Showing posts with label nature. Show all posts
Showing posts with label nature. Show all posts

Sunday, December 12, 2021

గల్పిక : చెట్టుకు చాదస్తం జాస్తి!

 గల్పిక : 

చెట్టుకు చాదస్తం జాస్తి!

 

- కర్లపాలెం హనుమంతరావు 


చెట్టుకు చాదస్తం జాస్తి. నరికినా అవి నరజాతిని  ప్రేమిస్తాయి. ఊడలు పెరికినా, వేరుతో సహా వూడబెరికినా తాను ఎండకు కాగుతూ నీడను ఇవ్వాలనే చూడడం చెట్టు  చాదస్తమా? కొమ్మలు విరుచుకు పోయే దొమ్మీజాతిని సరసకు రానీయనే కూడదు కదా వాస్తవానికి! రాళ్లేసి పళ్లు రాలగొట్టుకునే రాలుగాయిల మీద పూలు కురిపించే చెట్టును వట్టి 'ఫూల్' అనాలా? చెట్టు తన  పట్టలు చీల్చుకు పోతున్నా పట్టించుకోదు.. సరి కదా తానే తన తొర్రలో ఆ త్రాష్టుడు పైపైకి ఎగబాకేటందుకు వీలుగా మెట్లు తయారుచేయడం  విచిత్రమే! చెట్టంత ఎదిగిన మనిషి చెట్టుకు అపకారం తలపెట్టినా ఒక్క తిట్టు పదమైనా విసరడం ఎబ్బెట్టు చెట్టుజాతికి! నిలవ నీడలేని నిర్భాగ్యుడికి తనే కుదురు కడుపులో ఇంత  వెచ్చని చోటిచ్చే దయామయ జీవి లోకంలో చెట్టు కాక మరొకటి కనిపిస్తుందా? దేవుడు ఉన్నాడో లేడోనని సందేహించే మీమాంసకులకు.. ఉంటే గింటే ఎలా ఉంటాడోనని తర్కించే  ఆలోచనాపరులకు తనే దేవుడునని చెట్టు ఎప్పుడూ నోరు విప్పి సందేశమిచ్చుకోదు. గొప్ప గొప్ప సేవల నిశ్శబ్దంగా చేసుకుపోవడమే తరువు తత్వం తప్పించి గొప్పలు చెప్పుకునే నైజం చెట్టుకు వంటబట్టలేదు. వంటచెరుకుగా తనను వాడుకొమ్మన్నది.. కొమ్మలు ఎండిన తరువాత! తిండి సరుకుగా కండలు పెంచుకొమ్మనీ కాయా కసరూ, పండూ, పసరూ  విసుగూ విరామం లేకుండా కర్ణుని మించి ఎల్లవేళలా అందించేది చెట్టు. ఒక్క మనిషికనే కాదు నిజానికి చెట్టు సృష్టిలోని  తతిమ్మా అన్ని జీవులకు అమ్మను మించిన అమ్మ! అమ్మదయినా అడగనిదే పెట్టే ఔదార్యం కాదు. ఆమెయినా ఆ చెట్టు కొమ్మ ఇచ్చిన కాయా కసరు, పళ్లూ పూలతోనే సంసారం సాకేది. వంటికి చుట్టుకునే బట్ట చెట్టు ఇస్తేనే కదా వచ్చేది! కంటికి పెట్టుకునే కాటుకైనా సరే.. కాలి బూడిద అయిన పిదప మిగిలిన మాసిక నుంచే  వచ్చేదని తెలుసా! జీవుల సేవ కోసమై నేల తల్లి కడుపున పడినప్పటి బట్టే చెట్టు విత్తనమై మొలకెత్తాలని ఎంతలా తపిస్తుందో మనిషికి తెలియదు. అదనుకు పదునుగా వానలు పడితే ఆనందంగా వేళకు పంటగా మారి మన ఇంట చేరి గోదాము గుంటలో ఓ మూల దానానికి సిద్ధంగా ఉంటుంది. ఒకసారి కరవు రక్కసి రక్కేసిపోతుంది. మరోసారి వరద వచ్చి వంగడం కొట్టుకుపోతుంది. ఇంకోసారి ఏ పురుగో పుట్రో కుట్ర పన్నినట్లు తిండిగింజను తన్నుకుపోతుంది. ప్రకృతి ఉక్రోషం, ప్రకృతి సంతోషాలతో నిమిత్తంలేని సేవాతత్వం చెట్టూ చేమది.  కాబట్టే తాలూ తప్పను కూడా వదలకుండా ఏ తవుడో, చొప్పగ మార్చి సాగుపశువుల  కడుపు నింపేది. నమ్ముకున్న ఏ జీవినీ వదిలేసే ఊహ చెట్టుకు ఎప్పుడూ రాకపోవడం  సృష్టి విచిత్రాలలోకెల్లా విశేషవైన పెద్ద విచిత్రం. అగ్గి పెట్టే వంటచెరుకు నుంచి అగ్గిపెట్టెలో మండే పుల్ల సరుకు వరకు అన్నింటా చెట్టు మహావిశ్వరూపమే. చెట్టు విశ్వంభర! చెట్టు కలపగా ఇళ్లు కడుతుంది. చెట్టు  ఆకులై దడులు నిలబెడుతుంది. చెట్టు దుంగలై తల కాచినప్పుడే మనిషి ఒక ఇంటివాడుగా మారే అవకాశం. చెట్టాపట్టాలేసుకు తిరగవలసిన స్నేహితుడు చెట్టు మనిషికి.  అమ్మ పక్కన చేరి నసపెట్టే పసికందుకు  తాను ఊయల; అన్నీ వదిలి లోకం విడిచిపెట్టే మనిషిని ఆఖరి మజిలీ వరకు వదిలిపెట్టని  పేటిక చెట్టు. పాడు లోకం అని ఎంత ఈసడించిపోతున్నా తానో పాడెగా తోడుగా వచ్చే ఆత్మబంధువు కూడా ఆ చెట్టే సుమా! మట్టితో మనిషి  మమేకమయే చోటుకు గుర్తూ చిగురిస్తూ పైకి మొలచిన మొలకే సుమా!  గుర్తుగా  పూలిస్తుంది సరే.. ఆ పూలకు తావీ  ఎందుకనిస్తున్నట్లో చెట్టు? మానవత్వం ఎంత సుగంధభరితమై పరిమళించాలో చెట్టు ఇచ్చే సందేశం  మిత్రమా అది! పండు ఇస్తుంది.. సరే పండుకు రుచి ఎందుకు జతచేస్తుందిట చెట్టు? మనిషితత్వం ఎట్లా పండించుకొనాలో గురువులా తరువు బోధించే జీవనసూతం సుమా అది! కాలానికి సూచికలు చెట్టు ఎదుగుదల దిగుదలలే! ఏమీ విగలదనే వైరాగ్యం ఎంత అవాస్తవమో గ్రీష్మం వెన్నంటి వచ్చే వసంతంలో పూచి  చెట్టు జీవిత పరమార్థం ప్రకటిస్తుంది. రాతి కుప్పలు, ఇసుక తిప్పలు, జలగర్భాలు.. చివరికి బురద కూపాలు.. ఏదీ చెట్టు చివుళ్ల పచ్చని పలకరింపుకులకు బహిష్కృతం కాదు. అడిగితే బెరడునైనా మందుకు ఇచ్చేందుకు బెట్టుచేయని చెట్టు నుంచి మనిషి ఏమి పాఠం నేర్చుకుంటున్నట్లు? కట్టు బట్ట నుంచి, కొట్టుకు తినే కాయా, కసరు వరకు దాన కర్ణుడిని మించిన ఔదార్యం ప్రదర్శిస్తుంది కదా చెట్టు! నివారణలోనే కాదు, రోగ నిదాన చికిత్సలో సైతం వేరు, కాండం, మూలిక. ఆకు, పసరు, లేహ్యం, లేపనాలుగా   మొక్క చేసే సేవకు ఇంగితమున్న ఏ మానవుడైనా సాగిలపడి మొక్కాలి కదా నిజానికి? జ్ఞాన సింధు బుద్ధుడికి  గురువు తరువు; నేటి మనిషి మొరటుతనంతో  తరువు పరువు కోలుపోతున్నది; గుండె చెరువవుతున్నది.  కోరినది ఏదైనా మారు పలుకు లేకుండా సృష్టించైనా ప్రసాదించే కల్పతరువు పౌరాణికమైన కల్పన  కావచ్చునేమో’. కానీ  వాస్తవ జగత్తులోనూ గడ్డిపోచ నుంచి, గంధపు చెక్క దాకా మనిషి జీవితంలోని ఏ భాగమూ వృక్షజాతి ప్రమేయం వినా వృద్ధిచెందే అవకాశం సున్నా! దాల్చిన చెక్కా.. పూరి జగన్నాథుడు తాల్చిన చెక్కా.. మచ్చుక కై చెప్పుకునే చెట్టు తాల్చే సహస్రాధిక అవతారాలలో కొనే ముచ్చట్లు! చెట్టుకూ మనిషికీ మట్టే తల్లి. ఒకే తల్లి బిడ్డలై పుట్టినా ఇద్దరి తత్వాల మధ్య ఎందుకింత తారతమ్యం? దాని పొట్ట కొడితే తప్ప తన బతుకు గడవని చెట్టు పైన మనిషి దావవత్వం అభ్యంతరకరం. సౌహార్ద్రం సంగతి ఆనక.. కనీసం సోదరభావమైనా ప్రదర్శించే ఆలోచన నాగరీకత నేర్చినా మనిషి చేయడంలేదు.  విచారకరం! 'వృక్షో రక్షతి రక్షతః'  చాదస్త సుభాషితం కాదు. 'చెట్టును బతకనిస్తేనే చెట్టు బతకనిచ్చేది' అన్న పర్యావరణ సూత్రం  ఎంత సత్వరం వంటబడితే మనిషి మనుగడ కొనసాగింపుకు అంతటి మేలు! 

