Friday, December 24, 2021

పంచతంత్రము; దాని పుట్టుక శ్రీ శ్రీనివాసపురం నరసింహాచార్యులు ( ఆంధ్రసాహిత్య పరిషత్పత్తిక' 1957 - ఇస్యూ 6 )









 



పంచతంత్రము; దాని పుట్టుక

శ్రీ శ్రీనివాసపురం నరసింహాచార్యులు 


( ఆంధ్రసాహిత్య పరిషత్పత్తిక' 1957 - ఇస్యూ 6 ) 


శ్రీనివాసపురం నరసింహాచార్యులు, రమారమి ఏడెనిమి దేండ్లనాడు ఆంధ్రపత్రిక సచిత్ర వారపత్రి కలో శ్రీవిశ్వాత్ముల నరసింహమూర్తి గారి బొమ్మల పంచతంత్రము ప్రశటింపబడుచుండెను. కాని, అది పూర్తి కాశమునుపే మరదురదృష్ట వశమున నాక ధా చిత్రకారుడు కీర్తి శేషు డగుటచే పత్రికలో పడినంత వరకు పుస్తకరూపముగా వేసిన ఆంధ్రపత్రిక గ్రంథమాలా ప్రకాశ కులు తమమాటగా 'ఈపంచతంత్య్ర గ్రంథము పుట్టుక యెక్కడనో యెరుగ రా' దని వాసిరి. అది చదివినప్పుడు జగము మెచ్చిన శాస్త్ర మును జంతు సంతానముల ద్వారా జనులకు తెలియజేసెడి కృతిని జేసి సుశృతి యైన యీమహాకవి జీవితవి శేషములను ఏతద్గ్రంధము యొక్క జన్మస్థానమును; ఉత్పత్తి కారణములను వీనిని గురించిన విషయ ములు విద్వత్పరిశోధకు లెవ్వరేని తెలిసికొని ప్రకటము గావించుట కింతవరకు ప్రయత్నింపరైరిగదా ! యని విచారించి, యది మొద లావిషయమును తెలిసుకొనుటకై యన్వేషింపసాగగా నిన్నాళ్ళ కిప్పుడు ఆపంచతంత్ర గ్రంధి మెప్పుడు. ఎక్కడ, ఎందుకు ఎట్లు పుట్టినదో నాకు తెలియవచ్చినట్టి విశేషములను సారస్వతాభిమానుల సమక్ష మున నుంచుచుంటిని,


భారత దేశమునందలి సంస్కృతగ్రంధము లెన్నో అన్యభాష లలోని కనూడితము గావింపబడినవి. కాని, ఏదియు నీ పంచతంత్ర కావ్య మువలె పలు భాషలలోనికి పరివర్తనమై ప్రపంచవ్యాప్తి నంది నకల దేశములలోని సంస్కృతవిద్యార్థి విద్యాధికులకు గూడ పఠనీయమై యలరారుచున్న కృతి వెదకినను మరియొకటి కానరాదనుట జ్ఞా లంగీకరించిన నగ్న సత్యము,


ఈగ్రంధమున మిత్రభేదము, సుహృల్లాభము, సంథివిగ్రహము లబ్ధనాశము, అవిమృశ్యకారిత్వము అను ఐదుభాగము లున్నవి. క్రీ.శ. 581_579 సం॥ ప్ర్రాంతమున పర్షియా దేశము నేలు చుండిన ఔషరు


