Showing posts with label Child. Show all posts
Showing posts with label Child. Show all posts

Thursday, December 16, 2021

చందమామ కథ పరీక్షా ఫలితం రచన - బి. లక్ష్మణాచారి ( చందమామ - మాసపత్రిక - అక్టోబర్ - 1964 సేకరణ : కర్లపాలెం హనుమంతరావు

చందమామ కథ 


పరీక్షా ఫలితం 

రచన - బి. లక్ష్మణాచారి 

( చందమామ - మాసపత్రిక - అక్టోబర్ - 1964 

సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

              

సింధుదేశాన్ని మలయకేతు మహారాజు పాలిస్తూ ఉండేవాడు. ఆయన ఏకైక పుత్రిక వనజముఖి పరమ సుందరిగా కీర్తికెక్కింది. ఆమెను పెళ్ళాడాలని అనేక మంది రాజ కుమారులు వచ్చారు గాని, రాజకుమారి పెట్టిన పరీక్షలో నెగ్గలేకపోయారు. ఈ పరీక్ష గురించి వాడవాడలా తెలిసిపోయింది.


తనను పెళ్ళాడేవాడు ధైర్యవంతుడూ, వీరుడూ, యుక్తిపరుడూ అయి ఉండాలనే ఉద్దేశంతో రాజకుమారి ఈ పరీక్ష ఏర్పాటు చేసింది. ఆమె వచ్చిన వారి నందరినీ పరీక్షకు పెట్టలేదు; వారి వయసూ, అంద చందాలూ తనకు నచ్చిన మీదటనే ఆమె వారికి పరీక్ష ఇచ్చింది.


ఆ పరీక్ష ఈవిధంగా ఉన్నది: రాజభవనానికి ఉత్తరాన ఒక తోటా, దానికి ఉత్తరాన చిన్న అరణ్యమూ ఉన్నాయి. ఆమెను పెళ్ళాడ గోరినవాడు ఆ అరణ్యంలో ప్రవేశించి, అందులో దారి తప్పకుండా  తిరిగి రాజభవనానికి రావాలి. అరణ్యంలో ఒక పులి ఉన్నది. దాన్ని నిరాయుధుడై జయించి రాజ ముందుకు వచ్చి, తోటలో ప్రవేశించాలి. ఆ  తోటలో ఒక భయంకరమైన పక్షి ఉన్నది;  అది ఎవరినన్నా చూడగానే మీదికి వచ్చి కళ్ళు రెండూ పొడిచేస్తుంది. దాన్ని కూడా తప్పించుకుని రాజభవనం కేసి వస్తే తోటకూ, రాజభవనం ఆవరణకూ మధ్యగా ఒక బురద కందకం ఉన్నది. అందులో  గొంతు లోతు బురద ఉంటుంది. ఆ కందకంలోకి దిగి రాజభవనం చేరుకోగానే, రాజ మె కుమార్తె తన స్వహస్తాలతో లోటాడు నీళ్ళి స్తుంది. ఆ లోటాడు నీళ్ళతోనే బురద అంతా పోయేలాగు కడుక్కోవాలి. ఈ పరీ క్షలో నెగ్గినవాణ్ణి ఆమె పెళ్ళాడుతుంది. 


ఆమెను పెళ్ళాడ వచ్చిన వారిలో కొందరు పులి చేత చచ్చారు. మరి కొందరు పులి బారి నుండి తప్పించుకుని, భయంకర పక్షి మూలాన కళ్ళు పోగొట్టుకున్నారు. పులినీ, పక్షిని జయించి బురదలో దిగి వచ్చినా, లోటాడు నీటితో ఒళ్ళంతా కడుక్కోవటం ఎలా సాధ్యమవుతుంది?


ఈ అసాధ్యమైన పరీక్ష గురించి నాగావళి  రాజకుమారుడు ప్రతాపుడనేవాడు విన్నాడు. అతను సింధుదేశపు రాజధానికి వచ్చి, రాజ భవనానికి ఉత్తరాన ఉన్న అరణ్యాన్ని ఒక సారి చుట్టి వచ్చాడు. అరణ్యం చుట్టూ బలమైన కంచె వేసి ఉన్నది. ఆ కంచెలోనే ఉత్తర భాగంలో ఒక ద్వారమున్నది. చుట్టూ కంచె ఉండటమే గాక, రాజభవనానికి దగ్గిరిగా కూడా ఉన్నందున, ఆ అరణ్యం సహజమైనది కాదనీ, కృత్రిమ మైనదనీ, అందులో ఉండే పులి కూడా మనుషులు పెంచేదే అయి ఉంటుందనీ అతను ఊహించాడు.


తరువాత ప్రతాపుడు రాజకుమార్తెను సందర్శించాడు. అతను పరీక్షకు నిలబడ టానికి ఆమె సమ్మతించింది. ఎందుకంటే అతను యువకుడూ, అందగాడూనూ. అతను మనిషి ముఖాన్ని పోలి ఉండేటట్టుగా ఒక ముఖ కవచం చేయించుకున్నాడు. అది ధరించినట్టయితే, కళ్ళూ, ముక్కూ, గడ్డమూ, నుదురూ మొదలైన వాటితో కూడి, అచ్చగా మనిషి ముఖాన్ని పోలి ఉంటుంది, కాని అది లోహంతో చేయబడినది. ఈ కవచాన్ని చంకన పెట్టు కుని, చేతిలో మాంసం మూటగట్టి పట్టు కుని, ప్రతాపుడు ఉత్తర ద్వారం కుండా అరణ్యంలో ప్రవేశించాడు.


అరణ్యంలో అతను కొద్ది దూరం వెళ్ళే సరికి గాండ్రిస్తూ పులి ఎదురయింది. అతను మాంసం మూట విప్పి పులిముందు పడేసి తన ముఖానికి కవచం ధరించుకుని ముందుకు సాగాడు. పులి మాంసం తినటంలో నిమగ్నమై పోయి అతని గొడవే పట్టించుకోలేదు.


ప్రతాపుడు అరణ్యం దాటి తోటలో ప్రవేశించగానే భయంకర పక్షి వచ్చి, అతని ముఖ కవచంలోని కళ్ళను పొడిచి తన దారిన తాను పోయింది. అతను ముఖ కవచాన్ని తీసి దూరంగా పారేసి, తోటకూ రాజభవనం ఆవరణకూ మధ్య ఉండే బురద కందకంలోకి దిగి, పైకి వచ్చి, రాజ భవనాన్ని చేరుకున్నాడు.


రాజకుమారి లోటాడు నీళ్ళతో సిద్ధంగా ఉన్నది. ప్రతాపు డామెతో, "ఈ పరీక్షలో రెండు అంశాలలో నెగ్గాను. ఈ మూడవ దానిలో నెగ్గించే బాధ్యత అంతా నీ పైన ఉన్నది," అన్నాడు.


"ఈ లోటాడు నీటితో ఒంటి బురద అంతా కడుక్కోవలిసినవాడవు నీవేగదా?” అన్నది రాజకుమారి.


" అలాగే కడుక్కుంటాను. కాని ఆ నీరు పొయ్యవలిసిన పని నీది. జాగ్రత్త, ఒక్క చుక్క కూడా నేలపై పడకూడదు. అలా పడిన ప్రతి చుక్కకూ ఒక్కొక్క బిందెడు నీరివ్వవలిసి ఉంటుంది,” అన్నాడు ప్రతాపుడు.


"పరీక్షలో నెగ్గాపులే. స్నానం చేతువుగాని పద!" అన్నది రాజకుమారి. తరవాత వారిద్దరికీ వైభవంగా పెళ్ళి జరిగింది.


- బి. లక్ష్మణాచారి 

( చందమామ - మాసపత్రిక - అక్టోబర్ - 1964 

సేకరణ : 

కర్లపాలెం హనుమంతరావు 

16 - 11-2021

బోథెల్ ; యూఎస్ఎ 

Tuesday, December 14, 2021

వ్యాసం మన ఆట పాటలు - మలపాక వేంకటాచలపతి సేకరణ : కర్లపాలెం హనుమంతరావు

వ్యాసం 

మన ఆట పాటలు 

- మలపాక వేంకటాచలపతి 

సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 


విద్యావిధానంలో మన తండ్రుల కాలము, మన కాలములలోపుగ నే అనేక మార్పులు వచ్చాయి. దినమూ వస్తూనే ఉన్న విద్యాబోధకులకు ఒక టే సమ స్య' శేష ప్రశ్న' గా ఆదినుంచి వస్తూంది "బాల బాలి కల దృష్టి చదువువైపు చెదరకుండా నిల్పడ మెట్లా?" ఆని. 


పశ్చిమ దేశాల్లో విద్యాసంస్కర్తల రూసో కాలం నుంచి క్రొత్తమార్గాలు త్రొక్కినారు. దాని ఫలితంగా బాలుడు అభివృద్ధిపొందని వృద్ధుడు కాడనీ, అతని మన స్పతికోమలమనీ, సామాన్యమానవునకుండే రస వికారాలు  అతనికి లేవనీ తెలియబడ్డది. అందుచేత పశ్చిమదేశాల్లో బాలుని కఠినపరీక్షలకు గురిచేసే విద్యా విధానము మార్చబడి, బాలుని మనోగత అభిప్రాయా లు, ఐచ్ఛికముల ననుసరించి విద్యాబోధన ప్రారంభింప బడింది. 


కాని 'ఫ్రీబెల్' అనే ఆయన కాలమువరకు ఆటపాటలకు విద్యావ్యాప్తిపైగల    ప్రభావము గుర్తింపక బడినట్లు కన్పడదు. ఇతడు బిడ్డలకు సహజమును, నైసర్గికమునగు ఆటద్వారా విద్యను నేర్పవచ్చునని గ్రహించెను. ఇతడే మొదట 'ఆటపాటల'ను (Play_ Songs) వ్రాసి ఆటవస్తువులను తయారు చేసి పిల్లలకు విద్య ప్రారంభించాడు. ఇతని కాలమునుంచి కిండర్ గార్ట్ (Kindergarten) పద్ధతి ప్రాముఖ్యత వహించి విద్యాసంస్కర్తల అభిమానపద్ధతి ఆయ్యెను.


మన ఆంధ్రదేశములోకూడ ఈ ఆటపాటలు ఆనాదినుంచి ఉన్నవి. కాని వాటి విలువ గ్రహించినట్లు కన్పడదు. దీనినిబట్టి చూస్తే 'ఫ్రీబెల్' యొక్క పద్ధతి క్రొత్తది కాదని తెలుస్తుంది.


విద్య యొక్క పరమావధి మానవవికాసమని మన వారూ, పాశ్చాత్యులూ అంగీకరించిన విషయమే. విద్య మానవునికి సంపూర్ణత్వ మిచ్చేదని చాలమంది ఒప్పుకుంటారు. అట్టి సంపూర్ణత్వముకోసమే మన ఆచారవ్యవహారాలలో, నోములలో, వ్రతములలో, చిన్నప్పటి ఆటపాటలలో, తల్లి శిశువు నోదార్చే జోలపాటలలో విద్యాతత్త్వ మిమడ్పబడి ఉన్నది.


'ఫ్రీబెల్' (Froebel) తన ఆటపాటల్ని శిశువు యొక్క మొదటి సంవత్సరాన్నించి ఆరవ సంవత్స రమువరకు వ్రాశాడు. అతని ఉద్దేశము బిడ్డల్ని సరిగా పెంచగల తల్లులే ఈ ఆటపాటల్ని ఉపయోగించగలరని. కాని ఆట అనేక రూపాలతో వృద్ధులవరకు అభివృద్ధి చెందిఉన్నది. ఆబాలగోపాలము ఆనందించగల ఆట 'నాటకము' __కవియొక్క, సాహిత్యము యొక్క తుది ఫలము. ఆట ఏవిధముగా బాలకుణ్ణి ప్రభావితుణ్ణిగా చేస్తుంది నాటకముకూడ.  అట్లాగే అందర్నీ ప్రభావితుల్ని చేయగలదు. 


