Showing posts with label Education. Show all posts
Showing posts with label Education. Show all posts

Saturday, December 25, 2021

వ్యాసం: కాళిదాసు కాలంలో విద్యలు - పి. వి. భట్టశర్మ ( ఆంధ్రపత్రిక - వా - 24 -05 - 1950 సంచిక నుంచి ) సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 25-12-2021 ; బోధెల్ ; యూఎస్ ఎ

వ్యాసం

కాళిదాసు కాలంలో విద్యలు

పివిభట్టశర్మ

 

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు

25-12-2021 ; బోధెల్ ; యూఎస్ వ్యాసం: 

కాళిదాసు కాలంలో విద్యలు 

- పి. వి. భట్టశర్మ

( ఆంధ్రపత్రిక - వా - 24 -05 - 1950 సంచిక నుంచి ) 

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

25-12-2021 ; బోధెల్ ; యూఎస్ ఎ



మనదేశంలో వేద కాలమునుండిన్నీ ఉప

నయన సంస్కారంతో విద్యారంభం జరుగు తూండేది. ఈ సంస్కారం ఆయావర్ణముల వారికి పలు విధాలు గా ఉంటూ వచ్చేది. వారిలో క్షత్రియుని విద్య వీటినుండి ప్రారంభ మయ్యేది. విక్ర మోర్వశీయత్రోటకం లో ఆయువు (పురూరవునిపుత్రుడు ఆశ్రమ విద్యతోనే సమర్వేద్యనుకూడా అభ్యసించినట్లు మహాకవి ప్రయోగంవలన తెలుస్తున్నది. ) 


ఆశ్రమాల్లో విద్య నేర్చుకొనే శిష్యు రాండ్రు రెండు కాలుగా ఉండేవారని ధర్మసూత్రాలలో ఉన్నది. మొదటి తరగతి వారిని సద్యో వధువు లనేవారు. వీరు విద్యాభ్యాస మయినతరువాత గార్హస్థ్యం స్వీకరిం చేవారు. 


ఇక రెండవరకమువారు బ్రహ్మవాదినులు. వీరు జీవితాంతము బ్రహ్మచర్య మాచరించేవారట. ఇందుచేతనే “మీ చెలి వివా హమువఱకే నైఖాన సవ్రత మవలంబిస్తుందా, లేక జీవితాంతమూ వ్రతంలోనే మగ్నమవు తుందా” అని దుష్యంతుడు శకుంతల చెలులను ప్రశ్నిస్తాడు. 


మహాకవి కాలంలో సహవిద్య (Co-education) నిషిద్దం కాదు . ప్రియంవద,అనసూయ, శకుంతలలు ఆశ్రమంలోని బ్రహ్మ చారులతో కలిసే విద్య నేర్చారు.


ఆనాటి విద్యకు జ్ఞానము, వినయ చరమలక్ష్యాలు. కేవలం జ్ఞానోసార్ధనవలననే వికాసం కలగదు; జ్ఞానంతోపాటు వినయం కూడా ఆవశ్యకమని ఆనాటివారి తలపు. ఈ జ్ఞానవినయాలు గురువుల సహవాసంవలన లభ్య మవుతూండేవి. ఊరకే పుస్తకాలు వర్ణించిన మాత్రాన ఆ రోజుల్లో విద్వాంసు అనిపించుకోడం కష్టంగా ఉండేది. 


చదువుకు, సాయంగా రాగద్వేషాలు అణగేటట్లు తమ నడవడిని దిద్దుకొనేవారు. ఈ భావాన్నే మహాకవి "సమ్యగా గామితా విద్యాప్రబోధవినయావివ” - బాగుగా వచ్చిన చదువు ప్రబోధవినయాల నిచ్చినట్లు అనే ఉపమలో  నిబంధించారు. ‘విద్యా దదాతి వినయమ్' అనే సూక్తిని  కాళిదాసు తమ గ్రంథాల భూమికల్లోనే చరితార్ధం చేశారు. 


ఈ కాలానికి హద్దు లేదు, భూమి విశాల మయినది. ' నాతో సమాన మైన భావాలుండేవాడు తప్పకుండా ఉంటాడు' అనే భవభూతి మాదిరి దర్పంతో ఎప్పుడూ ఈ కవికులతిలకులు మొదలు పెట్టరు. "కీర్తి గడించిన భాససౌమిల్లకకవిపుత్రుల ప్రబంధాలకంటే  కాళిదాసుకబ్బంలో ఈ నాటకీయ గౌరవం ఎందుకు ? పండితులను సంతోష పెట్టేవఱకూ బాగా ఉన్న దనుకోచ్చు "మున్నగు వినమ్రమైన వాక్యాలతో వీరు ప్రారం భిస్తారు. పురూరవుని దర్బారు. చిత్రరథుడనే  గంధర్వరాజు ఇంద్రుని సందేశం పట్టుకొని మహారాజు చిత్రరధునకు స్వాగత మిస్తాడు. ఆ గంధర్వుడు రాజును శ్లాఘిస్తాడు. ఇంద్రుని పక్షంలో వారు  చూస్తున్నారంటే అదంతా ఇంద్రుని పరాక్రమ విశేషమేనని తన కృతజ్ఞతను పురూరవుడు ప్రకటిస్తాడు. 'వినయమే  పరాక్రమానికి అలంకార' మని ఈ సందర్భంలోని చిత్రరధుని వాక్యంలో కవి తన అభిప్రాయం

తెలియచేసినట్లు అనిపిస్తుంది. 



రఘువంశమే కాళిదాసుఅంతిమ కావ్యం అంటారు. ఈ కావ్యం ప్రారంభంలో మహా కవి వినయమ నే కొండుకొన పై నుండి ఉపదేసిస్తున్నట్లుగ ఉంటుంది. చూడండి — “సూర్యవంశ మెక్కడ? ఈ అల్బబుద్ధి ఎక్కడ? దుస్తర మైన సముద్రాన్ని లోతు తెలిసికోకుండానే తెప్పతో దాటుదామని యత్నిస్తున్నా. కవి యశఃప్రార్థినై మందుడనైన నేను హాస యోగ్యుడనే ప్రాంపును పొందదగ్గ పండ్లను పొట్టివాడు చేతులెత్తిన వెంటనే  పొందలేడు గదా" అని అంటూ తర్వాత కూడా "ప్రాచీన కవులు మాటలతలుపులు తెరిచిన ఈ సూర్య వంశంలో--వజ్రసముత్కీర్ణమై మణిలో దారమునకువలె —— నాకున్నూ గమనం లభ్య మవుతుంది" అంటారు.


త్రివర్గములకు మూలమైన మూడు విద్యలను పూర్వజన్మలోనే అంతుచూచినవి జ్ఞాపకముండునట్లు ఆ రాజు ఈ గురువులకు కష్ట మివ్వ నేర్పాడు అనడంలో ( రఘువంశం  18.50 ) కవి మూడు విద్యలను ఉల్లేఖించి కవి తమ కాలపు విద్యావిధానం సూచించారు . వేదత్రయం నుండి ధర్మాధర్మాలు, దండనీతి నుండి న్యాయాన్యాయాలు , వార్త నుండి అర్థ అనర్థాలు  - అని మల్లి నాథులు వ్యాఖ్యానించారు. 


దీనితోపాటు మహాకవి అక్కడక్కడ చతుర్దశి విద్యలనూ పేర్కొన్నారు . (5-21) మీమాంస మాట నామగ్రాహం గ్రహింపక పోయినా, రఘువంశప్రారంభశ్లోకంలోనే మీమాంసలో కవి నేర్పు స్పష్టమవుతున్నది.


శివతపోవర్ణనఘట్టంలో, 'విరాసనం వేసి, దృష్టి తిన్నగా, నిశ్చలంగా ఉండేట్లు చేసి బాహువులు వంచి, అంకంపై చేర్చి రెండు చేతులూ కమలాకారంలో నిలిపి, ఈశ్వరుడు ధ్యానం చేశారట. పాతంజలంలో సరిగా ఇదే పద్దతి నిర్దిష్టమైయున్నది. కుమారసంభవంలోగుణత్రయ విభాగాయ - త్యా మానయంతి ప్రకృతిం' అనేవి, రఘువంశంలో “లోష్ట కాంచనముల్లో సమబుద్ధి గల రఘువు ప్రాకృ తికమైన గుణత్రయాన్ని జయించెను' అనే వర్ణనకూడా ఆనాటి సాంఖ్యసిద్ధాంత ప్రాబ ల్యాన్ని, కవికి సాంఖ్యంలో గల పరిచ యాన్ని వ్యక్త పరుస్తున్నాయి.


ప్రపంచానికి కారణమై, కారణము లేనివాడవు, ప్రపంచమున కంతకుడనై అంతము లేనివాడివు" అని బ్రహ్మ చేసిన శివస్తోత్రము,

విక్రమోర్వశీయ నాందిలో "వేదాంతేషు యమాహు పురుష " మున్నగునవి కవికి గల వేదాంతపరిచయానికి  నిదర్శనలు. పై

భావాలు 'యతో వాఇమాని భూతానిజాయంతే ' అనే 

ఉపనిషద్భావాలకు వ్యాఖ్యానమే. ఉపనిషత్  అర్థం తెలియకుండా వేదాన్ని అప్ప చెప్పే' ఛాందసులు ఆనాడూ ఉన్నట్లుగా ‘వేదాభ్యాసజడు,లనడింవలన ఊహించవచ్చు నేమో. 'సాంగం చ వేద మధ్యాప్య'  అని వేదాంగాలు నిర్దేశింపబడ్డాయి. ప్రాతఃకాలమే నందినిని సేవిస్తూంటాడు. ముందు నందీని , నెనుక దిలీపుడు! నందిని డెక్కలనుండి వచ్చే ధూళి మార్గాన్ని పవిత్రం చేస్తున్నది. అదే మార్గంలో వస్తున్న సుదక్షిణ శ్రుతిని అనుసరించే స్మృతివలె వస్తున్నదిట .


యుద్ధభూమిలో శత్రువ్యూహములను భేదించే వ్యూహాల అంతు, శాస్త్రములు అంతున్న ఈ బాలుడు చూడగలడని ముందుగా  ఆలో చించే - రఘువు అని పేరు పెట్టారట. (రఘి ధాతువు గమనార్థకము) ఈ విధంగా నే మహా కవి తమ వ్యాకరణపరిజ్ఞానాన్ని అక్క డక్కడ విశదీకరించారు.


శ్రీరామవివాహసందర్భం. నలుగురు  రాజ కుమారులను పరిణయమైన ఆ రాజకన్యలు.. ఆ కన్యలను పొందగల్గిన రాజకుమారులున్నూ నిస్తులు లయ్యారట. ఆ వధూవరుల మేళనము ప్రాత: పదికలతో ప్రత్యయములు కలిసినట్లున్న దట. వధూవరులు అనే రెండు ఉపమేయములకు ప్రత్యయప్రకృతులకు ఉపమించారు. వరశబ్దం పుంలింగ ఏకవచనం. ఆటాంటి ప్రత్యయశబ్దాన్నే ఉపమానంగా వాడారు. ఈ విధంగానే స్త్రీలింగమైన వధూశబ్దానికి సరిగా స్త్రీలింగమైన ప్రకృతిశబ్దంతోనే సాదృశ్యం నిబంధించారు. ప్రకృతి ప్రత్యయములవలన ఫలితం పదనిష్పత్తి. అదే విధంగా వధూ వరుల యోగంతో గృహస్థాశ్రమం సిద్ధమవుతుంది. ఈ రెండు ఉపమేయ ఉపమానాలకు యోగం సాధారణ ధర్మము; సన్నిధమనేది ఉపమావాచకము. వ్యాకరణం వంటి నిష్క  శాస్త్రాన్ని కూడా తమ చమత్కారపూర్ణ ఉపమలతో  సరస మయ్యేటట్లు మహాకవి నిరూపించారు. ఈ అలంకారాన్ని 'పూర్ణోపము ' అని సాహితీశాస్త్రజ్ఞులు. ఇదేకాక 'ధాతో:  స్థాన ఇవాదేశాత్' మున్నగునవి కవికి  వ్యాకరణమంటే గల ఆదరణ తెలియచేస్తున్నది. మహాకవిసమయంలో మనవిద్యల ఉన్నతస్థాయిని ఊహించుకోగలవారికి, పతనమైనమన నేటివిద్యావిధానం దృగ్గోచరమై హృదయా వేదన ఎక్కువ కాకతప్పదు. 

--- 

 - పి. వి. భట్టశర్మ

( ఆంధ్రపత్రిక - వా - 24 -05 - 1950 సంచిక నుంచి ) 

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

25-12-2021 ; బోధెల్ ; యూఎస్ ఎ

Sunday, December 19, 2021

ఈనాడు - గల్పిక గురువు - లఘువు కాదు ; కారాదు! - రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 05 - 09-2009 )


 


ఈనాడు - గల్పిక 

గురువు - లఘువు కాదు ; కారాదు! 

- రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 05 - 09-2009 ) 



'గురువు, దేవుడూ ఒకేసారి కనిపిస్తే ముందు నేను గురువుకే నమస్కారం చేస్తాను. దేవుడిని నాకు ముందు చూపించినవాడు గురువే కదా!' అంటారు షిర్డీ సాయి బాబా యుద్ధరంగం మధ్య విషాదయోగంలో పడ్డ అర్జునుడికి సుఖదుఃఖే సమైకృత్వా' అంటూ గీతోపదేశం చేసిన శ్రీకృష్ణుడిని మనం 'జగద్గురువు'గా భావిస్తాం. అద్వైత బోధ చేసిన ఆదిశంకరులు మరో జగద్గురువు


రాయికి రూపం ఇచ్చేవాడు శిల్పి.  శిష్యుడికి రూపం తెచ్చేవాడు గురువు. 'గు' అంటే చీకటి, 'రు' అంటే పోగొట్టేది.  అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేవాడు గురువే.  కాబట్టే జన్మనిచ్చిన తల్లిదండ్రుల తరువాత పూజనీయుడవుతున్నాడు. గురువును పరబ్రహ్మ స్వరూపంగా సంభావించే సంప్రదాయం మనది. అధర్వణ వేదంలోని శిష్టాచార సంప్రదాయం ప్రకారం- చదువుకు కూర్చునే ముందు శిష్యుడు ఇష్టదేవతా ప్రార్ధన తరువాత ' స్వస్తినో బృహస్పతి ర్దదాతు' అంటూ గురువును స్మరించే విధానం ఉంది. మహాభారతం అరణ్యపర్వంలో యక్షుడు 'మనిషి మనిషి ఎలాగవుతాడు? అనడిగినప్పుడు- 'అధ్యయనం వలన. గురువుద్వారా' అని సమాధానం చెబుతాడు ధర్మరాజు. అందరూ ప్రణామాలు చేసే ఆ శ్రీరామచంద్రుడు కూడా విశ్వామిత్రుడి ముందు చేతులు జోడించి నిలబడి ఉండేవాడు సమాజంలో గురుస్థానం అంతటి ఘనతరమైనది.  కనుకనే శ్రీకృష్ణుడు చదువుచెప్పిన సాందీపునికోసం అతని మృతశిశువును తిరిగి తెచ్చి ఇచ్చే శ్రమ తీసుకున్నది.


గురువును గౌరవించటం రానివారు జీవితంలో రాణించలేరనటానికి కౌరవులే ప్రబల తార్కాణం.  ఔరంగజేబు కూడా చిన్నతనంలో విద్యాబుద్ధులు చెప్పిన గురువును చక్రవర్తి అయిన తరువాత దారుణంగా అవమానించాడు. క్రీస్తు పుట్టుకకు మూడు శతాబ్దాల ముందే మహామేధావి అరిస్టాటిల్ ఏథెన్స్ ఒక పెద్ద విశ్వవిద్యాలయన్నే స్థాపించి అలెగ్జాండర్ లాంటి విశ్వవిజేతను తయారుచేశాడు. అదేదారిలో చంద్రగుప్తుడిని తీర్చిదిద్దిన మహాగురుపు కౌటిల్యుడు. కృష్ణదేవరాయలుకు తిమ్మరుసు మామూలు మంత్రేకాదు, గురువు కూడా.


మనిషి భూమిమీద పడిననాడే బడిలోపడినట్లు లెక్క.  ఇంటివరకూ తల్లే అదిగురువు.  తల్లితండ్రులు ప్రేమపాశంచేత కఠిన శిక్షణనీయలేరు.  కాబట్టే గురువు అవసరం కలిగింది. గురుకుల సంప్రదాయంలో మహారాజు కుమారుడైనా కౌమారదశలో గురుకుల విద్యాభ్యాసం చేయవలసిందే. మహాచక్రవర్తి అయిన హిరణ్యకశిపుడు కూడా చెక్కులు పాలుగారే ప్రహ్లాదుడిని మంచి విద్యాబుద్ధులు నేర్పించమని చండామార్కులకు  అప్పగిం చాడు . పాటలీపుత్రాన్ని ఏలే సుదర్శనుడు బిడ్డలు విద్యాగంధంలేక అల్లరిచిల్లరగా తిరుగుతూ ఉన్నారని  వారిని విష్ణుశర్మ అనే పండితుడి వద్దకు విద్య నేర్చుకోవటా నికి సాగనంపింది.


నాటి చదువులు నేటి విద్యలంత సుకుమారంగా ఉండేవి కావు. వేదాధ్య యనం తరువాత పరీక్షలు. నింబ, సారస మనే రెండు పరీక్షలు మరీ సంక్లిష్టం.  సామవేదం  సంగీతమయం. తలూపకుండా వల్లించటం తలకు మించిన పని. బోడిగుండుమీద నిమ్మకాయ పెట్టుకుని అది దొర్లకుండా వల్లించడం  పూర్తిచేస్తేనే పరీక్ష అయినట్లు.  నింబ పరీక్ష మెడకు రెండువైపులా సూదులుతేలిన నారసంచుల్ని కట్టి సామగానం చేయమనేవాడు గురువు. తల కదిలితే సూదులు నేరుగా గొంతులో దిగుతాయి.  అది నారస పరీక్ష.  గురువు మాట వేదవాక్కుగా సాగిన కాలం అది. 


మన పురాణాలు, ఉపని షత్తులు, చరిత్రల్లోనే కాదు- ప్రపంచవ్యాప్తంగా కూడా గురుప్రసక్తి లేని, గురు ప్రశస్తి చేయని సంస్కృతులే లేవు. జార్జి చక్రవర్తి తన కొడుకు ' ప్రిన్స్ ఆఫ్ వేల్స్' చదివే పాఠశాలకు వెళ్ళి కొడుకు ఎలా చదువుతున్నాడో చూడాలని ఉబలాటపడ్డాడు. ఒకసారి చక్రవర్తి వస్తున్నాడని తెలిసి ఆ పాఠాలు చెప్పే పంతులుగారు 'మహా ప్రభో! మీరు రావద్ద'ని కబురు చేశాడు. 'ఎందు కయ్యా' అనడిగితే 'తమరు వస్తే నేను మర్యాదపూర్వకంగా నా తలపాగా తీసి, లేచి నిలబడాలి. ఇంతవరకూ నా విద్యార్థుల దృష్టిలో నేనే పెద్దను. నాకంటే పైన మీరొకరున్నారని తెలిసిపోతే, నా మాట విలువ తగ్గిపోతుంది. అది వారి భవిష్యత్తుకు మంచిది కాదు- అని విన్నవించుకున్నాడుట . రాజు గారు మన్నించి అటువైపు వెళ్లటం మానుకున్నారు. అదీ ఆ రో జుల్లో గురువుకిచ్చిన విలువ!


దేవతలకూ గురువున్నాడు .. బృహస్పతి. రాక్షసులకు శుక్రాచార్యుడు గురువు . మృతసంజీవనీ విద్య అతనికొక్కనికే తెలుసు. కచుడు ఆ తంత్రం తెలుసుకునేందుకే శిష్యరికం చేయటానికి వచ్చి చచ్చి బతికిన కథ మనకు తెలుసు. 


 'ద్రోణ' పేరుతో గురువులకు ఇవాళ బిరుదులిస్తున్నారు.  ద్రోణాచార్యుడి దగ్గర విలువిద్య నేర్చుకోవాలని ఉంది . . భంగపడినా ఆయన పిండి విగ్రహం ముందు పెట్టుకుంటే గాని ఏకలవ్యుడికి ఆ శాస్త్రరహస్యం  పట్టుబడలేదు. బలి అమాయకంగా వామనుడి రూపంలో వచ్చిన విష్ణువుకు సర్వం ధారబోసే ప్రయత్నంలో ఉండగా శిష్యుడిని వారించే నిమిత్తం అడ్డుపడి కన్నుపోగొట్టుకున్న గొప్ప గురువు శుక్రాచార్యుడు.


గురు శబ్దం  అంత గొప్పది.  కనుకనే  మన మాజీ రాష్ట్ర పతి అబ్దుల్ కలాం దేశాధ్యక్షుడి పదవికన్నా బడిపిల్లలకు పాఠాలు చెప్పటానికే ఎక్కువ మక్కువ చూపేవారు. ఓ తమిళ పత్రికలో బాలలకు ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో ఓ చిన్నారి 'చిన్నతనంలో మీరు చాలా కష్టాలు పడి ఓ పెద్ద శాస్త్రవేత్త, ఉపాధ్యాయుడు, రాష్ట్రపతి అయ్యారుగదా! మీ విజయానికి కారణం అదృష్టమా? ' అని అడి గితే 'అవును. చిన్నతనంలో నాకు మంచి దారిచూపించే ఉపాధ్యాయులు దొరికిన అదృష్టం' అని బదులిచ్చాడు కలాం. 


అటువంటి  గురువుకి నేటి మన సినిమాలలో  పడుతున్న గతిని చూస్తుంటే దిగులు కలుగుతుంది. 'గురువు' అంటే గుండ్రాయి కాదు అంటాడు ఓ సినిమా కవి. కాదు. గుండ్రాయే.  మనిషి అజ్ఞానాన్ని, మొండితనాన్ని చితక్కొట్టే గుండ్రామే  నిజమైన గురువు .  తాను అనాడు 'గోడకుర్చీ' వేయించాడు గనకే మనమీనాడు ఓ కుర్చీలో కూర్చుని గొప్పగా పనిచేసుకోగలుగుతున్నాం.


గురువులు అష్టవిధాలు . అక్షరాభ్యాసం చేయించిన వాడు, గాయత్రి ఉపదేశించినవాడు, వేదాధ్యయనం చేయంచినవాడు, శాస్త్రజ్ఞానం తెలియజెప్పేవాడు, పురోగతి కోరేవాడు, మతాది సంప్రదాయాలను  నేర్పేవాడు, మహేంద్రజాలాన్ని విడమరిచి చెప్పేవాడు, మోక్షమార్గాన్ని చూపించే వాడు - అని పురాణజ్ఞానం తెలియజేస్తున్నా వాటిని పట్టిం చుకొనే శిష్యులు ఇప్పుడు లేరు. గురువుకు నామాలు పెట్టే శిష్యులు తయారవుతున్నారు. దొంగలపాలు కానిది, దొడ్డ కీర్తిని తెచ్చేది, పరమ సౌఖ్యానిచ్చేది, భద్రతనిచ్చేది,  యాచ కలకిచ్చినా రవంత తరగనిది-  గొప్ప నిధి అయిన జ్ఞానాన్ని ఇచ్చే గురువును లఘువు చేయకుండా ఉంటేనే ఏ జాతికైనా మేలు జరిగేది.


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 05 - 09-2009 ) 

Tuesday, December 14, 2021

వ్యాసం మన ఆట పాటలు - మలపాక వేంకటాచలపతి సేకరణ : కర్లపాలెం హనుమంతరావు

వ్యాసం 

మన ఆట పాటలు 

- మలపాక వేంకటాచలపతి 

సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 


విద్యావిధానంలో మన తండ్రుల కాలము, మన కాలములలోపుగ నే అనేక మార్పులు వచ్చాయి. దినమూ వస్తూనే ఉన్న విద్యాబోధకులకు ఒక టే సమ స్య' శేష ప్రశ్న' గా ఆదినుంచి వస్తూంది "బాల బాలి కల దృష్టి చదువువైపు చెదరకుండా నిల్పడ మెట్లా?" ఆని. 


పశ్చిమ దేశాల్లో విద్యాసంస్కర్తల రూసో కాలం నుంచి క్రొత్తమార్గాలు త్రొక్కినారు. దాని ఫలితంగా బాలుడు అభివృద్ధిపొందని వృద్ధుడు కాడనీ, అతని మన స్పతికోమలమనీ, సామాన్యమానవునకుండే రస వికారాలు  అతనికి లేవనీ తెలియబడ్డది. అందుచేత పశ్చిమదేశాల్లో బాలుని కఠినపరీక్షలకు గురిచేసే విద్యా విధానము మార్చబడి, బాలుని మనోగత అభిప్రాయా లు, ఐచ్ఛికముల ననుసరించి విద్యాబోధన ప్రారంభింప బడింది. 


కాని 'ఫ్రీబెల్' అనే ఆయన కాలమువరకు ఆటపాటలకు విద్యావ్యాప్తిపైగల    ప్రభావము గుర్తింపక బడినట్లు కన్పడదు. ఇతడు బిడ్డలకు సహజమును, నైసర్గికమునగు ఆటద్వారా విద్యను నేర్పవచ్చునని గ్రహించెను. ఇతడే మొదట 'ఆటపాటల'ను (Play_ Songs) వ్రాసి ఆటవస్తువులను తయారు చేసి పిల్లలకు విద్య ప్రారంభించాడు. ఇతని కాలమునుంచి కిండర్ గార్ట్ (Kindergarten) పద్ధతి ప్రాముఖ్యత వహించి విద్యాసంస్కర్తల అభిమానపద్ధతి ఆయ్యెను.


మన ఆంధ్రదేశములోకూడ ఈ ఆటపాటలు ఆనాదినుంచి ఉన్నవి. కాని వాటి విలువ గ్రహించినట్లు కన్పడదు. దీనినిబట్టి చూస్తే 'ఫ్రీబెల్' యొక్క పద్ధతి క్రొత్తది కాదని తెలుస్తుంది.