వాన్ అనబడెడి పారసీక రాజు కాలమున సీగ్రంధము వహ్లతీభాషలో వీ నికిని. క్రీ. 18వ శతాబ్దని అరబ్బీ భాషలోనికిని, సైమియాన్ సేథ్ (Symeon 'Seth) అను నాతనిచే స్త్రీ. 1015 ప్రాంతమున గ్రీకు భాష శ లోనికిని, పొస్సిసస్ (Possinus) అన్న యతనిచే ల్యాటిన్ భాషలో నికిని రబ్బీజోయెల్ (Rabbi Joel) అను పండితునిచే క్రీ. 1250 ప్ర్రాంతమున హెబ్రూ భాషలోనికిని ఆతర్వాత నొకటి రెండు సంవత్స రములలో స్పానిష్ భాషలోనికిని పిమ్మట కీ. 15వ శతాబ్దని జర్మను భాషలోనికిని, ఆపై యూరపియను భాషలన్నింటిలోనికి పిల్పే లేక విద్వాయ్ ఫేబుల్స్!(Fables of Pilpay or Vid pai i.e. Vidya pati) అను పేరను ఇట్లు రమారమి రెండువందలమంది విద్యావేత్తలచే అన్ని దేశములలోను మొత్తముమీద సుమారేబది భాషలలోని కీయు ద్గ్రంథ మనువాదము చేయబడియున్న దని హెర్టల్ అను పాశ్చాత్య పరిశోధకుడు తనహిందూ దేశ కథాకావ్యచరిత్రములో వ్రాసియున్నా డు, ఈ కావ్యము యొక్క ప్రశస్తి తెలియుట కీవిషయ మొక్కటి


ఇయ్యది మాతృకయై యుండ దీని ననుకరించియు, అనుసరిం చియు మన దేశమున నెన్ని యేని నీతి కావ్యము లుదయించినవి. దీనికి సంగ్రహరూపమున సంస్కృతమున పంచతంత్ర కావ్య - పంచతంత్ర కావ్యదర్పణ - పంచోపాఖ్యానాదులు పెక్కుకృతులు గలవు. అట్లే ఆంధ్ర భాషయందును దూబగుంట నారాయణకవి, బైచరాజు వేంక టనాధకవి ప్రభృతులు పద్య కావ్యములుగను, కందుకూరు వీరేశలింగ కవి. పరవస్తు చిన్నయసూరి మొదలైన పండితులు గద్యరూపము నను, విశ్వాత్ముల నరసింహమూర్తి, శీలా వీర్రాజు మున్నగు చిత్ర కారులు బొమ్మలకధలుగను ఇంతటిప్రశస్తికి పాత్ర మైన యీకృతిని విద్యాపతిబిరుదనాము డైన విష్ణుశర్మ పండితుడు రచియించెను.


కృత్యాదియందు —


“మన వేవాచస్పతయే శుక్రాయ పరాశరాయ సముతాయ చాణక్యాయ చ విదుపే నమో ఒస్తు నయశాస్త్ర కర్తృభ్యః॥ సశలార్ధశాస్త్రసారం జగతి సమాలోక్య విష్ణుశ ర్మేదమ్, తం తైపంచభి రేత చ్చకార సుమనోహరం శాస్త్రమ్ |


అని చెప్పుటనుబట్టి యితఁడు ప్రాచీనము లైనమను అత్రి;విష్ణు హంత్ర; యాజ్ఞవల్క్య; ఉశన; అంగీరన; యమ; ఆపస్తంబ; సంవర్త; కాత్యాయన; బృహస్పతి; పరాశర; వ్యాస; శంఖ; లిఖిత; దక్ష; గౌతమ; శాతాతప; వశిష్టాదివింశతిధర్మశాస్త్రములనేగాక చాణక్య విష్ణుగు ప కౌటిల్యుని అర్థశాస్త్రము మొదలైన రాజనీతిశాస్త్రముల నన్నింటిని సాకల్యముగ ఆపోశనముపట్టి యాకళింపునకు దెచ్చుకొని ఆకాలమున ‘విద్యాపతి 'బిరుదవిఖ్యాతుడై వినుతింపబడియుండె నని చెప్పనగును.


గ్రంధాన తారికలో :—


"దక్షిణ దేశమందలి మహిళారోప్యపురము నేలెడి అమరశక్తి యనురాజు దుర్వినీతు లైనతన కొడుకులకు నీతి నేర్పు మని కోరగా వారికై నే నీ నీతిశాస్త్రమును రచియించితి” ననుమాటలు వా వ్రాసియుం టను బట్టి యీశవి దక్షిణ దేశవాసి మైనయా జేసియాస్థానమున విద్వత్కవిగా నుండెనని భావింపవచ్చునుగాని, ఈవిషయమునే పరి శోధకులును గుర్తించియుండ లేదు. అందుచే నీమాట గ్రంథ ప్రశస్తికై యాతడు కల్పించివ్రాసినదో లేక నిజమో యూహింప నలవి గాకు న్నది." అని బ్రహ్మశ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రిగారు తను వా సంస్కృతకవిజీవితము పుట 180లలో వాసిరి.


