Saturday, December 25, 2021

వ్యాసం: కాళిదాసు కాలంలో విద్యలు - పి. వి. భట్టశర్మ ( ఆంధ్రపత్రిక - వా - 24 -05 - 1950 సంచిక నుంచి ) సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 25-12-2021 ; బోధెల్ ; యూఎస్ ఎ

వ్యాసం

కాళిదాసు కాలంలో విద్యలు

పివిభట్టశర్మ

 

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు

25-12-2021 ; బోధెల్ ; యూఎస్ వ్యాసం: 

కాళిదాసు కాలంలో విద్యలు 

- పి. వి. భట్టశర్మ

( ఆంధ్రపత్రిక - వా - 24 -05 - 1950 సంచిక నుంచి ) 

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

25-12-2021 ; బోధెల్ ; యూఎస్ ఎ



మనదేశంలో వేద కాలమునుండిన్నీ ఉప

నయన సంస్కారంతో విద్యారంభం జరుగు తూండేది. ఈ సంస్కారం ఆయావర్ణముల వారికి పలు విధాలు గా ఉంటూ వచ్చేది. వారిలో క్షత్రియుని విద్య వీటినుండి ప్రారంభ మయ్యేది. విక్ర మోర్వశీయత్రోటకం లో ఆయువు (పురూరవునిపుత్రుడు ఆశ్రమ విద్యతోనే సమర్వేద్యనుకూడా అభ్యసించినట్లు మహాకవి ప్రయోగంవలన తెలుస్తున్నది. ) 


ఆశ్రమాల్లో విద్య నేర్చుకొనే శిష్యు రాండ్రు రెండు కాలుగా ఉండేవారని ధర్మసూత్రాలలో ఉన్నది. మొదటి తరగతి వారిని సద్యో వధువు లనేవారు. వీరు విద్యాభ్యాస మయినతరువాత గార్హస్థ్యం స్వీకరిం చేవారు. 


ఇక రెండవరకమువారు బ్రహ్మవాదినులు. వీరు జీవితాంతము బ్రహ్మచర్య మాచరించేవారట. ఇందుచేతనే “మీ చెలి వివా హమువఱకే నైఖాన సవ్రత మవలంబిస్తుందా, లేక జీవితాంతమూ వ్రతంలోనే మగ్నమవు తుందా” అని దుష్యంతుడు శకుంతల చెలులను ప్రశ్నిస్తాడు. 


మహాకవి కాలంలో సహవిద్య (Co-education) నిషిద్దం కాదు . ప్రియంవద,అనసూయ, శకుంతలలు ఆశ్రమంలోని బ్రహ్మ చారులతో కలిసే విద్య నేర్చారు.


ఆనాటి విద్యకు జ్ఞానము, వినయ చరమలక్ష్యాలు. కేవలం జ్ఞానోసార్ధనవలననే వికాసం కలగదు; జ్ఞానంతోపాటు వినయం కూడా ఆవశ్యకమని ఆనాటివారి తలపు. ఈ జ్ఞానవినయాలు గురువుల సహవాసంవలన లభ్య మవుతూండేవి. ఊరకే పుస్తకాలు వర్ణించిన మాత్రాన ఆ రోజుల్లో విద్వాంసు అనిపించుకోడం కష్టంగా ఉండేది. 


చదువుకు, సాయంగా రాగద్వేషాలు అణగేటట్లు తమ నడవడిని దిద్దుకొనేవారు. ఈ భావాన్నే మహాకవి "సమ్యగా గామితా విద్యాప్రబోధవినయావివ” - బాగుగా వచ్చిన చదువు ప్రబోధవినయాల నిచ్చినట్లు అనే ఉపమలో  నిబంధించారు. ‘విద్యా దదాతి వినయమ్' అనే సూక్తిని  కాళిదాసు తమ గ్రంథాల భూమికల్లోనే చరితార్ధం చేశారు. 


