Showing posts with label Magazine. Show all posts
Showing posts with label Magazine. Show all posts

Thursday, December 30, 2021

కథ బొమ్మల పెళ్లిళ్లు కొడపటిగంటి కుటుంబరావు. ( ఆంధ్రభూమి - మాస- 1938, అక్టోబర్ సంచిక ) సేకరణ కర్లపాలెం హనుమంతరావు



 


కథ 

బొమ్మల పెళ్లిళ్లు 

కొడపటిగంటి కుటుంబరావు.

( ఆంధ్రభూమి - మాస- 1938, అక్టోబర్ సంచిక ) 

సేకరణ కర్లపాలెం హనుమంతరావు 

30-12-2021 

బోధెల్ - యూఎస్ఎ



ఆరోజు సరోజినికి పర్వదినం. ఆపిల్లకళ్లకు సమస్తం ఆనందమయంగా తోచింది. 


వాళ్ల బావ భైరవమూర్తి గారి మేడ టాజిమహల్లాగుంది. ఇంటిపక్క తోట నందనవనంలాగుంది. తనతో తోటలో పికారు చెయ్య టానికి వచ్చిన సావిత్రి సాక్షాత్తూ దేవకన్యకలాగుంది. 


ఆరోజున సరోజినికి సావిత్రినిచూస్తే అనురాగంపొంగి పొర్లటం మొదలు పెట్టింది. ఈ ప్రేమావేశం తాత్కా లిక మేఫనీ, పూర్వం ఉన్నదికాదనీ, ముందుండబోదనీ ఆ ఉత్సాహంమీద సరోజినికి తోచటం అసంభవం. దీనికంతా కారణం అప్పుడే ప్రవేశిస్తున్న వసంతరుతువు కాదు, ఆనాడు భైరవమూర్తిగారి శిశువు అన్నప్రాశన.


మీరు సావిత్రినికాని సరోజినిని కాని ఇద్దరినీ కాని బాగా ఎరిగుండకపోతే ఇద్దరూ కవలపిల్లలని చెప్పినా నమ్ముతారు. 


నిజానికిమటుకు సరోజిని సావిత్రికి పిన తల్లి. సావిత్రి సరోజినికన్న ఏమాత్రమో పెద్దదీ, సరోజినికన్న మితభాషి కూడా కావటంచేత చూడగానే ఇద్దరిలో కనపడే భేద మేమిటంటే సావిత్రి పినతల్లికంటె గంభీరంగా ఉండేది. అంతకుమించి ఇద్దరిలోనూ ఎక్కువ తారతమ్యం లేదు.


సరోజిని సావిత్రిని తోటంతా తిప్పి ఆఖరుకు  తన ప్రాణానికి మంచి పాదరిల్లంటిది కనపడ్డ చోటు  చూపి ఇక్కడ కాస్సేపు కూర్చుందామన్నది. 


ఇద్దరూ ఆకుల కింద కూర్చున్నారు. కొంతసేపు ఆకబుర్లూ ఈకబు ర్లూ చెప్పి సరోజిని అసలు సంగతి కొచ్చింది.


“అయితే, సావిత్రీ బావ నీ పెళ్లి చేస్తాడుట నిజవేనా ? " 


సావిత్రి సమాధానంగా పినతల్లిని చూసి నవ్వింది.


"అంతా నిశ్చయమయిందా?" 


" అదే నిశ్చయం. ఇంకా తాంబూలా లిచ్చుకో లేదు.”


2


“నీ కాబొయ్యే మొగుడెవరు ?  "


సావిత్రి చాలా నేర్పరి. ఎటువంటి ప్రశ్న కటువంటి సమాధానం చెప్పాలో ఎరుగును .


“ఎరగవు టే? మామయ్య ఇక్కడ చదువుకునేట ప్పుడు వస్తూండేవాడే—రాధాకృష్ణ మూర్తని !” 


" నాకు బాగా జ్ఞాపకంలేదు... అయితే నీకీ  సంబంధం ఇష్టమేనా?" 


" ఎందు కిష్టంకాదు?”,


సరోజిని తనావిషయం మాట్లాడదలుచుకున్నది అ యిపోయినట్టు నన్న గొంతుతో ఏదో మంగళహారతి ఎత్తిచప్పున ఆపి “ఇప్పు డీసంబంధం కాకుండాపోతే?” అన్నది.


" ఏమిటి?"


“నిన్ను ఆ అబ్బాయికిచ్చి -ఆయన పేరేమిటి? —ఆయనకిచ్చి చెయ్యరనుకో..”. 


" పోనీ!...అయినా ఎందుకు చెయ్యరు?”.


"ఇంకొకరి కిచ్చిచే స్తే!" 


" ఇంకో రెవరు?"


“అన్నయ్యకి స్తే!”


సావిత్రి నవ్వి “తాతయ్య కిష్టంలేదుగా?" అంది. 


"తాతయ్య సంగతి కాదిప్పుడు! నీ సంగతి చెప్పు!"


" ఏమో! నా కంత యిష్టంలేదు సుమా. మామయ్య ఎప్పుడూ మేనకోడలిని చేసుకోటం నీతి కాదఁటుంటాడు. అయినా ఇప్పుడెందు కాఆలోచన?”


సరోజిని సావిత్రి చెయ్యి తీసుకుని వేళ్లు సాగ దీస్తూ “ఇవాళ మా నాన్న మీ నాన్న నడగబోతున్నాడు. నిన్ను అన్నయ్య కియ్యమని. నీకింకా తెలీదేమో?” అని సావిత్రి మొహం వంక చూసింది. 


సరోజిని అనుకున్నట్టు సావిత్రి మొహాన  ఏభావం కనపళ్ళేదు. 


ఇంత రహస్యం చెప్పినా సావిత్రి చలించకపోవటంచూసి సరోజినికి ఉత్సాహభంగమైంది. ఇద్దరూ కొంతకాలం మౌనంగా కూర్చున్నతరువాత సరోజిని పోదామంటూ లేచింది.


“కాస్సేపు కూర్చోవే అబ్బ! ఇంట్లో ఏముంది?"


"ఇంకా అడుగూ బొడుగూ కాఫీ ఉందేమో తౌగి ఇప్పుడేవస్తా. లేకపోతే మంచినీళ్లైనా తాగుతా: ఏం చేస్తాం!" అంటూ చెయ్యి వదలించుకుని సరోజిని ఇంటి వైపు పరిగెత్తింది.


సరోజినటువెళ్లింది, సుందరం ఇటొచ్చాడు. అతను వెనకనించి సావిత్రిని సమీపించి “ఇక్కడున్నావుటే అమ్మాయి? అమ్మ నీకోసం వెతుకుతూంటేను,,, ఓసి!" అంటూ సావిత్రి పక్కనేకూలబడి ఒక చేత్తో సావిత్రిని దగ్గరికి తీసుకున్నాడు.


“నీపెళ్లెప్పుడే, పెళ్లికూతురా ? రాధాయి కంట గడు 

తున్నారూ నిన్ను! మంచివెధవ నీకు మంచి మొగుడవుతాడు. ఆలుసుమాత్రం ఇచ్చేవు సుమా! ఒక చెంపనించి తొక్కి పెడితే కాని మాటవినడు. జాగ్రత్త."


" ఏమ్మాటలు, మామయ్యా!"


"ఓసి! నీకెంతసిగ్గు ! ఒక్కత్తెవు కూర్చుని మొగుడి విషయం ఆలోచిస్తున్నావేమోనని మంచి  చెప్పబోతే తప్పా? నే పోతున్నా లే!”


" ఉండు! ఉండు! అట్లా అయితే నేనూ పెళ్లి విష యమే మాట్లాడతాను. ఒకటి చెప్పు. మేనమామను పెళ్లి చేసుకోవచ్చునా?”


"తప్పు!"


" నేను మరి నిన్ను చేసుకోబోతున్నా నే!"


సుందరం సావిత్రి చెంపమీద ఒక్కటి పెట్టి “ఈసారి  ఆమాటంటే నీతో మాట్లాడను," అన్నాడు. 


సావిత్రి చెంపరుద్దుకుంటూ నవ్వి, “ఈ మాట మీ నాన్న అన్నా ఇదేనా శిక్ష!” అన్నది. 


సుందరం ఆశ్చర్యంతో మేనకోడలి వంకచూసి, “నాకింకా తెలీదే! నీతో ఎవరన్నారు?" అని అడి గాడు.


"సరోజిని.”


“దాని కన్నీ తెలుసు!... హూఁ! ఆ అయిదు వేల కట్నం నాన్న గారి మతిచెడగొడుతున్నది. సంవత్సరం కిందట ఈ విషయం వచ్చినప్పుడు అయినవాళ్లలో కట్నంరాదని చాతనాయిన  వంకలన్నీ చెప్పి మనిద్దరికీ ముడిపడకుండా చేశాడు. ఈసారి బావ ఎట్లా తప్పించుకుంటాడు? ఇంకో వెయ్యి ఇస్తామంటే సగోత్రీకుల పిల్లనైనా చేసుకుంటారు నాన్న గారు. ఒక్కపాఠం నేర్చుకో, పిల్లా! నీ కెప్పటికైనా పిల్లలు పుడితే విశ్వ ప్రయత్నంచేసి వాళ్లకు పెద్దవాళ్ళ నెదిరించటం నేర్పు. నాకిన్నేళ్లు  వచ్చినై, ఇంత చదువు చదివాను! నాన్న గారు రేపు కొండముచ్చును పెళ్ళిచేసుకోమంటే కాదనేటం దుకు నాకు ధైర్యంలేదు... మీ నాన్న నీకు చనువిచ్చా డుగా! రాధాయినే చేసుకుంటానని పోట్లాడు.”


"నేను పోట్లాడను. నాన్న పెళ్ళివిషయం నన్నడగడు, నేను సిగ్గుపడతానని ఆయన నమ్మకం, నేను సిగ్గు లేనట్టు ఆయన కెట్లా తెలియచెయ్యటం?" 


" ఆహా ఏం లోకం ! ఎవరి పిల్లల మనసు వాళ్ళకు తెలీదు!"


ఆసాయంకాలం సుందరం, రాధాకృష్ణమూర్తి కృష్ణ ఒడ్డున ఇసకలో కూర్చున్నారు.