శిశువు ఆటలను, పాటలను సులువుగా అనుకరించగలదని మనస్తత్వజ్ఞులు తెలుసుకున్నారు. ఆవేశపూరితమైన బాల్యము, అచిరకాలమునకు పూర్వమే  నిత్యానందమయ స్వర్గలోకము ఆనందలహరిని ఆమృతమయ గాన, నృత్యములతో రెట్టించి రెట్టించి పాడి తన భావాన్ని వ్యక్తపరుస్తుంది. తండ్రి శిశువుకు కొంచెము బిస్కత్తు పెట్టినపుడు “ఇంకా కావాలీ ఈ, ఈ" అని రాగము తీస్తూ కాళ్లగజ్జెలు ఘల్లును నేటట్లు గంతులు వేస్తుంది శిశువు. ఇది అనుభవైక వేద్యము, ఇట్టి పిన్నవయసునందు  పాటలతో నేర్పబడిన జ్ఞానము, ఆటలతో నేర్పబడిన నడత చిరస్థాయి, ఆనందదాయకము. శిశువు లావేశపూరితులే కాకుండా, అనుకరణ బద్దులుకూడను. అతిచురుకైన వారి యింద్రియములూ, అంతకన్న నిశితమైన వారి మెదడూ చూడబడే విష యాల్నీ, చెప్పబడే జ్ఞానాన్నీ అతిసులువుగా గ్రహిస్తుంది. కనుక ఈకాలములో వారికి బోధపడే విజయాల్ని, అభిప్రాయాల్ని, నేర్చు లిషయాలని  తల్లిదండ్రులు పరిశీలిస్తూ తగుజాగ్రత్త  తీసుకోవాలి. కనుకనే ఈవయసున నేర్పబడు కథలు , ఆటపాటలు ఎట్టివి  ఉంచాలి అనేది విద్యాబోధకులు నిర్ణయించాలి. ఇప్పుడు మక ఆటపొటలలోని ప్రాశస్త్యాన్ని


మొదట మన తల్లులు  మనకు నేర్పే ఆటపాటలలో ఒకటి 'ఏనుగు పాట' . తల్లి తన శిశువును తన కాళ్లమీద కూర్చుండబెట్టుకుని

" ఏనుగమ్మ ఏనుగు ఏవూరు  వచ్చింది ఏనుగు ఉప్పాడ వెళ్లింది. ఏనుగు ఉప్పునీరు త్రాగింది ఏనుగు చూపూరు వచ్చింది ఏనుగు మంచినీరు త్రాగింది ఏనుగు' అని పాడుతూ  శిశువు యొక్క మెడ పట్టుకుని ముందుకు నెట్టుతుంది; శిశువు కాళ్లు బిగదన్ని మరల వెనుకకు వస్తుంది. ప్రారంభదశ దాటగానే ఈ పాట వివడం తడవుగా శిశువు  ముందుకూ వెనకకూ ఊగటం ప్రారంభిస్తుంది. ఇది ఒక శరీరోపాసన  (bodily exercise). ఏనుగు యొక్క సతతచలనగుణము ఈపాట లో యిమడ్చబడిఉన్నది.


పసిబిడ్డకు  మొదలుకొని పండుముసలికి వరకు  చంద్ర డాహ్లాదకరుడే. (ఒక్క విరహుల్ని మినహాయించాలి  కాబోలు!) సారస్వతంలో చంద్రుడు చాలా స్థానమాక్రమించుకున్నాడు. ఇట్టి చంద్రుణ్ణి తల్లి 

' చందమామ రావే జాబిల్లి  రావే 

కొండెక్కి రావే గోగుపూలు తేవె  నేన పసిడి గిన్నెలో పాలుపోసుకుని  వెండి గిన్నెలో పెరుగుపోసుకుని  ఒలిచిన పండు ఒళ్లో వేసుకుని ఒలవని పండు చేత్తో పట్టుకుని  అట్లా అట్లా వచ్చి అమ్మాయినోట్లో వేయవే ' అని పాడుతూ 'ఆం ' తినిపిస్తుంది. శిశువుకూడా తదేక ధ్యానంతో   చిట్టి చేతులతో 'చందమామ'ని చూస్తూ  అల్లరి చేయకుండా  'బువ్వ' తింటాడు . అన్నం తినేటప్పుడేకాకుండా చంద్రుడు కనపడినప్పుడు శిశివు తన చేతులతో పిలుస్తాడు. ఈ పాటవల్ల శిశువు క్రమంగా  సౌందర్యగ్రహణ శక్తి, ఊహ, ఆకాశమునందలి జీవులను  గూర్చి తెలుసుకోవాలనే ఆశక్తి, పెరుగుతుంది. తద్వారా భగవంతుని వైపు దృష్టి మరలడానికి  అనేక రకాల అవకాశాలు కలుగుతాయి . ఫ్రీబెల్ 'యొక్క మదటి బహుమానపు శరీరవ్యాయామము ఇక్కడ  కలుగుతుంది.


ఇదే వయస్సులో, అనగా రెండేళ్ల వయసులో  భోజన పదార్థాలు తెలిపే  'చక్కిలిగింత ' ఆట నేర్పవచ్చు. పప్పు పెట్టి, కూర వేసి , పిండివంటలు చేసి... అత్తారింటికి  ఇల్లా, ... అంటూ తల్లి తన చేతి వేళ్లని శిశువుల చేతినింది చంక వరకు  నడిపించి గిలిగింతలు పెడుతుంది.  


బిడ్డకి రెండేళ్లు వచ్చి బాగా  కూర్చోటం అలవాటైనతర్వాత 'కాళ్లాగజ్జా ' ఆట నేర్పవచ్చు. ఆ పొట యిది :


కాళ్ల గజ్జె- కంకాణమ్మ

వేగు చుక్క - వెలగ మొగ్గ 

మొగ్గ కాదు - మోతి నీరు 

నీరుకాదు - నిమ్మల వాయ 

వాయకాదు- వావిలి కూర 

కూరకాదు - గుమ్మడి మీసం 

మీసం కాదు - మిరియాలపోతు 

పోతుకాదు ' బొమ్మల శెట్టి

శెట్టి కాదు - శ్యామల మన్ను 

 మన్ను కాగు -మంచి గంధవు  చెక్క 


ఈ నలుగురైదుగురు  పిల్లలు వరుసగా కాళ్లు చాపుకుని కూర్చోవాలి .  ఒకరు పై పాటలోని ఒక్కొక్క పదానికి ఒక్కొకకాలే కొట్టుచూ    అందరి కాళ్లూ  వరుసగా తట్టుచూ వెనుకకు ముందుకు తట్టుచూ  ఉండాలి. 'మంచి గంధపు చెక్క' అని ఏ కాలిమీదికి వస్తే ఆ కాలం పండినట్లు.  పండిని కాలు ముడుచుకోవాలి. ఇట్లాఅందరి కాళ్లూ  పండేవరకూ ఈ పాట పాడుకూ ఉండాలి. ఈ ఆటపాటలో బిడ్డకి కొన్ని ఆభరణాల పేర్లు— గజ్జెలు, కంకణము, వేగుచుక్క, వెలగ మొగ్గ మొదలైనవి-  కాళ్లు  ముడుచుకొనుట అనేజ్ఞానం కలుగుతుంది. ఈ పాటలో వైద్య శాస్త్రము కూడా ఉన్న దని మనకు తెలుసు.


ఈ వయస్సుననే 'గుడుగుడు గుంచము' ఆట ఆడవచ్చు. ఈ ఆటకు నలుగురైదుగురు పిల్లలు కూర్చుండి ముడిచిన గుప్పిళ్లు ఒకదానిమీద ఒకటి పెట్టుదురు . దీనివల్ల వీరికి ఒకవిధమైన పరిమాణ స్వరూపం తెలుస్తుంది. ఈ ఆట 'కాళ్లగజ్జె ' ఆట కంటే పెద్దది. ఇక్కడ బాలునికి కత్తియొక్క పదును, బద్ద యొక్క చరును, వేణ్ణీళ్ల వేడి, చన్నళ్ల  చలి తెలుస్తుంది. పైగా వాక్యసరళి తోటి  పరిచయ మధికమవుతుంది. చేతులు వెనుకకు దాచుకుని పృచ్ఛ కుడు వేసే ప్రశ్నలకి బాలుడు సరియైన సమాధానం చెప్పటం నేర్చుకుంటాడు. ఉదాహరణకి ప్రశ్నలు, జవాబులు ఇట్లా ఉంటాయి: , నీ చేతులే మైనాయి ? - పిల్లెత్తుకుపోయింది. — పి కిచ్చింది.  పిల్లేమి చేసింది? ——కుమ్మరివాడి కిచ్చింది- 


ఇట్లా ఎన్నయినా ఆటపాటల్ని చెప్పవచ్చు. ప్రత్యేకముగా అడపిల్లలు అడ్డుకునే 'చింతగింజలు '  , ఆటలో 'గణితము' యొక్క ప్రారంభదశ ఉన్నది. ఇప్పటికిని 'కుచ్చెలు' (కుచ్చె-క) లెక్క మన ముస లమ్మల దగ్గర సజీవంగా ఉన్నది. ఇదో అంకెల పాట .  ఎంత బాగుందో చూడండి! 


“ఒక్క ఓ చెలియ

రెండు రోకళ్లు 

మూడు ముచ్చిలక 

నాలుగు నందన 

అయిదు బేడీలు 

ఆరు చిట్టిగొలును"


ఈవిధం గా పదివరకు లెక్కల పాట  ఉన్నది. ఆటపాటలతో కలిపి వైద్యశాస్త్ర మేవిధంగా గుచ్చెత్తారా  చూడండి! 


"కొండమీద – వెండిగిన్నె 

కొక్కిరాజు - కాలు విరిగ 

విరిగి విరిగి - మూడాయె.

దాని కేమి మందు?

వేపాకు చేదు 

వెల్లుల్లి గడ్డ 

నూ నెమ్మబొడ్డు

నూటొక్క  ధార

ఇంకా, ‘మాతృభావము’ అభివృద్ధి చేసే 'చిన్ని పిన్ని కెన్నో ఏడు —' అనే పాట చూడండి. దీనిలో పెళ్లి బేరాలు, నగలు పెట్టడాలు మొదలైనవి అద్భుతంగా వర్ణించారు.


ఈదృష్టితో ఆటపాటల్ని ఆంధ్రభాషలోవేగాక ఇతర హైందవ భాష ల్లోంచికూడా సేకరించాలని నా ఉద్దేశం. రాబోయ్ ‘Sargent Scheme of Educa_ tion' (సార్జెంటు విద్యాప్రణాళికలో)  కూడా శిశు విద్యాలయాల ప్రసక్తి ఉన్నదిగనుక మన శిశువిజ్ఞాన -విషయమై తగు శ్రద్ధవహించి మన పురాతన పాటల్ని సేకరించడమే కాకుండా క్రొత్తవికూడా సృజించి  జ్ఞానాభివృద్ధి కనేకవిధాల ప్రయత్నించవచ్చు.


- మలపాక వేంకటా చలపతి 

సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

( భారతి - మాసపత్రిక - తారణ చైత్రము ) 

Sunday, December 12, 2021

ఫ్యామిలీ- చిన్న కథ - కర్లపాలెం హనుమంతరావు

ఫ్యామిలీ- చిన్న కథ 

- కర్లపాలెం హనుమంతరావు 

 

నాన్నా!

ఏంట్రా చిన్నా?

రోజుకు నువ్వెంత నాన్నా సంపాదించేది?

ఉలిక్కిపడ్డాడు   నాన్న.  చుర్రుమని కాలింది. వేలెడంత లేడు. వీడేందీ.. పిచ్చి ప్రశ్నలు!   బదులివ్వదలుచుకోలేదు. అయినా చిన్నా  వదలదలుచుకోలేదు తండ్రి. 

'చెప్పు నాన్నా! పోనీ గంటకు ఎంతిస్తారో ఆఫీసులో అదన్నా చెప్పు. అప్పుడే నేను పోయి పడుకునేది'

రెండు పెడ్దామనిపించింది .  అతి కష్టం మీద ఆపుకొంటూ 'గవర్నమెంటాఫీసుల్లో రోజూ జీతాలిస్తార్రా? నెలకో అరవై వేలొస్తాయేమో! ఇహ ఫో! తొమ్మిదవుతుంది. పోయి పడుకో!' గట్టిగానే గసిరాడీసారి తండ్రి.  

అయినా చిన్నా వదల్లేదు 'ఒక్క రోజుకు ఎంతొస్తుందో అది  చెప్పు నాన్నా! అప్పటి దాకా నేను పడుకునేదే లేదు గ్యారంటీ!'

బిడ్డ మొండితనం తండ్రికి ఎరికే. ఏదో ఒహటి చెప్పేదాకా   వదిలే రకం కాదు. అయినా ఇవాళేందీ పిలగాడు ఇట్లా జీతాల మీద తగులుకున్నాడు! 'రోజుకో రెండొందల చిల్లరొస్తుందేమోరా నాయనా! అయినా.. వేలడంత లేవు నీకెందుకురా ఈ వెధవారాలన్నీ! వెళ్లి పడుకో ఫో! మళ్లీ బైటికెళ్ళే పనుంది నాకు!' 

చిన్నా తండ్రి చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు 'నాన్నా! ప్లీజ్ నాకో ట్వంటీ రూపీస్ అప్పివ్వవా అర్జంటుగా? కావాలంటే వడ్డీ తీసుకో పెద్దయింతరువాత!'

ఉలిక్కిపడ్డాడు తండ్రి. ఇరవై రూపాయల అప్పా? దానికీ వడ్డీ చెల్లింపులా? వీడు పెద్దయిందాకా ఆగి తాను వసూలుచేసుకోవాలా?' వళ్లు మండిపోయింది తండ్రికి ఒక్క ఊపులో వచ్చిన వీరావేశానికి. 'ఎల్కేజీ కుంకగాడివి. డబ్బుల్తో నీకేంట్రా పనసలు? స్కూల్లో ఏం చేస్తున్నావు? ఏం జరుగుతుందీ ఇంట్లో.. ముందు నాకు తెలియాలి ?' అంటూ విసురుగా వంటింటి వైపుకు దూసుకెళ్లిపోయాడా నాయన వక్కసారిగా ముంచుకొచ్చిన వెర్రావేశంతో. 

