Wednesday, December 8, 2021

ప్రాకృతసాహిత్యంలో సామాన్యమానవుడు

 

 

Monday, April 5, 2021

10:44 AM

 

ప్రాకృతసాహిత్యంలో సామాన్యమానవుడు-తిరా--భారతి-75-6-౪.pdf


సకల జగజ్జంతువులకు వ్యాకరణాది సంస్కారం లేని సహజ వాక్ వ్యాపారం ప్రకృతి. ప్రకృతి సంబంధమైనది ప్రాకృతం.

పిల్లలకు, మహిళలకు ఇది సుబోధం. మేఘ వర్షిత జల స్వచ్చత దీని లక్షణం.దేశ విశేషాలను బట్టి సంస్కారాదులను బట్టి విశిష్టతను పొంది.. సంస్క్రుతాదులుగా తరువాత విభేదాలు పొందేది. రుద్రట రచిత కావ్యాలంకారానికి వ్యాఖ్యానం రాస్తు నమిసాధువు చెప్పిన వ్యుత్పత్తి ఇది.

సంస్కృతం ప్రాకృతం పరస్పారాబూతాలన్న మాట నిజమేనా?

అగ్ని మీళే పురోహితం

యజ్ఞస్య దేవ మృత్విజం

హోతారం రత్న ధాతవం- ఇది రుగ్వేదం తొలి మండలం తొలి ఋక్కు. మానవ జాతి మొదటి చందోబద్ధ సాహిత్యంగా పరిగణించేది. ఈ సంస్కృత శ్లోకానికి మూలాధారంగా ఏదైనా ప్రాకృత గాధ ఉందా? మరి సంస్కృతం సంస్కరింపబడిన ప్రాకృతంగా  నిర్ధారించుకోవడం ఎలా?! రెండూ ఒకే కొమ్మకు పూచిన రెండు పూవులు ఎందుకు కాకూడదు?

ఋగ్వేద మేధావుల భాష ఐవుండి.. ప్రాకృతం (ప్రజల భాష)దానికి సంపూర్ణ భిన్నంగా కాక.. సన్నిహితంగా ఉండే పలుకు ఎందుకు ఐ ఉండకూడదు? త్తణ- త్వవ, ఆవి- ఆయై, విహి- వఏభిః, హోహి- బోధి, విఊ- విదుః, రుక్ఖ- రుక్ష.. మొదటివి ప్రాకృత రూపాలు, రెండీవి సంస్కృత రూపాలు. రెంటికీ చాలా దగ్గర పోలికలు ఉన్నట్లు పిషెల్ (Richard Pischell)  మహాశయుడు ఉదాహరించిన ఈ రూపాలను బట్టి సంస్కృత ప్రాకృతాలు  అసలు ఒకే పూ రేకు రెండు పార్శ్వాలనుకున్నా తప్పు లేదు.

భాష ప్రవాహిని. ఋగ్వేద భాషా జన ముఖ యంత్రంలో పడి మార్పులకు లోనవక తప్ప లేదు. ప్రాచీనతను కాపాడుకోవాలనే తపన వలన  ఋక్కులకు, పనసలకు పద పాదాలు, ఉచ్చారణ రక్షణకు ప్రాతిశాఖ్యలు పుట్టినట్లున్నాయి. 'వేద రక్షణకు వ్యాకరణం చదవాలి.లోపాగమ వర్ణ వికారజ్ఞుడే వేద రక్షణా సమర్ఢుడు.' అని పతంజలి హితవు. పాణినీ 'వేదేలోకే' అని విడదీయడం వల్ల సాహిత్య భాష, లౌకిక భాష విడిపోయినట్లు అనిపిస్తుంది.

తథాగతుడు మేధావుల మేలిమి భాషకు పోక తన ప్రామ్తీయ పాలీ భాషలో ధర్మోపన్యాసాలు చేసినట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఋగ్వేద బ్రాహ్మణ  సంస్కృతాన్ని కొంచెం యాసతో కొంచెం ముఖ యంత్ర సౌలభ్యంతో వ్యవహరిస్తే తథాగతుడు వాడిన ఆ పాలీ భాష అవుతుంది అపిస్తుంది.

"యో చ నస్ససతం జంతు అగ్గిం పరచరే వనే

 ఏకంచ భావితత్తానం ముఉత్తం అపి పూజయే

 సా యేవ పూజనా సేయ్యో యమ్ చే నస్స సతం హుతం"

దమ్మ పదంలోని ఈ మూడు పాదాలు చాలు సంస్కృత ప్రాకృతాలు  ఒకే పూ రేకు రెండు పార్శ్వాలని నిర్దారించడానికి.