ఆ మర్నాడు సావిత్రి పెళ్ళికి ముహూర్తం ఏర్పాటు చేశారు. తాంబూలాలు పుచ్చుకున్నారు. ముహూర్తం ఇరవైరోజుల్లో ఉంది. 


" రాధా! నా పెళ్ళికి తప్పక రావాలిసుమా , చెల్లెలిని చేసుకుంటున్న వాడి పెళ్ళి నీకెక్కడ తటస్తపడుతుంది?" అన్నాడు సుందరం దీనంగా.


‘‘అర్ధంలేకుండా మాట్లాడతావేంరా, సుందరంగా !  అప్పకూతుర్ని చేసుకుంటున్న వాడివి నువ్వే నేం లోకం లో! నీకు మళ్ళీ అటువంటి పిల్లవస్తుందీ?”


"అటువంటి పిల్ల మాసరోజా ఒకతె ఉందిగా!" 


" ఛీ! అప్రాచ్యుడా! వాళ్ళిద్దరూ ఒకటిగా ఉంటారను కుంటున్నావుకాని, నక్కకూ —ఇద్దరికీ ఎంతో భేదం ఉంది. నాకు సంబంధమే కనపడదు.” 


“ఇంకేం? నాకు భేదమే కనపడదు. నిన్నా ఇవాళ లోపల   వందసార్లు సావిత్రిని సరోజిని పేరు పెట్టి పిలిచాను. అది పలకదు!" 


" నీ మొహం! దానిక్కోపం, వళ్ళుమంట, ఎందుకుండదు ? చిత్రంచూడు. ప్రకృతి మనల్ని వెక్కిరించటాని కిట్లాచేసిందికాని వాళ్ళిద్దరిలో నీకు కనపడ్డభేదం నాకు  కనపడి నీ కాభేదం కనపడకుండా ఉంటే ఎంత బాగుండేది. నేను సావిత్రిని కొంతవరకు నిశ్చింతగా - పెళ్ళిచేసుకునేవాణ్ణి. సరోజానీకు కుదిరేది.” 


ఇక్కడ రాధాకృష్ణమూర్తి ఈడుకుమించిన మాటన్నాడు.


"ఎందుకు దిగులుపడతావురా? పెళ్ళయిన మరుక్షణం నుంచీ  ప్రయత్నంచేసినా ఇద్దరికీ సంబంధం కనపడదు.” 


" నీదయవల్ల  అట్లా అయినా బాగుండును."


" నాన్నక్కోపం వచ్చింది మీ బావగారిమీద.”


" పెద్దకట్నం పోయిందే అని.” 


" సామెత చెప్పినట్టుంది.”


పూర్తిగా పొద్దుకూకకుండానే ఇద్దరూ ఇంటిదారి పట్టారు. భైరవమూర్తి గారి మేడముందు రాధాకృష్ణ మూర్తి గుడ్ నైటన్నాడు.


సుందరం  రాధాకృష్ణమూర్తి చెయ్యిపట్టుకున్నాడు. "ఒక కప్ కాఫీ తాగిన తరువాత. " 

" కాఫీ! అవశ్యం ”


ఇద్దరూ మూలగదిలో చేశారు. సుందరం లోపలికి వెళ్లాడు, సరోజినితో రెండు  కప్పులు కాఫీ తయారు చెయ్యమన్నాడు. అందుకని సరోజిని మూడు కప్పుల కాఫీచేసి తనకోకప్పు దాచుకుని మిగిలిన కాఫీ తెచ్చి ఇద్దరికీ ఇచ్చింది. తరవాత కొంచెం ఎడంగా నుంచుని రాధాకృష్ణమూర్తిని పరీక్ష చెయ్యటం మొదలు పెట్టింది. 


రాధాకృష్ణ మూర్తి కాఫీ కాస్త రుచి చూచి కప్పుబల్ల మీద పెట్టి "ఫైన్ ” అన్నాడు.


సుందరంకూడా కొంచెం తాగి మొహం చిట్లించి, “నాకు కాఫీ రుని తెలీదురా ఖర్మం!" అన్నాడు


" సావిత్రికీ అంతే, అన్నయ్యా దానివన్నీ నీగుణా లే" అన్నది సరోజిని నవ్వుతూ. 


రాధాకృష్ణమూర్తి కొంచెంసేపు సరోజిని వంకచూసి, తలగోక్కుని కాఫీతాగటం సాగించాడు.


ఈ కాఫీ మాత్రం ధుమాగా ఉందిరా. యమాగా ఉందనుకో! అద్భుతంగా ఉందంటేనమ్ము . ఎందుకూ? నెంగరం అయ్యరు కాఫీకి నకలు. అసలుకు సరియయిననకలు" 

 సరోజిని తల ఒక పక్కకు  ఒరగేసి  రాధాకృష్ణమూర్తి  వంక చూస్తూ "పాపం, సావిత్రికి సుందరమే మొగుడయే వాడు?" అనుకుంది.


" నేను పోతున్నాను. మీకింకేమన్నా కావాలా? " 


"నీళ్ళు” సుందరం.


" తాగటానికేనా?"…రాధాకృష్ణ మూర్తి. “


" తప్పకుండా! లేకపోతే ఈ చేదుఇట్లాగే ఉండనీమంటావా ఏమిటి?”


సరోజిని  బిగ్గరగా నవ్వుతూ పరిగెత్తిపోయింది.


రొండు నిమిషాలపాటు స్నేహితులిద్దరూ మౌనంగా  కూర్చున్నారు. చివరకు రాధాకృష్ణమూర్తికి మాట్లాడబుద్ధయింది. "మీ చెల్లెలికీ మీ మేనకోడలికి భేదం లేదంటావేంరా? " 


“ఆఁ?" అన్నాడు సుందరం పరధ్యానంగా,


" ఇద్దరికీ లక్షభేదం ఉంది.” 


" ఎవరు?"


" మీ చెల్లెలికీ- మీ సావిత్రికీ "


"ఏమిటి?"


భేదం —లక్ష భేదం—”


"ఏంభేదం?"


" ఉంది " 


"ఎందుకుంది. "


"ఎందుకు లేదు.”


ఇప్పుడు సుందరం దోవకొచ్చాడు.


‘నాఆలోచనంతా పాడు చేశావు! ఏమిటా మనం మాట్లాడుతున్నది?”


రాధాకృష్ణమూర్తి మళ్ళీ వెనక్కి రాదలుచుకోలేదు. "సావిత్రి ఇంత ఉత్సాహంగా ఉండదు.”


స్నేహితు డేంమాట్లాడుతున్నాడో తెలీక సుందరం " ఆఁ?" అన్నాడు. ‘


" ఇంక మాట్లాడదు.".


" ఎవరు?" 


'' సావిత్రి.” 


" సావిత్రంటే  . ఓహో సావిత్రా? ఇంకాసావిత్రేమో ననుకున్నా!"


" ఇంక నవ్వ దసలు .”


"ఎవరు? సావిత్రేనా?"


" ఆ! అంటే సావిత్రికాదు? సావిత్రి!"


"సావిత్రి నవ్వదా ?”


"నవ్వదు. ఎందుకు నవ్వాలి? నవ్వు నాలుగందాల చేటు  " 


రాధాకృష్ణమూర్తి తలగోక్కుని అకస్మాత్తుగా " గుడ్ నైట్" అని వెళ్లిపోయినాడు.




జరిగిన సంగతి  ఏమిటంటే రాధాకృష్ణమూర్తి మొదట సావిత్రికోసం ఉబలాటపడ్డప్పుడు తనమనస్సును ఆపిల్ల కర్పించుకున్నాడు. ఒకపిల్ల తన అనుజ్ఞ లేకుండా తన మనసును ఎత్తుకుపోయినట్లు   అతనికి కొత్త అనుభవం. అనుభవంలేనివాడు కనకనే పని పెట్టుకొచ్చి సరోజిని తన మనస్సును   ఆకర్షిస్తుంటే చూస్తూ ఊరుకున్నాడు. దానికి అతనికివ్వబడ్డ విశేషేమిటంటే సరోజిని !


రాధాకృష్ణమూర్తి మాట్లాడుతున్నది వినిపించుకో కుండా సుందరం ఆలోచిస్తున్న దేమిటంటే తన చెల్లెలికీ సావిత్రికీ ఏం సంబంధం ఉందా  అని. దానిక్కారణం ఉంది. 


అతను సావిత్రిని సరిగా చూసింది కిందటిరోజు ఉదయం. చెల్లెలిని సరిగా చూసిందంతకు పూర్వమే! మగ వాడికి పెళ్లియావ లేనంత కాలం ఆడపిల్లలంతా ఒకటి గానే ఉంటారు. వాళ్ళిద్దరికీ కొంతపోలికకూడా ఉండే చెప్పేదేమిటి?


అన్నిటికన్న ముఖ్యమైనవిషయం మొదటినించీ సావిత్రికి దిగులు తన్ను తనమామ కియ్యరనే .


—కొడపటిగంటి కుటుంబరావు.

( ఆంధ్రభూమి - మాస- 1938, అక్టోబర్ సంచిక ) 

సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

30-12-2021 ; బోధెల్ ; యూఎస్ఎ


వలపు -తాత కృష్ణమూర్తి ( ఆంధ్ర భూమి - మాసపత్రిక- 1933, అక్టోబర్ )

 వలపు 

-తాత కృష్ణమూర్తి


( ఆంధ్ర భూమి - మాసపత్రిక- 1933, అక్టోబర్ ) 



పుస్తకాలలో ఉన్న నాయికానాయకులకేగాక, మెదడు, శరీరావయవాలు సవ్యంగా ఉన్న ప్రతి మని షికీ యీడువచ్చిన పిమ్మట వలపంటే యేమిటో, కొంతవరకు అనుభవమవుతుంది. మహాకవులు నాయికిల వలె ప్రతీఆడదీ విరహవేదనలో మన్మధుణ్ణి, చంద్రు ణ్ణి, గాలిని, పిట్టల్ని నోరుతిరగని సమాసాలతో తిట్టి, చెలికత్తెలను కొట్టి, జుట్టు పీకుకొని, ఒళ్లు రక్కుకొని, మెడలోనిహారాలు తెంచేసుకొని, కాంభోజీరాగంలో వెక్కివెక్కి యేడవక పోవచ్చు ; ఉద్యానవనాలలో ఉండే లతలతో ఉరిపోసుకోకపోవచ్చు. ప్రతీమగ వాడూ కథలలోని రాజులవలె నిద్రాహారాలు మాని వేసి, కలలో కనిపించిన కన్యాలలామకోసం మహా రణ్యాలకుపోయి తపస్సులు చేయలేకపోవచ్చు; వలపు తీవ్రత కోర్వలేక కత్తితో కంఠంకోసుకొనో, విషం త్రాగో, చావడానికి సాహసించలేక పోవచ్చు. కాని ప్రతీమనిషికీ ప్రేమతత్వం ఏదోవిధంగా తెలియరాక మానదు.


