Showing posts with label Female. Show all posts
Showing posts with label Female. Show all posts

Sunday, December 12, 2021

పేగుబంధం - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు, సంపాదకీయం, 03 -08 - 2009 )

పేగుబంధం

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు, సంపాదకీయం, 03 -08 - 2009 ) 

చెయ్యగా చెయ్యగా పనుల్లో సులువు తెలుస్తుందన్నది  లోక నుడి. మనుషులకే కాదు.. దేవుళ్లకూ ఈ సూత్రం వర్తిస్తుంది.'విధినా తావభ్యస్తం యావద్స్పుష్టా మృగేక్షణాఅని  ‘సుభాషిత రత్నమాల’ ముక్తాయించడానికి అదే కారణం. లావణ్యంతో ఓలలాడే లలనామణి సృష్టి కోసం లీలామానుషుడు ఎన్నో మగబొమ్మలను తయారుచేసాడన్నది  ఈ శ్లోకం తాత్పర్యం. ఆడవాళ్లను అందుకే ఫెయిర్ సెక్స్ అనడం! 

 

ఫెయిర్ నెస్ ఎతుంటే ఏం లాభం? చపల చిత్తం మగవాడి బుద్ధి ముందు స్థిత ప్రజ్ఞత పుష్కలంగా ఉన్నా స్త్రీ సునిశిత గ్రహణ శక్తి మొక్కవోతూనే ఉంది. సృష్టి ఆది నుంచి ఇదే బాధమగవాడు ఆవులించక ముందే మగువలు వాడి పేగులు లెక్కెట్టేస్తారు!  ‘అందుకే ఆడదంటే మగవాడికంత బెదురు’ అన్నారు హిల్లరీ క్లింటన్ ఓ  సందర్భంలో! అబలగా అన్నింటా మగవాడు చిన్నబుచ్చే  ఆడది నిజానికి జగద్గురు శ్రీ శంకరాచార్యుని భాష్యం ప్రకారం అపర పరాశక్తి.. అతిలోక సుందరి శ్రీ లలితాదేవి.. కూడా! 

పరమేశ్వరి అనే పదానికి పరమార్థమేదో బుర్రకు  తట్టక ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ అంటూ తనకు తానే సర్దిచెప్పుకునే ‘బుద్ధి’తక్కువ శాల్తీ మగవాడు.  అయ్యగారి దృష్టిలో ముద్దరాలు అంటే ముద్దుపళని రాధికాసాంత్వనం మార్కు రాధాదేవి. ‘కంటికి నిద్ర రాదువినుకాంతుని బాసిన నాటినుండియున్/వంటక మింపు గాదు..’ టైపు విరహబాధలు తెగ పడిపోయే అష్ట శృంగార నాయికల్లో సందర్భాన్ని బట్టి ఎవరో ఒకర్తె. అందుకే  ఆమెను అందాల భరిణ అంటూ ఉన్నవీ లేనివీ ఊరికే ఊహించుకుని మరీ ‘కురులకు వందనములు తెలి గోము మొగంబునకున్ జోహారునీ/ యరుదగు కంబు గంఠమున కంజలినీ కుచ కుంభాళికిన్/ కరముల్ మోడ్చెదన్బెళుకు క్రౌనుకు మ్రొక్కెదబంచబాణ మం/దిరములకున్ సతీమణి! పదింబదిగా పదివేల దండముల్' అంటూ  దండకాలు రాసుకునేది. నడివయసు దాటినా మిడిమేళపు కవిత్వంతో సడీ సప్పుడు లేకుండా తన మానాన తాను తన పని తాను చూసుకునిపోయే చానను కూడా సామాజిక మాధ్యమ వేదికల మీద కీడ్చి కీచకుడికి మించి రచ్చ చేసేది మగవాడే.  కేస్టింగ్ కౌచ్ లు ఉన్నంత వరకు విరుగుడు తంత్రంగా  ‘మీ.. టూ’ లు పుట్టుకురాక తప్పదు. 

నిజానికి మహిళ ఏనాడూ ‘వాల్మీకి రామాయణం’ పట్టించుకోకుండా వదిలెట్టేసిన ఊర్మిళమ్మలా ఊరికే పడి నిద్రపోయిందిలేదుఅర్జనుడి రాక ముందు నుంచే రాజ్యందర్జాగా నడిపించిన   ప్రమీల  ప్రజ్ఞే  ప్రమదలది ఎప్పుడూనేటి లోకవ్యవహారం కూడా ఆ తీరులోనే  తరుణుల ఆధ్వర్యంలో సాగుతుంటే ఇప్పుడీ మహిళా దినోత్సవాలు గట్రా అంటూ ఆర్భాటాల అక్కరే ఉండేది కాదు.  

 

15వ శతాబ్దంలో ఇండియా  పర్యటనకని వచ్చిన నికోలో కోంటీ అప్పటి హిందూ రాజ్యాలలో భర్త చనిపోయిన భర్తతో బతికున్నభార్యనూ చితి పైకి ఎక్కించడం చూసి విస్తుపోయాడు.  ఆ కాల్చడాలు అవీ ప్రత్యక్షంగా ఇప్పుడు కనిపించవు. కానీ..కడుపులో పడ్డ మరుక్షణం నుంచి కాటిచితిలో పడే ఘడియ వరకు ఏదో ఓ దుర్మార్గపు రూపంలో ఆడాళ్లను కాల్చుకు తినడాలు మాత్రం తప్పడంలేదు ఇప్పుడు కూడానూ! 

వేదాల కాలంలో  స్త్రీ పురుషులిద్దరిలో గొప్ప ఎవరన్న  వాదమే వినిపించింది కాదు. జనకుడి  విద్వత్మహాసభలో గొప్ప తర్కతో తనను తలకిందులు చేసినప్పుడు మహాజ్ఞాని యాజ్ఞవల్క్య మహర్షి  మొహమాటం లేకుండా  మైత్రేయి ముందు మోకరిల్లినట్లు  మనకు కథలున్నాయి.  ఎప్పుడు రాజుకుందో గాని ‘అహం’ అనే ఈ నిప్పు రవ్వ.. ఇప్పటి  మగవాడి మనస్సులో  ‘అహం బ్రహ్మోస్మి’ అన్న అగ్నిని తెగ ఎగదోసేస్తోంది. మగవాడి ఆధిపత్య జ్వాలలకు సుకుమారమైన బతుకులు ఎన్నెన్ని  కాలి బూడిదయిపోతున్నాయో ప్రతీ రోజూ! మరి ఉద్యమం వద్దంటే ముద్దరాలు మొద్దులా ఓ మూల పడివుంటుందా?    

 

సృష్టిధర్మ రీత్యా పురుషుడి దేహం స్త్రీ శరీరం కన్న దృఢం అయితే కావచ్చును. అంత మాత్రం చేతనే అన్నింటా అతగాడు అధికుడు ఐపోతాడా? నాగరికత ఆరంభ యుగాలలో ఆడదే కుటుంబానికంతటికీ తిరుగులేని పెద్ద. పితృస్వామ్యవాదం బలిసి పెత్తనం రుచి మరిగిన తరువాత మగవాడో మహారాజు.. ఆడది అతగాడి ఇష్టారాజ్యానికి ఆడి పాడే మరబొమ్మగా మారిపోవడం.

 

బాల్యం నుంచే బాలికల ఊహలు మహా సునిశితంగా సాగుతుంటాయంటారు.  తన మొద్దు బుర్రకు అందని ఊహల  ఆడదాని చేతిలో ఓటమి  అంటే ఊహూఁ మగవాడికి మరి మండదా! సాటి మగవాళ్లల్లోఎంత నామర్దా!  అందుకే అడ్డదారుల్లో అయినా ఆడదానిని మగవాడు  లొంగదీసుకునేది. కానీ ఆడదాని మనసు ఊరుకుంటుందా? ‘జీవితమనే మాయాజూదంలో మగవాడిదేనా ఎప్పుడూ గెలుపు?/ అంటే ఖాయంగా అది కనిపించని శకుని విసిరే పాచికల ఆటే’ అనుకుంటుంది ప్రముఖ  తమిళ స్త్రీవాద రచయిత్రి ఉమా నారాయణ్ ‘కల్చరల్ డిస్లొకేషన్స్: ఐడెంటిటీసి, ట్రెడిషన్స్ అండ్ థర్డ్ వరల్డ్ ఫెమినిజమ్ ‘ చదివిన తరువాత.

 

వాస్తవానికి మానవ జీవనకావ్యంలో స్త్రీ పురుషులిద్దరూ  రఘువంశ కర్త కాళిదాసు బాషలో చెప్పాలంటే వాగర్థాలుఆదిదంపతులకు మల్లే వాళ్లిద్దరూ చెరో సగంగా సమన్వయంతోనిభాయిస్తే తప్ప జగత్ అనే ఈ మహారథం సక్రమంగా ముందుకు సాగదు!  'న శివేన వినా దేవీన దేవ్యాచ వినా శివః' ! అమ్మ లేకపోతే అయ్య లేడు. అయ్య లేని పక్షంలో మ్మ’ఉండదు. వేటూరివారి పాటలో ఇంకా వివరంగా చెప్పాలంటే మానవ జీవితం నర నారీ సంగమ మృదంగం/ గంగమ జంగమ సంగీతం.  ఆమె ధరకు జారిన శివగంగ తరంగం.  ఆడది అంటే ఇహ చిన్నచూపు ఎందుకో మగవాడికి?

 

తరతరాల వెలుగు తాలుపులైనాతరుగెరుగని ఇలవేలుపులైనా నేల మీదకు కాలు మోపే ముందు ఓ అమ్మ కడుపులోనే  ముందు నునుపు తేలేది! లోకాదర్శ జీవనుడు శ్రీరామచంద్రుడు భూమ్మీదకు  అవతరించింది కౌసల్యామాత గర్భంలో నవ మాసాలు రూపుదిద్దుకున్న తరువాత మాత్రమే! స్త్రీ జన్మ మహిమ రహస్యం ఆ త్రిశంకు  స్వర్గ ద్రష్ట  విశ్వామిత్రుల దృష్టి దాటక పోబట్టే బాలరామయ్యను మేలుకొలుపుతూ సుప్రజా రాముడి కన్న   ముందు కౌసల్య’ మాతనుతలుచుకున్నది. అమ్మ కడుపు చల్లంగా ఉన్నంత కాలమే ఏ అయ్య కలలైనా నిండుగా పండేది. మగాడు ఈ సింపుల్ లాజిక్ మరుగున పెడుతున్నందు  వల్లనే  స్త్రీలోకంలో  ఇంతలా అల్లకల్లోలం.

 

కోవెల వంటిదీ లోకం అన్నది కోమలి కోమల భావన.  కానీ ‘మగవాడి దృష్టిలో ఆమె తనువుకు మాత్రమే ఓ వెల! తాను కని పెంచిన మగవాడే  తన పాలిట సైతానుగా మారుతున్నందుకు  ఆ మాత  వెత. ఆ కలత వల్లనే నెలతలంతా  'ఏ జన్మకీ స్త్రీ జన్మ నీ కొద్దు నా చిట్టి తల్లీ!అంటూ అంతలాతల్లడిల్లిపోతున్నది అప్పుడూ.. ఇప్పుడు కూడా! 

