Showing posts with label Telugu. Show all posts
Showing posts with label Telugu. Show all posts

Friday, December 10, 2021

సాహిత్య వ్యాసం నివేదనం - కాటూరి వేంకటేశ్వరరావు సేకరణ - కర్లపాలెం హనుమంతరావు

 


సాహిత్య వ్యాసం 

నివేదనం


- కాటూరి వేంకటేశ్వరరావు

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు




భావము కుదిరి, ఉపక్రమోపసంహారాలతో, రమణీయార్ధములతో, సంవాద చతురతతో నడచిన ఈ కావ్యానికి ప్రబంధ మనే నూతన' సంకేతం ఏర్పడింది. వలసినంత భావనాసమృద్ధితో, అలంకారశిల్పముతో, రసభావనిరంతరంగా, గద్యపద్యాత్మకంగా రచితమైన ప్రబంధ మనే ఈ కావ్య పరిషియ ఆంధ్ర సాహితికి సొంతమని చెప్పదగును. ఆవేలమైన భావనకు రాయల ఆముక్తమాల్యదా, అద్భుతకథాకల్పనకు సూరన కళాపూర్ణోదయం నిదానములు. కావ్యానికి కావలసిన సకలలక్షణాలు సంపాదించుకొను టేకాక, శ్రవ్యరూపాన ఉన్న ప్రథమాంధ్రదృశ్య కావ్యమని పేరుగన్నది ప్రభావతీ ప్రద్యుమ్నం. కవిరాజ శిఖామణి నన్నెచోడుడు, ఎఱన, శ్రీనాథుడు, పినవీరభద్రుడు మున్నగువా రీ స్వతంత్ర కావ్యావిర్భూతికి బీజావాపం చేసినా, దీనికి ప్రత్యేక నామరూపాలు కల్పించిన మాన్యుడు అల్లసాని పెద్దన.


భారతాదులయందువలె కథాకథనము, ధర్మోపదేశము ఈ కావ్యములందు ప్రధానము కాదు. విభావాను భావాదులచే పరిపుష్టమగు రసనిష్పత్తియే ఇందు ప్రాధాన్యము వహించును. ఈ కాలపుగ వీశ్వరులు తమయెదుట కన్పట్టు మహా రాజ్యవిభవాన్నీ, అప్పటి రాగభోగాలను, నడతనాగరీశాలను మనసులందు నిల్పికొని వానికి రూపాంతరాలు కల్పించి, రసమయమైన గంధర్వలోకాన్ని సృష్టించారు. భువనవిజయం సుధర్మగాను, తుంగభద్ర మం దాకీని గాను, విద్యానగరళ్ళం గారవతులే కథానాయికలుగాను, ఆనాటి సాహసరనికులే నాయకులు గాను వీరి కావ్యాలలో అందందు రూపాంతరం పొందిరేమో ! ఆనాటి కవులకు, ప్రజలకు హస్తప్రాప్యములైన రసభోగాలనుండి వంచితులమైన మనకు నే డా కావ్యసృష్టి వింతగా, విపరీతంగా కన్పించినా సర్వర్తుధర్మసంశోభిత మై, అద్భుతర సస్యందియైన ఆరామంవంటిది ఆనాటి సాహిత్యం.


ఈ ప్రబంధకవులలో సహజశ్లేషలకు శయ్యాసౌభాగ్యానికి రామరాజ భూషణుడు, భక్తిపారమ్యానికి ధూర్జటి, ముద్దులొలుకు పలుకుబళ్ళకు తిమ్మన, అర్థభరితమైన పదబంధానికి రామకృష్ణుడూ — ఇలా ఒకరొకరే పేరుగాంచిరి. ఆంధ్రమున మొదటి ద్వ్యర్థి కావ్యమూ, యక్ష గానమూ ఈ కాలంలో నే పుట్టినవి. ఆత్మపరము, భక్తిభరితము అయిన శతకరచనం వెనుకటికాలంలోనే ఆరంభ మైనా ధూర్జటి కాళహస్తీశ్వరశతకం అట్టిరచనలకు మకుటాయమానమయింది. మెట్ట వేదాంతులను, దాంభికులను, మూఢమానవులను ఆధిక్షేపించి, పరిహసిస్తూ వేమయోగి అలవోకగా చెప్పిన ఆటవెలదులకు లోకుల నాలుకలే ఆకులైనవి.


విజయనగర సామ్రాజ్యం తల్లికోట యుద్ధంతో స్తమించిన పిమ్మట చోళ పాండ్య దేశాలలో రాజ్య స్థాపనం చేసికొన్న నాయక రాజులు ఆంధ్ర సాహిత్యానికి వూరు, మధుర, పుదుక్కోటలందు విస్తరిల్లిన ఈనాటి వాఙ్మయ మంతా కేవలళ్ళంగారపరమైనది. స్వయము కవియై, సర్వవిధాల కృష్ణరాయలకు దీటైన రఘునాథరాయల అనంతరమందు నాయక రాజులలోను,. వారిపిమ్మట రాజ్యమేలి మహారాష్ట్ర ప్రభువులలోను భోగపరాయణత


 విసరిలినది. ఆంధ్రజాతి జవసత్యాలు ఉడిగి, పౌరుష ప్రతాపము ల సంగతములు కాగా, మిగిలిన కామపరతనుండి ప్రభవించిన ఆనాటి కావ్యాలు సంయమం కోలుపోయి పరకీయాశృంగారానికి పట్టముగట్ట నారంభించినవి. ఈ 150 ఏండ్లలో పొడమిన సాహిత్యంలో విజయవిలాసంవంటి ఒకటి రెండు కావ్యాలు పూర్వకావ్య గౌరవాన్ని కొంత అందుకొన్నవి. యక్షగానము జై కటి ఈ కాలమందే వరి లినది. నాయక రాజులలో పెక్కురు, మహారాష్ట్రప్రతాపసింహాదులు, నాయక రాజుల సామంతులు, దండ నాధులు గూడ కావ్యములు రచించుటొకటి, పెక్కురు విదుషీమణులు కవయిత్రు లగుట యొకటియు ఈశాలమందలి విశేషాలు, గేయకవితకు ద్వితీయాచార్యు డగు క్షేత్రయ్యయు, దాక్షిణాత్యకృంగార కావ్యభూషణమైన రాధికాసాంత్వనం రచించిన ముద్దుపళనియు, ఆనాటివారే.


కోకొల్లలుగా బయలు దేరిన యక్షగానాలు, శృంగారపదాలు అభిన యిస్తూ రాజసభలలో నాట్యం చేసే వేశ్యల పదమంజీరధ్వనులే అప్పటి కావ్యా లలో ధ్వనించుచుండును. రాజాస్థానాలలో తెరపిలేకుండా సాగే కామ దేవతారాధనమే నాగరులకు అనుకార్యమై, త్యాగ భోగ రాయుళ్ళయిన నాయక రాజులే శృంగార కావ్య నాయకు లైనారా అనిపిస్తుంది. సకలేంద్రియసంతర్పణం చేసే కామపురుషార్థమహాఫలంకోసం రనికనరనారీలోకం నూటయేబదియేండు 3 ఇలా సాహిత్య సముద్రమథనం చేయగా చేయగా తుదకు రామనామామృత భాండం చేబూని వాగ్గేయకార సార్వభౌముడైన త్యాగరాజస్వామి అవతరిం చెను.


3. క్రీ. శ. 1850—1955


19వ శతాబ్ది పూర్వార్ధంలో రెండుమూడర్థాల కావ్యాలు, శ్లేష చిత్ర బంధ కవిత్వాలూ బయలు దేరినవి. హాస్యనీతిశతకాలవంటివితప్ప స్వతంత్ర కావ్యములు పొడమలేదు. దేశం క్రమంగా ఆంగ్లేయాక్రాంతమై, క్రిస్టియనుమత ప్రచారము, ఆంగ్లవిద్యాభ్యాసం ప్రబలినవి. వీనికి దోడు భౌతికదర్శనముల ప్రభావం వల్ల విద్యావంతులు ప్రత్యక్ష ప్రమాణబుద్ధులు కావొడగిరి. భారతీయధర్మము, సంప్రదాయాలు, ఆచారాలు పునర్విచారణకు పాత్రములై, స్వస్థాన వేష భాషాభి మానం సడలుటతో, సంఘసంస్కారోద్యమాలు సాగినవి. సముష్టి చిర కాలంగా తనచుట్టు నిర్మించుకొన్న ప్రాకారాలు శిథిలము లగుటయు, వానినుండి విడివడజూచే వ్యష్టి తనకే మం తాను విచారించుకోజొచ్చింది. భారతీయ ధర్మాన్ని నవీన కాలానుగుణంగా సంస్కరించుట కి ట్లొకవంక యత్నం జరుగు చుండగా, మరొకనంక ఆంగ్లప్రభుత్వ బంధనంనుండి విడివడాల చేకోర్కె బలీయ మయ్యెను. అంతట భారతీయపూర్వేతిహాసాన్ని, ధర్మ ప్రపంచాన్ని మథించి, స్వస్వరూపసాక్షాత్కారం పొందవలెననే కాండా, అభిజనాభిమానము ప్రబలమయ్యెను. ఆంగ్లభాషాకళాశాలల్లో ఆంగ్లేయసాహిత్యాన్ని అవ గాహిస్తున్న పడుచువాండ్రు ఈ రెండు ఉద్యమాల చే ప్రేరితులై అందరమైన


నివేదనం


ix


అద్భుతర సదర్శనానికి, మద్రమై, బంధనాగారపదృశమై కనిపించే బాహ్య లోకానికి పొత్తుకుదరక, తమవేదనలను చెప్పికొనుటకై మాటలను, మార్గములను


ఇంతలో తిరుపతి వేంకటకవులు ఈ కాలపువారి కష్టసుఖాలను చెప్పికొనుట కనువైన సులభసుందర శైలిచే కావ్యరచనం చేయనారంభించిరి. గురుజాడ అప్పారావు మానవధర్మాన్ని, దేశభక్తిని ముత్యాలసరమనే ఛందముచే గానము ఇట్లు దేశకాలానుగుణమైన కావ్య శైలియు, ఛందము దొరకి సంతట 20వ శతాబ్ది ప్రథమపాదమున తరుణవయస్కులు, గొంతులు విడివడినప్లై, ఆత్మనాయకములగు మధురకవితలను చెప్ప మొదలిడిరి.


పాశ్చాత్య సాహిత్య ప్రపంచమును, రవీంద్రనాథగీతావళిని ఆరగ్రోలిన సంస్కారపుష్టిచే ఆరంభమైన ఈ మధురకవితలందు అలనాటి రాయల సాహిత్యంలో లభించే అద్భుతమైనరసదర్శనం మల్లా లభించింది. అయితే ఆనాటి దర్శనం భోగభాగ్యములచే తులదూగే జీవనపొష్కల్యమునుండి లభింపగా, ఈనాటిది ప్రతికూల పవనహతినుండి ఆత్మజ్యోతిని కాపాడుకొనుటకై వాయు మండలో పరిపథాన కెగిరి, ఆచట నిర్మించుకొన్న ఏకాంతజీవనంనుంచి పుట్టింది. ఆచట కవి నిజానుభవాలకు రూపాంతరం కల్పింపగా, ఇచట కవి మనోరథాలకు రూపకల్పన జరిగింది. కాగా, అందు సంయోగ సుఖము, ఇచట తరచు విరహ పరిదేవనమాధురియు లభించినవి. మేఘదూతలోని యక్షులవంటి ఈ కవుల కా అలకానగరసుందరి దవుదువ్వులనే ఉండిపోయింది. పార్థివగంధస్పర్శ లేని ఆసుందరి ఆరాధ్య దేవతయై, పూజాపీఠ మలంకరించింది. ఆదేవిని ప్రసన్న నొనర్చుకొనుటకై వీరు పాడిన మధురకవితలలో అద్భుతమైన భావస్ఫూర్తీ, రమణీయారాలు కోకొల్లలుగా మనకు లభిస్తవి.