విద్య యొక్క పరమావధి మానవవికాసమని మన వారూ, పాశ్చాత్యులూ అంగీకరించిన విషయమే. విద్య మానవునికి సంపూర్ణత్వ మిచ్చేదని చాలమంది ఒప్పుకుంటారు. అట్టి సంపూర్ణత్వముకోసమే మన ఆచారవ్యవహారాలలో, నోములలో, వ్రతములలో, చిన్నప్పటి ఆటపాటలలో, తల్లి శిశువు నోదార్చే జోలపాటలలో విద్యాతత్త్వ మిమడ్పబడి ఉన్నది.


'ఫ్రీబెల్' (Froebel) తన ఆటపాటల్ని శిశువు యొక్క మొదటి సంవత్సరాన్నించి ఆరవ సంవత్స రమువరకు వ్రాశాడు. అతని ఉద్దేశము బిడ్డల్ని సరిగా పెంచగల తల్లులే ఈ ఆటపాటల్ని ఉపయోగించగలరని. కాని ఆట అనేక రూపాలతో వృద్ధులవరకు అభివృద్ధి చెందిఉన్నది. ఆబాలగోపాలము ఆనందించగల ఆట 'నాటకము' __కవియొక్క, సాహిత్యము యొక్క తుది ఫలము. ఆట ఏవిధముగా బాలకుణ్ణి ప్రభావితుణ్ణిగా చేస్తుంది నాటకముకూడ.  అట్లాగే అందర్నీ ప్రభావితుల్ని చేయగలదు. 


శిశువు ఆటలను, పాటలను సులువుగా అనుకరించగలదని మనస్తత్వజ్ఞులు తెలుసుకున్నారు. ఆవేశపూరితమైన బాల్యము, అచిరకాలమునకు పూర్వమే  నిత్యానందమయ స్వర్గలోకము ఆనందలహరిని ఆమృతమయ గాన, నృత్యములతో రెట్టించి రెట్టించి పాడి తన భావాన్ని వ్యక్తపరుస్తుంది. తండ్రి శిశువుకు కొంచెము బిస్కత్తు పెట్టినపుడు “ఇంకా కావాలీ ఈ, ఈ" అని రాగము తీస్తూ కాళ్లగజ్జెలు ఘల్లును నేటట్లు గంతులు వేస్తుంది శిశువు. ఇది అనుభవైక వేద్యము, ఇట్టి పిన్నవయసునందు  పాటలతో నేర్పబడిన జ్ఞానము, ఆటలతో నేర్పబడిన నడత చిరస్థాయి, ఆనందదాయకము. శిశువు లావేశపూరితులే కాకుండా, అనుకరణ బద్దులుకూడను. అతిచురుకైన వారి యింద్రియములూ, అంతకన్న నిశితమైన వారి మెదడూ చూడబడే విష యాల్నీ, చెప్పబడే జ్ఞానాన్నీ అతిసులువుగా గ్రహిస్తుంది. కనుక ఈకాలములో వారికి బోధపడే విజయాల్ని, అభిప్రాయాల్ని, నేర్చు లిషయాలని  తల్లిదండ్రులు పరిశీలిస్తూ తగుజాగ్రత్త  తీసుకోవాలి. కనుకనే ఈవయసున నేర్పబడు కథలు , ఆటపాటలు ఎట్టివి  ఉంచాలి అనేది విద్యాబోధకులు నిర్ణయించాలి. ఇప్పుడు మక ఆటపొటలలోని ప్రాశస్త్యాన్ని


మొదట మన తల్లులు  మనకు నేర్పే ఆటపాటలలో ఒకటి 'ఏనుగు పాట' . తల్లి తన శిశువును తన కాళ్లమీద కూర్చుండబెట్టుకుని

" ఏనుగమ్మ ఏనుగు ఏవూరు  వచ్చింది ఏనుగు ఉప్పాడ వెళ్లింది. ఏనుగు ఉప్పునీరు త్రాగింది ఏనుగు చూపూరు వచ్చింది ఏనుగు మంచినీరు త్రాగింది ఏనుగు' అని పాడుతూ  శిశువు యొక్క మెడ పట్టుకుని ముందుకు నెట్టుతుంది; శిశువు కాళ్లు బిగదన్ని మరల వెనుకకు వస్తుంది. ప్రారంభదశ దాటగానే ఈ పాట వివడం తడవుగా శిశువు  ముందుకూ వెనకకూ ఊగటం ప్రారంభిస్తుంది. ఇది ఒక శరీరోపాసన  (bodily exercise). ఏనుగు యొక్క సతతచలనగుణము ఈపాట లో యిమడ్చబడిఉన్నది.


పసిబిడ్డకు  మొదలుకొని పండుముసలికి వరకు  చంద్ర డాహ్లాదకరుడే. (ఒక్క విరహుల్ని మినహాయించాలి  కాబోలు!) సారస్వతంలో చంద్రుడు చాలా స్థానమాక్రమించుకున్నాడు. ఇట్టి చంద్రుణ్ణి తల్లి 

' చందమామ రావే జాబిల్లి  రావే 

కొండెక్కి రావే గోగుపూలు తేవె  నేన పసిడి గిన్నెలో పాలుపోసుకుని  వెండి గిన్నెలో పెరుగుపోసుకుని  ఒలిచిన పండు ఒళ్లో వేసుకుని ఒలవని పండు చేత్తో పట్టుకుని  అట్లా అట్లా వచ్చి అమ్మాయినోట్లో వేయవే ' అని పాడుతూ 'ఆం ' తినిపిస్తుంది. శిశువుకూడా తదేక ధ్యానంతో   చిట్టి చేతులతో 'చందమామ'ని చూస్తూ  అల్లరి చేయకుండా  'బువ్వ' తింటాడు . అన్నం తినేటప్పుడేకాకుండా చంద్రుడు కనపడినప్పుడు శిశివు తన చేతులతో పిలుస్తాడు. ఈ పాటవల్ల శిశువు క్రమంగా  సౌందర్యగ్రహణ శక్తి, ఊహ, ఆకాశమునందలి జీవులను  గూర్చి తెలుసుకోవాలనే ఆశక్తి, పెరుగుతుంది. తద్వారా భగవంతుని వైపు దృష్టి మరలడానికి  అనేక రకాల అవకాశాలు కలుగుతాయి . ఫ్రీబెల్ 'యొక్క మదటి బహుమానపు శరీరవ్యాయామము ఇక్కడ  కలుగుతుంది.


ఇదే వయస్సులో, అనగా రెండేళ్ల వయసులో  భోజన పదార్థాలు తెలిపే  'చక్కిలిగింత ' ఆట నేర్పవచ్చు. పప్పు పెట్టి, కూర వేసి , పిండివంటలు చేసి... అత్తారింటికి  ఇల్లా, ... అంటూ తల్లి తన చేతి వేళ్లని శిశువుల చేతినింది చంక వరకు  నడిపించి గిలిగింతలు పెడుతుంది.  


బిడ్డకి రెండేళ్లు వచ్చి బాగా  కూర్చోటం అలవాటైనతర్వాత 'కాళ్లాగజ్జా ' ఆట నేర్పవచ్చు. ఆ పొట యిది :


కాళ్ల గజ్జె- కంకాణమ్మ

వేగు చుక్క - వెలగ మొగ్గ 

మొగ్గ కాదు - మోతి నీరు 

నీరుకాదు - నిమ్మల వాయ 

వాయకాదు- వావిలి కూర 

కూరకాదు - గుమ్మడి మీసం 

మీసం కాదు - మిరియాలపోతు 

పోతుకాదు ' బొమ్మల శెట్టి

శెట్టి కాదు - శ్యామల మన్ను 

 మన్ను కాగు -మంచి గంధవు  చెక్క 


ఈ నలుగురైదుగురు  పిల్లలు వరుసగా కాళ్లు చాపుకుని కూర్చోవాలి .  ఒకరు పై పాటలోని ఒక్కొక్క పదానికి ఒక్కొకకాలే కొట్టుచూ    అందరి కాళ్లూ  వరుసగా తట్టుచూ వెనుకకు ముందుకు తట్టుచూ  ఉండాలి. 'మంచి గంధపు చెక్క' అని ఏ కాలిమీదికి వస్తే ఆ కాలం పండినట్లు.  పండిని కాలు ముడుచుకోవాలి. ఇట్లాఅందరి కాళ్లూ  పండేవరకూ ఈ పాట పాడుకూ ఉండాలి. ఈ ఆటపాటలో బిడ్డకి కొన్ని ఆభరణాల పేర్లు— గజ్జెలు, కంకణము, వేగుచుక్క, వెలగ మొగ్గ మొదలైనవి-  కాళ్లు  ముడుచుకొనుట అనేజ్ఞానం కలుగుతుంది. ఈ పాటలో వైద్య శాస్త్రము కూడా ఉన్న దని మనకు తెలుసు.


ఈ వయస్సుననే 'గుడుగుడు గుంచము' ఆట ఆడవచ్చు. ఈ ఆటకు నలుగురైదుగురు పిల్లలు కూర్చుండి ముడిచిన గుప్పిళ్లు ఒకదానిమీద ఒకటి పెట్టుదురు . దీనివల్ల వీరికి ఒకవిధమైన పరిమాణ స్వరూపం తెలుస్తుంది. ఈ ఆట 'కాళ్లగజ్జె ' ఆట కంటే పెద్దది. ఇక్కడ బాలునికి కత్తియొక్క పదును, బద్ద యొక్క చరును, వేణ్ణీళ్ల వేడి, చన్నళ్ల  చలి తెలుస్తుంది. పైగా వాక్యసరళి తోటి  పరిచయ మధికమవుతుంది. చేతులు వెనుకకు దాచుకుని పృచ్ఛ కుడు వేసే ప్రశ్నలకి బాలుడు సరియైన సమాధానం చెప్పటం నేర్చుకుంటాడు. ఉదాహరణకి ప్రశ్నలు, జవాబులు ఇట్లా ఉంటాయి: , నీ చేతులే మైనాయి ? - పిల్లెత్తుకుపోయింది. — పి కిచ్చింది.  పిల్లేమి చేసింది? ——కుమ్మరివాడి కిచ్చింది- 


ఇట్లా ఎన్నయినా ఆటపాటల్ని చెప్పవచ్చు. ప్రత్యేకముగా అడపిల్లలు అడ్డుకునే 'చింతగింజలు '  , ఆటలో 'గణితము' యొక్క ప్రారంభదశ ఉన్నది. ఇప్పటికిని 'కుచ్చెలు' (కుచ్చె-క) లెక్క మన ముస లమ్మల దగ్గర సజీవంగా ఉన్నది. ఇదో అంకెల పాట .  ఎంత బాగుందో చూడండి! 


“ఒక్క ఓ చెలియ

రెండు రోకళ్లు 

మూడు ముచ్చిలక 

నాలుగు నందన 

అయిదు బేడీలు 

ఆరు చిట్టిగొలును"


ఈవిధం గా పదివరకు లెక్కల పాట  ఉన్నది. ఆటపాటలతో కలిపి వైద్యశాస్త్ర మేవిధంగా గుచ్చెత్తారా  చూడండి! 


"కొండమీద – వెండిగిన్నె 

కొక్కిరాజు - కాలు విరిగ 

విరిగి విరిగి - మూడాయె.

దాని కేమి మందు?

వేపాకు చేదు 

వెల్లుల్లి గడ్డ 

నూ నెమ్మబొడ్డు

నూటొక్క  ధార

ఇంకా, ‘మాతృభావము’ అభివృద్ధి చేసే 'చిన్ని పిన్ని కెన్నో ఏడు —' అనే పాట చూడండి. దీనిలో పెళ్లి బేరాలు, నగలు పెట్టడాలు మొదలైనవి అద్భుతంగా వర్ణించారు.


ఈదృష్టితో ఆటపాటల్ని ఆంధ్రభాషలోవేగాక ఇతర హైందవ భాష ల్లోంచికూడా సేకరించాలని నా ఉద్దేశం. రాబోయ్ ‘Sargent Scheme of Educa_ tion' (సార్జెంటు విద్యాప్రణాళికలో)  కూడా శిశు విద్యాలయాల ప్రసక్తి ఉన్నదిగనుక మన శిశువిజ్ఞాన -విషయమై తగు శ్రద్ధవహించి మన పురాతన పాటల్ని సేకరించడమే కాకుండా క్రొత్తవికూడా సృజించి  జ్ఞానాభివృద్ధి కనేకవిధాల ప్రయత్నించవచ్చు.


- మలపాక వేంకటా చలపతి 

సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

( భారతి - మాసపత్రిక - తారణ చైత్రము ) 

గల్పిక - ఈనాడు ఆచార్యదేవోభవ! నేడు ఉపాధ్యాయ దినోత్సవం - రచన: కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు- ప్రచురితం - o5-o9-2009)

గల్పిక - ఈనాడు 


ఆచార్యదేవోభవ! 

 నేడు ఉపాధ్యాయ దినోత్సవం

- రచన: కర్లపాలెం హనుమంతరావు

 ( ఈనాడు- ప్రచురితం - o5-o9-2009)



' గురువూ, దేవుడూ ఒకేసారి కనిపిస్తే ముందు నేను గురువుకే నమస్కారం చేస్తాను. దేవుడిని నాకు ముందు చూపించినవాడు గురువే కదా!' అంటాడు షిర్డీ సాయిబాబా.  