 

భారతీయుల దృష్టిలో ఆడవాళ్లకు ఉండే పూజ్యభావన ఎంత  గొప్పగా ఉంటుందో చెప్పడానికని   యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః’ అంటూ ఎప్పుడూ ఒకే శ్లోకాన్ని వల్లెవేస్తాడు బడుద్ధాయి మగవాడు. వేదాలల్లో స్త్రీని దేవతలుగా చూపించడమూ, విద్యధనధైర్యాలకు స్త్రీలనే దేవతామూర్తులుగా చిత్రీకరించుకోవడమూ మహా బడాయిగాఎత్తిచూపిస్తాడు కూడాను. రామాయణంలో రావణాసురుడి కన్న ముందు రాముడిని కష్టాల పాల్చేసింది ఆడవాళ్లే.. కైకేయిమందరశూర్పణఖ.. అంటూ  తన చిన్ని బుద్ధికి తోచిన కుతర్కం ప్రదర్శిస్తాడు కూడాను!మరి కాస్త కావ్య శాస్త్రజ్ఞానం వంటబట్టి ఉంటే ప్రబంధాల నుంచి కూడా ఎంచుకున్న పద్యాలతో లెక్చర్లు  దంచికొట్టచ్చు. ‘సుబ్బరంగా చదువుకోవడానికని వచ్చిన పిల్లోడు చంద్రుడిని చెడగొట్టింది  తార అనే  స్త్రీనే కదా! కృష్టుణ్ని అష్టకష్టాల పాల్చేసిన దుష్టజాతిలో పూతన వంటి స్త్రీ జాతి పాత్రా ఎంతో కొంత ఉంది కదా!  ఆడజాతి అంతా పులుకడిగిన ముత్యాలల్లే బిల్డప్పులు ఇస్తే ఎట్లా?  ఏదో ప్రకృతిని చూసి పరవశించిపోదామని వచ్చిన పిచ్చి బ్రాహ్మడు ప్రవరాఖ్యుడిని వరూధిని వశం చేసుకోడానికి అంతలా  వేపుకుని తినాలా? ఆవటా అంటూ  అంటూ- సొంటూ లేని శుంఠ  ప్రశ్నలు లేవదీస్తాడు. జరిగాయో జరగలేదోజరిగితే ఎంత వరకు నిజంగా నిజాలే  ప్రచారంలోకి వచ్చాయో..ఇతమిత్థంగా నిర్థారణ కాని కట్టు కథలను పట్టుకుని కొట్టుకు చావడం తప్పించి.. వర్తమానం కట్టెదుట ఆడదానికి అన్ని మతాలలో వాస్తవంగా జరుగుతున్న అన్యాయం గురించి నోరు విప్పడు!

కామసూత్రాలను శాస్త్రీకరించి బహిరంగంగా  ప్రబోధించినందుకు మహానుభావుడని  మనం  నెత్తికెత్తుకుంటున్న వాత్సాయనుడు..  ఆయన అదే కామకళల్లో భర్తల పెత్తనాన్ని ఎట్లా భార్యలు చచ్చినట్లు ఒప్పుకుతీరాలో ఉదాహరణలతో సహా నొక్కి చెప్పిన నిజం ఎవరికీ చెప్పరు ఈ మగవాళ్లు. భర్త తినకుండా భార్య తింటే దోషమన్న దుర్మార్గపు సిద్ధాంతం మొదట లేవదీసిన రుషి ఆ మహాశయుడే! దాన ధర్మాల నుంచి ఏ ఇంటి పని (వంట పని తప్పించి) వరకైనా స్వతంత్రించి చేసుకునే హక్కు ఆమెకు చరిత్రలో ఏ దశలోనూ దఖలు పడిందిలేదు . ఒక్క  భర్తనే కాదు భర్త బంధువులనుమిత్రులనుముఖపరిచయస్తులనయినా సరే ఇంటికి వచ్చినప్పుడు నెత్తిన పెట్టుకు సకల సపర్యలతో ఒప్పించని పక్షంలో ఆమె ఉత్తమమైన ఇల్లాలు కానేరదు కదా.. కొండొకచో శాపతాపాలకూ  గురి అయిన  కథలూ పురాణాలలో బొచ్చెడున్నాయ్వాటి ప్రస్తావన ఏ మగవాడూ చెయ్యడు. భర్త మోజుపడి మరో వివాహం చేసుకున్నా .. వివాహం కుదరని పక్షంలో ఇంటికే తెచ్చేసుకుంటే  సవతితో సఖ్యంగా ఉండాలి తప్పించి కయ్యానికి కాలుదువ్వే సాహసం ధర్మపత్ని అయినా చేసిన  పక్షంలో పుణ్యస్త్రీ వంటి  బిరుదులన్నీ  వెనక్కి పీక్కోబడతాయని బెదిరింపులు  ఈ తరహా మొగవాళ్ల   నుంచే!

ప్రపంచంలోని అతి పెద్ద మతం క్రైస్తవానికి సైతం స్త్రీ పట్ల బొత్తిగా సదుద్దేశం లేదు. 'స్త్రీ పుట్టుకతోనే పాపి. పాపహేతువుకేవలం పురుషుడి సుఖ సంతోషాలే ఆ నీచ ప్రాణి  సృష్టి పరమార్థం.స్త్రీని బానిసగా దేవుని వాక్యం భావించిన దానికి ఏ మాత్రం తిసిపోని విధంగా పురుషుడి అన్ని కష్టాలకు మూలకారణం  క్రైస్తవంలో లాగా ఇస్లాం మతమూ గాఢంగా విశ్వసించింది

 

స్త్రీకి బురఖా ఇస్లాం ప్రసాదమే! ప్రార్థనాలయాల ప్రవేశం ఆమెకు నిషిద్ధం. భర్త కోరితే సంగమానికి సిద్ధం కాకపోవడం పాపహేతువు. ఎంత వయసు వచ్చినా భార్యను  శిక్షించే హక్కు భర్తకు ధారాదత్తం చేసింది  ఇస్లాం మతం. భర్త తలాడించకుండా తనకు పుట్టిన బిడ్డకు అయినా సరే పాలిచ్చే అధికారం భార్యకు కల్పించింది కాదీ మతం. విడిపోయినా సరే భర్త అనుమతి తప్పనిసరి అనడం కన్నా ఘోరం ప్రపంచంలో మరొకటి ఉంటుందా

 

ప్రపంచంలోని దాదాపు అన్ని మతాలలో స్త్రీలు వ్యామోహ కారకులు. వారి మీద సదా  ఓ కన్నేసి ఉంచడం పురుషుల  తప్పనిసరి బాధ్యతల్లో ఒకటి. ఆడవాళ్లు దున్నబడే భూములతో సమానం. భూముల మీదుండే హక్కు భుక్కుల నియమాలన్నీ స్త్రీలకీ వర్తిస్తాయి కొన్ని మతాలల్లో. లేబుల్ ఏదైనాకాలం ఎప్పటిదైనాప్రాంతం ఎక్కడిదైనావైవిధ్యాలువైరుధ్యాలుఅంతర్వైరుధ్యాలు ఎన్ని ఉన్నా  స్త్రీలకు అవ్యాయం  చేసే అంశంలో అన్ని మతాలు అన్నదమ్ముల వలెనే సహకరించుకున్నాయి.. సహకరించుకుంటున్నాయి కూడా!

 

హోలీ బైబిల్  రెండో ఛాప్టర్ ప్రకారం నిద్ర పోయే మగాడి డొక్కలో నుంచి ఓ పక్కటెముక పీకి  ది గ్రేట్ లార్డ్ గాడ్ సృష్టించబడినది ఆడజీవి. ఆ తరహా  భావజాలమే మన ముత్తాతలది కూడా. మనువులాంటి మగ మహానుభావులంతా చేరి  'న స్త్రీ స్వాతంత్ర్య మర్హతిఅంటూ  సిద్ధాంతాలు చేయబట్టే  మగవాడు  ఆ చొప్పదంటు సూత్రాలను పట్టుకుని  తోడు నీడుగా ఉందామని వచ్చే సాటి జీవి ఆడదానిని అన్ని ఆటలు ఆడిస్తున్నది! శేషం వేంకటకవి ‘శశాంక విజయం’లో కోరిక తీర్చమని తన దరి చేరిన గురుపత్ని తారతో ‘వికల చరిత్రు డైనముది వెంగలి యైనగురూపి యైననున్త్రికరణ శుద్ధిగా మగడె దేవు డటం చని నిశ్చయించియొండొక డెటువంటివా డయిన నొప్పదు కోరగ నింతికి’ అంటూ చంద్రుడు ద్వారా చెప్పిన నీతి సూక్తులన్న్నీ నిజానికి మగాడి మనసులో యుగాల బట్టి జెండా పాతుకుపోయి ఉన్నవే! ఆడదంటే ఒక్క తనువే అన్నట్లు మనువు  లాంటి దుష్ట మేధావులు ఈ తరహా  ధర్మపన్నాలు పదేపదే వల్లించడ వల్లనే ఆడవాళ్లకు  ఏ దశ లోనూ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు   బొత్తిగా లేకుండా పోయిందన్నది  స్త్రీవాదుల మండిపాటు. 

మరనుయంత్రాన్ని  కనిపెట్టక ముందే ‘మర-మనిషి’ని కనిపెట్టింది ప్రపంచం. మగప్రపంచం కనిపెట్టిన ఆ మర-మనిషి పేరు ఆడది. ఆడదిగా పుట్టినందుకు, చీరె కట్టడం నేర్చిందాకా పుట్టింటికి గొడ్డులా చాకిరీ చేయడం, ఓ మగాడొచ్చి మెడలో పలుపు కట్టగానే  తలొంచుకొని వెళ్లి అతగాడి వంశానికి   జీతం బత్తెం లేని ఊడిగం ఎల్లకాలం చేసుకుంటూ పడివుండటం!' మల్లాది సుబ్బమ్మగారి వంటి  స్త్రీ జనాభ్యుదయవాదులు పద్దాకా తిట్టిపోసేదీ మగవాడిని తమకు పగవాడిగా మారుస్తున్న ఈ తరహా పెడవాదనలను..   ఇప్పటికీ వాటిని గుడ్డిగా నమ్ముతూ  కఠినంగా అమలుచేస్తూ, ముమ్మరంగా ప్రచారం చేసే మూఢమతులను!

 

'ఎంత రుచి ఆ నిషిద్ధ ఫలానికి/ ఎంత వడి ఆ విముక్త హృదయానికి' అంటారు సినారె  విశ్వంభర ఖండకావ్యంలో నారీ నార సంగమ సుందర దృశ్యాన్ని అభివర్ణిస్తూ! ఇద్దరూ కలసి ఒకే తీరులో  ఆనుభవించే  ఆ సంగమ కార్యపు  తీయని రుచి మగవాడికి  ఒకానొక అనుభూతితో సరి. ఆడదానికి మాత్రం  మంచి.. చెడు..  అనుభవాలన్నీ  అక్కడి నుంచే  మొదలు! గర్భం ధరించింది మొదలు ప్రసవం అయే వరకుకాబోయే అమ్మ 

మగువంటే మగవాడి మర-యంత్రమా?

-    కర్లపాలెం హనుమంతరావు 

( సూర్య దిన పత్రిక సంపాదకీయ పుట వ్యాసం) 

 

 

 

చెయ్యగా చెయ్యగా పనుల్లో సులువు తెలుస్తుందన్నది  లోక నుడి. మనుషులకే కాదు.. దేవుళ్లకూ ఈ సూత్రం వర్తిస్తుంది.'విధినా తావభ్యస్తం యావద్స్పుష్టా మృగేక్షణాఅని  ‘సుభాషిత రత్నమాల’ ముక్తాయించడానికి అదే కారణం. లావణ్యంతో ఓలలాడే లలనామణి సృష్టి కోసం లీలామానుషుడు ఎన్నో మగబొమ్మలను తయారుచేసాడన్నది  ఈ శ్లోకం తాత్పర్యం. ఆడవాళ్లను అందుకే ఫెయిర్ సెక్స్ అనడం! 

 

ఫెయిర్ నెస్ ఎతుంటే ఏం లాభం? చపల చిత్తం మగవాడి బుద్ధి ముందు స్థిత ప్రజ్ఞత పుష్కలంగా ఉన్నా స్త్రీ సునిశిత గ్రహణ శక్తి మొక్కవోతూనే ఉంది. సృష్టి ఆది నుంచి ఇదే బాధమగవాడు ఆవులించక ముందే మగువలు వాడి పేగులు లెక్కెట్టేస్తారు!  ‘అందుకే ఆడదంటే మగవాడికంత బెదురు’ అన్నారు హిల్లరీ క్లింటన్ ఓ  సందర్భంలో! అబలగా అన్నింటా మగవాడు చిన్నబుచ్చే  ఆడది నిజానికి జగద్గురు శ్రీ శంకరాచార్యుని భాష్యం ప్రకారం అపర పరాశక్తి.. అతిలోక సుందరి శ్రీ లలితాదేవి.. కూడా! 

