Showing posts with label Literature. Show all posts
Showing posts with label Literature. Show all posts

Thursday, December 30, 2021

మహమ్మదీయ మహాయుగంలో గ్రంధాలయాలు




 


మహమ్మదీయ మహాయుగంలో గ్రంధాలయాలు 


5. భోజరాజు గ్రంథాలయము. క్రీస్తుశకము పండెండవళతాబ్దికి చెందిన కవిపోషకు డగు భోజరాజు గ్రంథ భాండారమే రాజనిర్మిత భాండా గారములలో మనకు తెలిసినవానిలో మొదటిది. కవి పోషకుడగుటయేగాక ఈ మహారాజు స్వయము కవి; పండితుడు. ఎంజనీరింగు, ఆర్కిటెక్చరు మున్నగు కళలను గూర్చినదగు 'సమరంగన' మనుపుస్తకము అతని రచనము. గైక్వాడువారి ఓరియంటల్ సీరీసులో కొలది వత్సరములకు పూర్వము ప్రచురించు భాగ్యము నాకు గలిగేను. సిద్ధరాజను పేరుగల చాళుక్యరాజు ఈభోజ రాజు రాజ్యమును జయించి ఈతని గ్రంథాలయమునుతన రాజధానీనగరమగు అహిల్ వాడునకు గొనిపోయి తన గ్రంథ భాండాగారమున కలుపుకొనేను. ఈ ఆన్ హిల్ వాడు నేడు పేటన్ అను నామమున శ్రీ గైక్వాడ్ మహారాజానారి సంస్థానమున ఒక నగరమైయున్నది.


5. ముహమ్మదీయుల దండయాత్రలు. గజనీముహమ్మదు దండయాత్రలతో హిందూ దేశ చరిత్రమున హిందూమహాయుగమునకు ఆశ్వాసాంత మైన జనవచ్చును. గజనీముహమ్మదు దేవాలయము లను నాశనముచేసెను, అర్చకులను తన క్రూరఖడ్గము నకు బలియిచ్చెను. అట్టిస్థితిలో అర్చకులు, పండితులు తమకు సాధ్యమైనన్ని గ్రంథములను గైకొని టి బెట్టు, నేపాళము మొదలగు దూరదేశములకును, ఎడారినడుమ నుండి దుర్గమమైన కౌసల్ మియరు మొదలగు తావుల


గము : గ్రంధాలయములు


కును, తదితర ప్రదేశములకు పారిపోయిరి. ఇక ముహమ్మదీయయుగమునందలి భారత దేశ గ్రం థాలయముల చరిత్రను గూర్చి తెలిసికొనవలసియున్నది.


9. ముహమ్మదీయులు:


హిందూసాహిత్య విజ్ఞానము. సాహిత్య


దండెత్తి వచ్చిన ముహమ్మదీయులు క్రమముగ దేశ పాలకులు నిచ్చట నిలిచిపోయిరి. పాలకులు పాదు కొనినపిదప వారికి సాహిత్యవిజ్ఞానాభివృద్ధివి వయమున శ్రద్ధవహించు:ుకు సావకాశము సమకూడెన. అపుడు వారు మసీదులను కట్టించిరి; ముహమ్మదీయ మతవ్యాప కమునకై పాఠశాలలు పెట్టించిరి; ముహమ్మదీయ విజ్ఞాన ప్రచారపరిశోధనలకై కళాశాలల నిర్మించిరి. కాలక్రమ మున వారిదృష్టి హిందువులు మతగ్రంథముల పైగూడ ప్రసరింప నారంభించెను. హిందువుల ధర్మగ్రంథములు వారియాజమాన్యమున పారశీక భాషలోనికి అనువదింప బడుటకు శుభారంభము జరిగెను. 3. ఢిల్లీ నగరము.


బానిసరాజుల కాలమున ఢిల్లీ నగరము విద్యాశాలలకు విఖ్యాతినందెను. పలువురు విద్యాసంతు లానగరమునకు చేరిరి. బానిసరాజులు విద్యాగోష్ఠియందు బహుప్రీతిని చూపిరి. కవులు, పండితులు తాము రచియించిన నూతన కావ్యములను, గ్రంథములను చదువుచుండ వినుటను ఆరాజులును, ప్రధానులును ఘన కార్యముగా భావించిరి. ఖిల్జీ రాజ్యసంస్థాపనాచార్యుడగు జలాలుద్దీన్ పండిత  


రత్నమును, కవిరాజును అగు అమీర్ ఖుస్రు అనువాని రాజభాండారపాలకుని నియమించి అతనికి కొరాన్ పరిరక్షకుడు అను బిరుదమిచ్చి అతని యుద్యోగ ము నాకు మంచివేతనమును ఏర్పఱచెను. గ్రంథ భాండాగ పాలకులలో ఈ అమీర్ ఖుసుకు జరిగినంత గౌరవము మఱి యెవరికిని జరిగి ముండ లేదనుట అతిశయోక్తి గాదు.


1. చక్రవర్తి ఫిరోజ్ టూగ్లక్. మొగలాయి చక్రవర్తులకు పూర్వులైన ముహమ్మ


దీయ చక్రవర్తులలో ఫిరోజ్ టూగ్లక్ నామము భారత దేశ గ్రంథాలయోద్యమ చరిత్ర కారునకు పూజనీయ మైనది. ఫిరోజ్ స్వయము పండితుడు; విశేషించి పండితపోషకుడు. విదేశములనుండి పండితులను రప్పించి వారితో సద్దో సలుపుటకు ఆతడు ముచ్చటపడు వాడు. అల్లు వచ్చిన పండితులు ఆవాసమునకు గాను అతను రాజభవనము నొకదానిని ప్రత్యేకించెను. విద్యావంతు డగు ఈ ప్రభువు హైందవపండితులను రాజసేవలో నియమించెను. హిందువుల సారస్వతముతో పరిచయ ముసంపాదింప తన మతస్థులను హెచ్చరించెను. నాగ ర్కాట్ నందలి దేవాలయమున ఒక చక్కని సంస్కృత గ్రంథ భాండాగారముండుటను తెలిసికొని పారశీక భాష నేర్చిన హిందూపండితుల నట కార్యను లుగ నియమించి ఆచ్చటి అపూర్వ గ్రంథములను కొన్ని ని రశీక భాషలోనికి అనువదింపజేసెను. Que మరణానంతరము భారత దేశ గ్రం థాలయోద్యమము కొంత కాలముకుంటువడినదని చెప్పవచ్చును. ఈ కాల మున తైమూరు హిందూదేశముపై ఎత్తిచ్చి ఢిల్లీనగర మును కొల్లగొట్టెను.


5. మఱికొన్ని చిన్న రాజ్యములు. మొగలుల కాలమునాటి భారత దేశ గ్రంథాలయో ద్యమచరిత్రను వివరించుటకు పూర్వము ఈ కాలము నాటి మఱికొన్ని చిన్న రాజ్యములు గ్రంథాలయోద్యమ విషయమున ఎట్లు కృషి చేసినవో తెలిసికొనవలసియు 8. అహమ నగరమున బహమనీ రాజులు ఒక న్నది. చక్కని గ్రంథ భాండారమును నిర్మించి క్రమముగ నిర్వ హించిరని తెలిసికొనుట కావందముగ నున్నది. ఆ రాజులు దీనికి ఒసగిన పోషణము అనంతమును,


అత్యంతశ్లాఘాపాత్రమును ఆయినదే అయినను పదు నేనవశతాబ్దిలో వారికడ మంత్రిగనుండిన ముహమ్మదు గవాను చేసినదానము ముందు అది డిందుపాటు నొందు చున్నది. డక్కనునందలి భాండాగారములందు అక్కడ క్కడ అతని పద్యమాలికలు నేటికిగూడ మనకు దొరు కుచున్నవి. అతడు కోటికి పడగ ఎత్తినధనవంతు డేయ య్యు చేతికి ఎముక లేని నెఱ దాతగుటచే మరణకా లమునాటికి ఆతని బొక్కసమున లెక్క కాసులుమాత్ర ముండెను. ఉన్నతభావములుగల పోడిమీ జీవితమున ఆతడు ఋషివలె దినములు గడపెరు. అతని ధనమం తయు మసీదులు కట్టుటకు, పండితులను పోషించుటకు, గ్రంథ భాండాగారములను నిర్మించుటకు న్యాయపఱుప బడెను. బీజపురమున ఆదిల్ షాహి వంశపురాజులుగూడ నొకచక్కని భాండాగారమును నిర్వహించిరి. ఆ గ్రంథాలయమునందలి పలుగ్రంథములను ఔరంగజేబు ఢిల్లీ నగరమునకు గొనిపోయినను పందొమ్మిదవ తాబ్దిని అగ్రంథాలయమును సందర్శించిన డాక్టరు ఫెర్గుసన్ దాని మంచిదినములలో ఆ గ్రంథాలయము బ్రహ్మాండ మైనదైయుండవలెనని అభిప్రాయపడినాడు. వంగ దేశ మును రిపాలించిన తొలిజట్టు ముహమ్మదీయ ప్రభువు లలో క్రీస్తుశకము 1282 మొదలు 1825 వఱకు పరిపా లనము సాగించిన నాదిర్షా భారత దేశ గ్రంథాలయో ద్యమచరిత్రకారుల ఎల్లరచే స్మరింపదగినవాడు. ఇంగ భాషలోనికి మహాభారతము ప్రథమమున భాషాంతరీక రింపబడుటకు ఆతనిఆజ్ఞయే కారణము .


5. మొగలాయి చక్రవర్తుల కాలము. మొగలాయి చక్రవర్తుల కాలమున భారత దేశ గ్రం థాలయోద్యమము హుటాహుటినడలతో సాగినదని చెప్పవచ్చును. మొగలాయి చక్రవర్తులు, రాణులు, రాజకుమారులు కళాసాహిత్యములందు మంచి అభిరుచిని, అభినివేశమును చూపిరి. మొగలాయీల మూలపురుషుడగు తైమూరు రచియించిన స్వీయ చరిత్ర నేడును ఉపలబ్ధమగుచున్నది. ఈ తైమూరువలె నీతిని వంశీయులును స్వయము గ్రంథకర్తలై విలపిల్లిరి. వెంగ లాయి రాజవంశసంస్థాపకుడుగు బేబరు గొప్ప విద్వాం సుడు. 'బేబర్ నామా' అను పేరుగల ఆతని స్వీయ


చరిత్ర ఆతరగతివాఙ్మయములో ఎన్నదగినదై నేటి కిని ప్రకాశించుచున్నది. పుస్తకములలో చిత్రములను రచియించు ఆచారమునకు బేబరు ఆద్యపురుషుడన వచ్చును. పుస్తకములు సచిత్రముగ ప్రచురించు పద్ధతి కనుగొనినది మొగలులకు కీర్తిదెచ్చిన విషయము గా నేటికిని మనము చెప్పుకొనుచున్నాము. బేబరు తన గ్రంథములయం దన్నిటియందును చిత్రములను చేర్చు వాడు. బేబరు అనంతరము మొగలాయిసామ్రాజ్యము నగు నియంతయైన ఆతని తనయుడు హుమాయూను తాను జైత్రయాత్రలకు పోవు నవసరమునగూడ కూడ నొకపుస్తకభాండాగారమును తరలించుకొని పోవు వాడు. చరిత్రకు అందిన ప్రథమసంచార గ్రంథాలయ మిదియేయని నిస్సంశ తముగ చెప్పుకొనవచ్చును. ఈ సందర్భమున నెపోలియనును గూర్చిన ఒక సంగతి సాదృ శ్వనిబంధనమున జ్ఞప్తికి వచ్చుచున్నది. నెపోలియను పుస్తకములనిన చెవికోసికొనువాడు. మంచి పుస్తకములు నెంచి ఆతడు అందు ఒక్కొక్క గ్రంథమును జేబునం దిముడు చిన్న సైజున ముద్రింపించి సుందరముగ బైండు చేయించియుంచుకొని ఈ గ్రంథసంచయమును తాను ఎచ్చటికిపోయిన అచ్చటకు గొనిపోవువాడు. హుమా యూను గ్రంథాలయాభిమానము మిక్కిలి మెచ్చదగి నది. ఆతడు తన విలాసమందిరమును ఒక గ్రంథాల యముగ మార్చిపై చెను. గ్రంథాలయ ప్రియుడగు ఈ రాజొక సారి గ్రంథాలయముననుండగా కాలుజారి మేడ మెట్లపైనుండిపడి అప్పుడు తగిలిన దెబ్బలు కారణము గా మరణించెను. హుమాయూన్ తనయుడు అక్బరు పాదుషా ఒక గొప్పగ్రంథ భాండాగారమును కూర్చెను. తాను జయించిన ఒక గుజరాతు దేశపురాజుయొక్క మునుగూడ నీతడు తన స్వాధీనము లోనికి తెచ్చికొ నేను. తనకడ మంత్రిత్వమువహించి యున్న ఫెయిజి అను వాని గ్రంథ సముదాయమును సయితము అక్బరు తన సొంత గ్రంథ సముచ్చయమున చేర్చికొ నేను. ఈ పుస్తకములన్నియు మూడుభాగ ములుగ విభజింపబడెను. పద్యము, వైద్యము, జ్యోతి షము, సంగీతము అను విషయములకు చెందిన గ్రంథము లన్నియు మొదటి విభాగమున చేర్చబడెను. భాషా