ఆ దురుసుగా పోవడంలో కిందపడి ఏడిచే పసిబిడ్డ సంగతి కూడా పట్టించుకునే మూడ్ లో లేకుండాపోయింది తండ్రికి. 

***

 అరగంట గడిచిన తరువాత ఆవేశాలు చల్లారాయి ఇంట్లో. తన దురుసు ప్రవర్తనకు తండ్రిలో పశ్చాత్తాపం మొదలయింది. చిన్నా పడుకొన్న గది వైపు చూసాడు. దుప్పటి కప్పుకుని కప్పు వంక చూస్తూ తల్లి పక్కనే పడుకుని ఉన్న పదేళ్లు కూడా నిండని కొడుకును చూసి తండ్రి గుండె చెరువయింది. గిల్టీగా చిన్నా పక్కలోకి చేరాడు నాన్న. ' సారీరా! బుజ్జిగా! ఇందాక నేను నీతో అట్లా  మాట్లాడకుండా ఉండాల్సింది.తోసేసానేమో కూడా కదా! వెరీ సారీ రా కన్నా! ఇదిగో నువ్వడిగిన ఇరవై రూపాయలు. ఇప్పుడు  నువ్వు హ్యాపీనే గదా?'

ఇరవై నోటు చేతిలొ పడగానే గభాలున లేచి కూర్చున్నాడు చిన్నా. అప్పటిదాకా ఏడ్చినట్లు వాడి లేతబుగ్గల మీద చారలు కట్టిన కన్నీళ్లే తెలియచేస్తున్నాయ్. ఇప్పుడవేమీ పట్టించుకునే మూడ్ లో లేడు చిన్నా! తండ్రి ఇచ్చిన ఇరవై నోటును  దిండు కింద దాచిపెట్టుకుని ఉన్న మరికొన్ని అట్లాంటి నోట్లతోనే కలిపి లెక్క   పెట్టేపనిలో పడిపోయాడు. చిన్నా దిండు కింద నోట్లు చూసిన తండ్రికి మళ్లీ కోపం తన్నుకురాబోయింది. 

కానీ అదే క్షణంలో చిన్నా.. గభాలున తండ్రిని గట్టిగా కౌగలించుకుని అన్నాడు 'థేంక్యూ పాపా! థేంక్యూ వెరీ మచ్! ఈ ఇరవైతో  రెండొందలు సరిపోయింది. ఇవన్నీ అచ్చంగా నీవే ఇక నుంచి!' చిల్లర నోట్లన్నీ తన   గుప్పెట్లో కుక్కి మూసేసే చిన్నా వంక అయోమయంగా చూసాడా తండ్రి. ' 'రేపు అమ్మ బర్త్ డే డాడీ !  నువ్వచ్చంగా ఇంట్లోనే ఉంటున్నావ్. అమ్మతో, నాతో కలిసి గుడికి సినిమాకి వస్తున్నావ్!  ఫుల్ డే ఆఫీసుకు డుమ్మా. నీ  జీతం రెండొందలు ఇచ్చాగా!  నువ్వూ హ్యాపీనేగా!' 

ఉత్సాహంగా చిన్నా అన్న ఆ మాటలకు  బిత్తరపోయిచూడడం నాన్న వంతయింది. 


-కర్లపాలెం హనుమంతరావు 

07- 04 -2021 

పెయిడ్ ఇన్ ఫుల్ -. చిన్నకథp హనుమంతరావు

 



సుబ్బుకు పదేళ్లు.  ఐదో తరగతి. బుద్ధిగా చదువుతాడు. లెక్కలు బాగా చేస్తాడని టీచరు బాగా మెచ్చుకుంటారు కూడా.  కూడికలు తీసివేతలు  రెండంకెల వరకు  నోటితోనే  చేసేయగలడు. కానీ ఈ సారి నోట్ బుక్ లోని ఒక కాగితం చించి దాని మీద ఈ విధంగా లెక్క వేసాడు. 

వీధి చివరి శేషయ్య కొట్టు వరకు వెళ్లి  ఉప్పు, కరేపాకు లాంటి సరుకులు వెంటనే తెచ్చి ఇచ్చినందుకుః  రూ.2

అమ్మ వంట పనిలో ఉన్నప్పుడు చెల్లాయిని ఆడించినందుకుః రూ.3

ఆదివారం నా గది శుభ్రం చేసుకున్నందుకు రూ. 3

అమ్మ పూజకు ఇబ్బంది లేకుండా  మూట్ లో పెట్టి వీడియో గేమ్స్ ఆడుకున్నందుకు రూ.1

బడిలో మంచి మార్కులు తెచ్చుకుంటున్నందుకు.. ప్రోగ్రెస్ రోజుకో కొత్త పద్యం చదివి చూడకుండా అప్పచెబుతున్నందుకు రూ.3

కుట్టుపని శిక్షణా కేంద్రానికి అమ్మకు  తోడుగా వెళుతున్నందుకుః రూ.2

ప్రోగ్రెస్ రిపోర్టులో ఎప్పుడూ తెచ్చుకునే  రెండో ర్యాంకు పోయినవారం కూడా  తెచ్చుకున్నందుకు  ఆ వారం  వాయిదాః రూ.10

చిల్లర  పనులుః రూ.10


పోయిన ఆదివారం నుంచి శనివారం వరకు  ఇంట్లో పని కోసం అమ్మకు చేసిన సహాయం బిల్లు మొత్తంః రూ 34వీడియో గేమ్ కు  లెక్క తక్కువ పడింది. 

సమయానికి నాన్నగారు ఇంట్లో లేరు. ఆఫీసు పని మీద వేరే ఊరికి వెళ్లారు. వారం దాకా రారు. అందుకే వారం మొత్తం తాను అమ్మకు చేసిన సాయానికి బిల్లు వేసి వంట ఇంట్లో పనిలో ఉన్న 

అమ్మకు అందించాడు సుబ్బు .


వంట పని కానించి చేతులు శుభ్రం చేసుకుని పొడి చేత్తో సుబ్బు ఇచ్చిన బిల్లు చదువుకుంది అమ్మ. అదే కాగితం వెనక సుబ్బు నుంచి పెన్సిలు అడిగి తీసుకుని ఈ విధంగా రాసి ఇచ్చింది .


అమ్మ రాసిన లెక్కః

నిన్ను నా కడుపులో తొమ్మిది నెలలు మోసాను. మోత కూలీః రూ. 0 

రాత్రిళ్లు నీకు భయమేసినప్పుడల్లా నా పక్క వదిలి నీ పక్కనే తోడు పడుకోనేదాన్ని. చల్లగాలి తగిలి జలుబు చేయకుండా నీ మీద దుప్పటి నిండుగా ఉందో లేదో మధ్య మధ్య మంచినిద్రలో కూడా వచ్చి చూసేదానిని. నిద్రలో నీకు తెలియదు. కాపలా పనికిః రూ.0


నీకు జ్వరం వచ్చినప్పుడు వేసిన మందుల ఖర్చు ఇప్పుడు చెప్పడం కుదరదు. మళ్లా నువ్వు మనుషుల్లో పడ్డదాకా దేవుడికి నీ క్షేమం కోసం చేసుకున్న ప్రార్థనలకుః రూ.0


ఇట్లా విడివిడిగా చెప్పడం కుదరదు కానీ నువ్వు పుట్టినప్పటి బెట్టి  ఇప్పటి దాకా నీ ఆటపాటలకు బొమ్మలు, పుస్తకాలు, చదువు సంధ్యలకు పుస్తకాలు,  ఉల్లాసానికి వెంట తీసుకువెళ్లిన పార్కులు, సినిమాలు, ఆఖరికి నీకు రొంప పడితే సమయానికి చేతిలో ఏ గుడ్డా లేకపోయినా నా చీర కొంగుతో చీదరించుకోకుండా తుడిచేదాన్ని. ఈ మాదిరి  చిల్లర సేవలు చాలా చేసాను. చేస్తున్నాను.  ముందు ముందూ చేయాలి, ఆ సేవలకు రూః0' అంటూ రాసే రాసే కాగితం వెనక్కు ఇచ్చేస్తూ అంది అమ్మ : 

" సుబ్బూ! నాకు నీ మీద ఉన్న ప్రేమకు విలువ కట్టడం  చేతకావడం లేదు. ఆ బిల్లూ నువ్వే వెయ్యి! నీ బిల్లుకు ఆ బిల్లు చెల్లు. ఇంకా ఏ మన్నా ఇవ్వాల్సింది  మిగులుంటే అప్పుడు మళ్లా కొత్తగా వేసుకురారా నాన్నా అమ్మకు నువ్వు చేసిన సేవలకు బిల్లు!


అమ్మ తిరిగి ఇచ్చిన ఆ కాగితం చదువుకున్న సుబ్బు కళ్ల వెంట నీళ్లు బొట బొటా కారాయి. పెన్సిలూ వెనక్కు తీసుకుని  

ఈ విధంగా రాసుకున్నాడు 

' పైడ్ ఇన్ ఫుల్' కాగితం మీద

- కర్లపాలెం హనుమంతరావు 

బోథెల్ ; యూఎస్ఎ

04-04-2020



Thursday, December 9, 2021

వ్యాసం- బాల భాష- భలే భాష రచన- కర్లపాలెం హనుమంతరావు ( తెలుగు - వెలుగు మాసపత్రిక ప్రచురణ - మార్చి, 2014 సంచిక)

వ్యాసం- 





బాల భాష- భలే భాష 

రచన- కర్లపాలెం హనుమంతరావు 

( తెలుగు - వెలుగు మాసపత్రిక ప్రచురణ - మార్చి, 2014 సంచిక) 



ఊహలను, కష్టసుఖాలను తోటివారితో పంచుకునే సాధనం- భాష. గుంపులుగా సంచరించే జీవులకు భాష అవసరం మరీ జాస్తి. వంటరిగా మసిలే కాకికి పది పన్నెండు అరుపులు వస్తే గుంపులుగా తిరిగే కోతికి వందదాకా శబ్దాలు చేయడం వచ్చు. మనిషి సంఘజీవి కనక భాషా తదనుగుణంగానే ఒక క్రమపద్ధతిలో అభివృద్ధి చెందింది. ఆ క్రమమే శిశువుల్లోనూ ప్రతిఫలిస్తుంటుందని జీవపరిణామవాదం. బాలభాషను స్థాలీపులాక న్యాయంగా పరిశీలించడమే ఈ వ్యాసం ముఖ్యోద్దేశం.


ప్రాపంచిక వ్యవహారాల్లో భాష అవసరాన్ని కనిపెట్టి మనిషి ఎలా దాన్ని వశంలోకి తెచ్చుకున్నాడో.. శిశువూ అదే క్రమంలో వస్తువులు, వాటి సౌకర్యాలు, వాటిని సమకూర్చుకునే పద్ధతులను గురించి నేర్చుకుంటుంది. ఒక మూల కొన్ని వస్తువుల కుప్ప ఉందనుకోండి. అందులో తనకు కావాల్సిన వస్తువు ఉంది. మూగ సైగలద్వారా స్పష్టంగా చెప్పడం కుదరదు కదా! పెద్దవాళ్ళెవరైనా ఒక్కొక్క వస్తువును చూపిస్తుంటే .. అది అవునో కాదో చెప్పాలి. అనుకున్నది దొరికేదాకా ఓపిక కావాలి. శిశువుకు అంత సహనం ఉండదు. కోరినది వెంటనే అందాలంటే స్పష్టమైన పదంతో సూచించడం అవసరం. మాటలు నేర్చుకోవడం అందుకే శిశువుకైనా ఒక తప్పనిసరి అవసరంగా మారింది. మాటలు రాని ఇద్దరు శిశువులను ఒకే చోట కూర్చో పెట్టిచూడండి. వాళ్ళిద్దరూ ఏవో విచిత్రమైన శబ్దాలతో పరస్పరం సంభాషించుకునే ప్రయత్నం చేస్తారు. అదే మాటలు నేరిస్తే కావాల్సిన వస్తువు పేరు వత్తి చెప్పో, ముఖకవళికలద్వారా సూచించో, అవయవాలను యథాశక్తి కదిలించో సాధించుకోవచ్చు. కానీ ఈ అభ్యాసమంతా ఎన్నో తప్పుల తడకలో తమాషాగా సాగుతుంది. ఆ కోణంనుంచే ఈ రచన సాగుతుంది. బిడ్డకు వస్తువు పేరు తెలిసినా దాని లక్షణం సంపూర్ణంగా తెలియదు చాలాసార్లు. ఆ వస్తువును గురించి తనకు తట్టిన భావంతో గుర్తించడం బిడ్డకు అలవాటు. బెల్లం రుచి నచ్చి బెల్లం పేరు పలకటం వచ్చిన పిల్లలు.. రుచి నచ్చిన మరే తినుభండారం చేతికిచ్చినా 'బెల్లం' అనే అంటారు. బెల్లం రుచి పేరు 'తీపి' అని తెలిసిన తరువాత ఆ 'తీపి' ఇష్టం కనక ఇష్టమైన ఏ రుచినైనా వాళ్ళు తీపి అనే అంటారు. పండగనాడు పిండివంటలు చేస్తారు. కాబట్టి అప్పచ్చులు చేసిన ఏరోజైనా పిల్లల దృష్టిలో పండుగైనట్లన్నమాట.