పరమేశ్వరి అనే పదానికి పరమార్థమేదో బుర్రకు  తట్టక ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ అంటూ తనకు తానే సర్దిచెప్పుకునే ‘బుద్ధి’తక్కువ శాల్తీ మగవాడు.  అయ్యగారి దృష్టిలో ముద్దరాలు అంటే ముద్దుపళని రాధికాసాంత్వనం మార్కు రాధాదేవి. ‘కంటికి నిద్ర రాదువినుకాంతుని బాసిన నాటినుండియున్/వంటక మింపు గాదు..’ టైపు విరహబాధలు తెగ పడిపోయే అష్ట శృంగార నాయికల్లో సందర్భాన్ని బట్టి ఎవరో ఒకర్తె. అందుకే  ఆమెను అందాల భరిణ అంటూ ఉన్నవీ లేనివీ ఊరికే ఊహించుకుని మరీ ‘కురులకు వందనములు తెలి గోము మొగంబునకున్ జోహారునీ/ యరుదగు కంబు గంఠమున కంజలినీ కుచ కుంభాళికిన్/ కరముల్ మోడ్చెదన్బెళుకు క్రౌనుకు మ్రొక్కెదబంచబాణ మం/దిరములకున్ సతీమణి! పదింబదిగా పదివేల దండముల్' అంటూ  దండకాలు రాసుకునేది. నడివయసు దాటినా మిడిమేళపు కవిత్వంతో సడీ సప్పుడు లేకుండా తన మానాన తాను తన పని తాను చూసుకునిపోయే చానను కూడా సామాజిక మాధ్యమ వేదికల మీద కీడ్చి కీచకుడికి మించి రచ్చ చేసేది మగవాడే.  కేస్టింగ్ కౌచ్ లు ఉన్నంత వరకు విరుగుడు తంత్రంగా  ‘మీ.. టూ’ లు పుట్టుకురాక తప్పదు. 

నిజానికి మహిళ ఏనాడూ ‘వాల్మీకి రామాయణం’ పట్టించుకోకుండా వదిలెట్టేసిన ఊర్మిళమ్మలా ఊరికే పడి నిద్రపోయిందిలేదుఅర్జనుడి రాక ముందు నుంచే రాజ్యందర్జాగా నడిపించిన   ప్రమీల  ప్రజ్ఞే  ప్రమదలది ఎప్పుడూనేటి లోకవ్యవహారం కూడా ఆ తీరులోనే  తరుణుల ఆధ్వర్యంలో సాగుతుంటే ఇప్పుడీ మహిళా దినోత్సవాలు గట్రా అంటూ ఆర్భాటాల అక్కరే ఉండేది కాదు.  

 

15వ శతాబ్దంలో ఇండియా  పర్యటనకని వచ్చిన నికోలో కోంటీ అప్పటి హిందూ రాజ్యాలలో భర్త చనిపోయిన భర్తతో బతికున్నభార్యనూ చితి పైకి ఎక్కించడం చూసి విస్తుపోయాడు.  ఆ కాల్చడాలు అవీ ప్రత్యక్షంగా ఇప్పుడు కనిపించవు. కానీ..కడుపులో పడ్డ మరుక్షణం నుంచి కాటిచితిలో పడే ఘడియ వరకు ఏదో ఓ దుర్మార్గపు రూపంలో ఆడాళ్లను కాల్చుకు తినడాలు మాత్రం తప్పడంలేదు ఇప్పుడు కూడానూ! 

వేదాల కాలంలో  స్త్రీ పురుషులిద్దరిలో గొప్ప ఎవరన్న  వాదమే వినిపించింది కాదు. జనకుడి  విద్వత్మహాసభలో గొప్ప తర్కతో తనను తలకిందులు చేసినప్పుడు మహాజ్ఞాని యాజ్ఞవల్క్య మహర్షి  మొహమాటం లేకుండా  మైత్రేయి ముందు మోకరిల్లినట్లు  మనకు కథలున్నాయి.  ఎప్పుడు రాజుకుందో గాని ‘అహం’ అనే ఈ నిప్పు రవ్వ.. ఇప్పటి  మగవాడి మనస్సులో  ‘అహం బ్రహ్మోస్మి’ అన్న అగ్నిని తెగ ఎగదోసేస్తోంది. మగవాడి ఆధిపత్య జ్వాలలకు సుకుమారమైన బతుకులు ఎన్నెన్ని  కాలి బూడిదయిపోతున్నాయో ప్రతీ రోజూ! మరి ఉద్యమం వద్దంటే ముద్దరాలు మొద్దులా ఓ మూల పడివుంటుందా?    

 

సృష్టిధర్మ రీత్యా పురుషుడి దేహం స్త్రీ శరీరం కన్న దృఢం అయితే కావచ్చును. అంత మాత్రం చేతనే అన్నింటా అతగాడు అధికుడు ఐపోతాడా? నాగరికత ఆరంభ యుగాలలో ఆడదే కుటుంబానికంతటికీ తిరుగులేని పెద్ద. పితృస్వామ్యవాదం బలిసి పెత్తనం రుచి మరిగిన తరువాత మగవాడో మహారాజు.. ఆడది అతగాడి ఇష్టారాజ్యానికి ఆడి పాడే మరబొమ్మగా మారిపోవడం.

 

బాల్యం నుంచే బాలికల ఊహలు మహా సునిశితంగా సాగుతుంటాయంటారు.  తన మొద్దు బుర్రకు అందని ఊహల  ఆడదాని చేతిలో ఓటమి  అంటే ఊహూఁ మగవాడికి మరి మండదా! సాటి మగవాళ్లల్లోఎంత నామర్దా!  అందుకే అడ్డదారుల్లో అయినా ఆడదానిని మగవాడు  లొంగదీసుకునేది. కానీ ఆడదాని మనసు ఊరుకుంటుందా? ‘జీవితమనే మాయాజూదంలో మగవాడిదేనా ఎప్పుడూ గెలుపు?/ అంటే ఖాయంగా అది కనిపించని శకుని విసిరే పాచికల ఆటే’ అనుకుంటుంది ప్రముఖ  తమిళ స్త్రీవాద రచయిత్రి ఉమా నారాయణ్ ‘కల్చరల్ డిస్లొకేషన్స్: ఐడెంటిటీసి, ట్రెడిషన్స్ అండ్ థర్డ్ వరల్డ్ ఫెమినిజమ్ ‘ చదివిన తరువాత.

 

వాస్తవానికి మానవ జీవనకావ్యంలో స్త్రీ పురుషులిద్దరూ  రఘువంశ కర్త కాళిదాసు బాషలో చెప్పాలంటే వాగర్థాలుఆదిదంపతులకు మల్లే వాళ్లిద్దరూ చెరో సగంగా సమన్వయంతోనిభాయిస్తే తప్ప జగత్ అనే ఈ మహారథం సక్రమంగా ముందుకు సాగదు!  'న శివేన వినా దేవీన దేవ్యాచ వినా శివః' ! అమ్మ లేకపోతే అయ్య లేడు. అయ్య లేని పక్షంలో మ్మ’ఉండదు. వేటూరివారి పాటలో ఇంకా వివరంగా చెప్పాలంటే మానవ జీవితం నర నారీ సంగమ మృదంగం/ గంగమ జంగమ సంగీతం.  ఆమె ధరకు జారిన శివగంగ తరంగం.  ఆడది అంటే ఇహ చిన్నచూపు ఎందుకో మగవాడికి?

 

తరతరాల వెలుగు తాలుపులైనాతరుగెరుగని ఇలవేలుపులైనా నేల మీదకు కాలు మోపే ముందు ఓ అమ్మ కడుపులోనే  ముందు నునుపు తేలేది! లోకాదర్శ జీవనుడు శ్రీరామచంద్రుడు భూమ్మీదకు  అవతరించింది కౌసల్యామాత గర్భంలో నవ మాసాలు రూపుదిద్దుకున్న తరువాత మాత్రమే! స్త్రీ జన్మ మహిమ రహస్యం ఆ త్రిశంకు  స్వర్గ ద్రష్ట  విశ్వామిత్రుల దృష్టి దాటక పోబట్టే బాలరామయ్యను మేలుకొలుపుతూ సుప్రజా రాముడి కన్న   ముందు కౌసల్య’ మాతనుతలుచుకున్నది. అమ్మ కడుపు చల్లంగా ఉన్నంత కాలమే ఏ అయ్య కలలైనా నిండుగా పండేది. మగాడు ఈ సింపుల్ లాజిక్ మరుగున పెడుతున్నందు  వల్లనే  స్త్రీలోకంలో  ఇంతలా అల్లకల్లోలం.

 

కోవెల వంటిదీ లోకం అన్నది కోమలి కోమల భావన.  కానీ ‘మగవాడి దృష్టిలో ఆమె తనువుకు మాత్రమే ఓ వెల! తాను కని పెంచిన మగవాడే  తన పాలిట సైతానుగా మారుతున్నందుకు  ఆ మాత  వెత. ఆ కలత వల్లనే నెలతలంతా  'ఏ జన్మకీ స్త్రీ జన్మ నీ కొద్దు నా చిట్టి తల్లీ!అంటూ అంతలాతల్లడిల్లిపోతున్నది అప్పుడూ.. ఇప్పుడు కూడా! 

 

భారతీయుల దృష్టిలో ఆడవాళ్లకు ఉండే పూజ్యభావన ఎంత  గొప్పగా ఉంటుందో చెప్పడానికని   యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః’ అంటూ ఎప్పుడూ ఒకే శ్లోకాన్ని వల్లెవేస్తాడు బడుద్ధాయి మగవాడు. వేదాలల్లో స్త్రీని దేవతలుగా చూపించడమూ, విద్యధనధైర్యాలకు స్త్రీలనే దేవతామూర్తులుగా చిత్రీకరించుకోవడమూ మహా బడాయిగాఎత్తిచూపిస్తాడు కూడాను. రామాయణంలో రావణాసురుడి కన్న ముందు రాముడిని కష్టాల పాల్చేసింది ఆడవాళ్లే.. కైకేయిమందరశూర్పణఖ.. అంటూ  తన చిన్ని బుద్ధికి తోచిన కుతర్కం ప్రదర్శిస్తాడు కూడాను!మరి కాస్త కావ్య శాస్త్రజ్ఞానం వంటబట్టి ఉంటే ప్రబంధాల నుంచి కూడా ఎంచుకున్న పద్యాలతో లెక్చర్లు  దంచికొట్టచ్చు. ‘సుబ్బరంగా చదువుకోవడానికని వచ్చిన పిల్లోడు చంద్రుడిని చెడగొట్టింది  తార అనే  స్త్రీనే కదా! కృష్టుణ్ని అష్టకష్టాల పాల్చేసిన దుష్టజాతిలో పూతన వంటి స్త్రీ జాతి పాత్రా ఎంతో కొంత ఉంది కదా!  ఆడజాతి అంతా పులుకడిగిన ముత్యాలల్లే బిల్డప్పులు ఇస్తే ఎట్లా?  ఏదో ప్రకృతిని చూసి పరవశించిపోదామని వచ్చిన పిచ్చి బ్రాహ్మడు ప్రవరాఖ్యుడిని వరూధిని వశం చేసుకోడానికి అంతలా  వేపుకుని తినాలా? ఆవటా అంటూ  అంటూ- సొంటూ లేని శుంఠ  ప్రశ్నలు లేవదీస్తాడు. జరిగాయో జరగలేదోజరిగితే ఎంత వరకు నిజంగా నిజాలే  ప్రచారంలోకి వచ్చాయో..ఇతమిత్థంగా నిర్థారణ కాని కట్టు కథలను పట్టుకుని కొట్టుకు చావడం తప్పించి.. వర్తమానం కట్టెదుట ఆడదానికి అన్ని మతాలలో వాస్తవంగా జరుగుతున్న అన్యాయం గురించి నోరు విప్పడు!