- కర్లపాలెం గనుమంతరావు 

10 - 10 - 2021 


బోథెల్ ; యూ. ఎస్.ఎ

చెట్టుకు చాదస్తం జాస్తి! - కర్లపాలెం హనుమంతరావు


చెట్టుకు చాదస్తం జాస్తి. నరికినా అవి నరజాతిని  ప్రేమిస్తాయి. ఊడలు పెరికినా, వేరుతో సహా వూడబెరికినా తాను ఎండకు కాగుతూ నీడను ఇవ్వాలనే చూడడం చెట్టు  చాదస్తమా? కొమ్మలు విరుచుకు పోయే దొమ్మీజాతిని సరసకు రానీయనే కూడదు కదా వాస్తవానికి! రాళ్లేసి పళ్లు రాలగొట్టుకునే రాలుగాయిల మీద పూలు కురిపించే చెట్టును వట్టి 'ఫూల్' అనాలా? చెట్టు తన  పట్టలు చీల్చుకు పోతున్నా పట్టించుకోదు.. సరి కదా తానే తన తొర్రలో ఆ త్రాష్టుడు పైపైకి ఎగబాకేటందుకు వీలుగా మెట్లు తయారుచేయడం  విచిత్రమే! చెట్టంత ఎదిగిన మనిషి చెట్టుకు అపకారం తలపెట్టినా ఒక్క తిట్టు పదమైనా విసరడం ఎబ్బెట్టు చెట్టుజాతికి! నిలవ నీడలేని నిర్భాగ్యుడికి తనే కుదురు కడుపులో ఇంత  వెచ్చని చోటిచ్చే దయామయ జీవి లోకంలో చెట్టు కాక మరొకటి కనిపిస్తుందా? దేవుడు ఉన్నాడో లేడోనని సందేహించే మీమాంసకులకు.. ఉంటే గింటే ఎలా ఉంటాడోనని తర్కించే  ఆలోచనాపరులకు తనే దేవుడునని చెట్టు ఎప్పుడూ నోరు విప్పి సందేశమిచ్చుకోదు. గొప్ప గొప్ప సేవల నిశ్శబ్దంగా చేసుకుపోవడమే తరువు తత్వం తప్పించి గొప్పలు చెప్పుకునే నైజం చెట్టుకు వంటబట్టలేదు. వంటచెరుకుగా తనను వాడుకొమ్మన్నది.. కొమ్మలు ఎండిన తరువాత! తిండి సరుకుగా కండలు పెంచుకొమ్మనీ కాయా కసరూ, పండూ, పసరూ  విసుగూ విరామం లేకుండా కర్ణుని మించి ఎల్లవేళలా అందించేది చెట్టు. ఒక్క మనిషికనే కాదు నిజానికి చెట్టు సృష్టిలోని  తతిమ్మా అన్ని జీవులకు అమ్మను మించిన అమ్మ! అమ్మదయినా అడగనిదే పెట్టే ఔదార్యం కాదు. ఆమెయినా ఆ చెట్టు కొమ్మ ఇచ్చిన కాయా కసరు, పళ్లూ పూలతోనే సంసారం సాకేది. వంటికి చుట్టుకునే బట్ట చెట్టు ఇస్తేనే కదా వచ్చేది! కంటికి పెట్టుకునే కాటుకైనా సరే.. కాలి బూడిద అయిన పిదప మిగిలిన మాసిక నుంచే  వచ్చేదని తెలుసా! జీవుల సేవ కోసమై నేల తల్లి కడుపున పడినప్పటి బట్టే చెట్టు విత్తనమై మొలకెత్తాలని ఎంతలా తపిస్తుందో మనిషికి తెలియదు. అదనుకు పదునుగా వానలు పడితే ఆనందంగా వేళకు పంటగా మారి మన ఇంట చేరి గోదాము గుంటలో ఓ మూల దానానికి సిద్ధంగా ఉంటుంది. ఒకసారి కరవు రక్కసి రక్కేసిపోతుంది. మరోసారి వరద వచ్చి వంగడం కొట్టుకుపోతుంది. ఇంకోసారి ఏ పురుగో పుట్రో కుట్ర పన్నినట్లు తిండిగింజను తన్నుకుపోతుంది. ప్రకృతి ఉక్రోషం, ప్రకృతి సంతోషాలతో నిమిత్తంలేని సేవాతత్వం చెట్టూ చేమది.  కాబట్టే తాలూ తప్పను కూడా వదలకుండా ఏ తవుడో, చొప్పగ మార్చి సాగుపశువుల  కడుపు నింపేది. నమ్ముకున్న ఏ జీవినీ వదిలేసే ఊహ చెట్టుకు ఎప్పుడూ రాకపోవడం  సృష్టి విచిత్రాలలోకెల్లా విశేషవైన పెద్ద విచిత్రం. అగ్గి పెట్టే వంటచెరుకు నుంచి అగ్గిపెట్టెలో మండే పుల్ల సరుకు వరకు అన్నింటా చెట్టు మహావిశ్వరూపమే. చెట్టు విశ్వంభర! చెట్టు కలపగా ఇళ్లు కడుతుంది. చెట్టు  ఆకులై దడులు నిలబెడుతుంది. చెట్టు దుంగలై తల కాచినప్పుడే మనిషి ఒక ఇంటివాడుగా మారే అవకాశం. చెట్టాపట్టాలేసుకు తిరగవలసిన స్నేహితుడు చెట్టు మనిషికి.  అమ్మ పక్కన చేరి నసపెట్టే పసికందుకు  తాను ఊయల; అన్నీ వదిలి లోకం విడిచిపెట్టే మనిషిని ఆఖరి మజిలీ వరకు వదిలిపెట్టని  పేటిక చెట్టు. పాడు లోకం అని ఎంత ఈసడించిపోతున్నా తానో పాడెగా తోడుగా వచ్చే ఆత్మబంధువు కూడా ఆ చెట్టే సుమా! మట్టితో మనిషి  మమేకమయే చోటుకు గుర్తూ చిగురిస్తూ పైకి మొలచిన మొలకే సుమా!  గుర్తుగా  పూలిస్తుంది సరే.. ఆ పూలకు తావీ  ఎందుకనిస్తున్నట్లో చెట్టు? మానవత్వం ఎంత సుగంధభరితమై పరిమళించాలో చెట్టు ఇచ్చే సందేశం  మిత్రమా అది! పండు ఇస్తుంది.. సరే పండుకు రుచి ఎందుకు జతచేస్తుందిట చెట్టు? మనిషితత్వం ఎట్లా పండించుకొనాలో గురువులా తరువు బోధించే జీవనసూతం సుమా అది! కాలానికి సూచికలు చెట్టు ఎదుగుదల దిగుదలలే! ఏమీ విగలదనే వైరాగ్యం ఎంత అవాస్తవమో గ్రీష్మం వెన్నంటి వచ్చే వసంతంలో పూచి  చెట్టు జీవిత పరమార్థం ప్రకటిస్తుంది. రాతి కుప్పలు, ఇసుక తిప్పలు, జలగర్భాలు.. చివరికి బురద కూపాలు.. ఏదీ చెట్టు చివుళ్ల పచ్చని పలకరింపుకులకు బహిష్కృతం కాదు. అడిగితే బెరడునైనా మందుకు ఇచ్చేందుకు బెట్టుచేయని చెట్టు నుంచి మనిషి ఏమి పాఠం నేర్చుకుంటున్నట్లు? కట్టు బట్ట నుంచి, కొట్టుకు తినే కాయా, కసరు వరకు దాన కర్ణుడిని మించిన ఔదార్యం ప్రదర్శిస్తుంది కదా చెట్టు! నివారణలోనే కాదు, రోగ నిదాన చికిత్సలో సైతం వేరు, కాండం, మూలిక. ఆకు, పసరు, లేహ్యం, లేపనాలుగా   మొక్క చేసే సేవకు ఇంగితమున్న ఏ మానవుడైనా సాగిలపడి మొక్కాలి కదా నిజానికి? జ్ఞాన సింధు బుద్ధుడికి  గురువు తరువు; నేటి మనిషి మొరటుతనంతో  తరువు పరువు కోలుపోతున్నది; గుండె చెరువవుతున్నది.  కోరినది ఏదైనా మారు పలుకు లేకుండా సృష్టించైనా ప్రసాదించే కల్పతరువు పౌరాణికమైన కల్పన  కావచ్చునేమో.. కానీ  వాస్తవ జగత్తులోనూ గడ్డిపోచ నుంచి, గంధపు చెక్క దాకా మనిషి జీవితంలోని ఏ భాగమూ వృక్షజాతి ప్రమేయం వినా వృద్ధిచెందే అవకాశం సున్నా! దాల్చిన చెక్కా.. పూరి జగన్నాథుడు తాల్చిన చెక్కా.. మచ్చుక కై చెప్పుకునే చెట్టు తాల్చే సహస్రాధిక అవతారాలలో కొనే ముచ్చట్లు! చెట్టుకూ మనిషికీ మట్టే తల్లి. ఒకే తల్లి బిడ్డలై పుట్టినా ఇద్దరి తత్వాల మధ్య ఎందుకింత తారతమ్యం? దాని పొట్ట కొడితే తప్ప తన బతుకు గడవని చెట్టు పైన మనిషి దావవత్వం అభ్యంతరకరం. సౌహార్ద్రం సంగతి ఆనక.. కనీసం సోదరభావమైనా ప్రదర్శించే ఆలోచన నాగరీకత నేర్చినా మనిషి చేయడంలేదు.  విచారకరం! 'వృక్షో రక్షతి రక్షతః'  చాదస్తమైన  సుభాషితం కాదు. 'చెట్టును బతకనిస్తేనే చెట్టు బతకనిచ్చేది' అన్న పర్యావరణ సూత్రం  ఎంత సత్వరం వంటబడితే మనిషి మనుగడ కొనసాగింపుకు అంతటి శ్రేయస్కరం! 
-కర్లపాలెం హనుమంతరావు 
బోథెల్; యూ ఎస్ ఎ 
08-02-2021 
***