ఈ కాలానికి హద్దు లేదు, భూమి విశాల మయినది. ' నాతో సమాన మైన భావాలుండేవాడు తప్పకుండా ఉంటాడు' అనే భవభూతి మాదిరి దర్పంతో ఎప్పుడూ ఈ కవికులతిలకులు మొదలు పెట్టరు. "కీర్తి గడించిన భాససౌమిల్లకకవిపుత్రుల ప్రబంధాలకంటే  కాళిదాసుకబ్బంలో ఈ నాటకీయ గౌరవం ఎందుకు ? పండితులను సంతోష పెట్టేవఱకూ బాగా ఉన్న దనుకోచ్చు "మున్నగు వినమ్రమైన వాక్యాలతో వీరు ప్రారం భిస్తారు. పురూరవుని దర్బారు. చిత్రరథుడనే  గంధర్వరాజు ఇంద్రుని సందేశం పట్టుకొని మహారాజు చిత్రరధునకు స్వాగత మిస్తాడు. ఆ గంధర్వుడు రాజును శ్లాఘిస్తాడు. ఇంద్రుని పక్షంలో వారు  చూస్తున్నారంటే అదంతా ఇంద్రుని పరాక్రమ విశేషమేనని తన కృతజ్ఞతను పురూరవుడు ప్రకటిస్తాడు. 'వినయమే  పరాక్రమానికి అలంకార' మని ఈ సందర్భంలోని చిత్రరధుని వాక్యంలో కవి తన అభిప్రాయం

తెలియచేసినట్లు అనిపిస్తుంది. 



రఘువంశమే కాళిదాసుఅంతిమ కావ్యం అంటారు. ఈ కావ్యం ప్రారంభంలో మహా కవి వినయమ నే కొండుకొన పై నుండి ఉపదేసిస్తున్నట్లుగ ఉంటుంది. చూడండి — “సూర్యవంశ మెక్కడ? ఈ అల్బబుద్ధి ఎక్కడ? దుస్తర మైన సముద్రాన్ని లోతు తెలిసికోకుండానే తెప్పతో దాటుదామని యత్నిస్తున్నా. కవి యశఃప్రార్థినై మందుడనైన నేను హాస యోగ్యుడనే ప్రాంపును పొందదగ్గ పండ్లను పొట్టివాడు చేతులెత్తిన వెంటనే  పొందలేడు గదా" అని అంటూ తర్వాత కూడా "ప్రాచీన కవులు మాటలతలుపులు తెరిచిన ఈ సూర్య వంశంలో--వజ్రసముత్కీర్ణమై మణిలో దారమునకువలె —— నాకున్నూ గమనం లభ్య మవుతుంది" అంటారు.


త్రివర్గములకు మూలమైన మూడు విద్యలను పూర్వజన్మలోనే అంతుచూచినవి జ్ఞాపకముండునట్లు ఆ రాజు ఈ గురువులకు కష్ట మివ్వ నేర్పాడు అనడంలో ( రఘువంశం  18.50 ) కవి మూడు విద్యలను ఉల్లేఖించి కవి తమ కాలపు విద్యావిధానం సూచించారు . వేదత్రయం నుండి ధర్మాధర్మాలు, దండనీతి నుండి న్యాయాన్యాయాలు , వార్త నుండి అర్థ అనర్థాలు  - అని మల్లి నాథులు వ్యాఖ్యానించారు. 


దీనితోపాటు మహాకవి అక్కడక్కడ చతుర్దశి విద్యలనూ పేర్కొన్నారు . (5-21) మీమాంస మాట నామగ్రాహం గ్రహింపక పోయినా, రఘువంశప్రారంభశ్లోకంలోనే మీమాంసలో కవి నేర్పు స్పష్టమవుతున్నది.


శివతపోవర్ణనఘట్టంలో, 'విరాసనం వేసి, దృష్టి తిన్నగా, నిశ్చలంగా ఉండేట్లు చేసి బాహువులు వంచి, అంకంపై చేర్చి రెండు చేతులూ కమలాకారంలో నిలిపి, ఈశ్వరుడు ధ్యానం చేశారట. పాతంజలంలో సరిగా ఇదే పద్దతి నిర్దిష్టమైయున్నది. కుమారసంభవంలోగుణత్రయ విభాగాయ - త్యా మానయంతి ప్రకృతిం' అనేవి, రఘువంశంలో “లోష్ట కాంచనముల్లో సమబుద్ధి గల రఘువు ప్రాకృ తికమైన గుణత్రయాన్ని జయించెను' అనే వర్ణనకూడా ఆనాటి సాంఖ్యసిద్ధాంత ప్రాబ ల్యాన్ని, కవికి సాంఖ్యంలో గల పరిచ యాన్ని వ్యక్త పరుస్తున్నాయి.