కామసూత్రాలను శాస్త్రీకరించి బహిరంగంగా  ప్రబోధించినందుకు మహానుభావుడని  మనం  నెత్తికెత్తుకుంటున్న వాత్సాయనుడు..  ఆయన అదే కామకళల్లో భర్తల పెత్తనాన్ని ఎట్లా భార్యలు చచ్చినట్లు ఒప్పుకుతీరాలో ఉదాహరణలతో సహా నొక్కి చెప్పిన నిజం ఎవరికీ చెప్పరు ఈ మగవాళ్లు. భర్త తినకుండా భార్య తింటే దోషమన్న దుర్మార్గపు సిద్ధాంతం మొదట లేవదీసిన రుషి ఆ మహాశయుడే! దాన ధర్మాల నుంచి ఏ ఇంటి పని (వంట పని తప్పించి) వరకైనా స్వతంత్రించి చేసుకునే హక్కు ఆమెకు చరిత్రలో ఏ దశలోనూ దఖలు పడిందిలేదు . ఒక్క  భర్తనే కాదు భర్త బంధువులనుమిత్రులనుముఖపరిచయస్తులనయినా సరే ఇంటికి వచ్చినప్పుడు నెత్తిన పెట్టుకు సకల సపర్యలతో ఒప్పించని పక్షంలో ఆమె ఉత్తమమైన ఇల్లాలు కానేరదు కదా.. కొండొకచో శాపతాపాలకూ  గురి అయిన  కథలూ పురాణాలలో బొచ్చెడున్నాయ్వాటి ప్రస్తావన ఏ మగవాడూ చెయ్యడు. భర్త మోజుపడి మరో వివాహం చేసుకున్నా .. వివాహం కుదరని పక్షంలో ఇంటికే తెచ్చేసుకుంటే  సవతితో సఖ్యంగా ఉండాలి తప్పించి కయ్యానికి కాలుదువ్వే సాహసం ధర్మపత్ని అయినా చేసిన  పక్షంలో పుణ్యస్త్రీ వంటి  బిరుదులన్నీ  వెనక్కి పీక్కోబడతాయని బెదిరింపులు  ఈ తరహా మొగవాళ్ల   నుంచే!

ప్రపంచంలోని అతి పెద్ద మతం క్రైస్తవానికి సైతం స్త్రీ పట్ల బొత్తిగా సదుద్దేశం లేదు. 'స్త్రీ పుట్టుకతోనే పాపి. పాపహేతువుకేవలం పురుషుడి సుఖ సంతోషాలే ఆ నీచ ప్రాణి  సృష్టి పరమార్థం.స్త్రీని బానిసగా దేవుని వాక్యం భావించిన దానికి ఏ మాత్రం తిసిపోని విధంగా పురుషుడి అన్ని కష్టాలకు మూలకారణం  క్రైస్తవంలో లాగా ఇస్లాం మతమూ గాఢంగా విశ్వసించింది

 

స్త్రీకి బురఖా ఇస్లాం ప్రసాదమే! ప్రార్థనాలయాల ప్రవేశం ఆమెకు నిషిద్ధం. భర్త కోరితే సంగమానికి సిద్ధం కాకపోవడం పాపహేతువు. ఎంత వయసు వచ్చినా భార్యను  శిక్షించే హక్కు భర్తకు ధారాదత్తం చేసింది  ఇస్లాం మతం. భర్త తలాడించకుండా తనకు పుట్టిన బిడ్డకు అయినా సరే పాలిచ్చే అధికారం భార్యకు కల్పించింది కాదీ మతం. విడిపోయినా సరే భర్త అనుమతి తప్పనిసరి అనడం కన్నా ఘోరం ప్రపంచంలో మరొకటి ఉంటుందా

 

ప్రపంచంలోని దాదాపు అన్ని మతాలలో స్త్రీలు వ్యామోహ కారకులు. వారి మీద సదా  ఓ కన్నేసి ఉంచడం పురుషుల  తప్పనిసరి బాధ్యతల్లో ఒకటి. ఆడవాళ్లు దున్నబడే భూములతో సమానం. భూముల మీదుండే హక్కు భుక్కుల నియమాలన్నీ స్త్రీలకీ వర్తిస్తాయి కొన్ని మతాలల్లో. లేబుల్ ఏదైనాకాలం ఎప్పటిదైనాప్రాంతం ఎక్కడిదైనావైవిధ్యాలువైరుధ్యాలుఅంతర్వైరుధ్యాలు ఎన్ని ఉన్నా  స్త్రీలకు అవ్యాయం  చేసే అంశంలో అన్ని మతాలు అన్నదమ్ముల వలెనే సహకరించుకున్నాయి.. సహకరించుకుంటున్నాయి కూడా!

 

హోలీ బైబిల్  రెండో ఛాప్టర్ ప్రకారం నిద్ర పోయే మగాడి డొక్కలో నుంచి ఓ పక్కటెముక పీకి  ది గ్రేట్ లార్డ్ గాడ్ సృష్టించబడినది ఆడజీవి. ఆ తరహా  భావజాలమే మన ముత్తాతలది కూడా. మనువులాంటి మగ మహానుభావులంతా చేరి  'న స్త్రీ స్వాతంత్ర్య మర్హతిఅంటూ  సిద్ధాంతాలు చేయబట్టే  మగవాడు  ఆ చొప్పదంటు సూత్రాలను పట్టుకుని  తోడు నీడుగా ఉందామని వచ్చే సాటి జీవి ఆడదానిని అన్ని ఆటలు ఆడిస్తున్నది! శేషం వేంకటకవి ‘శశాంక విజయం’లో కోరిక తీర్చమని తన దరి చేరిన గురుపత్ని తారతో ‘వికల చరిత్రు డైనముది వెంగలి యైనగురూపి యైననున్త్రికరణ శుద్ధిగా మగడె దేవు డటం చని నిశ్చయించియొండొక డెటువంటివా డయిన నొప్పదు కోరగ నింతికి’ అంటూ చంద్రుడు ద్వారా చెప్పిన నీతి సూక్తులన్న్నీ నిజానికి మగాడి మనసులో యుగాల బట్టి జెండా పాతుకుపోయి ఉన్నవే! ఆడదంటే ఒక్క తనువే అన్నట్లు మనువు  లాంటి దుష్ట మేధావులు ఈ తరహా  ధర్మపన్నాలు పదేపదే వల్లించడ వల్లనే ఆడవాళ్లకు  ఏ దశ లోనూ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు   బొత్తిగా లేకుండా పోయిందన్నది  స్త్రీవాదుల మండిపాటు. 

మరనుయంత్రాన్ని  కనిపెట్టక ముందే ‘మర-మనిషి’ని కనిపెట్టింది ప్రపంచం. మగప్రపంచం కనిపెట్టిన ఆ మర-మనిషి పేరు ఆడది. ఆడదిగా పుట్టినందుకు, చీరె కట్టడం నేర్చిందాకా పుట్టింటికి గొడ్డులా చాకిరీ చేయడం, ఓ మగాడొచ్చి మెడలో పలుపు కట్టగానే  తలొంచుకొని వెళ్లి అతగాడి వంశానికి   జీతం బత్తెం లేని ఊడిగం ఎల్లకాలం చేసుకుంటూ పడివుండటం!' మల్లాది సుబ్బమ్మగారి వంటి  స్త్రీ జనాభ్యుదయవాదులు పద్దాకా తిట్టిపోసేదీ మగవాడిని తమకు పగవాడిగా మారుస్తున్న ఈ తరహా పెడవాదనలను..   ఇప్పటికీ వాటిని గుడ్డిగా నమ్ముతూ  కఠినంగా అమలుచేస్తూ, ముమ్మరంగా ప్రచారం చేసే మూఢమతులను!

 

'ఎంత రుచి ఆ నిషిద్ధ ఫలానికి/ ఎంత వడి ఆ విముక్త హృదయానికి' అంటారు సినారె  విశ్వంభర ఖండకావ్యంలో నారీ నార సంగమ సుందర దృశ్యాన్ని అభివర్ణిస్తూ! ఇద్దరూ కలసి ఒకే తీరులో  ఆనుభవించే  ఆ సంగమ కార్యపు  తీయని రుచి మగవాడికి  ఒకానొక అనుభూతితో సరి. ఆడదానికి మాత్రం  మంచి.. చెడు..  అనుభవాలన్నీ  అక్కడి నుంచే  మొదలు! గర్భం ధరించింది మొదలు ప్రసవం అయే వరకుకాబోయే అమ్మ పడే యాతనలేమిటో వాయుపురాణం తిరగేస్తే విశదంగా బోధపడుతుంది. గర్భస్య ధారణే విషమే భూమి వర్త్ముని/ తస్య  నిష్క్రమణార్థాయ మాతృపిండం దదమ్యాహం' (గర్భం ధరించడమే కష్టం. ఎగుడు దిగుడు నేలల మీద నడవడం అందుకు అదనపు కష్టం. ఆ కష్టం కలిగించినందుకు నీ మాతృపిండాన్ని నేను నీకునమస్కరిస్తున్నాను) అంటూ ఎదిగొచ్చిన తరువాత  సంతానం తమ తల్లుల ముందు తోచిన  విధంగా  మోకరిల్లవచ్చు.  తన బిడ్డ పుట్టుక కోసం యమద్వారం ముందుండే మహాఘోరమైన వైతరణీ నదినైనా తరించేందుకు  సాహసించిన స్త్రీ అప్పట్లో నష్టపోయిన జీవితానుభవాలకు పరిహారం చెల్లించేదెవరూ?

 

భావుకతను రేకెత్తించే కవిత్వాలకేం గానీ.. వాస్తవంగా చూస్తే దేశంలోని స్త్రీ పురుష జనాభా నిష్పత్తి లెక్కలే ఆడవారి పట్ల మగజాతి ప్రదర్శించే ద్వంద్వవిలువల  వ్యాపార దృక్పథాలకు వికృత ఉదాహరణలు. పుట్టాలంటేనే 'చావు గండంనుండీ గట్టెక్కాల్సిన గడ్డు దుస్థితి ఒక్క ఆడ గుడ్డుకే ఈ గడ్డన ఇప్పటికీ! తప్పీ దారీ భూమ్మీద పడ్డా.. తప్పుదారిలో నడిచే మగప్రపంచాన్నుంచి ఎప్పటికప్పుడు తెలివిగా తప్పించుకునే దారులు దేవులాడుకోవడమే తప్పించి నేటికీ ఇంటా బైటా వయసుతో నిమిత్తం లేకుండా ఆడది ఎదుర్కోక తప్పని దైన్యస్థితులు ఎన్నెన్నో! 

 

తన జీవితాన్ని తనకై  తానుగా అచ్చంగా   మగవాడి హక్కులతో సరిసమానంగా బతికే మంచి రోజులు ఆడదానికి ఎప్పుడు లభిస్తే అప్పుడే ఏటేటా జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు అంతిమ లక్ష్యానికి సార్థకత ! 

 

-    కర్లపాలెం హనుమంతరావు 

( సూర్య దిన పత్రిక సంపాదకీయ పుట వ్యాసం) 

 

  యాతనలేమిటో వాయుపురాణం తిరగేస్తే విశదంగా బోధపడుతుంది. గర్భస్య ధారణే విషమే భూమి వర్త్ముని/ తస్య  నిష్క్రమణార్థాయ మాతృపిండం దదమ్యాహం' (గర్భం ధరించడమే కష్టం. ఎగుడు దిగుడు నేలల మీద నడవడం అందుకు అదనపు కష్టం. ఆ కష్టం కలిగించినందుకు నీ మాతృపిండాన్ని నేను నీకునమస్కరిస్తున్నాను) అంటూ ఎదిగొచ్చిన తరువాత  సంతానం తమ తల్లుల ముందు తోచిన  విధంగా  మోకరిల్లవచ్చు.  తన బిడ్డ పుట్టుక కోసం యమద్వారం ముందుండే మహాఘోరమైన వైతరణీ నదినైనా తరించేందుకు  సాహసించిన స్త్రీ అప్పట్లో నష్టపోయిన జీవితానుభవాలకు పరిహారం చెల్లించేదెవరూ?