భాష ప్రవాహ నైజం కలది కనక ఆ ప్రాకృతంలోనూ సాహిత్య సంస్కారం కలది పై పలుకు అయింది తక్కినది అపభ్రంశం కింద జమయింది. నమిసాధువు దబాయించి చెప్పిన ఆ అప్రభ్రంశ భాషా దేశ భాషలుగా వేయి చీలకలయింది.

 

సామాన్య మానవుణ్ణి ప్రాకృత సాహిత్యం ఆదరించినట్లు సంస్కృత సాహిత్యం ఆదరించలేదు. ఆదికావ్యం రామయణం కూడా రాగ రంజితమైనదే. ప్రాకృత సాహిత్యం ప్రజారంజన చేయలేదు అన్న మాట అబద్ధమని తేలి పోలేదూ! అ దృష్టితో చూస్తే ప్రాకృత సాహిత్యం గాథా సప్తశతిది ప్రజారంజక సాహిత్యంలో అగ్రస్థానం.

 

గాథా సప్తశతికి తెలుగు గడ్డతో సంబధం ఉంది. ప్రజారంజక కవుల గాథలను సేకరించి ప్రాకృత సాహిత్య మాతకు అలంకారాలుగా కూర్చిన హాలుడు తెలుగు వాడే. పేరుకు రాజైనా ప్రాణమంతా గ్రామీణ జీవన సౌందర్యానికే మీదు కట్టిన  మొదటి శతాబ్ది ముక్తక గ్రధన మార్గదర్శి.తెలుగుల కమనీయ కల్పనా  పటిమను దిగంతాలకు చాటిన మహనీయుడు.

 హాలుడిది ప్రధానంగా రసిక దృష్టి. శృంగార రస ధుని నుంచి తొంగిచూసే సామాన్యుని జీవితం హాలుని ప్రథాన ఇతివృత్తం.

'ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించని

కథలన్నీ కావాల'ని మహాకవి శ్రీ శీ ఇపుడన్నాడు గానీ క్రీస్తు శకం తొలి శతాబ్దిలోనే హాలుడు ఆ యజ్ఞం అరంభించాడు.

 

సామాన్య్డుడు అంటే ఎవరు? ప్రతి వృత్తిలోని సామాన్య గృహస్థు. రాజ సేవకుడు మొదలు.. నాపితుని వరకు.వారి దైనందిన జీవితం, దారిద్ర్యం, కరువు కాటకాలు, వాగులు, వరదలు, వానకాలపు బురద వీధులు, ఎండకాలపు మృగతృష్ణలు,  దప్పికగొన బాటసారులు, చలివెందలి చపలాక్షులు, చలికాలపు నెగళ్ళు, గొంగళ్ళు, గొంగళ్ళు అక్కర్లేని నెరజాణల మొగుళ్ళు, వసంతోత్సవాలు, మొగిల్లను చూసి నిట్టూర్పులు విడిచే ముదితలు, ఫాల్గుణోత్సవాలు, పెండ్లిండ్లు, పేరంటాలు, సతులు, అసతులు, విధవలు, వేశ్యలు, జారులు పూజారులు, వంటలు పంటలు,శిధిల దేవాలయాలు, ప్రసిథిల వలయాలు, నగలూ నాణేలు- ఒకటేమిటి.. గ్రామాలల్లోని ప్రతిదీ కావ్య వస్తువయింది.

ధర్మ శాస్త్రం నిషేధించిన ఋతుమతీ సంస్పర్శన సంగమాలను సైతం ఈ కవులు వదిలి పెట్టలేదు.

 

దారిద్ర్య చిత్రణలో ప్రాకృత కవి  నేటి కవిని ఎలా మించి పోయాడో చూడండి!

దుగ్గ అ కుటుంబఅ

కహంణ మఏ దోఇఏణ సోఢ వ్వా,

దసి ఓసరంత సలివేణ

ఉపహ రుణ్ణంవ పడవిణ (గాథాసప్తశతి 1-18)

(దుర్గ తకుటుంబాకృష్షిః

కథన్ను మయా ధౌతెన  సోఢన్యా

దశాపసరప్సలిలేన

వశ్యత రుదిత మివ పట కేన?)