ఒక వస్తువు ప్రత్యేక లక్షణాలను గుర్తించి ఆ లక్షణాలుగల వస్తువును ఆ పేరుతోనే పిలిచే శక్తి కొన్ని నెలలు గడిస్తేనేకాని బిడ్డకు పట్టుబడదు. పెద్దవాళ్లు పక్కనుండి సరిదిద్దే వరకూ చిన్నాన్నను నాన్ననీ, పక్కింటి పిన్నిని అమ్మనీ చేసేసి కంగారు పెట్టేస్తుంటారు. మీసాలు..గడ్డాలు కలగలిసిపోయిన ఆసామినెవరినన్నా చూపించి పెద్దాళ్ళు 'బూచాడు' అని భయపెడితే.. మీసాలు గడ్డాలున్న ప్రతి మగవాడూ ఆ బిడ్డ దృషిలో బూచాడే. ఆఖరికి టీవీలో రోజూ కనిపించే చంద్రబాబునాయుడునుంచి.. యోగా గురువు రాందేవ్ బాబాదాకా. వ్యక్తుల ప్రత్యేకలక్షణాలను గ్రహించి ప్రత్యేకమైన పేర్లతో గుర్తించడం శిశువుకి అలవాటు అయిందాకా ప్రతిరోజూ ఇంట్లో ఇలాంటి ఏదో తమాషా జరుగుతుండాల్సిందే. ఒక వస్తువు ప్రత్యేక లక్షణాన్ని గుర్తించే సామర్థ్యం అలవడ్డ తరువాత ఆ లక్షణాలున్న అన్ని వస్తువులను ఒక సముదాయంగా భావిస్తారు బిడ్డలు. గులాబి రంగు నచ్చింది కనక మల్లె, మందారం, గన్నేరు, చివరికి గడ్డిపూవైనా సరే- గులాబీలే బాలలకు. పెద్దవాళ్ళు ఒకొక్క పువ్వు లక్షణాన్ని వివరించి పేర్లు చెప్పించాల్సిన సమయమిదే. మొగైనా..పువ్వైనా, రెక్కైనా.. తొడిమైనా ఒక దశలొ పిల్లలకు అన్నీ పూల కిందే లెక్క. వివిధ దశలను ప్రత్యేకమైన పేర్లతొ గుర్తించి పిలిచే పదసంపద సొంతమయేదాకా పిల్లలతో ఇదో రకమైన తారుమారు సరదా.


పిల్లల దగ్గర సభ్యపద ప్రయోగాలు మాత్రమే చేయడం చాలా అవసరం. అర్థం తెలియకపోయినా పెద్దవాళ్ళ మాటలను గుడ్డిగా అనుకరించడం పసిబిడ్డల లక్షణం. భాషను చురుకుగా నేర్చుకోవడానికి బిడ్డకు ఉపకరించేదీ అనుకరణ గుణమే. అనుకరణ బిడ్డకు అంత సులభమేమీ కాదు. ఎన్నో పాట్లు. కొన్నిసార్లు నవ్వు పుట్టించే సందర్భాలూ కద్దు. పిల్లలకు తెలిసే వస్తువులు కొన్నే. ఆ వస్తువుల లక్షణాలు కనిపిస్తే తెలీని వాటినీ వాటి పేర్లతోనే పిలుస్తుంటారు. ఇంట్లో ఉండే తువ్వాయికి నాలుగు కాళ్ళు కనక నాలుగు కాళ్ళున్న గాడిదైనా సరే వాళ్ళకళ్ళకి తువ్వాయే. పండక్కి తను కొత్తగౌను కట్టుకుంది కనక ఇంట్లో వాళ్ళందరూ గౌన్లే కట్టుకుంటారని ఓ పాపాయి ఊహ. నిన్న, రేపు, కొనడం, అమ్మడం, రావడం, పోవడం.. లాంటి పదాల మధ్య తేడాలు అంతుబట్టక ఒకదానికి బదులు ఒకటి వాడి నవ్వు తెప్పిస్తుంటారు ప్రతి ఇంట్లోనూ పిల్లలు. మూడు నాలుగేళ్ళ పిల్లలు ఆటలాడుకుంటూ కల్పించుకునే సొంతపదాలు చాలా విచిత్రంగా ఉంటాయి. వస్తువులకు వాళ్ళు పెట్టే పేర్లు ఒక్కోసారి చాలా సృజనాత్మకంగా కూడా ఉండి ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. 'పడవ'ను ఒక పాపాయికి 'కాలవ ఇల్లు' అంది. వానబడితే కప్పలు బెకబెకలాడతాయి కనక వర్షాన్ని మరో చిన్నారి 'బెకబెక'గా సంబోధిస్తుంది. మానవసంబంధాలను అచేతన పదార్థాలకూ ఆపాదించే కావ్యలక్షణం పసివాళ్లకు ఎలా అబ్బుతుందో..అదో అబ్బురం. ఒక పాపకు వంకాయి పేరు మాత్రమే తెలుసు. సంత నుంచి


తండ్రి తెచ్చిన సొరకాయను, పొట్లకాయను .. వరసగాబెట్టి వంకాయ అమ్మమ్మ, వంకాయ తాతయ్య అంటూ వంకాయభాషలోనే పిలుస్తుంది. ఇంకో పాపకు పక్కింటి పడుచుపిల్లదగ్గర బాగా చనువు. అస్తమానం 'అక్క' అంటో ఆ పిల్ల వెంటే తిరుగుతుంటుంది. ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళందరూ ఆ పాపకు అక్క అమ్మ, అక్కఅన్న, అక్కనాన్న.. అని లెక్కన్న మాట. మరో బాబు దృష్టిలో పోషణ చేసేవాళ్ళందరూ అమ్మల కిందే జమ. అందుచేత


నీళ్ళుచేదుకునే బావి - బావమ్మ, అప్పచ్చి ఇచ్చే పక్కింటి ఆమె 'అప్పచ్చమ్మ'. చుట్టరికాలతో సొంతంగా పాటలు కట్టుకుని పాడుకోవడం పిల్లలకు ఎంతో సంతోషం కలిగించే సరదా. 'కప్ప నీ అప్ప, బల్లి నీ బావ, బొమ్మ నీ అమ్మ, చీమ నీ చెల్లెలు'- ఇలా సాగే పిల్లల పాటలు ఆంగ్లంలో 'నాన్సెన్స్ రైమ్స్' పేరిట చాలా ప్రసిద్ధి. పిల్లల ఈ అభిరుచి వల్లే బాలలకథల్లో కాకిబావ, నక్కమామ లాంటి చిత్రమైన పాత్రలు పుట్టుకొచ్చింది. తల, గొంతు, తత్సంబంధమైన తదితర కండరాల కదలికలను బట్టి ధ్వని ఉచ్చారణ ఉంటుందని మనందరికి తెలుసు. కండరాల స్వాధీనత వెసులుబాటు శిశువు ఉచ్చారణను నిర్దేశిస్తుంది. ఆ స్వాధీనానికి బిడ్డకు కొంత వ్యవధానం అవసరం. అయినా ఈ లోపే శిశువుకి వస్తువుమీద ఒక అవగాహన ఏర్పడి వుంటుంది. కండరాలను సులభంగా కదిలించగలిగిన అక్షరాలనే బిడ్డ ముందుగా పలుకుతుంది. ర, డ లాంటి అక్షరాలు అంత సులభంగా లొంగవు. త, ప లాంటి అక్షరాలూ ఆరంభంలో పలకడం కొంచెం కష్టమే. కష్టమని ప్రయత్నం శిశువుల లక్షణం కాదు. ఒక అక్షరాన్ని పలకడంలోని ఇబ్బంది.. దాని పక్క అక్షరాన్నిబట్టి ఉంటుంది. త, ప.. లు లాంటివి ఒంటిగా పలికే ఇబ్బందిని 'అత్త.. అప్ప' అని 'అ' ముందు చేర్చడంద్వారా పరిష్కరించుకోవడం ఇలాంటి ఒక పద్దతి. అక్షరాలను మార్చడం, కొన్ని అక్షరాలను వదిలేయడం, కష్టమైన అక్షరాలకు బదులుగా తేలిక అక్షరాలు పలకడం ఇంకొన్ని పద్ధతులు. కొత్తపదం దొరికినప్పుడు పరిచయమున్న పాతపదానికి దాన్ని అనుసంధానించుకోవడంద్వారా గుర్తుంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. శిశువు. రోకలి- లోకలి, తమలపాకు-తాంపాకు, పటికబెల్లం- కటికబెల్లం, పులుసు- పుస్సు, పెనసలు- పెస్సలు, పుస్తకం- పుత్తకం.. ఇలా ఎన్ని పదాలనైనా గుర్తించవచ్చు. రెండేళ్ళు నిండేవరకు శిశువుకు 20, 30 పదాలకు మించి రావు. మూడు నాలుగు ఏళ్ళకు అత్యద్భుతమైన వేగంతో నాలుగైదు వందల పదాలదాకా సాధిస్తారు పిల్లలు. ఒంటరిగా వుండే పిల్లలకు పదాలు ఎక్కువ రావు. ఈడుకు మించినవాళ్ళతో జోడుకట్టే బాలల భాషాజ్ఞానం అసాధరణంగా ఉంటుంది. పరిస్థితులు, ఆరోగ్యం, ఆసక్తి, పరిశీలనా శక్తి.. ఇలా భాషాభ్యాసానికి దోహదం చేసే ఉపకరణాల చిట్టా పెద్దదే.


అన్ని భాషాభాగాల్లోనూ నామవాచకాలను పిల్లలు ముందు గ్రహిస్తారని ఒక సాధారణ అభిప్రాయం. అభ్యాసం నామవాచకాలతోనే ప్రారంభమైనా శిశువుకి క్రియావాచకాలమీద

ధ్యాస జాస్తి. పని చేయడం మీదే శిశువుకు సహజంగా ఉండే ఆసక్తి దీనికి కారణం. ఇతర భాషాపదాలనూ క్రియాపదాలుగా మార్చి పలకడం.. అదో విచిత్ర పద విన్యాసం. ప్రతి పదానికి ఒక క్రియని జోడించే అలవాటువల్ల ఆ పదాన్ని ఆ క్రియకు పర్యాపదంగా ఉపయోగిస్తుంది శిశువు. మేడమీదకు తీసుకు వెళ్ళడానికి 'మీద.. మీద' అని సూచించడం దీనికి ఒక ఉదాహరణ. విరుద్ధపదాలను సైతం ఒకే వాక్యంలో సమర్ధవంతంగా కూరి వినోదం అందించడం పిల్లల మరో తమాషా విద్వత్ లక్షణం. ఆడవాళ్ళతో చాలాకాలం మెలిగిన బిడ్డ మొగవాళ్ళతోనూ 'ఇది ఇయ్యవే..ఇలా రావే' అని మాట్లాడుతుంటే నవ్వు రాకుండా ఎలా ఉంటుంది?


పొడుగు పొడుగు వాక్యాలతో గాని పెద్దలు స్పష్టపరచలేని భావాన్ని ఒక చిన్న పదంతో స్పంష్టంగా వెలిబుచ్చగల చిచ్చర పిడుగులు చిన్నారులు. అసలు సిసలు మినీకవులన్నా తప్పు లేదు. ఉయ్యాలలో పడుకోబెట్టి ఊపమనడానికి 'జో..జో.." అని రెండక్షరాలతో సూచిస్తుందో బాలమేధావి. రెండు మూడు సంబధంలేని విడి పదాలను జోడించి విచిత్రమైన వాక్యం తయారు చేయగలరు బాలలు. 'నాన్న.. తియ్య.. లే' అంటో చేతులు తిప్పుకుంటో పిల్లాడు చెబుతున్నాడంటే 'నాన్న మిఠాయి తీసుకురాలేదు' అని ఫిర్యాదు చేస్తున్నాడన్న మాట.


అభినయం తగ్గి మాటలు పెరగడం శిశువు వికాసదశ పరిణామం. వస్తువు, దాని ప్రత్యేక లక్షణం గుర్తు పట్టే విచక్షణ పెరిగే కొద్దీ పదాలను పొందిక చేసి వాక్యాలుగా ఉచ్చరించడం బిడ్డకు అలవాటవుతుంది.


పసిపిల్లలకు 'నేను' అన్న భావం ఒక పట్టాన బుర్రకెక్కదు. అందరూ తనను ఎలా పిలుస్తారో తననూ తానూ అలాగే సంబోధించుకుంటుంది ఓ చిట్టి. 'చిట్టికి పప్పులు కావాలి' అంటే 'నాకు పప్పులు కావాలి' అని అర్థం అన్నమాట. 'చిట్టి ఏడుస్తుంది.. చూడూ' అని అరుస్తుందంటే 'నన్ను ఏడ్పించద్దు' అని అర్థించడమన్న మాట.


