Showing posts with label collection. Show all posts
Showing posts with label collection. Show all posts

Saturday, December 18, 2021

పాత బంగారం - కథ అల్లుడి అలక - మారుతి ( ఆంధసచిత్రవారపత్రిక 28-6-63) సేకరణ- కర్లపాలెం హనుమంతరావు





పాత బంగారం - కథ 

అల్లుడి అలక 

- మారుతి 

( ఆంధసచిత్రవారపత్రిక 28-6-63) 

సేకరణ- కర్లపాలెం హనుమంతరావు 


విడిదిలో పెళ్ళికొడుకు అలిగి కూచున్నాడు. మగ పెళ్ళివారు భోజనాలకు రామని భీష్మించుకుని కూర్చున్నారు. 


పెళ్ళికొడుకు తల్లి చీర చెంగుతో ముక్కు తుడుచుకుంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నది. మొహ మంతా కందగడ్డ చేసుకుని పక్కనే కూచున్న ఇద్దరు కూతుళ్ళు ఏవో చెప్పుతూ అగ్నికి ఆజ్యం పోస్తున్నారు.


ఉదయం పది గంటల ఏడు నిముషాలకు సూత్ర ధారణ జరిగింది.  ఆ తర్వాత ఆరంభ మయిందీ ప్రచ్ఛన్న యుద్ధం!


వెంకయ్యవంతులుగారు కాలు కాలిన పిల్లిలాగ తిరుగుతున్నారు . . పెళ్ళివారిని శాంత పరచాలని. అయిన ఖర్చు అవుతూ ఈ అల్లరి ఏమిటని ఆయన బాధ.


పెళ్లి పందిట్లో ఎవరో అన్నారుట "అందుకే సాంప్రదాయం చూసి చేసుకోవాలని. ఒక మంచీ మర్యాదా ఏమీలేదు. మెహం వాచినట్టు ఆ ఫలహారాలకు ఎగబడడ మేమిటి- తింటూ ఆ వంకలు పెట్టడమేమిటి" అని.


'ఆడ పెళ్ళివారు ఇలాంటి మాటలతో అవమానం చేస్తారా' అని, మగ పెళ్ళివారు అలిగారు. 


వెంకయ్యవంతులుగా రసలే ముక్కోపి.  అయినా మనిషిలో ఎంతో మార్పు కనిపించిం దా సమయంలో! ఎర్ర పట్టుబట్ట కట్టుకుని తెల్లటి జరీ అంచు పట్టు ఉత్తరీయం మీద వేసు కుని విడిదికి బయలుదేరుతుంటే 'అసలే ఈయనది దుడుకు స్వభావం. లేనిపోని గొడవలు చేసి రసాభాసం చేస్తాడేమో'నని వెంట ఆయన తోడల్లుడు సుందరామయ్య కూడ వెళ్ళాడు.


వెంకయ్య పంతులుగారు నవ్వుముఖంతో ప్రాధేయ పూర్వకంగా వియ్యంకుడి చేతులు పట్టుకుని బ్రతిమలాడారు.' 'ఎవరో ఏదో అన్నారని ఇలా భోజనాలు చెయ్యకుండా ఉండటం న్యాయమా చెప్పండి బావగారూ! మేముగా ఏమయివా తెలియక పొరపాటున చేసి ఉంటే చెప్పండి; క్షమాపణలు కోరుకుంటాను"    


ఆయనంటున్న మాటలకు వియ్యపురాలి పక్కన కూచున్న ఎవరో ఒకావిడ లోపలినుంచి అన్న మాటలు వినిపించాయి. 


' ఎవరో ఏదో అంటే మా కెందు కింత బాధ ! పెళ్ళికూతురికి స్వయాన అమ్మమ్మట ఆ మాట అన్నది. మేమేమీ తిండికి మొహంవాచి రాలేదు.  మా మంచీ మర్యాదా మీచేత పరీక్ష చేయించుకో టానికి రాలేదు'


'ఆవిడ పెద్దది. తొందరలో ఏదో అని ఉంటుంది. ఆమె మాటలు అంతగా పట్టించుకోవా ల్సిన పనిలేదు. ఇక భోజనాలకు లేవండి బావ గారూ ! 'విస్తళ్ళు వేశారు. వడ్డించడానికి సిద్ధంగా ఉన్నారక్కడ. మీరు లేవాలి పంతులుగారు ప్రాధేయపడ్డారు. 


ఇక వెంకయ్య వెంట వచ్చిన సుందరామయ్యకు తను ఎన్నడూ చూడని సౌమ్యత ఆయనలో చూస్తుంటే ఆశ్చర్యం వేసింది.


' అనే మాటలు వేసి తొందరలో అన్నది —— పెద్దది అంటే ఎలాగండి, మా కెంత కష్టంగా ఉందో ఆలోచించారా మరి!' వరండాలో స్తంభానికి ఆనుకుని కూచుని పుగాకు చుట్ట చుట్టు కుంటున్న ఒక బంధువు ఎదురుప్రశ్న వేశాడు. ఆ విడిదిలో ఉన్నవాళ్ళు మూడు వంతు లకు పయిగా ఉదయం ఏడుగంటలనుండి అప్పటి దాకా ఆడ పెళ్ళివారికి కబుర్లు మీద కబుర్లు పెట్టి తెప్పించుకున్న ఇడ్లీ - ఉప్మా, కాఫీ నాలుగైదు సార్లయినా ఖాళీ చేశారు.


ఇదంతా చూసి ఆ ముసలావిడకు వళ్ళుమండి పోయి, ఆ మాట అన్నది, అయిదోసారి కాపీ గుండిగ పట్టించుకు పోదామని వచ్చిన ఆమె వినేట్లుగా! 


విడిది ఒకవేపుగా మంచంమీద "స్నేహితులతో ముచ్చట్లాడుతున్నాడు పెళ్లి కొడుకు . 


'రేడియో అడగరా మీ మామను .' 'రేడియో కమ్   ట్రాన్సిస్టరడగరా ఇప్పుడు గాకపోతే ఇంకెప్పుడిస్తాడు ?' అని సలహాలిస్తున్నారు

మిత్రులు. 


' ఆయన్ని మనవేపు రానీ అసలు' పెళ్ళికొడుకు సందేహం వెళ్ళబుచ్చాడు.


'ఓరి చవటా! అప్పుడే నీరు గారి  పోతావేమిరా ! ఆయన వచ్చి 'లేవోయ్ భోజనానికి' అని అనగానే లేచి ఆయన వెంట పరిగెత్తక. కొంచెం బెట్టు చెయ్యి. మిగతా సంగతి మేము పూర్తి చేస్తాము ' అని ధైర్యం చెప్పారు మిత్రులు. పెళ్ళికొడుకు అంగీకార సూచకంగా బుర్ర ఊపాడే గాని తన వయిపువాళ్ళు ఒక పట్టాన తెగనిచ్చేటట్టు కనబడలేదు వ్యవహారం.'


మామగారు ఒంటరిగాడయిపోయినాడు. బతిమలాడుతున్న కొద్దీ తీరుబడిగా విజృంభిస్తున్నారు. ఎవరికి తోచినట్లు వారు, 


వెంకయ్య పంతులు గారు క్షణక్షణానికి సహనం

కోల్పోతున్నారు. అయినా తప్పదు ! ఇటు వంటి సమయాల్లోనే ఓర్పు, నేర్పు అవసరం! ఇదే తను తలపెట్టిన శుభకార్యం ! అంతా నవ్యంగా జరిగిపోయిందనుకుంటే, సరీగా భోజ వాల ముందు పేచీ వచ్చిపడింది. 


అసలు వాళ్ళని మాట్లాడనివ్వకుండ ఉన్నవాళ్ళు తలా ఒక మాట విసురుతున్నారు. వియ్యంకుడు ఎటూ చెప్పలేక గుంజాటన పడుతున్నాడు. పెళ్ళి చేసి చూడు; ఇల్లు కట్టిచూడు అన్నారందుకే! 


వేలకు వేలు డబ్బు ఖర్చయినా వచ్చే మాట రానేవస్తుంది. వెంకయ్య పంతులుగారి వివాహంలో తనవాళ్ళు ఇంతకన్న ఎక్కువ అల్లరే చేశారు. పాపం! 

ఆయన మామగారు ఆరితేరిన అనుభవజ్ఞుడు కావడంచేత అన్నీ సునాయాసంగా సమర్థించుకుపోయాడు. ప్రతిదానికి అడుగడు గునా వంకలు పెట్టటమే మగపెళ్ళివారు. అప్పుడు జరిగిన దానికంటే ఇప్పటి పరిస్థితిలో ఎన్నో ఆ విషయం జ్ఞాపకంవచ్చి ఆయన కోపాన్నంతా దిగమింగుకుని వియ్యంకుడిని, ఆయన బంధులవును సమాధాన పరచాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. 


ఒక అరగంట జరిగిందీ వరసన. ఎంత సేవ యినా, మళ్ళీ మొదటికే వస్తున్నదీ వ్యవహారం!


భోజనాలకు లేచే  వాతావరణం ఎక్కడా కనిపించనే  లేదు. ఆలస్యం జరుగుతున్నకొద్దీ విడిదిలో ఏం జరుగుతున్నదో తెలుసుకుందామని పెళ్ళివారింటి నుంచి ఒకరి తర్వాత ఒకరు చేరుకుంటున్నారు. 


' సరే మీరంత పట్టుదల పడితే ఏం చెయ్యగలను ? 

నేనూ ఇక్కడే కూచుంటాను' అని వెంకయ్య పంతులుగారు వియ్యంకుడి పక్కనే కూచున్నారు. ఆయన తోడల్లుడు సుందరామయ్యకు మాత్రం సహనం నశించింది. 


 'వీళ్ళు మనుషులా లేక కారణ రాక్షసులా' అనిపించిందాయనకు. 


వెంకయ్య పంతులుగారు కూచోవడం గమనించిన ఒక బంధువు 'మీరు అనే మాటలు బాగానే ఉన్నాయి గానీండి; తప్పంతా మాదే నుంటారు  ఇంతకీ !' అన్నాడు అయిదోసారి పుచ్చుకున్న కాఫీ వెళ్ళి. టిఫిను పీకదాకా ఎగదన్నుతుంటే తాపీగా కంఠం సరిజేసుకుంటూ.


ఇంక లాభం లేదనుకున్నాడు సుందరామయ్య. కూచున్న వాడల్లా దిగ్గున లేచి 'అన్నమాటలేవో  అన్నాము. కావాలని మేమే ఆ ముసలమ్మచేత అని పించాము. సరా !.... ఇప్పుడు మీరు భోజనాలకు పదండి లేస్తారా లేవరా ! ఒక్కటే మాట. రెండు నిము షాలే టయిము' అన్నాడు హెచ్చు స్వరంతో.


ఆయన ముఖ కవళికలు చూసి అక్కడ అందరూ హడలిపోయారు. అప్పటిదాకా ఒకళ్ళ కొకళ్ళు సంబంధం లేకుండా మాట్లాడుకుంటున్న

మాటలతో రణగొణ ధ్వనిగా ఉన్న విడిది నిశ్శబ్దంగా

అయిపోయింది.


ఆడవాళ్ళంతా గజగజలాడారు. పెళ్ళికొడుకు గుండెల్లో రాయిపడింది. వెంకయ్య పంతులుగారు పరిస్థితి అర్థం చేసుకుని నవ్వుతూనే తోడల్లుని సమీపించి 'తొందరపడకు తమ్ముడూ!' అన్నారు.


' మీరూరుకోండి అన్నగారూ ! క్షమించండి. అంతకంటే ఏమీ చెప్పలేను' అని కోపంతో వెంకయ్యవంతులుగార్ని తప్పించుకుని రెండడుగులు ముందుకు వేసి 'అందరి మర్యాదా మంట కలసిపోకముందే - భోజనాలకు నడవండి - ఏమండి వియ్యంకుడుగారూ చూస్తారేం ?...  ఒరేయ్ చెంచయ్యా ! భజంత్రీలను  రమ్మను— మేళం చెయ్యమను... ' ఆజ్ఞలు సుందరామయ్య. జారీచేశాడు 'లేవలేకపోతే ఏం జేస్తాడో!' అని ఒకమూల నుంచి అన్న మాటలు ఆయన చెవుల్లో పడ్డాయి. 'నేనేం చేస్తానో, చేయిస్తానో మీతో చెప్పి చేయవలసిన అవసరం నా కేమిలేదు. మూర్ఖంగా ప్రవర్తించక హృదయమున్న మనుషుల్లాగా  ప్రవర్తించండి!' గర్జించాడు. 

 ఇంతలో చెంచయ్య అందించిన ప్రకారం బాజా భజంత్రీలు వచ్చి విడిదిముందు నిలిచారు. 


ఆశ్చర్య మేమిటంటే వెంకయ్య పంతులుగారు కూడ తన తోడల్లుని వేపు చూడడానికి సాహసించలేకపోయారు. 


అప్పటిదాకా కుడితిలో పడిన ఎలుకలాగా కొట్టుకుంటున్న వియ్యంకుడు లేచి లోపలికి వెళ్ళి 'నే చెబితే విన్నారుటమ్మా !.... సవ్యంగా సాగిపోతున్న దానికి ఒక మెలిక వేస్తిరి. ఇప్పుడు అవమానం పాలయ్యేది వాళ్లా మనమా! అసలే పల్లెటూరు ఇది. పదిమందిని పిలిచి మనమీదకు ఉసిగొలిపితే ఇక్కడ మన పరువేంకావాలి !.... ఆయన చూడు — వీరభద్రుడి అవతారం ఎత్తాడు !" అని మొత్తుకున్నాడు. 