ఆక్మనాయకములైన మధురకవిత లోకవంక ఇట్లు చెల్లుచుండ రెండవ వంక పూర్వేతిహాసములను రసమయంగా ప్రత్యక్షం చేసే వీరకథాకావ్యాలు, పర దాస్యబంధనాన్ని సహించని దేశభక్తి గేయాలు వెలువడజొచ్చెను. స్వస్థాన స్వధర్మాభిమానములనుండి ఆవిర్భవించిన ఈజాతికావ్యములు గూడ గుణ గౌరవ ముచే పొగడ్త కెక్కినవి.


ఇవి యిటులుండ ఇంకొక తెగ కవీశ్వరులు పామరజనజీవనమాధుర్యాన్ని పదకవితలందు అందీయసాగిరి. లోకానికి అన్న పత్రం పెట్టే కర్షకభాగ్యశాలిని, సంఘానికి సుఖభోగ పరికరాలను సమకూర్చియిచ్చే మంటిపుట్టువుల వితరణాన్ని కీ ర్తించుతూ వీరు ఈశ్వరాంశను మానవత్వమందు ప్రతిష్ఠ గావింపజొచ్చిరి.


ఈ వివిధ కావ్యసృష్టి యిలా జరుగుచుండగానే గాంధీజీ భారతరాజకీయ రంగాన ప్రధానభూమిక వహించడం, స్వాతంత్య్రచ్ఛ జనసామాన్యానికి గూడా ప్రాకడం, భాషారాష్ట్రములకొరకు ఆందోళన చెందడం, స్వతంత్రభారతంలో సంఘస్వరూప మెలాఉండాలి అనే వాదోపవాదాలు చెలరేగడం, ద్వీపాంత 


రాలనుండి ఆ సేకనూతనోద్యమమారుతాలు దేశంలో వీచడం వీని యన్నిటి భావుకులు చి తవీధులందు క్రొ ఆలోచనలు పొడమినవి. దీనితో కాల్పనిక మైద రసభావసృష్టి వెనుకబడి, దేశకాలాల యథాస్వరూపాన్ని చిత్రిస్తూ, నవసంఘ స్వరూపానికి రూపరేఖలు దిదేరచనలు బయలుదేరినవి. పరపీడనాన్ని, పరోప జీవనాన్ని శపించడం, కష్టజీవులందు అభిమానాన్ని ఉద్దీపింపజేసి ఆశాజ్యోతి వెలిగించడం __ఈ కాలపు కావ్యములకు సామాన్యలక్షణా లని చెప్పవచ్చు.


భావస్రవంతి పలుపోకల పోతున్న ఈ నవీనకాలంలో తొల్లి ఎన్నతు లేనంత వైవిధ్యము, గుణబాహుళ్యం కావ్యసృష్టియందు కనిపిస్తున్నవి. భావాను గుణములైన నూతవచ్ఛందాలను కవులు వాడుతున్నారు. కొందరు వృత్తగంధి వచనరచన చేస్తున్నారు. సంస్కృతపురాణేతిహాసాలకు మళ్ళా కొందరు కేవలానువాదాలు చేస్తుంటే, కొందరు వానిని స్వోపజ్ఞంగా క్రొత్త వెలయిను న్నారు. జానపద గేయాలు, వీరకథాగేయాలు ఎక్కువగా ప్రజాదరం పొందు తున్నవి. దేశకాలాలను వ్యాఖ్యానించుటకు కొందరు శతకపద్ధతి నవలంబిస్తు న్నారు.


ఏకాలమందైనా క్రొత్తదారి త్రొక్కేవా రొకరిద్దరే ఉంటారు. తక్తిన వారొక అడుగు అటూ యిటూగా ఆధారినే పోతూ, కొంత విలక్షణతను గూడ చూపెట్టుతారు. కొందరిరచనలు ఉపజ్ఞామహితములు కాకున్నా, తత్కాల పరిస్థితులకు, ఉద్యమాలకు ప్రతిబింబాలుగా ఉంటవి. ఇలా వేయేండ్లనుంచి ఎప్పటికప్పుడు నవనవంగా వర్ధిల్లుతున్న ఆంధ్రసాహిత్యమందలి కావ్యభేదాలను, రీతులను ఇందు ప్రదర్శించుటకు యత్నించితిని. ఆంధ్రసాహిత్యంలో కేవలం మేలేర్చి కూర్చేయత్నం కాకపోవడంవల్ల, ఆంధ్రరసజ్ఞలోకానికి పరమాదర పాత్రములైన కొన్నికొన్ని రచనల నిందు చేర్చలేకపోతిని. రుచిభేదంవల్ల, పరిశీలనాలోపంవల్ల, స్థలసంకోచంవల్లకూడా ఈ కూర్పు కొంత అసమగ్రతకు పాల్పడిఉంటుంది.


నా యీలోపములను సహృదయులు మన్నింపవేడెదను. ఇతర భాషా ప్రాంతములందలి సోదరభారతీయులకు ఆంధ్ర సాహిత్య సంపద నంతటిని, శృంగ గ్రాహికగా కాకున్నా, స్థూలారుంధతీన్యాయంగానైనా ఈ గ్రథవం చూపెట్ట గలదేని కృతార్థుడ నగుదును.


- కాటూరి వేంకటేశ్వరరావు

( తెలుగు కావ్యమాల - నుంచి ) 

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు

Thursday, December 9, 2021

ఆంధ్రము - తెలుగు - కోరాడ రామకృష్ణయ్య -కర్లపాలెం హనుమంతరావు

 ఆంధ్రము - తెలుగు 

కర్లపాలెం హనుమంతరావు 

మనిషి, జాతి, దేశం - వీటి గుర్తింపుకు సాంకేతికంగా ఒక ప్రత్యేకమైన పేరు ఏదైనా ఉండటం తప్పని సరి . చిత్రాంగా తెలుగువారి భాషకు రెండు పేర్లు ఆంధ్రము , తెలుగు! ( తమిళులదీ ఇదే వరస : తమిళం - అరవము .. అట్లాగే మరికొన్ని భాషలకూ ఉన్నప్పటికి వాటి చర్చ ఈ వ్యాస పరిధికి బైట. కనుక ఆంధ్రము - తెలుగు వరకే మనం పరిమితమవుదాం . ఈ చర్చ వల్ల భాషా సాహిత్యాలు, సంఘం ప్రాచీన పరిస్థితులు, ప్రాచీనా భాష పరిణామ క్రమం మీద కొద్దిపాటి అవగాహన వస్తుంది. అదీ ఈ వ్యాసం ఉద్దేశం కూడా.  


భాష అంటే మనిషి తన మనసులోని భాషను సంఘంలోని సాటి మనిషితో పంచుకునే  ప్రక్రియ సాధనం.  మనుషులకు సంబంధించిన జాతి, రాళ్లు  నివసించే ప్రాంతానికి దగ్గరగా పలికే పేర్లు ఆయా భాషలకు ఉండటం సహజం. ఉదాహరణకు అంగిలులకు దేశం ఇంగ్లాండ్, భాష ఇంగ్లీషు; అట్లాగే మన ఓడ్రులకు ఒరిస్సా, ఒరియా ) . అయి అఱువాళర్ అనేది ఒక తెగ పేరు. వాళ్ల  భాష పేరు ' అఱు ' వము. కానీ అరవల ప్రాచీన వాజ్ఞ్మయంలో ఆ పేరు కాకుండా ' తమిళం ' అనే పేరు మాత్రమే కనపడుతుంది. ఈ వింతాకు కారణం ఉత్తర దిక్కున ఉండే మన తెలుగువాళ్లే అంటారు ప్రసిద్ధ భాషా పరిశోధకులు కోరాడ రామకృష్ణయ్యగారు. తమిళం - అరవం లాగే ఆంధ్రం- తెలుగు కూడా ఆయా జాతి పేరుకు బట్టి ప్రాంతాన్ని బట్టి ఏర్పడినవే. రెండు వేరు వేరు జాతులు అయివుండి వేరు లేరు భాషలు ఉపయోగిస్తూ కాలక్రమేణా రెండు జాతుల వాళ్లూ దక్షిణాపథంలో ఒకే ప్రాంతంలో స్థిర పడి పోవడం వల్ల ఒకే భాషగా కలగలసిపోయి రెండు పేర్లతో పిలవబడుతున్నదా? ఈ అనుమానం చాలాకాలం బట్టి పరిశోధకులను వేధిస్తూనేవుంది. 

ఐతరేయ బ్రాహ్మణంలో ఓ కథ ఉంది. ఆర్యాంధ్ర జాతికి చెందిన వాళ్లు ఆర్య సంఘం నుంచి బహిష్కరించబడి పుండ్ర, పుళింద, మూతిబ లాంటి జాతులలో కలసి వింధ్యకు దక్షిణం దిక్కులో స్థిర పడ్డారని దాని సారం. వీళ్లే క్రమంగా క్రమంగా దక్షిణా పథానికి విస్తరించి కృష్ణా గోదావరి ప్రాంతాల ఆదిమవాసులు తెలుగు వారితో కలసిపోయారని విశ్వాసం . కృష్ణాతీరంలో రాజ్యాన్ని స్థాపించుకుని పాలన కూడా చేసినట్లు ఒక నమ్మకం. క్రీస్తు పూర్వం 3 వ శతాబ్ది నాటికే మగధ రాజ్యం తరువాత అంతటి మహరాజ్యంగా మెజస్తనీస్ మెచ్చుకున్నది ఈ ప్రాంతాన్నే . కృష్ణానదీప్రాంతంలోని ' కుబీరకుడు ' అనే రాజును గురించి 

భట్టిప్రోలు శాసనం కూడా ప్రస్తావించింది. ఆ శాసనం అశోకుడి కాలానికి కొద్దిగా ఇటువైపుదని పరిశోధకుల అభిప్రాయం. పశ్చిమ దిగ్భాగంలో ఉన్న మగధను కూడా జాయించి ఆంధ్రులు హైందవ మహాసామ్రాజ్యాన్ని స్థాపించిన విషయం అందరికీ తెలిసిందే. ఉత్తర దేశంలోని ఆర్యాంధ్రులు దక్షిణంలోని గోదావరీ కృష్ణాప్రాంతవాసులు తెలుగు వారితో  కలసిపోయి    సామ్రాజ్యపాలకులుగా పశ్చిమదిక్కు కు కూడా ఆక్రమించి మొత్తానికి పాలకులు అయినందున తెలుగు మాట్లాడే ప్రాంతం కూడా ఆంధ్రప్రాంతం అయిందని, ఇక్కడి ప్రజలు ఆంధ్రులు, రాల్లు మాట్లాడే తెలుగు భాష ఆంధ్రం కూడా అయిందని   తాత్పర్యం . 