'వర్షం వెలిసింది' అనడానికి 'వర్షం పోయింది' అని, 'నూనె ఒలికింది' అనడానికి 'నూనె పారిపోయింది' అని .. ఇలా ఒక పదార్థ లక్షణాన్ని వేరొక పదార్థ లక్షణానికి అన్వయించేసి చిత్రమైన పదబంధాలను తయారుచేసే శక్తి పసిపిల్లలది. ఎంతకూ తన మాట వినిపించుకోని తల్లిమీద 'నీకు చెవులు కనిపించవా?' అని గయ్యిమంటో లేచిందో పిల్లరాక్షసి. ఎంత అదిమి పట్టుకున్నా ఆ తల్లిపెదాలు నవ్వుతూ విచ్చుకోకుండా ఉంటాయా? 'అయ్యో.. బంగారంలాంటి బలపం పారేసావే' అని తండ్రి గద్దించడం గుర్తుంచుకున్న బాబు .. బళ్లో ఉపాధ్యాయుడు 'బంగారం చూసావా?' అని అడిగినప్పుడు 'చూసాను.. బలపం లాగుంటుంది' అనేస్తాడు ఠకీమని. ఎంత కోపిష్టి గురువుకైనా

ఫక్కుమని నవ్వు రాకుండా ఉంటుందా? 'అల్లరి చేసే బిడ్డ ఒళ్ళో ఇన్ని పప్పులు పోసి 'ఈ పప్పులు తీసికెళ్ళి వీటితో ఆడుకో' అని తల్లి గద్దిస్తే.. బిడ్డా అంతే చురుగ్గా ' 'పప్పుల్తో ఆడుకోం! పప్పులు పెట్టి చిన్ని తోటీ చింటూతోటీ ఆడుకుంటాం' అని తల్లి భాషను పెద్దఆరిందలా సరిదిద్దబోతే పెద్దవాళ్ళం మనం ఎంతసేపని పెదాలు బిగపట్టుకోగలం?! ఇట్లాంటి మెట్లెన్నో ఎక్కిన తరువాతే ఏ బాలైనా రేపటి ఉద్దండపిండంగా తయారయేది. భాషాభ్యాసంలోపదకవిపితామహుడు నన్నయకైనా దాటక తప్పని పసిదనపు చిలిపి దశలివన్నీ.***


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( తెలుగు - వెలుగు మాసపత్రిక ప్రచురణ - మార్చి, 2014 సంచిక) 

Tuesday, December 7, 2021

గేయకథ పిల్లల కోసం అనుమానం - పెనుభూతం - జె.జానకి ( ఆంధ్రపత్రిక - వారపత్రిక - 02-01 - 1952 సంచిక సేకరణ: కర్లపాలెం హనుమంతరావు


గేయకథ : పిల్లల కోసం 
అనుమానం - పెనుభూతం 
- జె.జానకి 
( ఆంధ్రపత్రిక - వారపత్రిక - 02-01 - 1952 సంచిక 
సేకరణ: కర్లపాలెం హనుమంతరావు 

ఎచ్చటికో, బాటసారి పయనం? 
చరచర సాగిస్తున్నాడు గమనం. 
సమయం కాని సమయం, 
అంతా అంధకారమయం 
నదురులేక బెదురు లేక, 
ఇటుచూడక అటుచూడక, 
సాగిస్తున్నాడు పయనం, 
ఎచ్చటికో ఆగమనం?

అతని కేదొ కనుపించింది, 
రోడ్డుప్రక్క నిలుచుంది, 
చేతులు చాచుకు చూచింది 
అమ్మొ భూతం అయ్యొ దయ్యం!

బాటసారికి వేసింది భయం 
అకస్మాత్తుగా ఆగింది పయనం 
ముందుకుపోతే పై బడు తుందేమొ? 
వెనుకకుపోతే వెంబడిస్తుందే మొ?

అని కలిగిం దతనికి సందేహం

స్ఫురణకు వచ్చింది ఆంజ నేయ దండకం
 "శ్రీ ఆంజ నేయం”అని మొదలు పెట్టాడు పఠనం

“దిక్కు లేనివారికి దేముడే దిక్కు 
నీకిదే మొక్కు తప్పించు ఈముప్పు" 
అని సాగించాడు ముందుకు గమనం.

అర రె దెయ్యం కాదు 
అది భూతంకాదు 
ఆ ఊరుకు-  అటుదారి 
ఈ ఊరుకు - ఇటుదారి 
అని చూపించే బల్ల అది . 

అంతా వట్టి అనుమానం, 
అనుమానమె పెనుభూతం, 
అన్న పెద్దలమాట నిజం సుమీ 
అనుకున్నాడా ఆసామీ. 
***

Wednesday, November 10, 2021

ఎవరు గొప్ప? - బాలల కథ

 


ఒక చిన్న కథ 

- సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

( పాత భారతి మాసపత్రిక నుంచి సేకరించినది. ) 


ఒక దేశంలో ఒక రాజు న్నాడు. అతని వద్దకు ఒక బీద వాడు వచ్చాడు. ఆబీదవాడు తన కూతుర్ని వివాహ మాడటానికి తన పేదరికం చే భయపడుచున్నాడని రాజు అనుకున్నాడు. . అనుకుని అ పేదవానితో "నాకూతురుతో పాటు ప్రస్తుతం సగం రాజ్యము వస్తుంది. నాతదనంతరం మిగతా రాజ్యం వస్తుంది" అని ఆపేదవాని మెడలో పూలహారం వేళాడు. 


ఆ పేదవాడు హారమును మెడలో నుండి తీసి వేసి "ఏమిటీ పిచ్చి నేను పెండ్లి చేసుకోను' అని గిరుక్కున తిరిగి వెళ్ళిపోయాడు.


కాని రాజుగారి కూతురు మాత్రం “యీ పేదవానిని ఎటులయినా సాధించి పెళ్ళి అయినా చేసుకోవాలి, లేకపోతే ప్రాణాలైనా  విడవాలి అని” అతనిని తీసుకు రాపడానికి వెంబడించింది. 


రాజా గారు, అతని అనుచరులు వీరిద్దరిని వెంబడించారు. ఈ పేదవాడు కొన్ని మైళ్ళు నడిచి, కొన్ని మైళ్ళు పరుగెత్తి ఒక ఆడవిలో ప్రవేశించాడు. ఆ అడవి యితనికి  చిరపరిచయంలాగ కడనిపించింది. అడివిలోని మర్మాలన్నీ యితనికి  విశదమేనని  స్ఫురించింది. 


ఇట్లుండగా సాయంకాలమై చీకట్లావరింప  మొదలిడాయి. చీకట్లో  ఒక దూకు దూకి పేదవాడు మాయిమై పోయినాడు. 


రాకుమారి  వెతికి వెతికి వేసారి నిరాశ చేసుకుని ఆడివిలోనుండి బయటికి పోయేమార్గం తెలిసికోలేని దుస్థితిలో ఒక చెట్టుకింద చతికిలబడింది. 


ఇంతలో రాజును  ఆటవికులు సమీ పించి "విచారింపకు. అడివిలోనుండి బయటకు పోయే దారి  మాకు తెలుసు. అయితేయిపుడు గాడాంధ కారం అంతటా కమ్ముకుంది. యిపుడు దారి తెలుసుకోలేము. ఇదుగో యిక్కడొక పెద్ద చెట్టుంది. దాని క్రింద యీరాత్రికి విశ్రమిద్దాము . ఉదయం కాగానే లేచి పోవచ్చును" అని అన్నారు.


ఆ చెట్టు మీద  ఒక పక్షి కుటుంబం గూడు కట్టుకుని కాపురం చేస్తూంది. ఒక మగపక్షి. ఒక ఆడపక్షి మూడు చిన్న పక్షులు ఉన్నవి.  మగపక్షి క్రింద వున్న  వారిని చూచి భార్యతో యిట్లు చెప్పింది. "చలి అతి తీవ్రంగా ఉంది. ఇక్కడ చాలామంది  అతిధులు పరున్నారు. చలి కాచుకోవహానికి  ఏమీ లేదు .. అంటూ ఆంతట  యెగిరి వెళ్ళి ఎచ్చటనో ఎండినపుల్లలను ముక్కుతో కరచుకొని ఆతిధులముందు పడవేసింది. 


వారు వాటి సహాయంతో మంట చేసుకున్నారు. అయినా  మగపక్షికి మాత్రం తృప్తి కలుగ లేదు. భార్యతో మళ్ళీ యిట్లా చెప్పింది.

"ఇప్పుడేం చేద్దాం. ఆతిధులకు తింటాని కేమీ లేదు. వారు ఆకలితో  పరున్నారు . మనం సంసారులము. అతిథులను మర్యాద చేసే లక్షణం గృహస్తునిది. కనుక నా శక్తికొలది సహాయం చేయాలి.  నా శరీరాన్ని వారి కిచ్చి వేస్తాను" అని ఆమండుతూన్న మంటలో పడుతూండగా అతిధులు చూచి రక్షించటానికి ప్రయత్నించారు.  కానీ లాభం లేకపోయింది.


తన భర్త మంటలో పడిపోవటం చూచి ఆడపక్ష్మి తనలో తానిట్లనుకుంది.

“ చెట్టుకింద పెక్కు రతిథులున్నారు . వారికి తినుటకు ఒక పక్షే ఉంది. అది చాలదు. నా భర్త ప్రారంభించిన కార్యం ఆసంపూర్తిగా  విడవటం నాధర్మం కాదు. కనుక నాశరీరాన్ని కూడా వారి కర్పించుకుంటాను” అని అనుకుంటూ ఆడపక్షికూడా మంటలో పడింది. 


మూడు చిన్న పక్షులును తమ తలితండ్రులు చేసిన పనిని చూచి వారి పనిని అసంపూర్తిగా  వదలటం బిడ్డలుగా ధర్మం కాదని అనుకుని అవికూడా మంటలో వడ్డవి.


కిందనున్నవారు ఆత్యాశ్చర్యముతో చూడసాగారు. వారు తిండిలేకనే రాత్రి గడిపివేసి యిటువంటి ఉదారస్వభావం గలిగిన పక్షుల మాంసము తినడంకంటె తిండి లేక చనిపోవడమే ఉత్తమనసుకొని వుదయమున నే లేచి యింటికి వెళ్ళారు. 


మంత్రివర్యున కీపమాచారమును వినిపించగా అతడు ఈ  విధమున జవాబిచ్చాడు.

" ఓరాజా, యెవరి స్థానములో వారు గొప్ప అని నీవు దృష్టాంతపూర్వకముగా చూచావు . ప్రపంచంలో జీవించాలంటే ఆపక్షుల మాదిరిగా జీవించవలె. ఏక్షణమున కాక్షణము ఆత్మార్పణం చేసుకోటానికి సంసిద్దంగా ఉండాలి. ప్రపంచాన్ని నీవు విసర్జించాలంటే అందమైన కూతుర్ని రాజ్యాన్ని ఒక్కసారిగా తృణీకరించి వైచిన ఆ పేదవానిని అనుసరించు. నీవు గృహస్తుగా  ఉం డాలంటే  యితరుల క్షేమం కోసం నీ ప్రాణాన్ని అర్పించుకో. కనుక అందరు తమ తమ స్థానాల్లో గొప్పవారే. ఒకరికి విధికృత్యమైతే మరొకరికి విధికృత్యంగాదు. 


( భారతి - కథ ) 

Friday, August 27, 2021

పెయిడ్ ఇన్ ఫుల్ -కర్లపాలెం హనుమంతరావు

 సుబ్బుకు పదేళ్లు.  ఐదో తరగతి. బుద్ధిగా చదువుతాడు. లెక్కలు బాగా చేస్తాడని టీచరు బాగా మెచ్చుకుంటారు కూడా.  కూడికలు తీసివేతలు  రెండంకెల వరకు  నోటితోనే  చేసేయగలడు. కానీ ఈ సారి నోట్ బుక్ లోని ఒక కాగితం చించి దాని మీద ఈ విధంగా లెక్క వేసాడు. వీధి చివరి శేషయ్య కొట్టు వరకు వెళ్లి  ఉప్పు, కరేపాకు లాంటి సరుకులు వెంటనే తెచ్చి ఇచ్చినందుకుః  రూ.2

అమ్మ వంట పనిలో ఉన్నప్పుడు చెల్లాయిని ఆడించినందుకుః రూ.3

ఆదివారం నా గది శుభ్రం చేసుకున్నందుకు రూ. 3

అమ్మ పూజకు ఇబ్బంది లేకుండా  మూట్ లో పెట్టి వీడియో గేమ్స్ ఆడుకున్నందుకు రూ.1

బడిలో మంచి మార్కులు తెచ్చుకుంటున్నందుకు.. ప్రోగ్రెస్ రోజుకో కొత్త పద్యం చదివి చూడకుండా అప్పచెబుతున్నందుకు రూ.3

కుట్టుపని శిక్షణా కేంద్రానికి అమ్మకు  తోడుగా వెళుతున్నందుకుః రూ.2

ప్రోగ్రెస్ రిపోర్టులో ఎప్పుడూ తెచ్చుకునే  రెండో ర్యాంకు పోయినవారం కూడా  తెచ్చుకుంటున్నందుకు ఆ వారం  వాయిదాః రూ.10

చిల్లర  పనులుః రూ.10

పోయిన ఆదివారం నుంచి శనివారం వరకు  ఇంట్లో పని కోసం అమ్మకు చేసిన సహాయం బిల్లు మొత్తంః రూ 34

వీడియో గేమ్ కు  లెక్క తక్కువ పడింది. 