తత్త్వము, వేదాంతము, మతము, ఖగోళశాస్త్రము, రేఖాగణితము అను విషయములకు చెందిన గ్రంథము అన్నియు రెండవ విభాగమున చేర్పబడెను. వాఖ్యాన ములు, వంశ చరిత్రలు, న్యాయశాస్త్రము అను విషయము లకు చెందిన పుస్తకములన్నియు మూడవవిభాగమున చేర్పబడెను. పుస్తకములలో చిత్రములను చేర్చు ఆచా రము ఈతనికాలమున బాగుగ పెంపొందెను. పుస్తక ములను సంకరతరముగ బైండింగు చేయు విషయమున ఈచక్రవర్తి హయాను. లో అతిశ్రద్ధ చూపబడెను. మొగలాయిచక్రవర్తులు స్వయముగా గ్రంథములను ప్రోవుచేయుటయందు అత్యుత్సాహమును చూపు పోయే గాక తమపూర్వులు ఏర్పఱచిన గ్రంథ భాండారములను కంటవతీడుకొని పరిరక్షించుట యందును విశేషాభి మానము చూపిరి. ఇంతటిదీక్షతో, ఇంతటిశ్రద్ధతో మొగలాయిచక్రవర్తులు సంతరించిన గ్రంధ సముదాయ మంతయు క్రీస్తుశకము 1739 వ సంవత్సరమున ఢిల్లీ నగ రముపై ఎత్తివచ్చి దానిని కొల్లగొట్టిన పారశీకుడు నాదిర్షా చేతులలో బడెను. 5. ఇతరరాజుల గ్రంథభాండాగారములు.


దక్షిణ భారత దేశపు సుప్రసిద్ధులగు రాజ నొడగు టిప్పుసూల్తాను బహుళ గ్రంథములను సేక రించెను. 1799-వ సంవత్సరమున శ్రీరంగ పట్టణము పట్టు కొనబడినపుడు ఈగ్రంథ సముచ్చయమంతయు నాశ నము చేయబడెను, లక్నో స్నే పట్టణము పట్టుకొనబడినపుడు 1884వ సంవత్సరమున అయోధ్యనబాబు గ్రంథా లయముకూడ నిప్లేయయ్యెను. కాని పలువురు రాజుల భాండాగారములు కాలపురుషుని నాశనఖడ్గమునకు ఎదురొడ్డి నిలచినవి. నేపాళము, కాశ్మీరము, మైనూ రు, జయపురము, జోధపురము, భోపాల్, ఆళ్వారు రాజ్యములందు పురాతన గ్రంథ భాండాగారములు నేటి కిని సుస్థితీయందున్నవి. ఆయాభాండాగారము లందలి గ్రంథములకు నేడు మంచిమంచి కెటలాగులు తయారు చేయబడియున్నవి. తంజావూరు ప్రభువుల గ్రంథభాం డారము మదరాసు ప్రభుత్వము వారి పరిరక్షణము నంది ప్రజోపయోగకరమైన సంస్థయై ప్రకాశించుచున్నది.


( బరోడా సంస్థానంలోని గ్రంథాలయ శాఖాద్యక్షులు కీ.శే న్యూటన్ మోహన్ దత్తా గారి ఆంగ్ల వ్యాసం ఆధారంగా ) 

( ఆంధ్రభూమి - వార- అక్టోబర్ 1938 సంచిక నుండి సేకరణ ) 


Wednesday, December 29, 2021

వ్యాసం ప్రబంధాలలో పండుగ భోజనాలు - ఉత్పల సత్యనారాయణాచార్యులు ( ఆంధ్ర ప్రదేశ్ - మాప - జనవరి, 1961 ) సేకరణ - కర్లపాలెం హనుమంతరావు .

 వ్యాసం 


ప్రబంధాలలో పండుగ భోజనాలు 

- ఉత్పల సత్యనారాయణాచార్యులు 

( ఆంధ్ర ప్రదేశ్ - మాప - జనవరి, 1961 ) 

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు .

                29-12- 2021 



తెలుగు సాహిత్యమున ఏదో యొక విందునో భోజనమునో పురస్కరించుకొని తెలుగువారి వంటకాలను విస్తరించి వర్ణించిన కవులలో ప్రముఖులు   శ్రీనాథుడు, శ్రీకృష్ణ రాయలు, పింగళి సూరన్న, తంజావూరు నేలిన విజయ  నాయకుడు. 


ఆయా కవులు తమ కులాచారములకును, అభిరుచులకును దగిన భోజన సదా ర్థములను వర్ణించియుండిరి. రాయలుమాత్రము  బ్రాహ్మణ..  బ్రాహ్మణేతర భోజనముల రెంటిని లెస్సగా నెఱిగినవా డగుట శాకాహార మాంసాహార భోజనముల జక్కగా వర్ణించి సమకాలపు సాంఘిక జీవనమును మనకు సాక్షాత్కరింప జేసి యున్నాడు. 


విస్సనమంత్రి పంక్తిని గూర్చుండి శ్రీనాథుడు హేమ పాత్రాన్న మారగించెడివాడు. అతని భోజనము సాధారణ మైన దైయుండదు. ఒకప్పుడు పల్నాడులో నొకరింట జొన్న న్నము పెట్టి, చింతచిగురు, బచ్చలాకు కలిపిన యుడుకు కూర వడ్డించిరట. కప్పురభోగి వంటకమున కలవాబుపడిన కవిసార్వ భౌమున కది యెట్లు రుచించును?


ఫుల్లసరోజనేత్ర ! యల పూతన చన్నుల చేదు ద్రావి నా 

సల్ల దవాగ్ని మ్రింగితి న టంచును నిక్కెద వేమొ తింత్రిణీ

పల్లవయు క్తమౌ యుడుకు బచ్చలి శాకము జొన్నకూటీతో 

మెల్లగ నొక్క ముద్ద మ్రింగుము నీ పస కాననయ్యెడిన్


అని పరిహాసము చేసినాడు. సన్నన్నము సున్నయైన పల్నాటి సీమను హేళన చేసి 'రసికుడు పోపడు పల్నాడు' అచట 'కుసు మాస్త్రుండైన జొన్నకూడే కుడువవలసి వచ్చు' సని యెఱుక పఱిచినాడు. ఆ కాలమున పూటకూలి ఇండ్లలో ముఖ్యముగా  లక్ష్మణవజ్ఝల నొక్క రూకకు చక్కని భోజనము లవారింట లభించెడిదట.


కప్పురభోగి  వంటకము కమ్మని గోధుమ పిండివంటయున్ 

గుప్పెడు పంచదారయునుక్రొత్తగ గాచిన యాలనే పెస 

ర్పప్పును గొమ్మున ల్లనటి పండ్లను నాలుగు నైదు నంజులున్ లప్పలతోడ త్రొంబెరుగు లక్ష్మణవజ్ఝల యింట రూకకున్.


తెలుగువారికి ముఖ్యముగా గుంటూరు మండల వాసులకు గోంగూర తగనియిష్టమను వాడుక యున్నది. ఆ ప్రాంతము వాడేయయిన శ్రీనాథు డేలనో గోంగూరను గొనియాడిన వాడు కాడు. ఇది చింతింపదగిన విషయమే మఱి ! ఆ కాలమున భోజనపరాక్రమము గల ఏ రామయమంత్రియో 'గోంగూర వంటి కూరయు గాంగేయునివంటి ధన్వి, నభూతోన భవిష్యతి' యని ప్రస్తుతించియుండవచ్చును. 'మా రామయమంత్రి భోజన పరాక్రమ మే మని చెప్పవచ్చు ఆ స్వామి యెఱుంగు తత్కబళ చాతురి తాళఫల ప్రమాణమున్ ' శ్రీనాథుడు, గోంగూరను గొనియాడకపోయినప్పటికి అరవవారి విండ్లను నిరసించియుండుట చేత నాంధ్రత్వమును నిల్పినవాడై నాడు. 


తొలుతనే ఒడ్డింత్రు  దొడ్డ మిర్యపుజారు చెవులలో పొగవెళ్లి చిమ్మి రేగ

బ్రహ్మరంధ్రము దాకా  బాఱు నావ పచ్చళ్లు మున్నగు అరవ పచ్చళ్లత నికి నచ్చవు. ఈ కవి సార్వభౌముడు కన్నడదేశమున కరిగియచ్చట 'రుచులు దోసంబంచు పోనాడి' నిస్పృహచెందిన వాడు. కావ్యపా కాలలో శ్రీనాథుడు నేటికాలపు రమ్యతయు రుచియు తెలిసిన రసికుడు ఇడైనలకు తన కావ్యమున చో టిచ్చిన యీ కవి నేటి నవనాగరిక యుగమున నుండదగినవాడు.


రాయలు ఋతుపర్ణనలో నాయా కాలములకు దగిన పంటక ములను బేర్కొనియున్నాడు. బ్రాహ్మణభోజనమును గూర్చి చెప్పుచు రాయలు పొరివిళం గాయలను బేర్కొ నెను. వేపుడు బియ్యపు పిండి బెల్లపు పాకముతో జేసిన యుండ లవి. పెరుగువడియములు, పచ్చివరుగులు - వాన కాలమున గలమాన్నము ఒల్చిన పప్పు, నాలుగైదు పొగపిన కూరలు - వేసవి కాలమున నులివెచ్చని యన్నము, తియ్యని చారులు, మజ్జిగపులుసులు, పలుచని యంబలి, చెఱకుపాలు, ఎడనీళ్లు, వడపిందెలు, ఊర గాయలు, నీరుచల్ల – ఇక చలికాలమున మిరియపు పొళ్లతో గూడిన వెచ్చవెచ్చని కూరలు, అవపచ్చళ్లు, చేయి చురుక్కను నేయి, ఇవురగాచిన పాలు బ్రాహ్మణు లారగించెడివారట.


తారుణ్యాతిగ చూతనూత్న ఫల యుక్తాలాభిఘార స్వన 

ద్ధారాధూపిత శుష్యదంబు హృత మాత్స్యచ్ఛేద పాకోద్దతో ద్గారంపుంగనరార్చు భోగులకు సంధ్యావేళలం గోళికాం 

తారాభ్యంతర వాలుకాస్థిత హి మాంతర్నారికేళాంబువుల్


మాంసాహారులైన ధనికులు వేసవి కాలమున చేపల తునకలలో మామిడి కాయముక్కలు వేసి తాళింపు పెట్టి మధ్యాహ్న వేళలం దల్పాహారముగా బుచ్చుకొనెడివారట. ఆ పిమ్మట స్నాన శాల దాపున దడియిసుకలో బూడ్చి పెట్టిన కొబ్బరిబొండములు దీసి ఎడనీరు త్రాగి చేపల కనరును పోగొట్టుకొనెడివా రట. శాకాహారపు అల్పాహారముగూడ నిండకు దక్కువైనది కాదు. పనసతొనలు, దోసబద్దలు, తియ్యదానిమ్మలు, గసదాడి అరటి పండ్లు పానకములు బ్రాహ్మణులు సాపడుచుండెడివారట.