యుద్ధరంగం మధ్య విషాదయోగంలోపడ్డ అర్జునుడికి 'సుఖదుఃఖే సమైకృత్వా' అంటూ గీతోపదేశం చేసిన శ్రీకృష్ణుడిని మనం 'జగద్గురువు'గా భావిస్తాం. అద్వైతబోధ చేసిన ఆదిశంకరులు మరో జగద్గురువు. రాయికి రూపం ఇచ్చేవాడు శిల్పి. శిష్యుడికి రూపం తెచ్చేవాడు గురువు. 'గు' అంటే చీకటి, 'రు' అంటే పోగొట్టేది. అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేవాడు గురువే కనకే, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తరవాత పూజనీయుడవుతున్నాడు. గురువును పరబ్రహ్మ స్వరూపంగా సంభావించే సంప్రదాయం మనది. 

అధర్వణ వేదంలోని శిష్టాచార సంప్రదాయం ప్రకారం- చదువుకు కూర్చునే ముందు శిష్యుడు ఇష్టదేవతా ప్రార్థన తరవాత 'స్వస్తినో బృహస్పతిర్దదాతు' అంటూ గురువును స్మరించే విధానం ఉంది. మహాభారతం అరణ్యపర్వంలో యక్షుడు 'మనిషి మనీషి ఎలాగవుతాడు?' అనడిగినప్పుడు- 'అధ్యయనం వలన... గురువుద్వారా' అని సమాధానం చెబుతాడు ధర్మరాజు.  అందరూ ప్రణామాలు చేసే ఆ శ్రీరామచంద్రుడు కూడా విశ్వామిత్రుడి ముందు చేతులు జోడించి నిలబడి ఉండేవాడు. సమాజంలో గురుస్థానం అంతటి ఘనమైనది కనకనే శ్రీకృష్ణుడు చదువుచెప్పిన సాందీపునికోసం అతని మృతశిశువును తిరిగి తెచ్చేందుకు అంత లావు శ్రమ తీసుకున్నది!.

 గురువును గౌరవించటం రానివారు జీవితంలో రాణించలేరనటానికి కౌరవులే ప్రబల  తార్కాణం.చిన్నతనంలో విద్యాబుద్ధులు చెప్పిన గురువును ఔరంగజేబుకూడా చక్రవర్తి అయిన తరవాత దారుణంగా అవమానించాడు. 

క్రీస్తు పుట్టుకకు మూడు శతాబ్దాల ముందే మహామేధావి అరిస్టాటిల్‌ ఏథెన్స్‌లో ఒక పెద్ద విశ్వవిద్యాలయన్నే స్థాపించి అలెగ్జాండర్‌లాంటి విశ్వవిజేతను తయారుచేశాడు. అదేదారిలో చంద్రగుప్తుడిని తీర్చిదిద్దిన మహాగురువు మన కౌటిల్యుడు.  కృష్ణదేవరాయలుకు తిమ్మరుసు మామూలు మంత్రేకాదు, గురువు కూడా. మనిషి భూమిమీద పడిననాడే బడిలోపడినట్లు లెక్క. ఇంటివరకూ తల్లే ఆది గురువు. తల్లితండ్రులు ప్రేమపాశంచేత కఠిన శిక్షణనీయలేరు గనక గురువు అవసరం కలిగింది. గురుకుల సంప్రదాయంలో మహారాజు కుమారుడైనా కౌమారదశలో గురుకుల విద్యాభ్యాసం చేయవలసిందే! మహాచక్రవర్తి అయిన హిరణ్యకశిపుడు కూడా చెక్కిట పాలుగారే ప్రహ్లాదుడిని మంచి విద్యాబుద్ధులు నేర్పించమని చండామార్కులవారికి అప్పగించాడు.  పాటలీపుత్రాన్ని ఏలే సుదర్శనుడు తన బిడ్డలు విద్యాగంధంలేక అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉన్నారనే గదా వారిని విష్ణుశర్మ అనే పండితుడి వద్దకు విద్య నేర్చుకోవటానికి సాగనంపింది! నాటి చదువులు నేటి విద్యలంత సుకుమారంగా ఉండేవికావు. వేదాధ్యయనం తరవాత పరీక్షలు మరింత కఠినంగా ఉండేవి. నింబ, సారసమనే రెండు పరీక్షలు మరీ సంక్లిష్టం. సామవేదం సంగీతమయం. తలూపకుండా వల్లించటం తలకు మించిన పని. బోడిగుండుమీద నిమ్మకాయ పెట్టుకుని అది దొర్లకుండా వల్లింపు పూర్తిచేస్తేనే పరీక్ష అయినట్లు, అది నింబ పరీక్ష. మెడకు రెండువైపులా సూదులుతేలిన నారసంచుల్ని కట్టి సామగానం చేయమనేవాడు గురువు. తల కదిలితే సూదులు నేరుగా గొంతులో దిగుతాయి! అది నారస పరీక్ష. గురువు మాట వేదవాక్కుగా సాగిన కాలం అది.

మన పురాణాలు, ఉపనిషత్తులు, చరిత్రల్లోనే కాదు- ప్రపంచవ్యాప్తంగా కూడా గురుప్రసక్తి లేని, గురుప్రశస్తి చేయని సంస్కృతులే లేవు. జార్జి చక్రవర్తి తన కొడుకు 'ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌' చదివే పాఠశాలకు వెళ్ళి కొడుకు ఎలా చదువుతున్నాడో చూడాలని ఉబలాటపడ్డాడు ఒకసారి. చక్రవర్తి వస్తున్నాడని తెలిసి ఆ పాఠాలు చెప్పే పంతులుగారు 'మహాప్రభో! మీరు రావద్ద'ని కబురు చేశాడు. 'ఎందుకయ్యా?' అనడిగితే 'తమరు వస్తే నేను మర్యాదపూర్వకంగా నా తలపాగా తీసి, లేచి నిలబడాలి. ఇంతవరకూ నా విద్యార్థుల దృష్టిలో నేనే పెద్దను. నాకంటే పైన మీరొకరున్నారని తెలిసిపోతే, నా మాట విలువ తగ్గిపోతుంది. అది వారి భవిష్యత్తుకు మంచిది కాదు!' అని విన్నవించుకున్నాట్ట. రాజుగారు మన్నించి అటువైపు వెళ్లటం మానుకున్నారు. అదీ ఆ రోజుల్లో గురువుకిచ్చిన విలువ!

దేవతలకూ గురువున్నాడు బృహస్పతి. రాక్షసులకు శుక్రాచార్యుడు గురువు. మృతసంజీవనీ విద్య అతనికొక్కనికే తెలుసు. కచుడు ఆ తంత్రం తెలుసుకునేందుకే శిష్యరికం చేయటానికి వచ్చి చచ్చి బతికిన కథ మనకు తెలుసు. 'ద్రోణ' పేరుతో గురువులకు ఇవాళ బిరుదులిస్తున్నారు. ఆ ద్రోణాచార్యుడి దగ్గర విలువిద్య నేర్చుకోవాలని తంటాలుపడి భంగపడినా ఆయన పిండి విగ్రహం ముందు పెట్టుకుంటేగాని ఏకలవ్యుడికి ఆ శాస్త్రరహస్యం పట్టుబడలేదు. 

బలి అమాయకంగా వామనుడి రూపంలో వచ్చిన విష్ణువుకు సర్వం ధారబోసే ప్రయత్నంలో ఉండగా, శిష్యవాత్సల్యంతో అడ్డుపడి కన్నుపోగొట్టుకున్నాడు గురువు శుక్రాచార్యుడు.

 

గురుస్థానం అంత గొప్పది కనకనే మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం దేశాధ్యక్షుడి పదవికన్నా బడిపిల్లలకు పాఠాలు చెప్పటానికే ఎక్కువ మక్కువ చూపుతున్నాడు. ఓ తమిళ పత్రికలో బాలలకు ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో ఓ చిన్నారి 'చిన్నతనంలో మీరు చాలా కష్టాలు పడి ఓ పెద్ద శాస్త్రవేత్త, ఉపాధ్యాయుడు, రాష్ట్రపతి అయ్యారుగదా! మీ విజయానికి కారణం అదృష్టమా?' అని అడిగితే 'అవును. చిన్నతనంలో నాకు మంచి దారిచూపించే ఉపాధ్యాయులు దొరికిన అదృష్టం' అని బదులిచ్చాడు కలాం. అలాంటి గురువుకి నేటి మన సినిమాల్లో పడుతున్న గతిని చూస్తుంటే దిగులు కలుగుతుంది. 

'గురువు' అంటే గుండ్రాయి కాదు అంటాడు ఓ సినిమా కవి. కాదు గుండ్రాయే! మనిషి అజ్ఞానాన్ని, మొండితనాన్ని చితక్కొట్టే గుండ్రాయే నిజమైన గురువు. తాను ఆనాడు 'గోడకుర్చీ' వేయించాడు గనకే మనమీనాడు ఓ 'కుర్చీ'లో కూర్చుని గొప్పగా పనిచేసుకోగలుగుతున్నాం.

 గురువులు అష్టవిధాలు.

అక్షరాభ్యాసం చేయించినవాడు, 

గాయత్రి ఉపదేశించినవాడు, 

వేదాధ్యయనం చేయించినవాడు, 

శాస్త్రజ్ఞానం తెలియజెప్పేవాడు, 

పురోగతి కోరేవాడు, 

మతాది సంప్రదాయాన్ని నేర్పించేవాడు, 

మహేంద్రజాలాన్ని విడమరిచి చెప్పేవాడు, 

మోక్షమార్గాన్ని చూపించేవాడు 

అని పురాణజ్ఞానం తెలియజేస్తున్నా వాటిని పట్టించుకొనే శిష్యులు ఇప్పుడు లేరు. గురువుకు నామాలు పెట్టే శిష్యులు తయారవుతున్నారు. 

దొంగలపాలు కానిది, దొడ్డకీర్తిని తెచ్చేది, పరమ సౌఖ్యానిచ్చేది, భద్రతనిచ్చేది, యాచకులకిచ్చినా రవంత తరగనిది, గొప్ప నిధి అయిన జ్ఞానాన్ని ఇచ్చే గురువును లఘువు చేయకుండా ఉంటేనే ఏ జాతికైనా మేలు జరిగేది. 


- రచన: కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు- ప్రచురితం - o5-o9-2009)


Sunday, December 12, 2021

సంస్కృతి : బళ్లో పడెయ్యడం అను అక్షరాభ్యాసం కథ -కర్లపాలెం హనుమంతరావు

  



ఇప్పుడంటే బిడ్డ తల్లి కడుపులో ఎదుగుతుండగానే.. కన్నవాళ్లు యమకంగారుగా ఏ కాన్వెంటులో సీటు దొరుకుతుందా అని వేట మొదలుపెడుతున్నారు. అర్థశతాబ్దం కిందట పిల్లల చదువులకు  తల్లిదండ్రులు మరీ ఇంతలా తల్లడిల్లడం కనిపించదు. 


బిడ్డను అయిదేళ్ల వరకు ఇంటా బయటా హాయిగా ఆడుకోనిచ్చేవాళ్లు. నడుముకు నిక్కరు గుండీలు సొంతంగా పెట్టుకునే  అయిదేళ్ళ వరకు ఆగి  ఆ నిక్కరు బిగించే చేతికే  పలకా బలపం ఇచ్చి బళ్లో కుదేసివచ్చేవాళ్లు. సామాన్యులు ఇంత సాధారణంగా జరుపుకునే పిల్లల అక్షరాభ్యాస కార్యక్రమం కలిగినవాళ్ల ఇళ్లల్లో  ఇంకాస్త ఆర్భాటంగా చేయడం రివాజు. డబ్బుండి చేసినా, లేకుండా  చేసినా ఇద్దరు  నిర్వహించేదీ ఒకే కార్యకలాపం. దాని పేరే అక్షరాభ్యాసం. గతంలో మన తెలుగునాట పిల్లలను పాఠశాలలో ఎట్లా వేసేవారో.. ఆ తతంగం, దానికి వెనుక ఉన్న ఆధ్యాత్మిక సంప్రదాయం .. వాటిని  గురించి సూక్ష్మంగా తెలుసుకొనేందుకే ఇక్కడ ఈ వ్యాసం. 

 

ధర్మశాస్త్రాలు బిడ్డకు అక్షరాలు దిద్దబెట్టే ఈ తతంగానికి రకరకాల పేర్లు నిర్దేశించాయి. తెలుగువాళ్ల మూలరుషిగా భావించే విశ్వామిత్రుడు బిడ్డను బళ్లోవేసే తంతును విద్యారంభం అన్నాడు. అదే సంస్కారం, గోపీనాథభట్టు విరచిత ' సంస్కార రత్నమాల ' ప్ర్రకారం- అక్షరారంభం! అక్షర స్వీకరణగా వశిష్టుడు పేర్కొంటే, మార్కెండేయుడు 'అక్షర లేఖనం'అనే పేరు ఖాయం చేశాడు. ఎవరే పేరుతో  పిలుచుకున్నా  పిల్లలకు  అక్షరాలు దిద్దబెట్టే శుభకార్యంలో తంతు  మాత్రం దాదాపు ఒకటే!