ఆర్యాంధ్రులు రాక ముందు కృష్ణా ప్రాంతం నిర్జనంగా ఏమీలేదు. తూర్పుదిక్కు నుంచి దక్షిణానికి సముద్ర మార్గంలో వెళ్లే బౌద్ధ యాత్రికులకు అమరావతి  స్థావరంగా ఉన్న నాగజాతి వాళ్లు ఆతిథ్యం ఇస్తుండేవాళ్లు . నాగజాతి అనే ఒక జాతి ఉన్నట్లు అమరావతీ స్తూపం మీద చెక్కిన చిత్రకథల ద్వారా నిర్ధారణ కూడా చేసుకోవచ్చు .  ఇంత జరిగినా ' తెలుగు' వాళ్ల ప్రస్తావన ఎక్కడా లేకపోవడానికి పరిశోధకులు ఊహించేదే నిజమయితే అక్కడి తెలుగువాళ్లు ఆ సరికే బర్మా వైపుకు ' తెలుంగులు' పేరుతో వలసపోగా .. మిగిలిపోయినవాళ్లు ఏ ' తెలగాణ్య బ్రాహ్మణులు, తెలగాలు'  గానో వ్యవహరింపబడ్డారు. క్రీ.శ 2వ శతాబ్దినాటి యవన యాత్రికుడు టాలమీ పేర్కొన్న ' ట్రిలింగాన్ ' ' ట్రిగ్లిఫాన్ ' ఈ తెలుగు ప్రాంతమే అయివుండవచ్చు.  ప్రాభవం బలంగా  ఉన్న చోట బలహీనులు ఉనికి కొల్పోవడం చరిత్ర గమనంలో మనం చూస్తున్న పరిణామమే, ఇక్కడ ఆంధ్రుల ప్రాభావంలో  ఆదిమ తెలుగు జాతికీ  అదే గతి పట్టివుండవచ్చు.   త్రిలింగము అనే కథ తరువాతి కాలంలో పౌరాణిక పరంగా కల్పన చేసి ఉండవచ్చు. 


చిట్టచివరగా ఒక మాట. తైలంగులు, తెలగాలు, తెలంగానా వంటి శబ్దాలను బట్టి ' తెలుగు ' అనేదే మూల రూపం అయివుండవచ్చు . కానీ అప్పటి సంస్కృత పండితులు ఈ దేశీయ పదాన్ని సంస్కృతీకరించే శ్రద్ధతో స్వభాషానురూపమైన రూపం, వ్యుత్పత్తి తయారు చేసారనడంలో సందేహంలేదు. ఆ తరహారూపాన్నే టాలమీ తీసుకున్నందువల్లనే  తెలుగును  ' ' ట్రిలింగాన్' ' ట్రిగ్లిఫాన్ ' అని ప్రస్తావించి ఉండవచ్చు. 


నోట్ : సంస్కృతీకరణ - ప్రక్రియను గురించి కుమారిలభట్టు ' తంత్ర వార్తికం ' అనే గ్రంథంలో చాల విపులంగా వివరిస్తాడు. కృష్ణానదికి ప్రాచీన రూపం మైసోలాన్. ఆ పరీవాహక ప్రాంతమంతా 'మైసోలియా' . ( అదే ఇప్పటి మచిలీపట్టణం). మై - అంటే ద్రావిడ భాషలలో ' నలుపు ' అని అర్థం. దీనిని సంస్కృతీకరించినందు వల్లనే నది ' కృష్ణ ' అయింది. దీనికీ ఓ ప్రాచూ నామం ఉంది. . ' కృష్ణ బేణ్ణా ' . కాలక్రమేణా అదే కృష్ణవేణి అయింది. ఇట్లా సంస్కృతీకరణను గురించి ఎన్నయినా ఉదాహరణలు ఇవ్వచ్చు. కానీ, ఇది సముయమూ కాదు. స్థలమూ పరిమితం, 

( వ్యాసానికి ఆధారం: కీ.శే. కోరాడ రామకృష్ణయ్యగారి ' ఆంధ్రము - తెలుగు ' - ( దక్షిణ దేశా భాషా సారస్వతములు - దేశి ) 


- కర్లపాలెం హనుమంతరావు 

03 - 10-2021 


బోథెల్ ; యూఎస్.ఎ 




Tuesday, December 7, 2021

ఆంధ్రుల ప్రాచీనత - కర్లపాలెం హనుమంతరావు

 ఆంధ్రుల ప్రాచీనత 

-  కర్లపాలెం హనుమంతరావు 


భారతదేశంలోని పురాతన జాతులలో ఆంధ్రజాతి ఒకటి..


భారత రామాయణాలలో, ఇతిహాసాలలో, పురాణాలలో జాతక కథలలో ఆంధ్రుల ప్రస్తావన కనిపిస్తుంది. 


కురుక్షేత్ర యుద్ధంలో ఆంధ్రులు కౌరువుల తరుఫున్ పోరాడారని ఒక విశ్వాసం. 


శ్రీకృష్ణుడు మధురానగరం వచ్చినపుడు అతని పై యుద్ధానికి కంసుడు  ఉసిగొల్పినా చాణూరుడు ఆంధ్రజాతి వాడేనని కూడా మరో నమ్మిక . 


మరో కథలో విశ్వామిత్రుడు ఒకానొక నరమేధ యాగంలో  బలిపశువు శునశ్శేపుని విడిపించి తన  దత్తపుత్రునిగా  స్వీకరిస్తాడు. దానితో విభేదించిన  విశ్వామిత్రుని బిడ్డలు ఉత్తర భాగం నుంచి తూర్పు , దక్షిణ దిశలుగా వలస వచ్చేస్తారు. వారు ఆంధ్రులు అనే భావనా ఉంది. 


కురుక్షేత్ర  యుద్ధం కారణంగా కురు పాండవుల పక్షాన పోరాడిన అనేక తెగలునాశనమయ్యాయి. గంగా,యమునా తీరాలు పీనుగుల పెంటగా మారిన ఫలితంగా మిడతల దండుల దాడి అధికమయినట్లు, ఆ బాధనుండి విముక్తికై వివిధ దిక్కులకు తరలిపోయిన జాతులలో ఆంధ్రులలోని ఒక భాగం  దక్షిణాపథానికి  వచ్చి స్థిరపడ్డట్లు ఛాందోగ్యోపనిషత్  తెలియచేస్తుంది. 


పుండ్ర పుళింద, శబర మూతిలులతో కలిసి వింధ్యకు దక్షిణాన ఆంధ్రులు నివసించినట్లు ఐతరేయ బ్రాహ్మణం చెబుతోంది . 


ఆంధ్రులంతా మూకుమ్మడిగా ఒకేసారి తరలిపోలేదు. ఇది శతాబ్దాలపాటు తెగలు తెగలుగా జరిగిన  మహాప్రస్థానం. ఉన్న చోటును ఒక పట్టాన వదలలేని మనస్తత్వంతో ఆంధ్రులలోని కొంత భాగం క్రీ.పూ 700 నాటికి కూడా యమునా నదీ  తీరాన గల  సాళ్వీదేశంలోనే అవస్తలు పడుతూనే ఉండిపోయారని  ఆపస్తంబ  రుషిగాధ తెలియచేస్తున్నది. 


ఆంధ్రులలోని బ్రాహ్మణులు నేటికీ పాటిస్తున్న  వివాహ పద్ధతులు.. గృహ్య సిద్ధాంతాలు ఈ ఆపస్తంబ  రుషి నిర్దేశించినవే! 


ఒక్కో గణానికి నిర్దేశకుడుగా ఒక్కో రుపి ఉండేవాడు. సాళ్వీదేశంలో ఉన్నప్పుడే ఆపస్తంబుడు రచించిన గృహ్య సూత్రాలు ఆంధ్రులతో పాటే వింధ్య దక్షిణానికీ తరలివచ్చి ఇక్కడి తెగలలో కలగలసిపోయాయి. 


వింధ్య దక్షిణానికి కొన్ని ఆంధ్ర తెగలు వలస వస్తే ( నేటి హైదరాబాద్ .. పరిసర ప్రాంతాలు) , మరికొన్ని ఆంధ్ర తెగలు తూరు కనుమల గుండా ఒరిస్సా వైపు నుండి కిందకి దిగి కళింగదేశంలో స్థిరబడ్డాయి . 


సెరివణిజ జాతక కథ ఆంధ్రులు తేల్ నదీ తీరాన   అంధకవురం నిర్మించుకున్నట్లు వర్ణిస్తుంది.  జాతక కథల కాలం క్రీ.పూ 200-250 . 


తేల్ మహానదికి  ఉపనది తెలివాహ . మహానది ఉన్నది ఒరిస్సాలో.  కాబట్టే ఆంధ్రులలోని ఒక తెగ ఒరిస్సా మీద నుంచి వచ్చినట్లు  భావిస్తున్నది. 


ఒరిస్సా  పురాతనకాలంలో కళింగదేశం .. ఆ దేశవాసులు కాళింగులుగా సుప్రసిద్ధం. బహుశా ఈ కారణం చేత కూడా ఆంధ్రులలోని  ఆ వైపు తెగకు కాళింగులు అన్న పేరు స్థిరపడిఉండవచ్చు .  నేటికీ కాళింగులు అనే పదం  . . ఆంధ్రులు  అనే పదానికి పవ్యాయపదంగా వాడటం గమనీయం . 


- కర్లపాలెం హనుమంతరావు 

26-11-2021 

( ఆధారం: ఏటుకూరి బలరామమూర్తి గారి ' ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర - ఆంధ్రుల ప్రాచీనత ' ) 


భాష - వ్యాసం అమ్మ భాష ' మమ్మీ ' పాలు! రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు సంపాదకీయ పుట - వ్యాసం - 16 -08 - 2009 ప్రచురితం)

 



భాష - వ్యాసం 

అమ్మ భాష ' మమ్మీ ' పాలు! 

రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు  సంపాదకీయ పుట - వ్యాసం - 16 -08 - 2009 ప్రచురితం) 


తొలిదశలో విద్యాబోధన మాతృభాషలోనే నిర్బంధంగా  జరగాలనే కర్ణాటక ప్రభుత్వ విధానాన్ని తప్పుపడుతూ సర్వోన్నత న్యాయస్థానం చేసిన కొన్ని వ్యాఖ్యల సేపథ్యంలో బోధనాభాషగా మాతృభాష పాత్ర ఏమిటనే చర్చ  ప్రారంభమయింది. 


మనరాష్ట్రంలో ప్రభుత్వమే ఆరో తరగతి నుంచి ఆంగ్లభాషను బోధనా మాధ్యమంగా ముందుకు తెచ్చినందువల్ల ఈ చర్చకు ఇక్కడ మరింత ప్రాధాన్యత  ఏర్పడింది. 


ఉనికి కోసం పోరాటం: 


కర్ణాటక ప్రభుత్వం 1994లోనే ఒకటినుంచి నాలుగు తరగతుల దాకా కన్నడ భాషను నిర్బంధంగా బోధించాలని ఆదేశాలిచ్చి అమలు జరుపుతోంది. ఇంగ్లీషు మాధ్యమంగా కొత్త పాఠశాలల్ని ప్రారంభించాలన్నా, ఉన్న పాఠశాలల్లోనే కొత్త తరగతులు తెరవాలన్నా ప్రభుత్వం నిరాకరిస్తూ వస్తోంది. కర్ణాటక ఐక్య  పాఠశాలల యాజమాన్యాల సంఘం ప్రభుత్వ ఉత్తర్వుపై 2004లో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది .  ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పురావడంతో కర్ణాటక ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థాను తలుపు తట్టింది. ఈ దశలో  ఉన్నత న్యాయస్థానం తీర్పు అమలును నిలుపుదం  చేయటానికి నిరాకరిస్తూనే  జులై 21న ప్రాథమిక పాఠ శాలలో ఆంగ్ల విద్యాబోధన సాగకపోతే విద్యార్థులు గుమస్తా ఉద్యోగాలకైనా పనికిరాకుండా  పోతారని, అరవై నుంచి యాభైవేల రూపాయల దాకా ఫీజులు  చెల్లించి తమ పిల్లల్ని ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో వేయటానికి తల్లిదండ్రులే సిద్ధ పడుతుంటే ప్రభుత్వానికేమి ఇబ్బందని అర్థం వచ్చేలా సర్వో నత న్యాయస్థానం  కొన్ని వ్యాఖ్యలు చేసింది.