కటిక దరిద్రం. ఉన్న ఒక్క గుడ్డనూ దినమూ గుంజి పులిమి ఆరవేస్తున్నారు. గుడ్డ చీకిపోయి ఇక ఉండ లేననకుంది. ఆర వేసిన గుడ్డ అంచునుంది నీరు కారుతుంది. దానిని ప్రాకృత కవి చూసాడు. హృదయం ద్రవించింది. ఈ దరిద్రపు సంసారం గుంజుకుని రావడం ఇక సహించలేనన్నట్లు ఆ గుడ్డ ఏడుస్తున్నట్లుగా ఉంది అని అంటాడు కవి.

Tuesday, November 11, 2014

12:00 PM

దరిద్రుని ఇల్లాలుకు వేవిళ్ళు.ఎన్నో కోరికలు పుడతాయి ఆ దశలో స్త్రీలకు. 'ఎం కావాలి>' అని భర్త అడిగినప్పుడల్లా భర్త అకులత్వం పోగొట్టడానికి 'మంచి నీళ్ళు' అని అడిగి పుచ్చుకునేదిట.

'దుగ్గ అఘరమ్మి ఘరిణీ

రక్ఖంతీ ఔలత్తణం పఇణో

పుచ్చిఅదోహల సద్దా

పుణోని ఉఆం విఆ కహేఇ (గా.సః 5-72)

౯దుర్గత గృహే గృహిణీ

రక్షంతీ అకులత్వం సత్యుః

పృష దోహద శబ్దా

పున రపి ఉదక మితి కధయతి)

 

పరిసర సామాన్యాంశాలను అతి సహజ మనోహరంగా అప్రయత్నంగా సులభగ్రాహ్యంగా ఉపమోత్ప్రేక్షించడంలోనే కవి కల్పనా దక్షత పరీక్షకు నిలబడేది.

ఫాలేహి అచ్చభల్లం

వ ఉఅహ కుగ్గామ దేఉలద్దరే,

హేమంత ఆల వధిఓ

విఝ్జా యంతం పలాలగ్గిం (గా.స-2-9)

పాటయ తగచ్చభల్లం

ఇవ వశ్యత కుగ్రామదేవకులద్వారే

'హేమంతకాల పథికో

విధ్మాయమానం పలాలాగ్నిం)

చలికాలం. పల్లెటూరి దేవళం ముందు ఓ బాటసారి అప్పటి వరకు చలి కాచి ఆరిన నెగడును కర్రపుల్లతో కెలకడం ఎలుగుబంటి పొట్ట చీలుస్తున్నట్లుందని కవి ఉపమోత్ప్రేక్ష.

మంట ఆరిన కాలిన గడ్డి కుప్ప పడి పోయిన  నల్లటి ఎలుగు బంటిలాగే ఉండటం.. దాని పొట్ట చిల్చినప్పుడు నిప్పులా లోపలి రక్త మాంసాలు కనిపించడం- ఎంత మనోహరంగా ఉంది కవి కల్పన!

రంధణకమ్మ నివు ణిఏ

మాజూరసు రత్తపాటలను అంధం

ముహమారు అం సి అంతో

ధూమాఇ సిహీ ణ వజ్జలఇ  (గా.స-2-24)

 

(రంధన కర్మనిపుణికే

మాకృధ్యస్య రక్తపాటల సుగంధం,

ముఖమారుతం సిబన్

ధూమాయతే శిఖీ న ప్రజ్వలతి)

కవితకు ప్రేరణ పద్మినీజాతి స్త్రీయే కానక్కర్లేదు. అనుక్షణం మన కటెదుట మసలుతూ, ఇంటి పనులలో నిమగ్నురాలైన ఇల్లాలైనా చాలు-అని ప్రాకృతకవి సిద్ధాంతమై ఉంటుంది.

ఇల్లాలు వంట చేయాలి , పొయ్యి రాజేసింది. పొయ్యి రాజుకోవడం లేదు. నిప్పు రావాడం లేదు. భర్త అంటాడూ"వంటల్లో ఆరితేరిన గడసరిదానా! ఊదడం మాను. కోపగించుకోకు. నీ ఊర్పుల కమ్మ తావిని ఆస్వాదిస్తూ అగ్నిదేవుడు మరీ మరీ ఆ  తావిని గ్రోలుదామని మండడం లేదు"

'హాసానిఓ జణో

సామలోఅ పఢమం పసూఅమాణాఏ,

వల్లహ వాహేణ ఆలం

మమ్మత్తి బహుశో భణంతేఏ  (గా.స-2-26)