తమాషా ఏమిటంటే, వీరమిత్రోదయ, స్మృతిచంద్రిక, సంస్కార రత్నమాల, యాజ్ఞవల్క్య స్మృతికి వ్యాఖ్యానం చెప్పిన అపరార్క వ్యాఖ్య లాంటి అర్వాచీన గ్రంథాలలో ప్రముఖంగా ప్రస్తావనకొచ్చిన అక్షరాభ్యాస సంస్కారం అసలు గృహ్యసూత్రాలలోనే కనిపించకపోవడం! విశ్వామిత్ర, బృహస్పతి వంటి రుషుల పేర్లు ఈ వ్యవహారంలోకి లాగడం కేవలం  దీనికి పురాతన సంప్రదాయవాసన అంటగట్టడానికేనంటూ పి.వి. కాణే వంటి ఆధునికులు విమర్శిస్తున్నారు. 


ఎడ్యుకేషన్ ఇన్ ఏన్షియంట్ ఇండియా గ్రంథం రాసిన డాక్టర్ అ.స. అత్లేకర్ అభిప్రాయం ప్రకారం భారతీయుల  అక్షర జ్ఞానాన్ని క్రీ.శ. ఏడు, ఎనిమిది శతబ్దాలకు ముందు కాలానికి మించి ముందుకు  తీసుకుపోలేం. 


ఇండియన్ యాన్టిక్వెరీ గ్రంథ కర్త డాక్టర్ బూలర్ లెక్క ప్రకారం అయితే మన దేశస్తులకు వర్ణమాలను గురించి తెలియడం క్రీ.పూ 800 తరువాతే! ఎట్లాంటి పరిస్థితుల్లోనూ  అంతకన్నా ముందైతే కాదు. ప్రాచీన లిపి మాల అనే మరో గ్రంథం ఉంది. దాని కర్త పండిత గౌరీశంకర్ హీరాచంద్ర.  ఈ దేశవాసులకు అక్షరాలు రాసే లేఖనకళ వంటబట్టిందే క్రీ.పూ 16 -12 శతాబ్దాల ప్రాంతంలో అంటారాయన.  అందరికి అందరూ పండితులే. అందరివీ శాస్త్రీయ పరిశోధనలే! కానీ ఏటి కొకరు కాటి కొకరు ! ఇహ రథం ముందుకు కదిలేదెట్లా? అందుకే ఆ గందరగోళాల జోలికి  పోకుండా ఇంచక్కా   మనవైన సంప్రదాయాలు ఈ అక్షరాభ్యాస తతంగాన్ని గూర్చి  ఏ వింతలూ విశేషాలూ  చెబుతున్నాయో.. రవ్వంత తెలుసుకుందాం!


 ఏ విషయం తెలిసినా , ఎంతటి  గొప్పవారైనా ఆరు నెలలు గడిస్తే అంతా మరుపుకొస్తుందని శాస్త్రం. అట్లాంటి మతిమరుపు జాడ్యానికి మందు కింద బ్రహ్మదేవుడు అక్షరమాలను   సృష్టించాడని బృహస్పతి స్మృతి ఉవాచ. 

'                                                                             షాణ్మాసికే తు సంప్రాప్తే భ్రాంతిస్సంజాయతే యతః ।

ధాత్రాక్షరాణి సృష్టాని పత్రా రూఢాన్యతః పురా॥- అనే శ్లోకానికి అర్థం ఇదే! 


కృష్ణయజుర్వేద సంహిత రెండో కాండంలో అంతకు మించిన తమాషా మంత్రం ఇంకోటుంది. 

 'యాప్ర లిఖతే తస్యైఖలతిః' అని ఆ మత్రం. అంటే ఆడవాళ్లు ఈడేరిన తరువాత గాని పలకా బలపం చేతబడితే .. ఆ పాపానికి పరిహారంగా బట్టతల గల బిడ్డ పుడతాడని హెచ్చరిక. ఆడవాళ్లు చదువుకోరాదని చెయ్యి చుట్టి ముక్కు చూపించే పద్ధతి అన్న మాట. ఆ లెక్క నిజమే అయితే,  ఇప్పుడు ఎక్కడ చూసినా అర్థ బోడిగుండు శాల్తీలే దర్శనమీయాలి  న్యాయంగా కదా! ఏదో .. అప్పటి నమ్మకాలు  అప్పటివి అని సరిపెట్టుకునేవాళ్లలో  ఏ పేచీ ఉండదనుకోండి! 


కాలం గురించి ఎన్ని కయ్యాలు జరిగినా, హిందువుల మనోభావాల ప్రకారం, ప్రప్రథమ లేఖకుడు వినాయకుడు. వ్యాసమహర్షి చెప్పుకుపోతుంటే మహా భారతం మొత్తం పూసపోకుండా రాసుకుపోయింది  ఆ మహాదేవుడే  కదా! మరి వ్యాసుడి కాలం సుమారు 5000 ఏళ్ల కిందటిదేనా అని అడిగితే  ఇప్పుడున్న   శాస్త్రవేత్తల్లో సగం మంది అవునన్నట్లే తలలాడిస్తారు.  ఇహ మన  అక్షరజ్ఞాన కాలం  గురించి ఇంతలా  కుస్తీలింకా అవసరమా? 

అని సందేహం. సమాధానం చెప్పే దెవరు? 


చౌలం అంటే ఉపనయనం ముందు జరిగే తంతు . అది ముగించుకున్న తరువాతనే ఈ అక్షరాభ్యాస కార్యక్రమం! అలాగని మరి  సాక్షాత్తూ కౌటిల్యుడంతటి రాజగురువే నియమం విధించాడు. 


రాజకుమారుడు 'వృత్త చౌల కర్మా లిపిం  సంఖ్యానం చ ఉపయంజీత, వృత్తోపనయనస్త్రయీ మాన్వీక్షికీం చ శిష్టేభ్యో నార్యా  మధ్యక్షేభ్యో దండనీతిం, వక్తృ ప్రవక్తభ్యః, బ్రహ్మచర్యం చా షోడశాద్వర్షాత్, అతో గోదానం దారకర్మ చ'-అన్నాడు. 


వడుగు అయిన తరువాత అక్షరాలు నేర్చుకోవడం, గణితం.. ఉపనయనం అయిన తరువాత  వేదాధ్యయనం చేయడం, అన్వీక్షకి, వార్త, దండనీతులు అనే మూడు రాజవిద్యలు పదహారో ఏడు వరకు (అంటే గోదానవ్రతం అయే వరకు)అభ్యసించడం ! అవన్నీ సక్రమంగా పూర్తి చేసుకున్న తరువాతనే పెళ్లి ముచ్చట. 


ఇలాంటి ఏదో నియమం ఉండబట్టే  వాల్మీకి కాలంలో కూడా ఉండబట్టే ఆ గురువు లవకుశులకు ఒక్క వేదం మినహాయించి  సమస్త విద్యలు చౌలం అయిన తరువాతనే  నేర్పించాడని ఉత్తర రామాయణంలో భవభూతి చెప్పిన  మాట. 


'నివృత్త చౌల కర్మణోశ్చ త్రయోస్థయీవర్జ మితరాస్తి స్రోవిద్యాః సావధానేన మనసా పరినిష్ఠాపితాః'

లిపి పరిజ్ఞాతుడైన తరువాతనే  రఘువంశ మహారాజు అజుడు సాహిత్యసముద్రంలోకి ప్రవేశించినట్లు కాళిదాసు రఘువంశంలో అనే మాట. 


చంద్రాపీడ మహారాజు ఆరేళ్లకు విద్యామందిర ప్రవేశం చేసి పదహారేళ్ల వరకు ఎట్లా గడిపాడో, ఎన్ని రకాల కళలు అభ్యసించాడో బాణుడు కాదంబరిలో వివరంగా చెప్పుకొస్తాడు.  


చదువులు నేర్చుకోవడం సరే, ఏ వయస్సు నుంచి నేర్చుకోవాలన్న విషయం మీద కూడా కీచులాటలే మళ్లీ! విశ్వామిత్ర నీతి ప్రకారం ఐదవ ఏట నుంచి విద్యారంగ ప్రవేశం చేయాలి. పండిత భీమసేన్ వర్మ రాసిన 'షోడశ సంస్కార విధి' అనే గ్రంథంలో  పేరు తెలియని ఒక స్మృతికర్త మతాన్ని బట్టి ఐదు నుంచి 

ఏడు సంవత్సరాల వరకు ఎప్పుడైనా నిక్షేపంగా అక్షరాభ్యాస కార్యక్రమం ముగించుకోవచ్చు. ఇదే ఆ రోజుల్లో 'పంచమే సప్తమేవాబ్దే' సిద్ధాంతంగా ప్రసిద్ధి. 


ఉపనయనం ఆర్షధర్మం దృష్టిలో  రెండో జన్మ. ఆ సందర్భంలో విద్యాభ్యాస కార్యక్రమం కూడా శుభంగా ముగించుకోవచ్చని బృహస్పతి అభిభాషణ. 


మార్గశిరమాసం మొదలు జ్యేష్ఠమాసం వరకు మధ్యలో ఎప్పుడైనా అక్షరాలు దిద్దబెట్టవచ్చని    చెబుతూనే ఆషాఢం నుంచి కార్తీకం మధ్య కాలం మొత్తాన్నీ నిషిద్ధ కాలంగా  విశ్వామిత్ర నీతి నిర్దేశించింది.

  

  'అప్రసుస్తే నిద్రాం త్యజతి కార్తిక్యాం తయోః సంపూజ్యతే హరిః' అని విష్ణు దర్మోత్తరం. సూర్యభగవానుడు ఉత్తరాయన పుణ్యకాలంలో ఉన్నప్పుడు చేసే అక్షరాభ్యాసం శుభదాయకమని వశిష్ఠుని వాక్కు.  


అపరార్కుడు, స్మృతిచంద్రిక కర్తలిద్దరూ మార్కండేయ పురాణోక్తులను పేర్కొంటూ ఐదో ఏట కార్తీక శుద్ధ ద్వాదశి నుంచి ఆషాఢ శుద్ధ ఏకాదశి లోపలే  ఈ కర్యక్రమాన్ని కడతేర్చుకోవాలని హితవు చెప్పారు. కాకపోతే ఒకటే షరతు. పాడ్యమి, షష్ఠి, అష్టమి, పూర్ణిమ, అమావాస్య, రిక్త తిధులైన చవితి, నవమి, చతుర్దశులను వదిలిపెట్టడం క్షేమకరమని హెచ్చరించడం.  


శని మంగళ వారాలు కూడా చదువుల ఆరంభానికి శుభదాయకం కాదన్నది నాటి కాలపు సమాజంలోని గాఢవిశ్వాసాలలో ఒకటి.  రవి, కుంభ రాశులకు చదువుల ప్రారంభానికి కలసిరావు. లగ్నాత్తు ఆష్టమంలో గ్రహాలేమీ లేకుండా చూసుకొని ముహూర్తం నిర్ణయించుకోవాలని పెద్దలు నిర్దేశించేవాళ్లు. ఈ తరహా  జ్యోతిష సంబంధ నియమాలు ఒకటా.. రెండా! పట్టించుకొనేవాళ్లు పట్టించుకొనేవాళ్లు. పట్టింపులేని వాళ్లు పిల్లల చేతిలో  ఓ మార్కాపురం పలకా.. నరసాపురం  బలపం పెట్టి బడికి తోలేసేవాళ్ళు.  


ముహూర్తం చూసుకుని గానీ, అక్షరం నేర్పించని పెద్దల  ఇళ్లల్లో ఎంత మంది చదువు సాములు నేర్చి పండిత ప్రకాండులయ్యారో.. ఆ లెక్కలు  అవీ తీసేవాళ్లు అప్పుడూ లేరు. ఇప్పడు అసలే లేరు. 


ఇహ అక్షరాభ్యాసం జరిపించే  విధానం గురించి కూడా కొద్దిగా తెలుసుకుందాం. ఓం ప్రధమంగా బిడ్డకు తలారా  స్నానం చేయించి , ఆపైన వస్త్ర భూషణాదుల అలంకరణ చేసి , విఘ్నేశ్వరునికి పూజ, సరస్వతీదేవికి అర్చన పూర్తి చేయించేవారు ! అటు పిమ్మట వెదురు చేట నిండానో, వెండి పళ్లెం నిండుగానో సన్నబియ్యం పోసి దానిని రెండే రెండు గీతలతో మూడు భాగాలుగా విభజన చేసి పై భాగంలో 'ఓమ్' .. రెండో భాగంలో 'నమఃశివాయ' .. మూడో గడిలో 'సిద్ధం నమః' అని మూడేసి సార్లు  పురోహితుడు బిడ్డ చేత రాయించి నమస్కారం చేయించేవాడు. విఘ్నేశ్వర, సరస్వతీ శ్లోకాలు బిడ్డుచేత ముద్దుగా చదివించేవాడు. 


ఇక్కడి ఈ ' ఓం నమశ్శివాయ' మంత్రం జైన సంప్రదాయం నుంచి పుట్టుకొచ్చిన తతంగమన్నట్లు కొందరి భావన.  కాదు.. పరమేశ్వరుడికి 'సిద్ధ' అనే నామాంతరం ఉంది. కాబట్టి 'ఓం నమశ్శివాయ సిద్ధం నమః' అనే ప్రార్థన వ్యవహారంలో 'ఓం నమః శివాయ సిద్ధం నమః' గా మారిందనే ప్రతివాదన తెచ్చేవాళ్లూ  కద్దు.  