Saturday, February 13, 2021

చిన్న కథః ఉరుము కథ -కర్లపాలెం హనుమంతరావు

  



దేవుడు, మనిషిదానవుడు అని బ్రహ్మదేవుడికి ముగ్గురు కొడుకులు.

దేవుడు ఒక రోజు తండ్రి దగ్గరకు వచ్చి 'జీవితంలో ఉపయోగించే ఏదైనా మంచి మాట ఒకటి చెప్పమ'ని ప్రార్థించాడు. 

'మాట కాదు. ఒక శబ్దం చెబుతాను.. అర్థం చేసుకుని ఆచరణలో పెట్టు!’ అంటూ 'అనే శబ్దం బోధించాడు బ్రహ్మ దేవుడు. దేవుడికి పరమానందమయింది." '' అంటే దమగుణం.. అనేగా నీ భావం తండ్రీ! నాకు దమగుణం(చెడును అణిచే గుణం) లేదనేగా నీ ఫిర్యాదు! అది  అలవర్చుకోమన్న మీ సలహా అవశ్యం పాటిస్తాను!'అని వెళ్ళిపోయాడు దేవుడు

మనిషీ బ్రహ్మదేవుణ్ణి సమీపించి అదే విధంగా జీవితానికి పనికొచ్చే మంచి్ముక్క ఏదైనా  చెప్పమని ప్రార్థించాడు. 'దేవుడికి చెప్పిందే నీకూను. ‘ద’ శబ్దం అంతరార్థం అర్థంచేసుకుని ఆచరించు!అని యథాప్రకారం  సలహా ఇచ్చాడు బ్రహ్మదేవుడు. మనిషికీ మహాసంతోషమయింది. '' అంటే దానగుణం అనేగదా తండ్రీ మీ భావం? తప్పకుండా  దానగుణాన్ని అలవర్చుకుంటాను. తండ్రికి తగ్గ బిడ్డగా పేరు తెచ్చుకుంటానుఅని ప్రమాణం చేసి వెళ్ళిపోయాడు మానవుడు. 

ఈ సారి దానవుడి వంతు వచ్చింది. 'దానవా! నీ అన్నల్లాగా నువ్వూ 'శబ్దం భావం బాగా  గ్రహించి  ఆచరణలో పెట్టు! అభివృద్ధిలోకి రా!’అని బోధించాడు బ్రహ్మదేవుడు. 'చిత్తం తండ్రీ!' మీఆజ్ఞ! 'శబ్దానికి దయాగుణం అనేగదా తమరి అర్థం? తప్పకుండా ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నిస్తానుఅని తండ్రికి వాగ్దానం చేసి నిష్క్రమించాడు దానవుడు. 

వాగ్దానాలైతే చేసారు గాని.. కాలక్రమేణా వాటిని మర్చిపోయారు బిడ్డలంతా. బ్రహ్మదేవుడికి అంతులేని దుఃఖం ముంచుకొచ్చింది. ఆ దుఃఖమే అప్పుడప్పుడూ కురిసే వర్షం. మధ్య మధ్యలో  'ద.. ద.. దఅంటూ  కన్నబిడ్డలకు వాళ్ళు మర్చిపోయిన దమదానదయా గుణాలనిగూర్చి  బ్రహ్మదేవుడు గుర్తుచేయడానికి చేసే ప్రయత్నమే ఉరుములు! ***

కర్లపాలెం హనుమంతరావు

(బృహదారణ్యకోపనిషత్తు సప్తమాధ్యాయం- ద్వితీయ బ్రాహ్మణం ఆధారంగా చెప్పిన పిట్టకథ)

 

Wednesday, February 10, 2021

ఉరుము - చిన్న కథ - కర్లపాలెం హనుమంతరావు

 


వృక్ష సంపద – ప్రకృతిచ్చిన పచ్చ’ధనం’ -కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు సంపాదకీయం)

 









 'నేత్రపర్వంబు హర్ష సందీపకంబు/ పావనకరంబు పరమ శుభావహంబు/

నీమహత్వంబు విబుదైక విగదితంబు/ దశదిశలయందు నీచారు ధవళకీర్తి

తనరుగావుత మాచంద్ర తారకముగ!' అంటూ హారతులు పట్టించుకున్న వృక్షసంపద ప్రాణికోటికి కోటి ప్రయోజనాల దాత . వృక్ష రహిత జీవావరణం ఊహకందటం కష్ట తరమే. 'పుటకే పుటకే మధు' అని పురాణ సూక్తి. ప్రతి పత్రంలోనూ మధురసం దాచి ఉంచి, ఆది నుంచి  ప్రతి జీవి  కుక్షి నింపుతున్నది  వృక్ష మాతే. చిగురుటాకు మొదలు.. ఎండు చితుకుల వరకు మొగ్గలు, పూవులు, కాయలు, పండ్లు, బెరళ్ళు.. ప్రత్యణువూ పరహితార్థంగ బతికే ప్తత్యక్ష దైవం వృక్షం.

'భూరుహాలూ మానవుల తరహాలో సుఖదుఃఖ అనుభవాలకు అతీతులేమీ కాదు. ' అన్నది మనువు మతం. జేమ్స్ మోరిసన్, జెసి బోసు గెల్వనా మీటరు సాయంతో నిరూపించిందీ ఈ సత్యమే.  కుఠార ప్రహారానికి విలపించిన విధంగానే.. గట్టు కట్టి నీరు పోస్తే చెట్టూ చేమా సంతోషిస్తాయి.. పుష్ప భావోద్వేగాలు ప్రధానాంశంగా సాగిన కరుణశ్రీ ఖండ కావ్యం మనకు  ఉదాహణగా ఉండనే ఉంది.   కాల గతిన గతించక ముందే చేసే వృక్షచ్ఛేదనను  ఉపపాతకంగా యాజ్ఞవల్క్యం(276) పరిగణించింది. పూర్వీకులు వృక్షాలకు దైవత్వం కల్పించి.. పూజనీయం చేయడంలోని ఆంతర్యం.. విలువైన  వృక్ష సంపద అర్థాంతరంగా అంతరార్థం కారాదనే. పరీశీలించే విశాల దృక్పథం ఉండాలే గాని ప్రాచీనుల సూత్ర బద్ధ నిబందనల చాటున దాగి ఉన్నదంతా.. నేటికి గాని నిగ్గు తేలని వైజ్ఞానిక అంశాల సమాహారమేనన్న సులువుగానే బధపడుతుంది. వరాహమిహిరాచార్యులు పన్నెండు వందల ఏళ్ల కిందటే  వృక్షారోపణ లక్షణాలను.. పుష్పాదుల వికాసానికి సహకరించే దోహద  క్రియలను గూర్చి పూసగుచ్చినట్లు వివరించారు.