 

భావుకతను రేకెత్తించే కవిత్వాలకేం గానీ.. వాస్తవంగా చూస్తే దేశంలోని స్త్రీ పురుష జనాభా నిష్పత్తి లెక్కలే ఆడవారి పట్ల మగజాతి ప్రదర్శించే ద్వంద్వవిలువల  వ్యాపార దృక్పథాలకు వికృత ఉదాహరణలు. పుట్టాలంటేనే 'చావు గండంనుండీ గట్టెక్కాల్సిన గడ్డు దుస్థితి ఒక్క ఆడ గుడ్డుకే ఈ గడ్డన ఇప్పటికీ! తప్పీ దారీ భూమ్మీద పడ్డా.. తప్పుదారిలో నడిచే మగప్రపంచాన్నుంచి ఎప్పటికప్పుడు తెలివిగా తప్పించుకునే దారులు దేవులాడుకోవడమే తప్పించి నేటికీ ఇంటా బైటా వయసుతో నిమిత్తం లేకుండా ఆడది ఎదుర్కోక తప్పని దైన్యస్థితులు ఎన్నెన్నో! 

 

తన జీవితాన్ని తనకై  తానుగా అచ్చంగా   మగవాడి హక్కులతో సరిసమానంగా బతికే మంచి రోజులు ఆడదానికి ఎప్పుడు లభిస్తే అప్పుడే ఏటేటా జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు అంతిమ లక్ష్యానికి సార్థకత ! 

 

-    కర్లపాలెం హనుమంతరావు 

( సూర్య దిన పత్రిక సంపాదకీయ పుట వ్యాసం) 

 

 

అడ్డదారి - కథానిక కర్లపాలెం హనుమంతరావు - (ఆంధ్రభూమి వారపత్రిక ప్రచురితం)

అడ్డదారి - కథానిక

కర్లపాలెం హనుమంతరావు


సులభ కెనరాబ్యాంకులో ఆఫీసర్. 

ఇయర్ ఎండింగ్ సీజన్.  ఆఫీసులో పని వత్తిడి ఎక్కువగా  ఉంటోంది ఎప్పటిలానే. 

తొందరగా తెముల్చుకుని బైటపడదామన్నా చీకటి పడనేపడిందా పూట.  పైన దట్టంగా మబ్బులు కూడా. సెల్ చూస్తే  టైమ్  ఏడుకు  ఇంకా ఐదే నిముషాలున్నట్లు గత్తర పెడుతోంది! ఆర్టీసి క్రాస్ రోడ్స్ కు వెళ్లే  లాస్ట్ బస్ టంచనుగా ఏడింటికి వచ్చి పోతుంది. 

ఎంత గబగబా అడుగులు వేసినా కనీసం పదినిముషాల నడక 

బస్టాండుకు. దాదాపు పరిగెత్తినంత పనిచేసిందామె. 

 నిర్మానుష్యంగా ఉంది బస్టాండంతా! డైలీ తనతో పాటు వచ్చే గ్యాస్ ఆఫీస్ పిఆర్ఓ  లేడీ   కూడా కనిపించలేదక్కడ. 

సామాను సర్దుకుంటోన్న పల్లీల అవ్వను అడిగింది సులభ  'సిటీకీ పోయే ఏడింటి బస్సు పోయిందా అవ్వా?' 

'ఇప్పుడే పోయింది బిడ్డా! ఇంకే బస్సులూ  రావే!ఎట్టా చేస్తావూ?'    తట్ట నెత్తికి  ఎత్తి పెట్టుకుని జాలిగా అడిగిందా అవ్వ. 

'ఏదైనా ఆటో చూస్తాలే! నువ్ పో!'

'పెద్ద మబ్బు తల్లీ! చినుకులు రాల్తావున్నాయి!  ఏ ఆటో సచ్చినోడు ఇటేపొచ్చి చస్తాడో! పాపం, ఆడబిడ్డవి! బేగి ఇల్లు చేరుకో తల్లీ!' అని గొణుక్కుంటూ వెళ్లిపోయిందా అవ్వ . 

సులభకు అప్పుడు గాని అర్థమయింది కాదు తన పరిస్థితి. 

బస్సు లేక, ఆటో దొరక్క, ఈ గాలివానలో ఇక్కడే ఇరుక్కుపోతే నలభై కిలో మీటర్ల దూరంలో ఉండే ఇల్లు చేరేదెట్లా? 

ఉన్న ఒకట్రొండు చిన్న దుకాణాలు కూడా కట్టేసుకుంటున్నారు మెల్లమెల్లగా! 

బస్టాండులో  ఆడమనిషొక్కతే బిక్కు బిక్కు మంటూ నిలబడుండటం అప్పుడే దారే పోయే మనుషుల కంట్లో  పడ్డం మొదలుపెట్టింది. ఒకళ్లిద్దరు మగాళ్లయితే మొరటుగా నిలబడి తేరిపారా చూస్తూ పోవడంతో భయం పట్టుకుంది సులభకు. 

'ఎంత తొందరగా ఇక్కణ్ణుంచీ కదిలితే అంత సేఫ్!'   

ఇంగితం హెచ్చరించడంతో సెల్ తీసి రాజశేఖర్ నెంబర్  నొక్కింది. రెండు కాల్సయినా   రెస్పాన్స్ లేదు. రాదని తెలుసు. శేఖర్ సెల్ ఈ టైములో ఆఫ్ లో ఉంటుంది!   అతగాడు అక్కడెక్కడో మాధాపూర్ చివర్లోని సాఫ్ట్ వేర్ కంపెనీలో అనలిస్ట్.  డ్యూటీ స్టార్టయ్యే ముందు డైలీ టీం డిస్కషన్  ఉంటుంది. ఆ టైమ్ లో సెల్ ఆన్-లో  ఉండదు. అది రూలు. రోజూ తను ఇంటికి చేరిం తరువాత మెసేజ్ పెట్టినా  వెంటనే రిప్లై రాదందుకే.  రూల్స్ స్ట్రిక్టు గా పాటించక తప్పని  ఆ కంపెనీలో  ఆఫీసు వదిలిందాకా శేఖర్ తో  కాంటాక్టంటే స్ట్రిక్ట్లీ వయా మెసేజెస్సే! 

అన్నీ తెలిసీ కాల్ చెయ్యడం.. కంగారు అణుచుకోలేకే! లక్కీగా భర్త నుంచి ఏదైనా సలహా  వస్తుందని కూడా ఆశ. కుదరక, మెసేజ్ పెట్టి నడక మొదలుపెట్టింది సులభ!

నిజంగానే లక్కీ! శేఖర్ నుంచి కాల్! సులభ చెప్పేది సగమే విని 'గొప్ప చిక్కుల్లో పడ్డావ్ సులభా! ఆ ఏరియా అస్సలు సేఫ్ కాదు. ముందేదైనా దొరికిన వెహికల్ పట్టుకుని యాదగిరి టాకీస్ సెంటర్  దాకా వచ్చేసెయ్! బేరం గీరుతూ కూర్చోక ఆటో దొరికితే. మీ లేడీస్ కు అదో వీక్ నెస్! సెంటర్ కొచ్చేయగానే మెసేజ్ పెట్టు. ఇట్లాగే ఏ టాయ్ లెట్ లోకో  దూరైనా మాట్లాడతా! ఇప్పటికే చాలా టైమయింది. బాస్ పిలవకముందే వెళ్లాలి' అంటూ కాల్ కట్ చేశాడు రాజశేఖర్.

ఒకటి రెండు ఆటోలు వస్తున్నట్లే వచ్చి దూసుకుపోయాయి. జల్లు జోరు పెరిగింది. ఇంటికి కాల్ చేస్తే చాలా సేపటికి గానీ ఎత్తారు కాదు అత్తగారు. 'ఎక్కడున్నావు సులభా?' పెద్దావిడ కంగారు. 'పిల్లలిద్దరూ భోజనాలు చేస్తున్నారు. ఇప్పటికే నిన్ను గూర్చి అరడజను సార్లు అడిగారు. తొందరగా రా!' ఆమె బెంగ  ఆమెది. 

విషయం చెప్పి 'కాస్త లేటవచ్చేమో అత్తయ్యా! పిల్లలకు సర్ది చెప్పండి! కాస్సేపు చదువుకుని పడుకోమనండి! మీరూ తినేయండి! నా కోసం వెయిట్ చెయ్యద్దు! షుగర్ టాబ్లెట్స్ వేసుకోడం మాత్రం మర్చిపోవద్దు' అని ఫోన్ పెట్టేసింది. 

ఎవరో ఆటోవాడు ఎదురుగా బండి నిలిపి 'ఎక్కడికమ్మా పోవాలి?' అనడిగాడు. 

'చిక్కడపల్లి వస్తావా?' ఆశగా అడిగింది సులభ. 

'సిటీలోకి పర్మిషన్ లేదు మేడమ్! కావాలంటే యాదగిరి సెంటర్ దాకా వస్తా! వందవుద్ది' అన్నాడు కరాఖండిగా.  

బండిలో ఎక్కి కూర్చున్న  తరువాత గొణుక్కుంది సులభ  'అందరూ అంతే! అవకాశం వస్తే ఏదీ  వదిలిపెట్టరు.. ఐదు కిలో మీటర్లు కూడా ఉండదు సెంటర్. ముప్పై అంటేనే గొప్ప. మీటరు వేస్తే పరిస్థితి అర్థమవుతుంది.'

 భర్త చెప్పిన మాట గుర్తుకొచ్చి కిమ్మనకుండా  కూర్చుండిపోయింది. 'ఎట్లాగో అట్లా క్షేమంగా ఇల్లు చేరితే చాలు. అదే పది వేలు' అనుకుంది  పదో సారి. 

వర్షం దంచి కొడుతుంటే టార్పాలిన్ కవర్ రెండు వేపులా కిందికి దించాడు ఆటోఅబ్బాయ్!

 

బండి ఎటు పోతుందో అర్థమవడం లేదు. డైవర్ వేసుకున్న పాన్ పరాగ్ వాసనకు కడుపులో దేవుతున్నట్లుంది.  కర్చీఫ్ తీసి ముక్కులకడ్డు పెట్టు క్కూర్చుంది. 

పది నిముషాలు కూడా నడిచింది కాదు.. బండి ఆగిపోయింది. డైవర్ రెండు మూడు సార్లు  పెడల్ గేర్ లాగి లాగి ట్రై చేశాడు. బండి మొరాయింపులు  మానలేదు.

'ఏమయింది?' భయంగా అడిగింది సులభ. 

వాడు బదులేమీ ఇవ్వకుండా  ఆటో దిగి వెనక ఏదో సరిచేయడానికి తంటాలు పడుతున్నాడు. ఈ సందులోనే రెండు మూడు సార్లు ఫోన్లు. సంభాషణంతా ఏదో అర్థం కాని భాషలోనే. బహుశా గోండు అయుండాలి.

రిపేరింగు  వాడి వల్ల కాలేదు లాగుంది. 'ఆటో దిగండమ్మా!' అన్నాడు టార్పాలిన్  కవరొకటి పక్కకు తొలగతోసి. 

బైటికి తొంగి చూసింది సులభ. కటిక చీకటి. వీధి దీపాలు వెలుగు దూరం నుంచి కనిపిస్తోంది. తనెక్కడుందో అర్థం కాలేదామెకు. 

కిందికి చూస్తే గలగలా శబ్దం. పాదాలు తడిసేటంత లోతులో రోడ్డు మీద నీళ్లు పారుతున్నాయ్. 

'ఇదేంటి? ధియేటర్ దాకా కదా తీసుకెళ్లాలి' అంది సులభ కోపాన్ని దిగమింగుకుంటూ. 

'అల్లదిగో ఆ ఎత్తు మీద కనిపిస్తావుందే.. అదే  థియేటర్! బండి ట్రబులిచ్చింది. చూస్తున్నారు కదా! దిగి నడుచుకుంటూ వెళ్లండమ్మా.. పైసలిచ్చి' అన్నాడు  నిర్లక్ష్యంగా ఆటో మనిషి.

'ఎట్లానయ్యా! ఇంత నీళ్లల్లో! చీకట్లో! నాకిదంతా కొత్త చోటు!' అంది సులభ మొండిగా. 

'బండి ట్రబులిస్తే నాదా తప్పు!   ఏం మాట్లాడతవ్! ముందు గాడీ దిగుండ్రి! పైసల్దియుండ్రి! ముచ్చట్లు ఆనక ! నే పోవాల!' 

డైవర్ మాటల్లో ఎంతో తేడా! ఏం చెయ్యాలో పాలుపోలేదు బ్యాంకాఫీసర్ సులభాకుమారికి. 