(హాసితో జనః

శ్యామయాః ప్రథమం ప్రసూయమానాయాః

వల్లభ వాదేవ ఆలం

మమేతి బహుశో భణం త్యా) 

 ప్రసూతి వైరాగ్యం పురాణ వైరాగ్యం, శ్మశాన వైరాగ్యాలకు మల్లే తాత్కాలికం. ప్రసవ వేదన భరించలేని బాధలో 'ఇహ మొగుడూ వద్దు.. మొద్దులూ వద్దు' అని ఆడవారు ఏడుస్తారు.అంతమాత్రం చేత వాళ్లు సంసారాలు చేయకుండా ఉన్నారా? ఉంటే సృష్టి ముందుకు సాగేది ఎట్లా?! ప్రాక్రుత కవి స్త్రీ ప్రసవ వైరాగ్యాని బహు చక్కని పద్యంలో వివరించాడు.

 

ముర్రుపాలు తాగిన కొత్త గేదె దూడకు ఎక్కడ లేని నిద్ర ఆవరిస్తుంది. ఆ ప్రకృతి ధర్మాన్ని ఓ  పరసతిని మరగిన వగలాడి పగటి నిద్రతో మహా చమత్కారంగా పోల్చిన కవి కల్పనా పటిమకు జోహార్లు అర్పించాల్సిందే!

జి హోసి ఇ తప్ప పిఅ

అణూది అహం ణేససేహి అంగేహిం

ణవసూఅ పీఅపీఅసి?  (గా.స- 1-65)

 

(యది భవసి న తస్య ప్రియా

అణుదివసం నిస్సహై రంగైః,

నవసూత పీతపీయూష

మత మహిషీ వత్సేవ కింస్వవిసి?)

గేహే హ సలోఅహ ఇమం

పహసి అవాణా వైస్స అస్సేఇ,

జాఆ సుఆ పదముబ్బిణ్ణ

దంతజుఅ లంకిఅం బోరం  (గా. స- 2-100)

(గృహ్ణీత ప్రలోకయత ఏనం

సహసిత వదనా పత్యు రర్పయతి,

జాయా నుత ప్రథమోద్భిన్న

దంతయు గళాంకితం బదరం)

ఓ పిల్లడికి పాల పండ్లు వచ్చాయి. ఆ పండ్లతో వాడు రేగు కాయను కొరికాడు. మహదానందంతో భర్త వద్దకు వచ్చింది పిల్లడి తల్లి 'ఇదిగో తీసుకోండి.చూడండి దీన్ని'  అంతో నవ్వుతూ పిల్లడు  కొరికిన -కొత్త పాలపళ్ల గాట్లున్న రేగుపండును భర్తకు చూపించింది.

 

పిల్లలకు పళ్ళు వచ్చే వరకు భార్యా భర్తలు తప్పనిసరిగా శయ్యాపథ్యం చేయాలి. ఈ లోగా కక్కుర్తి పడరాదని వైద్యక శాస్త్రం చెబుతోంది. అందుకే ఆ భార్యకు అంత ఆనందం. ఆమె నవ్వులోని అంతరార్థాన్ని కవిత్వంగా మలిచిన కవికి ఎన్ని వరహాలు పురస్కారం ఇవ్వాలి?!

 

అవిరల పడంత ణవజల

రారా రజ్జు ఘడిఅం పాత్తేణ,

అపహుత్తో ఉఖ్ఖేత్తుం

రస ఈవ మేహో మహిం ఉవహ  (గా.స- 5-36)

 

(అవిరల పతన్న సజల

ధారారజ్జుఘటాతాం ప్రయత్నేన,

అప్రభవ న్నుక్షేప్తుం

రసతీవ మేఘో మహీం పశ్యత)

 

బరువుల్ని పైకి లాగే సమయంలో ఊపుకోసం అప్రయత్నంగా నోటినుంచి శబ్దాలు చేస్తుంటారు కార్మికులు. ఈ దృశ్యాన్ని కుండపోతగా వర్షం కురిసే  సమయంలో వినిపించే మేఘ గర్జనలకు సమన్వయిస్తూ కవి చేసిన చమత్కార వర్ణన ప్రజా రంజకంగా ఎందుకుండదు! పగ్గ్గాలు పైనుంచి వదిలినట్లు వర్షం కురుస్తోంది. ఉరుములు వినిపిస్తున్నాయి. మేఘమనే కార్మికుడు సందులేకుండ భూమిని పగ్గాలు కట్టి పైకి లాగుదామనుకున్నాడు,ఎంత ప్రయత్నంచినా లాగ లేక మూలుగుతున్నాడు. ఆ మూలుగులేనుట ఉరుములు!

