడా విలువ ఇస్తాడు" అన్నాను బాధగా మరీ ఆవిడ అంతలా విమర్శిస్తుంటే వినలేక.


“నేనంటున్నది పూర్తిగా మీ ఫ్రెండుగారిని గురించే కాదు మహానుభావా! మీకు లోకం తీరు అర్థం కావడం లేదింకా. ఇంత సంపాదిస్తున్నా తండ్రినట్లా దిక్కులేని వాడిలాగా వదిలే సారంటే మరేమిటర్థం? ప్రేమ ఆయనకుండవచ్చు. ఆమె కుండాలని రూలేమన్నా ఉందా? లోకం తీరే అట్లా నడుస్తుం దిప్పుడు. ప్రత్యేకంగా మీరిప్పుడేమీ ఫోన్లు చేసి ప్రవచనాలు చెప్పాల్సిన పనిలేదు. మనకు బిల్లు ఖర్చు తప్ప... పెద్దాయనకు ఒరిగేదేమీ ఉండదు” అని దులిపి పారేసరికి ఫోను ఆలోచన విరమించుకున్నాను.


'శ్రీలక్ష్మీనారాయణ తల్లి ఎప్పుడో పోయి బ్రతికి పోయింది. తండ్రి బ్రతికుండి చచ్చిపోతున్నాడు' అనిపిం చింది.


ఇంక వాడి ఆలోచన పూర్తిగా చాలించడం మంచిదని పించింది కానీ, టీవీల్లో, పేపర్లలో 'మనీ ట్రీ' ప్రకటనలు చూసినప్పుడల్లా ముందు 'శ్రీరాములే' మనసులో మెదులుతున్నాడు.


ఆ రోజు టీవీలో వచ్చిన 'బ్రేకింగ్ న్యూస్' చూసి షాకయ్యాను. 'మనీ ట్రీ' బోర్డు తిప్పేసిందిట!


ఐదేళ్ల బట్టీ ఆంధ్రప్రదేశ్ అంతటా యాభై శాఖల ద్వారా మూడొందల కోట్ల టర్నోవర్తో లక్షమంది ఖాతాదారులకు సేవలందిస్తున్న చిట్ ఫండ్ కంపెనీ రాత్రికి రాత్రే దివాలా తీయడం నమ్మదగ్గ న్యూస్ కాదు. చిట్లు పాడిన వాళ్లందరూ హ్యాపీనేగానీ... వాళ్లలో చాలామంది కంపెనీ డైరక్టర్ల బినామీ లనీ పోలీస్ విచారణలో తేలిందిట. చిట్ హోల్డర్సందరూ గగ్గోలు పెడుతున్నారు. పెద్ద ఎత్తున అరెస్టుల పర్వం సాగు తోంది. శ్రీలక్ష్మీనారాయణ బావమరిది విదేశాల్లో ఉండటం వల్ల ప్రస్తుతం సేఫ్. కొడుకులిద్దర్నీ వీడు ఎప్పుడు ఈ రొంపి లోకి దింపాడో... పార్టనర్స్ అరెస్టయిపోయారు. శ్రీలక్ష్మీ నారాయణ పేరు మాత్రం ఎక్కడా వినిపించకపోవడం కొంత రిలీఫ్ కలిగించే అంశం. కానీ వాడు ముచ్చటపడి కొడుకులిద్దరికీ పెట్టుకున్న శ్రీనివాస్, శ్రీనాథ్ పేర్లలోని 'శ్రీని వత్తి వత్తి పలుకుతూ టీవీ వాళ్లు చేస్తున్న వెటకారపు వ్యాఖ్యా నాలకు మనసంతా ఏదో చేదు కాకరకాయ కొరికినట్లుగా తయారయింది.


చంద్రశేఖర్ ఇచ్చిన విజిటింగ్ కార్డులోని నెంబరుకు చాలాసార్లు రింగ్ చేసాను. రెస్పాన్సు లేదు. మూడు రోజులుగా అదే పరిస్థితి.


నా అవస్థ చూసి, “పోనీ.. ఒకసారి పర్శనల్గా వెళ్లి పలకరించి వద్దాం పదండి. పాపం, ఆవిడ కూడా ఎంతలా కుమిలిపోతుందో బిడ్డల పరిస్థితి చూసి” అంది మా శ్రీమతి. 

విజిటింగ్ కార్డులోని రెసిడెన్షియల్ అడ్రసు పట్టుకుని వెళ్లాం. శ్రీనగర్ కాలనీలో ఉందా ఇల్లు.


అది ఇల్లా! ఇంద్రభవనంలాగుంది.


పోలీసు పహరాలో ఉంది. 

ప్రవేశానికి అనుమతి లభించక తిరిగి వచ్చేసాం. 


నెల రోజుల తరువాత అనుకుంటా... మా అన్నయ్య కొడుక్కి వంట్లో బాగోలేదంటే చూడటానికి వెళ్ళాం. వాడికి నిండా పాతికేళ్లు లేవు. కీళ్ల నొప్పులు - ఉన్నట్టుండి వళ్లంతా కర్రలా బిగుసుకుపోతుంది. జాయింట్స్ విపరీతంగా వాచి పోయి... కదిలితే చాలు... విపరీతమైన నొప్పులు. బాధకు ఓర్చుకోలేక కేకలు పెడుతుంటే వినేవాళ్ళం తట్టుకోలేము. ఎంతమంది డాక్టర్సుకు చూపించినా... ఎన్నిరకాల మందులు మింగినా బాధకు తాత్కాలిక ఉపశమనమేగాని... శాశ్వత పరిష్కారం దొరకడం లేదు.


'వినయాశ్రమం ప్రకృతి చికిత్సాలయం'లో ఉన్నాడంటే చూడటానికి వెళ్లాను.