క్రీస్తు మొదటశతాబ్దియందు హిందూ దేశమున క్రైస్తవ


మతము వొడసూపి రెండవ శతాబ్దిలో నది దక్షిణ భారతమున నేటి మదరాసుప్ర్రాంతమున సుస్థిరముగ పాదుకొనినట్టు చరిత్ర తెలియ జేయుచున్నది. అప్పుడు అనఁగా క్రీ.2వ శతాబ్ది యారంభ కాలమున బలాఢ్యు డై నఅమరశక్తి యను రాజు మహిళాతోవ్యపుర మనబడెడి ప్రాచీన హైందవనగరమును రాజధానిగా జేసికొని రాజ్యపాలనము చేయుచుండెను. అదేనేడు మైలాపూరు అని వ్యవహరింపబడుచు మద రాసుమహానగరమున సంతర్భాగ మైపోయినది. ఈమహిళారోప్యపుర మునే గ్రీకు దేశస్థు డైన టాలెమీ (Ptolemy 140-150 A. D.) యనుభూగోళశాస్త్రజ్ఞుడు 1. పశ్చిమ భారత దేశము, ఆఫ్ఘనిస్థానము, డు బెలూచిస్థానము (India Intra Gengem) 2. ఆగ్నేయాసియా, చీనా దేశము (India Extra Gengem) అను పేర్లతో వ్రాసిన భారత దేశభూగోళగ్రంథమున రెండవ భాగమందు దక్షిణ దేశభౌగో ళిక స్వరూపనిర్ణయము చేయుసందర్భమున 'మహిళార' (Mahi larpha) యని పేర్కొనియుండినట్లు శ్రీ అక్షయకుమార్ మజుందార్ గారు తమహిందూహిస్టరీ యనుగ్రంథమున 844వుటలో వాయు చున్నారు.


పై నిచెప్పిన అమరశక్తి రాజునకు బాహుశక్తి, ఉగ్రశక్తి, అనంతశక్తి యనెడినిరక్షరకుక్షలు మూఢులు నై నముగ్గురు కొడుకు రమూర్ఖన్యు లైనయాకుమారత్రయమునకు విద్యా లుండిరి. మూర బుద్ధులు గరపి గుణవంతులుగ చేయుటకై యారాజు చేసిన ప్రయ త్నము లన్నియు నిష్ప్రయోజనము లయ్యెను. తుట్టతుదకు దైవవశ మున అశీతివర్ష ప్ర్రాయుడును, విద్యావృద్ధుడును ఆకాలమున పేరు మోసినపండితుడును నై నవిష్ణుశర్మను ప్రార్థింపగా రాజుకోరిక సంగీక


రించి యాయువరాజతయము నాశ్మశిష్యులుగా గ్రహించి వారిమన సున కిష్టమైనవిధమున వశుపక్ష్యాదులసంభాషణము చేసినట్లు నీతిధర్మ ములు నిండై యుండ అద్భుతము లైనకథలు చెప్పుచు వారిని వశవర్తు లను గావించుకొని మనసునకు నొప్పి గలుగనీయక నీతినేగాక జీవిత రహస్యములును, రాజ్యతంత్రములును మొదలై నసర్వవిషయము లును బోధించి వారిని గుణకోవిదులను గావించి తండ్రి కప్పగించి యాతనిచే మన్ననలు పొందెను. ఈవిషయములు శ్రీ వి. కె. మజుం దార్ గారు తనుగ్రంథము 716 పుటలో వ్రాసియున్నారు. ఇట్లగుట చేతనే కథలు, కట్టుకథలు వినికూర్పు నేర్పున భారతీయులు సర్వ ప్రపంచమందలిమానవజాతికిని బోధకు లైరని గుణపక్షపాతి యైన ఎలిఫిన్ స్టన్ మహాశయుడు తసహిందూ దేశ చరిత్ర తొమ్మిదవ ముద్రణ 172వపుటలో నుల్లే ఖంచియున్నాడు.