మొక్కా మోడులను  పెంచడం ఒక్క ఆహారానికేనా? ఆరోగ్యానికి, ఆహ్లాదానికి, మానసిక ప్రశాంతతకు, ఏకాంతానికికూడా!  వైద్యునిలా, మిత్రునిలా, హితునిలా జీవితో  సన్నిహితంగా మెలిగే తల్లి ప్రవృత్తి ప్రకృతిది. కాబట్టే అడవుల నుంచి.. అధునాతన కట్టడాల వరకు హరిత పత్ర పోషణ ఒక ముఖ్య జీవితోపాసనగా మారింది. వృక్షో రక్షతి రక్షితః.

 

వృక్షాంశం ఒక  శాస్త్రంగా పఠించే సంప్రదాయం ఇక్ష్వాకుల కాలం  నుంచే ప్రచారంలో ఉందీ దేశంలో. కౌటిల్యుడు (క్రీ. పూ 850)  అర్థ శాస్త్రంలో ఆయుర్వేద వైద్యం విధి విధానాలు విస్తృతంగా  చర్చించిన విశేశం ఎంత మందికి తెలుసు?. వేదాలు, సంహితలు మొక్కల బాహ్య స్వరూప స్వభావాలను అత్యంత మనోహరంగా వర్ణించాయి.   ఆర్యులు ఆదరించిన సాగు పద్ధతుల నుంచి, చరకుడు అనుసరించిన వైద్య విధానం వరకు అన్నింటికీ వృక్షాలు, మొక్కలు, మూలికలే ప్రధాన ఆలంబన. వాల్మీకి రామాయణం ఒక వృక్ష వైజ్ఞానిక గ్రంథం.  సుందర కాండలో లంకానగర ఉద్యాన వనాలు, కాళిదాసు మేఘసందేశంలో అలకాపురి వృక్షాలు  రుతుభేధం లేకుండా పుష్పిస్తాయి. లక్ష్మణ స్వామి మూర్చ బాధకు సుషేనుడు  సంజీవ పర్వత ఓషధులతోనే చికిత్స చేసింది. యుద్ధ కాండలో ఆయుధ ప్రహారాల నుంచి గాయపడకుండా తప్పించుకునే నిమిత్తం  మహాపార్శ్వుడు, మహోదరుడు ఓషదులను, నానావిధ సుగంధాలని దేహానికి పట్టించడం విశదంగా వర్ణించడం ఉంది. శిఖరాగ్ర వృక్షాల  బెరళ్లలోని శిలీంద్ర జాలం పొడి  వర్ష ధారలకు తడిసి శరద్రాత్రుల్లో మెరుస్తుంటుంది. అధిక మోతాదుల్లోని  భాస్వరం ఈ రసాయనిక చర్యకు ప్రేరణం. హిమవత్పర్వతం మీద ఓషధులు  వెదికే  ఆంజనేయుడి దృష్టి నుంచి  'సందీప్త సర్వౌషధ సంప్రదీప్త'మూ దాటి పోలేదు! అణ్ణామలై విశ్వవిద్యాలయం మాజీ వృక్షశాస్త్రాచార్యులు టి.సి.ఎన్. సింగ్  శబ్ద తరంగాలతో భూమి పొరల ద్వారా మొక్కల్లోని ప్రత్యుత్పత్తి కణజాలాన్ని ఉత్తేజపరిస్తే సత్వర పుష్ప వికాసం  సాధ్యమేనని నిరూపించారు.  స్రీ పాద తాడనంతో అశోకం, ఆలింగనంతో గోరింట, నమ్ర వాక్యాలతో కొండ గోగు అకాలంలోనూ పుష్పిస్తాయని కాళిదాసు, శ్రీహర్షుల కృతుల్లోనూ ఉండటం తెలిస్తే నవీన తరం ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడుడుతుందేమో! కాళిదాసు శృంగార మంజరిలోని 'పూవు నుంచి పూవు పుట్టే' వింత నేడు గులాబీ, జినియా జాతి  బంతి పువ్వుల్లో  కనిపిస్తుంది. ధూర్జటి 'కాళహస్తీశ్వర మాహాత్మ్యం' లోని ఓ చెట్టు  ఆకులు తటాక జలాల్లో పడ్డవి  జలచరాలుగాను,  గాలిలో తేలేవి పక్షులుగాను, వడ్డుకు అటు ఇటుగా  పడ్డవి ఉభయచరాలుగానూ మారే విడ్డూరం వర్ణీంపబడింది. ఈజిప్టు, రోము, గ్రీసు నగరాల తవ్వకాలలో బయట పడ్డ కొన్ని చిత్రాలు ఇదే వింతను చిత్రీకరిస్తుంటే ఆ అద్భుతానిని ఏమనిపిల్చుకోవాలి?! అయినా నాటి కవుల వృక్ష పరిజ్ఞానాన్ని సాటి పాశ్చాత్యులతో కలసి  మనమూ  వెటకరిస్తున్నాము! పెరటి చెట్టంటే మరి అంత చులకన కాబోలు!

రావిలోని రాగి తేజోకారి. బావి నీటిని  సైతం ఆవిర్లెక్కించే ఉష్ణకారి.  పగలు ప్రాణ వాయువు, రాత్రి బొగ్గు పులుసు  విడిచే గుణం వేప చెట్టుది. చింత గాలి వంటిసున్నానికి బద్ధ విరోధి.  అశ్వత్ఠం వృక్ష జాతుల్లోకెల్లా అత్యుత్తమమైనదని  గీత ధృవీకరిస్తున్నది. చెట్లు విడిచే గాలి వంటికి  తగిలే చోట నివాసముంటే చాలు.. సగం ఆరోగ్యం సర్వదా వైద్య పర్యవేక్షణలో ఉన్నట్లే నంటున్నారు  ఆరోగ్య శాస్త్రవేత్తలు. రష్యన్  వృక్ష శాస్త్ర పరిశోధకులు దక్షిణ భారతాన దొరికే అత్యంత అరుదైన ఆరువేల  రకాల మొక్కలను, వెయ్యి రకాల విత్తనాలను  పరిశోధనల నిమిత్తం పట్టుకు పోయారు. అయినా మనకు చీమ కుట్టినట్లైనా లేదు! మనకు చెట్టంటే పట్టదు! కార్తీక మాసం సంబరాల్లా  వనభోజనాల సందళ్ళు సాగే కాలం. ఉసిరి చెట్టు కింద సాలగ్రామార్చన.. సామూహిక  భోజనాలు ఓ ఆచారం. కాలుష్య రహిత హరిత వనాల్లో పవిత్ర ఔషధ పరిమళాల మద్య చేసే విందు ఆరోగ్య కోణం  వైద్యుల  ప్రశంసలు అందుకుంటోన్నది. 'జిరుత వాయువులను దెచ్చి చెమట లార్చి/ చల్లదనమిచ్చి సుఖమిచ్చి సత్వమిచ్చి/కౌతుకము నిచ్చి బుద్ధివికాస మిచ్చి/యతిధి కభ్యాగతికి మరియాద వెలయ/నాదరము జూపు మంచి గృహస్థు'నితో పోల్చాడు వృక్షరాజ్యాన్ని వెనకటికి ఓ ప్రకృతి ప్రేమికుడు. వివిధ  విలయాలకు ఇప్పుడా వృక్షాలు లక్షలాదిగా    నేలకూలుతున్నాయి. . పచ్చదనం తగ్గి నేల తల్లి కళ తప్పివున్నది. వనాలే లేవు .. వన భోజనాలు ఎక్కడని ఇప్పుడు  జనాల బెంగ. నిరుత్సాహం చికిత్స కాదు గదా! విలయాల అనంతరమైనా చెట్టు ఘనత మనకు తెలిసి వచ్చింది కదా! సంతోషం. కూలినంత వేగంగా వృక్ష జాతుల్ని తిరిగి నాటే ఉద్యమానికి ప్రభుత్వాల చేత శ్రీకారం చుట్టించాల్సింది ఓట్లు వేసి గెలిపించుకున్న జనతే. ఆనందం, ధృఢ సంకల్పంతో చెట్లు నాటే కార్యక్రమంలో జనమూ స్వచ్చందంగా చొరబడితే కోల్పోయిన పచ్చ'ధనా'న్ని తిరిగి సాధించడం ఎంత సేపూ?