అయితే లోకంలో చాలామందికి తమ అనుభవా లెట్లా ఉన్నా, వలపును గూర్చి అభిప్రాయాలు మాత్రం 3 మహావిపరీతంగా ఉండడానికి కారణం బహుళః కవుల తలతిక్క వ్రాతలే నేమో! దేనినైనా సరే, మసిపూసి మారడికాయ చేయగల సమర్ధులు కవులు, జంతువులు,


పిట్టలు, కీటకాలు సహితం అనుభవించి తెలుసుకోగల సెక్సు ప్రేమను మహా అపురూపమైన వస్తువుగా వర్ణించి దానికి తమ ఊహాశ క్తివలన లేనివెన్నో అర్థాలు కల్పించి, లోకంతో సంబంధంలేక ఏకొండగుహలోనో ముక్కు మూసుకొని మూడవ నేత్రంతో సర్వమూ తిలకించగల మహారుషులకును, కల్పితకథలద్వారా నిజాన్ని అబద్ధం గాను అబద్ధాన్ని నిజంగాను చెయ్యగల ఊహాజ్ఞాన సంపన్నులను కవిపుంగవులకును తప్ప, సామాన్యుల కది యెంతమాత్రమూ తెలియరాని రహస్యమని బోధిస్తా మంటారు !


సెక్సు ప్రభావంవలన స్త్రీ పురుషులకు ఒండొరుల యడల జనించే అనురాగమే వలపు. దీనినే పేరు, మోహం, మనసుల కలయిక, కామం, మన్మధవికారం, మమత యిత్యాది పేర్లతో వ్యవహరిస్తారు జనులు. వలపులో సుఖం దుఃఖం, అభిమానం యీర్ష్య, పశుత్వం దేవత్వం, స్వార్ధం స్వార్ధత్యాగం, మంచి చెడ్డ- అన్నీ లీనమైఉంటాయి. తెల్లని సూర్యకాంతిలో యింద్ర ధనస్సు రంగులన్నీ యిమిడియున్నట్లు వలపులో దయ, ద్వేషం, భక్తి, భయం మొదలైన గుణాలెన్నో విశద పడుతూ ఉంటాయి, పరిస్థితులను బట్టి.


ప్రేమ అనేమాటకు వాడుకలో అనేక అర్ధాలు ఉంటున్నాయి. మాతృప్రేమ, బంధుప్రేమ, దేశప్రేమ


దైవపేరు మొదలైనవి సెక్సుతో సంబంధం లేనివి. ఇక సెక్సుతో సంబంధం ఉన్న ప్రేమలో కూడా ము ఖ్యంగా రెండుకాలు ఉన్నాయి. శరీర సంపర్క వాంఛ ప్రధానంగాల ప్రేమ ఒకరకం. దీనినే కామ మనీ, పశుప్రేమమనీ అంటారు. శరీరభోగాలతో జోక్యంలేని ప్రేమ రెండోరకం. ఇది కేవలం మానసిక మనిన్నీ, మిక్కిలి పవిత్రమైనదనిన్నీ చెప్తారు. వల పులో నిజంగా యీ రెండురకాల ప్రేమలూ విడదీయ డానికి వీలు లేకుండా ఐక్యమైఉంటాయి.


ప్లేటో అనేది కథలలో సహజం గా నే కనిపించవచ్చును గాని మానవప్రకృతికి విరుద్ధ మే అనిపిస్తుంది. వలపుగలచోట శరీరసౌఖ్యా పేరు ఉండక తప్పదు. అయితే, ప్రేమించుకునే నాళ్ళకందరికీ అట్టి సౌఖ్యాలు లభించక పోవచ్చును; కోర్కెలు తీర్చుకుం దుకు తగిన అవకాశాలు లేకపోవచ్చును; కోర్కెలు, అవకాశాలు కూడా గలవారు యింద్రియనిగ్రహంవలన తమ శరీరవాంఛల నణచుకోవచ్చును. కాని, ఇంద్రియ సుఖవాంఛారహితమైన వలపుమాత్రం అసహజం!


అట్లే శరీవసంబంధం ఉన్నచోట నల్లా తప్పకుండా ప్రేమ ఉండితీరాలని తలచడం తప్పు. స్త్రీ పురుషులిద్దరు ఎట్టిప్రేమయు లేకనే శరీరసంపర్కం కలిగి ఉండ వచ్చును; బిడ్డలనుకూడ కనవచ్చును. ఇట్టినడత కడు నీచమైనదే అయినా, అస్వాభావికంమాత్రం కాదన డానికి మానవసంఘంలోగల వేశ్యావృత్తి ఒక గట్టి నిదర్శనం.


స్త్రీపురుషు లిద్దరికి శరీరసంబంధమాత్రమైన ఐక మత్యం యేర్పడినప్పు డది తుచ్ఛమగు కామమనిన్నీ, మన సుల కలయిక మాత్రం సంభవించినప్పు డది పవిత్రమగు స్నేహమనిన్నీ, మనోతనువులు రెండిటి బాంధవ్యమూ చేకూరినప్పు డది పేమమనిన్నీ చెప్పుకుంటారు, సాధా రణంగా. కాని తరుచుగా కామంలో స్నేహం, స్నే హంలో ప్రేమ, ప్రేమలో కామం కలసి పొడగడుతూ ఉంటాయేకాని, దేని కది విడిగా విళదకుడదు. కాబ బట్టే అర్ధం ప్రియులచేష్టలు యితరుల కప్పుడప్పుడు ఏమీ కాకుండా, విపరీతంగా కనబడతాయి.


స్త్రీపురుషులిరువురికి' అన్యొన్యాను రాగం కలగడా నికి నిజమైన కారణం నిర్ణయించడం పైవాళ్లకు సులభ సాధ్యమగుపనికాదు. ఒక్కొక్కప్పు డాప్రియుల కే తెలియదు, తామెందుకు ప్రేమించు కొంటున్నారో. సాధారణంగా మన ప్రబంధాలలో ఉదహరింపబడే ప్రేమ 'తొలిచూపువలపు' నాయికానాయకులలో నూటికి తొంభైమంది ఒండొరుల రూపలావణ్యాలం చూసుకొని మోూహించుకున్న వాళ్ళే! అతని తనూవిభవం చూసి ఆమె, ఆమె సొగసుందనం చూసి అతడు, వలచు కుంటారు. రూపా లెట్లా ఉన్నా, కొంత పరిచయంపైని ఒకరి గుణాలు చేష్టలు ఒకరు అర్ధం చేసుకొని ప్రేమిం చుకున్న వాళ్లు కూడా ఉన్నారు. ఒథెల్లో, డెన్డ్ మోనా వంటివాళ్లు. ఇక రూపం, గుణం, నడవడిక, ఏదీ చూసుకో నవసరంలేకుండా వలచుకో గలవాళు లేకపోలేదు--హిందూదంపతులవంటి అమాయకులు!


ఇతర కారణా లింకా ఎన్ని ఉన్నా, ముఖ్యంగా రూపం, యౌవనం వలపును పుట్టించడానికి బల లమైన హేతువులని చెప్పకతప్పదు. అందుకనే కవులు తాము చిత్రించే నాయికానాయకులలో ఎవరినీ అందహీనుల గాను, వయసుమీరిన వారిగాను చేయరు. శృంగార మనేది యౌవనంలో ఉన్న సుందరాంగులకే వర్తిస్తుంది. కాబోలన్నట్లుంటాయి, పుస్తకాలలో కథలు!


సె ఆకర్షణకు నిజంగా రూపం ఎంత సహ కారో, క్రొ త్తదనంకూడా అంతసహకారి, క్రొత్తవాళ్ళ ను చూసినప్పుడు మనసు చలించినట్లు చిన్నవాటి పరి చయులను చూసినప్పుడు చలించదు. ముఖ్యంగా రక్త సంబంధంగల దగ్గిర చుట్టాల పట్ల కామేచ్ఛ బొత్తిగా మచ్చిక జంతువులలోన కూడా యీచిత్రమే పొడగడుతుంది. చిన్నప్పటినుండీ ఒక్క గూట్లోనే పెరిగిన పావురాలు ఎన్నడూ కలి యవు. తేనెటీగ తనునివసించే పట్టులోని యీగల కొరకు దేవులాడక, వైచోట్లకు ఎగిరి సంబంధం కుదు ర్చుకుంటుంది. ఒకేపుట్టలో ఉన్న రెక్క చీమలు వాటి లో అవి వలచుకోక, దూరంగా నివసించే చీమలగుంపు తో పరిచయం చేసుకుందుకు ప్రయాణాలు చేస్తాయి.


(స్త్రీపురుషులిరువురికి' అన్యోన్యానురాగం కలగడా నికి నిజమైన కారణం నిర్ణయించడం పైవాళ్లకు సులభ సాధ్యమగుపనికాదు. ఒక్కొక్కప్పు డాప్రియులకే తెలియదు, తామెందుకు ప్రేమించు కొంటున్నారో. సాధారణంగా మన ప్రబంధాలలో ఉదహరింపబడే ప్రేమ 'తొలిచూపుదలవు'. నాయికా నాయకులలో నూటికి తొంభైమంది ఒండొరుల రహదశులావణ్యాలు చూసుకొని మోహించుకున్న వాళ్ళే! అతని తనూవిభవం చూసి ఆమె, ఆమె సొగసుందనంచూసి అతడు, వలచు కుంటారు. రూపా లెట్లా ఉన్నా, కొంత పరిచయంపైని ఒకరి గుణాలు చేష్టలు ఒకరు అర్ధం చేసుకొని ప్రేమిం చుకున్న వాళ్లు కూడా ఉన్నారు. ఒథెల్లో, డెస్టి మోనా వంటివాళ్లు. ఇక రూపం, గుణం, నడవడిక, ఏదీ చూసుకో నవసరంలేకుండా వలచుకో గల వాళ్లు లేకపోలేను-హిందూదంపతులవంటి అమాయకులు!