కేవలం 26 అక్షరాలు రెండున్నర లక్షల పద బంధా లున్న ఆంగ్ల భాషను శ్వేతజాతి నేతలు అప్పట్లో తమ సామ్రాజ్యం విస్తరించిన అన్ని చోట్లా స్థానిక భాషలమీద పెత్తనం చేయటానికి  వాడుకున్నారు. 


రాజాదరణ దొరికిన భాష రాణిస్తుంది. ' మనభాష, మన తిండి ఒంటబట్టిన మనిషి మరో చోటికి వెళ్ళలేడు . మనకే లొంగి ఉంటాడు' అనేది మెకాలే సిద్ధాంతం. దానిమీదే భరత ఖండంలోనూ  మిగతా బ్రిటిష్ పాలిత ప్రాంతాలలోనూ  ఆంగ్లభాషను స్థాని కులు తమకు దాసులయ్యే మేరకే వాడుకలోకి తెచ్చారు. ఆ క్రమంలో ఆంగ్లభాష అభివృద్ధి చెందుతూ స్థానిక భాషలు, వివిధ మాతృభాషలు మరుగునపడుతూ వచ్చాయి. 


ప్రస్తుతం మన రాష్ట్రంలో తెలుగు దీనావస్థలో ఉండటం మాతృభాషాభిమానులందరికీ ఆందోళన కలిగిస్తోంది. తమిళనాట  భాష ఆధారంగా పెద్ద ఉద్యమాలు వచ్చాయి. తమ భాషను ఉపయోగించుకుంటూనే శాస్త్రాలను, ఇతర అంశా లను పరిపుష్టం చేసుకునే విధానం అక్కడ కొనసాగుతోంది.  తమిళతనం ప్రజల భాషలో సజీవంగా ఉండే విధానాన్ని ఎంత ప్రపంచీకరణలోనూ వదులుకునేందుకు వారు సిద్ధంగా లేరు. 


ఉత్తరాదిన హిందీ భాషోద్యమం కారణంగా ఆంగ్లం కన్నా హిందీలో మాట్లాడటం గౌరవంగా భావిస్తారు. ఆంగ్ల భాష జనజీవనంలోకి అవసరానికి మించి చొచ్చుకునివచ్చి చేస్తున్న హానిని గుర్తించిన రామ్మనోహర్ లోహియా లాంటి సోషలిస్టు వాదులు ఒక దశలో ' అంగ్రేజీ హటావో'  అనే ఉద్యమాన్ని పెద్దయెత్తున చేపట్టిన చరిత్ర ఉంది. 


మనకు మన తెలుగు పనికిరాకుండా పోతోంది. అమెరికా లాంటి దేశాలకు వలస పోవటానికే ఈ ఆంధ్రదేశంలో పుట్టామని భావించే కుర్రతరం క్రమక్రమంగా అధిక మవుతోంది. ప్రపంచం మొత్తంమీద తెలుగు మాట్లాడేవాళ్లు 15 కోట్లమంది . చాలా యూరోపియన్ భాషల కన్నా మన భాష మాట్లాడేవారి సంఖ్య ఎక్కువ . ఒక్క భారతదేశంలోనే హిందీ తరవాత ఎక్కువమంది మాట్లాడేది తెలుగు భాష . యాభై ఆరు అక్షరాలు, ఆరులక్షల పదబంధాలున్న మనభాష చేత ఇరవయ్యారు అక్షరాలున్న ఆంగ్లానికి ఊడిగం చేయించాలని ఉబలాట పడుతున్నాం. సొంత రాష్ట్రoలో ఉద్యోగం చేయటానిక్కూడా తెలుగు మనకు పనికి రాకుండా పొతున్న పరిస్థితి.


దాదాపు రెండు తరాల విద్యార్థుడు  తెలుగు భాష రాకుండానే .. తెలుగు భాషపై అవగాహన లేకుండానే విశ్వ  విద్యాలయాలనుంచి బైటికి వచ్చిన వింత పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఉంది. 


ఇప్పుడు ఇళ్లల్లో తెలుగు అక్షరం కనిపించదు. తెలుగు పదం వినిపించదు . మరో రెండు తరాల పాటు ఈ నిర్లిప్తత ఇలాగే కొనసాగితే తెలుగు భాష ఏక మొత్తంగా ఉనికి లేకుండాపోయే ప్రమాదం పొంచి ఉందనే భాషాభిమానులు ఆవేదనలో అర్థం ఉంది .


మాతభాషను మించినది లేదు. ప్రజలకు  ప్రాణం పోసేది  తల్లిభాషే.  ప్రాథమికస్థాయి నుంచి  మాతృభాషలో  విద్యాభ్యాసం  చేసి అవసరాన్ని బట్టి పరభాషలను ఉపయోగించుకున్న వాళ్లు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. 


మనరాష్ట్రం నుంచి  ఐఐటి కి  ఎన్నికయిన  వారిలో ఎక్కువమంది పది వరకూ తెలుగులో విద్యాభ్యాసం చేసినవాళ్ళే.  బాల్యంనుంచే ఆంగ్లభాషను మప్పినంత మాత్రాన భవిష్యత్తులో ఆ భాష మీద పట్టు సాధించగలమన్న గ్యారంటీ మాత్రం ఏముం టుంది ? తెలుగులో చదువుకున్న వాళ్ళంతా నన్నయలూ, తిక్కనలూ అవుతున్నారా? నోబెల్ బహమతి గ్రహీతల్లో ఎక్కువ మంది ఇంగ్లీషు భాషలో రాసినవారు కాదు. ఆంగ్ల భాషతో పనిలేకుండానే చైనా, రష్యా వంటి దేశాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి కదా! ఫ్రెంచి, జర్మన్, స్పానిష్ లాంటి భాషల్లో సాహిత్యం, సంస్కృతి, విజ్ఞానం  ఆంగ్లభాషల్లో కన్నా ఎన్నోరెట్లు ఎక్కువ . ఇవన్నీ  ఆంగ్ల భాష మీద వ్యతిరేకతతో చెప్పే మాటలు కావు . తెలుగువాళ్ళకు అసలు ఇంగ్లీషు వద్దని చాదస్తంగా  చెప్పటానికి కాదు. ఏ భాషనైనా ఆవసరాన్ని  బట్టి తప్పక నేర్చుకోవాల్సిందే. అయితే ఒక దశ  వరకూ మాతృభాష  మాత్రమే  మాధ్యమంగా ఉండితీరాలని చెప్పటమే ఇక్కడి ఉద్దేశం.


బహుశా ఈ శాస్త్రీయ దృక్పథంతోనే కర్ణాటక ప్రభుత్వం కన్నడం ప్రాథమిక స్థాయిలో తప్పని సరి  బోధనా భాషగాఆదేశాలు జారీ చేసి ఉండవచ్చు . ఈ సందర్భంలో సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు కనీసం తల్లి భాష/ స్థానిక భాషలలో ఏ ఒక్క దానిలో కూడా విద్యాబోధన అంటూ ఉండనవసరం  లేదని తాత్పర్యం చెప్పుకొనే విధంగా ఉండటమే ఆశ్చర్యకరం


ఆంగ్లంలోనే విజ్ఞానం యావత్తూ  ఉందనీ..  అంతర్జాతీయ స్థాయిలో విద్యా ఉద్యోగాలకు అవసరమైన బిడ్డకు తల్లి  గర్భంలోనుంచే ఆంగ్లం నూరిపోయాలని  వాదించేవారికి వత్తాసు పలుకుతున్నట్లుగా ఉంది. ఇవాళా సాష్ట్  వేర్ రంగంలో ఉద్యోగాలా చేస్తూ , విమానాలలో  విదేశాలకు ఎగిరిపోయిన వాళ్లలో అధిక భాగం అనివార్యంగా ప్రాథమిక దశలో మాతృ భాషలోనే విద్యాభ్యాసం చేసిఉంటారు. 


అప్పటి విద్యావిధానం అలాంటిదే మరి . సర్వోన్నత న్యాయస్థానం లేవనెత్తిన  రెండో అభ్యంతరం ఆర్థిక సంబంధమైనది. వేలు ఖర్చుపెట్టి తమ పిల్లల్ని ఆంగ్ల పాఠశాలల్లో చేర్పించటానికి తల్లిదండ్రులే సిద్ధపడుతున్న నేపధ్యంలో  ప్రభుత్వనికి ఎందుకు నొప్పి .. అని సుప్రీంకోర్టు వ్యాఖ్య! ఈ తరహా  పరిశీలన కార్పొరేట్ మార్కెట్ వర్గాల నుంచి కాకుండా నేరుగా సమున్నత న్యాయస్థానం నుంచే రావటం ఆందోళన కలిగించే విషయం.


ఈ వ్యాఖ్య ఏ మేరకు సమంజసమో తేలాలంటే దీని నేపథ్య౦ ముందు కొంత అర్థంచేసుకోవాలి . 


ప్రపంచీకరణ విద్యను వ్యాపార వస్తువుగా మాత్రమే చూస్తుంది. ప్రపంచంలోని యువతలో 54 శాతం మనదే శంలోనే ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో ఇంటర్మీడియెట్ స్థాయినీ కలుపుకొని దాదాపు ఆరుకోట్ల మంది విద్యార్థులుంటారు. ప్రపంచ విద్యావ్యాపారంలో

అతి పెద్ద మార్కెట్ మనవేశమే.. అని పసిగట్టిన అంతర్జా తీయ పెట్టుబడిదారీ వర్గాలు  ఇక్కడి విద్య ప్రభుత్వ ఆధీనంలో ఉండటం గమనించింది.  విద్య వ్యాపారంగా సాగాలంటే ముందు ప్రభుత్వమనే అవరోధాన్ని  తప్పించాలి. ప్రపంచ వాణిజ్య సంస్థ జనరల్ అగ్రిమెంట్ ఆన్ త్రేడ్ ఇన్ సర్వీసెస్  (జి.ఎ.టి.ఎస్) చర్చల్లో విద్యను ఒక అంశంగా చేర్చటానికి  ఇదే కారణం. దీనికి మనదేశమూ అంగీకరించింది. 


మన్మోహన్ సింగ్ ప్రభుత్వం నాలుగేళ్ల కిందటే ముసాయిదా బిల్లును తయారుచేసింది. ఈ బిల్లు చట్టమైతే విదేశీ డిగ్రీన్ని ఇక్కడ విరివిగా అమ్ముకోవచ్చు. అంత ర్థాలం (ఇంటర్నెట్) ద్వారా ఇక్కడ కళాశాలలు నడిపించవచ్చు.  ఉద్యోగాలకసలు విదేశీ పట్టాలే ప్రమాణంగా మారే ప్రమాదమూ ఉంది కోట్లు రాబట్టే  ఈ వ్యాపారంలో  ఇక్కడి పెట్టుబడిదారీ వర్గాలూ చేతులు కలపాలని ఉవ్విళ్లూరుతున్నాయి . కాబట్టే   కేవలం ఆంగ్ల  మాధ్యమంలో మాత్రమే ఉద్యోగ, ఉపాధి కల్పన సాధ్యమని దశాబ్దం కిందటి నుంచి కొత్తవాదనను ప్రచారంలోకి తెచ్చాయి.


ప్రభుత్వం అంతటి నిర్లజ్జగా బైటికి  చెప్పలేదు .  కనుక ప్రజానుకూల సంక్షేమమనే తీసిని అద్ది నమా ఉదారవాద సిద్ధాంతానికి  తెరతీసింది. మాటలో ఎంత సంపూర్ణ అక్షరాస్యత, ప్రాథమిక విద్యలో ప్రాధాన్యత, ఉన్నత విద్య , విద్యాహక్కు అంటున్నా.. చేతల్లో మాత్రం దేశీయ విద్య విదేశీ శక్తుల హస్తగతనువుతూ పోవటాన్ని పరోక్షంగా ప్రోత్సహించే ధోరణిలోనే పథకాశాలు రచిస్తోంది. 