దానితో ఎవరి మటుకు వాళ్ళు తెలివి తెచ్చుకుని లేనిపోనిది భలానా వాళ్ళ పెళ్ళికి వెళ్ళి చావు దెబ్బలు తిని వచ్చారంటూ - కలగబోయే అపనిందకు జంకి భోజనాలకు వెళ్ళడానికి సిద్ధపడ్డారు. 


సుందరరామయ్య  విడిదంతా కలియ చూశాడు. అందరూ లేచి సిద్ధ మవుతున్నారు గాని పెళ్ళి కొడుకు మాత్రం నడిమంచం మీద కూచున్నాడు తిష్ట  వేసుకుని.

' ఏమిషర్లేలే! వాళ్ళంతా బయలుదేరారు. ఇప్పటికే కాలాతీత మయిపోయింది' అన్నాడు సుందరామయ్య పెళ్ళికొడుకు దగ్గరకు

వెళ్ళి.

ప్రళయం సరాసరి తవమీదికే వచ్చినందుకు ఆలోచించే వ్యవధికూడ దొరక్క ఠపీమని లేచి నుంచున్నాడు పెళ్ళికొడుకు . పక్కనున్న స్నేహితులు నొక్కి పెడుతున్నా వినకండా; వూడిపోతున్న మధుపర్కం సరిజేసుకుంటూ 'అబ్బే నాదేముంది, ' అన్నాడు.


అందరినీ కూడగట్టుకుని పెళ్ళివారింటికి చేరేలోగా ఈ వార్త పాక్కిపోయింది పెళ్ళి సందిట్లో సందరామయ్య అంతపని చెయ్యగలిగాడా! అనేదే ప్రతివారిని ఆశ్చర్యపరిచిన విషయం.


భయంతో భోజనాలకు బయలుదేరారే గాని మగ పెళ్ళివారి కిది అవమానకరంగానే తోచింది. పౌరుషం పెరిగింది. భోజనాల దగ్గర గొడవ చేసి ప్రతీకారం తీర్చుకోవాలని ఎవరి మటుకు వారు నిశ్చయించుకున్నారు. కొంతమంది బయటికే అనుకున్నారు. అవి మెల్లిగా పాకి మగ పెళ్ళివారి కంటె ముందుగానే వెంకయ్యవంతులుగారింటి చేరినయి.


ముహూర్త బలం మంచిది కాదన్నారు. అంతా సవ్యంగా అయిపోయిందని సంతోషిస్తుంటే ఈ కొసరు ఏమిటని బాధ వ్యక్తం చేశారు. సాంప్రదాయం అవీ చూడకుండ సంబంధం కలిపితే ఇట్లాగే ఉంటుందని వ్యాఖ్యానించారు కొందరు.


'ఇటువంటి వాళ్ళతో ఎట్లా నెగ్గుకు వస్తుందో పాపం జానకి!' అని పెళ్ళికుమార్తె మీద సానుభూతి చూపించారు.


సుందరామయ్య ఇంట్లో వాళ్ళందరికీ ధైర్యం చెప్పాడు: 'మీరేం భయపడద్దు మీ పని మీరు కాని

వ్వండి' అన్నాడు. వెంకయ్య పంతులుగారు మాత్రం “లేనిపోని గొడవ ఏమిటిది సుందర్రామయ్యా!” అని చేతులు పట్టుకున్నాడు ఎటూ పాలుపోక, 'మీరేం భయపడకండి. అంతా జరిగిపోయేట్లు చూచే భారం నాది' అన్నాడు సుందరరామయ్య. 


అల్లరి చేద్దామనుకున్న వాళ్ళెవరూ నోరెత్త లేదు భోజనాల దగ్గర. దానికి కారణం మందరామయ్య అడుగడుగునా ప్రత్యక్షమవుతుండటమే.


అంతా సక్రమంగానే జరిగిపోయింది గాని, పెళ్లి కొడుకు కోరికే ఇంకా కొరవ ఉండిపోయింది. స్నేహితులు, అప్పచెల్లెళ్ళూ కాకుల్లా పొడవటం మొదలుపెట్టారు పెళ్ళికొడుకు రామారావును.


“వాళ్ళు అన్నమాటలకే తలవంపులుగా ఉంటే, నవ్వు చవటలాగ ఇలా వూరుకోవటం ఏమీ బాగాలేదు. ఫలానావాడి పెళ్ళికి వెళ్ళి, అవమానం పాలయి వచ్చామని మేము ఏ మొహం పెట్టుకుని చెప్పుకోము.'' ఇట్లా రామారావు చెవిని ఇల్లు గట్టుకుని పోరారు. 'ఏమయినా సరే, అలక పానుపుమీద విలువయిన వస్తువేదయినా కోరాల్సిందే!' అని రూలింగ్ ఇచ్చారు.


సాయంత్రం అయిదు గంటలయింది.


ఆడ పెళ్ళివారు ఘనంగా అయిదు వందల రూపాయలు ఖర్చుపెట్టి రకరకాలుగా అలంకరించిన కారు మాట్లాడారు ఊరేగింపుకు; ఫుల్ బ్యాండు సెట్టుకూడా ఏర్పాటు చేశారు.


కాని, పెళ్ళికొడుకు అలిగాడు! ఆరు గంటలు అయినా, పెళ్ళికొడుకు పట్టెమంచంమీద బైఠాయింపు సమ్మె చేస్తున్నాడు !


వెంకయ్య పంతులుగారు తల పెట్టినది ఇదే మొదటి శుభకార్యం, జానకి ఆయన ప్రథమ సంతానం . కలిగినంతలో గొప్ప సంబంధం తెచ్చి చెయ్యా అని రెండు సంవత్సరాలపాటు గాలించి ఆఖరికి ఈ సంబంధం స్థిరపరుచుకున్నారు అన్ని విధాలా నచ్చటంచేత.


అల్లుడు డిగ్రీ పుచ్చుకున్నవాడని, కొద్దిపాటి అదీ ఉన్నది, అత్తమామలు ఉన్న కుటుంబం గనుక అమ్మాయి సుఖపడుతుందనడంలో సందేహం లేదని వెంకయ్య అనుకుని పంతులుగారు నిశ్చయిం చుకుని ముందుగా నిర్ణయించుకున్న లోపాయికారి కట్నంలో అయిదువేలరూపాయలు లగ్నాలు పెట్టుకున్నప్పుడే ఇచ్చేశారు. అదిగాక ఆడబడుచుల లాంఛనాలకింద వెయ్యి రూపాయలు, పెళ్ళి కుమారుడికి వెండికంచం - పట్టు బట్టలకు బదులు సూటు, రిస్టువాచీ  లగ్న మప్పుడు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అనుకున్న ప్రకారం అన్నీ సక్రమంగా జరిపారు.


ఇంత ఖర్చు భరించడానికి ఆయన సంతోషంతో తప్పుకోడానికి కారణం ప్రథమ సంతాన మయిన జానకి - వివాహం ఘనంగా జరిపించాలని సంకల్పించడమే ! అప్పటికే నాలుగు వేలు అప్పు  తగిలింది ఆయనకు.

అల్లుడు అలిగాడనగానే  పరిగెత్తుకుంటూ ఉత్తరీయం సరిజేసుకుంటూ వెళ్ళారు.

' ఏం నాయనా! ఏమిటి సంగతి' అని నవ్వు తూనే అడిగారు.

నూనె తడిలేక కళ్ళ మీదకు పడుతున్న జుట్టును చేత్తో పయికి నెట్టడానికి వృథా ప్రయత్నం చేస్తూ ముఖం చిట్లించి  కోపం నటించాడు రామారావు. చేతికున్న కొత్త రిస్టువాచీకి ఉత్తుత్తి ‘కి' ఇచ్చాడు కాసేపు.


వీడెటూ చెప్పలేడని  గ్రంహించిన పక్కనున్న స్నేహితుడు 'వాడు అలిగాడండీ! అడగటానికి మొహమాటపడుతున్నాడు' అన్నాడు. 'అనుకున్న ప్రకారం అన్నీ ఇచ్చాను గదుటోయ్! ఇంకా ఏమిటి అవతల ఊరేగింపుకు టయిము అయిపోతున్నది' అన్నారు వంతులుగారు బతిమాలుతున్న ధోరణిలో.


ఉదయమే, ఆడబడుచు కట్నంలో తన వాటాకు వచ్చిన రెండువందలూ పుచ్చుకుని పెట్టెలో దాచుకున్న పెళ్ళికొడుకు అప్పగారు "వేడుకలన్నీ జరిపి తీరాల్సిందే ! అదేమన్నమాటండోయ్ !" ఇవ్వాళ కాకపోతే ఇంకెప్పుడు చెల్లుతయి వాడి ముచ్చట్లు మాత్రం ! ఈ కాస్తా అయిపోతే ఆ తర్వాత మీరేం పెడతారో, వాడేం తీసుకుటాండో మే మేమన్నా చూడొచ్చామా .. అడగొచ్చామా' అన్నది తమ్ముడికి వత్తాసిగా. భళిభళి అన్నారు ఇంకో ఇద్దరు ఆమె అన్న దానికి.


కుడితిలో పడిన ఎలుకలాగ అయింది వెంకయ్య పంతులుగారి పని. చుట్టూ ఆడవాళ్ళ మెజారిటీయే ఎక్కువగా ఉంది. అప్పటికే ఖర్చులన్నీ కలిసి తలకు మోపెడయినయి. ఇంకా ఇంకా ఒక దాని కొకటి ఇట్లా పెరిగిపోతుంటే ఎట్లాగని ఆలోచిస్తున్న ఆయన చెవులకు 'అడగరా ! మళ్ళీ అవతల ఊరేగింపుకు వేళవుతున్నదని సుందర్రా మయ్యగారొచ్చి  బెదిరిస్తే మళ్ళీ కష్టం' అన్న మాటలు వినిపించినయి.


'ఏమడగనూ నా మొహం ' అని జుట్టు పై కి నెట్టుకుని 'స్కూటరు' అన్నాడు రామారావు. వెంకయ్య పంతులుగారు నీళ్ళు గారిపోయారు. రెండువేల అయిదు వందల రూపాయలు ఆయన కళ్ళముందు మెదిలినయి . పసిపిల్లవాడు కారు కొని పెట్టమన్నట్టుగా ఉన్నది అల్లుడు 'స్కూటరు' కొనిపెట్ట మనటం ! అతనేమంత అజ్ఞావా! తెలివితక్కువ వాడా! అన్నీ తెలిసే అట్లా అడుగుతున్నాడు. ఆయనకు చాలా బాధ కలిగింది. పయిగా వియ్యపు రాలు, వియ్యంకుడు తమ కివేమీ పట్టనట్టు

కొంచెం దూరంగా కూచున్నారు వేడుక చూస్తూ. రాని  నవ్వును బలవంతాన తెచ్చి పెట్టుకు కుని 'చూడు రామారావ్ ! కష్ట సుఖాలు తెలిసినవాడివి;

చదువుకున్నవాడివి. అందుచేత దాపరికం లేకుండా చెబుతున్నాను. 'స్కూటరు' అంటే వందా రెండు వందలకు వచ్చే వస్తువేమీకాదు. అంత పెద్దగా కోరటం బాగాలేదు. ఏదో నాకు తోచింది నేను సంతోషంగా ఇస్తాను తీసుకో !' అని వంద రూపాయల నోటు ఇవ్వబోయారు పంతులుగారు.


కళ్ళమీద పడిన జుట్టులోంచి వందరూపాయల నోటువేపు చూసి తటపటాయించాడు రామారావు, 'టు బీ ఆర్ నాట్ టు బి' అనే ముక్క జ్ఞాపకం వచ్చి.


'బాగుందిరోయ్ వరస.  చావుకు పెడితే లంకణాని కన్నట్టు — ఇదేమిటి!' అన్నా డొక మిత్రుడు మెంటులాగ పళ్ళన్నీ వెళ్ళబెట్టి. ఇవేమీ వినిపించుకో 

కుండ, పంతులుగారు అల్లుడిని సమాధాన పరచ డానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం మెల్లగా  పాకింది పెళ్ళిఇంటికి. పందిరి చల్లదనంలో  విశ్రాంతిగా  పడుకుని ఆడవాళ్ళతో సరదాగా

మాట్లాడుతున్న నుందరరామయ్య గుర్రుమన్నాడు. 

"వీళ్ళు మనుషులా కట్నమిచ్చి, సలక్షణ మయిన పిల్లనిచ్చి అన్ని లాంఛనాలతో పెళ్ళి చేస్తే ఇంకా గొంతెమ్మ కోరికలకు అంతెక్కడ!' అని చిందులెయ్యడం మొదలుపెట్టాడు.


మాతన వధువు జానకి కళ్ళ నీళ్ళ పర్యంత మయింది. ఇంత హృదయంలేని మనుషులు కూడ ఉంటారా లోకంలో, అనుకుంది. తన తండ్రి ఎంత సరదా పడుతున్నాడో, అంత కించ పరుస్తు న్నారు.  పెళ్ళివారు వచ్చిన దగ్గర నుంచీ కోరిక  కోరికలకు కూడ మితముండాలి ! ఇష్టంవచ్చినట్టు 'నాకు రైలు కావాలి, విమానం కావాలి' అంటే, ఎక్కడి మంచి తేగలరు ఎవరు మటుకు! జానకిని మూగ బాధ ఆవరించింది. ఎంతో మధురమయినదిగా ఊహించుకున్న వివాహం ఇంత జుగుప్సాకరంగా ఉంటుందమకోని జానకి బాధపడింది.


సందరామయ్య లేచి విడిదికి వెళ్ళబోతుంటే జానకి భయపడింది. 'బాబాయ్! ఒక్క మాట' అని పిలిచి గదిలో నుంచి ఇవతలకువచ్చి, సుందర్రా మయ్య దూకుడుగా వెళ్ళబోతున్న వాడల్లా  వెనక్కు తిరిగి జానకి దగ్గరికి వెళ్ళి "ఏంమ్మా'  అన్నాడు. జానకి మొహం చిన్నబోయి ఉన్నది.