ఇతర కారణా లింకా ఎన్ని ఉన్నా, ముఖ్యంగా రూపం, యౌవనం వలపును పుట్టించడానికి బలమైన హేతువులని చెప్పక తప్పదు. అందుకనే కవులు తాము చిత్రించే నాయికానాయకులలో ఎవరినీ అందహీనుల గాను, నయసుమీరిన వారిగాను చేయరు. శృంగార మనేది యౌవనంలో ఉన్న సుందరాంగులకే వర్తిస్తుంది కాబోలన్నట్లుంటాయి, పుస్తకాలలో కథలు!


సెకు ఆకర్షణకు నిజంగా రూపం ఎంత సహ కారో, క్రొ త్తదనంకూడా అంతసహకారి. క్రొత్తవాళ్ళ ను చూసినప్పుడు మనసు చలించినట్లు చిన్నవాటి పరి చయులను చూసినప్పుడు చలించదు. ముఖ్యంగా రక్త సంబంధంగల దగ్గిర చుట్టాల పట్ల కామేచ్ఛ బొత్తిగా ఉండదు. పక్షులలోను, మచ్చిక జంతువులలోను కూడా యీచిత్రమే పొడగడుతుంది. చిన్నప్పటినుండీ ఒక్క గూట్లోనే పెరిగిన పావురాలు ఎన్నడూ కలి యవు. తేనెటీగ తనునివసించే పట్టులోని యీగల కొరకు దేవులాడక, పైచోట్లకు ఎగిరి సంబంధం కుదు ర్చుకుంటుంది. ఒకే పుట్టలో ఉన్న రెక్క చీమలు వాటి లో అవి వలచుకోక, దూరంగా నివసించే చీమలగుంపు తో పరిచయం చేసుకుందుకు ప్రయాణాలు చేస్తాయి.


అమెరికా, యూరప్ వంటి దేశాలలో ఒకేతరగతిలో కలసి చదువుకునే బాలురు, బాలికలు సాధారణంగా పెండ్లాడుకుందుకు యిష్టపడరట. సగోత్రీకులకు, వివా హబాంధవ్యాలు నిషేధించిన హిందూధర్మశాస్త్రవేత్త లకు యీరహస్యం తెలుసు!


వెలుతురు, వేడిమి, విద్యుచ్ఛక్తి మొదలైనవాటి వలె వలపొక బాహ్యశక్తికాదు. ఆకలి, తలనొప్పి వంటి శరీర బాధయుకాదు. ఇంద్రియానుభవాల వలన మొదట జనించి, పిదప మనసులో స్థిరపడి, క్రమం గా మెదడునుకూడ వశ పరచుకోగల దారుణమహిమ కలది, అది. పంచేంద్రియాలలోను చూపు మిక్కిలి చురుకైనది కనుక, ప్రేమ సంకురింపజేయుటలో దానికి గల సామర్ధ్యాలు మరిదేనికీ లేవు. కళ్ళకుగల యీ దా రుణశక్తికి వెరచి కాబోలు మానససంఘంలో కొందరు ఘోషాపద్ధతిని విధించుకున్నారు తమ స్త్రీలకు! హిం దూవిధవకు సంఘం విధించిన పాడుముస్తాబుకూడా పురు వదృష్టికి వెరచియే నేమో!


మొదట చతుప్రభావంవలన ఉద్భవించిన వలపును మిగతా. యింద్రియాలు కొంతవరకు బలపరచగలవు. కాబట్టే ప్రియాలు కంటికింపగు ముస్తాబు చేసికొనుట తో తృప్తిపడరు, పువ్వులు, పరిమశద్రవ్యములు విరి విగా వాడతారు. కమ్మని మిఠాయిలు భుజిస్తారు. జిలి బిలి పలుకులతో సంభాషించుకుంటారు. పాడుకుం టారు. నృత్యంచేస్తారు. ముద్దులాడుకుంటారు. కాగ లించుకుంటారు. కరుచుకుంటారు. పిచ్చిపిచ్చి పను లెన్నో చేస్తారు. పంచేంద్రియాలకూ పరవశత్వం వస్తే నేగాని వాళ్ళకు తనివి తీరదు.


• ఎలవును జనింపజేయుటలోను, జనించిన వలపును వృద్ధినొందించుటలోను, ఒక్కొక్కప్పు డొక్కొక్క యింద్రియం ప్రాముఖ్యత వహిస్తుంది. ప్రియురాలి అను గ్రహం సంపాదించడానికి ఆమెనిద్రించే గది కిటికీ వద్ద చేరి, ఫిడేలో వీణో వాయినూ పాడేవాడట, పూర్వ కాలపు ఐరోపాప్రియుడు! పిల్లనగ్రోవి ఊది గొల్లపడు చులను వశపరచుకు నేవాడట శ్రీకృష్ణుడు. గానం, వా యిద్యం, సంభాషణ, ఏడుపు, నవ్వు మొదలైనవి కణ్ణం


ద్రియాన్ని రంజింపజేసే సాధనాలు. ఇక ఘ్రాణేంద్రి యాన్ని మెప్పించి, ప్రేమను పెంపొంద జేయగలవి. పువ్వులు, మంచిగంధం, పన్నీరు, అత్తరు, కస్తూరి మొ దలైనవి. ప్రియుల నొక్కొక్కప్పుడు కొన్ని కొన్ని వాసనలు వెర్రెత్తించగలవు. యోజనగంధిని ఆమె ఘుమ ఘుమకు వలచినాడట శంతన మహారాజు! అట్లే తియ్యని మిఠాయిలు, కమ్మనిపిండివంటలు, పండ్లు, పాలు, తేనె, సారాయిలు జిహ్వేంద్రియం ద్వారా మోహోద్రే కాన్ని స్ఫురింపజేసి వృద్ధిచేయగలవు. వలపును సాధిం చడంలో ఒక్కొక్కప్పుడు స్పర్శేంద్రియం చదువు కంటె తీక్ష్యంగా పనిచేస్తుంది. అయితే తనప్రతాపం చూపెట్టుకుందుకు కంటికిగల అవకాశాలు స్పర్శకు లభించవు, కలసి నాట్యం చేసుకునే సందర్భంలో ఒం డొరుల యొడలితాకుడుకు మోహో ప్రేకులై దంపతు లైన పాశ్చాత్య యువతీయువకు లెందరో ఉన్నారట! తన మొగంతీరుకూ, పాటనేర్పుకూ, మాటతీపికీ, దేనికీ సాధ్యుడుకాక కొయ్యబొమ్మవలె నిల్చున్న ప్రవరుణ్ణి చూసి, తుదకు క్షణబాహు మూలరుచితో


"పాంచద్భూష


బాలిండ్లు పొంగారఁబై యంచుల్ మోపగఁ గౌఁగిలించి యధరంబాసింప -” సాహసించిందట సరూధిని. ఉగ్గుపాలతో కళాశాస్త్ర మార్మాలన్నీ నేర్చుకున్న ఆప్రౌఢకు, అతగాడిని లొంగదీయడానికి స్పర్శేంద్రియమే అంత్యసాధనమని తోచింది!


ఇంద్రియసుఖాలు వలపు కెంత అవసరములైనా, కేవలం వాటిపోషణ మీదనే ఆధారపడి ఉండ దది. అందుకనే ప్రేమకు చంచల స్వభావం ఆరోపించారు. పెద్దలు. శరీరం, మనసు, మెదడు ఏకీభవించి కాపా డితేనేగాని నిలవదు వలపు! స్త్రీపురుషు లిద్దరికి ఒకసారి నిజమైన వలపు కుదిరినప్పుడు, అట్టి ప్రేమ స్థిరంగా నిలుస్తుందనీ, ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా చలించదనీ, వాదిస్తారు కొందరు విడాకులు, ద్వితీ యవివాహాలు, ప్రియులకలహాలు మానవసంఘంలో అరుదైనట్లు పుట్టుక, పెరుగుట, చావుగల జీవ


ప్రేమకు స్థిరత్వం ఆరోపించడం వెర్రి. కాని, ఇంద్రియాల ప్రేరేపణకు లెక్క చేయక, హృదయాన్ని లొంగదీసు కొని, బుద్ధిబలంవలన స్థిరంగా ఒక్కరినే ప్రేమించ గలుగుట మానవునికి అసాధ్యంకాదు. పతీవ్రతలు, ఏక పత్నీ వ్రతులు అట్టి మనోబలంగల ఘనులు.


వలపు విషయంలో అవకతవకగా ప్రవర్తించే వాళ్ళం. దరూ మెదడుతకు వరాళ్ళే అని రూఢిపరచగ లరు నేటి శాస్త్రజ్ఞులు. మెదడుశక్తి అంటే పుస్తకాలు చదు పుకున్న జ్ఞానమని కాదు. బడిచదువు, పరిక్షలు, శా శాస్త్ర జ్ఞానం—వీటితో సంబంధంలేక, ప్రతీ మనిషికీ పుట్టుక 'నే భగవంతు డనుగ్రహించే శక్తి అది! సమాన మైన అవకాశాలతో,ఒకేగురువు వద్ద శిక్ష నభ్యసించిన విద్యా . ర్థులందరూ ఒకేమో స్టరు తెలివితేటలు గల వాళ్ళుగా ఉండకపోవడానికి యిదేకారణం. మనిషికీ మనిషికీ, జం తువుకూ మనిషికీగల తేడాలను యేర్పరిచేది యీజ్ఞాన శక్తే! వలపు నిలకడలేనిదే అయినా, దానిని బళవరచు కొని, స్థిరంగా ఒకరిమీదనే నిలచేటట్లు చేసుకోవడం మానవుని ప్రజ్ఞ. అది వానిమేధాశక్తిని నిరూపిస్తుంది. సంఘానికి కొంత మేలు చేస్తుంది. వాని జీవితానికి శాంతి


వలపుకు చంచల స్వభావం ఉండడమే కొంతవరకు మానవుడికి ఉపచరిస్తూ ఉంది. లేకపోతే, జోళ్ళుకుట్టు కుసేవాడు రాజు కూతుర్ని చూసి మోహించి, మనసు మరల్చుకోలేక గుండెపొడుచుకొని చావవలసినదే. వలచినవారిని పొందలేని మనిషికి మరి జీవితంలో ఆనం దమ నేది ఉండదన్న మాట. దొంపత్యను నేది అర్థంలేని బాంధవ్యమవుతుంది. కలిగినవలపును నిలుపుకుందుకు గాని, మరల్చుకుందుకు గాని మానవుడికి సాధ్యమవుతూ. ఉంది గనుక నే, సంఘానికి కొంత గౌరవం, ప్రత్యేక వ్యక్తులకు కొంతచిత్తశాంతి లభిస్తున్నాయి.