సమయానికి నాన్నగారు ఇంట్లో లేరు. ఆఫీసు పని మీద వేరే ఊరికి వెళ్లారు. వారం దాకా రారు. అందుకే వారం మొత్తం తాను అమ్మకు చేసిన సాయానికి బిల్లు వేసి వంట ఇంట్లో పనిలో ఉన్న అమ్మకు అందించాడు.

వంట పని కానించి చేతులు శుభ్రం చేసుకుని పొడి చేత్తో సుబ్బు ఇచ్చిన బిల్లు చదువుకుంది అమ్మ.

అదే కాగితం వెనక సుబ్బు నుంచి పెన్సిలు అడిగి తీసుకుని ఈ విధంగా రాసి ఇచ్చింది అమ్మ.

అమ్మ రాసిన లెక్కః

నిన్ను నా కడుపులో తొమ్మిది నెలలు మోసాను. మోత కూలీః రూ. 0 

రాత్రిళ్లు నీకు భయమేసినప్పుడల్లా నా పక్క వదిలి నీ పక్కనే తోడు పడుకోనేదాన్ని. చల్లగాలి తగిలి జలుబు చేయకుండా నీ మీద దుప్పటి నిండుగా ఉందో లేదో మధ్య మధ్య మంచినిద్రలో కూడా వచ్చి చూసేదానిని. నిద్రలో నీకు తెలియదు. కాపలా పనికిః రూ.0

నీకు జ్వరం వచ్చినప్పుడు వేసిన మందుల ఖర్చు ఇప్పుడు చెప్పడం కుదరదు. మళ్లా నువ్వు మనుషుల్లో పడ్డదాకా దేవుడికి నీ క్షేమం కోసం చేసుకున్న ప్రార్థనలకుః రూ.0

ఇట్లా విడివిడిగా చెప్పడం కుదరదు కానీ నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి దాకా నీ ఆటపాటలకు బొమ్మలు, పుస్తకాలు, చదువు సంధ్యలకు పుస్తకాలు,  ఉల్లాసానికి వెంట తీసుకువెళ్లిన పార్కులు, సినిమాలు, ఆఖరికి నీకు రొంప పడితే సమయానికి చేతిలో ఏ గుడ్డా లేకపోయినా నా చీర కొంగుతో చీదరించుకోకుండా తుడిచేదాన్ని. ఈ మాదిరి  చిల్లర సేవలు చాలా చేసాను. చేస్తున్నాను.  ఆ సేవలకు రూః0

సుబ్బూ! నాకు నీ మీద ఉన్న ప్రేమకు విలువ కట్టడం నాకు చేతకావడం లేదు. ఆ బిల్లూ నువ్వే వెయ్యి. నీ బిల్లుకు ఆ బిల్లు చెల్లు. ఇంకా ఏ మన్నా ఇవ్వాల్సింది  మిగులుంటే అప్పుడు మళ్లా కొత్తగా వేసుకురారా నాన్నా అమ్మకు నువ్వు చేసిన సేవలకు బిల్లు!

అమ్మ ఇచ్చిన ఆ కాగితం చదువుకున్న సుబ్బు కళ్ల వెంట నీళ్లు బొట బొటా కారాయి. పెన్సిల్ వెనక్కు తీసుకుని 

ఈ విధంగా రాసుకున్నాడు ' పైడ్ ఇన్ ఫుల్'ఎక్కడో  

( ఎక్కడో చదివిన బాలల కథానిక నా శైలిలో )  

-కర్లపాలెం హనుమంతరావు 

బోథెల్ , యా ఎస్.ఎ 

***


Friday, March 12, 2021

తన కోపమె తన శత్రువు- చిన్న కథ - రచన : కర్లపాలెం హనుమంతరావు

బాలు వయసు పదేళ్ళు. అంత చిన్నతనంలో కూడా కోపం బుస్సుమని వచ్చేస్తుంది. కోపం వస్తే ఎంత మాట పడితే అంత మాట అనేస్తాడు. పెద్దా చిన్నా చూసుకోడు. అంత దురుసుతనం భవిష్యత్తుకు మంచిది కాదని వాళ్లమ్మ ఎన్ని సార్లో  చెప్పిచూసింది.  కాస్సేపటి వరకే అమ్మ మాటల ప్రభావం. మళ్లీ కోపం యధాతధం. ఆ సారి పుట్టిన రోజు పండుగకు తనకు కొత్త వీడియో గేమ్ కావాలని అడిగాడు బాలు. పరీక్షలు దగ్గర్లోనే ఉన్నాయి. ఆటల రంధిలో పడి చదువు మీద ధ్యాస తగ్గుతుందని అమ్మానాన్నల బెంగ. పరీక్షలు అయి వేసవి సెలవులు మొదలయితే గానీ ఏ ఆటలూ వద్దని అమ్మ నచ్చచెప్పబోయింది. వినకపోగా అమ్మ మీద ఇంతెత్తున ఎగిరి గభాలున ఒక బూతు పదం కూడా వాడేసాడు. షాకయ్యాడు అక్కడే ఉండి బాలు వీరంగం అంతా చుస్తున్న నాన్న. అప్పటికి ఏమీ అనలేదు. 

మర్నాడు పుట్టినరోజు బాగానే జరిగింది. ఫెండ్స్ రకరకాల ఆటవస్తువులు బహుమానంగా ఇచ్చారు. పరీక్షలు అయిన దాకా వాటిన తెరవకూడదన్న షరతు మీద నాన్నగారు ఒక పెద్ద రంగుల పెట్టె బహుమానంగా ఇచ్చారు. తెరిచి చూస్తే అందులో బోలెడన్ని మేకులు, ఒక సుత్తి, బాలుకి చాలా ఇష్టమయిన తన ముఖం అచ్చొత్తించిన పెద్ద చెక్క ఫ్రేము ఫొటో. నాన్నగారు  ఇలా చెప్పారు 'బాలు! కోపం మంచిది కాదు అని ఎన్ని సార్లు చెప్పినా నీకు అర్థం కావడం లేదు. ఎందుకు మంచిది కాదో నీకై నువ్వే తెలుసుకోవాలి. అందుకోసమే నీకు ఈ చిన్న పరీక్ష. ఇందులో వంద మేకులు ఉన్నాయి. నీకు  కోపం వచ్చిన ప్రతీసారీ ఒక మేకు ఈ పటం మీద ఈ సుత్తితో కొట్టాలి. మేకులన్నీ అయిపోయిన తరువాత ఇంకా కావాలంటే కొని ఇస్తాను' అన్నాడు. 

బాలుకు ఈ ఆట బాగా నచ్చింది. మొదటి రోజు ఏకంగా 37 మేకులు పటం మీద సునాయాసంగా కొట్టేసాడు. అంటే 37 సార్లు కోపం వచ్చిందని అర్థం. రెండో రోజు ఆ ఊపు కొంత తగ్గింది. 21 మేకులు మించి పటంలోకి దిగలేదు. సుత్తితో మేకును కొడుతున్నప్పుడు బాలు మనసు మెల్లిగా ఆలోచనలో పడడం మొదలుపెట్టింది. ఈ మేకులు కొట్టే తంటా కన్నా అసలు కోపం తెచ్చుకోకుండా ఉంటే గోలే ఉండదు కదా! అని కూడా అనిపించింది. 

రోజు రోజుకూ ఆ భావన బాలులో పెరుగుతున్న కొద్ది పటం మీద మేకులు దిగడం తగ్గిపోయింది. అంటే బాలుకు కోపం వచ్చే సమయం క్రమంగా తగ్గిపోయిందనేగా అర్థం! కోపం వచ్చిన ప్రతీసారీ మేకులు, సుత్తితో వాటిని పటం మీద కొట్టే బాదరబందీ గుర్తుకు వచ్చి చల్లబడిపోయేవాడు. 

మేకులు కొట్టడానికి ఇప్పుడు పటం మీద చోటు వెతుక్కోవడం కూడా కష్టంగా ఉంది. పటం నిండా మేకులు  నిండిపోయేవేళకు బాలుకు అస్సలు కోపం రావడం పూర్తిగా మానేసింది. కోపం తగ్గిన తరువాత అమ్మానాన్నా వీడియోగేమ్ ఇప్పుడు ఎందుకు కొనివ్వడం లేదో అర్థమయింది. నెల రోజుల కిందట అమ్మతో తాను దురుసుగా మాట్లాడిన సంగతీ గుర్తుకు వచ్చింది. కళ్ల వెంబడి ఇప్పుడు నీళ్లు వచ్చాయి. తప్పు తెలుసుకున్న బాలు కొట్టలేక మిగిలిపోయిన మేకులు, సుత్తి తండ్రి ముందు పెట్టి 'నాన్నా! 'కోపం ఎందుకు మంచిది కాదో ఇప్పుడు అర్థమయింది. ఇక ఈ మేకులు కొట్టే పని నా వల్ల కాదు . నేను అమ్మ మీద ఇక నుంచి ఎప్పుడూ కోపమే తెచ్చుకోను' అని చెప్పాడు. 

తండ్రి 'కోపం వల్ల ఇబ్బంది ఏమిటో నీకు తెలిసి వచ్చిందే! కానీ నాకే ఇప్పుడు ఇబ్బంది వచ్చిపడింది . నీకు ఈ పాఠం నేర్పడానికి మేకులు, సుత్తి, పటం ఫ్రేము కట్టించడానికి 500 రూపాయలు అవసరమయ్యాయి. సమయానికి నా దగ్గర అంత  డబ్బు లేకపోతే ఒక ఇనుప కొట్లో అరువు మీద తీసుకున్నాను. ఇప్పుడు మనకు వాటితో అవసరం లేదు కదా! అతని మేకులు, పటం తిరిగి అతనికి ఉన్నది ఉన్నట్లుగా ఇచ్చేస్తే సరి. నువ్వు రోజుకో మేకు చొప్పున మేకులన్నీ పీకి పారేయ్! కాకపోతే మళ్లా ఒక షరతు. నీకు కోపం వచ్చిన రోజున మేకు తీయడానికి లేదు. గుర్తుంచుకో!'అన్నాడు.

బాలుకు ఆ రోజు నుంచి రోజుకు ఒక మేకు పటం నుంచి తీయడం మీదనే ధ్యాసంతా. అందుకోసం గాను  కోపాన్ని ఆమడ దూరం పెట్టవలసిన అగత్యం మరింత గట్టిగా అర్థమయింది. మొత్తానికి పటం మీది మేకులన్నీ తీసి మేకులు, సుత్తి, పటం తండ్రికి ఇచ్చే సమయానికి బాలు పూర్తిగా శాంత స్వభావుడిగా మారిపోయాడు.'మేకులు పీకడానికి నీవు కోపాన్ని ఎట్లా నిగ్రహించుకున్నావో గమనించాను. కోపం తెచ్చుకోకపోవడమే కాదు..  అది వచినప్పుడు దానిని నిగ్రహించుకోవడం  కూడా జీవితంలో చాలా ముఖ్యమైన విషయం.  ' తన కోపమే తనకు  శత్రువు' అని పెద్దవాళ్ళు ఎందుకు అన్నారో ఇప్పుడు బాగా అర్థమయింది అనుకుంటా. కోపం తెచ్చుకొని ఏదో ఒక దురుసుమాట అని ఎదుటి వాళ్ల మనసును గాయ పరచడంలాటిందే మేకుతో పటం మీద సుత్తితో బాదడంతో సమానం. ఇప్పుడు ఆ తప్పు తెలుసుకొని మేకు మళ్లీ తీసినా పటం మీది చిల్లులు పోవు కదా! ఆ వికారం పోగొట్టడం మన తరం కాదు గదా! నోటికొచ్చింది తిట్టి ఆనక 'సారీ' అన్నా ఎదుటి వాళ్ల మనసు మీద గాయమూ ఇట్లాగే ఎప్పటికీ చెరిగిపోకుండా మిగిలిపోతుంద'ని గుర్తుంచుకో చాలు.' అన్నాడు తండ్రి.

బాలు బుద్ధిగా తలుపాడు. 

పరీక్షలు అయి వేసవి రాగానే తండ్రే బాలును వెంటబెట్టుకుని ఎలక్ట్రానిక్ షాపుకు తీసుకువెళ్లి అతగాడికి కావలసిన వీడియోగేమ్సు కొనిపెట్టాడు. ఎన్ని గేమ్సు కొనిపెట్టాడో అన్ని పుస్తకాలు కొని  ఇస్తూ.. ఒక పుస్తక చదవడం పూర్తయిన తరువాతే ఒక వీడియా గేమ్ ఆడుకోవడానికి పర్మిషన్' అన్నాడు తండ్రి నవ్వుతూ.

బాలుకు ఈ సారి కోపం రాలేదు 'అలాగే నాన్నా !' అని సంతోషంగా వీడియో గేమ్సూ, పుస్తకాలూ అందుకుని షాపు బైటికి వచ్చాడు

***

Saturday, February 13, 2021

పాప ఇచ్చిన సందేశం చిన్న కథ - కర్లపాలెం హనుమంతరావు

 



ఉమ్మడి కుటుంబం లో అత్తారింట్లో పెట్టే ఆరళ్ళు తల్లికి చెప్పుకుందామని పుట్టింటి కొచ్చింది కల్పన కూతురు తో సహా.అపిల్లకి ఏడేళ్ళు. తల్లితో మాట్లాడనీయకుండాఒకటే అల్లరి చేస్తుంది.