మాతృ భాషలో విద్యాబోధన జరగాలన్న నిబంధనను విద్యాహక్కు చట్టం నుంచి  2006 లోనే  తొలగించి ప్రభుత్వం తన నిజస్వరూపం చాటుకుంది.


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడాది కిందటే సక్సెస్ పాఠశా లల పేరుతో ఆంగ్ల మాధ్యమాన్ని సీబీఎస్ఈ పాఠ్యాంశాలతో సహా ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. అరకొరగా శిక్షణ పొందిన ఉపాధ్యాయులు కొత్త పాఠ్య  ప్రణాళికను  ఆంగ్ల మాధ్యమంలో బోధించలేక పాఠాలను  తెలుగు లిపిలో రాయించి బోధిస్తున్నారని చెప్పుకొంటున్నారు. కొత్త మాధ్యమాన్ని  అందుకోలేని విద్యార్థులు తిరిగి తెలుగు మాధ్యమంలోకే వెళ్ళిపోవటమో .. అదీ కుదరని పక్షంలో  ఏకంగా చదువుకే నామం పెట్టేయటమో చేస్తున్నారన్నది నిష్ఠుర సత్యం. 


ప్రాథమిక స్థాయిలో మాతృభాష మాధ్యమ విధానం నుంచి పక్కకు తొలగితే సహజంగానే ఇలాంటి దుష్పరిణా మాలు జరుగుతాయనే- పొరుగునున్న తమిళనాడులో రెండు భాషలనూ సమన్వయం చేసుకుంటూ విద్యాబోధన విజయవంతంగా కొనసాగిస్తున్నారు. మాతృభాషలో బోధన అంటే ఏమిటో, అన్ని వర్గాల పిల్లలకు దీన్ని ఒక దశ వరకూ నిర్బంధం చేయటం ఏ విధంగా అవసరమో, ఆంగ్ల మాధ్యమం ఏ దశనుంచి ప్రారంభిస్తే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందో .. ఇత్యాది  ముఖ్యమైన విధానాలను  నిస్వార్ధంగా  నిజాయితీగా , నిదానంగా అన్ని వర్గాల వారికి నచ్చజెప్పటానికి ప్రభుత్వం పూనుకొనుంటే  అసలీ వివాదమే ఉత్పన్నమయ్యేది కాదు. 


ప్రాథమిక దశ తరువాత బోధనా మాధ్యమం ఐచ్ఛికంగా  ఉండాలి. ఎవరు ఏ మాధ్యమం కోరుకుంటే ఆ మాధ్యమాన్ని సమాన సౌక ర్యాలతో అందుబాటులో ఉంచటం  ప్రభుత్వాలు అనుసరిం చవలసిన  ఉత్తమ విధానం.  ధనార్జన కోసమే విద్యాసంస్థలు నడిపే వ్యాపారవేత్తలను  పరోక్షంగానైనా ఏ ప్రజా ప్రభుత్వమూ ప్రోత్సహించరాదు. 15 కోట్ల  మంది తెలుగు మాట్లాడేవారు ఉన్నప్పటికీ  పరిపాలన అదే భాషలో సాగకపోవడానికి , పరాయితనం  మీద అవసరానికి మించిన మోజే  ప్రధాన కారణమని తెలుసుకున్నపపుడే  తెలుగు భాషకు మళ్ళీ మంచికాలం వచ్చినట్లు లెక్క. 


 మన ప్రజల డబ్బుతో చదువుకొని విదేశాలలో శాశ్వతంగా స్థిరపడిపోవటాన్ని గొప్పతనంగా కాక, సామాజిక ద్రోహంగా మనం చూడగలిగిననాడు  పరిస్థితుల్లో మార్పు క్రమంగానైనా వస్తుంది.


తొలి వెలుగు దీవం


మన కర్ణాటక వివాదం మీద వెలు వరించే మలితీస్సులో భాషా  ఆవశ్యకత ప్రాథమిక దశ వరకు ఎంత అవసరమో గుర్తించి తదనుగుణంగానే మార్గదర్శకాలను జారీ చేస్తుందని ఆశించటంలో తప్పులేదు గదా ! ఈ మధ్య పార్లమెంటు ఆమోదం పొందిన విద్యా హక్కు బిల్లు అందరికీ విద్యను అందించటం ఒక హక్కుగా పేర్కొంది. అట్టడుగు స్థాయివారూ విద్యను సక్ర మంగా అందుకునే పరిస్థితులను కల్పించాల్సింది ప్రభుత్వమే. అప్పుడే  బడుగు జీవికి సక్రమమైన విద్య మాత్న భాషలో  అందేది.  


- రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈూడు సంపాదకీయ పుట - వ్యాసం - 16 -08 - 2009 ప్రచురితం) 


Monday, December 6, 2021

తెలుగు పాత్రికేయం సమానార్థకాలకు ప్రయత్నలోపం - సి. రాఘవాచారి


తెలుగు పాత్రికేయం

సమానార్థకాలకు ప్రయత్నలోపం

- సి. రాఘవాచారి

తెలుగు పత్రికల భాషాసేవ అనన్య సామాన్యమైనది. వివిధ రంగాల్లోని సమాచారాన్ని పాఠకులకు తెలియజేయడంతో పాటు తెలుగుభాషా వికాసం కూడా పత్రికల కర్తవ్యంలో భాగంగా ఉండేది. వార్తాసంస్థలు ఇంగ్లీషులో పంపించే వార్తలను అనువాదంచేసి, ప్రచురించేటప్పుడు  సాధ్యమైనంతవరకు తెలుగు పదాలే వినియోగించాలని ఒకనియమం స్వచ్ఛందంగానే పాటించడం జరిగేది. దానిని నియమం అనడంకన్నా స్వభాషపట్ల అనురక్తిగా చెప్పడం ఇంగ్లీషు పదాలకు సమానార్థకాలు సృష్టించడం, అవి ప్రజలకు సులభంగా అర్థమయ్యేరీతిలో రూపొందించడం ఆరోజుల్లో సంపాదకవిభాగంలో పనిచేసేవారి ప్రాథమ్యంగా ఉండేది. కొత్తపదం వచ్చినప్పుడు మక్కికి మక్కి కాకుండా అర్ధాన్ని బట్టి, తెలుగులో సులభంగా అర్ధంగ్రహించటానికి వీలయ్యే సమానార్థకాన్నే స్థిరపరచి వాడేవారు. తెలుగును అధికారభాషగా ప్రకటించిన తరువాత ఈ ప్రయత్నంపట్ల ఉండాల్సిన శ్రద్ధాశక్తులు ఏ కారణంతో లోపించినా విచారకరం.


తెలుగుపాత్రికేయుల్లో సంపాదకులతోపాటు అనుభవజ్ఞులైనవారు ఈ విషయమై ఆవేదన పడుతున్నారు. ఆందోళన చెందుతున్నారు. ఇంగ్లీషు అనేకాదు, సంస్కృతం, ఉర్దూ పదాల వెల్లువలో తెలుగుభాష తన స్వరూపాన్ని పోగొట్టుకుంటున్నదా అనే బాధ సహజం. అవసరమైనప్పుడు అన్యభాషా పదాలు బాగా ప్రచారంలో ఉన్నవయితే వాటిని తెలుగుభాష విసర్గ సౌందర్య సౌష్టవాలు చెడకుండా వాడడంలో ఆక్షేపణలకు తావుండరాదు. కానీ, ఇప్పుడు జరుగుతున్నది అదికాదు. పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రమున్నట్లు ఇంగ్లీషుపదాలు శీర్షికల్లోనూ, వార్తల్లోనూ విశృంఖల స్వైరవిహారం చేస్తున్నాయి. సమస్యను పరిష్కరించడానికి పాత్రికేయులతోబాటు విశ్వవిద్యాలయాలు, వివిధ అకాడమీలు (ప్రత్యేకించి ప్రెస్ అకాడమీ) కలిసి ప్రయత్నిస్తే సమానార్థకాలసృష్టి అసాధ్యమేమీకాదు. తెలుగుభాష సమయ సందర్భాలనుబట్టి అన్యభాషాపదాలను స్వీకరించడానికి అనువైనది. ప్రాచీన సాహిత్యంనుంచి నేటి పత్రికలభాష వరకు వెయ్యేళ్ళచరిత్ర ఈ విషయాలను నిరూపిస్తోంది. గతంలో తెలుగుపత్రికలకు తెలుగులోనే వార్తలు పంపాలని విధిగా ఆదేశాలున్నరోజుల్లో సమానార్థకాలకోసం విలేకరి కొంత ప్రయాస పడాల్సివచ్చేది. కానీ ఆ ప్రయాస ఫలప్రదంగా

భాషకు, విలేకరి భాషాభివృద్ధికి తోడ్పడుతుండేది. 


అప్పుడు సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తరువాత కూడా ఇంగ్లీషు పదాల వాడకం పెరగడం ఒక విచిత్రమైన వైవిధ్యం, 

గతంలో వలె పత్రికల్లో రాజకీయాలకు పరిమితం కాకుండా, ఈ రోజు అనేక శాస్త్ర విజ్ఞాన విషయాలకు సంబంధించిన వార్తలను పాఠకులకు అందజేయడం విరివిగా పత్రికల్లో అదాజేయడం జరుగుతున్నది. పత్రికలలో ఉండే సహజమైన వత్తిళ్ల  కారణంగా పారిభాషక పదాలకు సమానార్థకాల ఇబ్బందితో కూడుకున్నప్పటికీ, ఆ కారణంతో అన్యభాషాపదాలను అదేపనిగా ఉపయోగించడం సరైనదికాదు. పరిభాష వెనుకఉండే భావాన్ని - సమానార్థకాలు స్వీకరించే సదవకాశం ఎక్కువ. సోవియట్ యూనియన్ లో గోర్బచెవ్  సంస్కరణలుగా 'గ్లాస్ నోస్త్ ', 'పెరిస్త్రోయికా' అనేపదాలు విరివిగా వార్తల్లో వచ్చేవి.  వాటికి  స్థూలంగా దగ్గరైన  'గోప్యరాహిత్యం', 'పునర్వ్యవస్థీకరణ' అనేపదాలు తెలుగులో వాడినందువల్ల పాఠకులు సులభంగా గ్రహించేపరిస్థితి ఉండేది. ఏదైనా సమానార్థకంకన్నా అన్య భాషా  పదమే పాఠకులకు అర్థమవుతుందనుకుంటే అది వినహాయింపు తప్ప సూత్రం కారాదు.


పారిభాషిక పదాలకు తెలుగులో సమానార్థకాలు రూపొందించడం లక్ష్యంగా తెలుగు అకాడమీవంటి సంస్థలను ఏర్పాటుచేశారు. శాసన, పరిపాలనా సంబంధమైన పదాలకు స్పష్టమైన ప్రసిద్ధమైన సమానార్థకాలు రూపొందించినప్పటికీ వాటివినియోగం పత్రికల ద్వారా ఆశించినంతగా లేకపోవడం బాధాకరమే. ఉదాహరణకు 'టాక్స్'ను తీసుకుంటే దానికి పన్ను' అని రాస్తుంటాం. అంతేగాకుండా సెస్సు, డ్యూటీ, లెవీ అనే బడ్జెట్ పారిభాషిక సాంకేతికార్థం భిన్నంగా ఉంటుంది. అయినా పైసంస్థలు రూపొందించిన పదాలకంటే ఎక్కువగా పాఠకులకు  ఆమోదయోగ్యమైనవాటిని పత్రికలు తమకుగా తాము సృష్టించుకుంటే అభ్యంతరం ఉండరాదు . ఆ ప్రయత్నం లేకపోగా సమానార్థకాలపట్ల అలసత్వం, తేలికభావన చోటుచేసుకోవడం విచారించదగిన విషయం.