 

ఇక రాజకీయ ఛాయలు గల గాథలకూ కొదవ లేదు. సామాన్యుని దృష్టి కోణంనుంచి కవిత్వరీకరింపబడటమే ఇక్కడ ఎన్నదగిన అంశం.

 

ఆమ అస ఇహ్మ ఓసర

సఇవ్వఏ ణ తుహ మఇలఆం గోత్తం,

కిం ఉణ జణస్య జాఆవ్వ

చందిలం తా ణ కామేమో  (గా.స-5-17)

 

(ఆమాస్త్యో వయం

అససర పతివ్రతే న తవ మలినితం గోత్రం;

కింపున ర్వయం జనస్య జాయేవ

నాపితమ్ తావన్న కాక్ముయామహే)

 

'ఔను! మేము లంజలం. దగ్గరకు రాకు. తప్పుకో. నీ వంశం మైలపడిపోనూ! కాని మెము సామాన్య సంసారికి భార్యలం. నాపితుని మామించ లేదుగదా!' అని ఈ గాథకు అర్థం. ఈ సంభాషణ అర్థ మవాలంటే కొంత చారిత్రిక నేపథ్య జ్ఞానం తప్పని సరి. గాథాసప్తశతి ఐదవ శతకం 17వ గాథ నందవంశ మూలపురుషుని కథను ధ్వనింపచేస్తుందని శ్రి ఎన్.ఎస్. కృష్ణమూర్తిగారి అభిప్రాయం.

నందులకు పూర్వం భారపాలకులు శిశునాగులు. శిశునాగుల్లో కడపటి రాజు కాలాశోకుడు. కాలాశోకుని భార్యకు ఆస్థాన నాపితునికి సంబంధం కలిగింది. ఆ నాపితుడు కాలాశోకుని భార్య సహాయంతో, అతనిని చంపి, రాజ్యం ఆక్రమించుకొని నందవంశానికి మూలపురుషు డవుతాడు. వీడిని నాపితదాసుడని కొందరన్నారు.మహావంశ నందులు అధార్మికులని, ఉన్నత కులులు కారని ఆ స్త్రీ ఈ గథలో అంటున్నది.

 

వీధి వినోదాలు కవి దృష్టిని దాటి పోలేదు. ఒక వీధిలో మల్లుడు తప్పెట కొదుతున్నాడు. తప్పెట తాళానికి అనుగుణంగా మల్లుని భార్య నాట్యం చేస్తున్నది. ఒకర్తె మల్లుని భార్యను ఎత్తి పొడుస్తున్నది." ఓ మల్లీ! ఎంత దురదృష్టమే నీది! భర్త డప్పు కొడితే ఆడుతావు సిగ్గు లేక! అని.

ఆ ణత్తం తేణ తుమం

వఇణో వహఏణ సడహ సధేణ

మల్లి ణ లజ్జసి ణచ్చసి

దోహాగే సా అడి జ్ఞంతే     గా.స-785

 

ఆజ్ఞప్తం తేన త్వాం

సత్యా ప్రహడేన పటహశబ్దేన,

మల్లి నలజ్జసే నృత్యసి

దౌర్భాగ్యే ప్రక్టీ క్రియమాణే

(మొదటి భాగం సమాప్తం)

గాథా సప్తశతి-రెండో భాగం

గథా సప్తశతి లోని రచన కొంతైనా తెలుగు గడ్డ మీద జరిగుంటుందని పండితుల అభిప్రాయం. దీనిలోని తెలుగు పలుకులను గురించి తిరువల రామచంద్ర గారు భారతిలో విస్తృతంగా రాసారు.

 

వజ్జాలగ్గం కూదా గాథా సప్తశతిలాగా ముక్తకాల సంకలనమే. కర్త జయవల్లభుడనే శ్వేతాంబర జైనముని. 8వ శతాబ్ద్ద్దం వాడు.  తను ధర్మార్థ కోవాలానే త్రివర్గం గురించిన సుభాషితాలను సంకలించానని స్వయంగా చెప్పుకున్నాడు.