నృసింహపురాణం ప్రకారం దైపప్రార్థనల అనంతరం గురుపూజ ఒక విధి. గర్గ వచనం ప్రకారం, అజ్యాహుతులతో సరస్వతి, హరి, లక్ష్మి, విఘ్నేశ, సూత్రకారులకు స్వవిద్యను ఉద్దేశించి హోమం చేయడం  మరో విధి. ఇప్పుడీ ఆచారాలకు సమయమేదీ? ఉన్నా శ్రద్ధ ఏదీ? బిడ్డకు మంచి పబ్లిక్ పాఠశాలలో అడ్మిషన్ సాధించడమే వంద యజ్ఞాలు నిర్వహించిన పెట్టు. అంత తలకిందులుగా ఉంది నేటి వ్యాపార చదువుల వ్యవహారం.


ఇస్లాం మతంలో కూడా ఈ విద్యారంభానికి దీటుగా   'బిస్మిల్లాఖాని' అనే శుభకార్యం ఉంది. ముసల్మాన్ సంప్రదాయవాదులూ  ఐదో ఏట, నాలుగో నెల, నాలుగో రోజు బిడ్డ చేత అక్షరాభ్యాసం చేయిస్తారు. 

'ఏసియాటిక్ బెంగాల్ ' అనే  గ్రంథంలో (శాహజహాం) మొగల్ చక్రవర్తి హుమయూన్‌ కు  ఈ తరహా అక్షరాభ్యాసం, తదనంతరం ఉత్సవం జరిపినట్లు  ఒక ప్రస్తావన కనిపిస్తుంది. 


'శూద్ర కమలాకరం' లో సైతం రాజవిద్యలైన ధనుర్విద్య, ఛురికాబంధనాల ప్రస్తావన వచ్చినప్పుడు శుభదినాలలో ప్రారంభించాలనే నియమం కనిపిస్తుంది.  పునర్వసు, పుష్యమి, భరణి, హస్త, స్వాతి, చిత్ర, కృత్తిక, మఘ, రోహిణి, ఉత్తరాత్రయం, శ్రవణ, ధనిష్ఠ, మూల, మృగశిర, పుబ్బ, రేవతి-ఈ నక్షత్రాలలో ధనుర్విద్యారంభం శుభదాయకమని 'ధనుర్విద్యాదీపిక' నిర్దేశిస్తుంది. 


'సర్వాయుధనగామాత్ర..' లాంటి మంత్రాలు కొన్ని మంత్రాలు ఉన్నాయి. వీటితో లక్ష్మీ నారాయణులను పూజించి తొట్టతొలుత ఒక బాణమో, ఛురకత్తో  తూర్పు దిశకు వదలడం  ఆయుధ విద్యలకు సంబంధించిన  కింద లెక్క. 


ఇప్పుడైతే బాణాలు, భురకత్తులు గట్రా  విసరడాలు లేవు కానీ .. వాటి స్థానంలో రాళ్లు విసరటం.. ఏసిడ్ బాటిళ్లు నెత్తిన పొయ్యడాలు వంటి విధ్యంసకర విద్యల ప్రాబల్యమే ఎక్కువగా ఉంది. ఆ విద్యలకు ఏ ఆరంభ ముహూర్తాలు అక్కరలేదు. గురవులతో అయితే అసలు బొత్తిగా అవసరమే లేదు. ప్రతీ ఆకతాయి విద్యార్థి  ఎవరికి వాడే ఏకలవ్యుడు ! 


-కర్లపాలెం హనుమంతరావు

09 -09 -2021

బోథెల్, యూ.ఎస్.ఎ

(మూలఃభారతీయ సంస్కారములు -అక్షరాభ్యాసము)

 

  

 

 

 

 

 

   


Wednesday, December 8, 2021

ఈనాడు - సంపాదకీయం గీతా మకరందం - కర్లపాలెం హనుమంతరావు

 ఈనాడు - సంపాదకీయం 

గీతా మకరందం 

- కర్లపాలెం హనుమంతరావు 


గంగ, గాయత్రి, గీత- ప్రపంచానికి భారతీయత ప్రసాదించిన మూడు ముఖ్యమైన ఆధ్యాత్మిక కానుకలు. తొలి రెండింటి మాట అటు ఉంచి గీతాసూత్రం మాత్రం ' శంకా సంకుచితాంతరంగులకు, వృథా సందేహమందేహులకు' కింకర్తవ్య విమూఢత్వం ఆవరించినప్పుడం మతాలు, నమ్మకాలతో నిమిత్తం లేకుండా స్వస్థతనందించే చక్క ని ఔషధం. దాదాపు అయిదువేల సంవత్సరాల కిందట- దుర్మదాంధు లైన కురుసైన్యం ఎదుట కురుక్షేత్ర రణక్షేత్రం ముంగిట దైన్యయోగంలో పడిన నరుడికి నారాయణుడే జ్ఞానసారథ్యం వహించి చేసిన కర్తవ్య  బోధ- గీత.  'గీ' అంటే త్యాగం, 'త' అంటే తత్వజ్ఞానం. యుద్ధ సందర్భాన్ని ఓ మిషగా ఎంచుకొని అన్ని కాలాలకూ  వర్తించే నిష్కామ కర్మ యోగ ప్రాశస్త్యాన్ని భగవంతుని మాటగా 'గీత'  ప్రకటించిందని  బుద్ధిజీవులూ విశ్వసిస్తున్నారు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలతో సరి సమానంగా ప్రామాణికత  సంతరించుకొన్న ప్రవచనంగా శంకరాచార్యుల వంటి భగవత్పాదులూ  గీతను భావించి భాష్యాలు వెలువరించారు. సంక్షుభిత సమాజానికి సాంత్వన చేకూర్చే చిత్రమైన తత్వ మేదో గీతలో దాగుందని డాక్టర్ అనిబిసెంట్ వంటి మేధావులు వ్యాఖ్యానాలు వెలువరించారు. దేవుడు పట్టించుకోనంత దూరంలో ఉన్నాడు. కనుక, మనిషి నిర్భయంగా సుఖపడవచ్చని ఆదిమానవుడు నమ్మిస కాలం నుంచి , నేటి కాలం  దాకా- మానవజీవన ప్రస్థానంలో ఎన్నెన్నో మతాలు, మార్పులు, మలుపులు త్రికరణశుద్ధిగా, ఫలాపేక్ష రహితంగా, భవబంధాలకు అతీతంగా, కర్మ చేయడమొక్కటే మనిషి కర్త వ్యమని కుండ బద్దలు  కొట్టిన గీతాసూత్రం- ఈ అణుయుగంలో సైతం అణువంతైనా మారింది లేదు. గీత సజీవతకు అంతస్సూత్రంగా దాగిన ఈ నిత్య జీవిత సత్యసంధతే ప్రధాన కారణం. మంచి మనుగడే మతం అభిమతమైతే గీత సర్వమత సమ్మతం ఎందుకు కాదు! 


' దేహమా కంపించుచున్నది! ద్రోహమా యనిపించుచున్నది/ మోహమేదో కుంచుచున్నది' అంటూ విషాదయోగంలో పడిన  నరుడిని - మోహమడంగి తొలంగె ధర్మ సందేహములన్నియున్ అనే మోక్ష సన్యాస యోగదశదాకా నడిపించుకొని తెచ్చేందుకు  గీత లో నారాయణుడు ఎత్తిన అవతారాలు ఎన్నెన్నో!  'ముందు గూర్చుండి నే పగ్గములను బట్టి/ రథము నడిపింతు/ కార్యసిద్ధికి నీవింక గడగుమయ్య'' అని అంటూ నాయకుడిలా ముందు నిలబడి భరోసా ఇస్తాడు ఒకసారి . ' దారుణ మారణ క్రియ/ కెట్టు లోర్చు మదీయ హృదయము? / కొట్టనీ... చేతులు కట్టుకొని యుందున్ ' అంటూ డీలాపడిపోయినప్పుడు ' త్యజింపుము బేలతనమ్ము ధైర్య మున్ జెదరనీకుము' అని తల్లిలా లాలిస్తాడు మరోసారి . కొంచెపు మాట లాడెదు. జుగుప్ప  అశోచ్యుల కోసమేల శో/ కించు టనార్యజుష్ట మపకీర్తికర, మ్మపవిత్రమైనదీ/ చంచలబుద్ధి కశ్మలత  చాలు' అంటూ తండ్రిలా మందలిస్తాడు ఇంకోసారి . మోహపాశంలో పడి కొట్టుమిట్టులాడే మిత్రుడి చేయి పట్టుకొని ఎలాగైనా పైకి లేపాలన్న తాపత్రయం చూపిస్తాడు చాలాసార్లు. నరుడేకైక ధనుర్ధరుండయి యఖండ త్యాగదీక్షా దురం/ ధరుడై నిల్చిన ముజ్జగమ్ముల  నసాధ్యమన్నదే లేదు' అంటూ గురువులా ధర్మమార్గం దర్శింపజే స్తాడు భగవానుడు గీతలో . ' కర్తన్ నేను సమస్త భూతములకున్ సర్వములో వర్తింతున్, అవతార ధర్మమును నిర్వర్తింతు, భూభారము తీర్తున్ నీవు నిమిత్త మాత్ర మగు నంతే క్లైబ్యమింకేల / నీ కర్తవ్యము గుర్తెరింగి / విజయా గైకొనుము  గాండీవమున్ ' అంటూ నిలబెడతాడు . చింతాక్రాంతుడైన మానవుడికి సాంత్వన కలిగించే నిమిత్తం అంతా తవ మీద వేసుకునే జౌదార్యం ఇంతగా మరే సంస్కృతిలోనూ ఎవరూ ప్రదర్శించినట్లు కనిపించదు. 


చెప్పడంలోని గొప్పతనమో, వ్యా సమహర్షి గడుసుతనమోగాని పరమ గంభీరమైన వేదాంతసారం గీతా పాత్రలో పరమాన్నమంత మధురంగా ఉంటుంది. యోగులు, స్వాములు, అవధూతలే కాదు బుద్ధివాదులు , చివరికి చలం వంటి స్వేచ్ఛాప్రణయవాదువా గీతామకరందాన్ని సీతాకోక చిలుకల్లాగా సేవించడానికి ఉవ్విళ్ళూరుడాన్నిబట్టి సుఖజీవన అంతస్సూత్రమేదో ఆ పుష్పంలో దాగుందనేగా అర్థం!  చాలాకాలం కిందట కనుమరుగైన నా తల్లి స్థానాన్ని భర్తీచేసింది భగవద్గీతే. మనసు కలత చెందినప్పుడల్లా నా తల్లి ఒడిలోనే తలదాచుకొనే వాడిని '  అనేవారు అహింసాయోగి మహాత్మాగాంధీ . చిత్తం పరిశుద్ధయేకొద్దీ కొత్తకొత్త అర్ధాలు తోచే  చిత్రమైన ఆధ్యాత్మిక పొత్తం  గీత ' అనేవారు ఆధునిక యోగి వివేకానంద. ధర్మాధర్మాల మధ్య ఘర్షణ హృదయాన్ని రణక్షేత్రంగా మార్చినప్పుడు  విచక్షణ భగవత్ స్వరూపం పొంది సన్మార్గం చూపిస్తేనే గదా మనిషి  పతనావస్థ నుంచి బైటపడేది! వాస ప్రొక్తమైన  గీత అష్టాదశాధ్యాయాలలోని శ్లోకాలలో  ఏదో ఒకటి ప్రపంచంలో  ఏదో మూల ఎవరో ఒకరి చిత్తచాంచల్యమనే  చీకటిని చెండాడే  దివిటీలా వెలుగు తూనే ఉంది. అందుకనే విశ్వవ్యాప్తంగా శ్రీమద్భవద్గీతకు ఇంతకాలంగా ఇంతా మన్నన.  గీత కేవలం వ్యాస మహాభారతంలోని భాగం మాత్రమే కాదు, మనిషి నిశ్చింత జీవితానికి నిత్యం పాటించదగిన జీవన సూత్రాలు  విరివిగా పొదిగిన మనోవికాస శాస్త్రం కూడా. నరుడికి నారాయణుడు గీతలో చేసిన తామరాకు మీది  నీటిబొట్టు తత్వం మతాలు, నమ్మకాలతో  నిమిత్తం లేకుండా లోకం మొత్తం అనుక్షణం  అనుసరించదగిన సూక్తం. అనేక భాషలలో  భాష్యాలు, వ్యాఖ్యానాలు, అనువాదాలు వెలువడ్డ భగవద్గీతపై నేడు వివాదం రేగడమే దురదృష్టం.  ఉత్తమ మానసిక వికాస సాహిత్యంగా, జ్ఞానామృత భాండంగా  ప్రశంసలు అందుకొనే శ్రీమద్భగవద్గీత తీవ్రవాద సాహిత్యమనే ముద్ర వేయడం, నిషేధానికి పూనుకోవడం సంకుచిత మనస్కుల తెలివిమాలినతనం.  మతాలకు అతీతంగా ఆధ్యాత్మిక జ్ఞానం తీర్చడంలో ముందున్న గీతను  ఎవరేమని అడిపోసుకున్నా-  అది అమరానందం అందించే మకరందం. 