ఈయాధారములతో సంస్కృతశ విజీవిత కారునిసంశయము తీరి మన కొకమార్గము దొరికిన ట్లయినది.


ఇంతకును విద్వన్మణి యైనవిష్ణుశర్మజీవిత చరిత్రము పూర్తిగా లభింపదయ్యెను. ఈతడు తనకథలలో నవకాశముగల్గినప్పు డంతయు బౌద్ధబిక్షువులను, జైనసన్యాసులను, యాయావరీయ బ్రాహ్మణులను తఱచుగా నుపాలంభము చేసియుండెను. ఒకకథలోని సందర్భమును పురస్కరించుకొని యొకానొక నక్కనోట 'అహో! నేడు భట్టారక వారముగదా! మాంససంబంధమైన యీసరమును నాదంతములతో నెట్లు స్పృశింపగలను!' అని పలికించుటను పరిశీలనా దృష్టితో నాలో చింతు మేని ప్ర్రాచీన కాలమున భానువాసరమున మాంసాహారము నిషేధింపబడిన పెచ్చటను కానరాకున్నది. గనుక ఆకాలమున నీ మహిళారోప్యపురము (Mylapore)న నెలకొనియుండిన క్రై స్తవులు ఆదివారమున మాంసాహారము, మద్యసేవనము, దైనందిన చర్యయు


మాని విధిగా సుపవసించి యారాధనా మందిరములలో గుమిగూడి శ్రద్ధాళువులై తమ మతగ్రంథమైన బైబిలును పఠించుచుండెడి వారి -యాచారముల వాలకము నతిచమత్కారముగ నవహాస్యము చేసి సహేతుకమైన వ్యాజ వినయమును ప్రదర్శించి యుండే నని తోపక -మానదు.


మదరాసు ప్ర్రాంతమునందలి మైలాపూరున బుట్టి ప్రాముఖ్యత నంది కాలక్రమమున సకలజగత్సంస్తూయమాన మైన గ్రంధ మని తెలిసియే పరవస్తు చిన్నయసూరి ప్రత్యేకించి దీనియాం ధీకరణమునకు బూనుకొని యుండెనేమో యనిగూడ తలంప వీలు లేకపోలేదు. గ్రంధము సాంతముగ ముగిసియుండినచో దీని చరిత్రను గురించి ఆమహామనీషి గ్రంధప్రస్థావనములో వ్రాసియుండు నేమో శదా?


'విష్ణుశర్మ యొక్క యీకృతి గుణాఢ్యుని బృహత్క ధలోని కొన్ని కధలకు వచనరూపమైన సంక్షేపానువాదము. ఈగ్రంధమున నందందు గానవచ్చెడి శ్లోకములు కొన్ని యీతడు స్వయముగా రచి 3 యించినవే యనవచ్చును గాని, పెక్కు శ్లోకములు మనుస్మృత్యాది పూర్వగ్రంధములనుండి స్వీకరించినవే యనదగును. కాని, క్రీ. శ. 8వ శతాబ్దివాడైన దామోదరగుప్తుని శంభళీమతనామాంతర కుట్టనీ మతమునందలి "పరఙ్కః స్వాస్తరణః పతి రనుకూల” యన్నల్లోక సా చితని పంచతంత్య్ర మిత్రభేద ప్రశరణము నందును. కీ. 9వ శతాబ్ద ఉత్తరార్ధమువాడును ఔత్తరాహుడును నైన రుద్రభట్టుయొక్క శృంగారతిలశములోని “సార్థంమనోరధశతై” అనెడి శ్లోక మాం ఛమున లబ్ధనాశతంత్రము నందును గనిపించుచుండుట వలనను ఇంగ్లం డులోను జర్మనీ దేశమునందును ముద్రితమైన “పం చతంత్రము”నకును భారత దేశమున వ్యాప్తిలోనున్న గ్రంధమునకును కొన్ని చోట్ల భేదము


కానవచ్చుచున్న దాని సర్. సి, పి, బ్రౌను పండితుడు చెప్పుటచేతను, గ్రంధము దేశమున వ్యాపించినకొలది రోజులలోనే క్రమేపి అర్వా చీనులకృతులలోని శ్లోకము లీపంచతంత్రమున ప్రక్షిపము లైనట్లు. విమర్శనా చక్షువులకు విదితముగాక పోదనుట సత్యదూరము కాదు.