 

సువ్వన్ను వయణ పంకయ

ణివాసిణిం పణమిఊణ సుయదేవిం,

ధమ్మాఇ సుహాసి అం వోచ్చం   వ-1

 

(సర్వగ్య వదన పంకజ

నివాసినీం ప్రణమ్య శ్రుతదేవీం,

ధమ్మాది త్రివర్గ యుతం

సుజనానాం సుభాషితం పక్ష్యామి)

'కవుల వివిధ గాథలలో మేలిమిని గ్రహించి జయవల్లభమనే వజ్జాలగ్గం విధిపూర్వకంగా కూర్చాను' అన్నాడు.

 వజ్జా అంటే పద్దతి. లగ్గం అంటే సంకలనం. ఒక ప్రస్తావంలో చెప్పే గాథల పద్ధతిని పజ్జా-ప్రజ్యా అన్నానని తెలుపుకున్నాదు. ఇతడు ప్రాకృతం గురించి గొప్పగా చెప్పుకున్నాడు. లలిత మధురాక్షరమైనది ప్రాకృత కావ్యం.నది స్త్రీలకు ఇష్టమైనది. శృంగార రసయుతం. అలాంటిది ఉండగా సంస్కృతం ఎవరు చదువుతారు? అని ఇతని ప్రశ్న.

లలిఏ మహురక్ఖర ఏ

జువౖ జణ వల్లహే ససింగారే

సంవే(?) పా ఇఅ లవ్వే

కో సక్కై సక్కఅం పఢిఉం-  29

 

పాలు పితుకడం సరిగా తెలియని వారు ఆవులను బాధ పెట్టినట్లు గాథల రసం తెలియని మోటువాళ్ళు దాన్ని ఈకకు ఈక తోకకు తోక లాగి పాడు చేస్తారని వాపోతాడీ కవి ఓ గాథలో "ఓ గాథా! నిన్ను మోటు మనుష్యులు అడ్డదిడ్డంగా చదువుతారు.చెరుకు తినడం తెలియని మోటువాళ్ళు చెరుకు నమిలినట్లు నిన్ను ఎక్కడ బడితే అక్కడ విరుస్తారు' అని కవి వాపోత.

వజ్జాలగ్గం భర్తృహరి సుభాషిత పద్యతిలో సంకలనం చేసినట్టిది. దీనిలో 96 పగ్గాలలో దాదాపు వేయి గాథలున్నాయి. సామాన్య జనుడే ఈ కవి లక్ష్యం. దరిద్రుణ్ణి, తదితరులని స్వేచ్చగా వర్ణించాడు. దరిద్రుడు అతని దృష్తిలో సిద్దులందరిలోకి మహా సిద్ధుడు.

'దీనంతి జోయసిద్ధా

అంజణ సిద్దా వి కౌని దీసంతి,

దాంద్జ జో యసిద్దం

మం తె లోఆని పచ్చంతి  -141

 

 

(దృశ్యంతే యోగసిద్ధాః

అంజన సిద్దా అపి కేచన దృశ్యంతే,

దారిద్ర్యయోగ సిద్ధం

మాం తే లోకా న ప్రేక్షంతే)

 యోగ సిద్ధులు కనబడతారు. అంజన సిద్ధులూ కనబడతారు. నాబోటి దారిద్ర్య యోగసిద్ధులు ఎప్పుడూ ఎవ్వరికీ కనిపించరు- అని ఓ దరిద్రుడు వాపోతుంటాడుట.

 

జై నామ కహని సోక్ఖం

హూఇ తులగ్గేణ సేవఅజణస్య,

తం ఖవణాఅ సగ్గారో

హణం న విగ్గో వా సఏహి   -153

 

(యది నామ కథమపి సౌఖ్యం

భవతి తులాగ్రేణ సేవకజనస్య,

తత్ క్షపణక స్వర్గారోహణ

మివ వ్యాకుల భావసతైః)

రాజసేవకులు దంభర్మాంకులు. వస్త్ర వ్యాపారులు, పల్లెల్లో తెలివితేటలు గలవారు, వడ్డెవాళ్ళు, వైద్యులు, జ్యోతిష్కులు, మొదలైన వారి మనస్తత్వాలను బాగా చిత్రించాడీ కవి. రాజ సేవకునికి ఏదైనా సౌఖ్యం కాకతాళీయంగా వస్తే, అది క్షపణకుని స్వర్గారోహణం లాగా ఎన్నో కష్టాల తర్వాత మరణానంతరంసంభవించ వచ్చునంటాడు.  క్షపణకుడు(సన్యాసి) కి సుఖం కలిగేదెప్పుడు? మరణానంతరమే. అతని ఘనతను గ్రహిమ్చి విమానంకట్టి మోసుకుని పోతారు. వాద్యాలు మోగిస్తూ దానాలు ఇస్తారు. అతని పేర ఇలా అంత్య సంస్కారం కోసం తీసుకు వెళతారు. ఇలాగే రాజసేవకుడికీ కాకాతాళీయంగా ఏదైనా సుఖం కలిగిందీ అంటే అది మరణం తరువాతే. జీవితకాలంలో సుఖ యోగం లేదు అని కవి భావం.