'అంతా విన్నాను బాబాయి ! ఇటువంటి మను ష్యులనుకోలేదు' ఇప్పుడు నువ్వు వెళ్లి నోరు చేసు కుంటే, అల్లరి అవటం తప్ప మరేంలేదు' అని కాసేపు తటపటాయించి 'ఇదిగో బాబాయ్ ఎవరికీ తెలీకుండ ఈ కాగితం వారికి అందజేయి. ఇదే నిన్ను కోరేది' అన్నది జానకి కాగితం మడత ఆయన

చేతుల్లో పెడుతూ,


సుందరామయ్య ఆ కాగితం అందుకున్నాడు, ఆయనలో రేగిన కోపం చల్లారింది. ముఖం ప్రశాంత మయింది.' 'అలాగే తల్లీ " అని జానకి తల నిమిరి విడిదివేపు దారితీశాడు.


ఈయన్ని చూస్తూనే అలక పాన్పున లంక రించిన పెళ్ళికొడుకు— చుట్టూ చేరిన సగంమంది వెనక్కి తగ్గారు.  ఇవ్వేమీ పట్టించుకో కుండా, 'ఏమిటి' మామా అల్లుడు మంతనా లాడుతున్నారు తీరిగ్గా' అన్నాడు సుందరామయ్య అతి ప్రశాంతంగా నవ్వుతూ.


'అబ్బే ఏముందీ !.... అల్లుడు ఏదో వేడుక కొద్దీ కోరాడు. ఆ విషయంమీదే మాట్లాడు తున్నాం' అన్నారు వెంకయ్య పంతులుగారు నుదిటి మీద పట్టిన చెమట తుడుచుకుంటూ. అప్పటికే ఆయన సహనం చచ్చిపోయింది.


సుందరామయ్య నవ్వుతూ పెళ్ళికొడుకు పక్కగా మంచంమీద కూచున్నాడు. లోపల పీచుపీచుమంటున్నా, పయికి బింకంగానే కూచు. న్నాడు రామారావు.


మంచంచుట్టూ అందరి మొహాలూ సావధానంగా చూసి, సుందరామయ్య పెళ్ళికొడుకు చెవులో రెండు మాటలు రహస్యంగా చెప్పి, కాగితం మడత అతని చేతుల్లో ఉంచాడు.


పెళ్ళికొడుకు రెండు క్షణాలు చలనం లేకుండ అట్లాగే కూర్చుని మంచంమీద నుంచి దిగి 'ఇప్పుడే

వస్తానురా' అని మిత్రులకు సంజ్ఞ చేసి, బాత్ రూమ్ లోకి వెళ్ళి కాగితం మడత విప్పి చదువు కున్నాడు. ఆ వెంటనే 'ఛీఛీ'! అనుకున్నాడు. పశ్చాత్తాప పడ్డాడు. చేదుమందు మింగినవాడిలా మెహంపెట్టి, ఆ కాగితం అతి భద్రంగా దాచు కున్నాడు.' ఎంత తప్పుపని చేశాను' అనుకున్నాడు.


సబ్బుతో కసాబిసా మొహమంతా కున్నాడు. గదిలోకి వెళ్ళి రెండు నిముషాల్లో డ్రమ్ చేసుకుని వూరేగింపుకు సిద్ధమయి బయటికి వచ్చిన పెళ్ళికొడుకుని చూసి సుందరామయ్య మినహా అందరూ ఆశ్చర్యపోయారు.


'అప్పుడే అలక తీరిందా ఏమిట్రా' అన్నారు. మిత్రులు.


'ఆ! తీరినట్టే!' అన్నాడు ముక్తసరిగా, అలంకరించిఉన్న కారువేపు నడుస్తూ. వెంకయ్యపంతులుగారు అయోమయంగా తోడల్లుని వేపు చూశారు. 'అదంతా ఉందిలేండి అన్నగారూ' అని నిండుగా నవ్వాడు సుందర్రామయ్య. అప్పుడే విడుదలయిన కొత్త సినిమాలో పాట అందుకున్నారు బ్యాండువాళ్ళు.


ఊరేగింపు కారు బయలుదేరుతున్నదన్నారు. అందరూ సంబర పడిపోయి. - పెళ్ళికూతురు సిగ్గు దొంతరలతో హంసలా నడిచివచ్చి కారులో కూర్చుంది తన హృదయేశ్వరుని పక్కన హృదయమంతా మల్లెపందిరి కాగా..


పెళ్ళికొడుకులో హఠాత్తుగా ఇంత మార్పు రావటానికి కారణం ఏమిటో ఎంత తల బద్దలు కొట్టుకున్నా, అర్థం కాలేదు ఎవరికీ.


😊😊😊


Sunday, December 12, 2021

తెలుపు’ కోసం కొసరాజు సురేష్ అందిస్తున్న ఈ శీర్షికలో ‘సందిగ్ధ’ మూడవది.

 మంచి పుస్తకం’ ఒక సంపద.



1980, 90లలో ఇంగ్లీషులో వెలువడిన ‘మానుషి’ పత్రికకి మంచి పేరు ఉండేది. మధు కిష్వర్ దీనికి వ్యవస్థాపక సంపాదకురాలు. అది ‘ఫెమినిస్టు’ పత్రిక అని ఇతరులు పేర్కొన్నప్పటికీ దాని ఉప శీర్షిక ‘A Journal about Woman and Society’ అని ఉంటుంది.

1992-96లో నేను వ్యవసాయ శాఖలో ఘంటశాల విత్తనాభివృద్ధి క్షేత్రంలో పని చేస్తుండగా మానుషి పత్రికలో ప్రచురితమయిన విజయ్‌దాన్ దేథా కథలు చదివాను. మానుషి ట్రస్ట్ ఆ కథలను ‘ద డైలెమా’ అన్న పేరుతో పుస్తకంగా ప్రచురించింది. ఘంటశాలలో ఉండగా ఒక కథ, రాజేంద్రనగర్ లోని అపార్డ్‌కి డెప్యుటేషన్‌లో (1996-2001) ఉండగా మరో అయిదు కథలు అనువాదం చేశాను.

నేను చేసిన చాలా అనువాదాలకు మూల భాషకీ, తెలుగుకీ మధ్య ఇంగ్లీషు అనుసంధాన భాషగా ఉంది. అయితే ‘సందిగ్ధ’ పుస్తకానికి మూల భాష రాజస్థానీ. విజయ్‌దాన్ దేథా (బిజ్జి అని అంటారు) తన మాతృ భాషలోనే రచనలు చేశారు. ‘సందిగ్ధ’ లోని కథలు ముందుగా హిందీలోకి, హిందీ నుంచి ఇంగ్లీషులోకి (రూత్ వనిత అనువాదం), ఇంగ్లీషు నుంచి తెలుగులోకి వచ్చాయి.

రాజస్థాన్ జానపద కథలను అక్షరబద్ధం చెయ్యటానికి రూపాయన్ అనే సంస్థని విజయ్‌దాన్ నెలకొల్పారు. రాజస్థానీ మౌఖిక భాషలోని జానపద కథల ఆధారంగా 14 సంపుటాల బాతాన్ రి ఫుల్వారి (కథల తోట) ప్రచురించారు. విజయ్‌దాన్ 800కి పైగా కథలు రాశారు. వీటిల్లో కొన్నింటిని సినిమాలుగాను, కొన్నింటిని నాటకాలుగాను మలచారు. ‘చరణ్‌దాస్ చోర్’ మూల కధ విజయ్‌దాన్ రాసినదే. దీనిని హబీబ్ తన్వీర్ నాటికగా మలచారు, శ్యాం బెనగల్ సినిమాగా తీశారు.

ఈ కథల్లో గొప్ప వెలుగు ఉంది. అది పురుషుడి కళ్ల చుట్టూ అల్లుకున్న అధికార వ్యామోహపు, ఆధిపత్య లాలసత్వపు చీకటిని తుత్తునియలు చేయగల శక్తివంతమైంది. ఈ కథల్లోని పురుష పాత్రలు పురుష లోకం మీద ద్వేషంతో సృష్టించినవిగా అనిపించవు. అలాగే ఇందులోని స్త్రీ పాత్రలు పురుషులపై గుడ్డి ద్వేషాన్ని ప్రకటించవు. అదే వీటిలోని ప్రత్యేకత


-సజయ, ఒమ్మి రమేష్ బాబు (లిఖిత ప్రెస్)

2000లో లిఖిత ప్రెస్ పేరుతో ప్రచురణలను ప్రారంభించిన సజయ, ఒమ్మి రమేష్ బాబులు విజయ్‌దాన్ దేథా ఆరు కథలను తమ మొదటి పుస్తకంగా ఎంచుకోవటం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ‘ప్రాంతీయ స్థాయిలో విలసిల్లే జానపద సాహిత్యాన్నీ, కళలనీ కూడా విశ్వీకరణలో ఐక్యం చేసి వాటి అస్థిత్వాన్ని దెబ్బతీయాలన్న యత్నమూ జరుగుతోంది… ఈ సందర్భంలోనే మనం మన మౌలిక సాహిత్యపు విలువలన్నింటినీ ప్రాణప్రదంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సాహిత్యపు మూలాలన్నింటినీ శోధించి సాధించుకోవాల్సి ఉంది. ఈ లక్ష్యంతో విభిన్నమైన సామాజిక నేపథ్యాల జీవిత చిత్రణలను ప్రచురించాలన్న ఉద్దేశంతో ‘లిఖిత ప్రెస్’ ప్రారంభమౌతోంది… తన తొలి ప్రచురణగా వెలువరిస్తున్న ఈ రాజస్థానీ జానపద కథల సంకలనమే ఇందుకు సాక్ష్యం…’ అని ప్రచురణకర్తలు తమ ముందుమాటలో పేర్కొన్నారు. ఇంకా, ‘మన సమాజంలో మన గడ్డ మీద స్త్రీలు ఎటువంటి వివక్షకి గురవుతున్నారో, ఎలా శోకతప్తులవుతున్నారో కళ్లకు కట్టినట్టు వివరిస్తాయీ రాజస్థానీ జానపద కథలు, కల్పననీ, వాస్తవాన్నీకలబోసిన ఈ కథల్లో గొప్ప వెలుగు ఉంది. అది పురుషుడి కళ్ల చుట్టూ అల్లుకున్న అధికార వ్యామోహపు, ఆధిపత్య లాలసత్వపు చీకటిని తుత్తునియలు చేయగల శక్తివంతమైంది. ఈ కథల్లోని పురుష పాత్రలు పురుష లోకం మీద ద్వేషంతో సృష్టించినవిగా అనిపించవు. అలాగే ఇందులోని స్త్రీ పాత్రలు పురుషులపై గుడ్డి ద్వేషాన్ని ప్రకటించవు. అదే వీటిలోని ప్రత్యేకత,’ అని పేర్కొన్నారు. (ఈ పుస్తకం ప్రస్తుతం ముద్రణలో లేదు.)

ఆంగ్ల ప్రచురణకు పరిచయంలో, ‘తనలోని అధికార కాంక్షకు పగ్గాలు వదిలినప్పుడు పురుషులు ఎంతటి మూర్ఖులుగా, హాస్యాస్పదులుగా మారతారో జానపద సాహిత్యం స్పష్టంగా బయల్పరచడం చెప్పుకోదగిన విషయం. తమపై జరుగుతున్న అణిచివేతను బాహాటంగానూ, బయటకి కనపడకుండానూ స్త్రీలు అనేక విధాలుగా ఎలా వ్యతిరేకిస్తున్నారో ఈ కథలు తెలియచేస్తాయి. ఈ మహిళలలో ఏ ఒక్కరూ ప్రతిఘటించకుండా పడి ఉండలేదు. తమదైన హుందాతనాన్ని కాపాడుకుంటూనే పురుషులు నిర్ణయించిన వ్యవస్థలను, పద్ధతులను ప్రశ్నించి ఎదుర్కొన్నారు. జీవించటంలోని ఒక విధమైన ఆనందాన్ని, స్త్రీ – పురుషుల మధ్య మరింత సంతృప్తికరమైన, మరింత సమాన సంబంధాలను కాంక్షించటాన్నీ ఈ కథలు చాటుతున్నాయి,’ అని మధు కిష్వర్ పేర్కొన్నారు.

రాజ్‌కమల్ ప్రకాశన్ హిందీలో ప్రచురించిన ‘దువిధ’, ‘ఉల్‌ఝన్’ అన్న రెండు సంపుటాల నుంచి ఆధికారం, మానవ ప్రవర్తనపై దాని వికృత ప్రభావం అన్న అంశం చుట్టూ అల్లిన ఆరు కథలను ఎంపిక చేసి ఇంగ్లీషు అనువాదంతో ‘ద డైలెమా’ గా మానుషి ట్రస్ట్ ప్రచురించింది.

ఈ పుస్తకానికి శ్రీవిద్య నటరాజన్ జానపద శైలిని తలపించే రీతిలో ఎంతో చక్కని బొమ్మలు వేశారు. కవర్ డిజైన్ ఏలే లక్ష్మణ్ చేశారు.