కొన్నికొన్ని పరిస్థితులందు కంటికి నచ్చిన వాళ్ళను చూసినప్పుడుగాని, పరిచయంగల వాళ్ళతో ముచ్చ టించేటప్పుడు గాని, ప్రతీమనిషికీ హృదయంలో అర్థం లేని వెర్రి వెర్రికోర్కెలు రగలడం సహజం. అయితే, కొంతఆలోచనాశక్తి, మెదడు అనేవి ఉంటాయి కనుక, కలిగిన ప్రతికోర్కెకూ దాసుడు కానక్కర


లేదు మనిషి. వలపును తన చెప్పుచేతలలో ఉంచుకో లేని మనిషిది దుర్బలమైన మెదడన్నమాట!


తెలివితక్కువవాళ్ళను ముప్పుతిప్పలు పెట్టి, మూడు చెరువుల నీళ్ళు త్రాగిస్తూ ఉంటుంది వలపు. అది మనదేవుళ్ళను, రుషులనుకూడా కొందరిని పరాభవించి సకల బాధలూ పెట్టింది. ఇంద్రుడు, శంక రుడు, శ్రీకృష్ణుడు, విశ్వామిత్రుడు, పరాశరుడు. వీళ్ళందరూ దానికి లొంగిపోయిన మహానుభావులే! ఇక ఆల్పప్రజ్ఞావంతులగు సామాన్యజనులు దాని ప్రభకు దాసోహమనడంలో ఆటే వింతలేదు. మళ్ళీ జీవరాసు లలో కల్లాజ్ఞా నవంతుడనని గర్విస్తాడు నరుడు; తుద కిట్లాంటివాటిలో వెర్రికు ట్టెవలె ప్రవర్తిస్తూ ఉంటాడు. వలపుమూలాన మానససంఘంలో నిత్యమూ ఎన్నో ఘోరాలు, అసందర్భాలు జరుగుతునే ఉంటాయి -' ఆత్మహత్యలు, కూనీలు, దెబ్బలాట్లు, మోసాలు, దొంగతనాలు, యుద్ధాలు, బలవంతం పెళ్లిళ్లు - యిత్యా, దులు. అందుకనే, వలపు గుడ్డిదనీ, వలపులో ఉన్న వాళ్ళు పిచ్చివాళ్ళకంటే అసందర్భంగా ప్రవర్తిస్తారనీ చెప్తారు పెద్దలు. ఒక్కొక్కప్పుడు దెయ్యం పట్టినట్లు మనిషి నా వేశించి,పీడించి, పశువును చేయగలదువలపు; మహామారివ్యాధివలె బాధించి, ప్రాణాలు తీయగలదు.


అట్లే నరున కిహలోకమందే స్వర్గమిచ్చి, సకల సౌఖ్యాలూకూర్చి, వానినిఘనకార్యాలు చెయ్యడానికి పురికొల్పి, బిచ్చగాని సహితం సింహాసనమెక్కించి, వానిజీవితాన్ని ఆనందమయంగా చెయ్యగలదు వలపు. అల్పుని ఘనునిగాను, లోభిని త్యాగిగాను, వృద్ధుని పడుచువానిగాను, పిరికివానిని ధైర్యవంతుని గాను, బలహీనుని శక్తివంతునిగాను మార్చగలదు. మానవ హృదయంలోగల ఔన్నత్యాన్ని పైకి తెచ్చి,. చెడునడ తగల వారిని బాగుపరచి, సంఘానికి ఐకమత్యం, గృహా నికి శాంతి నెలకొల్పగలదు. బంధుత్వాలు, స్నేహాలు, వివాహాలు, సంతానాలు వలపుమీదనే ఆధారపడి ఉంటున్నాయి. పేమకొరకు నరుడు తన ప్రాణాల నా ధారపోయగల త్యాగశీలుడౌతాడు. వలపు అతనిజీవితానికి వెలుగునిచ్చే దివ్యజ్యోతి ; ఆత్మకు శాంతినొసగే తారకమంత్రం !


వలపులో మంచి, చెడుగు, రెండూ ఉన్నాయన్న సంగతి గుర్తెరిగి, సాధ్యమైనంతవరకు ఆమంచే సామా న్యుడికి లభ్యమయేటట్లు చెయ్యడానికి యత్నించారు, మన శాస్త్రకారులు.. సంఘనియమాలు, వివాహాచా రాలు, నీతులు, మతబోధ, అన్నీ యిట్టి సదుద్దేశం గలవే. అనుభవం, పరిశోధనాశక్తి, ఊహాజ్ఞానం మెం డుగాగల మహానుభావులు అన్ని దేశాలలోను, అన్ని యుగాలలోను యిట్టి సిద్ధాంతాలు నిర్మిస్తు నేఉంటారు. ఆది అంతము లేని పరిశ్రమ వారిది! ఏమంటే, నేటి జనులకు నిన్నటి శాస్త్రాలు మనస్కరించవు; రేపటి జనులకు నేటి సిద్ధాంతాలు సరిపడవు..


వలపు విషయంలో ధర్మశాస్త్రవేత్తలు విధించిన యేనియమా:ూ తమకు తృప్తికరంగా లేకపోవుటవలన, నేటి రష్యాలో కొందరు "స్వేచ్ఛ' పేమ"ను అనుసరి స్తున్నారు. అంటే, ప్రకృతిలోగల మృగపక్ష్యాది స్వేచ్ఛజీవుల యిచ్ఛానుసారంగా జనులు వావి వరుసలనుకూడ గణించక వలపు సుఖముల ననుభవిం చుట! ఇది ప్రత్యేకవ్యక్తుల కొక్కొక్కప్పుడు కొంత సదుపాయంగా ఉన్నట్లు కనిపించినా, సంఘానికీ, సం తానానికీ లాభకరంగా ఉంటుందని తోచదు. ఉత్తమ జాతి పక్షులు, జంతువులు, సహితం కొన్ని నియమాలు ననుసరించి మళ్లీ ప్రవర్తిస్తాయి. చక్రవాకాలు, పావు రాలు మనిషికి బుద్ధి చెప్పేటంత నీతితో మెలగుతా యట, తమజోడుపిట్టలపట్ల, ఏకట్టుబాట్లూ లేని స్వే చ్ఛప్రేమ మానవునికి 'సౌఖ్యప్రదం కాకపోవడమేగాక, యీర్ష్యగుణం మెండుగాగల వాని ప్రకృతికి బొత్తిగా సరిపడదు. నేటి సాంఘికాచారములలో లోటుబాట్లు పెక్కులుండవచ్చును ; ఆచరణలో ఉన్న శాస్త్రనియ మాలు నవీన నాగరికతకు అనుగుణ్యములుగా లేక పోవ చ్చును; దేశకాలపరిస్థితుల ననుసరించి సంఘాన్ని సం స్కరించుకొని, మానవుడు తన జీవితాన్ని సవరించుకో వలసినదేకాని, కట్టుబాట్లు లెక్క చెయ్యక, సంఘాన్ని ధిక్కరించి, కళ్ళెంలేని గుర్రంవలె వెర్రిగా పరుగెత్త దలచుట తెలివితక్కువ.


-తాత కృష్ణమూర్తి.





Thursday, December 23, 2021

కథ పగ రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఆంధ్రప్రభ వారపత్రిక - 31 - 12 - 1977 సంచికలో ప్రచురితం )





 




కథ

పగ 

రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఆంధ్రప్రభ వారపత్రిక - 31 - 12 - 1977 సంచికలో ప్రచురితం ) 


“ప్రపంచంలో ఇలా ఇంకెక్కడున్నా జరిగిందేమో నాకు తెలీదు. కాని, నా జీవితంలో మాత్రం జరిగిపోయింది....'


"ఎవరికైనా చెప్పుకుని భోరువ ఏడవాలనిపిస్తుంది. కానీ ఎవరికి చెప్పు కోను ! ఎలా చెప్పుకోను ! విన్న వాళ్ళెవరైనా  నా మొహాని ఉమ్మేస్తారే!...”


"నాకు పిచ్చెత్తి నా బావుణ్ణు . కానీ, పిచ్చెత్తదు. . ఈ బడబాగ్ని గుండెల్లో దాచుకుని ఇలా ఉండిపోవాల్సిందే,”


“దేవుణ్ణి నే వంత పిచ్చిగా ఎందుకు ప్రేమించాను: ఏమో!... నాకే తెలీడు. అతనిలో ఏదో చిత్రమైన ఆకర్షణ  ఉంది. దాని ప్రభావానికే మంత్రముగ్ధనై  ఆంతధైర్యంగా అందర్నీ విడిచి వచ్చి అతన్ని పెళ్ళాడింది...” 


"ఇప్పుడు నా కెవ్వరూ లేరు  అతను తప్ప...." 


"అతమా నాకు దూరమయితే!... ఓహ్! ఆ ఊహకే తన గుండె దడ దడలాడిపోతుందే!... బహుశా ఈ బలహీనతే తన జీవితం మీద ఇంత పెద్ద దెబ్బ తీసిందేమో!... 


' ఏమో!... అంతా ఆయిపోయింది... ఇప్పుడుకొని ప్రయోజన మేముంది!... నిప్పులాంటి ఈ తప్పును గుప్పెట్లో పెట్టుకుని  తిరగటం తప్ప.... 


“నిప్పు గుప్పెటను కాలుస్తుంది.


ఆ సంగతి తెలుసు. నిజం ఎప్పటికైనా బయటపడి తీరుతుంది. ఆ సంగతీ  తెలుసు... దేవుడి కెప్పుడో ఈ విష యం తెలిసే తీరుతుంది... అప్పుడు తనేం చేస్తాడు!.... 


ఏమయినా చేయనీ!  ఇప్పుడు మాత్రం తనీ విషయం  చెప్పదు .... చెప్పి చేజేతులా తన సంసారంలో  నిప్పులు కుమ్మరించుకోదు ... చూస్తూ చూస్తూ దేవుడి పొందును  తనెలాంటి పరిస్థితుల్లోనూ వదులుకో లేదు... 