ఆ గోల భరించ లేక గోడ మీడున్న ప్రపంచ పటం తీసి ముక్కలు ముక్కలు గా చించి "వీటినన్నింటిని మళ్ళి ఒక షేపు లోకి తీసుకొంచ్చిన దాక నా జోలికి రావద్దు" అని పని పురమాయించింది. ఆ రాకంగానయినా కాస్సేపు తల్లితో ప్రశాంతంగా మాట్లాడనిస్తుందేమోనని ఆశ. 

ఐదు నిముషాలు కూడా కాకుండానే పాప అతికించిన పటం పట్టుకొచ్చేసింది.

అంత తొందరగా ఎలా పెట్టింది?!

ఆ మాటే పాపను అడిగితే "ఇందులో ఏముందే అమ్మా! పటం వెనక నువ్వ్వు ఇదివరకు వేసిన పాప బొమ్మ ఒకటుంది కదా!..దాన్ని బట్టి టకటక పెట్టేసా" అనేసింది.

ఆలోచనలో పడింది కల్పన.

'ఆరళ్ళు పెట్టే అత్తగారు తనకు వంట్లో నలతగా వుంటే ఆసుపత్రికి తీసుకుని వెళ్ళిన దాక కొడుకుతో దెబ్బలాడటం గుర్తుకొచ్చింది .తంటాలు పెడుతుందనుకునే తోడికోడలు తాను పది రోజులు ఆసుపత్రిలో వుంటే వేళ తప్పకుండ పథ్యం తయారుచేసి స్వయంగా ఆసుపత్రికి తెచ్చి తిన్న దాక దగ్గ్గర నుంచి కదలక పోవటం గుర్తు కొచ్చింది. అస్తమానం అల్లరి పెట్టే ఆడపడుచు అవసరానికి రక్తం ఇచ్చి ఆదుకోవటం గుర్తుకొచ్చింది.ఊరునుంచి వచ్చి మూడు రోజులు కూడా కాకుండానే ఇంటికి పోదామని పాప ఎందుకు మారాం చేస్తుందో ఇప్పుడు అర్ధమయింది కల్పనకు. 

ఏ విషయాన్నయినా పాజిటివ్ కోణం లో చూడాలనే సందేశం పాప నోటితో చెప్పకుండానే పటం ద్వార చూపించినట్లయింది.

తల్లికి ఇక తన గొడవలు చెప్ప  దలుచుకోలేదు. 

ఆ సాయంత్రమే అత్తగారింటికి బయలు దేరింది. 

- కర్లపాలెం హనుమంతరావు 

బోథెల్ ; యూఎస్ఎ 

15 -02-2021  


 

 

 


Friday, February 12, 2021

బాలల ఆటపాటలు - కర్లపాలెం హనుమంతరావు

              


బాల్యం అంటే అభివృద్ధి ఆగిపోయిన వృద్ధాప్యం కాదు. నిత్యోత్సాహానికి అది నిలువుటద్దం. పసిమనసు ఎంత సున్నితమో.. అంత సునిశితం. చూపు ఎంత విశాలమో.. తృష్ణ అంత ఉత్కృష్టం. ఎదిగిన మనుషులకుండే రసవికారాలకు బాలల మనసు బహుదూరం. స్వేఛ్ఛ బాలల శక్తి. ఆసక్తి వారి తరగని ఆస్తి. అనుకరణ వారి మాధ్యమం. పరిశీలన పాఠ్యప్రణాళిక. చిన్నవయస్సులో వంటబట్టిన జ్ఞానం.. ఆట పాటలతో తీర్చిదిద్దిన నడత కడదాకా తోడొచ్చే మంచి మిత్రులు.

పిల్లల దృష్టి చదువు నుంచి పక్కకు చెదురుతుందన్న బెదురుతో వారిని పెద్దలు ఆట పాటలకు ఆమడ దూరంలో ఉంచుతున్నారు. అది సరి కాదు. పశ్చిమదేశాల్లో రూసో కాలంనుంచి చదువు సంధ్యల్లో ఆటపాటల పాత్ర పెరిగే దిశగా ప్రణాళికలు రూపొందుతున్నాయి.  కుసుమ కోమలంగా ఉండే పసిమనసును కఠిన పరీక్షలకు గురిచేయడం మానుషం అనిపించుకోదు. మనోగత అభిప్రాయాలని సానబెట్టే ఐచ్ఛిక విద్యావిధానం మాత్రమే పసివారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేది.

విద్య పరమావధి మనోవికాసమే అన్న సిద్ధాంతం ఇప్పుడు సర్వే సర్వత్రా అందరం  సమ్మతిస్తున్న వాదం. సంపూర్ణ వ్యక్తిత్వం సాధించడానికి విద్య ఒక ముఖ్యమైన సోపానంగా భావించి సమర్థిస్తున్నాం. ఆటపాటల ద్వారా అత్యంత సహజంగా బాలబాలికలకు విద్యాబోధన చేయవచ్చ'ని గాఢంగా విశ్వసించిన విద్యావేత్త ఫ్రీబెల్(Free Bell). ప్లే సాంగ్స్ఆటవస్తువుల ద్వారా చదువుసాములు సాగించే 'కిండర్ గార్టన్'(Kinder Garten) విధానం ఫ్రీబెల్ రూపొందించిందే!

మన ఆచారవ్యవహారాలైన నోములువ్రతాలు వంటి ఆధ్యాత్మిక సంప్రదాయాలు తరచి చూసినా అడుగడునా కంటబడేదీ అంతర్లీనంగా సాగే విద్యావిధానమే! ఫ్రీబెల్ ఆటపాటల్ని (ప్లే సాంగ్సు) ఏడాది నుంచి పదేళ్ళ   వయసున్న బాలలకోసం  రాసారు. బిడ్డల్ని సరైన దిశలోకి మలిపే  ప్రాథమిక దిశ ఇదే కావచ్చన్నది ఆయన ఉద్దేశం కావచ్చు. సరిగ్గా ఆ అభిప్రాయంతోనే మన ప్రాచీనులు  సైతం పసిమనసులకు సులభంగా పట్టుబడే బాలగీతాలను ఆటలతో మేళవించి మప్పే ప్రయత్నం చేసారు.

ఉదాహరణకు 'చందమామపాటనే తీసుకుందాం!

'చందమామ రావే! జాబిల్లి రావే! కొండెక్కి రావే! గోగుపూలు తేవే!

భమిడిగిన్నెలో పాలు పోసుకొని.. వెండిగిన్నెలో పెరుగు పోసుకొని

ఒలిచిన పండు ఒళ్ళో వేసుకుని.. ఒలవని పండు చేత్తో పట్టుకొని

అట్లా వచ్చి అట్లా వచ్చి అమ్మాయి నోట్లో వేయవే!'

అని పాడుతూ తల్లి బిడ్డకి బువ్వ తినిపిస్తుంది. ఈ పాట మూలకంగా బిడ్డ దృష్టి సౌందర్యంమీదకు మళ్ళుతుంది. ఊహాశక్తి ఊపందుకుంటుంది. ఆకాశజీవులమీద ఆసక్తి పెరుగుతుంది. ఫ్రీ బెల్ ఉద్దేశంకూడా సరిగ్గా ఇదే కదా!

బిడ్డకు రెండేళ్ళు వచ్చి కూర్చోవడం వచ్చిన దశలో 'కాళ్ళా గజ్జాఆట ఆడిస్తారు మన తల్లులు.

'కాళ్ళా గజ్జా కంకాళమ్మా! వేగు చుక్కా వెలగా మొగ్గా!

మొగ్గా కాదు మోతీ నీరు/ నీరూ కాదు- నిమ్మల వాయ/

వాయా కాదు- వావిలి కూర/ కూరా కాదు- గుమ్మడి మీసం/

ఇలాగా సాగి.. సాగి చివరకు

'శెట్టీ కాదు- శ్యామల మన్ను/ మన్నూ కాదు- మంచిగంధం చెక్కఅని ముగుస్తుంది పాట.

ఒక్కో మాటకు  ఒక్కోకాలు తడుతూ 'మంచిగంధంవంతు వచ్చిన కాలును పండినట్లు ముడిచి  పక్కన పెట్టడం పాటలోని ఆట. బిడ్డకు పద పరిజ్ఞానం పెంచడం వైజ్ఞానిక ప్రయోజనమైతే.. కాళ్లు ముడవడం.. తెరవడం వంటి మంచివ్యాయామం అందించడం దైహిక ప్రయోజనం. వైద్య రహస్యాలు కూడా ఈ పాటలో ఇమిడి ఉన్నాయి మరింత సునిశితంగా గమనించగలిగితే!

'కొండమీదవెండిగిన్నె/ కొక్కిరాయి- కాలు విరిగె/ విరిగి విరిగి మూడాయె/ దానికేమి మందు?'  అని అడిగి 'వేపాకు చేదు/వెల్లుల్లి గడ్డ/నూనెమ్మ బొటు/ నూటొక్క ధారఅని గోసాయి చిట్కాలు నేర్పించే పాట ఇంకోటి.

ప్రశ్నలడిగి సమాధానాలు రాబట్టే ' నీ చేతులేమైనాయి?/ పిల్లెత్తుకు పోయింది/ పిల్లేమి చేసింది?/ కుమ్మరివాడికిచ్చిందిలాంటి పాటలింకో రకం.

'ఆడపిల్లలు ఆడుకునే 'చింతపిక్కలుఆటలో గణిత విజ్ఞానం దాగుంది. 'ఒక్క ఓలియ/ రెండు జోకళ్ళు/ మూడు ముచ్చిలక/ నాలుగు నందన/ ఐదు బేడీలు/ ఆరు చిట్టి గొలుసులాంటివి అలవోకగా బాలలకు ఒంట్లు వంటబట్టే పాటలు.  ఐదారుగురు గుప్పిళ్ళు ముడిచి ఆడుతూ పాడుకునే 'గుడు గుడు గుంచంపాట పసివాళ్ళకు పరిమాణ స్వరూపాన్ని పరిచయం చేసే పాట. 'కత్తి పదును.. బద్ద పదునువేన్నీళ్ళ వేడిచన్నీళ్ళ చలితెలియచేసే పాట. 'పప్పూ పెట్టి/ కూర వేసి/పిండివంటలు వేసి/ అత్తారింటికి దారేదంటే/ ఇట్లా.. ఇట్లా..అంటూ తల్లి చేతివేళ్ళతో బిడ్డకి చక్కలిగింతలు పెట్టి  మరీ నవ్వించడం.. కేవలం నవ్వులతోనే కాలక్షేపం చేయడానికి కాదు. ఆచారవ్యవహారాలమీద బాలలకు ఒక ఆనందకరమైన అనుభూతిని అలవాటు చేయడానికే! ఇలా ఎన్నైనా ఉదాహరణలు ఇచ్చుకుంటూ పోవచ్చు.

బాలసాహిత్యం ఏనాటిదో చెప్పలేం. ఈ పాటలు ఎవరు కట్టినవో  కనుక్కోవడం కష్టం. బిడ్డల మనసెరిగిన ఏ తల్లి తలలో మెదిలిన భావ తరంగాలో  వాత్సల్య రూపంలో వెలికి వచ్చుండవచ్చు. 'బాలవాజ్ఞ్మయానికి తల్లి మనసే ధర్మకర్తృత్వం వహించేదిఅంటారు చింతా దీక్షితులు.

ఆదికావ్యానికి నాంది విషాదం ఐతే.. బాలసాహిత్యానికి నాంది తల్లి ప్రేమ. ప్రపంచంలో ఏ దేశ వాజ్ఞ్మయాన్ని పరిశీలించినా ఇలాంటి బాలసాహిత్యమే చిట్టి చిట్టి సెలయేళ్లలా సందడి చేస్తూ కనిపించేది.బిడ్డల ఆలనా పాలనా ఆట పాటలతో మిళాయించడం వట్టి పాశ్చాత్య విద్యావేత్తల బుర్రల్లో    మాత్రమే పుట్టి పెరిగిన ఆలోచన కాదు. మన  ఆచార వ్యవహారాలలో       ఏనాటినుంచో అంతర్వాహినిగా ప్రవహిస్తున్న విద్యావిధానం అని చెప్పడమే ఈ చిరు వ్యాసం ఉద్దేశం.