పర్సు  తీసి యాభై నోటు అతగాడి చేతిలో పెట్టింది. 'ఇంకో ఇరవై ఇయ్యమ్మా! ఇంత బారిస్ లో  కూడా గీడ  దాకా తోలుకొచ్చినా. కష్టం చూడరా దొరసానులు!'

వాడి దబాయింపుకు వళ్ళు మండింది. కానీ, ఒంటరి ఆడది. అక్కడున్న పరిస్థితుల్లో ఏం చేయగలదు తను? 

బైలుదేరే ముందు ఆటో నెంబరైనా నోట్ చేసుకోలే.. కంగారులో. ఎంత పెద్ద మిస్టేకయిందో  ఇప్పుడర్థమవుతోంది.

మరీ రచ్చ చేస్తే మొదటికే మోసమవుతుందేమో! వాడు  పర్సు మొత్తం గుంజుకున్నా తానేంచేయగలదు! 

ముందెట్లాగో కొంప చేరాలి. మారు మాట్లాడకుందా మరో ఇరవై వాడి చేతిలో పడేసి బండి దిగిపోయింది సులభ. 

వాన జోరు అట్లాగే ఉంది. వళ్లంతా తడిసి ముద్దయిపోయిందప్పటికే. హ్యాండ్ బ్యాగ్ ను జల్లుకు అడ్డుగా పెట్టుకొని దూరంగా కనిపించే థియేటర్ వైపుకు అడుగులు వేసింది  సులభ. 

నడక అలవాటే పూర్తిగా తప్పిపోయిందీ మధ్యన! పదడుగులు పడేసరికి నీరసం ముంచుకొచ్చింది. ఆయాసం కూడా. థియేటర్ సెంటర్ చాలా మెరకలో ఉంది. అంత ఎత్తు తానిప్పుడు  ఎక్కగలదా!..  అదీ వాన నీరు ధారగా ఫోర్సుగా కిందికి జారుతున్నప్పుడు!

దారి సరిగ్గా కనపడ్డం లేదు. ఎక్కడ ఏ గుంటలేడ్చాయో  పాడు ..  తెలీదు! మ్యాన్ హోల్సు గానీ ఉండి  కాలు  వాటిలో  పడితే! వణుకొచ్చింది సులభకు!  

కాళ్ల కింద నుంచి ఏదో జర జర పాకి పోయినట్లనిపించింది. ఏడుపొక్కటే తక్కువ పాపం  బ్యాంకాఫీసర్ సులభమ్మకు..ఆ క్షణంలో! 

'ఎక్కడికమ్మా! ఈ యేల  అట్లా ఒంటిగా  పడిపోతావుండావు?'  

ఆ గొంతు వినిపించిన వైపుకు చూస్తే ఓ సగం కూలిన పెంకుటింటి  వసారాలో ముసిలామె కనబడింది వానజల్లుకు తడవకుండా ఓ వార కూలబడి!

'ఆ థియేటర్ సెంటర్ దాకా పోవాలవ్వా! అక్కడికి బస్సులొస్తాయిటగా! నాది  సిటీ!' అంది సులభ.

'ఈ ఎత్తు యేపు ఎందుకు బిడ్డా?   అసలే సరిగ్గా ఉండత్తల్లీ అటేపు! ఇంత లావు  వర్షంలో జారకుండా పోగలగవనే! తాగుబోతు సచ్చినోళ్లు అంకాళమ్మ గుడి కాడ అంకఛండాలప్పనులు చేస్తావుంటారమ్మా అహర్నిశలూ! ఒంటరి ఆడబిడ్డవి. ఈ టైములో..  నిన్ను గాని ఇట్లా   చూస్తే  వదిలేస్తారనేనా     త్రాష్టులు!' అంది అవ్వ.

అప్పుడు చూసుకుంది సులభ తన వంటి వంక. వర్షానికి తడిసి ముద్దయిన బట్టలు  వంటిని దాచిపెట్టే డ్యూటీకి ఎప్పుడో రిజైన్ చేసేశాయి. లోపలి తెల్ల రంగులు దుస్తులు  అంత చీకట్లో కూడా మెరుపులొస్తున్నప్పుటు బైటికి స్పష్టంగా కనిపిస్తున్నాయి.  

ఆటో మనిషి తన వంక అదోలా చూడడం అప్పుడు గుర్తుకొచ్చి సన్నటి వణుకు వచ్చింది.. కానీ తమాయించుకుందెలాగో!

'అవ్వా! ముందు ఇల్లు చేరడం కావాలి  నాకు.  దేవుడిదే భారం ! మూడు కిలో మీటర్లు నడిచొచ్చా! ఇంకో రెండు కిలో మీటర్లేగా..'

'ఇట్టా చుట్టూ  తిరిగిపో తల్లీ!  అయితే ఇంకో రెండు కిలోమీటర్లవుద్ధి ఎక్కువ అయిన ఆలీసం ఎట్లాగూ అయింది గదా! పెద్ద ముండాదాన్ని! ఎందుకు చెబుతా వున్నానో అర్థం చేసుకో బిడ్డా! రోడ్డు వారా లైట్లుంటాయి కిందైతే. వచ్చే పోయే జనాలు కనపడతా వుంటారు. నీ అదురుష్టం బావుంటే అటేపెళ్లే బళ్ళు తగలచ్చు. చౌరాస్తా కాడ పోలీసు ఠాణా కూడా   ఉండింది బిడ్డా!' అంది అవ్వ తడుముకుంటూ చేతిలోకి ఊత కర్ర తీసుకుని ఇంట్లోకి  పోతూ!  

సులభ గొప్ప  మీమాంసలో పడిపోయింది. కష్టమైనా సరే, ఎత్తు దారి ఎక్కేసి తొందరగా సెంటర్ కెళ్లి పోవడమా? 

అవ్వన్నట్లు, పోలీసు స్టేషనూ, జనసంచారం, లైట్లూ ఉండే పల్లం దారెంట పడి సెంటర్ చేరుకోడమా?  

పెద్దావిడ. ఈ లొకాలిటీ మనిషి. ఏ అనుభవం మీద ఇంతలా చెబుతోందో? కాస్త చుట్టు తిరుగుడైనా రోడ్డు వారగా పోవడమే మేలు అనిపించింది సులభకు. వచ్చిన దారినే మళ్లీ  కాళ్లూ కాళ్లూ కొట్టుకుంటూ వెనక్కు  తిరిగి రోడ్డు బాట వేపుకు నడక మొదలుపెట్టిందాఖరుకు. 

రోడ్డు మీద ఇందాక తనెక్కి వచ్చిన ఆటో కనిపించలేదు! ముసలవ్వ చెప్పిన పోలీస్ ఠాణా దాటుతుండగా ఉప్పల్ గుండా పోయే బస్సొకటి కనిపించింది.  చెయ్యెత్తంగానే ఠక్కుమని ఆగింది. గభాలున ఎక్కి ఓ  సీటులో కూలబడ్డ  తరువాత గాని ఊపిరి తేలికగా వచ్చింది కాదు. 

'బాగా తడిసిపోయారే.. పాపం!'  అంది లేడీ కండక్టర్ సికిందరాబాద్ స్టేషన్  టిక్కెట్ కోస్తూ! 

బస్సు సిటీ జౌట్-స్కర్ట్స్ లోకి  ఎంటరవగానే దిగిపోయి   దొరికిన ఆటో పట్టుకుని ఇల్లు చేరింది సులభ. అప్పటికి  రాత్రి పది..  పది!  . 

అత్తగారు బోజనం కూడా చేయకుండా జాగారం చేస్తున్నారు.. పాపం.. తన కోసమే   ఎదురు తెన్నులు చూస్తూ. పిల్లలు తమ తమ రూముల్లో పడి నిద్రపోతున్నారు. భర్తకు మెసేజ్ పెడదామని సెల్ బయటకు తీస్తే అప్పటికె ఐదు  మిస్డ్ కాల్స్ .. పది  మెసేజెస్సూ! 

తనే కాల్ చేసింది భర్తకు!  వెంటనే ఎత్తేడు రాజశేఖర్! ఎంత సేపు అలాగే ఫోనులో భోరుమని ఏడ్చేసిందో మాటా పలుకూ లేకుండా! అత్తగారు అలా అమ్మలా వెన్ను నిమురుతూనే ఉన్నారు భర్తతో సంభాషణ కొససాగుతున్నంత  సేపూ!

---

మర్నాడు బ్యాంకుకి శెలవు పెట్టేసింది సులభ. అటు మర్నాడు బ్యాంకు కెళ్లినప్పుడు రాత్రి అనుభవాన్ని తన కొలీగ్సుకు  చెబుతుంటే.. అంతా విన్న తరువాత మూర్తి అన్నాడు  చివర్లో 'సులభగారూ! మీరు ఆ అవ్వ చెప్పినట్లు విని మంచి డెసిషన్ తీసుకున్నారు.  ఆ రూట్ లో పైకి  వెళ్లకపోవడమే మంచిదయింది. నిన్న రాత్రి  సరిగ్గా అదే స్పాట్లో .. పాపం..  గ్యాస్ కంపెనీలో పన్చేసే      పి ఆర్ వో.. ఎవరో పాపం.. ఆవిడ.. దొంగ రాస్కెల్స్ బారిన  పడి సర్వనాశనం జరిగపోయింది  !' అంటూ ఈనాడు రంగారెడ్డి ఎడిషన్ లోని ఓ పేజీ పరిచి చూపించాడు. 

'సామూహిక అత్యాచార ప్రయత్నం'  శీర్షిక కింద ఫలానా మహిళా ప్రయాణీకురాలిపై తుంటరులు  తలపెట్టిన గ్యాంగ్ రేపుకు  సంబంధించిన వార్తాంశం అది. 

తమ తమ వాహనాలలో ఎక్కే ఒంటరి స్త్రీలను మాయమాటలు చెప్పి దారి మళ్లించడం. ఆనక మిత్రబృందంతో  కలసి లొంగతీసుకోవడం..  గురించి వివరంగా రాసిన ఆ కథనం  చూడగానే  సులభ గుండెలు ఒక్కసారి గుభేల్మన్నాయి!   

ఠాణాలో స్టేషన్ ఆఫీసర్ వెనక చేతులు కట్టుకు నిలబడ్డ రేపిస్టుల ఫొటోలో  మొన్న రాత్రి తాను ఎక్కిన ఆటో డ్రైవరు కూడా ఉండడం చూసి ఆమె అవాక్కయిపోయింది కొన్ని క్షణాలు!

అంతకు మించి షాకిచ్చిన వార్తాంశం  అక్కడే మరోటి కనిపించింది సులభకు! 

అదే ఫొటోలో పోలీసులకు అసుంటా దూరంగా బెంచీ మీద ముణగదీసుకుని కూర్చోనున్న ఆడమనిషి..  వేరెవరో కాదు..   'మెరక బాటలో  తనను పైకి వెళ్లకుండా వారించిన  పుణ్యమూర్తి .. ముసిలవ్వ! 

ఆ పాడు   ఘోరానికి    సరిగ్గా తన కొంపే వేదికవడంతోసరిగ్గా   కళ్లు లేకపోతేనేమీ, ఆ గుడ్డి అవ్వ చూడలేకపోయిందిట!   చేతిలోని ఊత కర్రతో అందినోడి నడ్డి   అందినట్లు విరగ్గొట్టేసివట !    

'ఆనక పోలీసోళ్లకు  సమాచారం అందించిందీ  ఆ ముసిల్దే మేడమ్! మా పేటలో అందరూ మా గొప్పగా చెప్పుకుంటుండ్రు.  ఆ రేప్ కేసు  త్రాష్టుల్లో తన కొడుకుండాడని  తెలిసీ    వెనక్కి తగ్గడం లేదీ    గుడ్డితల్లి' అంది బైటి  నుంచి      టీ.. కాఫీలు తెచ్చిచ్చే  మహాలక్ష్మి.  