ఇంతవరకును గ్రంధప్రశస్తి దానిమార్పు జన్మస్థానము కృతి కర్త వెదుష్యము వీనింగూర్చిన విషయము లుటంకించితిని, ఇంత కాల నిర్ణయమును గూర్చి మల్లాది వారనిస మాటలంజెప్పి మతాంతరములు. జూపించి పర్యవసానముం జెప్పి యీనావ్యాసమును ముగింతును,


క్రీస్తు ఆరవశతాబ్దిని మొట్ట మొట్టమొదట నీపంచతంత్య్ర గ్రంథము. పర్షియను భాషలోని కనువదింపబడినది కనుక అంతకుమున్నె యీ గ్రంధముపుట్టినదని కొందరును, దౌర్మంత్యా న్నృపతిరిత్యాదిభర్తృ హరిసు భాషిత త్రిశతిలోని శ్లోక మిం దుండుటంబట్టి దానిత ర్వాత నిది జనించిన దని మరికొందరును ఏతచ్చోక మిదిపుట్టిన తర్వాత చేరియుండు ననెడి భావమున సుభాషిత త్రిశతిశన్నను వంచతంత్య్రమే ప్రాచీన మని పల్కుచున్నారు గనుక విష్ణుశర్మకాలము సునిశ్ఛితము కాకున్న దని సంస్కృతకవి జీవితము 18 పుటలో వ్రాసిరి.


ఏవిధముగ జూచినను భర్తృహరి క్రీస్తు కుపూర్వు డగునని పలు వురు పండితులభిప్రాయము నొసంగియున్నారు. కావున మన మీ సందే హమును వీడిమతాంతర మైన యభిప్రాయముల నరయుదము,


డాక్టర్ : యం. కృష్ణమాచారియార్ (మదాసు) గారు తమ హిస్టరీ ఆప్ క్లాసికల్ సాట్ లిటరేచర్ అన్న పేరున 1937 సం॥ ప్ర్రకటించిన గ్రంధమున నీవిష్ణుశర్మను క్రీ.పూ. 776 సం॥ నాటిదాడుగా గుణాఢ్యునిశన్నను ముందు కూర్చుండ పెట్టుట యెట్లొ పరిశోధకులు నిర్ణయింతురు గాక !


 

67


పంచతంత్రము; దాని పుట్టుకు


మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు 'మెట్లయిన నితడు శా. శ. 450 కి పూర్వడు గాని పరుడు మాత్రము కా'డని ముగ తముయభిప్రాయమును చెప్పిరి.


విషయ మంతటిని సముస్వయము జేసి చూచినచో విష్ణుశర్మ


తప్పక స్క్రీ. 2వ శతాబ్ది ప్రధమపాదము నాటివాడనియు నేటిమదరాసు మహానగరమున నొక భాగమైన నాటి మహిళారోప్య పురము నేటి మైలాపూరునంది పంచతంత్రము వుటైననియు ప్రపంచమునకు తెలియ వచ్చుట సాహిత్యారాధకులకు సంతోషదాయకము కదా !


ఈవ్యాసమును వ్రాయునెడల నేను పేర్కొన్న గ్రంధకర్తల కును, ప్రకాశకులకును కృతజ్ఞతలు చెప్పుచు విరమింతును.


- శ్రీ శ్రీనివాసపురం నరసింహాచార్యులు 

( మూలం - ఆంధ్రసాహిత్య పరిషత్పత్తిక' 1957 - ఇస్యూ 6 ) 


సేకరణ 

కర్లపాలెం హనుమంతరావు

బోథెల్ ; యూ. ఎస్.ఎ.

24 -12-2021 










No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...