అతని విూద తన కంత లాలప ఉండబట్టేనా ఇంత పెద్ద ఘోరాన్ని కిమ్మవకుండా తన గుండెల్లో దాచుకు తిరుగుతోంది! 


“దేవుడికి మాత్రం తన మీదంత  ప్రేమలేదూ! ఎంత ప్రేమ లేక పోతే కులం కూడా చూడకుండా అంతమంది  నెదిరించి నా మెళ్ళో తాళికడతాడు! అందుకేగా వాళ్ళందరికీ అతను  దూరమయింది! ఇప్పుడు అతనికి మాత్రం ఎవరున్నారు. . నేను  తప్ప..."


"నే నతనికి .. నాకతనూ!...”


" ఈ అలుసు చూసుకొనేనేమో  శేషు తన జీవితంలో ఇలా నిప్పులు కురి పించిందీ!....”


"ఏంత వద్దనుకున్నా అతను గుర్తుకొస్తూవే ఉన్నాడు....”


"వాడు గురుకొస్తే చాలు ఒళ్ళంతా కంపరమెత్తి పోతుంది... 


ఏమయితేనేమి... ఆ దుర్మార్గుడిపల్లే తన జీవితమిలా కళంకితమయిపోయింది.” 


ఏమాత్రం పసి గట్టినా ఎప్పుడో ఆ నాగుపాము  పడగ నీడ నుండి తప్పుకోనుండేది. 


ఇప్పుడంతా అయిపోయింది.. తన బ్రతుకు సర్వనాశనం అయిపోయింది...” 


" పూర్తిగా వాడిననీ ప్రయోజనం లేదేమో! తన తలరాతే అలా ఉందేమో!... కాకపోతే ఇదంతా ఏమిటి? 


 కమ్మగా తిని, తిరిగే దేవుడు మంచమెందుకెక్కాలి? ..... ఒక్క నెలరోజులు డ్యూటీకి హాజరు కాలేక పోయినందుకే  పగ బట్టినట్లు మేనేజ్ మెంట్  అతన్ని  ఎందుకు టెర్మినేట్ చేమాలి? అక్కడికీ  వ్యక్తిగతంగా ప్రాధేయపడినా ప్రయోజనం లేకపోయిందే!... 


ఆరో గ్యం చెడిపోయి, ఉన్న ఆ ఒక్క చిన్న ఉద్యోగం ఊడిపోయే సరికి అతను బెంబేలు పడిపోయి  తననెందుకు అంతలా  కంగారు పెట్టాలి? అప్పటికీ తనెంతో ధైర్యం  చెప్పిందతనికి! '' వెధవ ఉద్యోగం! పోతేపోయింది. ముందారోగ్యం కుదుట పడనీయండి . . తరువాత చూసుకుందామని... " 


తను మాత్రం బింకం  కొద్ది అలాగ అంది కాని రోజు రోజుకీ క్షీణిస్తున్న అతని ఆరోగ్యాన్ని చూసి ఎంత కుమిలిపోయేది!... 


అక్కడికీ తను తన తండ్రికి  ఉత్తరం రాసింది.  నా కూతురెప్పుడో చచ్చిపాయిందని సమాధానం వ్రాసాడా పెద్దమనిషి! .... 


అత్తగారింటికి  స్వయంగా వెళ్ళి వచ్చింది . తనెవరాలా తెలిసే సరికి తెరిచిన తలుపులు  కూడా మూసుకున్నారు! 


 వంటిమీది  సొమ్ము  ఒక్కొక్కటే తాకట్టు కొట్టు కెళ్లిపోయింది   కూర్చుని తింటే అంటే కొండలైనా కరిగిపోవా! ... 


 ఉన్నవన్నీ హరించుకుపోతుంటే  బాధ పడలేదు.. విధి ఎంచుకిట్లా పగ పట్టినట్లు   తమ జీవితాలతో  చెలగాట మాడుతుందొ తెలీదు !  


ఉన్నట్లుండి ఆయన రక్షం కక్కుకుంటే ..బేజారెత్తిన తను డాక్టరు కోసం పరుగెత్తింది. అప్పపుడు  దొరికిన వాడొక్క శేషునే. 

ఆ స్థితిలో  తానేమీ ఆలోచించుకోలేక పోయింది . టెస్టులు చేయించి తరువాత చివరకు  క్షయ_గా తేలింది. 


శేషు రికమెండేషన్ మీదటనే  దేవుడు హాస్పిటల్లో జాయినవ్వడం .. కొన్ని రోజులు తరువాత డిశ్చార్జ్ అవడమూ సాధ్యమయాయి.  


ఆ తరువాత కూడా రోజూ వచ్చి దేవుణ్ణి చూసిపోయేవాడు శేషు. 


వైద్యం ఖర్చుల గురించి అడిగినప్పుడు " మీరు వాటిని గురించి ఆలోచిస్తూ వర్రీ అవకండి" అని నవ్వేవాడు. 


అంతా ఉదార బుద్ధి అనుకొనేది తాను  అప్పుడు. శేషు అంతగా మారిపోయినందుకు తనెంతో  సంషించింది కూడా. 


.. కానీ వాడు మార లేదనీ .. ఆ ఉదారమంతా వట్టి  బూటకమని..... కడుపులో  కుత్సితపు టాలోచనలు పెట్టు కునే ఈ సహాయం చేస్తున్నాడని  తెలుసుకోలేక పోయింది .... 


.. అన్నీ  తెలిపే వేళకి నిలువులోతు  రొంపిలో కూ రుకుపోయినట్లు తెలిసిపోయింది.    


నిస్సహాయంగా ఆ దుర్మార్గుడి వత్తిడికె బలైపోయింది . 


"ఆ దురదృష్టకరమైన రోజు తనకింకా  బాగా గుర్తే! ...”


"బయట భోరున  వర్షం. చలిగాలికి దేవుడికి తిరిగి దగ్గు ఆరంభమయింది . ఆ బాధచూడలేక కబురంపితే శేషు ప్రత్యక్షమయాడు.


ఇంజెక్షన్ ఇచ్చిన తరువాత మత్తుగా పడుకొన్నాడాయన .


"చలి గాలి తగలకూడదు . తలుపులేసి రమ్మన్నాడు శేషు.


వేసి వస్తుంటే హఠాత్తుగా  చేయి పట్టుకున్నాడు.... అసహ్యంతో తన ఒళ్ళంతా కంపించింది... ! కోపంగా చేయి విసిరికొట్టింది .


" నీ దేవదాసు నీకు  దక్కాలంటే నా కోరిక మన్నించాలి" అని చిన్నగా నవ్వాడతను . "నీ మొగుడిప్పుడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు, నే నిప్పుడిచ్చిందిమామూలు మత్తు  ఇంజెక్షన్ కాదు . ఆ ప్రత్యేకమైన మందు ప్రభావంతో ఒక్క గంటదాకా ఆతనికిక్కడ జరిగేదీ తెలిసే అవకాశం లేదు.తరువాత ట్రీట్ మెంట్ సాగకపోతే మాత్రం ఇంజెక్షన్ ప్రభావంవల్ల మరింత బాధపడుతాడు.  ఇదే అతని చివరి రాత్రి అవుతుంది . నీకు భర్త కావాలో..  నీ శీలమే కావాలో తేల్చుకో."


"నువ్వేమనుకొన్నా ఫర్వాలేదు.. నువ్వీ రాత్రికి నాకు కావాలి. కాదంటావా! నా ఫీజు నాకు పారేయి.. వెళ్ళిపోతా.." 


" ఎక్కడ నుంచి  తేగలదంత  డబ్బు ఆక్షణంలో! ఇంకో గంటలో  స్పృహ  వచ్చి బాధతో ఈయన మెలికలు తిరిగిపోతూ మెల్ల మెల్లగా మృత్యు ముఖంలోకి జారి పోతుంటే నిస్సహాయంగా ఎలా ఊరుకోగలదు ! ఎక్కడికని పోగలదీ అర్ధరాత్రి? .... ఎవరినని  యాచించగలదు మాంగల్యం  కాపాడమని!...


" భగవాన్! ఏ ఆడదానికీ ఎదురవ్వ రాని  దౌర్భాగ్యపు పరీక్ష! ఇంత లోకంలో ఒంటరిగా ఒక ఆడది దిక్కులేక భర్త ప్రాణం కోసం తనను తాను అర్పించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు కల్పించావ్!.....


తాను నమ్మిన భూమే తన కాళ్ళకింద తొలుచుకుపోతుంటే, 


తానేదో అంతు లేని అగాథాలలోకి అణగివేయబడుతున్న  చప్పుళ్లు ! 


... ఆ చీకటిరాత్రి... చిన్న గదిలో ... భర్త ఎదుటే... మరో మగాడి కామానికి బలయిపోయిన ఆ దౌర్భాగ్యపు క్షణాలు తనా జీవితంలో మాయని మచ్చ! 

చచ్చిపోదామన్న పిచ్చి  కోరిక చాలా సార్లు కలిగింది.  కాని... దేవుడిని అల్లాంటి  స్థితిలో వదిలిపోలేని బలహీనత! ... బలవంతాన తననిలా   కట్టి పడేస్తుంది...


మధ్య మధ్య  జరిగిందంతా అతనికి చెప్పేయాలన్ని పిచ్చి ఉద్రేకం ముంచు కొస్తుంది... కాని... చెప్పి... చే జేతులా అతని ప్రేమను దూరం చేసుకోలేదు ... 


అదేనేమో తనలోని   బలహీనత .. 


అందుకే... ఇలా... అందర్నీ దగా చేస్తూ... తనను తాను దగా చేసుకుంటూ బతుకు ఈడ్చుకొస్తున్నది. .......! 


శేషు: 


"మనిషి మనసు మహాచిత్రమైంది. అదెంత స్వచ్ఛమయిందో అంత స్వేచ్ఛకలది  కూడా. 


దానికి వావివరుసలు, నీతి నియమాలు, న్యాయాన్యాయాలు, కట్టు బాట్లు ఏవీ. . పట్టవు. బుద్ధి బలమైనదైతే తప్ప మనసు వెర్రి పోకడకు అడ్డుకట్ట పడటం  కష్టం.