శ్రావణ మాసమున ఆకుకూర అధికము. ఆకాలమున సామాన్యులైన రెడ్లు చెంచలి, తుమ్మి, లేత తిగిరిసాకు తఱగి చింతచిగురు కలిపి నూనెలో వేయించి పొడికూర చేసికొనెడి వారు.


గురుగుం జెంచలి దుమ్మి లేదగిరి సాకుం దింత్రిణీ పల్లవో 

త్కరముం గూడ దొరంటి సూనియలతో గట్టావి కుట్టారు

గిరముల్ మెక్కి తమిన్ బసుల్ పొలము వో గ్రేపుల్ మెయుల్నాక మే 

కరువు గుంపటి మంచ మెక్కిరి ప్రభు త్వైకాప్తి రెడ్లజ్జడిన్.


పెద్ద నార్యుడు శ్రీనాథుని వంటి అనుభవ రసికు డయ్యును నారని కేలతో వంటకములపై బుద్ధిపోలేదు. ఆయనకు 'ఆత్మ కింపయిన భోజన' మున్న జాలు. కప్పురభోగి పంటకముకన్న పెద్దన్నకు కప్పురపు ఏడెమే ముఖ్యము. 


పారిజాతాపహరణప్రబంధమున నంది తిమ్మన్న 'శాక పాకంబుల చవులు వక్కా ణించుచు' శ్రీకృష్ణుడు భుజించినట్లు వర్ణించి యుండెనే కాని, ఆ శాక పాకములను మనదాక రానిచ్చిన వాడు కాదు.


కమ్మనై కారమై నేతను పండంబొల్చి, త దుమురై పాఱుటల్ లేక సద్యోజనితంబుల్ వోలెఁ జాలు జపులోదవునవి కండచక్కెర పాకమున దయారయినవియు సగు అప్పాలను తెనాలి రామకృష్ణుడు వర్ణించెను. ఇచ్చట కార మనగా ఘాటని అర్థము. పింగళి సూరనార్యుడు తన కథానాయకుడై న క ళాపూర్ణునకు బ్రాహ్మణ భోజనమే పెట్టించెను.


పట్లు మండిగలు బొబ్బట్లు వడలు కుడుములు సుకియలు గడియంపుటట్లు వె

కల వంటకములు బూరెలు తేనె తొలలు చా న్నప్పాలు వడియంబు లప్పడాలు బొంగరములు సొజ్జెబూరె కాగుల సేవె లుక్కెర లరిసెలు చక్కిలములు.


తంజాపు రాంధ్ర నాయక రాజైన రఘునాథ భూపాలుడు శ్రీనాథుని కప్పురభోగి పంటకములను చవిచూచినవా డగుటచే గాబోలు తన కాలపు దొరల భోజనములను గూర్చి రఘునాథ రామాయణమం దిట్లు వర్ణించెను.


కప్పురభోగి పంటకము కమ్మగనే పడియున్ భుజించి మేల్

దుప్పటులట్లు మూరగల తోరవు పచ్చడముల్..

కప్పుకొచెడి వారట! ఈ రఘునాథ భూపాలుని కుమారుడైన విజయ రాఘవ నాయకుని రఘునాథాభ్యుదయ ద్విపద కావ్యమం దానాటి వంటకములలోని విశేషము లెన్నేనియు గ్రహింప వచ్చును. ఈ కవిరాజు భోజన మిషతో నాటి మహారాజుల మహానసమున ఘుమఘుమలాడు వంటకములను బెక్కింటిని పేర్కొని యున్నాడు.


ఒక వేదండయాన కై దండ యుసగ దిగి బంగరు పీటమీద గూర్చుండిన పట్టపు రాజు పళ్లెరమున దొలుతగా “గిలుకు టం దెలు మ్రోయ గీరసల్లాప కులుకుచు పచ్చడులు గొని వచ్చినదట ! వడ్డన మొదలుకొని స్వీయ సంప్రదాయమునే వర్ణించి నాడు విజయ రాఘవుడు.


"అప్పడాల్ నువు పొడి హవణించినట్టి 

కప్పురపుకోడి యొక్క లతాంగి తెచ్చె

 తురిమిన టెంకాయ తునియలు గూర్చి కరివేప పొడిచల్లి కమ్మని నేత

పొంకంబుగా దాల్చి పొదిగినయట్టి కుంకుమకోడి గై కొనివచ్చె నొకతి"


ఈ వంటకములలోని పదార్థములనుబట్టి ఇవి శాక సంబం ధములే యనియు, నేటి పకోడీలవంటివే కప్పురపుకోడి మున్నగు నవి యనియు, నాటి బ్రాహ్మణులుగూడ నిట్టివి చేయుచుండెడివా రనియును జెప్పవచ్చును. కాని బ్రాహ్మణులు దీనిని కప్పురపు కోడి, కుంకుమకోడి, కస్తూరికోడి, పాలకోడి, కట్టుకోడి అని పేర్కొనకపోవచ్చును. పదార్థ మొక్కటియయ్యును వ్యవహారమునందును, పేర్లలోను కొద్దిపాటి భేద ముండవచ్చును. కో ళ్లన్నియు బోయి పకోడీలు మాత్రము నిలిచినవి. 


నీరుమజ్జిగయనగ మనము సాధారణముగా మజ్జిగ తేట యని భ్రమపడుదుము. అది కాదు.


"సారమౌ జంబీర సారంపు రుచుల 

మీఱంగ లవణంబు మితముగా గూర్చి 

మేలైన సొంటితో మిళిత మైనట్టి 

ఏలకి పొడివైచి యింపు దీసింప 

దగు వట్టివేళ్లచే తావులు గట్టి 

మగువ యొక్క తె నీరుమజ్జిగ దెచ్చె"


ఇవి కాక మనము మఱచిపోయిన సారసత్తులు, పేణీలు మున్నగు ఈ కవి తన ప్రబంధమున నిబంధించి మనకు రుచి చూపించుచున్నాడు.



- ఉత్పల సత్యనారాయణాచార్యులు 

( ఆంధ్ర ప్రదేశ్ - మాప - జనవరి, 1961 ) 

సేకరణ : కర్లపాలెం హనుమంతరావు .

                29-12- 2021 

Sunday, December 26, 2021

మన ప్రాచీన కవుల చమత్కారాలు

 


మన ప్రాచీన కవుల చమత్కారాలు 


( ఆంప- వా - 28 -08 - 1957 ) 


6 అంగములలోనే మే లుత్తమాంగమందు ను తమంబులు కన్నుల ఉర్విజనుల కట్టి కన్నులు 'లేపను టం తేకాక


ఉ తీసుఁడు కౌఁడె సద్గుణయు కిసతఁడు" కూతురుని ధృత రాష్ట్రున శివ్వడానికి నిశ్చ యించానని గాంధారపతి చెప్పగా బంధు పులు అన్న మాటలు.


‘సర్వస్య శాత్రస్య శిరఃప్రధానఆ సర్వేంద్రియాణాం నయనం ప్రధానమ్ '


అంటారు పెద్దలు. అవయవా అన్నింటా తల ఉత్తమం - సర్వేంద్రియాలలో నయనం ముఖ్యం. ఆలాటి కన్నులు లేవుగాని ధృత రాష్ట్రునికి లో టేమిటీ? ఎన్ని ఉంటే ఏంలాభం? కళ్లులేవు. బలే మంచి పెండ్లి కొడుకు అన్నారు. ఏపిల్ల అయినా, చివరికి నీ రేశిలింగం గారి చౌదస్తపు చలమమ్మకూడా ఒప్పుకోదు "పిండాడడానికి కొని గాంధారి అలా ఉంది. ఒప్పుకొంది. ణీ పెళా


గురువుగారుకోరినట్టు అర్జునుడు ద్రుపదుడై జయించి రథానికి కటి తెచ్చి గురుదక్షిణగా అప్పగించాడు. అప్పుడంటాడు ద్రోణుడు_


‘వీరెవ్వరయ్య ద్రుపదమ హారాజులె ఇట్లు కృపణులయి పట్టుబడక వీరికివలసె నె అహహ! మ హారాజ్యమడాంధి కొర సుదీ వాసెనోరో


అని 9


పిల్లవాడికి పాలకోసం ఆపుకోవాలనీ, సహాధ్యాయికజా ఆమాత్రం ఉపకారం చేయకపోతాడా అనీ ద్రోణుడు ద్రుపగుణ్ణి అర్థించాడు. అప్పుడు మహారాజైన గ్రుహ శారతమ్యం తెలుసుకోకుండా మాటాడుతున్నావు. పరమదరిద్రుడివి నువ్వు మహారాజు నేను. నాకూ నీకూ స్నేహ *మేమిటి పోశా అని తూలనాడాడు ఐ గర్వంతో, - దానికి ఈ నాడు ద్రోణుక - జనాబు చెబుతున్నాడు


ఓహో ద్రుపదమహారాజులా? వీరు? మహా రాజత్వం మాసిపోయినట్టుండే ఇంత దిని


పోయారేమిటి ఎరే, - అని హాసృసూరు అధిక్షేపించాడు.


ఏఘటంలో నేనాసరే సన్న పొర్యుని హాస్యం అంతర్నాళలకు సూది పోటు పొడిచినట్టుంటుంది. స్థూలదృష్టిలో సున్నితీ గానూ, సూక్ష్మవిచారణలో చురుకుగానూ


యామిజాల పద్మనాభస్వామి


తగిలే హాస్యం ప్రకటించడములో నన్నయ సిద్ధహస్తుడు.


విచిత్రవీర్యుడు రాజ కార్యాల ప్రసక్తి వర్ణించి సంతతి కొమోపభో గాలతో కాల క్షేపం చేయడంవల్ల షేయ రోగి అయి పోయాడు. దీనిని నన్నయ


రాజయతీ, బాధితుడయి దేవలోక సుదతీప్రియడయ్యె విచిత్రవీర్యుడున్'


అని అంటాడు. సచ్చిపోయాడని వాద్యంగా అనడు. ఐహిక శాసవాంఛతో తృప్తితీరక దేవలోకంలో ఉన్న నడతులకు ప్రియు ఉయాడంటాడు,


రాజై పట్టం గట్టళన్నాక ప్రజాక్షేమం కోసం రాజకార్యాలు పరిశీలించి పరిపాలస చేయడం నాని విధి. అది మానేసి కొను వాసుడై రోగి అయి చచ్చాడు. గారిని ఆవ ళ పూర్వకంగా సూచిస్తున్నాడు శబ్ద శాసనుడు.


ఆరి వీడి కామం తగలడా! నల విడి ఎ సాము చేశా డుం వీడు,- అనే బుద్ధి చెబుతూ అయింగా' ఇక అన భవించరా, అన్నకుండి


ఒకౌసురవన ఘట్టములో బ్రాహ్మణ వేషా లతో నివసిస్తున్నారు పాండవులు. వారున్న యింటి యజమానివంతు వచ్చింది బకాసురు ఆనాడు ఆహారం గా ఎవరో ఒకరు వెళ్ళలి తల్లి, తండ్రి, కూతురు, చిన్న కొడుకు ఇది వారికుటుంబం నేనంటే నేను అని పెద్దవాళ్ళు ముగ్గురూ ఎనించుకొంటు ఆ సందర్భంలో అవ్యక్త పరను డిన పిల్లవాడు తల్లిదండ్రులకూ, అక్క కూ కన్నీళ్ళు తుడుస్తు


దండుకుల చేత ఏన రెక్క సుఁ గిట్టి చంపి


బులుకి వత్తు మీరేశ్వ గా వలవదనుచు కలయి నూకా ర్చ తీశతొక్కు పలుకు


(వాడి ను టలుకున) వాళ్ళయేడుపు కొసరుణి దంపడానికి ఒక పోయింది చిన్న కర్రపట్టుకొని వారువెళ్ళి చంప వస్తా డట. ఏమి’లో అనుకొన్నాడు వాడు.


పాము పాము అని పెద్దవాళ్ళు గాభరా పడుతూ ఉంటే ఏదీ నేను పంపేత్తాను " అంటాడు ఆ యి దారేళ్ళ వయసువాడు, చేపాటి కర్రలో పరుగెత్తుతాడు. దూచేవారి కందరికీ వింత గానూ నవ్వుగానూ ఉంటుంది.


