Thursday, December 9, 2021

కథలు రాసేందుకు సామాజిక అవగాహన చాలా? - పి.రామకృష్ణ - సేకరణ : కర్లపాలెం హనుమంతరావు

 కథలు రాసేందుకు సామాజిక అవగాహన చాలా?

- పి.రామకృష్ణ 


ఒకప్పటి కదలకంటే ఇప్పుడు వాటి సంఖ్య పెరిగింది. వస్తు విస్తృతీ పెరిగింది. అయితే, అప్పటి కథలు ఇచ్చిన సంతృప్తినీ, ఒస్పందననూ ఇప్పటి కథలు ఇస్తున్నాయా? పాత్రలతో సహా అప్పటి కథలు ఇప్పటికీ జ్ఞాపకంవున్న సంగతి తల్చుకుంటే, ఇవ్వడం లేదని ఒప్పుకోవలసిందే. ఎందుకని? ఇప్పటికీ సాహిత్యం చదివే పాఠకులతో ఈ అంశం చర్చించా లనే ఈ ప్రస్తావన


స్వేచ తనకు అవసరమైనంత మేరకు విస్తరించి, తననొక స్వతంత్ర ప్రక్రియగా ప్రకటించుకునేది. కథా ప్రతిపాదన నచ్చినా నచ్చకపోయినా దాని నిండు దనంలో లోపం వుండేది కాదు. ఇప్పుడు కథకు ఆ స్వతంత్రం లేదు. కథకు లేదంటే కథకు లకు లేదనే అల్లసాని పెద్దన కోరికల్లాంటివి అవసరం లేదు కానీ, అందులో మొదటిదైన 'నిరుపహతి స్థలం' అంటే నిబం ధనలు లేని జాగా కథకు అవ సరం. అది నేటి పత్రికల్లో లభ్యం కావటం లేదనేది అందరికీ తెలి సిందే కనుక, ఆ సంగతి వది లేద్దాం. అయితే, ఆ ఏకైక కారణమే కథ ఈ స్థితిలో వుండటానికి కారణమా అని మాత్రం ఆలో చించాలి. ఒక్క వాక్యం కూడా సాహిత్యమవుతుందని ఇంతకు ముందు పెద్దలు చెప్పారు. ఆ లెక్కన చిన్న కథకైనా సాహిత్యం కాగల అర్హత వుంటుంది. కథ సాహిత్యమైతే తప్పనిసరిగా స్పందింపజేస్తుంది. మరి ఇప్పటి కధ 'బావుంది' అనిపించడం మినహా, ఎప్పటికీ జ్ఞప్తికుండేలా ఎందుకు చెయ్యలేకపోతోంది? అది చెప్పవలసిన బాధ్యత ఈ ప్రస్తావన తెచ్చిన నామీదనే


ఉందని అనుకుంటున్నాను. అయితే, నేను చెబుతున్న


కథ చదివినప్పుడు తప్ప తర్వాత జ్ఞాపకం లేకుండా పోతున్నది. అందుకు కారణం కథకులకు సాహిత్య నేపథ్యం లేకపోవడం. సమాజంలో మనం చూస్తున్న అసమానతలనూ, అన్యాయాలనూ ఎత్తిచూపేందుకు సాహిత్య అవగాహన అక్కర్లేదు. సామాజిక అవగాహన చాలు అనే అభిప్రాయమూ వినిపిస్తూ వుంది. సామాజిక అన్యాయాలను సాహిత్యం ద్వారా చెప్పదల్చుకున్నప్పుడు, అది సాహిత్యం అవ్వాల్సిన అవసరం వుంది కదా!


కారణాలు నా అభిప్రాయాలే. ఇవి ఇంకే ఒకరిద్దరి అభిప్రాయాలైనా


నా ప్రయత్నం ఫలించినట్లే.


కథా రచన అనేది ఒక సృజనాత్మక ప్రక్రియ. ఈ అభిప్రాయాన్ని ఎవ్వరూ వ్యతిరేకించరనుకుంటున్నాను. అంటే, కథకు తగినంత స్థలం వుండటం అవసరమే అయినా, అంతకంటే ముఖ్యం అది సాహిత్యం అవడం. సమాజంలో జరుగుతున్నవి మాత్రమే చెబితే అది సాహిత్యం అవదు. కథకుడి సృజన సామర్ధ్యమే దాన్ని సాహిత్యం చేస్తుంది. ఆ సృజనశక్తి ఎలా వస్తుంది? సాహిత్య నేపథ్యం దాన్ని సమకూరుస్తుంది. కధ సాహిత్యమయిందా, లేదా అని పాఠకులు ఆలోచించాలని కాదు. స్పందింపచెయ్యడంలోనే ఆ సంగతి నిర్ణయమవుతుంది. అందుకు పాఠకులకు పరీక్ష అవసరం లేదు. స్పందింపచెయ్యకపోతే, 'బావుంది' అనే తాత్కాలిక పరిమిత స్పందన వరకే పాఠకులుండిపోతారు. అదీ సమస్యనైనా సరిగా చెప్పినప్పుడే.


అందువల్లనే కథ చదివినప్పుడు తప్ప తర్వాత జ్ఞాపకం లేకుండా పోతున్నది. అందుకు కారణం కథకులకు సాహిత్య నేపథ్యం లేకపో వడం. సమాజంలో మనం చూస్తున్న అసమానతలనూ, అన్యాయా లను ఎత్తిచూపేందుకు సాహిత్య అక్కర్లేదు. అవగాహన సామాజిక అవగాహన చాలు అనే అభిప్రాయమూ వినిపిస్తూ. వుంది. సామాజిక అన్యా ద్వారా చెప్పదల్చుకున్న పడు. అది సాహిత్యం అవ్వాల్సిన అవసరం వుంది కదా!


ఇప్పటి కథకులు సాహిత్య సంబంధం లేనివాళ్ళయితే, మరి వున్నవాళ్ళు రాయొచ్చు. అనవచ్చు. రాయొచ్చు. కానీ వాళ్ళకు వుండదు. సృజనకు పూర్తి అవకాశం లేని కథ రాయడంపై వాళ్ళకు ఆసక్తి వుండదు. సాహిత్య పరిచయం వుండీ, ఒకప్పుడు కథలు రాసీ, ఇప్పటికీ ఉన్నవాళ్ళు కథలు రాయడం మానెయ్యడానికి ఓపిక లేకపోవడమే కాక అదీ కారణం కావచ్చు. ఇంతకూ చెప్పదల్చుకున్నది ఒక్కటే. భౌతిక నిర్మాణానికే కాదు, భావ నిర్మాణానికైనా పునాది అవసరం. అది రచయితలకే కా, పాఠకులకు అవసరమే. లేకపోతే, ఏది సాహి త్యమో తెలీకపోవడమో, ఏదైనా సాహిత్యమనుకునే పరిస్థితో ఏర్పడే ప్రమాదం వుంది. నిజానికి, ఈ ప్రమాదాన్ని రెండుగా చెప్పనక్కర్లేదు. ఏది సాహిత్యమో తెలీనప్పుడు, ఏదైనా సాహి తమే అవుతుంది కదా!


పి. రామకృష్ణ

( సేకరణ : కర్లపాలెం హనుమంతరావు ) 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...