'నువ్వు   అడ్డదారిలో పోతుంటే ఆపగలిగిన ఆ గుడ్డితల్లి తన  కొడుకు అడ్డదారిలో పోతుంటే ఆపలేకపోయింది చూశావా సులభా!సరే అయినా సరే..     చట్టానికి పట్టిచ్చే  అవకాశం రాగానే అంతలా తెగించేసింది! .. రియల్లీ హ్యట్సాఫ్ టు ధి  గ్రేట్ మదర్!' అంటూ విషయం విన్న రాజశేఖర్ కామెంట్ పాస్ చేస్తుంటే       సులభ  కళ్లల్లో నీళ్లు  గిర్రున  తిరిగాయి! 

కర్లపాలెం హనుమంతరావు

(ఆంధ్రభూమి వారపత్రిక 27 -01 -2013 ప్రచురితం)

***


తెలుపు’ కోసం కొసరాజు సురేష్ అందిస్తున్న ఈ శీర్షికలో ‘సందిగ్ధ’ మూడవది.

 మంచి పుస్తకం’ ఒక సంపద.



1980, 90లలో ఇంగ్లీషులో వెలువడిన ‘మానుషి’ పత్రికకి మంచి పేరు ఉండేది. మధు కిష్వర్ దీనికి వ్యవస్థాపక సంపాదకురాలు. అది ‘ఫెమినిస్టు’ పత్రిక అని ఇతరులు పేర్కొన్నప్పటికీ దాని ఉప శీర్షిక ‘A Journal about Woman and Society’ అని ఉంటుంది.

1992-96లో నేను వ్యవసాయ శాఖలో ఘంటశాల విత్తనాభివృద్ధి క్షేత్రంలో పని చేస్తుండగా మానుషి పత్రికలో ప్రచురితమయిన విజయ్‌దాన్ దేథా కథలు చదివాను. మానుషి ట్రస్ట్ ఆ కథలను ‘ద డైలెమా’ అన్న పేరుతో పుస్తకంగా ప్రచురించింది. ఘంటశాలలో ఉండగా ఒక కథ, రాజేంద్రనగర్ లోని అపార్డ్‌కి డెప్యుటేషన్‌లో (1996-2001) ఉండగా మరో అయిదు కథలు అనువాదం చేశాను.

నేను చేసిన చాలా అనువాదాలకు మూల భాషకీ, తెలుగుకీ మధ్య ఇంగ్లీషు అనుసంధాన భాషగా ఉంది. అయితే ‘సందిగ్ధ’ పుస్తకానికి మూల భాష రాజస్థానీ. విజయ్‌దాన్ దేథా (బిజ్జి అని అంటారు) తన మాతృ భాషలోనే రచనలు చేశారు. ‘సందిగ్ధ’ లోని కథలు ముందుగా హిందీలోకి, హిందీ నుంచి ఇంగ్లీషులోకి (రూత్ వనిత అనువాదం), ఇంగ్లీషు నుంచి తెలుగులోకి వచ్చాయి.

రాజస్థాన్ జానపద కథలను అక్షరబద్ధం చెయ్యటానికి రూపాయన్ అనే సంస్థని విజయ్‌దాన్ నెలకొల్పారు. రాజస్థానీ మౌఖిక భాషలోని జానపద కథల ఆధారంగా 14 సంపుటాల బాతాన్ రి ఫుల్వారి (కథల తోట) ప్రచురించారు. విజయ్‌దాన్ 800కి పైగా కథలు రాశారు. వీటిల్లో కొన్నింటిని సినిమాలుగాను, కొన్నింటిని నాటకాలుగాను మలచారు. ‘చరణ్‌దాస్ చోర్’ మూల కధ విజయ్‌దాన్ రాసినదే. దీనిని హబీబ్ తన్వీర్ నాటికగా మలచారు, శ్యాం బెనగల్ సినిమాగా తీశారు.

ఈ కథల్లో గొప్ప వెలుగు ఉంది. అది పురుషుడి కళ్ల చుట్టూ అల్లుకున్న అధికార వ్యామోహపు, ఆధిపత్య లాలసత్వపు చీకటిని తుత్తునియలు చేయగల శక్తివంతమైంది. ఈ కథల్లోని పురుష పాత్రలు పురుష లోకం మీద ద్వేషంతో సృష్టించినవిగా అనిపించవు. అలాగే ఇందులోని స్త్రీ పాత్రలు పురుషులపై గుడ్డి ద్వేషాన్ని ప్రకటించవు. అదే వీటిలోని ప్రత్యేకత


-సజయ, ఒమ్మి రమేష్ బాబు (లిఖిత ప్రెస్)

2000లో లిఖిత ప్రెస్ పేరుతో ప్రచురణలను ప్రారంభించిన సజయ, ఒమ్మి రమేష్ బాబులు విజయ్‌దాన్ దేథా ఆరు కథలను తమ మొదటి పుస్తకంగా ఎంచుకోవటం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ‘ప్రాంతీయ స్థాయిలో విలసిల్లే జానపద సాహిత్యాన్నీ, కళలనీ కూడా విశ్వీకరణలో ఐక్యం చేసి వాటి అస్థిత్వాన్ని దెబ్బతీయాలన్న యత్నమూ జరుగుతోంది… ఈ సందర్భంలోనే మనం మన మౌలిక సాహిత్యపు విలువలన్నింటినీ ప్రాణప్రదంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సాహిత్యపు మూలాలన్నింటినీ శోధించి సాధించుకోవాల్సి ఉంది. ఈ లక్ష్యంతో విభిన్నమైన సామాజిక నేపథ్యాల జీవిత చిత్రణలను ప్రచురించాలన్న ఉద్దేశంతో ‘లిఖిత ప్రెస్’ ప్రారంభమౌతోంది… తన తొలి ప్రచురణగా వెలువరిస్తున్న ఈ రాజస్థానీ జానపద కథల సంకలనమే ఇందుకు సాక్ష్యం…’ అని ప్రచురణకర్తలు తమ ముందుమాటలో పేర్కొన్నారు. ఇంకా, ‘మన సమాజంలో మన గడ్డ మీద స్త్రీలు ఎటువంటి వివక్షకి గురవుతున్నారో, ఎలా శోకతప్తులవుతున్నారో కళ్లకు కట్టినట్టు వివరిస్తాయీ రాజస్థానీ జానపద కథలు, కల్పననీ, వాస్తవాన్నీకలబోసిన ఈ కథల్లో గొప్ప వెలుగు ఉంది. అది పురుషుడి కళ్ల చుట్టూ అల్లుకున్న అధికార వ్యామోహపు, ఆధిపత్య లాలసత్వపు చీకటిని తుత్తునియలు చేయగల శక్తివంతమైంది. ఈ కథల్లోని పురుష పాత్రలు పురుష లోకం మీద ద్వేషంతో సృష్టించినవిగా అనిపించవు. అలాగే ఇందులోని స్త్రీ పాత్రలు పురుషులపై గుడ్డి ద్వేషాన్ని ప్రకటించవు. అదే వీటిలోని ప్రత్యేకత,’ అని పేర్కొన్నారు. (ఈ పుస్తకం ప్రస్తుతం ముద్రణలో లేదు.)

ఆంగ్ల ప్రచురణకు పరిచయంలో, ‘తనలోని అధికార కాంక్షకు పగ్గాలు వదిలినప్పుడు పురుషులు ఎంతటి మూర్ఖులుగా, హాస్యాస్పదులుగా మారతారో జానపద సాహిత్యం స్పష్టంగా బయల్పరచడం చెప్పుకోదగిన విషయం. తమపై జరుగుతున్న అణిచివేతను బాహాటంగానూ, బయటకి కనపడకుండానూ స్త్రీలు అనేక విధాలుగా ఎలా వ్యతిరేకిస్తున్నారో ఈ కథలు తెలియచేస్తాయి. ఈ మహిళలలో ఏ ఒక్కరూ ప్రతిఘటించకుండా పడి ఉండలేదు. తమదైన హుందాతనాన్ని కాపాడుకుంటూనే పురుషులు నిర్ణయించిన వ్యవస్థలను, పద్ధతులను ప్రశ్నించి ఎదుర్కొన్నారు. జీవించటంలోని ఒక విధమైన ఆనందాన్ని, స్త్రీ – పురుషుల మధ్య మరింత సంతృప్తికరమైన, మరింత సమాన సంబంధాలను కాంక్షించటాన్నీ ఈ కథలు చాటుతున్నాయి,’ అని మధు కిష్వర్ పేర్కొన్నారు.

రాజ్‌కమల్ ప్రకాశన్ హిందీలో ప్రచురించిన ‘దువిధ’, ‘ఉల్‌ఝన్’ అన్న రెండు సంపుటాల నుంచి ఆధికారం, మానవ ప్రవర్తనపై దాని వికృత ప్రభావం అన్న అంశం చుట్టూ అల్లిన ఆరు కథలను ఎంపిక చేసి ఇంగ్లీషు అనువాదంతో ‘ద డైలెమా’ గా మానుషి ట్రస్ట్ ప్రచురించింది.

ఈ పుస్తకానికి శ్రీవిద్య నటరాజన్ జానపద శైలిని తలపించే రీతిలో ఎంతో చక్కని బొమ్మలు వేశారు. కవర్ డిజైన్ ఏలే లక్ష్మణ్ చేశారు.

విజయ్‌దాన్ దేథాది ఒక ప్రత్యేకమైన శైలి. ఇది కథ మొదలులోనే కనపడుతుంది. ఉదాహరణకు ‘కాకి విధానం’ కథ ఎలా మొదలవుతుందో చూడండి: ‘స్వప్రయోజనమే పూజ, స్వప్రయోజనమే దైవం. మిగిలినదంతా మోసం, దగా. దేశం, శీలం, అభిమానం అంటే ఎవరికి పట్టింది… మతం, కర్తవ్యం అన్నవి ఉత్తి మాటలు! పైన పటారం లోన లొటారం… ప్రేమ డొల్ల, హృదయం రాయి!… మునులు తెల్లగా కనపడతారు కానీ వాళ్ల హృదయాలు నలుపు. సృష్టికర్త, సర్వం తెలిసినవాడూ ప్రతి వ్యక్తి స్వప్రయోజనాలను తీర్చుగాక!’ అతని రచనలలో సుదీర్ఘమైన వర్ణనలు, ఉపమానాలు, సామెతలు ఉంటాయి.

అప్పటివరకు సంతోషంగా ఉన్న బీజా, తీజాలకు బీజా పురుషుడుగా మారిన మరుక్షణం అతని ప్రవర్తనలో మార్పు వల్ల సమస్యలు ఎదురవుతాయి. స్త్రీ కంటే పురుషుడు బలవంతుడని, అతని ముందు బలహీనురాలయిన మహిళ ఎందుకూ కొరగాదు అని అనుకోవటం మొదలుపెడతాడు బీజా.

పురుషుడు కావటంతోనూ, అధికారం రావటంతోనూ వ్యక్తులు ఏలా మారిపోతారో ఈ కథలు చూబిస్తాయి. ఉదాహరణకు ‘కొత్త దారి’ అన్న కథలో ఒక వ్యాపారి తన కూతురిని కొడుకు వేషంలో పెంచి తన స్నేహితుడైన మరొక వ్యాపారి కూతురితో పెళ్లి జరిపిస్తాడు. చివరికి అబ్బాయిగా పెరిగిన అమ్మాయి (బీజా) తానూ అమ్మాయినేనని గుర్తించి బాధపడుతుంది. ‘స్త్రీ పురుషుల మధ్య వివాహంలో అద్భుతమేముంది!’ అనుకుని వాళ్లిద్దరూ అమ్మాయి బట్టల్లో ఇంటి నుంచి బయటకు వెళ్లి ఒక దెయ్యం సహాయంతో అందమైన మహలులో ఆనంద డోలికల్లో విహరిస్తూ ఉంటారు. దెయ్యానికి పుంసత్వం ఇచ్చే శక్తులు ఉన్నాయని తెలుసుకుని తాను పురుషుడుగా మారతానని బీజా అంటాడు. అప్పటివరకు సంతోషంగా ఉన్న బీజా, తీజాలకు బీజా పురుషుడుగా మారిన మరుక్షణం అతని ప్రవర్తనలో మార్పు వల్ల సమస్యలు ఎదురవుతాయి. స్త్రీ కంటే పురుషుడు బలవంతుడని, అతని ముందు బలహీనురాలయిన మహిళ ఎందుకూ కొరగాదు అని అనుకోవటం మొదలుపెడతాడు బీజా. ఇద్దరూ అమ్మాయిలుగా ఉన్నప్పుడు రాని ప్రశ్న (‘ఈ ఆస్తికి అసలైన యజమాని ఎవరు?’) బీజా పురుషుడుగా మారిన తరవాత అతనిలో తలెత్తుతుంది. అంతే కాకుండా, ‘నా సొంత సామ్రాజ్యాన్ని నెలకొల్పుతాను. అంతులేని సంపదను కూడగట్టి పెద్ద సైన్యాన్ని తయారు చేస్తాను… నీ వంటి వాళ్లు వందల మంది నాకు రాణులై నా కోసం ఎదురు చూస్తుంటారు,’ అంటాడు. ఒక్క రాత్రి లోనే తమ మధ్య ఈ ‘నేను’ అన్నది ఎలా వచ్చిందని తీజా ఆశ్చర్యపోతుంది. బీజా తన తప్పుని తెలుసుకుని మళ్లీ అమ్మాయిగా మారిన తరవాతే వాళ్లిద్దరి మధ్య తిరిగి ప్రేమ నెలకొంటుంది.