***

(ఈనాడు సంపాదకీయం)

-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్, యూఎస్ఎ


ఆంధ్రకల్పవృక్షం-తాడి చెట్టు- వేటూరి ప్రభాకర శాస్త్రి గారు-

 

తాటి చెట్టు ఆంధ్రుల కల్ప వృక్షం. తాటాకు చుట్టతో కట్టడాన్ని బట్టి తాళికి ఆ పేరు వచ్చిందిస్త్రీ కర్ణ భూషణాలు తాటాకు కమ్మలుతాటి తోపులు ప్రతిగ్రామంలో తప్పని సరి.యనభై తొంభై ఏళ్ళ వయసుగల వారి చేతే తాటిగింజలు నాటించేవారు ఊరి పెద్దలు.తాడి కాపు పట్టే లోపు మరణం తప్పదన్న భయం కారణం.పదిహేనేళ్ళకు గాని తాటి కాపు పట్టదు.' ముత్తాడి' అంటే మూడు తరాల తాడిని చూచిన మొనగాడని అర్థం.తను నాటిన తాటి కాపుకు పండు పడితే దాని గింజను మళ్లా నాటి మళ్లా దాని పండునూ నాటి అది కాపుకు వచ్చినదాకా నూకలు చెల్లకుండా ఉన్నాడంటే వాడు నిజంగా దీర్ఘాయుష్మవంతుడేగా! 

నేల  నాణ్యతతో  చదునుతో తాటికి నిమిత్తం లేదు.నీటి వసతి అక్కర్లేదు. విస్తీర్ణం తక్కువున్నా ఎక్కువ మొక్కలు నాటుకోవచ్చు.నాటిన మూడేళ్లకే ఆకులు మట్టలు ఉపయోగానికి వస్తాయి. కట్టుబట్ట మినహా మిగతా జీవితావశ్యక వస్తువులన్నీ తాటి చెట్టునుండి సేకర్ంచుకుని జీవయాత్ర గడుపుకున్న రోజులు ఉన్నాయి. గుడిసెకు నిట్రాడ దూలం.గోడల కొంపకైతే తనాబీలు దూలాలు, స్తంభాలు, కొమరులు, గుజ్జులు, వాసాలు, పెండెలు, అన్నింటికీ తాటిచెట్టు ఆటి వస్తుంది. కట్టడానికి తాటనార. ఇంట పడకలకి తాటియాకులుసామానుల భద్రానికి తాటి పెట్టెలు, బుట్టలు. తాటి డొక్కుతో నీరు తోడే చేద. నారతో చేంతాళ్ళు సరే సరితాటి మ్రానులు రెండుగా చీల్చి నీళ్లు పారే దోనెలుగా వాడుకోవచ్చు. తాటి ముంజెలు, తాటి పండ్లు, తాటి(నిలవ చేసిన పేసము) చాప, బుర్రగుంజు, తాటి తేగలు, తాటి బెల్లం, తాటి కల్కండ, తాటిపానకం, తాటి కల్లు వమ్టికి మేలు చేసే మంచి ఆహార పానీయాలు.

(ఆంధ్రకల్పవృక్షం-తాడి చెట్టు-వేటూరి ప్రభాకర శాస్త్రి గారు- భారతి- -46-6-1)

-సేకరణ; కర్లపాలెం హనుమంతరావు

బోథెల్, యూ ఎస్ ఎ

10 -02 -2021

Thursday, February 4, 2021

వేళకు కురవ్వద్దు.. భారీ వర్షాలు అసలొద్దు.. సరదా వ్యాసం -కర్లపాలెం హనుమంతరావు


పిలవా పెట్టకుండానే నైరుతీ  ఋతుపవనాలు వేళకు వెళ్లి ఉదారంగా   తెలుగు గడ్డల మీద  తెగ కురుస్తున్నట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో ఇంద్రుడు వరుణదేవుణ్ని పిలిపించి క్లాసు పీకాడు 

ఆహో.. ఓహో.. అంటారన్న మెప్పుకోసమా ఈ కరుణ? ఉదార హృదయం దేవుళ్ల ఉనికికే ప్రమాదం వరుణా!

నా ఆదేశం లేకుండా అసలు నువ్వు ఆ దేశాల వైపుకు ఎందుకు వెళ్లినట్లు? ఒక్క అన్నంపెట్టే వర్గమేనటయ్యా భూలోకంలో  మన కున్నది?  భక్తుల మనోభావాలు దెబ్బతింటే ఎమిటి మన గతి? కరువు కాటకాలు అనాది నుండి జనాలకు అలవాటు అయిన విపత్తులు. వాటి మీదనే ఆధారపడ్డ జీవితాల మీద చీకూ చింతా లేదా నీకు?

ఇంతటి విచ్చలవిడి ఉదారత ఇప్పటి వరకూ ఎరగను నేను .రుతుపవనాల రాకపోకల మీదనే  ప్రభుత్వాల ఉత్ఠానపతనాలు. ఒక పార్టీ పాలనలో కొన్నేళ్లపాటు  నువ్వా దిక్కే చూడలేదు.. గుర్తుందా ? . 

వానలు కరవయితేనే ప్రభుత్వాలకు మేఘమథనాల మథన. మబ్బు విత్తనాలు పెద్దమనుషుల ముఖ్యమైన ఆదాయ వనరులు . కరవుల క్కరువొస్తే ప్రకృతి విపత్తుల శాఖకు పని కరవు. 

అదే పనిగా  కురిస్తే  జలాశయాల  గతి ఏమై పోవాలని నీ ఆశయం?  కంటి తుడుపు కోసం తవ్విన గంజిగుంటలనుకుంటున్నావా  అవన్నీ! అలుగులు పారేటట్లు కురిస్తే ఆ రిజర్వాయర్లన్నీ ఆ ఖర్చు ఎవరయ్యా అచ్చుకునేది? 

మరీ కడుపుబ్బరంగా ఉందని మబ్బులు  కక్కటిల్లితే ఏ సముద్రం మీదకో పోయి కురవాలి! సాగు, తాగు నీటి అవసరాలు తీర్చే అధికారం నీ ఒక్కడికే సోపలేదే నేను! దొడ్డిదారిన తిరిగే  వాటర్ ట్యాంకుల వాళ్ళ  వాటా మర్చిపోతే ఎట్లా  నువ్వు ?

సముద్రుడు రుద్రుడవుతున్నాయ్యా నా మీద ఇక్కడ! గతంలో వాన ఒక్క చుక్క పడ్డా ఇంచక్కా తన కడుపులోకేనని  నిశ్చింతగా ఉండేవాడా సాగరుడు. ఇప్పుడు అడుగడుగునా ప్రాజెక్టులు! తాము కట్టే రాతిగట్లను కూలిస్తే ప్రభుత్వాలకు ఆగ్రహం రాదా? కాంట్రాక్టర్లకు తంటాలు తెచ్చి పెట్టేలనేనా ఈ భారీ వర్షాలు ? ఆ పని నేను నిన్నెప్పటికీ చెయ్యనివ్వను.  అంత ఉబ్బరంగా ఉందా? అడిగితే నేరుగా వెళ్లి ఆ సముద్రంలో కురవమని నేనే  పురమాయిద్దునుగా ! పుసుక్కున వెళ్లి ఆ నేల మీదనే ఉన్న నీళ్లన్నీ ఒలకబోసేయట మేంటీ ?!  

సముద్రాల ప్రసాదమే  స్వామీ నీ నీటిమేఘాలన్నీ!  కడలి గాని మొహం చాటేస్తే నీ కడుపు నిండా ఉండేదంతా కాలకూట విషమే! సాయమందుకుని,  సాయం అందించాల్సి న  సమయంలో సాకులు చూపిస్తే కింది జాతుల్లా అందరూ గమ్మునుండరు! సమయం చూసి దెబ్బ కొడితే ఇంద్రుణ్ని నా కథ మళ్లీ మొదటికొచ్చేస్తుంది. ఏనుగంటే చచ్చినా బతికినా పదివేలే గానీ, ఏనుగు మీదెక్కి ఊరేగే నా బోటివాడి విలువ అంబారీ మీదున్నంత వరకే నాయనా ! ఇందుడికి ఐరావతాన్ని దూరం చేసే ఈ కుట్రకు ఎవరు తెర లేపినా సహించే ప్రశ్నే లేదు. 