జన వ్యవహారంలో అలవాటుపడిన అన్యభాషా పదాలు అన్ని భాషల్లోనూ ఉంటాయి. వాటికి భాషా ఛాందసం జోడించి విశ్వామిత్ర సృష్టితో సమానార్థకాలు రూపొందించాల్సిన పనిలేదు. ఒకవేళ అలా సృష్టించినా అవి ఆమోదయోగ్యత పొందడం కష్టం. తెలుగుమాత్రమేవచ్చి అన్ని రంగాలకు చెందిన సమాచారాన్ని పత్రికలద్వారా తెలుసుకోవాలనుకొనే పాఠకుడు ప్రమాణంగా ఉండాలి. తెలుగు పత్రిక చదవటానికి మరో రెండుభాషల పరిచయం అర్హతగా ఉండాల్సినస్థితి అపహాస్యభాజనం. బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వంలో అధికారభాషాయంత్రాంగం నిర్వహించిన కీర్తిశేషులు పి.వి. నరసింహరావు, పరిపాలనారంగంలో తెలుగు వినియోగంపై శాసనసభలో శ్వేతపత్రం (వైట్‌ పేపర్) ప్రకటించినప్పుడు అందులోని సమానార్థకాలపట్ల పత్రికల్లో పెద్దవిమర్శ సాగింది. 


ఒక ప్రసిద్ధసంపాదకుడు అయితే ధారావాహిక సంపాదకీయాల్లో భూరాజసము (ల్యాండ్ రెవిన్యూ) లాంటి పదాలను ఉటంకించి ప్రత్యాఖ్యానం వెలువరించారు. దీనికి స్పందించి నరసింహారావుగారు తెలుగురాక మరిన్ని భాషలు చదివినవారు తెలుగు భాషాభివృద్ధికి ఆటంకమని చెప్పినదాంట్లో అతిశయోక్తి ఉండవచ్చేమోగానీ ఇప్పటి స్థితినిబట్టి ఎంతో కొంత సరైన ప్రతిస్పందన అనిపిస్తోంది.


ప్రస్తుతం తెలుగు పత్రికల్లో, ప్రసార మాధ్యమాల్లో అవసరంలేకున్నా ఇంగ్లీషుపదాలు వాడటం ఎబ్బెట్టుగా తోస్తోంది. అచ్చమైన తెలుగుమాట దేవుడెరుగు, అసలు ఇంగ్లీషుమాటలు వాడితేనే అదేదో శ్రేష్ఠమన్న భావన చోటు చేసుకున్నది. ఒక పత్రికలో గతంలో పతాకశీర్షికల్లో కూడా భారత్ బదులు ఇండియా అని వాడేవారు. అది అప్పుడు చివుక్కుమనిపించినా ఇప్పటి పరిస్థితుల్లో కొంత మేలేమో అనిపిస్తోంది.  ప్రాంతీయ ప్రత్యేకతలను బట్టి భాషలో అక్కడికక్కడే అర్థమయ్యే పదాలు ఇతరత్రా వాడినందువల్ల గందరగోళం తప్ప మరేమీ

ఉండదు, 

కోస్తా ప్రాంతాల్లో వెలువడే ఎడిషన్లలో 'షురూ' అనే ఉర్దూ పదం కనిపిస్తోంది. ఏమైనా ఏ భాషపట్ల వ్యతిరేకత అక్కర్లేదుగానీ, మనభాషను సుసంపన్నం చేసుకోవడం అభిలషణీయం. ఈ అంశంపై పాత్రికేయుల్లోనే ఆత్మపరిశీలన అవకాశం కల్పించడం ద్వారా మిత్రులు టంకశాల అశోక్ ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో జర్నలిస్టులు, ప్రెస్ అకాడమీ, వివిధ విశ్వవిద్యాలయాల్లోని జర్నలిజం శాఖలు భాగస్వాములైతే ఆ ఫలితం అందరికీ చెందుతుంది.

( ' వార్త' 15-06-05- ఆధారంగా ) 

- సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

                   07-11-2021 


Friday, October 1, 2021

పచ్చ నాకుల రాణి వాసపు కవిత కృష్ణశాస్త్రిది - కర్లపాలెం హనుమంతరావు



కృష్ణశాస్త్రి కవిత్వం పై శ్రీ శ్రీ స్పందన - 'ఆస్వాదానికి ఆహ్వనం' శీర్షికతో ' అమృత వీణ'  ముందుపుటల్లో కనిపిస్తుంది.

సముద్రం ఎక్కడ ఉందో తెలీదు. కాని కృష్ణశాస్త్రి సృజించిన ఇక్షురస సముద్రం మాత్రం పురాణాల్లో వర్ణితమయిన క్షీరసాగరానికి వెదుకులాడే అగత్యాన్ని తప్పించింది- అంటాడు అందులో శ్రీ శ్రీ . నిజమా? చూద్దాం!

'వేయ బోవని తలుపు తీయమని పిలుపు /

రాధ కెందుకొ నవ్వు గొలుపు /

నీలోన నాలోన నిదురపోయే వలపు /

మేలుకుంటే లేదు  తలుపు'

 ఇది కృష్ణశాస్త్రి 'కృష్ణాష్టమి' కవితా ఖండికలోని కొన్ని  పంక్తులు. ఖండిక మొత్తం చదివితే శ్రీ శ్రీ ఒలకపోసిన అతిశయోలంకారంలో అతిశయం ఆవగింజంతయినా లేదనే అనిపిస్తుంది. 

 కృష్ణశాస్త్రి కవిత్వంలో  కనిపించే రసం మధురంగా ఉంటుందనేది  సర్వే సర్వత్రా వెల్లడయ్యే భావనే. కాని శ్రీ శ్రీ మరో మెట్టు పైకెళ్లి   మాధుర్యం అంటేనే  అసలు  నిర్వచనం  అనిర్వచనీయమైన   కృష్ణశాస్త్రి కవిత్వం'  అనే భావన వెల్లడిస్తాడు.

'అంతరాంతము నీ అమృత వీణే యైన /

మాట కీర్తన మౌను! /

ఈ అనంత పథాన  /

ఏ చోటి కా చోటు నీ ఆలయ్యమ్మగును, నీ ఓలగ మ్మౌను '

 'అమృత వీణ' ఆలపించే ఈ పంచమరాగం కర్ణపుటాలకంత కమ్మని  విందు చేస్తుంటే అవకాశం లభించినప్పుడు  ఎవరిమైనా శ్రీ శ్రీ మాటకు  వంత పాడక ఉండగలమా! 

'తినగ తినగ వేము తియ్యగ నుండు'. కాని, ఇక్షురసానికి ఆ స్వాదు గుణం లేదు. అదే పనిగా సేవించడానికి పూనుకుంటే రెండు లోటాల పరిమితి దాటితే చెరుకు రసపు తీపైనా వెగటనిపిస్తుంది. కృష్ణశాస్త్రి తన ఇక్షురస కవిత్వానికి ఆ అతిపాన దోషం అంటకూడదు అనుకున్నాడేమో! మిరియాల పొడివంటి ఘాటు ప్రయోగాలు, కరక్కాయల కటువు  తలపించే భాషా ప్రయోగాలు అక్కడా ఇక్కడా చేసి మరీ మహాకవి మాట నిలబెట్టాడు.

'పూజ కంటే వస్తిని, ఏ/

మోజు లేని 'చిన్నవిరిని' /

ప్రభువు కొలువున దాసిని శ్రీ/

పదములకు 'తివాసిని'

'పూల జాతర' అనే కృష్ణశాస్త్రి మధుర పాతరలో  ఇక్కడ కోట్స్ రూపంలో కనిపించే పదప్రయోగాలు, భాషలో .. భావంలో  ఘాటుగానో, కటువుగానో  ఉండటం గమనించాలి. కాకపోతే శాస్త్రిగారి  కలం, గళం నుండి ఎన్నడో గాని ఈ మాదిరి వగరు కాయల వరుసలు కురిసింది లేదు. అదృష్టం. చందమామకైనా చిన్న మచ్చ ఉంటేనే కదా అందం చందం! 

శ్రీ శ్రీ మరో చోట అంటాడూ .. 19వ శతాబ్ది తొలి దశాబ్ది వరకు జిమీందారీ వ్యవస్థకు మాత్రమే ' గొడ్డు'  చాకిరీ   చేసిన  తెలుగు కవిత, కృష్ణశాస్త్రి  పూర్వీకులు రాయప్రోలు, అబ్బూరి వంటి అభ్యుదయ కవుల రాకతో  బంధ విముక్త అయింది. అనంతరం కృష్ణశాస్త్రి తరం నుంచి భావకవిత్వం పేరు మీద యువతరాన్ని ఉర్రూతలూగించిందని. ఏ రసపట్టు కనికట్టు లేకపోతే ఎంత నూత్నమైనదైనా అటు బళ్లారి  నుంచి ఇటు బరంపురం వరకు భావకవిత ఊరికే ఊరేగగలుగుతుందా ?

'ఎడబాసి పోకోయి /

 నీ దాసి నీ రేయి /

ఈ ఎదకు నిముసమే/

నెడబాటు విసమే ' అంటూ ఆ 'జులపాల జుట్టు కట్టుతో సహా భావికవికి ఓ ఆహార్యమంటూ గళసీమకు వేళాడు హార్మోనియంతో తన కంటూ  'ట్రెండు' నొకటి సృష్టించుకోగలడు కృష్ణశాస్త్రి! భావకవిగా కవిలోకాన్ని ప్రభావితం చేసిన  అతగాని ప్రతిభా పాటవాలకు జతకాని  మధుర స్వారస్య సారస్వత వచనాలు   మచ్చుకకు మాత్రమే ఎక్కడో ఒకటీ.. అరా .. అక్కడా.. ఇక్కడా!ఈనాటికీ చెక్కుచెదరని  కృష్ణపక్షం  ఒక్కటి  చాలు భావకవి వైతాళికునిగా కృష్ణశాస్త్రి సాధించిన అర్హతలన్నిటి పైనా ఆమోదా ఆముద్ర ప్రమోదపూర్వకంగా పడేటందుకు.

కాకపోతే ప్రతిభావంతులైన ఏ వైతాళికగణ విజయ యాత్రలకయినా ఆదిలో హంసపాదులా ఆరంభంలో ఆటంకాలు తప్పవు. ఆ రివాజు తప్పకూడదని కాబోలు, ఆ కాలం నాటి మహాపండితుడొకాయన  అక్కిరాజు ఉమాకాన్తమ్ కేవలం కృష్ణశాస్త్రిని వెక్కిరించటానికేనా అన్నట్లు 'నేటి కాలపు కవిత్వం' పేరున ఓ దిక్కుమాలిన గ్రంథం వెలువరించింది.   తెలుగు ఉమాకాంతాన్ని సంస్కృత ఉమాకాన్తంగా చెప్పుకునే ఆ పండితుడికి సంస్కృతంలో తప్పించి  మరెక్కడా కవిత్వం కనిపించని హ్రస్వదృష్టి కద్దు. నన్నయను సైతం కవుల పద్దు నుంచి కొట్టిపారవేయగల సమర్థుల  వక్రదృష్టికి సమకాలీన కవికోకిల కాకిలా అనిపించక మానుతుందా? 

'పలుక లేను పలుక లేను /

భయము సిగ్గు వొడము దేవ ! /

అలయని దయ నా యందే నిలిపి వదలవోయి దేవ! /

మలిన  మలిన బ్రతు కిది; పలుక లేను నీ నామము' వంటి చిలుక స్వరాలతో రాసి పాడినా నాటి  బ్రహ్మసమాజ ఉద్యమానికి ఊతమిచ్చే వందలాది రసగుళిక పద్యాలు ఎంత హృద్యమయితేనేమి, మడి కట్టుకున్న బధిరాంధ పండితుల చెవులకు దిబ్బెళ్లు  అనిపించవా? 