ఈలాటి భావాలు వెల్లడించే ఘట్టాలలో కూడా నన్నయ ఎదురు లేని వ్యాఖ్యాత గా కనబడతాడు.


జీవితములో సముద్రతరంగాలవలె రేగే బాధలు అనేకం ఉంటాయి. మనస్సుబరువెక్కి సర్వేంద్రియాలకూ సంకెల వేసినట్టు చలనం లేకుండా ఆయి బరువు తలకెత్తినట్టు ఉంటుంది. ఆ బరువును ఇట్లే దింపడానికి మందు హాస్యం. మనస్సుకి వికాసం కలిగించేది హాస్యం.


సంఘములో, నిత్య జీవితంలో తెలిసి, తెలియక వస్తున్న దురాచారాలనూ, దుష్ట బంధాలనూ రూపు మా పి విడగొట్టడానికి హాస్యం ఎంతో ఉపయోగపడుంది కాని దానిని విరివిగా ఉపయోగించి జీవితంలో చైతన్యాన్ని సమగ్రంగాకలిగించేవిధానంలో గ్రంథాలు తెలుగులో ఆటే వెలువడ లేదు. ఎక్కడో నాటా నూటా ఆయా సందర్భాలలో ఒకటి రెండు పద్యాలలో వెక్కిరిస్తున్నట్టు ము డి పెట్టి సవితప్ప హాస్యాన్ని అంగిరసముగా చేసికొని ఆవిర్భ వించిన కౌవ్యాలు లేవు.


నన్నెచోడుని కుమారసంభవములో దక్షాధ్వరధ్వంసం పట్టులో కొంత హాస్యం గోచరిస్తుంది రుద్రుని సైన్యాలు యజ్ఞవాటి కను ధ్వంసం చేసి దేవతౌబృందాన్ని చీకాకుపరచిన ఘట్టం చదువుకూ ఉంటే పకాలున నవ్వు వస్తుంది.


ప్రమథగణాలబారినుండి తప్పించుకో వాలని బ్రహ్మ తన వాహనమైన హంసను అధిరోహించబోయి భయంతో నేలమీద పడిపోయాడు. అప్పుడు హంస తామర తూడుని కఱిచి పట్టుకొన్నట్టు బ్రహ్మను పట్టుకొని పరుగెత్తిందట. వాహనంబు నెక్కి వచ్చి భయంబుళ


వడఁకి నేలఁబడ్డ వనజగర్భుఁ


గమిచికొని మరాళకము నా


కఱచికొని రయమునఁ బఱచి విష్ణువు గరుత్మంతుణ్ణి కౌగలించుకొని


దాని కాళ్లు' వేళ్లూ పట్టుకొని ఇంటికి పారి పోయా ఉంటాడు' “గరుడి నడుము మెడయు కాలును శైలును,


ఇఱికికొనుచు చక్రి వెఱచి పఱ చె కుబేరుడు సరవాహనుడు. ప్రమధగణాల


బాధ తప్పించుకొ నేందుకు ఆయన గారు పడ్డ పాటు 'తన యెక్కిన మానినిఁ దా


సనయము నెక్కంగ మఱచి యాతనిఁ


దన మ పున నిడికొని పటిచె భయం బున ధనపతి తన్నుఁ బిఱుద భూతము వాహనమైన వాడిమీద తాను కూర్చో


దానికి 


బదులు తనమీద వాణి ఎక్కించు కొని పారిపోయాడు. ప్రమధగణాలు 'ఓ అని అరుస్తున్నాయి వాడి తెలివి తేటలు చూసి. అప్పుడు యుక్తాయు కజానం ఎక్కడ వస్తుంది పాపం తన బ్రతుకేమవు తుందో అని కుబేరుడి భయం. వాడి చేష్ట మాత్రం మనకి నవ్వు పుట్టిస్తుంది. ఈలాగే ఒక్కొక్క దిక్పతి పొందిన అవస్థను కవి బీభత్సంగా వర్ణించినా అది తాత్కాలికవర్ణనలో హాస్యభంగిమ నే సూచిస్తుంది.


విరాటపర్వంలో కీచకునివల్ల


జరిగిన అవమానాన్ని సైరంధ్రి వేషంలో ఉన్న ద్రౌపది కొలువుకి వచ్చి విరటునితో మొర పెట్టుకొంటుంది. ఆసమయంలో శంకభట్టయి వున్న ధర్మరాజు 'సభలో ఇల్లాలు ఇంతసేపు మాటాడడం, ఎదిరించడం తగునా? చాలు వెళ్ళు' అంటాడు. 'సైరంధ్రి వినలేదు. కంక భట్టుకి కోపం వచ్చి, 'పలుపోకలఁ బోవుచు వి చ్చలవిడి నాట్యంబు సూపు చాడ్పున


గులసతుల గఱువ చందము దొలగక నిటునికి దగ్గు తోయజవదనా.' అని ఆక్షేపించాడు. అప్పుడు సైరంధ్రి


అన్న మాటలు చురుక్కు లే తగిన హాస్యపు


.


పోటు.


‘నాదు భల్ల భుండు నటుడింత నిక్కంబు పెద్దవారియట్ల పిన్న వారు, కొన పతులవిధమ కాకయే శెలూషి గాననంగరాదు. అంతే కాదు. జూదఱి యాలికి గఱువతనం


బెక్కడిదయ్యా'—అంటుంది. ఒక్కపంక్తిలో తిక్కన తన అసాధారణ • మైన హాస్యరేఖాచిత్రం చూపి కవిబ్రహ్మ అయాడు.


రానురాను ప్రబంధయుగం అవతరించి హస్యానికి స్థానం లేకుండా చేసుకొంది. ప్రాచీన కావ్యాలలో ఈ మాత్రమేనా హాస్యానికి తావుందిగాని తరువాతి వానిలో ఆ ప్రసంగానికే నెలవు లేదు.


శ్రీనాథుని కావ్యాలలో ప్రత్యేకించి హాస్యానికి స్థానం కనబడదుగాని చాటువులలో కొంత సున్నితమైన హాస్యం కనబడుతుంది. ముందే చెప్పాను. ఆశేప ణలో, సంస్కారపక్షంలో చెప్పిన దానిలో హాస్యానికి తావు ఉంటుందని శ్రీనాథుడు పల్నాటిని ఉద్దేశించి చెప్పిన పద్యాలలో ఆ ధోరణి కొంత కనపడుతుంది.


'రసికుడు పోవడు పల్నా డెసగంగా రంభయైన ఏకులు వడకునా


* మన ప్రాచీన


వసుధేశు డైన దున్నును కుసుమాస్త్రం డైనజొన్నకూడే కుడుచున్ దో సైడు గొంపలో పసుల త్రొక్కిడి మంచము దూడ రేణమున్ చేసిన వంటకంబు పని బాలుర కౌచము వి స్తరాకులు చూసిన గుడ్డలున్ తలకు మాసిన ముండలు వంటకుండలుకో


శాసెడు కట్టెలున్ తలప కాదు పురోహితు వింటి కృ


కృత్యముల్ పలనాడు అంటే ఆనాడు శ్రీనాథుడు తనకు కావలసే భోగాలన్నీ ఇట్టే లభించే సీమ అనుకొని వెళ్ళాడు. అవి యేవీ లేవు. చీకాకు వేసి "బీదరమీద ఆ ఉంటాడు పాపం! గరళము మ్రింగితి నంచున్ ఇలా ఏడ్చి


పురహర! గర్వింపఁబోకు పోపోవా! నీ


బిరుదింక గానవచ్చెడు మెరసెడి రేనాట జొన్న మెతుకులు


కొండవీడులో గాడిద నుద్దేశించి


అక్కడి చిల్లర కవులను నవ్వుల చేశాడు. గాడిద! నీవునుకో కవివి కావుగదా! ఇట కొండవీడు లోక పాలు


అని ఎంత గడు గాయితనం ఇది!


వెలులిం దిలపిషమున్ "మెసవితి


విశ్వస్త వడ్డింపగా' అన్నాడు


ద దేశిసంచారంలో ఒక యింట విందా


కన్నడ రగించిన సందర్భంలో- అసలే అది తెలకపిండి గుండ. దానిలో


వెలులి కలిసింది. రుచికె తే బాగానే ఉంటుందిగాని పరమశివభక్తుని


కది వెగటుగా తోచినట్టుంది. దానికి తోడు గాజులచేయి కాదు వడ్డించింది. విశ్వస్త. కవిసార్వభౌముని అవస్థ ఏమి చెప్పడం!.... తెనాలి రామకృష్ణుణి హాస్య కవి గా చెప్పుకుంటారేగాని అంతి రసవంతమైన హాస్యం ఆయన కృతులలో కన్పడదు. అమవసనికి అన్నమాట అలసని పెదనా' ఇత్యాది బాటుపద్యాలు ఎవడో కల్పించినవి గాని చరిత్రాధారాన్ని బలపరచేవి కావు. “కాదుపోదంటే పాండురంగ మాహాత ములో నిగమ శ రోశ్రీ ఖ్యా పౌరస్య సము లో బోఢ లో కొంత ఆక్షేపగర్భమైన హాస్యం స దేమో; శీలం పిల్లిశీలమనీ, చదువులు చిలకల చదువులనీ అన్నది అక్క నిగమశర్మని... అంతే.. దానికి తార్కాణగా వాడు ఆరాత్రి అందరూ నిద్రిస్తూఉంటే చేసిన అక్క


ముక్కుపుడకతో సహా నగలన్నీ ఒలిచి పట్టుకుపోయాడు. నాని ప్రవృత్తి మాత్రం హాస్యాన్ని సూచిస్తుంది. తుంటరితనానికే అది జయపతాక,


ఈ నిగమశర్మోపాఖ్యానాన్ని దృష్టిలో పెట్టుకొని కందుకూరి రుద్రయ్య నిరంకుశో పాఖ్యానం అనే నాలు గాళ్వాసాల కావ్యం వ్రాసి అక్కడక్కడ చక్కని హాస్యం సూచించాడు. నిగమశర్మ ప్రవృత్తికీ నిరం కుశుని ప్రవృత్తికీ సాజాత్యం సరిపోవడమే కాక కొన్ని గుణాలలో నిరంకుశుడు నిగమ శర్మకి ఒక మెట్టు పైన కూర్చున్నట లేడు.


వేశ్యనూత పెట్టిన చకొరగుళ్లు తృప్తిగా నిక్కి నిరంకుశుడు పోయాడు. అక్కడ ఒక లింగము కనబడ్డాది. నిరంకుశుడు ఆ లింగాన్ని చూచి నాతోడుతన్


సౌగటాలా డెదవే న వేందుకు సుమ


స్తోతవ్య జూటాంతి కా!”


అని


ధించి జూదరులలో తాను అగ్రణినని బిరుదు మాటలాడుతాడు. కొంగున మూటగట జొన్న సొగటాలు తీసి గెల్పినవాడికి ఓడిన వాడు లంజను తెచ్చి యివ్వాలని పందెం పెటి లింగం పంతుకూడా తెనే సొగటా లాడి దైవగతివల్ల తానే గెలిచాడు. గెలిచి నందుకు దేవ వేశ్య అయిన రంభను తెచ్చి యిమ్మన్నాడు. ఎంతకీ లింగం జవాబివ్పదు. దానిమీద నిరంకుశుడికి కోపంవచ్చి, తగునె పన్నిదమిక యీగతిఁ


దప్పు మౌనముఁ జాల్పఁగా దగు న నీకు ను నాకుఁ బెద్దల దండఁ బెటెదఁ జండి పై గగన కేశ! యటంచుఁ జందురు కాని పేలు


పొగడ దండయిన ర్చైనా విట


భూసురాగ్రణి దిట్టయె తన గుడ్డతీని ఈశ్వరలింగానికి చుట్టి పెద్దలదగ్గర తగపు పెడతాను రమ్మని లాగు తాడు. చక్కని తగవు. విటుని గుర్మా వాన్ని వెల్లడించే హాస్యగర్భితి మైన ఆక్షేపణ ఇది.