***


- కర్లపాలెం హనుమంతరావు 

బోథెల్ ; వాషింగ్టన్ రాష్ట్రం, 

యూ. ఎస్.ఎ 




ఈనాడు - సంపాదకీయం ఆమె గుండె చప్పుడు - కర్లపాలెం హనుమంతరావు

ఈనాడు - సంపాదకీయం 

ఆమె గుండె చప్పుడు! 

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయం - 27 -02 - 2011 - ప్రచురితం) 


'దైవం స్త్రీ జాతి పక్షపాతి. ప్రావీణ్యం సాధించిన తరవాత అంగన సృష్టికి పూనుకొన్నాడు. అందుకే ఆమె అంత సర్వాంగ సుందరంగా శోభిల్లడం ' అంటాడు రామాయణంలో వాల్మీకి. 'తమ్ములనేలు కన్నులు, సుధానిధిబోలు మొగంబు' అంటూ మొదలుపెట్టి 'తేనియల్/ చిమ్మెడు ముద్దు బల్కులును జేయని సొమ్ములు సుందరాంగికిన్' అంటూ శృంగార పారవశ్యంతో భామినుల అంగాంగ వర్ణనలకు పూనుకొన్న భర్తృహరి 'కుచములు ముక్తావళి రమ్యముల్' అనేదాకా సాగిలపడ్డాడు. బాల రసాలసాల నవపల్లవ కోమల కావ్య కన్యకను గూళల కివ్వనని తల్లి వాగ్దేవికి వాగ్దానం చేసే సందర్భాన కూడా 'కాటుక కంటినీరు చనుకట్టు పయింబడనేల యేడ్చెదో?' అని పోతనామాత్యుడు అన్నాడంటే... మరి ఎంత పరమ భాగవతోత్తముడయితేనేమి ..  అతగాడూ ఒక మగవాడే గదా అనిపించక మానదు. ఇది ప్రకృతి విరుద్ధం కూడా కాదంటాడు శృంగారనైషధ కర్త శ్రీనాథుడు. 'మాంచి పైలాపచ్చీసులో ఉన్న పడుచుపిల్ల చెక్కిలిమీద చిటికేస్తే యువకుల మనసులు ఉయ్యాల లూగుతాయిగానీ... చంటివాళ్లకేం చలనముంటుందీ?' అనేవారి మాటలూ కొట్టి పారవేయదగినవి  కాదు. శ్రీకృష్ణ పరమాత్ముడంతటి మహా మాయావి సమర సమయంలో మేనమామ వాహనం కువ లయపీడం కుంభస్థలి చూసి రాధ గుండెపొంగుల తలపులతో తబ్బిబ్బులయ్యాడని జయదేవుడు గీతగోవిందమ్ చమత్కరించింది కదా ! స్త్రీ సౌందర్య సందర్శన మాత్రం చేతనే పురుష హృదయం ఉప్పుటేరులాగా ఉప్పొంగడం సృష్టిసహజం. 'కులుకు కుచ కుంభ ముల కొమ్మకును కుంభరాశి' అని అన్నమయ్య అమ్మ అలివేలు మంగమ్మను కీర్తించినా  స్తుతి అమ్మ పరంగా నాగింది కనుక  అసభ్యమనిపించదు.


అమృతం కోసం సురాసురులు క్షీరసాగర మథనానికి పూనుకో వాల్సి వచ్చింది. మానవుడు అదృష్టవంతుడు... ఏ ప్రయాసా లేకనే పెదవులకు అమృతాన్నందించే ప్రేమమూర్తి లభించింది. ఎంత భగవానుడైనా సరే- ఒకసారి భూమిమీద అవతరించిన తరువాత... తరుణంలో తల్లి చన్ను కుడవక తప్పదు. శకటాసురుని వధానంతరం ఏడుపు లంకించుకున్న బాలకృష్ణుని తన ఒడిలోకి లాక్కొని ' అలసితివిగదన్న చన్ను గుడువుమన్న సంతసపడుమన్న' అంటూ యశోద పడ్డ ఆరాటం అలవికానిది. బెజ్జ మహాదేవి తాను బిడ్డగా భావించిన పరమేశ్వరుణ్ని తలచుకుంటూ 'తల్లి లేకుండిన తన యుడు గాన/ ప్రదుడై యిన్ని వాట్లకు వచ్చే జన్నిచ్చి పలుమాఱు వెన్నయు బెట్టి/ పన్నుగా నిన్నియు బాలును పోసి/ యాకొనగా గడు పరిసి పాలిచ్చి సాకించి పెనుపదే జనని గల్గినను' అంటూ పరిపరి విధాల వాపోయింది. పులి ఎదురైనప్పుడు గోమాతకు ముందుగా గుర్తుకొచ్చింది ఇంటివద్ద ఉన్న కన్నబిడ్డ కడుపారాటమే!  ఇన్ని పాలిచ్చి ఇన్ని సుద్దులు నేర్పి ఇప్పుడే వస్తానని ఆ కన్నపేగు కోసమే పులిముందు అంతగా ఆరాటపడింది! ఊరి బైట వేద పాఠ శాలలో విద్యాభ్యాసం చేసే ఒక బ్రహ్మచారి ఎప్పటిమాదిరే మధ్యాహ్న భోజనంకోసం ఒక ఇంటిముందు జోలెపట్టి 'భవతీ భిక్షాం దేహీ ' అని పిలిచాడు.  స్నానం చివరలో ఉన్న ఆ ఇంటి ఇల్లాలు ఒంటిమీది తడిబట్టలతోనే ఆహారం తీసుకొచ్చింది. చదువు తప్ప మరే ధ్యాసా ఎరుగని ఆ బాలకుడు తల్లి ఎదురురొమ్ములు  చూసి ' ఏమిటమ్మా అవి?' అని అమాయకంగా అడిగాడు. ' పుట్టబోయే పాపాయికి దేవుడు ఇచ్చిన రెండు పాలగిన్నెలు నాయనా!' అని తెలివిగా బదులు ఇచ్చింది ' అంటారు తిరుమల రామచంద్ర. కరుణశ్రీ ఈ పాలగిన్నెలనే పొదుగుగిన్నె అని కూడా భావిస్తూ ఎంతో కరుణ రసాత్మకమైన  కవితలల్లారు . పెదవులయందమృతము మాటలయందమృతము చూపులయందమృతము అమృతంబుగల కుంభద్వయంగల స్త్రీత్వమునకు ప్రణామంబు' అంటుంది సుభాషిత రత్నావళి.


పురిటినొప్పులు తెలియని పురుష జాతికి జన్మనిచ్చి స్తన్యమిచ్చే స్త్రీకి ఆరోగ్యమనేది ఎప్పుడూ పెద్ద సమస్యే. రుతువులు, పురుళ్ళు, సంసారంలోని అనివార్యమైన బాధ్యతల ఒత్తిళ్ళూ... ఆమెనెప్పుడూ వత్తి అంచుదాకా కాలిపోయే దీపశిఖగానే చేస్తున్నాయి. పరదుఃఖ కారుణ్యం నెలత అదనపు బలహీనత. చప్పట్లకు ఎగిరిపోయే చెట్టు మీది చిలకల్లాగా ఇక్కట్లకు బెదిరిపోయి కట్టుకున్నవారిని కన్నవారినీ వదిలిపోయే చిలకల కొలికి కాదు గదా ఆమె! సంసార రథానికి ఆమె రెండో చక్రమైనప్పుడు- జీవనయానం సునాయాసంగా సాగటానికి ఆ చక్రమూ సక్రమంగా ఉండాలి గదా! కష్టంలో ముందుండే... సుఖంలో తోడుండే, విజయంలో వెనకుండే... ఎల్ల పుడూ పక్కనే ఉండే ఆమె గుండెలతో ఆడుకోవడమేకాదు- లోపలి గుండెచప్పుళ్లనూ వినటం మగవాడు నేర్చుకోవాలి. నారీనింద్యాలు అని చెప్పే పదిహేడు బలహీనతల్లో స్వ స్వస్థతపట్ల స్త్రీకి సహజంగా ఉండే నిర్లక్ష్యమూ ఆమె అనారోగ్యానికి ప్రధాన హేతువని మనోవైజ్ఞానికుల భావన. వ్యసనాలకు దూరంగా ఉండే ఆడవారి  ఆయుష్షు సైతం మగవారికన్నా తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం- రొమ్ము క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. క్యాన్సర్ని తొలిదశలో గుర్తించగలిగితేనే నివారణ సాధ్యమవుతుంది. ఒకదశ తరవాత నివారణ అసాధ్యం. రొమ్ము క్యాన్సర్ కణాల వ్యాప్తికి కారకమైన పదార్థాన్ని వైద్యులు గుర్తించగ లిగారు. శరీరంలోని వేరే భాగాలకు క్యాన్సరు కణాలు సోకటానికి కారణమయ్యే ఈ పదార్ధం చర్యను అరికట్టగలిగే కీలక విధానాన్ని కనిపెట్టినట్లు బెంగళూరు కేంద్రంగా పనిచేసే బ్రిటిష్ క్యాన్సర్ పరిశోధనా బృందం ప్రకటించింది. బృంద సారథి ఆర్లేన్ విల్కీ ఆశించినట్లు- 'రొమ్ము క్యాన్సర్ కణాలు వేరే అవయవాలకు వ్యాపించి సంభవిస్తున్న తొంభైశాతం స్త్రీ మరణాలు రాబోయే కాలంలో గణనీయంగా తగ్గుముఖం పట్టగలవని ఆశిద్దాం. దుఃఖం లేనిచోటే స్వర్గమని యజుర్వేదం అంటుంది. ఆ స్వర్గం పురుషుడికి దక్కాలంటే- తల్లి, చెలి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలి.


- - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయం - 27 -02 - 2011 - ప్రచురితం)



Saturday, March 13, 2021

బ్రహ్మ చెవుడు ఉంటేనే గురు బ్రహ్మగా రాణింపు - సరదాకే - కర్లపాలెం హనుమంతరావు

 



గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వరహ...!

సోది! మాను మానవా! సూటిగా పాయింటుకి రా!’ 

'చిత్తం చిత్తం శ్రీమన్నారాయణా! దిగువ లోకంలో నేనో దిక్కుమాలిన అయ్యవారుని..!కన్నీళ్లు అడ్డు పడ్డంతో మాట పెగల్లేదు బక్క పంతులుగారికి. 

'అరరేఁ! ఎందుకయ్యవారూ ఈ కన్నీరు?! నరులకు  నువ్వే కదా గురువుగా మా తరుఫు   జ్ఞాన తరువువి! బుజ్జాయిలుగా ఉన్నప్పటి బట్టీ మనుషుల మరగుజ్జు మెదళ్లలో నానా గుజ్జూ కూరి బాహుబలి సైజు భారీ మోదీలుగాషాలుగా  మలిచే పూచీ నీకే కదా మేం అప్పగించింది! మరి ఇప్పుడేంటీ పేచీ’ 

బుద్ధి గడ్డి తిని స్వామీ      మీ దేవుళ్ల పని నా నెత్తికి రుద్దుకున్నది అప్పట్లోకేవలం తొమ్మిది అవతారాలు మాత్రమే తమరు ఎత్తింది కేశవా ఇప్పటికి.   ఓఁ.. దానికే సర్వలోకాలకు సమస్త సన్మంగళాలు సిద్ధించాయనా తమరి భ్రమదుష్ట శక్తులన్నింటినీ తరిమికొట్టేసినట్లు తమరేమో  ఇక్కడ నిశ్చింతగాయోగనిద్రలో జోగుతుంటిరి!  తుంటరి మూకలేవీ ఎక్కడకీ తారుకోనేలేదు తాండవ కృష్ణా! బాహాటంగానే  మా భూమండలం పై   బళ్లూకాన్వెంట్లూగట్రాలతో పీడన కొనసాగిస్తున్నారు.  పసికుంకలకు,  మా బడిపంతుళ్లకు నానా రకాల నరకాలు  రుచి చూపిస్తున్నారు!’ మేష్టార్లుగా మేం దిద్దే బుడతల నోటుబుక్కుల  ముందర కూర్మావతారంలో తమరెత్తిన  మంధర గిరులు ఎన్ని వందలైనా  దూది పింజలే సుమా!’   

గోల మాని గో టు ది పాయింట్ స్ట్రయిట్ సర్!’ 