విజయ్‌దాన్ దేథాది ఒక ప్రత్యేకమైన శైలి. ఇది కథ మొదలులోనే కనపడుతుంది. ఉదాహరణకు ‘కాకి విధానం’ కథ ఎలా మొదలవుతుందో చూడండి: ‘స్వప్రయోజనమే పూజ, స్వప్రయోజనమే దైవం. మిగిలినదంతా మోసం, దగా. దేశం, శీలం, అభిమానం అంటే ఎవరికి పట్టింది… మతం, కర్తవ్యం అన్నవి ఉత్తి మాటలు! పైన పటారం లోన లొటారం… ప్రేమ డొల్ల, హృదయం రాయి!… మునులు తెల్లగా కనపడతారు కానీ వాళ్ల హృదయాలు నలుపు. సృష్టికర్త, సర్వం తెలిసినవాడూ ప్రతి వ్యక్తి స్వప్రయోజనాలను తీర్చుగాక!’ అతని రచనలలో సుదీర్ఘమైన వర్ణనలు, ఉపమానాలు, సామెతలు ఉంటాయి.

అప్పటివరకు సంతోషంగా ఉన్న బీజా, తీజాలకు బీజా పురుషుడుగా మారిన మరుక్షణం అతని ప్రవర్తనలో మార్పు వల్ల సమస్యలు ఎదురవుతాయి. స్త్రీ కంటే పురుషుడు బలవంతుడని, అతని ముందు బలహీనురాలయిన మహిళ ఎందుకూ కొరగాదు అని అనుకోవటం మొదలుపెడతాడు బీజా.

పురుషుడు కావటంతోనూ, అధికారం రావటంతోనూ వ్యక్తులు ఏలా మారిపోతారో ఈ కథలు చూబిస్తాయి. ఉదాహరణకు ‘కొత్త దారి’ అన్న కథలో ఒక వ్యాపారి తన కూతురిని కొడుకు వేషంలో పెంచి తన స్నేహితుడైన మరొక వ్యాపారి కూతురితో పెళ్లి జరిపిస్తాడు. చివరికి అబ్బాయిగా పెరిగిన అమ్మాయి (బీజా) తానూ అమ్మాయినేనని గుర్తించి బాధపడుతుంది. ‘స్త్రీ పురుషుల మధ్య వివాహంలో అద్భుతమేముంది!’ అనుకుని వాళ్లిద్దరూ అమ్మాయి బట్టల్లో ఇంటి నుంచి బయటకు వెళ్లి ఒక దెయ్యం సహాయంతో అందమైన మహలులో ఆనంద డోలికల్లో విహరిస్తూ ఉంటారు. దెయ్యానికి పుంసత్వం ఇచ్చే శక్తులు ఉన్నాయని తెలుసుకుని తాను పురుషుడుగా మారతానని బీజా అంటాడు. అప్పటివరకు సంతోషంగా ఉన్న బీజా, తీజాలకు బీజా పురుషుడుగా మారిన మరుక్షణం అతని ప్రవర్తనలో మార్పు వల్ల సమస్యలు ఎదురవుతాయి. స్త్రీ కంటే పురుషుడు బలవంతుడని, అతని ముందు బలహీనురాలయిన మహిళ ఎందుకూ కొరగాదు అని అనుకోవటం మొదలుపెడతాడు బీజా. ఇద్దరూ అమ్మాయిలుగా ఉన్నప్పుడు రాని ప్రశ్న (‘ఈ ఆస్తికి అసలైన యజమాని ఎవరు?’) బీజా పురుషుడుగా మారిన తరవాత అతనిలో తలెత్తుతుంది. అంతే కాకుండా, ‘నా సొంత సామ్రాజ్యాన్ని నెలకొల్పుతాను. అంతులేని సంపదను కూడగట్టి పెద్ద సైన్యాన్ని తయారు చేస్తాను… నీ వంటి వాళ్లు వందల మంది నాకు రాణులై నా కోసం ఎదురు చూస్తుంటారు,’ అంటాడు. ఒక్క రాత్రి లోనే తమ మధ్య ఈ ‘నేను’ అన్నది ఎలా వచ్చిందని తీజా ఆశ్చర్యపోతుంది. బీజా తన తప్పుని తెలుసుకుని మళ్లీ అమ్మాయిగా మారిన తరవాతే వాళ్లిద్దరి మధ్య తిరిగి ప్రేమ నెలకొంటుంది.

‘ద్వంద్వ ప్రమాణాలు’ అన్న కథలో తన ప్రేమికుడైన రౌతుని దేశానికి రాజుగా రాణి ప్రకటించిన మరుక్షణం (మరుక్షణమే), ‘ఇటువంటి లంజను ఎలా నమ్మటం? పెళ్లి చేసుకున్న భర్తనే మోసగించటానికి వెనుకాడలేదు. తన పట్ల ఎంత కాలం విశ్వాసంగా ఉంటుంది?… వారిని నాశనం చేయకపోతే సింహాసనానికి అర్థమూ, విలువా లేకుండా పోతాయి,’ అనుకుంటాడు. పదవీచ్యుతుడైన రాజు, “తప్పు పూర్తిగా నాది కాదు. ఈ సింహాసనం, ఈ కిరీటానికి కూడా ఈ తప్పులో భాగముంది… తప్పులో అధిక భాగం ఈ రాజ్యాధికారానిదే,” అంటాడు.

‘సందిగ్ధ’ అనే కథలో వానర మనిషిని గొర్రెల కాపరిగా వ్యాపారి భార్య మారుస్తుంది. వాస్తవానికి అతను రాకుమారుడు. ఆ రహస్యం తెలిసి అతను తిరిగి రాజు అవుతాడని తెలిసినప్పుడు, “ఈ అడవిలోని ఆనందాలకు ఏ రాజ్యం సరితూగగలదు?” అని అడుగుతుంది. అలా అయితే తనని వానర మనిషిగానే ఉండనివ్వాల్సిందని అతను అంటాడు.

‘సందిగ్ధ’ అనే కథలో వానర మనిషిని గొర్రెల కాపరిగా వ్యాపారి భార్య మారుస్తుంది. వాస్తవానికి అతను రాకుమారుడు. ఆ రహస్యం తెలిసి అతను తిరిగి రాజు అవుతాడని తెలిసినప్పుడు, “ఈ అడవిలోని ఆనందాలకు ఏ రాజ్యం సరితూగగలదు?” అని అడుగుతుంది. అలా అయితే తనని వానర మనిషిగానే ఉండనివ్వాల్సిందని అతను అంటాడు. సింహాసన అధికారాన్ని చవి చూడక ముందే మొత్తం ప్రపంచాన్ని తన ఏలుబడిలోకి తీసుకుని రావాలని, గాలి, సముద్రం, పగటి కాంతుల మీద ఆధిపత్యం చెలాయించాలని ఉవ్విళ్లూరుతుంటాడు. రాజ్య విస్తరణ, భోగాలాలసతలో కూరుకునిపోయి ఆమెను దూషిస్తాడు.

విక్రమార్కుని సింహాసనం మీద కూర్చుంటే చాలు నోటి నుంచి సత్యం, న్యాయం ఎలా పలుకుతాయో, అలా పురుషుడిగా పుట్టినందుకు గర్వం, అహంకారం, స్వార్థం వంటివి పుట్టుకొస్తాయి. పెట్టుబడిదారీ విధానాన్ని అంతం చెయ్యవచ్చు కానీ పితృస్వామ్యాన్ని అంత తేలికగా అంతం చెయ్యలేమన్న దాని గురించి అందరం లోతుగా ఆలోచించాలి.

‘సంశయం’ అన్న కథ చూస్తే విజయ్‌దాన్ దేథా కథా నైపుణ్యం, ఆలోచనా విధానం అర్థమవుతాయి. వాస్తవానికి ఇది ఒక చిన్న కథ. రొమిల్లా థాపర్ ‘భారత కథలు’ అన్న పుస్తకంలో (ఇది విజ్ఞాన ప్రచురణల ద్వారా తెలుగులో అందుబాటులో ఉంది) ‘భూతం’ అన్న పేరుతో ఈ కథ ఉంది. దీని నిడివి ఒకటిన్నర పేజీలు. ధనిక వ్యాపారి కొడుకు పెళ్లి చేసుకుని భార్యతో ఊరికి తిరిగి వస్తుంటే దారిలో ఆమెను చూసి ఒక దెయ్యం మోహిస్తాడు. కొత్త భార్యని ఒంటరిని చేసి వ్యాపారి కొడుకు వ్యాపారానికి వెళితే అతని లాగా వచ్చిన దెయ్యం ఆమెతో కాపురం చేస్తుంటాడు. ఆమె భర్త తిరిగి వచ్చినప్పుడు అసలు భర్త ఎవరు అన్న ప్రశ్న తలెత్తుతుంది. తీర్పు కోసం రాజు దగ్గరకు వెళుతుంటే దారిలో ఒక గొర్రెల కాపరి ఒక సీసాలోకి దెయ్యం వెళ్లేలా చేసి అసలైన భర్తని గుర్తిస్తాడు. స్త్రీ ఒక వస్తువు కాబట్టి ఆమెను అసలైన యజమాని దగ్గరకు చేర్చటం ద్వారా న్యాయం జరిగినట్టు ఆ కథ ఉంటుంది.

పితృస్వామ్య కాలపు విలువలతో ఉన్న జానపద కథను ఆధునిక కాల భావాలతో స్త్రీ దృష్టి కోణం నుంచి మలచటం విజయ్‌దాన్ దేథా ప్రత్యేకత. ఈ పుస్తకంలో ఉన్న అన్ని కథలూ ఇలాంటివే. అవి మనలను ఆలోచింపచేస్తాయి, వదలక వెంటాడుతుంటాయి.

ఇందులో ఆ స్త్రీ ఆలోచనలకు ఎటువంటి తావు లేదు. ఇదే కథని ‘పహేలీ’ అన్న పేరుతో సినిమాగా తీశారు. అసలైన భర్తని గుర్తించినప్పటికీ జనాదరణ కోసం దెయ్యం తిరిగి అతని రూపంలో వచ్చాడన్న ముగింపుని సినిమాలో ఇచ్చారు. విజయ్‌దాన్ దేథా ఈ రెండింటికీ భిన్నంగా దీనిని 25 పేజీల అద్భుతమైన ప్రేమ కథగా మలిచాడు. ఆమె అందానికి వివశుడైన దెయ్యం ఆమెను ఆవహించి బాధించలేడు, ఆమె భర్తను ఆవహించినా ఆమె బాధపడుతుంది కాబట్టి ఏం చెయ్యాలో తెలియని స్థితిలో పడతాడు. వ్యాపారి కొడుకు పరదేశాలకు వెళ్లటం చూసి అతడి వేషంలో వస్తాడు. కొడుకే తిరిగి వచ్చాడని తల్లిదండ్రులు అనుకుంటారు. అటువంటిది కొత్త భార్యకి తేడా ఏం తెలుస్తుంది? కానీ, ఆమె నుంచి నిజం దాచటం అంటే ఆమెను మోసం చెయ్యటం అవుతుందని దెయ్యం నిజం చెపుతాడు.

దెయ్యం ప్రేమ లోని నిజాయితీని గుర్తించి, వెళ్లే వాడిని ఆపలేకపోయాను, వచ్చినవానిని ఎలా ఆపగలనని అతనిని భర్తగా అంగీకరిస్తుంది. దెయ్యం ప్రేమ కాంతితో సూర్యుడు మసకబారాడంట! వాళ్లిద్దరూ ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా రోజులు గడుపుతుంటారు. తల్లిదండ్రుల దగ్గర, గ్రామ ప్రజల దగ్గర మంచి పేరు గడిస్తారు. ఒక సందర్భంలో ఆమె ప్రేమ అతని హృదయంలోని విషాన్ని అమృతంగా మార్చిందని దెయ్యం అంటాడు. భార్య గర్భవతి అయ్యి, ప్రసవ వేదనలో ఉన్న సమయంలో విషయం తెలిసి, ఒక సంవత్సరం ముందుగానే అసలైన భర్త తిరిగి వస్తాడు. భార్య ప్రాణ గండం నుంచి బయటపడి ఆడపిల్లను ప్రసవించేంతవరకు బయట జరుగుతున్న గొడవ దెయ్యానికి పట్టదు. నాలుగేళ్ల ప్రేమమయ జీవితంతో అతడి తత్వమే మారిపోయింది. అతడు అబద్దమూ చెప్పలేడు, అలాగని నిజమూ చెప్పలేడు. ఆమె మర్యాదని కాపాడాలన్నదే అతని ఆలోచన. దెయ్యాలు చేసే మాయలు అతడికి అన్నీ తెలుసు కానీ మనుషుల మోసాల గురించి ఏమీ తెలియదట. ఆమె కష్టాలపాలు కాకూడదని గొర్రెల కాపరి పెట్టిన మొదటి రెండు పరీక్షల్లో నెగ్గి అనాలోచితంగా మూడవ పరీక్షలో నీటి బుర్రలోకి దూరి బందీ అవుతాడు. అసలు భర్త ఉన్న పడక గదిలోకి వెళ్లబోతూ భార్య, ‘జంతువులనైనా వాటి ఇష్టానికి వ్యతిరేకంగా నడిపించలేమే, అవి కనీసం నిరసనతో తలనైనా ఊపుతాయి. కానీ ఆడవాళ్లకు తమ సొంత మనసు ఉండే వీలుందా?’ అన్న ఆలోచనలతో కథ ముగుస్తుంది.

పితృస్వామ్య కాలపు విలువలతో ఉన్న జానపద కథను ఆధునిక కాల భావాలతో స్త్రీ దృష్టి కోణం నుంచి మలచటం విజయ్‌దాన్ దేథా ప్రత్యేకత. ఈ పుస్తకంలో ఉన్న అన్ని కథలూ ఇలాంటివే. అవి మనలను ఆలోచింపచేస్తాయి, వదలక వెంటాడుతుంటాయి.