నీ కుండపోతలకు కింద ఎవరూ సంతోషంగా లేరు. చుక్క పడితే నగరాలు మహాసాగరాలయ్యే దుస్థితి. కోవిద్- పంథొమ్మిది కారణంగా ఇళ్ళల్లో కట్టిపడేసినట్లున్న జనాల బతుకు నీ జడివానల దెబ్బకు మరింత జటిలమవుతుంది .. తెలుసా ? లాక్- డౌన్లు ఎత్తేస్తున్నా నీ ముమ్మర వర్షాల మూలకంగా కాలు కింద పెట్టే పరిస్థితి లేదని తిట్టి పోస్తే నీ పోస్టు ఊస్టింగే . బి కేర్ ఫుల్ వరణా! పిచ్చి పిచ్చి రాజకీయాలతో పిచ్చిపట్టినట్లయిపోయి పాపం  జనాలు  నాలుగ్గోడల మధ్యనే పగటి దెయ్యాల్లా తిరుగుతుంటే .. నువ్వేంటీ ఇట్లా జడివానలు కురిపించి జడిపించడం?  ఆడాళ్ల  టీవీ సోపు ఏడుపులతోనా నీకు   పోటీ ? తుగ్లక్! 

వానలు పడక ఇహ ప్రభుత్వాలతో కూడా ఏ ప్రయోజనం లేదని తేలితే జనం, కనీసం ఏ కప్పల పెళ్లిళ్లు, గాడిద కళ్యాణాలతోనో కాలక్షేపం చేసేవాళ్లు. నిక్షేపంలాంటి ఆ జంతువులనూ మన మగపిల్లల మాదిరి  పెళ్లిపీటలకు దూరం చేస్తున్నావ్  కదా ! 

చెరువుల స్థితి చూస్తుంటే కడుపు చెరువవుతోందయ్యా! పూడిక తీయని చెరువులు నీ కుండపోత వర్షం దెబ్బకి  గబ్బంతా ఊళ్ల మీదకు తోసేస్తున్నామ్ ! తూము కాలవల్లో  మురికి పొంగిపొర్లుతూ  రోడ్డు మీదనే  మూసీలా ప్రవహిస్తోంది. 

వానలు పడనప్పుడు దేవుళ్లకు రుద్రాభిషేకాలు చేయడం కింద మనుషులకు  బాగా అలవాటు. ఆ భక్తి పరిశ్రమ మీదా గట్టి దెబ్బే కొట్టేస్తున్నావు  గదా నువ్వు ఎడా పెడా కురిసి   ! 

పాపం పండింది కాబట్టి శిక్షించడానికి ఈ అతివృష్టి అని మాత్రంనాకు  చెప్పద్దు! ఆ శిక్షలు, కక్షలు గట్రా అక్కడి ప్రజలెన్నుకున్న ప్రభుత్వాల బాధ్యత. ఆ పోలీసు దాడులు, విచారణలకు ఆదేశాలు అవీ చూసినా ప్రభుత్వాలు తమ వంతు బాధ్యత చక్కగా నిర్వర్తిస్తున్నట్లే లెక్క! కరోనా రోగాల నుంచి మిడతల దాడి, చైనా బెడదల దాకా దేవుళ్ల వంతు  దేవుళ్లు చేస్తుంటిరి గదా! పేరిగాడి పెత్తనంలా మధ్యలో నువ్వేంటి ఇలా ఎడా పెడా  అడగాపెట్టకుండా  అక్కడికెళ్ళి ఆగకుండా  దడదడా   ఆ వడగళ్లు, ఉరుములు, మెరుపులతో ఆగడాలు! స్టాపిట్ అట్ ఒన్స్ ! 

సమయానికిలా  అన్నీ సక్రమంగా నీలాగా  చెల్లిస్తే వెల్లికిలా పడుకోడం, కమ్మంగా తిని గుర్రుకొట్టడం జనాలకు మా బాగా అలవాటయిపోతుందయ్యా! నాస్తికత్వం బలిస్తే ఇహ  నీకూ నాకూ  ఇద్దరికీ పస్తే! మన ఉనిక్కి స్వస్తే! 

ముందర్జంటుగా  అ వర్షించడాలు.. ఉరుములు మెరుపులతో గర్జించటాలా  గట్రా ఆపెయ్ వరుణదేవా! మరీ అంత కడుపుబ్బరం తట్టుకోలేకుంటే .. ఎన్నో మహాసముద్రాలున్నాయయ్యా మనకు  భూమ్మీద.. ఎక్కడికైనా పోయి నిశ్చింతగా  కురుసుకో.. పో! ఐ డోంట్ హావ్ అబ్జెక్షన్

- కర్లపాలెం హనుమంతరావు 

బోధెల్ ; యూఎస్ఎ

05 -02 -2021 

Friday, September 11, 2020

పుష్ప వివాదము - శ్రీ యామిజాల పద్మనాభస్వామి 'పుష్ప విలాసము' నుంచి సేకరించినది.

 












(కవులూ పువ్వులూ సమాన ధర్మము కలవారు. పరిసరాలను తమ తత్త్వముతో సుగంధభరితము చేయటమే కర్తవ్యం.  యథాశక్తి  ప్రాకృతిక దీక్షతో సామాజిక సేవాబద్ధులై పదుగురితో  'శభాష్' అనిపించు కొనవలె కాని..తమలోతాము తమ తమ ఆధిక్యతను గూర్చి వృథావాదనలకు దిగి  పలుచనగుట తగదు!

కవులతోనే లోకములు తెలవారుట లేదు. ప్రొద్దు గుంకుట లేదు. ప్రాపంచిక సుఖదుఃఖములను పానపాత్రలో కవుల పాత్ర కేవలము రుచి పెంచు మధుర ఫల రసము వంటిది మాత్రమే!  

 

 

ఇట్టి ఊహలు నాలో ప్రబలముగా  ఉన్న  వేళ   నాకు యాదృచ్ఛికముగా    యామిజాల పద్మనాభస్వామిగారి - 'పుష్ప్ప విలాసము', 1953 నాటి ఉగాది భారతి సంచికలో ప్రచురితమైన కవిత కంటబడినది. నాడూ ఈనాడు వలెనె కవులు వర్గముల   మధ్య ఒక స్పర్థ వాతావరణేమేదో ఉండి ఉండవలె. అందుచేతనే ఆనాటి కోకిల స్వరములోని మందలింపుల ఒక పరి ఆలకింపవలెనన్న లక్ష్యముతో  నేటి యువకవివర్యుల  సమక్షమునకు ఈ చక్కని కవితాఖండికను తెచ్చుటకు  అయినది. హితవైన పలుకులకు పాత-కొత్తల తారతమ్యములెందుకు?!

 

"పుష్ప వివాదము"

 

అదొక పూలతోట. పలురకాల పూల జాతులు నవయవ్వనముతో మిసమిస లాడుతున్నవి. ఒక్కొక్క తీగనె పరిశీలన చేసుకుంటో పోయి నేను ఒక తిన్నెపై కూర్చున్నాను. అంతలో మలయమారుత కుమారుని చక్కిలిగింతలతో చెలరేగింది పుప్పొడి దుమారం. చివాలున లేచింది మల్లె. వాదు మొదలైనది.

 

మల్లె

ఏమే! గులాబీ! నిన్న కాక మొన్న వచ్చి నువ్వు తోటివారినందర్నీ ఆక్షేపిస్తున్నావట? ఎందుకా మిడిసిపాటు?

 

తావుల్ జల్లుదువా సుదూరముగ? పంతాలాట సైరింతువా?

ఠీవిన్ నిల్తువ రెప్పపాటయిన? చూడ్కిన్ సైతువా గట్టిగా?

క్రేవన్ బాలసమీరుండు నిలువన్ ప్రేమించి లాలింతువా?

పోవే; నెత్తురు కోతలే కదనె నీ పుట్టింటి సౌభాగ్యముల్.

 

గులాబి మాటపడుతుందా!

సరే వారన్న మాటలు వినవు చూడు!

వలపులు గ్రుమ్మరించి సుమభామల చిక్కని కౌగలింతలం-

దలరెడు తేటిరాజునకు హాయిగ స్వాగతగీతి పాడునా?

వెలువము కర్కశంబు కద; చెల్మి యెరుంగను పాపజాతితో;

తల విలువన్ గణింపవలదా? మరి సంపంగి కన్నె; మల్లికా!

 అంటూ తన వత్తాసుకై మరో ప్రియపుష్ప సేహహస్తాన్ని అందుకున్నది.

 

కేతన

అదలా వుండనీ కానీ అక్కామల్లికా!

ఈ మందార మల్లిక నన్నేమని నిందించిందో విన్నావా?

అంటూ సందు చూసుకుని మరో కేతన తగువు మధ్యకు వచ్చి దూరింది.