పొరంగు తమ్మయ్య వైజయంతీ విలాస దేవ జీవి విప్రనారాయణుని వేశ పరచుకొన్న సందర్భంలో అతి సుకుమార మైన హాస్యం సవరించాడు. దేవదేవి నిట్టూ రులలో, హొలుచూపులలో, లలో, పైట ఊపులలో తిమ్మయ్య శృంగా రానికి చేయూత గా ఇచ్చిన హాస్యం సువర్ణ లేపనంగే భానిస్తూంది.


దేవ దేవీ మధురవాణులు విప్రనారాయ


ణుని దర్శించి సమస్కరించగా, 'చందురుఁ గను నరవిందము


చందంబున మోమువంచి సంయమికులపతి డా డారామగ్రుమ


బృందము పుచక్కిని కిమ్మనకుండా పోయారు. ఆదశీ చూసి ఇతడు చాలా గొప్పవాడే అన్నాది మధుర వాణి. దేవదవి అందుకు ఒప్పుకోక “ఇటువంటయ్యలు కొరా చిటుకుమనక యుండ సందెచీకటి వేళ్ళ శా


ఘట చేటీవిటు లై క్కటకంబున తిరుగువారు కంజదళాక్షీ ! 'కడసిచూడ ఘోటక బ్రహ్మచర్యంబు పింగళోజపంబు పిల్లి శీల


మజగరోపవాస మల ఒక ధ్యానంబు


నక్క వినయ మిట్టి నయములెల్ల


అని హేళన చేసింది


- సస మాటే


అయింది. వేశ్యా స హ వాసాలు శ్రీ వైష్ణవులకు తగునా! కొమ్మా! ఆవల మమ్ములోకు లేమంటారో అని జీవదేవీ సేవకు అనుమా నించిన మహానీయుడు కాలుజార్చాడు.


“శిరసుపై పేసు పొడగన్న చేరబోయి హింస సీయకుమని చేతికిచ్చే పరిస్థితిలోకి డేకింది వజ్రపంజరనిభ మైన వాని సర్భావం లోహ మై గ్రాప మై, దృఢదారువై, తరుణవృతమై, యమై పూవై దానిలో మకరందమై పోనుపోను నీళ కంటెనూ పల్చనై కరగిపోయింది.ఒక్కడికే కాలుచాచి పరుండడానికి చాలని కుటీరం వర్షంపడిన నాటి రాత్రి దేవదేవికీ విప్ర నారాయణునికీ కూడా శరణ్యమైంది. అవు తుంది మరి


అయ్యెడ మిక్కిలి శైత్యం బియ్యడ తెమ్ము నీవు నింతీ! అని ప్రియురాలిని నోరారా, మనసారా పిల్చి దాపునకు చేర్చుకొన్నా బోడి దాసరయ్య-రంగరంగా అని రంగనాథ స్మరణమే జీవిత పరమార్థంగా ఇనపకచ్చడం కట్టుకొన్న వే వాడు నో చ్ఛిష్ట యేస విటజనో. కుటిల వేశ్యను అంటుకొని బ్రాహ్మణ్య మంటు చేశాడంటాడు తిమ్మయ్య


రానురాను హాస్యాన్ని తీవ్రంగానూ, మృదువు గానూ చెప్పకుండా రచనలో నీరుపోసి పెంచినవాడు వేమన్న - కులను తౌచాశాలను విమర్శిస్తూ దంభ వేషాలను ఆ క్షేపిస్తూ తిట్టులో నవ్వు పుట్టించినదిట వేసునయోగి


పుణ్య క్షేత్రాలకు గిం చుకున్న వారికి మంత్రిజలసుకున్న మంగలి జల మెచ్చు' - అని బోధ చేసున్నాడు..


పోయి


ణుని దర్శించి సమస్కరించగా, చందురుఁ గను నరవిందము


చందంబున మోమువంచి సంయమికులసం


క్రందనుఁ డారామగ్రుమ బృందము పడుచక్కిని కిమ్మనకుండా పోయారు. ఆదశీ చూసి


ఇతడు చాలా గొప్పవాడే అన్నాది మధుర వాణి. దేవదవి అందుకు ఒప్పుకోక ఇటువంటయ్యలు కొరా చిటుకుమక యుండ సందెచీకటి వేళ్ళ


ఘట చేటీవిటు లై క్కటకంబున తిరుగువారు కంజదళాక్షీ ! 'కడసిచూడ ఘోటక బ్రహ్మచర్యంబు పింగళోజపంబు పిల్లి శీల


మజగరోపవాస మల ఒక ధ్యానంభ నక్క వినయ మిట్టి నయము లెల్ల. అని హేళన చేసింది 'సస


అయింది. వేశ్యా సహవా సాలు శ్రీ వైష్ణవులకు తగునా! కొన్మూ! ఆప ల మమ్ములోకు లేమంటారో అని దేవదేవీ సేవకు అనుమా నించిన మహానీయుడు కాలుజార్చాడు.


శిరసుపై పేసు పొడగన్న చేరబోయి హింస సేయకుమని చేతికిచ్చే పరిస్థితిలోకి డేకింది వజ్రపంజరనీభి మైన వాని సర్భావం లోహ మై గ్రాప మై, దృఢదారువై, తరుణవృక్ష మై, ఫలప్రాయమై, పూవై దానిలో మకరందమై పోనుపోను నీళ కంటెనూ పల్చనై కరగిపోయింది.ఒక్కడికే కాలుచాచి పరుండడానికి చాలని కుటీరం వర్షంపడిన నాటిరాత్రి దేవదేవికీ విప్ర నారాయణునికీ కూడా శరణ్యమైంది. అవు తుంది మరి


అయ్యెడ మిక్కిలి శైత్యం బియ్యడ తెమ్ము నీవు నింతీ! అని ప్రియురాలిని నోరారా, మనసారా పిల్చి దాపునకు చేర్చుకొన్నాడా దాసరయ్య-రంగరంగా అని రంగనాథ స్మరణమే జీవిత పరమార్థంగా ఇనపకచ్చడం కట్టుకొన్న వె వాడు విటజనో చ్ఛిష్టమైన ఆ కుటిల వేశ్యను అంటుకొని బ్రాహ్మణ్య మంటు చేశాడంటాడు తిమ్మయ్య


రానురాను హా ప్యాన్ని తీవ్రంగానూ, మృదువు గానూ చెప్పి చెప్పకుండా రచనలో నీరుపోసి పెంచినవాడు వేమున్న కులమతౌచాశాలను విమర్శిస్తూ దంభ వేషాలను ఆ క్షేపి సూతిటులో నవ్వు


పుట్టించినదిట వేమనయోగి ----


పుణ్య క్షేత్రాలకు గించుకున్న వారికి మంత్రిజలసుకున్న మంగలి జల మెచ్చు' - అని బోధ చేసున్నాడు...


పోయి


గొడుటావు బిసుక కుండ గొంపోయిన


పాల నీదు పండ్లు రాలదన్ను' అని చివరి


చరణంలో ‘లోఖవాని నడుగ లాభంబు లేదయా?


అంటాడు......


మోక్షానికిపోతే మొస లెత్తుక పోయిం


ఉంటారు. గుహలలోకి పోయి జపం చేయ


బోతే పులి ప్రత్యక్షమై మోష్ o


యాసంగా ఇస్తుందన్నాడు వేమన్న -


'మోక్ష మేకదా కౌవలసింది జీవికి తఱచి చదవవలసే రచన వేమన శతకం.. హాస్యంకోసం ప్రాచీన కవుల గ్రంథాలు సాలీపులాక న్యాయంగా ఇంతవరకూ


స్పృశించాము.


ఇటీవలి వారిలో వారి జీవితాలకు సంబం ధించే ముచ్చటలు కొంచెం అనుకొందాము. వీరేశలింగం గారి ప్రహసనాలూ, పాను గంటివారి సాక్షి కొంచెం కరకుగానూ, అక్కడక్కడ చాదస్తంగానూ ఉన్నా హాస్యప్రధానములైన రచనలుగా దానికి ఎన్నుకోవచ్చు:


గ్రంథాలు వ్రాయకపోయినా నడిమింటి సర్వమంగ ళేశ్వర శాస్త్రులు గారు సరసంగా మాట్లా డే కవి అని ప్రసిద్ధి. చెల్లెలూ, తానూ భోగీపండుగకు ఆత వారింటికి వెళ్లారట. తెల్లవారిన తరువాత చెల్లెలు వరహాకుంచెతో నగలు తోముకుం టూంది. శాస్త్రి గారి వదిన గారు ఆ మెను చూచి 'వ ది నే! పందివా? ఏదుపందివాళి అడివిపందివా' అని అడిగిందట. శాస్త్రిగా గారి చెల్లెలు కొంచెం బొద్దుగా ఉంటుంది. అందుకు ఆవిడ హాస్యమాడింది. అక్కడికి కులందోము పుడక కోసం వచ్చిన శాస్త్రులు ఏదుపందివో అడివిపందివో తెలియదుగాని మొత్తంమీద పందివే అన్నా రట. చటుక్కున వదినె గారు లోపలికి పోయారట. వరహాకుంటే ఏపందిరోమంతో కట్టారనే ప్రశ్న చమత్కరించబోయి నది చె గారు పొందిన జవాబిది.


శాస్త్రులుగారు వామనావతారం. వడ్డన బంతి జరిగింది. ఆకుకొసను కందకూర వడిం చారు--వదిన గారు - తె లి సీ. కందకూరంటే శాస్త్రులుగారికి మహాప్రీతి. చూస్తూ కూర్చు న్నారు. అప్పుడు వదిన గారు 'ఏమిటి మరిది గారు అలా కూర్చున్నారు? ఆ కందకా అని అడిగారట. 'ఔను వదినే! ఆ కందకే” అన్నారట. సరేలెండని మళ్ళీ ఇంత కూర తెచ్చి అందేట్టు చేశారట ఆమె. శాస్త్రులుగారు జగన్నాధస్వామి దర్శనానికి పూరీ క్షేత్రానికి వెళ్ళారు. స్వయంపాకం చేసుకొని మత్తాకుల వి సరిలో భోజనం చేస్తు రు. ఆ సమయంలో పెద్దపండా వచ్చి


'ఏమిటి శాస్త్రులుగారూ! అన్నీ తెలిసిన పెద్దలు తమరు. ఏంత అఘాయిత్యప్పని చేస్తున్నారు? మా అవతారం పండుకొనే మఱ్ఱాకును ఉచ్ఛిష్టం చేశేసేరా?' అని ఆక్షే పించాడు. చటుక్కున శాస్త్రులుగారు 'భయపడకండి. మీకంటే నేనుచేసే దానిలో విచారించవలసేది లేదు. నేను మీ అవతారం పాన్పును ఉచ్ఛిష్టంచేశానేకాని మీరు అవ తారాలకు అవతారాలనేమింగేసు రుగా' అన్నారు నదురు బెదురూ లేకుండా. ఆ దెబ్బతో పెద్దపండా తలదిమ్మంది. మరి కంటిచూపులేదు. ఏవ్యం అయిపోయాడు.


ఈ శాస్త్రులుగారు వ్రాసిన జే సమాస కుసుమావళి. సంస స్కృ ఏమాత్రం చదివిస తెలుగు వారికీ అది పరిచి దానిలో విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ శాస్త్రులుగారు సహజహాస్యప్రియత్వమును


చమత్కారంగా వెలిబుచ్చారు. ‘భూనాయకం నా ధవనాయకం బా


భజ భువం వా ధనమేతి లోళ తద్విఘ్న నాథం న భజామి కింతు సహస్రశస్తం ప్రణమామి నిత్యమ్' లోకంలో భూనాయకుణ్ణిగాని, ధన నాయకుణ్ణిగాని భజిస్తే భూమిని గాని, ధన ముసుగాని పొందుతాడు. అందువల్ల విఘ్న నాధుణ్ణి "నేను భజించను. వేయి విధాలా వానికి మొక్కులు మాత్రం చెల్లించు కొంటాను అంటారు శాస్త్రులుగారు. విఘ్ను నాయకుణ్ణి సేవిస్తే విఘ్నాలు వస్తాయని చమత్కృతి.