++

పాఠకుల అభిరుచికి పెద్దపీట వేయడం కారణంగా కొసరాజు సురేష్ గారు మంచి అనువాద పుస్తకాలు అందించిన ఘనతని మాత్రమే సొంతం చేసుకోలేదు, వారు ‘మంచి పుస్తకం’ ప్రచురణ సంస్థ ట్రస్టీగా వందలాది పుస్తకాల భండాగారాన్ని తెలుగు పాఠకులకు అందించి మనల్ని సంపద్వంతం చేశారు. వారి అనువాదాల్లో గడ్డికపరకతో విప్లవం మొదటిదైతే బాబోయ్:బడి! రెండవది. మీకు పరిచయం చేసిన పై పుస్తకం మూడవది. చిన్నవి పెద్దవి కలిపి వారువంద పుస్తకాల దాకా తెలుగు పాఠక ప్రపంచానికి అనువదించి ఇచ్చారు, అందులో అత్యధిక ప్రజాదరణ, పలు ముద్రణలు పొందిన పాలో కోయిలో తాత్వక గ్రంథం ‘పరుసవేది’ని మీరు చదివే ఉంటారు. దాంతో పాటు హృదయాలను మండించే పెరుమాళ్ మురుగన్ ‘చితి’ కూడా వారు అనువదించినదే. 

e





-మార్మిక గాథలు - గాథాసప్తశతి కవితలు - తెలుగు అమవాదం : దీవి సుబ్బారావు అమవాదం: దీవి సుబ్బారావు - సేకరణ : కర్లపాలెం హనుమంతరావు ( ఆంధ్రజ్యోతి - వివిధ - సౌజన్యంతో )

 సేకరణ : 

మార్మిక గాథలు - గాథాసప్తశతి కవితలు 

- తెలుగు అమవాదం : దీవి సుబ్బారావు 


గాథాసప్తశతి పేరు వినే ఉంటారు. స్తప్తశతి అంటే ఏడు వందలు. హాలుడు అనే మహారాజు పాకృత భాషలో అప్పటికి జనసందోహంలో ప్రచులితంగా ఉన్న అనేకానేక  గాథలను సేకరించాడు. వాటిలో సుమారు ఏడువందలు తనకు ఒదిగిన పరిభాషలో ఒక క్రమం ఏల్పాటు  చేసుకుని మార్మికత"  పండులో రుచిలాగా..  కూర్చి చేసిన సంకలనం గాథాసప్తశతి. పామర జనం నోటిలో  నానే పలుకుబళ్లు శిష్ట సాహిత్య ప్రక్రియలో వదగలేవన్న పండితుల  విశ్వాసాన్ని ప్రశ్నిస్తున్నట్లు చేసిన  ఈ చిట్టి కవితల నుంచి ఆనందవర్ధనుడు, ముమ్ముటుడు వంటి ప్రఖ్యాత ఆలంకారికులు ఉదాహరణలుగా తీసుకున్న సందర్భాలు  కద్దు. 

అన్నట్లు, హాలుడు క్రీ.శ 1 వ శతాబ్దికి చెందిన శాతవాహనవంశానికి చెందిన రాజు . తెలుగువాడు. నేటి తెలంగాణా కరీంనగర్ జిల్లాకు చెందిన ' కోటి లింగాల' ను రాజధానిగా చేసుకుని శాతవాహనులు పాలించినట్లు చరిత్రకారులు నిర్ధారిస్తున్నారు. 

ఆ గాథాసప్తశతి నుంచి శ్రీ దీవి సుబ్బారావు గారు అక్టోబర్ 22, 2012 నాటి ఆంధ్రజ్యోతి దిన పత్రిక సోమవారపు సాహిత్యపుటలో ప్రచురించిన కొన్ని కవితలను  రుచికోసం శాస్త్రార్థం మీ ముందు ఉంచుతున్నాను : 

- కర్లపాలెం హనుమంతరావు 


ఒక పేదింటి ఇల్లాలి కటిక దారిద్ర్యాన్ని కవి ఇంత  కరుణారసాత్మకంగా నాలుగే  నాలుగు పాదాల్లో వర్ణిస్తున్నాడు; 


ఇంటిచూరు నుండి కారే వాననీరు 

కొడుకు మీద పడకుండా తల అడ్డుపెట్టింది/  కానీ 

తన కన్నీరే వాడిని తడుపుతొందని 

ఆ తల్లికి తెలియడం లేదు. 

( ప్రకృతి పొంగను నిరోధించగలిగినా అంతరంగ ప్రకృతిని అడ్డుకోవడం మనిషికి ఎంతటి అసాధ్యమో తెలియచేసే చిట్టి గాధ ఇది. ఇక్కడ తల్లిని మనిషికి ప్రతినిధిగా ఎంచుకోవడంలోనే కర్త ప్రతిభంతా కంటికి కడుతుంది. 


ఆనాటి కాలంలో సమాజంలో వివాహేతర సంబంధాలు విపరీతమైన మోతాదులో ఉండి వుండవచ్చు. సప్తశతిలో చాలా గాధలు ఈ వైపరీత్యాన్ని చమత్కారపూర్వితమైన మార్మికతతో వెలువరించడం గమనించవచ్చు. ఉదాహరణగా రెండు: 


అండిపెట్టి కుక్కకు 

ఆమె ఎలా తర్ఫీదు ఇచ్చిందో చూడు 

మొగుడు వస్తే మెరుగుతుంది 

మిండడొస్తే తోకాడిస్తుంది 


ఆమె చాపల్యాన్ని ఓ కుక్క ద్వారా ప్రదర్శించే మార్మికత ఈ గాధలోని విశిష్టత. 


మరొకటి: 

తొలికోడి కూతకు బెదిరి  

పక్క మీద నుంచి లేచిన వన్నె కాడా

ఇది నీ సొంత ఇల్లు, సొంత భార్య 

భయపడకుండా కౌగలించుకుని పడుకో 


సంసార సంబంధమైన చిటపటలు, అసూయాద్వేషాలు ఇప్పటికి మల్లేనే అప్పుడూ ఉన్నాయి.  ఆ గాధలకు కవితారూపాలు కల్పిస్తూ కనిపించే వాటిలో మచ్చుక్కి  మరో రెండు:


నన్నెప్పుడూ పైకి రమ్మని 

సురతము జరిపే సొగసుకాడా 

పిల్లలు కలుగలేదని 

నామీద నేరం మోపుతావెందుకు? 

బోర్లించిన కుండలో 

చుక్క నీరైనా నిలుస్తుందా ?

    నేడు ఏ డాక్టర్ సమరం చెబితేనో గాని అవగాహనకు రాని సెక్స్ సమస్యకు మూలం నాడు ఓ సామాన్యమైన  గృహిణికే ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ సమస్యకూ ఉన్న కారణాన్ని బోర్లించిన కుండతో పోల్చడం మన వేమన పద్యం శైలిని మరపిస్తుంది కదూ! 


ఇళ్లలోని సవతుల మధ్య సహజంగా ఉండే ఈర్ష్యా సూయలు  ఇక్కడ కవి ఎంత మార్మిక భావనతో వెలిబుచ్చుతున్నాడో చూడండి: 

ఆమె పెదాల  ఎరుపుదనం 

క్రితం రాత్రి 

ప్రియుడు ముద్దులలో చెరిపివేసినా 

మర్నాడు పొద్దున

సవతుల కళ్లల్లో ప్రత్యక్షమయింది 


కొంత మంది స్త్రీలు  తప్పు దారిలో నడిచారు గదా అని స్త్రీలందరినీ ఆ గాటకే కట్టివేయడం సబబు కాదు.  ఒక ఇంటి ఇల్లాలు తనకు భర్త మీద ఉండే అపరిమితమైన ప్రేమను ఈ చిట్టిగాధ ఎంత గాఢంగా వివరిస్తుందో చూడండి! 


ఊరు విడిచి వెళ్లిన భర్త 

తిరిగి వచ్చే రోజు  రాసిపెట్టింది ఆమె గోడమీద 

ఇంటి పైకప్పు చిల్లులో నుంచి 

వర్షపునీరు దిగి చెదిరిపోకుండా 

చేతులడ్డం పెట్టి కాపాడుతోంది 


మరొకటి ఇట్లాంటిదే! 


అత్తా! మలయ మారుతం వీచే పనిలేదు 

మామిడి కొమ్మలు చివురు తోడిగే పనిలేదు 

నావోడు వస్తున్నాడంటేనే 

వసంతకాలం వచ్చేసినట్లు 


ఒక ముగ్ధ తన ప్రేమ భావనతో  గాధను  ఇంత కవితాత్మకంగా మార్చేస్తుంది . నాయుడుబావను ఊహించుకుంటూ ఎంకి ప్రేమ కొద్దీ పడే భ్రాంతిలా తోచే ఈ లోతైన ప్రేమ కవితను చూడండి! 


ఎటు చూస్తే అటు 

కళ్లెదుట కనిపిస్తుంటావు 

దిక్కలన్నిటికీ నీ చిత్రపటాలు 

వేలాడగట్టినారా ఏమిటి? 


ఇక చివరగా : 

ఒక ఊరునో , సమూహాన్నో కాపాడే బాధ్యతనెత్తిమీద వేసుకున్న వీరుడి గాధ ఇది. అతని వీరోచిత రక్షణ కారణంగా ఊరంతా నిశ్చింతగా నిద్రపోతుందిటి గానీ , ప్రియాతి ప్రియమైన తన భర్తకు ఆ ధర్మకార్య నిర్వహణలో ఎట్లాంటి ముప్పు  సంభవిస్తుందో అని ఇంటి ఇల్లాలు పడే ఆందోళనా మామూలుగా ఉండదు. ఈనాటి వీరజవానుల ఇళ్లలోని పరిస్థితులు కూడా అలాంటివే. 


కత్తి గాట్లతో 

ఎగుడు దిగుడుగా ఉన్న  

వీరుడి ఎదురు రొమ్ము మీద 

భార్య సమంగా నిద్రపోలేదు గానీ, 

ఊరు మొత్తం 

హాయిగా కునుకు తీస్తుంది. 


- తెలుగు అమవాదం: దీవి సుబ్బారావు

 - సేకరణ : కర్లపాలెం హనుమంతరావు   

( ఆంధ్రజ్యోతి - వివిధ - సౌజన్యంతో ) 


 19 -09-2021 

  బోథెల్ ; యూ. ఎస్.ఎ






 


 


అట్ల పిండి - గుడిపాటి వెంకట చలంగారి హాస్య కథ - సేకరణః కర్లపాలెం హనుమంతరావు

 



(జెరుమీ' ననుసరించి) 

నా చిన్నతనంలో మాకు ఒక నాయనమ్మ వుండేది. ఆమె పేరు వెర్రి బామ్మ. కాని అట్లు బహు ప్రశ స్తంగా వొండేది. ఆవిడ చేస్తే ఇంత వరకు ఒక సారిగా, పాతికట్లకంటే, తక్కువ తిన్న వాడు లేడ' . మాలో ఆమెని, అందుక నే, ఆట్ల బామ్మ, అనేవాళ్లం. ఎల్లా చేసేదో, ఆపిండిలో “ఏంకలి పేదో' ఎనరికీ తెలియదు. ఒక సారి నేను మా చెల్లెలుగారి ఊరు నెళ్లుతున్నా. మా చెల్లెలు గర్భిణీ , "ఉండి అమ్మ అట్లు తినాలని వుందని ఉత్తరాలు రాస్తోంది. బామ్మ ఏం చేసిందం టే, పిండి కలిపి, ఒక పెద్ద సత్తెప్పాలలో వేసి, సిబ్బిబోర్లించి, గుడ్డ నా సినకట్టి, నన్ను ముందు తీసు కెళ్లీ మంది, మనకు తను బయలు దేరివ స్తానంది. చేబోల్లో మధ్య ఒక రోజు దిగాను. మర్నాడు తెల్ల వారి రైలుకొచ్చి, మూటా గిన్నె పెట్టుకుని, ప్లాటు ఫారం మీదనుంచున్నా. దగ్గర వున్న వాళ్లందరూ మూటలూ ట్రంకులూ మోసుకుని దూరంగా పోతున్నారు. కారణం తెలియక, ఎందుకన్నా మంచిది పోని అగా, నామూటా, గిన్నా తీసు కుసి, నేనూ 'వాళ్ల వెనకాల వెళ్ళి నుంచున్నా. వాళ్ళు నా కేసికోపంతో చూసి వెనక వొదిలిన చోటి కే వెళ్లి మళ్లీ నుచున్నారు. ఆలోచించా, ఎందు కొనన్ని ట్లా ఏడిపిస్తున్నా రని. ఒక వేళ ఈ అట్ల పిండి వాసనేమో. కాని మాయింట్లో వాళ్ళందరికి చాలా అలవాటే. అదిగాక ఆవాసన తగి లేటప్పటికి సంతోషంకూడానూ. ఈ కాస్త భాగ్యానికే ఇంత అడావిడా; ఎంతసుకుమారం అబ్బా అనుకున్నా. 


రైలంతా కిక్కిరిసివుంది. నేనెక్కిన పెట్టిలో ఆవూరివాళ్ళెవరూ ఎక్క లేదు. వాళ్ళు కని పెట్టెవున్నారు, నే నెక్కడయెక్కు. తానో చూ స్తో నే నెక్కి నచోట ఇదివర కే పదిమంది వున్నారు, చోటు లేద న్నారు. 