 

ఒక సేవకుడు అనుకుంటాడు"మంచి పొదుగు ఉన్న మూడు ఆవులు, నాలుగు మంచి ఎడ్లు, చేతినిండా  వరికంకులు ఉంటే చాలు.. ఓ సేవా ధర్మమా, నీవు ఎక్కడన్నా సుఖం ఉండు' అని.

తంబాఉ తిన్ని సుపఓహరా ఉ

చత్తరి పక్కల ఎఇల్లా,

నిస్సన్నా రాలయ మంజరీ ఉ

సేవా సుహం కుణవు'   -160

 

(గాన స్తి సః సుపతీధరాః

చత్వారః సనర్థ బలీవర్గాః

నిష్పన్నా రాలవ మంజర్యః

సేవా సుఖం కరోతం)

గ్రామాలలోని చతురులను గురించి కవి చాలా మనస్తత్వ విచారణ చేసాడు. ఒకామె ఒక అమ్మాయిని హెచ్చరిస్తుంది" పల్లెల్లోని భేకులు బహు చతురులు. బహు కూట నిపుణులు. వారి చేతుల్లో పడ్డ వారికి స్వప్నంలో కూడా సుఖం లేదు.వారికి ఆరవ జ్ఞానం(సిక్స్త్ సెన్సు) ఉంటుంది. ఆ చూపుల్లో పడిన వాడికి సుఖం ఉండాదు'

 మేడలతో, మిద్దెలతో, ప్రాకారాలతో, శిఖరాలతో ఉండేదే కాదు.. చతురులున్న పల్లే నగర మవుతుంది.

 

తహ చంపిఊణ భరి ఆ

నిహిణా లావణ్ణ ఏత తణు అంగీ,

జహ సే చిహారతరంగా

అంగుళి మగ్గ దీసంతి   -314

 

(తథా నిసీడ్య భృతా

నిధినా లాణ్యేన తన్వంగీ,

యథా అస్యాః చికురతరంగా

అంగుళీమార్తా ఇవ దృశ్యంతే)

 

శరీర సౌందర్యం, అంగాంగ సౌష్టవానికి మించిందని ప్రాకృత కవి గొప్ప ఊహ.ఓ లావణ్య సుందరిని చూసిన అతగాడికి ఇంత్లో ధాన్యమో, పత్తో సంచుల్లోకి కూరుతున్న దృశ్యం గుర్తుకొచ్చింది.విధి ఒక తన్వంగిని లావణ్యంతో కూరి కూరి నింపాడుట. పై నుంచి నొక్కి నొక్కి కూరిన చేతుల గుర్తులే వంకుల జుట్టు అని కవి చమత్కారం! ఆహా.. ఎంత గొప్పగా ఉందీ ఊహ!

 

దాడిమఫలం వ్వ పెమ్మం

ఎక్కేసక్కేవ్వ హోఇ సకషాయం,

జావ న బీఓ రజ్జఇ

తా కిం మహ రత్తణం కుణఇ    -334

(దాడిమఫల మివ ప్రేమ

ఏకైకస్మిన్ పక్షే సకషాయం,

యావ న్న ద్వితీయే రజ్యతే

తావ త్కిం మధురత్వం కరోతి)

ప్రాకృతమని చిన్న చూపు కాని సామాన్యుని చూపు ఎంత గహ్యమైన అంశాన్నైనా తన పరిధిలోకి అనువదించుకుని అత్యద్భుతమైన అవగాహనను ప్రదర్సిస్తుంది. మేధావుల ఊహ పోహల వలె కాకుండా సామాన్య జీవి ఏక పక్ష ప్రేమని పూర్తిగా పండని దానిమ్మ పండుతో ఎంత గొప్పగా పోల్చాడో! దానిమ్మ పక్వానికొచ్చే విధానం మిగతా ఫలాలకన్నా కొద్దిగా విభిన్నంగా ఉంటుంది. గింజలన్నీ ఎర్ర బారినదాకా పండులోకి తీపిదనం రాదు. ఒక పక్క తియ్యగా ఉండి మరో పక్క వగరుగా ఉండే లక్షణం ఒక్క దానిమ్మ పండుకే ప్రత్యేకం. ప్రేమా అంతేట. 'ఒక పక్షంలో మాత్రమే ప్రేమ ఉండి మరో పక్షంలో దానికి అనుగుణమైన స్పందన కరవైతే ఆ బంధం దానిమ్మ పండు మాదిరి సంపూర్ణమైన పక్వ ఫలం అనిపించుకోదు'అంటాడు ప్రాకృత కవి.బిఓ అన్న పదానికి విత్తనం, రెండో పక్షం రెండు అర్థాలు ఉండి గాథ చమత్కారాన్ని మరింత పెంచింది.