అడిదం సూరకవికూడా ఈ ధోరణి కణ వాడే అని అంటారు.


ఒకనాడు నూరకవి గారి భార్య భర్తన చూసి 'ఏమండీ! అవునండీ మన అబ్బాయి


మీద ఓపద్యం చెప్పరండీ అని అడిగింది. వెంటనే చెప్పాడు సూరకవి.


‘బాబా బూచులలో పల


బాచన్నే పెద్దబూచి భావింపంగన్ బూచం బూచంటే రా| రా వెఱతురు


బాచన్నను చూచి పట్టపగలే నెఱతుర్ అని చదివాడు.


(బాచన్న ఆ నేది ముద్దు పేరు. ఈ బాచ స్నే శుద్ధాంధ్ర రామాయ ణ • వ్రాసిన బాల భాస్కరుడు.)


కొడుకు అంత చక్క من నీవాడట. రఘువంశాది కావ్యాలకు వ్యాఖ్యా సంవ్రాసి ఆసేతుశీతాచలం పేరు పొందిన ప్రతిభాశాలిమల్లి నాథసూరిని ఒక నాడు భార్య


రచయితలు: *


'అవునండీ! నామీద ఒక శ్లోకం చెప్పరూ.' అని అడగగా వెంట నే 'ఇదుగో చెబు తున్నాను విను.” అని


'తింత్రిణీదళ విశాలలోచనా నింబపల్లవ సమానకుంతలా మేరుమందర సమానమధ్య రూ మల్లి వాథగృహిణీ విరాజతే '


అని చదివాడట.


చింతాకులవలె వెడల్పయిన కళ్ళు వేప చిగుళ్లకు పొటి వచ్చేకుదులు, మేరు ముందర పర్వతాలను పోలిన నడుము కలదై మల్లి నాధుని యిల్లాలు విరాజిల్లుతూంది. యిల్లాలు ఇది విని ఎల్లా సహించిందో గాని యీరోజులో 'జుల్లో అయితే ?. (1)


ప్రస్తావికంగా చెప్పినదే అయినా తిరుపతి వెంకటక వులలో ఒక రైన తిరుపతిశాస్త్రి గారు చెప్పిన యీ పద్యం ఎంతో గంభీరమైప


అర్థాన్ని చెబుతూ పక్కున నవ్విస్తుంది.


"మును సౌగంధిక పుష్పమున్ గొనగ భీముండే డైరం బోపు త్రో పను సాక్షాత్కృతిచేసి ఖడ్గమృగమున్ వారింపగా సంజనా


తనయుం డెక్టుడు పేర్మి నిచ్చిన పదార్థంచే న యీపయీస్


జసువా డార్జనసేయు వెంకటకవి ! సారస్య మట్లుండుటన్


ఈ పయిని లోకంలో సారస్యమునుబట్టి ఆర్జనకుపోతే వచ్చేది వెండ్రుకలే అనే భావాన్ని శాస్త్రులుగారు ఇంత గంభీర ధ్వనితో చెప్పారు.


చాలా శ్రమపడి హాస్యరసం పోషించి వ్రాయాలనే సదుద్దేశం గల ప్రతిభావంతు ఆలాటి గ్రంథాలు చాలా యేమిటి వేళ్ళమీద చెప్పాలన్నా అటే లేవు.


కూచిమంచి జగ్గకవి చంద్రరేఖావిలాపం తిట్టుక విత్వం గా ఉంది. పొందిన అందులో పేరు బాగా నే హాస్యం లేకపోలేదు. కాని దానిని ప్రమాణగ్రంథం గా పండితులు అంగీకరించినట్టు కప్పట్టగు ఏమైనా హాస్యం ప్రధాన రసంగా ఉద్భవిల్లవలసే కథావస్తు వును తీసుకొని కావ్యాలు ప్రత్యేకం అది మాటలతో కాదు.


వ్రాయవలసే అవసరం ఎంతైనా ఉంది. అయేపనిమాత్రం కాదు. 

--- 


Saturday, December 25, 2021

వ్యాసం: కాళిదాసు కాలంలో విద్యలు - పి. వి. భట్టశర్మ ( ఆంధ్రపత్రిక - వా - 24 -05 - 1950 సంచిక నుంచి ) సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 25-12-2021 ; బోధెల్ ; యూఎస్ ఎ

వ్యాసం

కాళిదాసు కాలంలో విద్యలు

పివిభట్టశర్మ

 

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు

25-12-2021 ; బోధెల్ ; యూఎస్ వ్యాసం: 

కాళిదాసు కాలంలో విద్యలు 

- పి. వి. భట్టశర్మ

( ఆంధ్రపత్రిక - వా - 24 -05 - 1950 సంచిక నుంచి ) 

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

25-12-2021 ; బోధెల్ ; యూఎస్ ఎ



మనదేశంలో వేద కాలమునుండిన్నీ ఉప

నయన సంస్కారంతో విద్యారంభం జరుగు తూండేది. ఈ సంస్కారం ఆయావర్ణముల వారికి పలు విధాలు గా ఉంటూ వచ్చేది. వారిలో క్షత్రియుని విద్య వీటినుండి ప్రారంభ మయ్యేది. విక్ర మోర్వశీయత్రోటకం లో ఆయువు (పురూరవునిపుత్రుడు ఆశ్రమ విద్యతోనే సమర్వేద్యనుకూడా అభ్యసించినట్లు మహాకవి ప్రయోగంవలన తెలుస్తున్నది. ) 


ఆశ్రమాల్లో విద్య నేర్చుకొనే శిష్యు రాండ్రు రెండు కాలుగా ఉండేవారని ధర్మసూత్రాలలో ఉన్నది. మొదటి తరగతి వారిని సద్యో వధువు లనేవారు. వీరు విద్యాభ్యాస మయినతరువాత గార్హస్థ్యం స్వీకరిం చేవారు. 


ఇక రెండవరకమువారు బ్రహ్మవాదినులు. వీరు జీవితాంతము బ్రహ్మచర్య మాచరించేవారట. ఇందుచేతనే “మీ చెలి వివా హమువఱకే నైఖాన సవ్రత మవలంబిస్తుందా, లేక జీవితాంతమూ వ్రతంలోనే మగ్నమవు తుందా” అని దుష్యంతుడు శకుంతల చెలులను ప్రశ్నిస్తాడు. 


మహాకవి కాలంలో సహవిద్య (Co-education) నిషిద్దం కాదు . ప్రియంవద,అనసూయ, శకుంతలలు ఆశ్రమంలోని బ్రహ్మ చారులతో కలిసే విద్య నేర్చారు.


ఆనాటి విద్యకు జ్ఞానము, వినయ చరమలక్ష్యాలు. కేవలం జ్ఞానోసార్ధనవలననే వికాసం కలగదు; జ్ఞానంతోపాటు వినయం కూడా ఆవశ్యకమని ఆనాటివారి తలపు. ఈ జ్ఞానవినయాలు గురువుల సహవాసంవలన లభ్య మవుతూండేవి. ఊరకే పుస్తకాలు వర్ణించిన మాత్రాన ఆ రోజుల్లో విద్వాంసు అనిపించుకోడం కష్టంగా ఉండేది. 


చదువుకు, సాయంగా రాగద్వేషాలు అణగేటట్లు తమ నడవడిని దిద్దుకొనేవారు. ఈ భావాన్నే మహాకవి "సమ్యగా గామితా విద్యాప్రబోధవినయావివ” - బాగుగా వచ్చిన చదువు ప్రబోధవినయాల నిచ్చినట్లు అనే ఉపమలో  నిబంధించారు. ‘విద్యా దదాతి వినయమ్' అనే సూక్తిని  కాళిదాసు తమ గ్రంథాల భూమికల్లోనే చరితార్ధం చేశారు. 


ఈ కాలానికి హద్దు లేదు, భూమి విశాల మయినది. ' నాతో సమాన మైన భావాలుండేవాడు తప్పకుండా ఉంటాడు' అనే భవభూతి మాదిరి దర్పంతో ఎప్పుడూ ఈ కవికులతిలకులు మొదలు పెట్టరు. "కీర్తి గడించిన భాససౌమిల్లకకవిపుత్రుల ప్రబంధాలకంటే  కాళిదాసుకబ్బంలో ఈ నాటకీయ గౌరవం ఎందుకు ? పండితులను సంతోష పెట్టేవఱకూ బాగా ఉన్న దనుకోచ్చు "మున్నగు వినమ్రమైన వాక్యాలతో వీరు ప్రారం భిస్తారు. పురూరవుని దర్బారు. చిత్రరథుడనే  గంధర్వరాజు ఇంద్రుని సందేశం పట్టుకొని మహారాజు చిత్రరధునకు స్వాగత మిస్తాడు. ఆ గంధర్వుడు రాజును శ్లాఘిస్తాడు. ఇంద్రుని పక్షంలో వారు  చూస్తున్నారంటే అదంతా ఇంద్రుని పరాక్రమ విశేషమేనని తన కృతజ్ఞతను పురూరవుడు ప్రకటిస్తాడు. 'వినయమే  పరాక్రమానికి అలంకార' మని ఈ సందర్భంలోని చిత్రరధుని వాక్యంలో కవి తన అభిప్రాయం

తెలియచేసినట్లు అనిపిస్తుంది. 



రఘువంశమే కాళిదాసుఅంతిమ కావ్యం అంటారు. ఈ కావ్యం ప్రారంభంలో మహా కవి వినయమ నే కొండుకొన పై నుండి ఉపదేసిస్తున్నట్లుగ ఉంటుంది. చూడండి — “సూర్యవంశ మెక్కడ? ఈ అల్బబుద్ధి ఎక్కడ? దుస్తర మైన సముద్రాన్ని లోతు తెలిసికోకుండానే తెప్పతో దాటుదామని యత్నిస్తున్నా. కవి యశఃప్రార్థినై మందుడనైన నేను హాస యోగ్యుడనే ప్రాంపును పొందదగ్గ పండ్లను పొట్టివాడు చేతులెత్తిన వెంటనే  పొందలేడు గదా" అని అంటూ తర్వాత కూడా "ప్రాచీన కవులు మాటలతలుపులు తెరిచిన ఈ సూర్య వంశంలో--వజ్రసముత్కీర్ణమై మణిలో దారమునకువలె —— నాకున్నూ గమనం లభ్య మవుతుంది" అంటారు.


త్రివర్గములకు మూలమైన మూడు విద్యలను పూర్వజన్మలోనే అంతుచూచినవి జ్ఞాపకముండునట్లు ఆ రాజు ఈ గురువులకు కష్ట మివ్వ నేర్పాడు అనడంలో ( రఘువంశం  18.50 ) కవి మూడు విద్యలను ఉల్లేఖించి కవి తమ కాలపు విద్యావిధానం సూచించారు . వేదత్రయం నుండి ధర్మాధర్మాలు, దండనీతి నుండి న్యాయాన్యాయాలు , వార్త నుండి అర్థ అనర్థాలు  - అని మల్లి నాథులు వ్యాఖ్యానించారు. 


దీనితోపాటు మహాకవి అక్కడక్కడ చతుర్దశి విద్యలనూ పేర్కొన్నారు . (5-21) మీమాంస మాట నామగ్రాహం గ్రహింపక పోయినా, రఘువంశప్రారంభశ్లోకంలోనే మీమాంసలో కవి నేర్పు స్పష్టమవుతున్నది.


శివతపోవర్ణనఘట్టంలో, 'విరాసనం వేసి, దృష్టి తిన్నగా, నిశ్చలంగా ఉండేట్లు చేసి బాహువులు వంచి, అంకంపై చేర్చి రెండు చేతులూ కమలాకారంలో నిలిపి, ఈశ్వరుడు ధ్యానం చేశారట. పాతంజలంలో సరిగా ఇదే పద్దతి నిర్దిష్టమైయున్నది. కుమారసంభవంలోగుణత్రయ విభాగాయ - త్యా మానయంతి ప్రకృతిం' అనేవి, రఘువంశంలో “లోష్ట కాంచనముల్లో సమబుద్ధి గల రఘువు ప్రాకృ తికమైన గుణత్రయాన్ని జయించెను' అనే వర్ణనకూడా ఆనాటి సాంఖ్యసిద్ధాంత ప్రాబ ల్యాన్ని, కవికి సాంఖ్యంలో గల పరిచ యాన్ని వ్యక్త పరుస్తున్నాయి.