కాని నాతప్పాలముందుతోసి, 'వెనకాల 'నేనూ ఎక్కాను. తప్పాల పైన బల్ల మీద పెట్టి, ఇద్దరు లావాటి వాళ్ళు మధ్యయిరికి, చాలా వుక్కగా వుందండీ యీవాళ అన్నాను. రెండునిమషాలయింది ఒక ముసలాయన ఇటు అటు కదలడం మొదలు పెట్టాడు. "చాలా ఉక్కగా వుందండీ యిక్కడ" అని పెద్దటంకోటి మోసుకొని బయటికి బయి లు దేరాము. ఇంకోచోట అసలు ఒక రిమీద ఒకరునుంచున్నారండి" అన్నా ఆగ లా. రెండోలా వాటాయనకూడా లేచి వెనకాల వెళ్ళాడు. ఒక గ్ని వొదిలి ఒకరు ఉండ లేరుగాబోలు అనుకొని, హాయిగా సద్దు కున్నాము. ఇంతలో తక్కినవాళ్ళందరూ హూ, హూ" అని ముక్కులో అనడం మొదలు పెట్టారు. ఒకాయనమీద తెల్లనిబొట్టు పడ్డది, పైకి చూస్తే తప్పాల్లో పిండి కారుతోంది. బండి అంతా పరిమళం. అశాత్తుగా ఒక మాటైనా ఆడకుండా, నలుగురు లేచి బస్తాలు', టం కుబు, దింపుకుని, బయిటికి నడిచారు. మిగిలిన వాళ్లం హాయిగా కాళ్ళుజాచుకున్నాం. మిగిలిన వాళ్లల్లో ఒక బ్రాహ్మడు, శవాలుమో శే వాడిలాగున్నాడు, కుళ్ళిన పసిపిల్లశవంవాసన” అన్నాడు. ఆమాట తో అదిరిపడి, ఇంకా ముగ్గురు లేచి, ఒకళ్ళ కాళ్ళకి ఒకళ్ళు అడ్డుపడు తో, బండిలో నుంచి కిందికి దొర్లారు. రైలు కదుల్తోంది. ఆఖరికి ఆ బండికల్లా నేనూ పచ్చకోటాయినా మిగిలాము. “ఏమిటండీ ఈ కొంచానికి యింత అడావిడీ చేస్తారు. వీళ్ళు? అంతా వేషం!” అన్నాడు. ఆయనికి చాలా జలుబు చేసింది కాని రైలు బయలు దేరిన కాసేపటికల్లా, ఒక్కసారి గాలిరివ్వునకొట్టేప్పటికి, చాలా బాధపడడం మొద లు పెట్టాడు. ఆ జలుబూ గిలుబూ వొదిలిపోయింది. తరవాత స్టేషను లో కాఫీ తాగొస్తానని దిగి ఇంకో బండిలో ఎక్కేశాడు. చాలా నీచ మయిన పని చేశాడనుకున్నా. 


తరవాత, బండీ అంతానా దే. ప్రతి స్టేషనులో మనుషుల్ని హా యిగా వొక్కణ్ణి ఇటూ అటూ చూస్తే నిశ్చింతగా కూచున్న నన్నూ నాబండినీ చూసి, కళ్లుకుట్టి, ఒ రేయ్ శంకరయ్యా! కాళీ బండిరా. ఇట్లారా, అని టంకులూ, సంచులూ మోసుకొచ్చి; తలుపు తెరచి మెట్లెక్కి; ముక్కుతో ఇటూ అటూ వూది, బండి కేసీ నా మొహం కేసీ, చూసి: అమాంతం వెనకాల వాళ్ల మీద విరుచుకు పడేదీ. అందరూ అంతే, ప్రతి స్టేషను దగ్గిరా, అంతే. ఏమెరగనట్టు, అటు కేసి మొహం తిప్పేసి కూచున్నా. రయిలు కదలుతున్నా, అట్టే వుండి పోయినారుగాని, నాబండిలోమాత్రం ఎక్కలేదు. 


గిన్నె దించుకొని, హాయిగా, గోదావరి స్టేషనులో దిగాను. కూలీ మాయింటిదాకా ఒక అణాకి గిన్నె మోసుకొస్తానన్నాడు. గిన్నె నెత్తి మీద పెట్టాను. దించాడు. రానండి” అని, వెళ్లిపోయా షు. ఇదంతా చూస్తున్న ఇంకోడు ఆలోచించి, రెండణాల కొస్తానన్నాడు. గిన్నె నెత్తిని పెట్టుకున్నాడు. కష్టంతో బళ్ల దాకా నడిచాడు. దింపాడు. “నాచాత కాదండి బాబూ” అని వెళ్లాడు. పావలా యిస్తానని కేకేశా. మాట్లాడకుండా నెత్తిమీద గడ్డ తీసుకొని, వాసన చూసు కుంటూ, పోతున్నాడు. . 


ఆఖరికి అర్ధరూపాయికి బండిమాట్లాడు కోన్నాను, వాడు మాతం వొదల దలచుకోలా, అసలు గెడణాలు మమూలు, మా చెల్లెలగారింటికి ఒక నిముషం తరువాత బాబూ కేవు చాలదు. ముప్పావలా యిప్పించాలి'' అన్నాడు. కొంచెం దూరం తలాడు. 1.ఒక రూపాయి యిచ్చినాకష్టం చాలదు” అని ఆ పొడు. ఏ కష్టం? అది అతనికే తెలియాలి. ఎంతకష్టగా లేకపోతే. అంత సశ్యం - పీలుస్తాడు? సరేనన్నా, ఏం చెయ్యను. అంతకంటే, మళ్లిరూపాయి న్నర కావాలి అనపోతున్నాడు. ఇంతలో గోదావరిమీద నించి గాలి విసరింది. ఎద్దు వేపు, ఎద్దు పరుగు మొదలు పెట్టి , గుగం పసి కిరాదు. వెనక నుంచి ఏం వస్తుందను కొన్నదో. ఏమిటో బండి ఎవరి మీదనించన్నా పోతుందనుకొన్నా, కాని బండీ రాకముందే, గాలి తగల గానే ఎక్కడున్న వాళ్లు అక్కడే ఇళ్లల్లోనికి, దుకాణాల్లోకి, పక్క.. సందుల్లోకి తప్పుకున్నారు. ఇంటి దగ్గర బండి ఆగి తేనా? నలుగురు  ఎద్దుని పట్టుకున్నారు. ముక్కు లవత లికి తిప్పేసి అప్పటి కే ఆగకపోయ్వే దే? బండివాడు దూకి ఎగ్గుముక్కు కి గుడ్డకప్పేసి, సశ్యం వాసన చూపించక పో తే ఇంటిలో పనికి వెళ్లాను. - గిన్నా నేనూ, చెల్లెలూ పిల లూ పరిగెత్తుకుంటూ వొచ్చారు. అన్నయా" అనీ, మామ య్యొచ్చాడు, మామయొచ్చాడ, నీ గదిలోకి. గుమ్మం దగ్గిర అందరూ తటాలున ఆగారు, కష్టంమీద మా చెల్లెలుమాతం మొహంమీద పమిట కొంగు కప్పుకొనివచ్చి, యేడుస్తో సన్ను కావలించుకొని, ( అన్నయ్యా! యెందుకు దాస్తావు? చెప్పునాతో ". యేం ఘోరం జరి గిందో,, అంది. ఏం లేదమ్మా బొమ్మయిచ్చిన అల్లు-డి,, అన్నాను. 


బామ్మ రాత్రిక్కూ ఔరా లేదు. మూడు రోజులు చూశాం రా లేదు. ఏకదిపితే ఏ నువుతుందో అని ఆగిన్నెనీ ఆట్లా నేవుంచా.. ఆతలుపు సూత్రం గొళ్లెం వేసి, 'TVళం వేసి, శీలు చేసి, చిల్లుల్లో గుడ్డ పేలిశలూ అవీ కు క్కొ ము. ఎవరం 3 వేపుపో లేదు. నేను స్నా ను చేసి, సబ్బుతో కడుక్కు.. న్నా ; కాని ఇంకా బజార్లలో సాగాలితగలగానే మనుషులు, కలెక్టరు మోటారు ముందు.. తప్పుకు సేట్టు, తప్పుట, మాన లేదు. ఇండు రోజులు : డి మా చెల్లెలు, లుట్లఆశ వదలుకొని ఇక వూరుకో లేక ( ఈ పిండి బొమ్మ యే" చెయ్యముంది?” అని అడిగింది. 


"నేనొచ్చిందాకా, ముట్టుకోకుండా, అట్లా నే వుంచేమ ద” న్నాను. చెప్పుడ మెందుకు? దాన్నెవరు కదిలిస్తారంది. మూడు రోజులూ అయింది. పిల్లలు కొంచెం నలతగా కనపడ్డారు. ఆదుకోరు. అక్కడ క్కడ దిగులుగా చతికిలబడతారు, చంటిపిల్ల కారణం లేకుండా మారాంపట్టి యేడుపు.బామ్మకి ఉత్తరాలు రాశాం; రిప్లయి ప్రీపెయిడు "టెలిగ్రాములిచ్చాం ! 

జవాబుగా లేదు. నాలుగో రోజున నూ చెల్లెల : ది 44ఒక రూపాయి ఇచ్చి, దీన్నీ అపతలపా గేయిస్తే బొమ్మ కోప్పడు తుందా? 13, తప్పకండా కోప్పడుతుంది. ఎన్నడూ ఇంక అట్లు చే య్యదు. నవ్వదు. మాట్లాడదు. మని మొహం చూడదు. అయినా 


బ రూపాయికి ఎవడు పారేస్తాడు? వొట్టిపీనిక్కి.. పప్ రూపాయిలు తీసు కుంటాడే”, అన్నా ను. 


వాసన ఇల్లంతా వ్యాపించింది. పెద్దమ్మాయికి విరోచనాలు; అబ్బాయికి జ్వరం; చిన్న పిల్లకి పొంగు; మా చెల్లెలికి ఆరో నెలనే నెప్పులు. ఏం చెయ్యం ? ఎవరితో చెప్పకండా ఇల్లు తాళం వేసి, సత్యానికి పోయాము. 


ఇన్నాళ్ళు మా బావ వూళ్ళో లేను. మేముసతాని కెళ్లిన మర్నాడు వూళ్ళోదిగి ఇల్లు తాళం వేసుం టే మమ్మల్ని వెతుక్కుంటూ వొచ్చాను. అతని వెనకాల పెద్దగుంపు. చుట్టుపక్కల వాళ్ళ-దరూ “ఇల్లు తెరుస్తారా లేదా?లో పలనూరుకూనీల న్నా జరిగాయి. మరియాదస్తు లనుకున్నా ము. సత్యానిగొస్తే దాగుతుందా!,, అని ఒక బే అరుపులు, మునిసిపాలిటీ వారు ఇల్లుతగల పెట్టటానికి సిద్ధంగా ఉన్నారు. ఏ చెయ్యం? జబ్బు పిల్ల ల్నే సుకొని వెన కాలి కెళ్లాము." 


అగ్గ రాతి నేను మా బావా మూతులకి గుడ్డలుకట్టుకుని, ఒక సెటుబుడ్డి మీదగుమ్మరించుకుని ఆతప్పాల బుజాలమీద మోసు కుంటూ, గోదావరి వేపు బయలు దేరాం. సిద్దర్లో మనుషులు కలవరిం చారు, కేకలు పెట్టారు. తొందరగా వెళ్లి, శాషయ్య మెట్టదగ్గిర నావ తీసుకుని నీళ్ల మధ్య కుపోయి గిన్నె పాళం " గోదావరిలో పడేశాం. నీళ్ల ల్లో పిండి పారపోసి గిన్నె తెచ్చుకోవాలని బుద్ధి పుట్టింది. కాని మూత తీస్తే, లోపలినించి ఏమొస్తుందో, ఏదన్నా విషజంతువు బయలు దేరు తుందేమో అని భయమేసింది. "రెండు రోజుల్లో శేషయ్య మెట్ట గుమ్మెత్తి పోయింది, ఒక్కరూ నీళ్ళుముంచుకోరు. ఏదో చాలా వుపదవం రాబోతుదని వూళ్ళోపు కారు. రైలుబ్రిడ్జి మీద, రూల్సుకి వ్యతి ప్రేకం గా, ముప్పైమైళ్ళ వేగంతో “పోతూంది. "పెద్ద పెద్దచాపలు చచ్చి తేలు తున్నాయి. కాని ఒక్కరూ వాటి నిముట్టుకోరు. గోదావరి దా టే పిట్ట 


లు గిరగిర తిరిగి నీళ్లల్లో పడుతున్నాయి. చివరికి పడవలూ వలలూ వేసు కుని, 


గోదావరి కెలికి, గిన్నె సిపట్టి బయిటికితీశారు. యెట్టాక నుక్కున్నా 






సాహితి 


గో, ఏమో, హాయిగా నిదపోతున్న ఇంటిల్లిపాదికి ,అర్ద రాతి హటాత్తుగా మెళుకువవొచ్చింది. వూపిరిపీల వడం అసాధ్యమై తంటా లుపడ్డాం. వెంటనే లేచి లాంతర్లు వెలిగించి ఆవుపదవం ఏమిటని వెడితే, అరుగుమీద ఆగిన్నె వుంది. వెంటనే ఆగిన్నెని తీసి కెళ్ళి వూరిబయిట దూరంగా స్మశానంలో, నిలువులో తున గుంటతీసి పాతి పెట్టించాము. మర్నాటికి కలెక్టరుకీ చైర్మనికీ పెద్దమాన్ స్టరు అర్జీలు వెళ్ళాయి. వాసనకి దెయ్యాలన్నీ లేచి స్మశానంలోంచి వూళ్ళోకి బయలు దేరాయట. మునిసిపాలిటీ వారు మమ్మల్ని బలవంతం చేసి, ప్రా సిక్యూషన్ చేస్తామని బెదిరించి, ఆ గిన్నె తవ్వించారు. చివరికి ఒక మంచి సంగతి ఆలోచించాము అనంతపురంలో 'మేము ఒకరికి అయిదు వేలు బాకీ, ఆయన పేర దీన్ని బంగీ కట్టి పోస్టాఫీసుకు తీసి కెళ్ళాము. యిరవయి రూపాయిలు లంచమిస్తే నేగాని ఆగుమాస్తా బంగీ తీసుకోలా. ఆరోజు మధ్యాహ్నం నుంచి పోస్టాఫీసుకీ పక్కనున్న మునిసిపల్ ఆఫీసుక 


సెలవు, ఆసాయంతం రైలు గోదావరి స్టేషన్కి అరమైలుముందే ఆగింది మరతిప్పి నా యిజన్ కదల లేదు. చివరికి యేం చేశారో తెలియదు. వారాపతికల్లో మాత్రం యెన్నడూ లేనిది అనంత పురంలో ప్లేగు 


మొదలు పెట్టిందని చదివాము. ఆయన ఇంతవరకూ అప్పుకోసు అడ గలేదు. ఆయనకి ఆరుగురుకొడుకులూ పదిమందిమనతులూవున్నారు. 