యువ కవి లోకమంతా ఉత్తమమైనదంటూ సంభావించిన వృక్షరాజపు కొత్త శాఖ భావకవిత. ఆ కొమ్మ నుంచి మొలకెత్తిన మరో కొత్త చివురు చూసి మండిపడే నైజముండే ఏ పండితలోకమైన చిర్రుబుర్రులాడక తప్పదు.వేదుల సత్యనారాయణ వంటి ఎన్నో కవి కోకిలలకు ఆశ్రయమిచ్చిన ఆ నూతన తరుశాఖ మీదనే మొగ్గ పూవైన చందంగా  భావకవి కృష్ణశాస్త్రి అందాల భావలోకం కనులు విప్పార్చింది .  కాబట్టే  'పచ్చ నాకుల రాణి  వాసపు /

పడతినే, సంపెంగనే / 

సరసులను, సామంతులను /

నా స్వాదు  వాసనా పిలుచునే '( పూల జాతర) అని  ఎలుగెత్తి పాడినా  చెల్లించుకోగలిగింది. రస పిపాసువుల హృదయాలకు  అదే కొత్త రాగాల  విందయింది.

'నేటి కాలపు కవిత్వ౦' పుస్తకానికి  కొనసాగింపుగా అనంతపంతుల రంగస్వామి  అనే మరో వెకిలి కవీ 'కృష్ణపక్షం'  పూర్వపక్షంగా 'శుక్లపక్షం' అనే మరో వెక్కిరింత పద్యకావ్యం వెలయించాడు. ఆ రోజుల్లోనే వేదుల  వంటి ఉద్దండ భావకవులు 'సారస్వతారిష్టం అనే శుక్ల నష్టం' గా ఛీత్కరించిన 'శుక్లపక్షం' ఉమాకాన్తమ్ గారి కావ్యం పక్కనే బూజుగూటిలో మగ్గిపోయింది.

'నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?/

నా యిచ్ఛయే గాక నా కేటి వెరపు?/

కలవిహంగమ పక్షముల దేలియాడి/

తారకా మణులలో తారనై మెరసి/ 

మాయ మయ్యెదను నా మధురగానమున!' అన్న కృష్ణశాస్త్రి మాటే  అతని భావకవిత సాధికారతను  అచ్చంగా నిజం చేసింది.   

నాటికే కాదు నేటికీ శాస్త్రిగారి భావకవిత్వపు బాణి తెలుగు సాహితీ రాణి పాదాల పారాణి అనడంలో  అందుకే అతిశయోక్తి రవ్వంతైనా లేదు అనేది!

-కర్లపాలెం హనుమంతరావు

01 - 10-2021

బోథెల్ ; యూ ఎస్.ఎ

Thursday, September 30, 2021

తెలుగు భాష ప్రాచీనత విశిష్టతలపై రాజకీయాలు -కర్లపాలెం హనుమంతరావు



రాజ్యాంగబద్ధంగా చూసుకుంటే  రాజ్యాంగంలో పొందుపరిచిన అన్ని భాషలకు ఒకే తరహా హోదా ఉంటుంది. ఒక భాషకు ప్రాచీనత దృష్ట్యానో, మరే ఇతరేతర కారణాలతోనో 'క్లాసికల్' బిరుదు తగిలించబూనుకోవడం రాజ్యాంగ రీత్యానే సమ్మతం కాదు. కాని, ఉత్తర భారతం పెద్దన్న పాత్ర  పెత్తనం కారణంగా హిందీకి లభించే ఆదరణ దక్షిణాదిన ఏ ద్రవిడ భాషకూ దక్కడం లేదు. అందులోనూ తెలుగు భాష పరిస్థితి నానాటికి తీసిపోవు నాగం బొట్లు సామెతలా తయారయింది.

తమిళ భాషకు మాత్రమే క్లాసికల్ హోదా దక్కడం ద్రవిడభాషా రాజకీయాలలోనూగల పక్షపాతం ఇందుకు నిదర్శనం. తమిళనాట రాజకీయాలు ప్రారంభం నుండి భాషతో సమ్మిళితమయివుండటం, కేంద్రంలోని ప్రభుత్వాలను   తమిళ  పక్షాలు ప్రభావితం చేయగలగడం వంటివి ఉపరితలంలో కనిపించే కొన్ని రాజకీయ, సాంస్కృతిక కారణాలు. అందుకు భిన్నమైన పరిస్థితులు తెలుగుభాషకు శాపంగా మారాయి.

తమిళుల తరహాలో తెలుగువారికి స్వీయభాషకు సంబంధించిన భాషాఉద్యమాలు, బలమైన సాంస్కృతిక ఆకాంక్షలు లేవు. పేరులో తెలుగు ఉన్నప్పటికి తెలుగుదేశం ఒక రాజకీయపక్షంగ  తెలుగు భాష సమున్నతి కోసం నిజాయితీతో చేపట్టిన చర్యలు శూన్యం. గతంలో కేంద్రంలో ఎన్.డి.ఎ ప్రభుత్వ పాలనలో తెలుగుదేశం నిర్వహించగల ప్రముఖ పాత్ర వుండీ, భాష కోసమై  చేపట్టిన ఒత్తిడి కార్యక్రమాలు  ఏవీ  లేవు. రాజకీయపార్టీలను తప్పుపట్టి ప్రయోజనం లేదు. ఓటర్ల మనోభీష్టాలకు అనుగుణంగా ఎదగడం ద్వారా అధికారం చేపట్టే లక్ష్యంతో పనిచేయడమే  రాజకీయపక్షాల స్వాభావిక లక్షణం.

 

ఇక్కడగల మరో విచిత్రం గమనించాలి. 'క్లాసికల్ లాంగ్వేజ్' అనే పదాన్ని తెలుగులో ప్రాచీనభాషగా  తర్జుమా చేసుకుని భాషకు సంబంధించిన వయస్సు నిర్ధారణపై పేచీలకు దిగడం చూస్తున్నాము. న్యాయానికి క్లాసికల్ అనే ఆంగ్లపదానికి విశిష్టత, శ్రేష్టత సమానార్థకాలుగా చెప్పుకోవాలి. కాబట్టి ఒక భాష క్లాసికల్ లక్షణం కేవలం ఆ భాష వయసును బట్టే కాక, ఆ భాషకు ఉండే విశిష్టత ఆధారంగా కూడా నిర్ధారించడం ఉచితం.

విశిష్టతకు భాష సుసంపన్నత ఒక్కటే కారణం కాబోదు. అంతకు మించి భాషకు ఉండే స్వతంత్ర ప్రతిపత్తి, మరింత వివరంగా చెప్పాలంటే పునాది కూడా గణనకు తీసుకోవాలి. ఆంగ్లభాష ఎంత సుసంపన్నమైనప్పటికి యూరపులో గ్రీకు భాషతో సమానమైన హోదా సాధించలేకపోవడం గమనార్హం. వేరొక సంప్రదాయం నుండి ఉద్భవించినప్పుడు, ఎంత సుసంపన్నమైనప్పటికి భాషకు స్వతంత్ర ప్రతిపత్తి లభించదు. సంగమ సాహిత్యంలో తమిళభాషకు సుమారు 1000, 1500 సంవత్సరాల వెనుకనే స్వతంత్ర సాహిత్య అస్థిత్వం ఉంది. క్లాసికల్ భాష సరితూగే ప్రమాణమే అది.

 

వాస్తవ దృష్టితో పరిశీలిస్తే అసలు ఈ 'క్లాసికల్' అనే పదమే దేశీయమైనది కాదు,  యూరపు సంబంధితం. అక్కడ వారు పైన చెప్పిన కారణాలతో ఆంగ్లానికి కాక గ్రీక్ భాషకు క్లాసికల్ హోదా కట్టబెట్టారు. మనం మన భాషా సంస్కృతులకు వేరే ప్రమాణాలు నిర్ధారిచుకోవలసిన అగత్యం ముందు గుర్తించాలి. ప్రస్తుతమున్న ప్రమాణాలను బట్టి చూసుకున్నా క్లాసికల్ హోదా సాధించిన తమిళ భాషకు మించి వయసు, విశిష్టతల దృష్ట్యా సంస్కృత భాషకు ఈ హోదా దక్కడం సబబు. అందుకు భిన్నంగా తమిళభాషకు ప్రాచీన హోదా పట్టం కట్టడం వెనుక ఇంతకు ముందు చెప్పుకున్నట్లు రాజకీయాలే ప్రధాన కారణం.

 

తమిళానికి మూలం సంగమ సాహిత్యం. దాని వయసు సుమారు క్రీ.శ అయిదో శతాబ్ది వరకు విస్తరించినట్లు పరిశోధకులు చెప్పే మాట. (ప్రముఖ భాషా పరిశోధకుడు డాక్టర్ కె.ఎ. నీలకంఠ శాస్త్రి వాదన ప్రకారం తమిళ భాష ప్రాచీనత క్రీ.శ. 300 శతాబ్ది అయినా కాదు.) అత్యంత ప్రాచీనత తన ప్రత్యేకతగా  చెప్పుకునే తమిళానికి ఉన్న స్వతంత్ర పునాది ఏమిటో, దానికి సమానమైన లేదా మించిన వయసు, విశిష్టతలు తతిమ్మా భాషలకు ఎందుకు లేవో.. ఎక్కడా ప్రమాణపూర్వకమైన ప్రయాగాల ద్వారా నిర్దారణ కాలేదు.  కాని  తమిళభాషకు ప్రాచీన హోదా కల్పించారు! కేవలం రాజకీయ కోణం మాత్రమే దీని వెనుక అన్నది సర్వే సర్వత్రా భాషాపండిత లోకంలో వినవస్తున్న మాట. కాదనగలమా?

(తెలుగు భాష ప్రాచీనత, విశిష్టత - కల్లూరి భాస్కరంగారి పరిశోధన వ్యాసం ఆధారంగ)

-కర్లపాలెం హనుమంతరావు

01 -09 -2021

బోథెల్, యూ.ఎస్.ఎ

 

 

 

Saturday, July 3, 2021

ఆంధ్ర'భాషాపదం- చరిత్ర పరంగా -కర్లపాలెం హనుమంతరావు

 



క్రీస్తుకు పూర్వం పదో శతాబ్దం దాకా 'తెలుగు' అనే పదమే కనిపించదు. ఈ పదం మొదటిసారి ప్రత్యక్షమవడం తమిళ, కన్నడ శాసనాలలో, ఆంధ్రకర్ణాటక వాజ్ఞ్మయంలో! అదీ 'తెలుంగు, తెలుంగ, తెలింగ' తరహా రూపాలలో!

జాతికా? భాషకా? ఈ ‘తెలుగు’ పదం దేనికి సూచకం? అన్న ప్రశ్నకు ‘రెండింటికీ’ అన్నది  సరిపోయే సమాధానం. ఈ రెండింటికే కాకుండా మూడోది, ముఖ్యమైనది ‘స్థాన’ సూచకంగా కూడా వాడుకలో ఉండేది ఒకానొకప్పుడు. 'తెలుంగ నాడొళగణ మాధవియకెఱెయ' అంటూ 'తెలుగుదేశంలోని 'మాధవియకెఱెయ' అనే ఊరి పేరు 'దేశ'పరంగా ప్రస్తావించిన తొలినాటి శాసనమే ఇందుకు ఆధారం.  ‘తెలుగు’ అనే పదం  భాషకు చేసే సేవనే  ఆంధ్రతిలింగ, తెలింగ అనే రెండు పదాలు అప్పటికే  చక్కబెడుతున్నాయి.