ప్రపంచానికి కారణమై, కారణము లేనివాడవు, ప్రపంచమున కంతకుడనై అంతము లేనివాడివు" అని బ్రహ్మ చేసిన శివస్తోత్రము,

విక్రమోర్వశీయ నాందిలో "వేదాంతేషు యమాహు పురుష " మున్నగునవి కవికి గల వేదాంతపరిచయానికి  నిదర్శనలు. పై

భావాలు 'యతో వాఇమాని భూతానిజాయంతే ' అనే 

ఉపనిషద్భావాలకు వ్యాఖ్యానమే. ఉపనిషత్  అర్థం తెలియకుండా వేదాన్ని అప్ప చెప్పే' ఛాందసులు ఆనాడూ ఉన్నట్లుగా ‘వేదాభ్యాసజడు,లనడింవలన ఊహించవచ్చు నేమో. 'సాంగం చ వేద మధ్యాప్య'  అని వేదాంగాలు నిర్దేశింపబడ్డాయి. ప్రాతఃకాలమే నందినిని సేవిస్తూంటాడు. ముందు నందీని , నెనుక దిలీపుడు! నందిని డెక్కలనుండి వచ్చే ధూళి మార్గాన్ని పవిత్రం చేస్తున్నది. అదే మార్గంలో వస్తున్న సుదక్షిణ శ్రుతిని అనుసరించే స్మృతివలె వస్తున్నదిట .


యుద్ధభూమిలో శత్రువ్యూహములను భేదించే వ్యూహాల అంతు, శాస్త్రములు అంతున్న ఈ బాలుడు చూడగలడని ముందుగా  ఆలో చించే - రఘువు అని పేరు పెట్టారట. (రఘి ధాతువు గమనార్థకము) ఈ విధంగా నే మహా కవి తమ వ్యాకరణపరిజ్ఞానాన్ని అక్క డక్కడ విశదీకరించారు.


శ్రీరామవివాహసందర్భం. నలుగురు  రాజ కుమారులను పరిణయమైన ఆ రాజకన్యలు.. ఆ కన్యలను పొందగల్గిన రాజకుమారులున్నూ నిస్తులు లయ్యారట. ఆ వధూవరుల మేళనము ప్రాత: పదికలతో ప్రత్యయములు కలిసినట్లున్న దట. వధూవరులు అనే రెండు ఉపమేయములకు ప్రత్యయప్రకృతులకు ఉపమించారు. వరశబ్దం పుంలింగ ఏకవచనం. ఆటాంటి ప్రత్యయశబ్దాన్నే ఉపమానంగా వాడారు. ఈ విధంగానే స్త్రీలింగమైన వధూశబ్దానికి సరిగా స్త్రీలింగమైన ప్రకృతిశబ్దంతోనే సాదృశ్యం నిబంధించారు. ప్రకృతి ప్రత్యయములవలన ఫలితం పదనిష్పత్తి. అదే విధంగా వధూ వరుల యోగంతో గృహస్థాశ్రమం సిద్ధమవుతుంది. ఈ రెండు ఉపమేయ ఉపమానాలకు యోగం సాధారణ ధర్మము; సన్నిధమనేది ఉపమావాచకము. వ్యాకరణం వంటి నిష్క  శాస్త్రాన్ని కూడా తమ చమత్కారపూర్ణ ఉపమలతో  సరస మయ్యేటట్లు మహాకవి నిరూపించారు. ఈ అలంకారాన్ని 'పూర్ణోపము ' అని సాహితీశాస్త్రజ్ఞులు. ఇదేకాక 'ధాతో:  స్థాన ఇవాదేశాత్' మున్నగునవి కవికి  వ్యాకరణమంటే గల ఆదరణ తెలియచేస్తున్నది. మహాకవిసమయంలో మనవిద్యల ఉన్నతస్థాయిని ఊహించుకోగలవారికి, పతనమైనమన నేటివిద్యావిధానం దృగ్గోచరమై హృదయా వేదన ఎక్కువ కాకతప్పదు. 

--- 

 - పి. వి. భట్టశర్మ

( ఆంధ్రపత్రిక - వా - 24 -05 - 1950 సంచిక నుంచి ) 

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

25-12-2021 ; బోధెల్ ; యూఎస్ ఎ

Friday, December 24, 2021

పంచతంత్రము; దాని పుట్టుక శ్రీ శ్రీనివాసపురం నరసింహాచార్యులు ( ఆంధ్రసాహిత్య పరిషత్పత్తిక' 1957 - ఇస్యూ 6 )









 



పంచతంత్రము; దాని పుట్టుక

శ్రీ శ్రీనివాసపురం నరసింహాచార్యులు 


( ఆంధ్రసాహిత్య పరిషత్పత్తిక' 1957 - ఇస్యూ 6 ) 


శ్రీనివాసపురం నరసింహాచార్యులు, రమారమి ఏడెనిమి దేండ్లనాడు ఆంధ్రపత్రిక సచిత్ర వారపత్రి కలో శ్రీవిశ్వాత్ముల నరసింహమూర్తి గారి బొమ్మల పంచతంత్రము ప్రశటింపబడుచుండెను. కాని, అది పూర్తి కాశమునుపే మరదురదృష్ట వశమున నాక ధా చిత్రకారుడు కీర్తి శేషు డగుటచే పత్రికలో పడినంత వరకు పుస్తకరూపముగా వేసిన ఆంధ్రపత్రిక గ్రంథమాలా ప్రకాశ కులు తమమాటగా 'ఈపంచతంత్య్ర గ్రంథము పుట్టుక యెక్కడనో యెరుగ రా' దని వాసిరి. అది చదివినప్పుడు జగము మెచ్చిన శాస్త్ర మును జంతు సంతానముల ద్వారా జనులకు తెలియజేసెడి కృతిని జేసి సుశృతి యైన యీమహాకవి జీవితవి శేషములను ఏతద్గ్రంధము యొక్క జన్మస్థానమును; ఉత్పత్తి కారణములను వీనిని గురించిన విషయ ములు విద్వత్పరిశోధకు లెవ్వరేని తెలిసికొని ప్రకటము గావించుట కింతవరకు ప్రయత్నింపరైరిగదా ! యని విచారించి, యది మొద లావిషయమును తెలిసుకొనుటకై యన్వేషింపసాగగా నిన్నాళ్ళ కిప్పుడు ఆపంచతంత్ర గ్రంధి మెప్పుడు. ఎక్కడ, ఎందుకు ఎట్లు పుట్టినదో నాకు తెలియవచ్చినట్టి విశేషములను సారస్వతాభిమానుల సమక్ష మున నుంచుచుంటిని,


భారత దేశమునందలి సంస్కృతగ్రంధము లెన్నో అన్యభాష లలోని కనూడితము గావింపబడినవి. కాని, ఏదియు నీ పంచతంత్ర కావ్య మువలె పలు భాషలలోనికి పరివర్తనమై ప్రపంచవ్యాప్తి నంది నకల దేశములలోని సంస్కృతవిద్యార్థి విద్యాధికులకు గూడ పఠనీయమై యలరారుచున్న కృతి వెదకినను మరియొకటి కానరాదనుట జ్ఞా లంగీకరించిన నగ్న సత్యము,


ఈగ్రంధమున మిత్రభేదము, సుహృల్లాభము, సంథివిగ్రహము లబ్ధనాశము, అవిమృశ్యకారిత్వము అను ఐదుభాగము లున్నవి. క్రీ.శ. 581_579 సం॥ ప్ర్రాంతమున పర్షియా దేశము నేలు చుండిన ఔషరు


వాన్ అనబడెడి పారసీక రాజు కాలమున సీగ్రంధము వహ్లతీభాషలో వీ నికిని. క్రీ. 18వ శతాబ్దని అరబ్బీ భాషలోనికిని, సైమియాన్ సేథ్ (Symeon 'Seth) అను నాతనిచే స్త్రీ. 1015 ప్రాంతమున గ్రీకు భాష శ లోనికిని, పొస్సిసస్ (Possinus) అన్న యతనిచే ల్యాటిన్ భాషలో నికిని రబ్బీజోయెల్ (Rabbi Joel) అను పండితునిచే క్రీ. 1250 ప్ర్రాంతమున హెబ్రూ భాషలోనికిని ఆతర్వాత నొకటి రెండు సంవత్స రములలో స్పానిష్ భాషలోనికిని పిమ్మట కీ. 15వ శతాబ్దని జర్మను భాషలోనికిని, ఆపై యూరపియను భాషలన్నింటిలోనికి పిల్పే లేక విద్వాయ్ ఫేబుల్స్!(Fables of Pilpay or Vid pai i.e. Vidya pati) అను పేరను ఇట్లు రమారమి రెండువందలమంది విద్యావేత్తలచే అన్ని దేశములలోను మొత్తముమీద సుమారేబది భాషలలోని కీయు ద్గ్రంథ మనువాదము చేయబడియున్న దని హెర్టల్ అను పాశ్చాత్య పరిశోధకుడు తనహిందూ దేశ కథాకావ్యచరిత్రములో వ్రాసియున్నా డు, ఈ కావ్యము యొక్క ప్రశస్తి తెలియుట కీవిషయ మొక్కటి


ఇయ్యది మాతృకయై యుండ దీని ననుకరించియు, అనుసరిం చియు మన దేశమున నెన్ని యేని నీతి కావ్యము లుదయించినవి. దీనికి సంగ్రహరూపమున సంస్కృతమున పంచతంత్ర కావ్య - పంచతంత్ర కావ్యదర్పణ - పంచోపాఖ్యానాదులు పెక్కుకృతులు గలవు. అట్లే ఆంధ్ర భాషయందును దూబగుంట నారాయణకవి, బైచరాజు వేంక టనాధకవి ప్రభృతులు పద్య కావ్యములుగను, కందుకూరు వీరేశలింగ కవి. పరవస్తు చిన్నయసూరి మొదలైన పండితులు గద్యరూపము నను, విశ్వాత్ముల నరసింహమూర్తి, శీలా వీర్రాజు మున్నగు చిత్ర కారులు బొమ్మలకధలుగను ఇంతటిప్రశస్తికి పాత్ర మైన యీకృతిని విద్యాపతిబిరుదనాము డైన విష్ణుశర్మ పండితుడు రచియించెను.


కృత్యాదియందు —


“మన వేవాచస్పతయే శుక్రాయ పరాశరాయ సముతాయ చాణక్యాయ చ విదుపే నమో ఒస్తు నయశాస్త్ర కర్తృభ్యః॥ సశలార్ధశాస్త్రసారం జగతి సమాలోక్య విష్ణుశ ర్మేదమ్, తం తైపంచభి రేత చ్చకార సుమనోహరం శాస్త్రమ్ |


అని చెప్పుటనుబట్టి యితఁడు ప్రాచీనము లైనమను అత్రి;విష్ణు హంత్ర; యాజ్ఞవల్క్య; ఉశన; అంగీరన; యమ; ఆపస్తంబ; సంవర్త; కాత్యాయన; బృహస్పతి; పరాశర; వ్యాస; శంఖ; లిఖిత; దక్ష; గౌతమ; శాతాతప; వశిష్టాదివింశతిధర్మశాస్త్రములనేగాక చాణక్య విష్ణుగు ప కౌటిల్యుని అర్థశాస్త్రము మొదలైన రాజనీతిశాస్త్రముల నన్నింటిని సాకల్యముగ ఆపోశనముపట్టి యాకళింపునకు దెచ్చుకొని ఆకాలమున ‘విద్యాపతి 'బిరుదవిఖ్యాతుడై వినుతింపబడియుండె నని చెప్పనగును.