వాళ్ళెవరూ ఇంతవరకు మాకువు త్తరం రాయ లేదు. 

***


Thursday, December 9, 2021

కథలు రాసేందుకు సామాజిక అవగాహన చాలా? - పి.రామకృష్ణ - సేకరణ : కర్లపాలెం హనుమంతరావు

 కథలు రాసేందుకు సామాజిక అవగాహన చాలా?

- పి.రామకృష్ణ 


ఒకప్పటి కదలకంటే ఇప్పుడు వాటి సంఖ్య పెరిగింది. వస్తు విస్తృతీ పెరిగింది. అయితే, అప్పటి కథలు ఇచ్చిన సంతృప్తినీ, ఒస్పందననూ ఇప్పటి కథలు ఇస్తున్నాయా? పాత్రలతో సహా అప్పటి కథలు ఇప్పటికీ జ్ఞాపకంవున్న సంగతి తల్చుకుంటే, ఇవ్వడం లేదని ఒప్పుకోవలసిందే. ఎందుకని? ఇప్పటికీ సాహిత్యం చదివే పాఠకులతో ఈ అంశం చర్చించా లనే ఈ ప్రస్తావన


స్వేచ తనకు అవసరమైనంత మేరకు విస్తరించి, తననొక స్వతంత్ర ప్రక్రియగా ప్రకటించుకునేది. కథా ప్రతిపాదన నచ్చినా నచ్చకపోయినా దాని నిండు దనంలో లోపం వుండేది కాదు. ఇప్పుడు కథకు ఆ స్వతంత్రం లేదు. కథకు లేదంటే కథకు లకు లేదనే అల్లసాని పెద్దన కోరికల్లాంటివి అవసరం లేదు కానీ, అందులో మొదటిదైన 'నిరుపహతి స్థలం' అంటే నిబం ధనలు లేని జాగా కథకు అవ సరం. అది నేటి పత్రికల్లో లభ్యం కావటం లేదనేది అందరికీ తెలి సిందే కనుక, ఆ సంగతి వది లేద్దాం. అయితే, ఆ ఏకైక కారణమే కథ ఈ స్థితిలో వుండటానికి కారణమా అని మాత్రం ఆలో చించాలి. ఒక్క వాక్యం కూడా సాహిత్యమవుతుందని ఇంతకు ముందు పెద్దలు చెప్పారు. ఆ లెక్కన చిన్న కథకైనా సాహిత్యం కాగల అర్హత వుంటుంది. కథ సాహిత్యమైతే తప్పనిసరిగా స్పందింపజేస్తుంది. మరి ఇప్పటి కధ 'బావుంది' అనిపించడం మినహా, ఎప్పటికీ జ్ఞప్తికుండేలా ఎందుకు చెయ్యలేకపోతోంది? అది చెప్పవలసిన బాధ్యత ఈ ప్రస్తావన తెచ్చిన నామీదనే


ఉందని అనుకుంటున్నాను. అయితే, నేను చెబుతున్న


కథ చదివినప్పుడు తప్ప తర్వాత జ్ఞాపకం లేకుండా పోతున్నది. అందుకు కారణం కథకులకు సాహిత్య నేపథ్యం లేకపోవడం. సమాజంలో మనం చూస్తున్న అసమానతలనూ, అన్యాయాలనూ ఎత్తిచూపేందుకు సాహిత్య అవగాహన అక్కర్లేదు. సామాజిక అవగాహన చాలు అనే అభిప్రాయమూ వినిపిస్తూ వుంది. సామాజిక అన్యాయాలను సాహిత్యం ద్వారా చెప్పదల్చుకున్నప్పుడు, అది సాహిత్యం అవ్వాల్సిన అవసరం వుంది కదా!


కారణాలు నా అభిప్రాయాలే. ఇవి ఇంకే ఒకరిద్దరి అభిప్రాయాలైనా


నా ప్రయత్నం ఫలించినట్లే.


కథా రచన అనేది ఒక సృజనాత్మక ప్రక్రియ. ఈ అభిప్రాయాన్ని ఎవ్వరూ వ్యతిరేకించరనుకుంటున్నాను. అంటే, కథకు తగినంత స్థలం వుండటం అవసరమే అయినా, అంతకంటే ముఖ్యం అది సాహిత్యం అవడం. సమాజంలో జరుగుతున్నవి మాత్రమే చెబితే అది సాహిత్యం అవదు. కథకుడి సృజన సామర్ధ్యమే దాన్ని సాహిత్యం చేస్తుంది. ఆ సృజనశక్తి ఎలా వస్తుంది? సాహిత్య నేపథ్యం దాన్ని సమకూరుస్తుంది. కధ సాహిత్యమయిందా, లేదా అని పాఠకులు ఆలోచించాలని కాదు. స్పందింపచెయ్యడంలోనే ఆ సంగతి నిర్ణయమవుతుంది. అందుకు పాఠకులకు పరీక్ష అవసరం లేదు. స్పందింపచెయ్యకపోతే, 'బావుంది' అనే తాత్కాలిక పరిమిత స్పందన వరకే పాఠకులుండిపోతారు. అదీ సమస్యనైనా సరిగా చెప్పినప్పుడే.


అందువల్లనే కథ చదివినప్పుడు తప్ప తర్వాత జ్ఞాపకం లేకుండా పోతున్నది. అందుకు కారణం కథకులకు సాహిత్య నేపథ్యం లేకపో వడం. సమాజంలో మనం చూస్తున్న అసమానతలనూ, అన్యాయా లను ఎత్తిచూపేందుకు సాహిత్య అక్కర్లేదు. అవగాహన సామాజిక అవగాహన చాలు అనే అభిప్రాయమూ వినిపిస్తూ. వుంది. సామాజిక అన్యా ద్వారా చెప్పదల్చుకున్న పడు. అది సాహిత్యం అవ్వాల్సిన అవసరం వుంది కదా!


ఇప్పటి కథకులు సాహిత్య సంబంధం లేనివాళ్ళయితే, మరి వున్నవాళ్ళు రాయొచ్చు. అనవచ్చు. రాయొచ్చు. కానీ వాళ్ళకు వుండదు. సృజనకు పూర్తి అవకాశం లేని కథ రాయడంపై వాళ్ళకు ఆసక్తి వుండదు. సాహిత్య పరిచయం వుండీ, ఒకప్పుడు కథలు రాసీ, ఇప్పటికీ ఉన్నవాళ్ళు కథలు రాయడం మానెయ్యడానికి ఓపిక లేకపోవడమే కాక అదీ కారణం కావచ్చు. ఇంతకూ చెప్పదల్చుకున్నది ఒక్కటే. భౌతిక నిర్మాణానికే కాదు, భావ నిర్మాణానికైనా పునాది అవసరం. అది రచయితలకే కా, పాఠకులకు అవసరమే. లేకపోతే, ఏది సాహి త్యమో తెలీకపోవడమో, ఏదైనా సాహిత్యమనుకునే పరిస్థితో ఏర్పడే ప్రమాదం వుంది. నిజానికి, ఈ ప్రమాదాన్ని రెండుగా చెప్పనక్కర్లేదు. ఏది సాహిత్యమో తెలీనప్పుడు, ఏదైనా సాహి తమే అవుతుంది కదా!


పి. రామకృష్ణ

( సేకరణ : కర్లపాలెం హనుమంతరావు ) 

Tuesday, December 7, 2021

మహాభారతంలో ధర్మరాజు చేసిన సూర్యస్తో త్రములోని ప్రకృతికి సంబంధించిన కొంత భాగం- ( వనపర్వం - 13 వ అధ్యాయం- శ్లో 14-25 )

 



మహాభారతంలో  ధర్మరాజు చేసిన సూర్యస్తో త్రములోని ప్రకృతికి సంబంధించిన కొంత భాగం- 

( వనపర్వం - 13 వ అధ్యాయం- శ్లో 14-25  ) 


త్వమాదాయాం శుభి స్తేజో నిదాఘే సర్వదేవానామ్ । సర్వేషధిరసానాం చ పునర్వరాసు ముఖ్చసి।


14


మీరు గ్రీష్మఋతువునందు మీ కిరణములచే సమస్త దేహ ధారుల యొక్క తేజమును సమస్త ఓషధుల యొక్క రసము యొక్క సారమును ఆకర్షించి తిరిగి వర్షాకాలమున దానిని వర్షిం జేయుచున్నారు


తపన్త్యన్యే దేహన్త్యన్యే గర్జన్యన్యే తథా ఘనాః ॥ 

విద్యోత స్ర్తీ ప్రవర్షన్తి తవ ప్రావృష రశ్మయః ॥


15


వర్ష ఋతువునందు మీ యొక్క కొన్ని కిరణములు తపించుచు కొన్ని మండింపజేయుచు కొన్ని మేఘములై గర్జించుచు కొన్ని మెఱుపులయి మెఱయుచు కొన్ని వర్షించుచు ఉన్నవి.


న తథా సుఖయత్యగ్నిర్న స్రావారా న కమ్బలాః | శీతవాతార్దితం లోకం యథా తవ మరీచయః ॥


10


శీతకాలపు గాలిచే పీడింపబడిన జనులకు మీ కిరణము లెంత సుఖమును కలుగ జేయునో అంత సుఖమును అగ్ని కాని కంబళ్ళు. కాని వస్త్రములుకాని కలుగ చేయజాలవు


త్రయోదశ ద్వీపవతీం గోభిర్భాస యసే మహీమ్ । త్రయాణామఎ లోకానాం హితాయైకః ప్రవర్తనే॥


17


మీరు మీ కిరణములద్వారా పదమూడు ద్వీపములతో కూడిన ఈ భూమిని ప్రకాశింపజేయుచున్నారు మఱి యు ఒంటరిగనే ముల్లోకములకును వాత మొనర్చుచున్నారు


తవ యద్యుదయో న స్యాదగ్ధం జగదిదం భవేత్ | 

న చ ధర్మార్థకామేషు ప్రవర్తేరన్ మనీషిణః ||


18


మీరు ఉదయించనిచో ఈ జగత్తంతయు గ్రుడ్డిది యగును మఱియు విజ్ఞులు ధర్మ అర్థ కామ సంబంధ కర్మములందు ప్రవృ త్తులే కారు


ఆధానపశుబన్ధేష్ణ  మ శ్రయజ్ఞ తపః క్రియాః | త్వత్ప్రసాదాదవాప్య ర్తే బ్రహ్మక్షత్ర విశాం గణైః || 


19


అగ్ని స్థావన పశువులను కట్టుట పూజ మంత్రములు యజ్ఞానుష్ఠానము తపస్సు మున్నగు క్రియ లన్నియు మీ యొక్క కృపచేతనే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులద్వారా జరుపబడు చున్నవి.


యదహర్ర్బహ్మణః ప్రోక్తం సహస్రయుగ సమ్మితమ్ | 

తస్య త్వమాదిర న్తశ్చ కాలక్షైః పరికీర్తితః ॥


20


వెయ్యి యుగములతో గూడిన బ్రహ్మ దేవునియొక్క దిన మేది చెప్పబడినదో కాలమానము నెఱిఁగిన విద్వాంసులు దాని ఆది అంతములు మీరే యని చెప్పుచున్నారు


మనూనాం మరుపుత్రాణాం జగతో మానవస్య చ | 

మన్వ స్తరాణాం సర్వేషామీశ్వరాణాం త్వమీశ్వరః ||


21


మనువు యొక్కయు మను పుత్రులయొక్కయు జగత్తు యొక్కయు అమానవునియొక్కయు మన్వంతరము లన్నిటి యొక్క యు ఈశ్వరులయొక్కయు ఈశ్వరుడు మీరే అయి యున్నారు.


సంహారకాలే సమ్ప్రా ప్తే  తవ క్రోధ వినిః సృతః | 

సంవర్తకాగ్ని స్త్రైలోక్యం భస్మీకత్యావతిష్ఠతే ॥


22 


ప్రళయకాల మేతెంచగా మీ వలన ప్రకటనగు సంవర్తక మను అగ్ని మూడు లోకములను భస్మ మొనర్చి తిరిగి మీ యందే స్థితిని పొందుచున్నది


త్వద్దీధితి సముత్పన్నా నానావర్ణా మహాఘనాః ।

సైరావతాః సాశనయః కుర్వన్త్యాభూత సమ్లవమ్ ॥


23 


మీ యొక్క కిరణముల చేతనే ఉత్పన్నములగు ఐరావతాది రంగురంగుల మహామేఘములు మెఱపులు సమస్త ప్రాణుల యొక్క సంహారము నొనర్చుచున్నవి.


కృత్వా ద్వాదశధాత్మాZZనం  ద్వాదశాదిత్యతాం గతః | సంహృత్యై కార్జనం సర్వం త్వం శోషయసి రశ్మిభిః || 


24


పిదప  మీరే మిమ్ములను పండ్రెండు స్వరూపములుగ విభ జించుకొని పండ్రెండుగురు సూర్యుల రూపమున ఉదయించి మీ కిరణములద్వారా ముల్లోకములను సంహార మొనర్చుచు ఏకార్ణ వము యొక్క జలమునంతను శోషింప చేయుచున్నారు.