ప్రపంచానికి కారణమై, కారణము లేనివాడవు, ప్రపంచమున కంతకుడనై అంతము లేనివాడివు" అని బ్రహ్మ చేసిన శివస్తోత్రము,

విక్రమోర్వశీయ నాందిలో "వేదాంతేషు యమాహు పురుష " మున్నగునవి కవికి గల వేదాంతపరిచయానికి  నిదర్శనలు. పై

భావాలు 'యతో వాఇమాని భూతానిజాయంతే ' అనే 

ఉపనిషద్భావాలకు వ్యాఖ్యానమే. ఉపనిషత్  అర్థం తెలియకుండా వేదాన్ని అప్ప చెప్పే' ఛాందసులు ఆనాడూ ఉన్నట్లుగా ‘వేదాభ్యాసజడు,లనడింవలన ఊహించవచ్చు నేమో. 'సాంగం చ వేద మధ్యాప్య'  అని వేదాంగాలు నిర్దేశింపబడ్డాయి. ప్రాతఃకాలమే నందినిని సేవిస్తూంటాడు. ముందు నందీని , నెనుక దిలీపుడు! నందిని డెక్కలనుండి వచ్చే ధూళి మార్గాన్ని పవిత్రం చేస్తున్నది. అదే మార్గంలో వస్తున్న సుదక్షిణ శ్రుతిని అనుసరించే స్మృతివలె వస్తున్నదిట .


యుద్ధభూమిలో శత్రువ్యూహములను భేదించే వ్యూహాల అంతు, శాస్త్రములు అంతున్న ఈ బాలుడు చూడగలడని ముందుగా  ఆలో చించే - రఘువు అని పేరు పెట్టారట. (రఘి ధాతువు గమనార్థకము) ఈ విధంగా నే మహా కవి తమ వ్యాకరణపరిజ్ఞానాన్ని అక్క డక్కడ విశదీకరించారు.


శ్రీరామవివాహసందర్భం. నలుగురు  రాజ కుమారులను పరిణయమైన ఆ రాజకన్యలు.. ఆ కన్యలను పొందగల్గిన రాజకుమారులున్నూ నిస్తులు లయ్యారట. ఆ వధూవరుల మేళనము ప్రాత: పదికలతో ప్రత్యయములు కలిసినట్లున్న దట. వధూవరులు అనే రెండు ఉపమేయములకు ప్రత్యయప్రకృతులకు ఉపమించారు. వరశబ్దం పుంలింగ ఏకవచనం. ఆటాంటి ప్రత్యయశబ్దాన్నే ఉపమానంగా వాడారు. ఈ విధంగానే స్త్రీలింగమైన వధూశబ్దానికి సరిగా స్త్రీలింగమైన ప్రకృతిశబ్దంతోనే సాదృశ్యం నిబంధించారు. ప్రకృతి ప్రత్యయములవలన ఫలితం పదనిష్పత్తి. అదే విధంగా వధూ వరుల యోగంతో గృహస్థాశ్రమం సిద్ధమవుతుంది. ఈ రెండు ఉపమేయ ఉపమానాలకు యోగం సాధారణ ధర్మము; సన్నిధమనేది ఉపమావాచకము. వ్యాకరణం వంటి నిష్క  శాస్త్రాన్ని కూడా తమ చమత్కారపూర్ణ ఉపమలతో  సరస మయ్యేటట్లు మహాకవి నిరూపించారు. ఈ అలంకారాన్ని 'పూర్ణోపము ' అని సాహితీశాస్త్రజ్ఞులు. ఇదేకాక 'ధాతో:  స్థాన ఇవాదేశాత్' మున్నగునవి కవికి  వ్యాకరణమంటే గల ఆదరణ తెలియచేస్తున్నది. మహాకవిసమయంలో మనవిద్యల ఉన్నతస్థాయిని ఊహించుకోగలవారికి, పతనమైనమన నేటివిద్యావిధానం దృగ్గోచరమై హృదయా వేదన ఎక్కువ కాకతప్పదు. 

--- 

 - పి. వి. భట్టశర్మ

( ఆంధ్రపత్రిక - వా - 24 -05 - 1950 సంచిక నుంచి ) 

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

25-12-2021 ; బోధెల్ ; యూఎస్ ఎ

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...