"నా మనసు చాలా సున్నితమైంది. ఒకసారి వోడిపోతే జీవితాంతం మరిచి పోలేని నైజంనాది. పగబట్టి కసి తీర్చుకుంటే గాని  మనసు తృప్తి పడదు, మనసుకు బావిసను నేను . అందుకే విధి ఆడించిన ఆ విషాద నాటకంలో నేను విలన్ పాత్రనే పోషించానేమో..  నాకు తెలీదు.


జీవితంలో మళ్ళీ కవించదనుకున్న శారద ఆరోజు తిరిగి తటస్థ పడింది. 

అదీ... నా కంటి ముందు... నా అనుగ్రహం  కోసం పరితపిస్తూ .. 


ఒకప్పుడు తన కోసమే నేను రాత్రింబవళ్ళు పరితపించి పోయింది ... ఆమె ప్రేమమ పొందాలని... ఆమె అందాలనన్నింటిని అందుకోవాలని వెర్రెత్తి  పోయాను ...


 కాని అప్పుడు ఎంత కర్కశంగా తిరస్క రించిందీ! ....


 'ఛీ ! నీ మొహానికి తోడు ప్రేమొకటే తక్కువ..." అని ఎద్దేవా కూడా చేసింది.  నేను ఆర్తిలో రాసినా ప్రేమలేఖను  చించి నా కళ్లెదుటే చెత్తబుట్టలోకి విసిరేసింది! 


ఆ సంఘటన నేను జన్మలో మర్చి పోగలనా? 


" ఆదంతా ఈ దేవదాసు అండ చూసుకునే అని అప్పట్లో నాకు తెలీనేలేదు....”


మళ్ళీ శారద రాకతో ప్రశాంతంగా సాగుతున్న నా జీవితంలో తుఫాను చెలరేగింది. 


' ఎంత వద్దనుకున్నా గతం ముల్లులా  గుండెల్ని కెలకసాగింది. వచ్చిన ఆ అవకాశాన్ని వదులుకో దలుచుకో 

లేదు.' 


నిజానికి శారద భర్తదంత సీరి యస్ కేసేమీ కాదు. ప్రథమస్థాయిలో ఉన్న క్షయ మాత్రమే. చాలా తేలికగా నయం చేయవచ్చుకూడా. 

కానీ, ఓ నెలరోజుల పాటు అతన్ని మా హాస్పిటల్ లో అడ్మిట్ చేయించుకొని  దాన్ని బాగా ముదరనిచ్చాను. అదే మరో రోగినైనా , మరో డాక్టరయినా నెల  రోజుల్లో మామూలు మనిషిని చేయవచ్చు. కాని, శారద ఆర్థిక స్థితి చాలా హీనంగా ఉందని గ్రహించాను. 


ఇద్దరూ పెద్ద వాళ్ళను  కాదని ప్రేమ వివాహం చేసుకుని అందరికీ దూరమయి అల్లాడుతున్నారని తెలుసు కోవడానికి ఆట్టే సమయం పట్టింది కాదు.  


శారద నిస్సహాయ స్థితి చుట్టూ నా వలను మరింత నేర్పుగా బిగించాను. నెలరోజుల ట్రీట్ మెంట్ కు  ఒక్క పైసా అయినా తీసుకోకుండా ఎంతో ఉదార బుద్ధి నటించాను. నా ఉచిత సహాయానికి పాపం, దేవదాసెంత కుచించుకు పోయేవాడో! 


"మీ ఋణం ఎన్ని జన్మలెత్తినా ఎలా తీర్చుకోగలను డాక్టర్!" అని అతనెన్ని సార్లన్నాడో! 


అప్పట్లో శారదను అనాథను చేయటమే తన లక్ష్యం. కానీ క్రమంగా శారద  ప్రవర్తన నాలోని అహాన్ని మరింత రెచ్చ గొట్టింది. 


గతాన్ని మర్చిపోయినట్లు లేదావిడ. నా మంచి తనాన్ని నమ్మినట్లు కూడా లేదు. నా మనసు తెలిసినట్లు నాకు దూర దూరంగా తప్పుకు తిరిగేది.  తప్పని సరి   పరిస్థితుల్లో నా సహాయాన్ని స్వీకరించాల్సి వచ్చినట్లు ప్రవర్తించటం నన్ను  మరింత కవ్వించింది. 


" అందుకే క్రమ క్రమంగా నా పథకంమార్చేశాను . మరింత క్రూరమైన పద్ధతి ద్వారా శారద జీవితాన్ని ఛిన్నా భిన్నం  చెయ్యనిదే నా పగ చల్లారదు . 


అందుకే ఆ రాత్రి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నది ....


 తప్పో ఒప్పో నాకు తెలీదు. నా పగ తీరి అహం తృప్తి చెందడం ప్రధానం.... “


అందుకే ఆ వర్షం రాత్రి శారద పిలిచినప్పుడు  మెడిషన్ లో  పాత మార్ఫియా కూడా తీసుకువెళ్లాను, 


బాధతో మెలికలు తిరుగుతుతున్న దేవదాసుకు ప్రమాదకరమైన మందు  ఇంజెక్షన్ లా  ఇచ్చాను


నిజానికి ఆ డోసుకు మనిషి పూర్తిగా మగతలో  వెళ్ళలేడు . పరిసరాలలో ఏమి జరుగుతుందో  తెలుస్తూనే ఉంటుంది. కాని, ఏమీ చేయలేనంత అశక్తుడవుతాడు ... 


కావాలనే నా పని చేశాను... శారదకు, నాకు  మధ్య జరిగే వ్యవహారంతా ప్రత్యక్షంగా విని అతని మనసు విరిగి  పోవాలనే ఆ పని చేశాను . 


తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన  భార్య  తన కళ్ళెదుటే మరో మగాడికి త్య శీలాన్ని  సమర్పిస్తుంటే ఏమొగాడికైనా మనసు విరిగి ముక్కలు చెక్కలవుతుంది.

తరువాత  ఆ భార్యతో మనసారా సంసారం చేయలేడు, 

నేను కోరుకున్నదీ అదే. బ్రతికినంత కాలం వాళ్ళిద్దరి మధ్య పెద్ద  అగాధం సృష్టించడం. 


శారదను G పరిస్థితుల్లో లొంగ దీసుకోవటమంత కష్టమయిన పనేమీ  కాదు. 


బలవంతంగానైనానేనాపనిచేసి ఉండే వాడినే. 


కాని, దేవదాసు చివరి ఘుడియల్లో ఉన్నాడనీ సింపుల్ గా  చిన్న అబద్దమాడి  ఆవిడ బలహీనత మీద దెబ్బకొట్టి చివరికామె తనకు తానే  లొంగిపోయేటట్లు చేయగలిగాడు...” 


" శారదమీద నాకు అప్పుడు ఎలాంటి మోజూ లేదు. ఉన్నదల్లా కేవలం పగ... కసి... ! ఏ మనిషి అండ చూసుకుని నా స్వచ్ఛమయిన ప్రేమను తిరస్క రించి నా గుండెను  గాయపరచిందో ఛీ! అని ఆ మనిషి చేతనే తిఁస్కరింపబడేటట్లు చేయడమే  నా లక్ష్యం.. దాన్ని సాధించటానికి నేనెన్ని మెట్లు దిగజారినా లెక్క పెట్ట లేదు.... 


దేవదాసు: 


"శీలం అంటే నా దృష్టిలో మానాసిక మైనది. 

శారీరకంగా పవిత్రంగా ఉండి మానసిక వ్యభిచారం చేసే వాళ్ళని ఎంతో మందిని చూస్తున్నాను. వాళ్ళంటేనే నాకు అసహ్యం . 


 శారద మీద నాకున్న అభిమారం ఇప్పుడు  కూడా రవంత తగ్గలేదు. 


నాకే అంత నరకయాతనగా ఉంటే .. ఆ క్షణాలలో ఆమె ఎంత  క్షోభకు గురయివుంటుందో ఊహించగలను. 


శీలాన్ని గురించి ఆడవాళ్ళకుండే అభిప్రాయం .. సర్వస్యంగా  భావించడం! అది ఆత్మాభిమానానికీ సంబంధించిన సంస్కారంగా భావిస్తారు. స్వంత ప్రమేయం లేకుండా యాదృచ్ఛికంగా మగాడు చేసే అఘయిత్రయంలో తాను పాపపంకిలం అయినట్లు కాదు . స్త్రీలను ఆవిధంగా ట్యూన్ చేసినవాడు మగవాడే . స్త్రీకి విధిగా ఉండాలని నిర్దేశించే ఆ సోకాల్డ్ ' శీలం ' తనకు మాత్రం ఉండనవసరం లేదా?  


తాము చేయని  తప్పులకు అమాయకంగా తమకు తామే శిక్షలు విధించుకోవడం!  .. కుదరని పక్షంలో  కుమిలిపోవడం ! ఎప్పుడు ఇది సరైన పద్ధతి కాదని అర్థమవుతుందో అప్పటి వరకు ఆ మిషతో మగఓాతి వికృత చర్యల కింద అణగారి పోవడం తప్ప మరో వికాసం ఉండదు. 


శారద అదే కోవలో ఆలోచిస్తోంది . అదే నాభయం ఎక్కడ ఏ అఘా త్యానికి పాల్పడుతుందో!  


ఏది ఏమయినా నేను త్వరగా కోలుకోవాలి . శారద కోసమైనా మళ్లా మనుషుల్లో  పడాలి . జీవితాంతం నేను తనను ప్రేమిస్తూనే ఉంటానని భరోసా కలిపించడం భర్తాగా స్నేహితుడుగా, ప్రేలుకుడుగా తన తక్షణ కర్తవ్యం కూడా! 

శారదను అపరాధ భావన నుంచి విముక్తి చేసేందుకు నేను త్వరగా కోలుకుని తీరుతాను . నాకా నమ్మకం ఉంది. నేను ఆశాశీవిని 

***


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఆంధ్రప్రభ వారపత్రిక - 31 - 12 - 1977 సంచికలో ప్రచురితం ) 




Wednesday, December 22, 2021

కథానిక పనికిరానివాడు - కర్లపాలెం హనుమంతరావు ( ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక- 03-07- 1985 సంచికలో ప్రచురితం )



కథానిక 

పనికిరానివాడు  

- కర్లపాలెం హనుమంతరావు 

( ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక- 03-07- 1985 సంచికలో ప్రచురితం ) 


తాగబోతున్న టీని తిరిగి ఇచ్చే సి వాప సిచ్చిన చెత్త నోటును పట్టుకుని బయలుదేరాను. 