త్వామిన్ద్రమాహు స్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం ప్రజాపతిః | త్వమగ్నిస్త్వం మనః సూక్ష్మం ప్రభుస్త్వం బ్రహ్మ శాశ్వతమ్ ||


25 


మిమ్ములనే ఇంద్రుడని చెప్పుచున్నారు మీరే రుద్రుడు మీరే విష్ణువు మీరే ప్రజాపతి అగ్ని సూక్ష్మమనస్సు ప్రభువు సనాతన బ్రహ్మము మీరే అయి యున్నారు


- సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

01 - 12 - 2021 


మాతృక : భారతరత్నాకరము 

ఎమర్జెన్సీలో వచ్చిన తెలుగు లొంగుబాటు కవిత్వం

 


6:28 PM

 

సుడిగాలినెదుర్కునేదే అసలయిన పాట

 

పేరుకే ప్రజాస్వామ్యం. దానికి కష్ట మొచ్చినప్పుడు మన తెలుగు కవులు నిర్వహించిన పాత్ర ఆశ్చర్యం కలిగిస్తుంది. లబ్దప్రతిష్ఠులు ఎందరో ఇందిరమ్మ అత్యవసర పరిస్థితికి వత్తాసుగా కవిత్వం రాయడం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఈ అమ్ముడుపోయిన కవులలలో శ్రీ శ్రీ గురించి అందరం చెప్పుకుంటుంటాం. ఆయనకు తోడుగా జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సినార్, ప్రభుత్వ కవి దాశరథి, జె,బాపురెడ్డి, భీమన్న, దివాకర్ల, పరిమళా సోమేశ్వర్, ముని సుందరం, పి.ఎస్. ఆర్. ఆంజనేయ శాస్త్రి, గుత్తికొంద సుబ్బారావు, విహారి&శాలివాహన, జ్యోతిర్మయి, లసూరా, భద్రిరాజులు గట్రా.

జనం శ్రమ నుంచి ముక్కు పిండి వసూలు చేసిన సొమ్మును సర్కారిచ్చే సంబావనల కింద పుచ్చుకుని పేదల గురించి కన్నీళ్లు పెట్టుకున్న కవులు కొందరైతే, ఇవాళుండి రేపు పోయే ప్రాణానికి భయపడి కలాన్ని కదిలించిన ఉద్యమకవులు ఇంకొందరు. అలవాటుగా ప్రభుత్వం ఏది  చేసినా తప్పెట్టలు కొట్టే  పాంప్లెట్ కవులను గురించి పెద్దగా చెప్పుకొనవలసిన అవసరం లేదు. కానీ అప్పటి వరకు తమ భావజాలమని సగర్వంగా ప్రకటించుకున్న ఉద్దేశాలకు పూర్తి విరుద్ధంగా ప్రసిద్ధ కవులు రాసిన కవితలే అబ్బురం కలిగిస్తాయి.

 

దేశీయులలో తనకు కలిగిన అప్రతిష్ట సంపూర్ణంగా తెలిసున్న ఇందిర కొత్త పంథాలో కొద్ది మంది మేధావులకు ఇన్ని రొట్టె ముక్కలు విసిరి పోగుచేసుకున్న ప్రగల్భాల కవిత్వాన్ని పాకెట్స్ రూపంలో విదేశాలలో పంచి ప్రపంచం దృష్టిలో తానో విప్లవ పాలకురాలిగా ముద్ర వేయించుకునే ప్రయత్నం అప్రతిహతంగా సాగింది. 'ఇందిరే ఇండియా.. ఇండియానే ఇందిర' అనే భావన బలంగా ముద్రపడే దిశగా అంతఃపుర తైనాతీలు చేపట్టని నికృష్ట చర్యలు లేవు. దేశంలోని ఇతర ప్రాంతాల ప్రతిస్పందన గురించి ఇంత చిన్న వ్యాసంలో వివరంగా చర్చించుకోడం కుదరదు. కానీ తెలుగు గడ్డ వరకు కవులు ప్రజావ్యతిరేకతకు స్వార్థబుద్ధితో చేసిన కొంత లాలూచీ చీదర కవిత్వం గురించి రేఖామాత్రంగా చెప్పడమే ఇక్కడ ఉద్దేశం.

 

కొంత మంది తెలుగు కవుల  కవిత్వం ఏ విధంగా సాగిందో ఓసారి తిలకించి తరిస్తారనే ఈ చిన్న వ్యాసం.

వీర నారి మన ఇందిర

విజయ శంఖ మూదిందిరా!

ప్రజాస్వామ్యమును పడద్రోసే

వారిని అణచి వేసిందిరా!

  • అనే పదాలతో గవర్నమెంట్ కవి దాశరధి తొలి శంఖం పూరించారు. ప్రజాస్వామ్యాన్ని పడద్రోసిందెవరు? ఇందిరాగాంధీనా, జయప్రకాశ్ నారాయణా, మొరార్జీయా, అటల్ బిహారీ వాజ్ పేయీనా? నిజాం రాజు బూజు దులిపిన ఉద్యమంలో ఘనమైన పాత్ర వహించినట్లు చెప్పుకునే దాశరథి కే తెలియాల్సుంది.
  • 'ప్రగతి శక్తుల బలం పెరిగింది నేడు

విషమ శక్తుల నడుం విరిగింది నేడు'

తన పేరుకు ముందు జ్ఞానపీఠ పురస్కారం గ్రహీత అని ట్యాగ్ లైన్ తాగిలించుకోనిదే తోచని కవి సి. నారాయణరెడ్డిగారి స్త్రోత్ర గానం ఇది.

'పూర్వదిక్కున పూర్వ పుణ్యమే దిక్కుగా

హృదయేందిరదె వెలసె, హృదయ మ!' అని బోయి భీమన్నగారు ఉద్బోధన సాగిస్తే ..

దివాకర్లవారు సైతం తన వంతు పంచరత్నాలతో నియంత  ఇందిరమ్మకు మరింత శొభను చేకూర్చే  అలంకారాలు సమకూర్చి  ధన్యులయారు.

 పెద్దలే ఈ మాదిరి తమ దద్దమ్మతనం నిర్బీతిగా ప్రకటించుకున్న సందర్భంలో అసలు సిసలు గవర్నమెంట్ పాంప్లెట్ జె. బాపురెడ్డి అధికారంలో ఉన్నవారిని అన్ని విధాలా ప్రస్తూతిస్తూ కవిత్వం రాయడంలో అబ్బురమేముంది.  

ఆయనగారి కవిత్వం ఎలా సాగిందో జస్ట్ మచ్చుక్కిః

'అరాచకత్వ వర్షం వెలిసింది

అలజడుల బురద బెడద తగ్గింది

ఇరవై రంగుల ఇంద్రధనుస్సు

ఈ దేశాన్ని పాలిస్తున్నది'

ఇందిరమ్మ ఇరవై సుత్రాల పథకం ఇరవై రంగుల ఇంద్రధనుస్సు లా తోచింది కవిగారికి.

పరీక్ష సమయం వచ్చింది

విజృభించింది ఇందిరా ప్రియదర్శిని'

అంటూ పరిమళా సోమేశ్వర్ గారు మరో తప్పెట పుచ్చుకున్నారు అప్పట్లో.

 ముని సుందరం అనే మరో కవిమహాశయులకు ఈ మాత్రం నాజూకుతనం కూడా నచ్చింది కాదు ప్రగతి శీల శక్తుల పట్ల ఆయనకున్న కక్షనంత ఆక్షరాలలో కూర్చి మరీ 'పత్రికల్ని, ప్రజా వ్యతిరేకుల్ని బుట్టలో బంధించిన యీ దినం - నీకూ నాకూ పర్వం' అంటు అత్యవసర కాలపు అఘాయిత్యాలను సూటిగా ఎదుర్కొన్న పత్రికలను, ప్రజలను తిట్టిపొసేశారు. అతనికి చరిత్ర చెప్పిందట సామాన్యులు కోరేది హక్కులు కానే కాదుట!

'బ్రేకుల్లేని బ్రెయిన్లతో జాతి జీవనాన్ని

కలుషితం చేస్తున్న కడు పెద్ద మనుషులు..

అందుకే ఈ అత్యవర పరిస్థితి '

అంటూ ఇంత 'కూడూ-గుడ్డా-గూడా' సంపాదించుకుని తరించాడు.  సరసుడు- పాపం -ఆధునికుడు.

పి.ఎస్. ఆర్. శాస్త్రి కైతే 'ఇదే ఇదే శాసనాసి - పాపం, శమించుగాక!

ఇక గుత్తికొండ సుబ్బారావు, విహారి & శాలివాహన & కో, జ్యోతిర్మయి, లసూనా, భద్రిరాజులు  ఈ దారిలో సాగిపోయిన 'బాటసారులు' .

ఇక్కడ పేర్కొన్నది కొద్ది మంది మాత్రమే. ప్రసిద్ధులు, కాస్తో, కుస్తో పది మంది దృష్టిని ఆకర్షించే ప్రబుద్ధిజీవులు కనక.

ఈ బాణీలో సాగిన కవుల కవాతు వినిపిస్తూ పోతున్న కొద్దీ  ఈ చిన్ని వ్యాసం లక్ష్యం పలచబడుతుందన్న  దిగులుతో ఇటీవలి కాలంలో ఈ తరహా లొంగుబాటు ప్రదర్శించిన మరో దివంగత  ప్రఖ్యాత ప్రజాగాయకుని వైఖరిని నిరసిస్తూ నేను  రాసుకున్న నిరసన కవిత ప్రస్తావన అసందర్భం కాదనుకుంటా!

 

 

 

"పాట రద్దయి పోదు!"

(ప్రజాకళ-జూలై-2012 సంచికలోని నా కవిత)

 

కాలం ముందు చేతులు కట్టుకుని నిలబడటం ఎంత దయనీయం!

ఇలాంటి విషాద ఘడియ ఒకటి వచ్చి పడుతుందని ఊహించనే లేదు .

భ్రాంతి దిగ్ భ్రాంతి గా మారిన దురదృష్టపు క్షణాలివి.

 

వసంతానికి తప్ప దేనికీ గొంతు విప్పని చిలుక

కొండచిలువతో కలిసి బృందగానం ఆలపించటం కన్నా విషాదం మరేముంటుంది ?

కత్తి అంచున నిలబడి గొంతెత్తి పాడుతూ ఆడి పాడిన ఆ పాట నిజామా?

కొత్త నేస్తం తో చెట్టపట్టాల్ పట్టి చిందులేసే ఈ పాట నిజామా?

నిప్పుకుండను పుక్కిట పట్టిన ఆ పాటేనా

బజారులో రెండు రూపాయలకమ్మే నీటి పాకెట్లా ఇలా కలుషితమయిపోయిందీ!నీ పాట తాకట్టు కొట్టువాకిట్లో తచ్చాడుతున్నప్పుడే నాకు స్పృహ వచ్చి వుండవలసింది

కలల్ని మింగి హరయించుకోవటం కష్టమని నీ కిప్పుడనిపించిందా!

మరి నీ రాగాన్ని భుజాన మోసుకు తిరుగుతున్న వాడి గతేమిటి పాటగాడా!

దగా, మోసమని నడి బజారులో వాడు నిన్నలా నిలదీస్తోంటే

నీ గురించి కాదు గాని

నిన్ను నమ్ముకున్న పాటను గూర్చి జాలేస్తుంది.

జనం భుజాలమీద మోసుకునే పదాలను నువ్వలా రాజు పాదాల ముందు పరచావు

పాట పరుసవేది స్పర్స అంటకముందు నీవూ ఆ జనం మనిషివేనని మరిచావు

ఏ బలహీన క్షణాలలో రుద్రుడు కాముడి మాయలో పడి ఓడిపోయాడో

ఆ మాయదారి క్షణాలే మళ్ళి నీ పాటకూ దాపురించాయని సరిపెట్టు కోమంటావా?

వేళ్ళు నరికినా తలను తెంపినా

నీ పాటనే మొండిగా పాడుకొనే మొండెం నిన్నిప్పుడు అడుగుతుంది మిత్రమా!

బదులు చెప్పు!

కవాతుకు ఒక పాట తగ్గింది ..అంతేగా !

వేల గీతాలు ఈ అపస్వరాన్న్నితొక్కుకుంటూ వెళ్ళిపోతాయి

పాట ఆగితే ఆట ఆగదు

ఇది దొరలు గడీలో ఆడుకునే కుర్చీలాట కాదుగా !

సుడిగాలినెదుర్కునేదే అసలయిన పాట

నెత్తురు గడ్డ మీద పూచిన పూవు అంత తొందరగా వాడిపోదులే!

పాట మడుగును అడుగుకింతని నువ్వమ్ముకున్నా

అడుగునున్న తడి మాత్రం ఏ అమ్మకానికీ కుదరదు.

నాలిక మెలికలు తిరిగినంత తేలికగా పాట ఆత్మ మడత పడదు.

నువ్విలా చివరి అంకపు స్త్రోత్ర పాఠపు సర్వేజనా సుఖినో భవన్తులాగా

ఎంత జీరబోయినా

పాట రద్దయి పోదు

రద్దయేది పాటగాడిగా నువ్వు మాత్రమే మిత్రమా !

-కర్లపాలెం హనుమంత రావు

***

(జనవిజయం పేరుతో శ్రీ సదాశివరావు వెలువరించిన చిన్ని పొత్తం లోని ("కవులంటే"- వ్యాసం ఆధారం పు. 277 -287)

 

 

 

 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...