బింకాన్ని ప్రెమను రెండు మదగజాలతో పోల్చాడు మరో గాథలో ప్రాక్కృత కవి. బింకం ఉంటే ప్రేమ పండదు. ప్రేమ ఉంటే బింకం నిలవదు. రెండూ ఒకే చోట ఉండలేవు.. ఒకే కట్టుకు కట్టివేసిన రెండు మదాజాల మాదిరిగా.

జి మాణీ కీస పిఓ

అహన పియో కీసక్షీరఏ(?) మాణో,

మాణిణి దోని గయిందా

ఎక్క కంభే న బజ్జంతి  -355

ఒక వరలో ఇమడని రెండు కత్తులతో ప్రేమని, అహంకారాన్ని కబీర్ దాస్ కూడా పోల్చడం గమనించాలి.

పియా బాహై పేమరస

రాఖా బాహై మాన

ఎకమ్యానమేఁదో ఖడగ

దేఖా సువా , కాన'

 

పల్లెటూరి జనానికి బూతన్నా, బహిరంగ శృంగార చేష్టలన్నా సంకోచం లేకపోవడం ఈనాడే కాదు..ఆ నాడూ ఉంది. కాబట్టే వజ్జాలగ్గంలో కవి 'ఒక నవ దంపతుల వివిధ శృంగార భంగిమల్ని రాత్రంతా చూస్తూ గడిపిన  దీపం నూనె లేకపోయినా అలాగె మండుతున్నదని ఓ గాథలో  సూచ్యం చేస్తాడు.

దట్టూణ తరుణ సురఅం

వివిహ పలోఠ్ఠంత కరణసోహిల్లం,

దీఓ వి తగ్గయ మణో

గఅం వి తెల్లం న లక్ఖేఇ -319

 

(దృష్ట్యా తరుణ సురతల

వివిధ ప్రలుఠత్  కరన సహితం,

దీపోసి తద్గతమనాః

గతం మసితైలం న లక్షయతి

అని చెప్పుకొచ్చాడు.

 

తాడిచెట్టును అడ్డం పెట్టుకుని ఓ ప్రాకృత కవి  'ఓ తాడిచెట్టూ! ఎందుకు నీ ఎత్తు? సగం ఆకాశాన్ని ఆక్రమించావు. ఆకలి దప్పి తీర్చుకుందామని పాంథులు దగ్గర చేర్తారా ఏమన్నానా?' అంటూ రస హీనతని ఎద్దేవా చేస్తాడు. ప్రాకృత సాహిత్యంలో ఇలాంటి నర్మ గర్భ శృంగార  ప్రేలాపలకు కొదవే లేదు. గ్రామీణులు పని పాటల అలుపు సొలుపుల నుచి ధ్యాసను  మళ్ళించుకోడానికి వళ్ళు పులకలెత్తే మౌఖిక శృంగారాన్నాశ్రయించడం అసభ్యంగా భావించడం లేదు నాడూ నేడూ కూడా! 

కబీరు అంతటి సాధువు ఈ గాథను గుర్తుకు తెచ్చే ఖర్జూర వృక్ష దోహాను వల్లె వేస్తున్నాడు మరి

" సాథు భయా తో క్యా భయా

జై సే షేడ ఖబర్,

సంచీకో సాయా సహీఁ

ఫల తాగే అతిదూర్!"

హౌనయ్యా గొప్ప సాధువే ఖర్జూరం లాగ. పిట్ట వాలడానికి నీడ లేదు. పండ్లు కోసుకుందామంటే దూరంగా ఉన్నాయి .. అందవు"

(ప్రాకృతసాహిత్యంలో సామాన్యమానవుడు-తిరా--భారతి-75-6-౪.pdf)

 

 

 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...