 

నీకే చెల్లెనె కేతకీ; కనులలో నిండార దుమ్మోయగా;

తాకిన్ నెత్తురు చింద వ్రేళ్ళు కొరుకన్; సర్పంబుగా నిల్వగా;

ఆ కంఠంబుగ పాపజాతికి శరణ్యంబై మహారణ్య మం

దేశాంతంబుగ రాణివై మెలగ; ఏరీ సాటి నీకిలన్.

అంటూ మందరా మల్లిక ఎత్తిపోసిన తిట్లన్నిటినీ తిరిగి  గుర్తుకు తెచ్చుకుంది.

 

చేమంతిః మూతి మూడు వంకలు తిప్పి అంది

ఓహో! దాని అందానికి అది మురిసిపోవాలిః

పరువంబా! ఎదలోన మెత్తదనమా?భావోల్బణ ప్రక్రియన్ 

గరువంబా!మకరంద గంధ విలసత్ కళ్యాణ సౌందర్యమా?

బిరుసై నిప్పులముద్దమోము కద; యీ పేలాపనంబేల? సం

బరమా? వచ్చిన దాని నోర్చుకొనునా పైపెచ్చు మందారమా?

అనేసింది.

మందార వదనం మరింత ఎర్రబారింది రోషకషాయిత గళముతో

'ఔనౌను నీ శౌభాగ్యనికి నన్నాక్షేపిచ వద్దూ?'

పంతములాడబోకె పయివారలు విన్నను నవ్వుకొందురె;

ఇంతులు దండలల్లకొని యెంతయు ముచ్చటతో ధరింతురం

చెంతువు నీ విలాసము 'లిహీ' యగు మాలతికన్నె ముందు చే

మంతిరొ! ఊక రేకుల సుమంబను పేరది  నీది కాదటే;

అని తగులుకుంది.

(అంతలో చేరువలో నున్న సరోజిని ఫక్కున నవ్వి)

దానికెమిలే! మాలతిలో గర్వమున్నది.

అది రేరాణినటంచు త్రుళ్ళి పడునమ్మా! దాని లేనవ్వులో

పదముల్ పాడునటమ్మ! తుమ్మెదలు; శుబ్రజ్యోత్స్నపైపూతతో

పెదవుల్ నొక్కునటమ్మ! చందురుడు, నన్వీక్షించి బల్ టెక్కుతో

ఎదో అలాపము సేయు మాలతిని నేనిన్నాళ్ళు సైరింతునే?

అని రెచ్చగొట్టేసింది మరంత అనంద ప్రదర్శనయో సన్నివేశం రక్తి కట్టిస్తో!

 

మాలతి ముక్కు ఎగబీల్చి

సైరింపక యేమి సేయగలవే? నీ వాడిన మాటలో?

బంగరు కొండపై పసిమి వెన్నెల చిన్నెల బాలభామ రే

ఖంగనవో యటంచును  ఎగాదిగ చూచెద నన్ను; నీవు రే

లం గమనీయ హాస సువిలాస వికాసములొప్పువాని చం

ద్రుంగని మూతి మూసుకొని క్రుంగవొ? నీ బ్రతు కే రెఱుంగరో?

                      *              *                *    

చతురత మీర నిట్టి సరసా లిక చాలును కట్టిపెట్టు నీ

బ్రతుకు భవిశ్యమున్ కడిగివైచెద; నాచున బుట్టి, పీతలన్

కుతకన్ దాల్చి, నీదు కనుగొల్కుల చిమ్ముదు; నీటి పుర్వువై

అతుకులబొంతవై; కసబువాతెర విప్పకుమా సరోజినీ!

అంటూ ఏకంగా మొదటి పుష్పం మందారం మళ్లీ మాటలు అందుకోవడం౿

 

ఇల్లా ఒకరినొకరు ఆక్షేపిచుకుంటూ ఉండగా శ్రుతి మించిందని

కోకిలమ్మ

భళిరా! పువ్వ్వుల కన్నెలార మన సంబంధంబుతో లోకముల్

తెలవారున్, క్షయి సేయు, నవ్వుకొను, ప్రీతిం జెందు; మీ లోన మీ

రలయింపన్ తగవా? యటంచు పగలన్ న్యాయంబుగా తీర్చు రే

ఖిల పో పొండన గూసె 'కో' యని కుగూకారమ్బు తోరంబుగన్.

అంటూ మందలింపులకు దిగిపోయింది!

 

పూలు తమ తొందరపాటుకు సిగ్గ్గుతో తలలు వంచుకున్నవి. ఒకింత సేపు గడవనిచ్చి ఒకరిని చూసి ఒకరు నవ్వుకున్నవి. తిరిగి పువ్వుల తోట నవ్వుల తోటలా మారిపోయింది.

పువ్వులకన్నా  ఘనులమని కదా మనం మన కవులను  మహా గారవించెదము. ఆ అభిమానమును  నిలుపుకొనవలెను గాని.. దురభిమానము పూనగా పూతన బంధువర్గమును మించి ఈ పరస్పర యుద్ధములేమిటికోయి కవిమిత్రులారా! మరువము దండను బోలు సుగంధ పరిమళములు జల్లు మానవతా మాలికలకు చుట్టుకొను పూవులుగా అలరించుడు! చాలించుడిక ఈ ఈశు బుట్టు విసువు మాటల  రాళ్ల బుట్ట బుగ్గిలో బోర్లించుడు!