‘ద్వంద్వ ప్రమాణాలు’ అన్న కథలో తన ప్రేమికుడైన రౌతుని దేశానికి రాజుగా రాణి ప్రకటించిన మరుక్షణం (మరుక్షణమే), ‘ఇటువంటి లంజను ఎలా నమ్మటం? పెళ్లి చేసుకున్న భర్తనే మోసగించటానికి వెనుకాడలేదు. తన పట్ల ఎంత కాలం విశ్వాసంగా ఉంటుంది?… వారిని నాశనం చేయకపోతే సింహాసనానికి అర్థమూ, విలువా లేకుండా పోతాయి,’ అనుకుంటాడు. పదవీచ్యుతుడైన రాజు, “తప్పు పూర్తిగా నాది కాదు. ఈ సింహాసనం, ఈ కిరీటానికి కూడా ఈ తప్పులో భాగముంది… తప్పులో అధిక భాగం ఈ రాజ్యాధికారానిదే,” అంటాడు.

‘సందిగ్ధ’ అనే కథలో వానర మనిషిని గొర్రెల కాపరిగా వ్యాపారి భార్య మారుస్తుంది. వాస్తవానికి అతను రాకుమారుడు. ఆ రహస్యం తెలిసి అతను తిరిగి రాజు అవుతాడని తెలిసినప్పుడు, “ఈ అడవిలోని ఆనందాలకు ఏ రాజ్యం సరితూగగలదు?” అని అడుగుతుంది. అలా అయితే తనని వానర మనిషిగానే ఉండనివ్వాల్సిందని అతను అంటాడు.

‘సందిగ్ధ’ అనే కథలో వానర మనిషిని గొర్రెల కాపరిగా వ్యాపారి భార్య మారుస్తుంది. వాస్తవానికి అతను రాకుమారుడు. ఆ రహస్యం తెలిసి అతను తిరిగి రాజు అవుతాడని తెలిసినప్పుడు, “ఈ అడవిలోని ఆనందాలకు ఏ రాజ్యం సరితూగగలదు?” అని అడుగుతుంది. అలా అయితే తనని వానర మనిషిగానే ఉండనివ్వాల్సిందని అతను అంటాడు. సింహాసన అధికారాన్ని చవి చూడక ముందే మొత్తం ప్రపంచాన్ని తన ఏలుబడిలోకి తీసుకుని రావాలని, గాలి, సముద్రం, పగటి కాంతుల మీద ఆధిపత్యం చెలాయించాలని ఉవ్విళ్లూరుతుంటాడు. రాజ్య విస్తరణ, భోగాలాలసతలో కూరుకునిపోయి ఆమెను దూషిస్తాడు.

విక్రమార్కుని సింహాసనం మీద కూర్చుంటే చాలు నోటి నుంచి సత్యం, న్యాయం ఎలా పలుకుతాయో, అలా పురుషుడిగా పుట్టినందుకు గర్వం, అహంకారం, స్వార్థం వంటివి పుట్టుకొస్తాయి. పెట్టుబడిదారీ విధానాన్ని అంతం చెయ్యవచ్చు కానీ పితృస్వామ్యాన్ని అంత తేలికగా అంతం చెయ్యలేమన్న దాని గురించి అందరం లోతుగా ఆలోచించాలి.

‘సంశయం’ అన్న కథ చూస్తే విజయ్‌దాన్ దేథా కథా నైపుణ్యం, ఆలోచనా విధానం అర్థమవుతాయి. వాస్తవానికి ఇది ఒక చిన్న కథ. రొమిల్లా థాపర్ ‘భారత కథలు’ అన్న పుస్తకంలో (ఇది విజ్ఞాన ప్రచురణల ద్వారా తెలుగులో అందుబాటులో ఉంది) ‘భూతం’ అన్న పేరుతో ఈ కథ ఉంది. దీని నిడివి ఒకటిన్నర పేజీలు. ధనిక వ్యాపారి కొడుకు పెళ్లి చేసుకుని భార్యతో ఊరికి తిరిగి వస్తుంటే దారిలో ఆమెను చూసి ఒక దెయ్యం మోహిస్తాడు. కొత్త భార్యని ఒంటరిని చేసి వ్యాపారి కొడుకు వ్యాపారానికి వెళితే అతని లాగా వచ్చిన దెయ్యం ఆమెతో కాపురం చేస్తుంటాడు. ఆమె భర్త తిరిగి వచ్చినప్పుడు అసలు భర్త ఎవరు అన్న ప్రశ్న తలెత్తుతుంది. తీర్పు కోసం రాజు దగ్గరకు వెళుతుంటే దారిలో ఒక గొర్రెల కాపరి ఒక సీసాలోకి దెయ్యం వెళ్లేలా చేసి అసలైన భర్తని గుర్తిస్తాడు. స్త్రీ ఒక వస్తువు కాబట్టి ఆమెను అసలైన యజమాని దగ్గరకు చేర్చటం ద్వారా న్యాయం జరిగినట్టు ఆ కథ ఉంటుంది.

పితృస్వామ్య కాలపు విలువలతో ఉన్న జానపద కథను ఆధునిక కాల భావాలతో స్త్రీ దృష్టి కోణం నుంచి మలచటం విజయ్‌దాన్ దేథా ప్రత్యేకత. ఈ పుస్తకంలో ఉన్న అన్ని కథలూ ఇలాంటివే. అవి మనలను ఆలోచింపచేస్తాయి, వదలక వెంటాడుతుంటాయి.

ఇందులో ఆ స్త్రీ ఆలోచనలకు ఎటువంటి తావు లేదు. ఇదే కథని ‘పహేలీ’ అన్న పేరుతో సినిమాగా తీశారు. అసలైన భర్తని గుర్తించినప్పటికీ జనాదరణ కోసం దెయ్యం తిరిగి అతని రూపంలో వచ్చాడన్న ముగింపుని సినిమాలో ఇచ్చారు. విజయ్‌దాన్ దేథా ఈ రెండింటికీ భిన్నంగా దీనిని 25 పేజీల అద్భుతమైన ప్రేమ కథగా మలిచాడు. ఆమె అందానికి వివశుడైన దెయ్యం ఆమెను ఆవహించి బాధించలేడు, ఆమె భర్తను ఆవహించినా ఆమె బాధపడుతుంది కాబట్టి ఏం చెయ్యాలో తెలియని స్థితిలో పడతాడు. వ్యాపారి కొడుకు పరదేశాలకు వెళ్లటం చూసి అతడి వేషంలో వస్తాడు. కొడుకే తిరిగి వచ్చాడని తల్లిదండ్రులు అనుకుంటారు. అటువంటిది కొత్త భార్యకి తేడా ఏం తెలుస్తుంది? కానీ, ఆమె నుంచి నిజం దాచటం అంటే ఆమెను మోసం చెయ్యటం అవుతుందని దెయ్యం నిజం చెపుతాడు.

దెయ్యం ప్రేమ లోని నిజాయితీని గుర్తించి, వెళ్లే వాడిని ఆపలేకపోయాను, వచ్చినవానిని ఎలా ఆపగలనని అతనిని భర్తగా అంగీకరిస్తుంది. దెయ్యం ప్రేమ కాంతితో సూర్యుడు మసకబారాడంట! వాళ్లిద్దరూ ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా రోజులు గడుపుతుంటారు. తల్లిదండ్రుల దగ్గర, గ్రామ ప్రజల దగ్గర మంచి పేరు గడిస్తారు. ఒక సందర్భంలో ఆమె ప్రేమ అతని హృదయంలోని విషాన్ని అమృతంగా మార్చిందని దెయ్యం అంటాడు. భార్య గర్భవతి అయ్యి, ప్రసవ వేదనలో ఉన్న సమయంలో విషయం తెలిసి, ఒక సంవత్సరం ముందుగానే అసలైన భర్త తిరిగి వస్తాడు. భార్య ప్రాణ గండం నుంచి బయటపడి ఆడపిల్లను ప్రసవించేంతవరకు బయట జరుగుతున్న గొడవ దెయ్యానికి పట్టదు. నాలుగేళ్ల ప్రేమమయ జీవితంతో అతడి తత్వమే మారిపోయింది. అతడు అబద్దమూ చెప్పలేడు, అలాగని నిజమూ చెప్పలేడు. ఆమె మర్యాదని కాపాడాలన్నదే అతని ఆలోచన. దెయ్యాలు చేసే మాయలు అతడికి అన్నీ తెలుసు కానీ మనుషుల మోసాల గురించి ఏమీ తెలియదట. ఆమె కష్టాలపాలు కాకూడదని గొర్రెల కాపరి పెట్టిన మొదటి రెండు పరీక్షల్లో నెగ్గి అనాలోచితంగా మూడవ పరీక్షలో నీటి బుర్రలోకి దూరి బందీ అవుతాడు. అసలు భర్త ఉన్న పడక గదిలోకి వెళ్లబోతూ భార్య, ‘జంతువులనైనా వాటి ఇష్టానికి వ్యతిరేకంగా నడిపించలేమే, అవి కనీసం నిరసనతో తలనైనా ఊపుతాయి. కానీ ఆడవాళ్లకు తమ సొంత మనసు ఉండే వీలుందా?’ అన్న ఆలోచనలతో కథ ముగుస్తుంది.

పితృస్వామ్య కాలపు విలువలతో ఉన్న జానపద కథను ఆధునిక కాల భావాలతో స్త్రీ దృష్టి కోణం నుంచి మలచటం విజయ్‌దాన్ దేథా ప్రత్యేకత. ఈ పుస్తకంలో ఉన్న అన్ని కథలూ ఇలాంటివే. అవి మనలను ఆలోచింపచేస్తాయి, వదలక వెంటాడుతుంటాయి.

++

పాఠకుల అభిరుచికి పెద్దపీట వేయడం కారణంగా కొసరాజు సురేష్ గారు మంచి అనువాద పుస్తకాలు అందించిన ఘనతని మాత్రమే సొంతం చేసుకోలేదు, వారు ‘మంచి పుస్తకం’ ప్రచురణ సంస్థ ట్రస్టీగా వందలాది పుస్తకాల భండాగారాన్ని తెలుగు పాఠకులకు అందించి మనల్ని సంపద్వంతం చేశారు. వారి అనువాదాల్లో గడ్డికపరకతో విప్లవం మొదటిదైతే బాబోయ్:బడి! రెండవది. మీకు పరిచయం చేసిన పై పుస్తకం మూడవది. చిన్నవి పెద్దవి కలిపి వారువంద పుస్తకాల దాకా తెలుగు పాఠక ప్రపంచానికి అనువదించి ఇచ్చారు, అందులో అత్యధిక ప్రజాదరణ, పలు ముద్రణలు పొందిన పాలో కోయిలో తాత్వక గ్రంథం ‘పరుసవేది’ని మీరు చదివే ఉంటారు. దాంతో పాటు హృదయాలను మండించే పెరుమాళ్ మురుగన్ ‘చితి’ కూడా వారు అనువదించినదే. 

e





మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...