గ్రంధాన తారికలో :—


"దక్షిణ దేశమందలి మహిళారోప్యపురము నేలెడి అమరశక్తి యనురాజు దుర్వినీతు లైనతన కొడుకులకు నీతి నేర్పు మని కోరగా వారికై నే నీ నీతిశాస్త్రమును రచియించితి” ననుమాటలు వా వ్రాసియుం టను బట్టి యీశవి దక్షిణ దేశవాసి మైనయా జేసియాస్థానమున విద్వత్కవిగా నుండెనని భావింపవచ్చునుగాని, ఈవిషయమునే పరి శోధకులును గుర్తించియుండ లేదు. అందుచే నీమాట గ్రంథ ప్రశస్తికై యాతడు కల్పించివ్రాసినదో లేక నిజమో యూహింప నలవి గాకు న్నది." అని బ్రహ్మశ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రిగారు తను వా సంస్కృతకవిజీవితము పుట 180లలో వాసిరి.


క్రీస్తు మొదటశతాబ్దియందు హిందూ దేశమున క్రైస్తవ


మతము వొడసూపి రెండవ శతాబ్దిలో నది దక్షిణ భారతమున నేటి మదరాసుప్ర్రాంతమున సుస్థిరముగ పాదుకొనినట్టు చరిత్ర తెలియ జేయుచున్నది. అప్పుడు అనఁగా క్రీ.2వ శతాబ్ది యారంభ కాలమున బలాఢ్యు డై నఅమరశక్తి యను రాజు మహిళాతోవ్యపుర మనబడెడి ప్రాచీన హైందవనగరమును రాజధానిగా జేసికొని రాజ్యపాలనము చేయుచుండెను. అదేనేడు మైలాపూరు అని వ్యవహరింపబడుచు మద రాసుమహానగరమున సంతర్భాగ మైపోయినది. ఈమహిళారోప్యపుర మునే గ్రీకు దేశస్థు డైన టాలెమీ (Ptolemy 140-150 A. D.) యనుభూగోళశాస్త్రజ్ఞుడు 1. పశ్చిమ భారత దేశము, ఆఫ్ఘనిస్థానము, డు బెలూచిస్థానము (India Intra Gengem) 2. ఆగ్నేయాసియా, చీనా దేశము (India Extra Gengem) అను పేర్లతో వ్రాసిన భారత దేశభూగోళగ్రంథమున రెండవ భాగమందు దక్షిణ దేశభౌగో ళిక స్వరూపనిర్ణయము చేయుసందర్భమున 'మహిళార' (Mahi larpha) యని పేర్కొనియుండినట్లు శ్రీ అక్షయకుమార్ మజుందార్ గారు తమహిందూహిస్టరీ యనుగ్రంథమున 844వుటలో వాయు చున్నారు.


పై నిచెప్పిన అమరశక్తి రాజునకు బాహుశక్తి, ఉగ్రశక్తి, అనంతశక్తి యనెడినిరక్షరకుక్షలు మూఢులు నై నముగ్గురు కొడుకు రమూర్ఖన్యు లైనయాకుమారత్రయమునకు విద్యా లుండిరి. మూర బుద్ధులు గరపి గుణవంతులుగ చేయుటకై యారాజు చేసిన ప్రయ త్నము లన్నియు నిష్ప్రయోజనము లయ్యెను. తుట్టతుదకు దైవవశ మున అశీతివర్ష ప్ర్రాయుడును, విద్యావృద్ధుడును ఆకాలమున పేరు మోసినపండితుడును నై నవిష్ణుశర్మను ప్రార్థింపగా రాజుకోరిక సంగీక


రించి యాయువరాజతయము నాశ్మశిష్యులుగా గ్రహించి వారిమన సున కిష్టమైనవిధమున వశుపక్ష్యాదులసంభాషణము చేసినట్లు నీతిధర్మ ములు నిండై యుండ అద్భుతము లైనకథలు చెప్పుచు వారిని వశవర్తు లను గావించుకొని మనసునకు నొప్పి గలుగనీయక నీతినేగాక జీవిత రహస్యములును, రాజ్యతంత్రములును మొదలై నసర్వవిషయము లును బోధించి వారిని గుణకోవిదులను గావించి తండ్రి కప్పగించి యాతనిచే మన్ననలు పొందెను. ఈవిషయములు శ్రీ వి. కె. మజుం దార్ గారు తనుగ్రంథము 716 పుటలో వ్రాసియున్నారు. ఇట్లగుట చేతనే కథలు, కట్టుకథలు వినికూర్పు నేర్పున భారతీయులు సర్వ ప్రపంచమందలిమానవజాతికిని బోధకు లైరని గుణపక్షపాతి యైన ఎలిఫిన్ స్టన్ మహాశయుడు తసహిందూ దేశ చరిత్ర తొమ్మిదవ ముద్రణ 172వపుటలో నుల్లే ఖంచియున్నాడు.


ఈయాధారములతో సంస్కృతశ విజీవిత కారునిసంశయము తీరి మన కొకమార్గము దొరికిన ట్లయినది.


ఇంతకును విద్వన్మణి యైనవిష్ణుశర్మజీవిత చరిత్రము పూర్తిగా లభింపదయ్యెను. ఈతడు తనకథలలో నవకాశముగల్గినప్పు డంతయు బౌద్ధబిక్షువులను, జైనసన్యాసులను, యాయావరీయ బ్రాహ్మణులను తఱచుగా నుపాలంభము చేసియుండెను. ఒకకథలోని సందర్భమును పురస్కరించుకొని యొకానొక నక్కనోట 'అహో! నేడు భట్టారక వారముగదా! మాంససంబంధమైన యీసరమును నాదంతములతో నెట్లు స్పృశింపగలను!' అని పలికించుటను పరిశీలనా దృష్టితో నాలో చింతు మేని ప్ర్రాచీన కాలమున భానువాసరమున మాంసాహారము నిషేధింపబడిన పెచ్చటను కానరాకున్నది. గనుక ఆకాలమున నీ మహిళారోప్యపురము (Mylapore)న నెలకొనియుండిన క్రై స్తవులు ఆదివారమున మాంసాహారము, మద్యసేవనము, దైనందిన చర్యయు


మాని విధిగా సుపవసించి యారాధనా మందిరములలో గుమిగూడి శ్రద్ధాళువులై తమ మతగ్రంథమైన బైబిలును పఠించుచుండెడి వారి -యాచారముల వాలకము నతిచమత్కారముగ నవహాస్యము చేసి సహేతుకమైన వ్యాజ వినయమును ప్రదర్శించి యుండే నని తోపక -మానదు.


మదరాసు ప్ర్రాంతమునందలి మైలాపూరున బుట్టి ప్రాముఖ్యత నంది కాలక్రమమున సకలజగత్సంస్తూయమాన మైన గ్రంధ మని తెలిసియే పరవస్తు చిన్నయసూరి ప్రత్యేకించి దీనియాం ధీకరణమునకు బూనుకొని యుండెనేమో యనిగూడ తలంప వీలు లేకపోలేదు. గ్రంధము సాంతముగ ముగిసియుండినచో దీని చరిత్రను గురించి ఆమహామనీషి గ్రంధప్రస్థావనములో వ్రాసియుండు నేమో శదా?


'విష్ణుశర్మ యొక్క యీకృతి గుణాఢ్యుని బృహత్క ధలోని కొన్ని కధలకు వచనరూపమైన సంక్షేపానువాదము. ఈగ్రంధమున నందందు గానవచ్చెడి శ్లోకములు కొన్ని యీతడు స్వయముగా రచి 3 యించినవే యనవచ్చును గాని, పెక్కు శ్లోకములు మనుస్మృత్యాది పూర్వగ్రంధములనుండి స్వీకరించినవే యనదగును. కాని, క్రీ. శ. 8వ శతాబ్దివాడైన దామోదరగుప్తుని శంభళీమతనామాంతర కుట్టనీ మతమునందలి "పరఙ్కః స్వాస్తరణః పతి రనుకూల” యన్నల్లోక సా చితని పంచతంత్య్ర మిత్రభేద ప్రశరణము నందును. కీ. 9వ శతాబ్ద ఉత్తరార్ధమువాడును ఔత్తరాహుడును నైన రుద్రభట్టుయొక్క శృంగారతిలశములోని “సార్థంమనోరధశతై” అనెడి శ్లోక మాం ఛమున లబ్ధనాశతంత్రము నందును గనిపించుచుండుట వలనను ఇంగ్లం డులోను జర్మనీ దేశమునందును ముద్రితమైన “పం చతంత్రము”నకును భారత దేశమున వ్యాప్తిలోనున్న గ్రంధమునకును కొన్ని చోట్ల భేదము


కానవచ్చుచున్న దాని సర్. సి, పి, బ్రౌను పండితుడు చెప్పుటచేతను, గ్రంధము దేశమున వ్యాపించినకొలది రోజులలోనే క్రమేపి అర్వా చీనులకృతులలోని శ్లోకము లీపంచతంత్రమున ప్రక్షిపము లైనట్లు. విమర్శనా చక్షువులకు విదితముగాక పోదనుట సత్యదూరము కాదు.


ఇంతవరకును గ్రంధప్రశస్తి దానిమార్పు జన్మస్థానము కృతి కర్త వెదుష్యము వీనింగూర్చిన విషయము లుటంకించితిని, ఇంత కాల నిర్ణయమును గూర్చి మల్లాది వారనిస మాటలంజెప్పి మతాంతరములు. జూపించి పర్యవసానముం జెప్పి యీనావ్యాసమును ముగింతును,


క్రీస్తు ఆరవశతాబ్దిని మొట్ట మొట్టమొదట నీపంచతంత్య్ర గ్రంథము. పర్షియను భాషలోని కనువదింపబడినది కనుక అంతకుమున్నె యీ గ్రంధముపుట్టినదని కొందరును, దౌర్మంత్యా న్నృపతిరిత్యాదిభర్తృ హరిసు భాషిత త్రిశతిలోని శ్లోక మిం దుండుటంబట్టి దానిత ర్వాత నిది జనించిన దని మరికొందరును ఏతచ్చోక మిదిపుట్టిన తర్వాత చేరియుండు ననెడి భావమున సుభాషిత త్రిశతిశన్నను వంచతంత్య్రమే ప్రాచీన మని పల్కుచున్నారు గనుక విష్ణుశర్మకాలము సునిశ్ఛితము కాకున్న దని సంస్కృతకవి జీవితము 18 పుటలో వ్రాసిరి.


ఏవిధముగ జూచినను భర్తృహరి క్రీస్తు కుపూర్వు డగునని పలు వురు పండితులభిప్రాయము నొసంగియున్నారు. కావున మన మీ సందే హమును వీడిమతాంతర మైన యభిప్రాయముల నరయుదము,


డాక్టర్ : యం. కృష్ణమాచారియార్ (మదాసు) గారు తమ హిస్టరీ ఆప్ క్లాసికల్ సాట్ లిటరేచర్ అన్న పేరున 1937 సం॥ ప్ర్రకటించిన గ్రంధమున నీవిష్ణుశర్మను క్రీ.పూ. 776 సం॥ నాటిదాడుగా గుణాఢ్యునిశన్నను ముందు కూర్చుండ పెట్టుట యెట్లొ పరిశోధకులు నిర్ణయింతురు గాక !


 

67


పంచతంత్రము; దాని పుట్టుకు


మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు 'మెట్లయిన నితడు శా. శ. 450 కి పూర్వడు గాని పరుడు మాత్రము కా'డని ముగ తముయభిప్రాయమును చెప్పిరి.


విషయ మంతటిని సముస్వయము జేసి చూచినచో విష్ణుశర్మ


తప్పక స్క్రీ. 2వ శతాబ్ది ప్రధమపాదము నాటివాడనియు నేటిమదరాసు మహానగరమున నొక భాగమైన నాటి మహిళారోప్య పురము నేటి మైలాపూరునంది పంచతంత్రము వుటైననియు ప్రపంచమునకు తెలియ వచ్చుట సాహిత్యారాధకులకు సంతోషదాయకము కదా !


ఈవ్యాసమును వ్రాయునెడల నేను పేర్కొన్న గ్రంధకర్తల కును, ప్రకాశకులకును కృతజ్ఞతలు చెప్పుచు విరమింతును.


- శ్రీ శ్రీనివాసపురం నరసింహాచార్యులు 

( మూలం - ఆంధ్రసాహిత్య పరిషత్పత్తిక' 1957 - ఇస్యూ 6 ) 


సేకరణ 

కర్లపాలెం హనుమంతరావు

బోథెల్ ; యూ. ఎస్.ఎ.

24 -12-2021 










మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...