ఇట్లా దేశపరంగా 'తెలుగు'  పదం ప్రాచుర్యంలోకి రావడం క్రీ.శ పదో శతాబ్దం తరువాత. కానీ ఆ తెలుగు పదం   'తెలుంగు, తెలింగ' లాంటి రూపాలలో కనిపించేది.  పదకొండో శతాబ్ది నాటి  చాళుక్య రాజరాజు నరేంద్రుడి ఆస్థాన కవి నన్నయభట్టు కాలం నాటికి  తెలుగుకు 'తెనుగు' అనే మరో భాషారూపం కూడా జతపడింది.  పన్నెండో శతాబ్దపు  నన్నెచోడుడి చలవతో ఆ 'తెనుగు' అనే పదం  భాషకు సంబధించిందన్న భావం గట్టిపడింది. పదమూడో శతాబ్దిలో మహమ్మదీయ చరిత్రకారులు కూడా 'తిలింగ్' అన్న పదం వాడేసి  'తిలింగ' అన్న రూపానికి సాధికారత కల్పించడం విశేషం! ఏతావాతా తేలేది ఏమిటి? తిలింగ, తెలుంగు, తెలింగ, తెనుగు తరహా పదాలు కూడా అంతకు మునుపట్లా కేవలం, ప్రాంతానికి.. జాతికే  కాకుండా  'భాష'ను సూచించే పదాలుగా కూడా సామాజిక ఆమోదం పొందాయని. అప్పటికి వరకు వాడుకలో ఉన్న ‘ఆంధ్ర’  పదానికి ఈ 'తిలింగ, తెలుంగు, తెలింగ, తెనుగు' తరహా పదాలు ప్రత్యామ్నాయాలు అయ్యాయన్నమాట.  బొత్తిగా శబ్ద సాజాత్యం లేకుండా ‘ఆంధ్ర’ పదానికి ఎట్లా   ప్రత్యామ్నాలయాయీ? అంటే అదే చిత్రం!

ఇక తెలుగు, తెనుగు పదాల వ్యుత్పత్తి పుట్టుక అంతకు మించిన విచిత్రం. వివాదాస్పదం కూడా.  క్రీ.శ 14 వ శతాబ్ది ప్రథమార్థంలో ఓరుగల్లును ఏలిన కాకతి చక్రవర్తి ప్రతాపరుద్రుడి ఆస్థానంలో ఉండే దుండిన విశ్వనాథకవి తన  ప్రసిద్ధ 'ప్రతాపరుద్రీయం' లో 'యై ర్దేశ స్త్రిభి రేష యాతి మహతీం ఖ్యాతిం త్రిలింగాఖ్యయా/యేషాం కాకతిరాజకీర్తివిభవైః కైలాస శైలః కృతః/తే దేవాః ప్రసర త్ప్రసాదమధురాః శ్రీశైల కాళేశ్వర/ద్రాక్షారామనివాసినః ప్రతిదినం త్పచ్ఛ్రేయసే జాగ్రతు' అంటూ చేసిన ప్రార్థనలో 'త్రిలింగ' అనే పదం  వాడాడు. అందుకు ఆ కవి చెప్పిన కారణం తిరుగులేనిది కావడంతో  ‘ఆంధ్ర’కు  అదే సరైన పదంగా భాషలో స్థిరపడిపోయింది.

కళింగం తప్పించి తతిమ్మా యావదాంధ్రం  కాకతి ప్రతాపరుద్రుడి స్వాధీనంలో ఉండటంతో శివక్షేత్రాలుగా ప్రసిద్ధమైన శ్రీశైల, కాళేశ్వర, దాక్షారామాలను ఉజ్జాయింపు ఎల్లలుగా చెప్పి ఆయా క్షేత్రాలలోని శివలింగాల పట్ల భక్తితోనే  ఈ ప్రాంతాన్ని 'త్రిలింగం' అన్నాను పొమ్మన్నాడు సోమనాథుడు గడుసుగా. నిజానికి కవి ఇక్కడ చేసింది సాహిత్యపరమైన చమత్కారం. అయినా అప్పటి వరకు ఆంధ్రపథంగా ప్రసిద్ధిలో ఉన్న ప్రాంతం కాస్తా 'త్రిలింగ' దేశంగా మారికూర్చుంది. కాకతీయులు శైవులు. వారు పాటించిన  శైవమతానికి అతికినట్లు సరిపోయే ఈ కావ్య చమత్కారానికి 'ఆంధ్ర' అనే పాత పదం పాపం, ఇంకేం బదులిస్తుంది? మొత్తానికి మహాదేవుడి  మూడు శివలింగాల చలవతో చివరకు ఆంధ్రులమంతా ‘త్రిలింగులు’గా మారిపోవడం మహాచిత్రం! 

ఓ మారు వ్యవహారంలోకంటూ వచ్చేసిన తరువాత  ఉచ్చారణలో తొణికిసలాడే గాంభీర్యం.. వ్యుత్పత్తి వివరణ- పదానికి దగ్గరగా ఉండటంతో ఈ 'త్రిలింగ' పదం జనం నాలుకల మీద సునాయాసంగా స్థిరపడిపోయింది. దేశపరంగా ‘త్రిలింగదేశం’ అట్లా స్థిరపడిందే! ఆ త్రిలింగదేశ వాసులం కనక మనం 'త్రిలుంగులు' గా మార్పుచెందాం. మనం మాట్లాడే భాష 'త్రిలింగ భాష'గా మారిపోయింది.  కాలక్రమేణా  తిలింగ భాష, తెలింగ భాష, తెలుంగు భాషగా రూపాంతరం చెందుతూ చెందుతూ  'తెలుగు భాష'గా గుర్తింపు పొందే దశలో ఉంది  ప్రస్తుతం.   

'తెలుగు' పదానికి  వ్యుత్పత్తి చెప్పటంలో విద్యానాథుడు అనుసరించిన విధానాన్నే అతని తరువాతి కాలపు తెలుగు లక్షణవేత్తలూ అనుకరించారు. ఆ తరహా లాక్షణికులలో మొట్టమొదటివాడు 15వ శతాబ్ది పూర్వార్థానికి  చెందిన  విన్నకోట పెద్దనకవి. ఆయన తన  కావ్యాలంకార చూడామణిలో 'ధర శ్రీపర్వత కాళే/శ్వర దాక్షారామ సంజ్ఞ వఱలు త్రిలింగా/కర మగుట నంధ్రదేశం/బరుదారఁ ద్రిలింగదేశ మనఁజనుఁ గృతులన్' అన్నాడు.

'తత్త్రిలింగపదము తద్భవం బగుటచేఁ/దెలుఁగుదేశ మనఁగఁ దేటపడియె/వెనుకఁ దెనుఁగుదేశమును నండ్రు కొంద'రని అప్పటి వరకు  వ్యవహారంలో ప్రసిద్ధంగా ఉన్న తెనుగుదేశానికి సమన్వయం కూడా ఇచ్చాడు. ఎదురు బదులివ్వగలరా ఇంకెవరైనా! 17వ శతాబ్ది నాటి అప్పకవీ దీనినే అనువదించాడంటేనే ఈ వ్యుత్పత్తి పదం సత్తా ఏంటో అర్థమవటంలేదా!.  

 

ఇక, పాల్కురికి సోమనాథుడు ఈ త్రిలింగదేశాన్ని 'నవలక్ష తెలుంగు' (తొమ్మిది లక్షల గ్రామాలకు పరిమితమైన తెలుగు)గా తన ‘పండితారాధ్యచరిత్ర’లో కొత్తగా నిర్వచించాడు.  ఆనాటి మహమ్మదీయ చరిత్రకారుడు ఈసామీ సైతం ఈ మాటను పట్టుకునే 'నౌ లాఖ్ తిలింగ్' (తొమ్మిది లక్షల తిలింగ్) అని నిర్ధారించడం అదో తమాషా. 14వ శతాబ్దం పూర్వార్థం నాటి శాసనాలు ఈ ‘నవలక్ష తెలుంగు’లోని తెలుంగునే 'తిలింగ' దేశంగా మార్చేశాయి. 'తైలింగ ధరణితలం'గా వ్యవహృతమవడమే ఇందుకు ఉదాహరణ.  అదే శతాబ్దం నాటి ఒకానొక శాసనం 'తిలింగదేశం'  అనే పదాన్ని ‘పశ్చా త్పురస్తా దపి యస్య దేశౌ/ఖ్యాతౌ మహారాష్ట్రకలింగ సంజ్ఞౌ;/అవా గుదక్పాండ్యక కాన్యకుబ్జౌ/దేశ స్స్మతత్రాస్తి తిలింగనామా’ అంటూ నిర్వచించింది.

ఇట్లా కవులు, వైయాకరణులు,  లాక్షణికులు, చరిత్రకారులు వివిధకాలాలలో ఒకే రకంగా చేసిన ఎల్లల ప్రస్తావనల చలవ వల్ల అంతిమంగా ఆంధ్రదేశం త్రిలింగ దేశం(తెలుగుదేశం)గా స్థిరపడిందనుకోవాలి. 'తెలుగు' ఆంధ్ర’ పదానికి దేశపరంగా, జాతిపరంగా, భాషపరంగా కూడా   పర్యాయపదం అయింది.

ఇంత హంగామా జరిగినా,  ఇప్పటికీ 'తెలుగు' అనే పదానికి  శాస్త్రీయంగా వ్యుత్పత్తి అర్థం కాని, ఆ పదం ఎప్పుడు మొట్టమొదటగా వాడుకలోకి వచ్చిన వివరాలు కానీ, ఆ రావడం  దేశవాచకంగానా, జాతివాచకంగానా, భాషావాచకగానా రావడమని గానీ.. ఏవీఁ ఇతమిత్థంగా తెలీటం లేదు. జాతివాచకమో,  భాషావాచకమో అయితే ఆదిమకాలంలో అంధ్రులు, తెలుగువారు ఒక్కరే అయివుండాలి  మరి. ఏ చారిత్రిక పరిశోధనా ఈ దశగా సాగి వాదనలు వేటినీ నిర్ధారించినట్లు కనిపించదు! శబ్దపరంగా పొంతనకైనా ఆస్కారంలేని  ఈ రెండు పదాలు మధ్యనా ఎట్లా ఒకదానికి ఒకటి  పర్యాయపదాలు అనే బంధం బలపడిందో! ఇదీ ఓ  పెద్ద వింత.  భాషాపరిశోధకులు నిగ్గు తేలిస్తే తప్ప ప్రామాణీయకమైన సత్యాలుగా తేలని అనేక భాషాంశాలలో ఈ ఆంధ్ర -తెలుగు పదాల పరస్పర పర్యాయబంధ రహస్యం కూడా ఒకటి. నన్నయ కాలం నుండి తెలుగు, ఆంధ్రం ఒకదాని కొకటి పర్యాయ పదాలయ్యాయని కేవలం నమ్మకం మీద మాత్రమే చెప్పుకోవడం!  

 

ఇవాళ ఆంధ్రులు అంటే  తెలుగువాళ్ళే కానీ, తెలుగువాళ్లంతా ఆంధ్రులు అంటే ఒప్పుకోని పరిస్థితిలు నెలకొనివున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలుగా సమైక్య ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తరువాత  సంభవించిన మరో ప్రధానమైన మార్పు నవ్యాంధ్రప్రదేశ్    నివాసులు మాత్రమే ఆంధ్రులుగా పరిగణింపబడటం! తెలంగాణా రాష్టవాసులు తమను తెలుగువారుగా చెప్పుకుంటారు కానీ 'ఆంధ్రులు'గా గుర్తింపు పొందేందుకు మాత్రం సిద్ధంగా లేరు!

-కర్లపాలెం హనుమంతరావు

03 -07 -2021

 

 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...