-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్, యూఎస్ఎ

***

 

 

Thursday, October 24, 2019

ఎర్ర ముక్కు జింక- కొత్తపల్లి పత్రిక సౌజన్యంతో



అనగా అనగా ఒక ధృవపు జింక ఉండేదట. దాని పేరు రుడాల్ఫు. దానికి ఓ పొడవాటి ముక్కు ఉండేది, ఎర్రగా మెరుస్తూ. సాధారణంగా ధృవపు జింకలకు పొడవాటి ముక్కులు ఉండవు. ఉన్నా అవి అట్లా ఎర్రగా మెరవవు. అందుకని అందరూ రుడాల్ఫును 'ఎర్రముక్కు జింక' అని పిలిచి, ఏడిపించేవాళ్ళు. రుడాల్ఫు తన ఎర్ర ముక్కును చూసుకొని నిజంగా కుమిలిపోయేవాడు. మిగిలిన జింకలన్నీ అతన్ని ఎగతాళి చేస్తుండేవి. రుడాల్ఫు తల్లిదండ్రులు గాని, తోడబుట్టినవాళ్ళు గాని అతనివైపుకు చూడకుండా నేలబారున చూస్తూ మాట్లాడేవాళ్లు. అతన్ని తలచుకొని సిగ్గుపడేవాళ్ళు. "తనేం నేరం చేశాడని భగవంతుడు ఇట్లా శిక్షిస్తున్నాడు?" అని రుడాల్ఫు అనుక్షణం బాధపడేవాడు.

డిసెంబరు నెల. క్రిస్మస్ రానున్నది. క్రిస్మస్ తాత ప్రపంచంలోని పిల్లలందరికోసం బహుమతులు తీసుకొని, ప్రపంచాన్ని చుట్టి వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. మామూలుగా తన బండిని లాగే ధృవపుజింకలు-డాషర్, డ్యాన్సర్, ప్రాన్సర్, విక్సన్ లను సిద్ధం కమ్మన్నాడు. వాళ్లు లాగే ఆ బండిని ఎక్కి, తాత బయలుదేరగానే, ధృవపుజింకలన్నీ అంతటి గౌరవానికి నోచుకున్న తమ జాతి హీరోలను కీర్తిస్తూ హర్షధ్వానాలు చేశాయి. కానీ ఏం లాభం? ఆ సాయంత్రం భూమిని ఒక భయంకరమైన పొగమంచు కప్పేసింది. దారి ఏమాత్రం కనబడటంలేదు. క్రిస్మస్ తాత పిల్లలకు బహుమతులిచ్చేందుకు వచ్చేది ఇళ్ల పొగ గొట్టాల్లోంచే కదా! ఆ మంచుపొర ఎంత దట్టంగా ఉందంటే, తాతకు, పాపం ఒక్క పొగగొట్టం కూడా కనబడలేదు! ఆ పొగమంచులోంచి దారి కనుక్కోవాలని తాత తన చేతిలో ఉన్న లాంతరును ఎంత ఊపినా ప్రయోజనం లేకపోయింది.
ఏం చేయాలో పాలుపోక, క్రిస్మస్ తాత కంగారు పడుతున్న ఆ క్షణంలో అక్కడ ప్రత్యక్షమయ్యాడు రుడాల్ఫు. అతని ముక్కు రోజూకంటే ఎర్రగా మెరిసిపోతూ వెలుగులు చిమ్ముతున్నది. తాత సాంతాక్లజ్ సమస్యకు పరిష్కారం దొరికినట్లైంది- రుడాల్ఫుకు బండి సారధ్యం లభించింది! క్రిస్మస్ తాత రుడాల్ఫును బండిలో అన్ని జింకలకంటే ముందు నిలిపి, కళ్లెం వేసి, తను బండినెక్కాడు. మరుక్షణంలో‌బండి ముందుకు దూసుకుపోయింది. రుడాల్ఫు క్రిస్మస్ తాతను ఆరోజు ప్రతి ఇంటి పొగగొట్టానికీ చేర్చాడు- భద్రంగానూ, వేగంగానూ. వాన, పొగమంచు, మంచు, వడగళ్ళు- ఇవేవీ ఆపలేకపోయాయి రుడాల్ఫును. ఎర్రగా మెరిసే అతని ముక్కు, అంత దట్టమైన పొగమంచునూ చీల్చుకొని ముందుకు పోయింది!

ఆ తర్వాత క్రిస్మస్ తాత అందరికీ చెప్పాడు, సంతోషపడుతూ- "రుడాల్ఫు గనక లేకపోతే ఆరోజున నేను ఎక్కడికీ కదలలేకపోయేవాడిని" అని. ఇప్పుడు అందరూ రుడాల్ఫునూ, అతని బలాన్నీ, అతని ఎర్రముక్కునూ కొనియాడటం మొదలుపెట్టారు! ఒకనాడు అతను సిగ్గుపడి, దాచలేక- దాచలేక- దాచుకున్న ఎర్రముక్కే, ఈనాడు ప్రతి ధృవపుజింకకూ కలల వెలుగైంది. అన్ని జింకలూ ఇప్పుడు అలాంటి ముక్కుకోసం తపించటం మొదలుపెట్టాయి! శక్తికీ, మంచితనానికీ మారుపేరైన రుడాల్ఫు క్రమంగా అందరికీ ప్రీతిపాత్రుడయ్యాడు. గొప్ప పేరు ప్రతిష్ఠలు సంపాదించుకున్నాడు. లోపాలను తలచుకొని కుమిలిపోయే వాళ్లెవరైనాసరే- తన కథను విని స్ఫూర్తి తెచ్చుకునేంతగా ఎదిగాడు.
సేకరణ: కర్లపాలెం హనుమంతరావు
-కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

Thursday, August 11, 2016

చందమామ విజయ రహస్యం

కాదేదీ నా కబుర్లకనర్హం
మా చిన్నతనంలో బాలల బొమ్మల భాగవతం.. భారతం.. రామాయణం.. లాంటి పుస్తకాలు  చదవడం ఎంతగా ఇష్టపడేవాడినో .. అరవై ఏళ్ళు దాటిన ఈ వయస్సులో కూడా అలాంటి సాహిత్యం కంటబడితే అంతగానే ఇష్టపడతాను. నాలాగే చాలామంది అలాగే ఇష్టపడుతారనే అనుకుంటాను!
పిల్లలకోసం రాసిన పుస్తకాలను పెద్దలం మనమూ అంతే ఇష్టంగా చదవడం కాస్త విడ్డూరంగానే ఉంటుంది. కానీ.. మనస్తత్వవేత్తలు మాత్రం 'ఇందులో అంత ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు కదా.. అది మంచి ఆరోగ్యానికి సంకేతం కూడా' అంటున్నారు.
పిల్లల పుస్తకాలలో సాధారణంగా కనిపించే పాత్రలు.. కథానాయకులైనా.. కథానాయికలైనా.. రాక్షసులైనా.. భూతాలైనా.. ఎలాంటి పై ముసుగులు లేకుండా అటు మంచివైపో.. ఇటు చెడువైపో ఉండటం స్పష్టంగా కనిపిస్తుంటుంది. కథ నడుపున్నంత సేపూ ఎలాంటి  మాయా మర్మాలు చూపకుండా  కథానాయకుడు సాహస వీరుడుగానో.. తెలివితేటలు కలవాడి ఉవకుడిగానో.. అమాయకుడిగానో.. పరోపకారిగానో.. సమాజంలో పదిమంది మెచ్చే ఇంకా ఏ ఇతర సుగుణాలు కలవాడిగానో మాత్రమే కనిపిస్తుంటాడు. కథానాయికలైతే అతి సుకుమారులు. అత్యంత సౌందర్యరాశులు. అమాయకత్వం మూర్తీభవించిన ముగ్ధబాలలు. రాక్షసులు.. భూత ప్రేత పిశాచాలు..  సవతి తల్లులు.. మంత్రగత్తెలు..  భయంకరమైన జంతువులు.. వంటి దుష్టశక్తుల చేతుల్లో పడి రక్షించేవారికోసం అలమటించే నిస్సహాయులుగా కనిపిస్తూ మన సానుభూతిని చూరగొంటారు. ప్రతికూలశక్తులేవైనా గానీయండి..  నిష్కారణంగా .. నీచంగా.. అసహాయులను అవస్థల పాల్చేస్తూ.. ఆనందించే కౌటిల్యం ప్రదర్శిస్తుంటాయి. వాటి చెడుకు.. కథానాయకుల రూపంలో కనిపించే మంచికి మధ్య నిరంతరం కథ జరుగుతున్నంత సేపూ సంఘర్షణ జరుగుతుంటుంది. ఆ ఘర్షణలో అంతిమంగా ,, కచ్చితంగా మంచికి విజయం కలగడం.. అమాయకమైన అందమైన కథానాయికలు విముక్తి చెందడం.. చదివే చిన్నారులకు ఎంతో సంతోషం కలిగించే అంశాలు.
వయసు పైనబడి శరీరం వడలిపోయినా .. అంతర్గతంగా .. పసిపిల్లలకు మల్లే ఎప్పుడూ మంచికే జయం కలగాలని; దుర్మార్గం.. దౌర్జన్యం.. రాక్షసత్వం.. శాశ్వతంగా ఓడితీరాలన్న తీవ్రకాంక్ష   ఇంకా  మనసులో ఇంకిపోకుండా మిగిలున్నపెద్దలకి .. పిల్లల మాదిరిగానే.. అలాంటి బాలసాహిత్యం ఎంతో ఆనందం.. ఉత్తేజం.. కలిగిస్తుంది.

పెద్దలకోసం రాసిన పుస్తకాలలో మంచి మంచిలాగా స్పష్టంగా కనిపించక పోవచ్చు. చెడు మంచి ముసుగు వేసుకొని వంచనకు తెగబడుతుండవచ్చు. అందం అన్నివేళలా ఆనందం కలిగించే విశేషం కాకపోవచ్చు. అమాయకత్వమూ  సానుభూతి చూరగొనే తీరులో ఉండక పోగా.. ఒక్కోసారి తీవ్రమైన కోపం తెప్పించే పద్ధతిలో విసుగు పుట్టించవచ్చు. మంచికి .. చెడుకు మధ్య జరిగే సంఘర్షణ బాల సాహిత్యంలో మాదిరి స్పష్టంగా ఉండక..  మేదో సంబంధమైన నారికేళపాకంలో కూడా సాగే రచనలుగా ఉండవచ్చు. తలుచుకొనేందుకే ఇష్టంగా ఉండని మానవ సంబంధాలు.. అవినీతి.. అకృత్యాలు.. క్రౌర్యాలు.. కామకలాపాలు.. నమ్మక ద్రోహాలు..నరికి చంపుకోడాలు..  ఇలా ఏవైనా.. ఏ రూపంలో అయినా .. కనిపించి చదివేవారి మనసుమీద ప్రతికూలమైన వత్తిడి పెంచి ఆరోగ్యానికి ఇబ్బంది కలిగే  రీతిలో సాగవచ్చు. అలాంటి రచనలు వాస్తవానికి.. వాస్తవ ప్రపంచానికి ప్రతిబింబాలుగా ఉన్నంత మాత్రాన.. పెద్దలందరికీ ఒకే విధంగా ఆదరణీయం కాకపోవచ్చు. సంస్కృతీ సంబంధమైన వైవిధ్యాలు.. భాషాసంబంధమైనా వైరురుధ్యాలు.. అన్ని రచనలను అందరు పెద్దలు ఒకే తీరులో అభిమానించేందుకు అవరోధంగా మార్చుతుంటాయి.  పెద్దల సాహిత్యంలో అంతిమ విజయం కచ్చితంగా  మంచికే దక్కాలన్న నియయ.. నిబంధనలు కూడా ఉండవు.  ప్రౌఢసాహిత్యం విషయంలో అందుకే అందరు పెద్దలకు ఒకే విధమైన అభిమానం ఉండాలని ఆశించడం అహేతుకం.
బాలల సాహిత్యంలో ఈ బెడదలేవీ ఉండవు.  ఏ రూపంలో ఉన్నా కథ.. కథనాలు.. సరళంగా.. సదా సమాజహితంగా సాగుతూ.. మంచి చెడుల మధ్య విభజన రేఖ నల్లబల్లమీద తెల్లసుద్దతో వేసిన బొమ్మంత స్పష్టంగా… అందంగా ఉంటుంది. అందుకే అది భాషా.. సంస్కృతి.. కాలం.. దేశం.. వంటి పరిమితులకు అతీతంగా ప్రపంచంలోని  పసిపిల్లలందరి  మానసికానందానికి.. మనో వికాసానికి ఒకే తీరులో ప్రేరణ అవుతుంటుంది. పిల్లల మనస్తత్వంగల పెద్దలనూ అదే తీరులో అలరిస్తుంటుంది.

తెలుగులో కొన్ని దశాబ్దాల పాటు అవిఛ్చినంగా సాగి ఆబాల గోపాలాన్ని ఒకే తీరుగా అలరించిన.. అలరిస్తున్న..   విజయావారి 'చందమామ' మాస పత్రిక విజయంలోనే ఈ రహస్యం దాగి ఉంది.

బాలసాహిత్యాన్ని నిజంగా ఇష్టపడుతున్నట్లయితే- అలా ఇష్టపడుతున్నట్లు బాహాటంగా  చెప్పుకోడాన్ని  పెద్దలెవరూ చిన్నతనంగా భావించవలసిన అవసరం లేదు. బాలల సాహిత్యాన్ని అభిమానిస్తున్నారంటే ఆ  పెద్దల మనసులూ బాలల మనసులంత స్వచ్చంగా.. సహజంగా.. ఆరోగ్యంగా.. ఆనందంగా.. ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఉన్నట్లే లెక్క
-కర్లపాలెం హనుమంతరావు
*** 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...