ఈ నోటును మార్చట మెలా? అదీ సమస్య 


కొండపల్లి పోయిందాకా తెలిసిన మొహం లేదే! 


చీరాల బస్సు స్టాండులో చిల్లర కోసం పత్రిక కొనాల్సి వచ్చింది. 


బస్సు బయలుదేరే హడావుడిలో నోటు చూసుకోలేదు. టిక్కెట్టు ఖరీదు ప్లస్ సాదర ఖర్చులు పోనూ మిగిలిందీ నోటు మాత్రమే.


పది పైసలతో  కొండపల్లి చేరటం ఇంపాజి బుల్. 


ఊరుకాని ఊరు. ఈ బెజవాడలో చిక్కడిపో యాను. వెనక్కు పోవటానికి లేదు. ముందుకు సాగటానికి లేదు. 


ఏదో విధంగా ఈ పదిరూపా యల నోటుని మార్చాలి . 


బ్యాంకుల టైము కాదు. సాయంత్రం అయిదున్నరయింది.


(కొన్ని బాంకులు ఉంటాయి గాని, ముక్కూ మొగం తెలీనివాళ్ళ దగ్గర చెత్త నోట్లు ఎక్స్ఛేంజ్ చేస్తాయన్న నమ్మకం లేదు).


చూపు ఉన్న  ఏ సన్నాసీ ఈ నోటును చస్తే తీసుకోడు. పోనీ డిస్కౌంటు రేటుకు ట్రై చేస్తేనో! 


ఎలా అడగటం? ఎవరిని అడగటం? 


విజయ వాడలో నోట్ల ఆసుపత్రి ఉందని విన్నాను. ఎక్క డుందో తెలీదు. ఎవరి నడిగినా ఫలితం లేకపో యింది.


ఎనిమిది గంటల లోపు నేను కొండవల్లి చేరుకో లేకపోతే నా ఈ ప్రయాణం వృథా.


'నువ్వు ప్రయోజకుడివిరా. పైకొస్తావు. డబ్బు సాయం నేను చేస్తాను. బి.ఎ. పరీక్షకు కట్టు' అన్న మేనమాడు ఈ రాత్రే పనిమీద హైద్రాబాదు వెళుతున్నాడు. నెల రోజుల దాకా తిరిగి రాడు. 


పరీక్ష ఫీజు కట్టే సమయం దాటి పోతుందప్పటికైతే. అందుకే హడావుడిగా దొరికిన డబ్బు చేత పుచ్చుకుని కొండపల్లి బయలుదేరాను సాయంత్రం.


'ఈ పది రూపాయల నోటు మార్చలేకపోతే ప్రాక్టికల్ గా  నేను పనికిరాని వాడి కిందే లెక్క. 


ఇంటర్లో సంపాదించుకున్న ఫస్ట్ క్లాసు ఇందుకు ఉపయోగిస్తుందా?' 


రకరకాల ఆలోచనలు... కొన్ని ఆచరించలేనివి.

కొన్ని ఆచరించగలిగినా అంతరాత్మ ఒప్పుకోనివి. 'రిక్షా బేరం చేసుకొని కొంత దూరం పోయి ఈ నోటు ఇస్తేనో ? 


తీసుకోక చస్తాడా? పాపం! కష్టజీవి!


గుడ్డివాడి బొచ్చెలోవేసి చిల్లర తీసుకుంటేనో! 


పదిరూపాయల చిల్లర బొచ్చెలో ఉండదు. అలా తీసుకోవడం ద్రోహం' కూడా! 


ఆలోచనలతో బుర్ర వేడెక్కడమే కాని, ఫలితం లేదు. 


ఎదురుగా లీలా మహల్లో ఏదో ఇంగ్లీషు సినిమా.  రష్ గా ఉంది. 'పోనీ అక్కడ కౌంటర్‌ లో ట్రై చేసి చూస్తేనో! ఆ హడావుడిలో వాడు నోటు చూడవచ్చాడా!' 


రు. 20 కౌంటర్ లో అరగంట నిలబడిన తరువాత కౌంటరు ముందు కొచ్చాను. నోటు తీసి కౌంటర్లోకి తోస్తుంటే గుండె గుబగుబలా ఉంది.


ఇందాక టీ స్టాలు ముందు ఏమీ అనిపించలేదు. అప్పుడు నోటు సంగతి తెలీదు. 


ఇప్పుడు తెలుసు. మోసం... మోసం ... అని అంతరాత్మ ఘోషిస్తూనే ఉంది.


'ఇందులో మోసం ఏముంది? దొంగనోటు కాదు గదా నేనిచ్చేది!' అని మరో వైపునుండి సమర్థన. 


' ఈ నోటు పోదు' అనేశాడు కౌంటర్లో మనిషి కర్కశంగా


గభాలున  చెయ్యి బయటకు తీసేసుకుని మొహం చూపకుండా హాలు బయటకు వచ్చేశాను. 


'ఇంక ఈ నోటును మార్చటం నా వల్ల కాదు. కొండపల్లిదాకా నడిచి పోవడమొక్కటే మార్గం. లేదా.... బెగ్గింగ్...' 


' ఛీ...చీ... ! నా మీద నాకే చచ్చే చిరాకుగా ఉంది.


'టికెట్ కావాలా సార్!' అని పక్క కొచ్చినిలబడ్డాడు ఓ కుర్రాడు. 


పదిహేనేళ్ళుంటాయి. వాడు వేసుకొన్న పట్టీ బనీను మాసి , చినిగి, ముడతలు  పడి అచ్చు నా వదిరూపాయల నోటు లాగే ఉంది.


' 2 - 20 .. ఫోర్ రుపీస్...2-20 . ఫోర్ రుపీ స్ . అని మెల్లగా గొణుగుతున్నాడు.


బ్లాకులో టిక్కెట్లు అమ్ముతున్నాడని తెలుస్తూనే ఉంది' 


' పోనీ నాలుగు రూపాయలకు టిక్కెట్టు కొంటే ! ఆరు రూపాయలన్నా మంచివి వస్తాయి. కొండపల్లిదాకా వెళ్ళవచ్చు. ఎందుకైనా మంచిది ముందే నోటు సంగతి చెప్పి ఇవ్వటం....'


నోటును చూసి ' అయిదు రూపాయ లిస్తాను. సార్!' అన్నాడు ఆ కుర్రాడు. 


నా అవసరాన్ని కనిపెట్టాడు-అవకాశాన్ని ఉపయో

గించుకుంటున్నాడు. అసాధ్యుడు! 


జంకూ గొంకూ లేకుండా తెలిసి తెలిసి ఇలాంటి పరమ చెత్త నోటును తీసుకోవటానికి చాలా సాహనం కావాలి. అందులోనూ ఒక రూపాయి కాదు, రెండు రూపాయలు కాదు... పది రూపాయలు... అతని స్తోమతకు అది చాలా ఎక్కువ. 


టికెట్ ప్లస్ అయిదు రూపాయలు ఇచ్చాడు. వది

రూపాయల నోటు అందుకొని. 


అడగకుండా ఉండలేకపోయాను.' ఈ నోటును నువ్వెలా మారుస్తావోయ్?' 


' అదంతా ట్రేడ్ సెక్రెట్, సార్!' అని నవ్వా డు. 


' చెబితే రూపాయి ఇస్తా!' 


' అయితే, చెప్పను. మీ కంటిముందే మార్చి చూపిస్తా... రెండు రూపాయ లిస్తారా?' అన్నాడు. సవాల్ గా . 


ఎలాగూ నాకీ అయిదు రూపాయలు తిరిగి చీరాల పోను సరిపోవు. కొండపల్లిలో ఎలాగూ తంటాలు పడాల్సిందే. సరే. మరో రూపాయి పారేసి ప్రపంచజ్ఞానం నేర్చుకుంటే పోయేదే ముంది.. ఆ జ్ఞానం  నాకు లేనప్పుడు!


ఒప్పుకున్నాను. 


ఫుట్ పాత్ మీద అడుక్కునే గుడ్డి తాత దగ్గర పాత నోటు మదుపు పెట్టి ఎనిమిది రూపాయలు తెచ్చాడు. 


నన్ను కూడా వెనక నిలబెట్టి రెండు సినిమా టిక్కెట్లు కొన్నాడు. 


చూస్తుండగానే పది నిముషాల్లో ఆ టికెట్లను రెట్టింపు రేటుకు గిట్టించేశాడు. పావు గంటలో అరు రూపాయలు లాభం... అదీ పాత పనికిరాని నోటు పెట్టుబడితో! ....


' అడుక్కునే తాతకు ఆ నోటు మారదు. నువ్వు

పాపం గుడ్డి తాతను మోసం చేశావు' అన్నాను.


' అందరి విషయం మన కనవసరం, సార్! మన పనేదో మనం చూసుకోవాలి. అడిగారు గనుక చెబుతున్నా. తాతకు బాంకులో అకౌంటుంది. ఏ నోటు ఇచ్చినా తీసుకుంటారు. వాడికి రెండు రూపాయలు లాభం. నాకు అయిదు రూపాయలు లాభం... మీకు పని జరిగింది...' 


' ఇంత తెలివైన వాడివి మరెందుక నిలా రోడ్లు పట్టావు! ? ' 


అని అడగకుండా ఉండలేకపోయాను బెట్ పెట్టిన రెండు రూపాయలు అందిస్తూ ఒక రకమైన అడ్మిరేషన్‌ తో. 


వాడు నవ్వాడు మిస్టీరియస్ గా.  'మా అయ్య నన్ను తన్ని తగలేశాడు చదూకోటల్లేదని, ఎందుకూ పనికిరానని...' 


ఉలిక్కిపడ్డాను నేను. 


పనికిరాని వాడు.... అతనా?...నేనా??...


ఎవరు? వాడు చదువుకోలేదు. కనక భేషజం లేదు. 


నేను చదువుకున్నాను. కనక భేషజం నన్ను చొరవ చెయ్యనియ్యలేదు. .


మంచికీ చెడుకూ కూడా పనికిరాని ఈ చదువు పనికిరాని వాడుగా తయారు చేస్తుంది నన్నే...


ఇంకా నాలాంటి వాళ్లు ఎందరో...! 


- రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఆంధ్రప్రభ వారపత్రిక - 03 -07 - 1985 సంచికలో ప్రచురితం ) 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...