చికిత్స చేసే యోగాచార్యులు ఒక విచిత్రమైన విషయం చెప్పారు.


"కీలు బందుల్లోని రాపిడికి షాక్ అబ్జార్బర్సుగా పనిచేసే గుజ్జు పదార్థం చాలినంత ఉత్పత్తి చేయలేని దేహాల్లో ఇలాంటి రుగ్మతలు సంభవిస్తుంటాయి. ఇలాంటి వ్యాధి ఉన్నవాళ్లు చిన్నతనం నుంచే కొన్ని కఠినమైన ఆసనాలు. సాధన చేస్తూ ఉండాలి" అంటూ కొన్ని ఆసనాలు చూపిం చారు.


అందులో ఒకటి రెండు కాళ్లు నడిమికి విరిచి వాటి మధ్యలో నుంచి చేతులు బయటికి లాగి మెడ చుట్టూ


గట్టిగా బంధించి ఉంచే ఉత్తాన కూర్మాసనం వంటి ఆసనం. చంద్రశేఖర్ చెప్పిన కోదండం' గుర్తుకొచ్చింది ఎందుకో. వాడి మాట నిజమే అయితే శ్రీలక్ష్మీనారాయణకు రోజూ ‘కోదండం' పడేది... ఈ రకం కీళ్ల జబ్బు ముందు ముందు ముదరకుండానేమో!


ఇప్పుడు గుర్తుకొస్తుంది. వాడికా జబ్బు ఉన్నట్లే ఉంది. మా నాన్నగారు పేంబెత్తం వీపు మీద ఆడించినప్పుడల్లా విరుచుకుపడిపోతుండేవాడు. మా అన్న కొడుకూ అట్లాగే  


విరుచుకు పడిపోయేవాడు - 'ఎమోషనల్'గా 'ఇంబేలన్స్' అయినప్పుడల్లా. ఒకసారి ఎటాక్ వస్తే కనీసం మూడు రోజుల దాకా మంచం దిగలేని పరిస్థితిట!


ఆ లెక్కన ఇప్పుడు శ్రీలక్ష్మీనారాయణ పరిస్థితి!? 'మనీ ట్రీ' మునిగి కొడుకులిద్దరూ జైలు పాలయితే ఎంతటివాడయినా ‘ఇంబేలన్స్' అవకుండా ఉండగలడా!?


రెండు కాళ్ళూ మడిచి వాటి గుండా చేతులు బయటకు తీసి మెడచుట్టూ బంధించి పట్టుకుని 'కోదండం' వేసి ఉన్నాడు శ్రీలక్ష్మీనారాయణ.


వాడినెట్లాగైనా ఒకసారి చూడాలి. ఎంతయినా చిన్ననాటి 

నుంచీ మిత్రుడు. 

చంద్రశేఖరికి కాల్ చేసాను.


కూల్గా సమాధానం చెప్పాడు వాడు.


"వేటపాలెం కూడా వచ్చిపో! మన చిన్ననాటి సస్పెన్స్ కూడా విడిపోయినట్లవుతుంది. గొప్ప జీవిత సత్యం తెలుసు కుంటావు" అన్నాడు.


వెంటనే వేటపాలెం బైలుదేరాను.


బస్టాండులోనే నన్ను  పట్టుకున్నాడు చంద్రశేఖర్. "మన శ్రీలక్ష్మీనారాయణని చూపిస్తా పద!" అంటూ గడియార స్తంభం సెంటర్ వెనకాలున్న రామమందిరం

దగ్గర శ్రీరాములి పెంకుటింటికి తీసుకెళ్ళాడు. పాత డొక్కు డబ్బాల వెనక కాటా ముందు ఎప్పటిలాగానే వినాయకుడిలాగా ముతక బనీను... మోకాలి చిప్పల పైదాకా ధోవతి కట్టులో శ్రీరాములు ! 


ఈసారి మమ్మల్ని బైటే ఆపలేదు. లోపలి గదిలోకి తీసుకువెళ్ళాడు.


రెండు కాళ్ళూ మడిచి వాటి గుండా చేతులు బయటకు తీసి మెడచుట్టూ బంధించి పట్టుకుని 'కోదండం' వేసి ఉన్నాడు శ్రీలక్ష్మీనారాయణ.


ఆసనం మధ్యలో లేవకూడదని బైటికి తీసుకొచ్చేసాడు శ్రీరాములు.

తిరిగొస్తూ ఉంటే కలకండ ముక్క చేతిలో పెట్టలేదు కానీ... అంతకన్నా ముఖ్యమైన జీవిత సత్యాన్ని ఒకటి వినిపించాడు శ్రీరాములు.


“మనీ ట్రీ వ్యవహారం మీకు తెలుసుగా! మనవళ్లిద్దరూ జైలు కెళ్లారు. బావమరుదులు తప్పుకున్నారు. వీడు విరుచు కుపడిపోయాడు. కోడలు గోడు గోడున ఏడుస్తూంటే ఇక్కడకు తీసుకొచ్చాను. బిడ్డ దివాలా తీసి జబ్బుతో బాధ పడుతుంటే అక్కడ వృద్ధాశ్రమంలో కూర్చోబుద్ధికాలేదు. పరిస్థితులు కాస్త బాగుపడేదాకా మళ్లీ నాకీ 'దుకాణం సంత' తప్పదు” అన్నాడు.


నిజంగా శ్రీరాములులోని తండ్రికి మనస్ఫూర్తిగా ఓ దండం పెట్టాలనిపించింది.


- కర్లపాలెం హనుమంతరావు 

( రచన మాసపత్రిక- కథాపీఠం పురస్కారంతో  ప్రచురితం) 




మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...