***

సేకరణః 

కర్లపాలెం హనుమంతరావు

11 -09 -2020

Monday, August 31, 2020

ఖర్చు తక్కువ వైద్యం. పిలవగానే పలికే వైద్యుడు - ప్రకృతి -కర్లపాలెం హనుమంతరావు






ప్రకృతితో ఒక్కోరికి ఒక్కోరకమైన అక్కర. కవి, గాయకుడు ప్రకృతిని చూసి స్పందించే మంచి కవిత్వం, గానం ప్రసాదించేది.  ఆ మధ్య చైనీస్ యువకులు కొంత మంది ప్రకృతిలో దొరికే గుమ్మడి, బీర, దోస వంటి కూరగాయలను సంగీత పరికరాలుగా ఎలా ఉపయోగించవచ్చో ఒక యూ ట్యూబ్ వీడియోలో చూపించి అందరిని అవాక్కయేటట్లు చేసారు. నిజానికి ప్రకృతిలో దొరికే కాయగూరలు, దుంపలు, పండ్లు ఫలాలు సౌందర్య పోషణకు ఉపయోగించుకునే తెలివితేటలు పెంచుకుంటున్న మహిళామణులు వాటి అవసరం ముందు తిండి తిప్పలకు, మందుమాకులకు ఎంత వరకు ముఖ్యమో తెలుసుకుంటున్నారా?
మందుల దుకాణాలలో  ఔషధాలకు కొదవ ఉండదు, నిజమే కాని, అన్ని రకాల మందులు అందరు వాడటం అంత క్షేమం కాదు. కొన్ని సార్లు వికటించే ప్రమాదం కద్దు. ఏవి హాని చెయ్యనివో తెలుసుకోవడానికి మళ్ళీ  ఏ అలోపతి వైద్యుడి దగ్గరకో పరుగులెత్తాలి. వేళకు అన్ని చోట్లా డాక్టర్లు అందుబాటులో ఉండే దేశమా మనది? భారతదేశం వరకు అందరికీ అందుబాటులో ఉండే వైద్యుడు ప్రకృతి నారాయణుడు. ఆ వైద్యనారాయణుడి థెరపీని నమ్ముకుంటేనే  మన ప్రాణాలకు తెరిపి.
ఉదాహరణకు, గోళ్ల కింద గాయమయిందనుకోండి. ఒక్కో సందర్భంలో కొనుక్కొచ్చుకున్న మందు గోరు చివుళ్ల సందున సరిగ్గా అమరదు. వాడినట్లే ఉంటుంది కాని, ఫలితం కనిపించదు. కనిపించినా దాని ప్రభావం నెమ్మది మీద గాని తెలిసే అవకాశం లేదు. అదే వంటింట్లోనే కూరగాయల బుట్టలో ఏ వేళకైనా దొరికే బంగాళా దుంపను ముక్కలుగా కోసి ఒక ముక్కతో ఆ గాయమయిన భాగం కవర్ అయే విధంగా కట్టుకట్టుకుంటే సరి. మూడు రోజులు వరసగా ఉదయాన్నే పాత ముక్క స్థానంలో కొత్త ముక్కను పెట్టి కట్టుకుంటే నాలుగో రోజున అక్కడ గాయమైన ఛాయలు కూడా కనిపించవు.  చర్మం పైన పొక్కులు, బొబ్బలు కనిపిస్తే బంగాళా దుంపల ముక్కలతో గట్టిగా రుద్దితే వెంటనే మంచి గుణం కనిపిస్తుంది.  అలాగే బంగాళా దుంపను ఉడకబెట్టిన నీరు షాంపూ కండిషనర్ కన్నా మంచి ప్రభావం చూపిస్తుంది. రెగ్యులర్ షాంపూతో తల శుభ్రం చేసుకున్న తరువాత ఆరబోసిన వెంట్రుకలను ఉడికిన బంగాళా దుంపల నీళ్లతో కడిగి ఆరబెట్టుకుంటే ఆ శిరోజాల మెరుపు సహజంగా ఉందటమే కాదు, జుత్తుకు భవిష్యత్తులో హాని కూడా కలగదు. బూడిద రంగుకు తిరుగుతున్న జుత్తును దారిలోకి తేవాలన్నా ఈ బంగాళాదుంపల ద్రవంతో కడిగే అలవాటు క్రమం తప్పకుండా చేస్తే సరిపోతుంది. కాణీ ఖర్చు లేని వైద్యం. పిలవగానే పలికే వైద్యుడు ప్రకృతి.
బంగాళా దుంపలు కళ్ల ఉబ్బును తగ్గిస్తాయి. తడిగా ఉన్న భాగం వేపుని కొద్దిసేపు కళ్ల కింద పెట్టుకుని, ఆ తరువాత రుద్దుకుంటే  ముడతలు బిగిసుకుంటాయి. క్రమం తప్పకుండా చేసేవారికి కళ్ల కింద ఉబ్బు బాధ నుంచి విముక్తి కలుగుతుంది. మో చేతుల కింద అదే పనిగా వత్తిడి  ఉన్నవాళ్లకు ఆ ప్రదేశంలో నల్లటి మరకలు నిలబడిపోతాయి, వాటి మీద  క్రమ తప్పకుండా బంగాళాదుంప ముక్కలను రుద్దుతుంటే మరకలు తొలగిపోతాయి.
బంగాళాదుంపలకు చర్మానికి భలే లింకు. దుంపలు కడిగిన నీళ్లలో నిమ్మ రసం పిండుకుని దానితో మొహం శుభ్రం చేసుకోవడం అలవాటుగా ఉన్నవాళ్ల మొహంలో ఆ కళే వేరు. వదనం  సమ్మోహనంగా మారుతుందిఎండపొడికి చర్మం కమిలిన  చోట బంగాళా దుంపల తడి చెక్కలు ఉంచితే చర్మం అతి తొందరలో తిరిగి సహజ స్థితికి  వచ్చేస్తుంది. ఉడికించిన బంగాళా దుంపల ముద్దలో వేళ్లతో ఎత్తిపెట్టిన పెరుగు రవ్వంత కలిపి ఆ పేస్టును మొహానికి పట్టించుకోవడం అలవాటు చేసుకుంటే మొగం ఎప్పుడూ మంచి  నిగారింపుతో కళకళలాడుతుంది. బంగాళా దుంపల పేస్టుకు దోసకాయ పేస్టు, సోడావుప్పు కలిపి ఆ పేస్టుతో  మొహం శుభ్రం చేసుకునే అలవాటు ఉన్నవారికి వయసు పైబడిన తరువాత  చర్మం మీద ఏర్పడే ముడతలు వెనకడుగు పడతాయి.
పిల్లలు తిరుగుతున్న ఇంటిలో గోడలకో, గడపలకో పెయింటింగు వేయించాల్సిన అవసరం వస్తుంటుంది ఒక్కోసారి. పెయింట్లలో వాడే పదార్థాలకు తోడు, వార్నిష్ నుంచి వచ్చె గాలి ఇంటి వాతావరణంలోఒక రకమైన ఘాటుతనం పెంచి, ఒక్కోసారి వాంతులు అయేంత వరకు పరిస్థితి వికటిస్తుంది. పసిపిల్లలను, ముసలివాళ్లను ఎక్కువగా బాధించే ఈ కాలుష్య సమస్యకు ఉపాయం, పెయింట్ చేసే స్థలంలో సగం తరిగిన ఉల్లి ముక్కలు ఉంచితే ఆ ఘాటుకు ఈ ఘాటు సరితూగి కాలుష్య ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. ఉల్లిపాయలో గంధకం ఉంటుంది. ఆ ధాతువు విషానికి విరుగుడుగా పనిచేస్తుంది. చెవికి సంబంధించిన వ్యాధులకు ఉల్లిపాయ బ్రహ్మౌషధం. చెవిపోటు వచ్చిన సందర్భాలలో చెవి దగ్గర ఉల్లిపాయ ముక్క ఉంచి కట్టు కట్టి రోజంతా వదిలేస్తే కర్ణభేరిలోని కాలుష్యకారకాలు నశించి బాధ నుంచి ఉపశమనం తప్పక కలుగుతుంది.  
పాదాలపైన గాయాలు, వ్రణాలు అయినప్పుడు తేనెను మందులా ఉపయోగించాలి. గాయమైన చోట తేనె రాస్తూ ఉంటే కొత్త కణాలు తొందరగా పుట్టుకొచ్చి గాయం పూడే సమయం తగ్గిపోతుంది.  తేనెకు సూక్ష్మక్రిములను నాశనం చేసే గుణం ఉంది.
వంటి దురదలకు యవలు మంచి మందు. యవల జావను ఒక గుడ్డలో కట్టి  నీటిలో ముంచి ఆ తడి మూటను దురద పుట్టిన చోట రుద్దుతూ పోతే బాధ  క్రమంగా తగ్గిపోతుంది. మశూశికం పోసినప్పుడు చర్మం మీద పొక్కులు లేచి దురద పుట్టిస్తాయి. వాటిని గోకినందువల్ల చుట్టు పక్కలకు ఆ దురద క్రిములు మరంతగా విస్తరించే అవకాశమే ఎక్కువ. ఈ తరహా సందర్భాలలో యవల జావ వైద్యం అపకారం చేయనై ఉత్తమ ఉపశమనం.
తాజా నిమ్మరసం వాసనచూడడం వల్ల, మద్యం అతిగా తాగిన హాంగోవర్ బాధ నుంచి ఉపశమనం సాధ్యమే. నిమ్మ, ద్రాక్ష, నారింజ, తొక్కలను మూడు నాలుగు రోజుల పాటు ఎండకు పెట్టి ఆనక నిల్వచేసుకుంటే సబ్బులాగా వాటిని వాడుకోవచ్చు. బొప్పాయి తొక్కల గుజ్జును అరికాళ్ల కింద రాసుకుంటే అందులో ఉండే రసాయనాల ప్రభావం వల్ల అక్కడ ఉండే మృత చర్మకణాలన్నీ తొలగిపోయి పాదాలు పరిశుభంగా కనిపిస్తాయి. అరటి తొక్కల గుజ్జు భాగం వైపు పంధదార జల్లి స్నానం చేసే ముందు వంటికి పట్టిస్తే చర్మం మీద చేరిన మకిలంతా తొలగి స్నానానంతరం శరీరం నిగనిగలాడుతుంది
ఇండియాలో కూడా ఇప్పుడు దొరుకుతున్నాయనుకుంటా మన బేరీ పండ్లను పోలి ఉష్ణమండలాలలో పెరిగే ఒక రకమైన కాయ అవకాడో! దానితో ఎండలో తిరిగి వచ్చిన తరువాత ముఖం రుద్దుకుంటే మొహం చల్లగా హాయిగా ఉండి శరీర ఉష్టోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. పనసపండులోని రసాయనాలు మనిషి శరీరం మీది మృతకణాలను తొలగించడానికి బాగా ఉపయోగిస్తాయి
స్ట్రా బెర్రీ పళ్లు దంతాలను ధవళ కాంతితో  ధగధలాడించే ఇంద్ర్రజాలం ప్రదర్శిస్తాయి. వడదెబ్బకు పుచ్చకాయలు మంచి ఔషధం. చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడంలోనూ పుచ్చకాయల పాత్ర అమోఘమైనది.
ప్రకృతిలో లభ్యమయ్యే వస్తువుల నుంచి లాభం పొందే కళ అభివృద్ధి చేసుకోబట్టే మనిషి మిగతా జీవజాతులతో పరిణామదశ పోటీలో ముందున్నది.  ప్రాణమిచ్చి, ఆ ప్రాణం నిలబెట్టే ప్రకృతిని ప్రాణప్రదంగా చూసుకోవాలే తప్పించి, ప్రకృతి వైద్యుడి ఉనికికే చేటు తెచ్చే విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆ కష్టనష్టాలు చివరికి మనుషులుగా మనకు మనమే కొని తెచ్చుకున్నట్లే అవుతుంది!
-కర్లపాలెం హనుమంతరావు
31 -08 -2020

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...