యస్సార్భూమ్మీద కో సారి కోదండపాణి మళ్ళీ దిగిరావాలి! ఏ కాన్వెంటు ఇస్కూలులోనో జాయినవాలి! అప్పటిగ్గానీ మా గురుర్విష్ణువుల తిప్పలేమిటో  తిరుమలేశునికి తెలిసిరావు.  అట్టహాసమే తప్పించి హిరణ్యాక్షుడు నిజానికి వట్టి పిచ్చి సన్నాసి  స్వామీవరాహావతారం ఎత్తి  తమరిట్లా ముట్టే,   మూతీ ఎగరేయగానే బెదిరి   కొట్టేసిన భూమి మొత్తం  ఇట్టే  తిరిగిచ్చేసిన రాక్షసోత్తముడుమా నేతలు ఉత్త రాక్షసులుఎన్నో హిరణ్యాక్ష వరాలిచ్చారు  ఎన్నికల ముందు..  మీ ముక్కోటి దేవతలను మించి! గెలిచి గట్టెక్కినాక  కావరం చూపించడం తప్పించి.. ఏ ఒక్క వరమూ తీర్చే యోచనే లేకపాయ యోగానందా! తమరెంతో  అధర్మ ద్వేషులని గదా విశ్వమంతటా వినిపించే మాటఅదే సత్యమైతే మరెందుకు  సుమొటోగా అయినా   మా భూలోక గురువుల  బీదరుపులు తమరి చెవుల దాకా రాలేదు?!  పింఛమే ఆడిస్తారోఫ్లూటే ఊదుతారో మురళీ కృష్ణా.. ముందు మా ఉపాథ్యాయుల కాంట్రిబ్యూటరీ పింఛను సమస్య కొంచమైనా  ముందుకు కదిలే మహిమ చూపించమని మనవి!  ప్రహ్లాదుడంటే పాలూ నీరూ తేడా తెలియని  బాలుడు. అతగాడేదో అమాయకంగా అడిగాడని అంత లావు ‘గాడ్’ అయివుండీ అన్యాయంగా తమరు  నరసింహావతారమెత్తి అంతమొందించారే హిరణ్యకశిపుడిని! నిజానికి అక్షరం విలువ క్షుణ్ణంగా తెలిసిన సత్తెకాలపు తండ్రి  హిరణ్యకశిపుడు.  పద్దాకా పాఠ్యప్రణాళికలలో అడ్డ దిడ్డంగా  మార్పులు తెచే మా దొడ్డ పాలకులు ఆ ప్రహ్లాదుడి కన్నతండ్రి కాలి ధూళికైనా సరిరారు నరహరీ ప్రభుద్ధుల బుద్ధుల సరిదిద్దే పనికి తమరెందుకు బద్ధకిస్తున్నట్లుదుష్టశిక్షణ పద్దు తమరి ఎజెండా నుంచి ఇంకా జారకుండా ఉందా ముకుందా?  భూలోక దేవుళ్ళం కదా మేం గురువులంఅయినా ఇంత దూరం  దేకుతూ పాకుతూ వచ్చి దేబిరించే దాకా  తమరు విద్యాహక్కు చట్టం అమలుపై దృష్టి పెట్టరా విశ్వంభరా  విడ్డూరం కాకపోతే!  తమరా బాకీ కల్కి అవతారం  ఎత్తైనా ముందు మా పీ ఆర్ సి బకాయిలు నగదు రూపంలో చెల్లించేదుకు  ప్రభుత్వాలను ఒప్పించండి  మహాప్రభోతల్లిభాష ప్రాధాన్యత పై  ఇంకా తాత్సారం తగదు  ! ఇందిరాప్రియా..   తమరి ఇమేజికే డ్యామేజీ! వైనతేయునికి స్వామివారన్న వినయమన్నా   వైరి వర్గం చూపదుఏ పరశురామావతారం తాలూకు గండ్రగొడ్డలి సీనులో మార్ఫింగు  వీడియోలో వైరలయే ప్రమాదం కద్దు! 'బతకలేక బడి పంతులుఅన్న సామెత చచ్చినా చచ్చిపోరాదన్నదన్నంత కచ్చగా ప్రవర్తిస్తున్నారందరూ  గురువుల ముందరఅందుకే ఏకీకృత సర్వీసు నిబంధనల అమలుకోసం భూమ్యాకాశాలనైనా ఏకం చేసి తీరాలన్న  పంతానికొచ్చాం పంతుళ్లమంతా. ఇకనైనా  తమరికి      ఉదాసీనత తగదు సదానందా! మా తగాదాలలో తలదూర్చండిజగద్గురువుగా సాటి గురువుల గౌరవం నిలపండి!  హలం భుజాన మోసారే  తప్పించి   కనీసం ఓ అరెకరా మడి చెక్కనైనా తమరు చదును చేసిందెక్కడ?  భూమ్మీది పంతుళ్ల పనులు  వత్తిళ్ళు అంత సులువుగా లేవు సుదర్శనా!  పేరుకే బడికి సెలవులు. పరగడుపున నిద్ర లేచింది మొదలు రాత్రి పొద్దెక్కినా పడకెక్కలేనంత పనిభారం!  ఎన్నికల నుంచి సమాచార సేకరణల వరకు అన్నింటా సర్కారువారికి కాణీ ఖర్చులేని కంచిగరుడ సేవకులు బడి పంతుళ్ళే పద్మనాభా! అయినా ‘టీచర్’ అంటే బడి లోపలి  బుడతడి పాలిట డర్టీ క్రీచర్. బడికి బైట సర్కారు కంటికి ‘సిల్లీ కేరికేచర్’! కృష్ణావతారంలో అబల ‘సత్య’ ఆగ్రహానికి జడిసి గబగబా పారిజాతం కోసం పరుగులెత్తారే మురారీ! అరే!  అదే మరి ఇన్నాళ్ళుగా మా బతుకులు బాగు కోసం సత్యాగ్రహాలకు  దిగుతున్నా చీమైనా కుట్టినట్లు లేదేం శ్రీమన్నారాయణా!   

 

సర్సరేలే గురువా! యోగ నిద్ర మధ్యలో జొరబడింది ఈ మీ  లోకం గోలంతా చెప్పి మరీ నన్ను దెప్పేందుకా?!’ 

 

ఏళ్ల తరబడి పదవీ విరమణ చేసే ఏళ్ళు పెంఛమని ఏడ్చుకుంటున్నాం పంతుళ్లం. యుగాల బట్టి పెండింగులో పడుంది  జగన్నాథుడి పదో అవతారం. ముందెళ్ళి ఆ ముకుందుడి  ముక్కు పిండి జవాబు రాబట్టుకు రండి.. అప్పుడు మీ తిప్పల సంగతి గురించి  తీరిగ్గా ఆలోచిద్దాం!’ అంటోంది సర్కార్ ఎప్పుడు ఆందోళనలకు దిగినా చివరాఖర్న! ఈ వేళ మా లోకంలో ఉపాధ్యాయులకు  దినోత్సవం.  గురువులకు గురువువి! తమరిచ్చే  సూచనల గురించే ఈ యాచనంతా యాదగిరిస్వా,మీ!’ 

బిగినింగులో చదవబోయావే .. ఏదీ ఆ శ్లోకం ఇప్పుడో సారి బిగ్గరగా బైటికి చదువు గురువా!’ 

 'గురుబ్రహ్మ.. గురుర్విష్ణు:.. గురుర్దేవో మహేశ్వర: .. 

 ‘ఆగక్కడ! నీ శ్లోకంలోనే ఉంది కదా సారూ  ముందుగా గురువంటే  బ్రహ్మ.. చివర్నేమో శివుడు. నా ఖర్మ కాకపోతే  మధ్యన ఉన్న నన్ను అడ్డమేసుకుని  ఎవరెవరినో ఈ ఆడిపోసుకోవడంలోని ఆంతర్యమేమి స్వామీ?!’ 

కైలాసగిరి చుట్టూతానే ముందు కాళ్లరిగేటట్లు తిరిగింది ముందు ముకుందా!  ‘ఒకే రకంగా ఉద్యోగ నిబంధనలు లేవు. ఆ కారణంగా పదోన్నతలకు అవకాశాలు కరువు. కరువు భత్యం బకాయిలకు ఎప్పుడూ ఎదురుచూపులే! పీఆర్సీ నివేదికల అమలు జాప్యమయే పక్షంలో కనీసం బకాయిల్లో కొంత నగదుగానైనా  ముక్కుకు వాసన చూపించమని  ఏళ్ల బట్టి మొత్తుకోళ్లు. అయినా సర్కార్ల మనసులు కరగేదిలేదు. పింఛన్ కోసమని  జీత బత్తేలలో  కోత పెట్టే పద్ధతిఅయినా  బలవంతంగా రుద్దకుండా పాత విధానమే  కొనసాగించేలా చూడమని కైలాసవాసుణ్ని  వేడుకొనేందుకుఉ వెండికొండ పై కెన్ని సార్లు ఎగబాకామో.. ఆ దేవుడికే తెలుసు.  నల్ల బ్యాడ్జీలతో  మేం కంటపడ్డప్పుడల్లా వల్లకాదు పొమ్మనడు.. వల్లకాటికి రావద్దనడు. శివయ్య తాండవాలు తప్పించి మరో అనుగ్రహం మాకెన్నడూ  లేకపాయ! ఇదేమని నిలదీయబోతే నడి మధ్యలోకి నంది బంటు వచ్చి  గుప్పెడు బూడిదకు తోడు ఆ బికారి శేష వస్త్రాలని చెప్పి ఇదిగో ఈ మందపాటి తోలు ఒకటి అందించడంతో సరి .. శ్రీహరీ!’ 

సరి! మరి మీ గురుబ్రహ్మ శ్లోకంలోనే ఉంది కదా అందరి కన్నా ముందు   విధాత పేరుఆ చతుర్ముఖుడికీ ఎందుకట ముఖం చాటేయడం?’ 

బ్రహ్మగురువుకి మా లోకంలో పూజాదికాలు కరువు!  ఆ మాంధాత  మాటకు ఏమంత విలువుంటుందివట్టి కంఠశోష అవుతుందేమోనని    మీ సన్నిదానానికే ఇట్లా వచ్చి విన్నవింఛుకునేది? ’ 

దుర్మార్గాల ప్రక్షాళన కోసం   సరికే తొమ్మిది అవతారాలు ఎత్తున్నాను! బుద్ధావతారంలోనే మీ  మానవుల బుద్ధి మా బాగా బుర్రకెక్కింది బాబూ!   కలి పైత్యం ఆసాంతం ముదరాలి ముందు. ఆ పైనే కల్క్యావతారం కథా కమామిషు! నా సహస్ర బాహువుల్లో సహస్ర ఆయుధాలు. శంకువుచకంగదదండం. మీ అధికారులది బధిరాంధకార బుద్ధి. శంఖవు పనిచేయదు. చక్రం ఏ సత్యయుగం ముందు కాలంనాటొ తయారీనో! వాడకం లేని అలంకారం. అస్తమానం సర్కులేషన్లో ఉండి.. వాడుతున్న కొద్దీ వాడి పెరిగే ఆయుధం దండం. దీన్నందుకో గురువర్యా! మీ యుగంలో దీని మరో పేరే ‘దణ్ణం’. దణ్ణం దశగుణం భవేత్! పై వాళ్లను  మునగ చెట్టు ఎక్కించేందుకుకరుడుగట్టిన పెద్దలను మెత్తబరిచి కడగండ్ల బారి నుంచి  తప్పించుకునేందుకు అన్ని యుగాలలోఅన్ని లోకాలలో దాసులు ఎల్లవేళలా రెండు చేతుల నిండుగా ధరించి ధీమాగా తిరిగే లైట్ వెయిట్ పవర్ ఫుల్ వెపన్ ఈ దణ్ణం.  గద  మాదిరి భారీగా ఉండదు కనుక  భుజం మోత తప్పుతుంది. శంకువు  తరహాలో మారుమోగదు కాబట్టి గుట్టు చప్పుడు కాకుండా  మన పని కానిస్తుంది. చక్రమంటే చూపుడు వేలు పద్దస్తమానం దానికే మీదు కట్టే బాధ.  దండం   పెరుకే ఒక ఆయుధం. కనీసం బట్టలు ఆరేసుకునే దండెం కిందకైనా ఉపయోగించని దండుగ ఆయుధం.  ’ బక్క అయ్యవారువి.  తిక్క ఆందోళనలతో సాధించేది ఏమీ లేదని ముందు తెలుసుకో! సమయానుకూలంగా ఈ 'దండం'  సందించే విద్య ఒక్కటి వంటకి బడితే చాలు సర్వీసులో ఉన్నంత కాలం బడికి వెళ్ళి పాఠాలు చెప్పకున్నా జీత భత్తేలతో పాటు ‘ఉత్తమ ఉపాధ్యాయ’ వంటి  పురస్కారాలు అడక్కోకుండానే రెక్కలు కట్టుకుని మరీ ఇంటి ముంగిట వాలిపోతాయ్!  మంచు కొండ మీద ఒంటి మీద చింకిపాతైనా లేకుండా మాడు పై ఒకరినివంటి పక్కన వేరొకరిని  ఇద్దరాడంఫులను  ఒకేసారి భరింఛడానికి తోడు గొంతు లోపల కాల కూట విషమున్నాగొంతు మీదనే మిన్నాగు పాకుతున్నా,  గోల గోలగా అరుపులు సాగిస్తూ ఒక్క క్షణమైనా వదలని భూత ప్రేతపిశాచాల  మూకలను సైతం చుట్టూ చేర్చుకునీ యోగ ముద్రలో అంత భద్రంగా కాలుడు దున్నపోతు మీద ఓ కాలు వేసుకుని మరీ అంత  కులాసాగా విశ్వదుష్ట వినాశనం పైన ఏ ఒక్క  ఫిర్యాదుకైనా తావీయనంత దీక్షతో  ధర్మకార్యం నిర్వహణ నిరంతరం అనాదిగా అంత సమర్థంగా ఎలా నిర్వహిస్తున్నాడో ఎన్నడైనా ఆలోచించావా గురువా! ఆ మహేశ్వరుడి అంత నిశ్చింతకూ నీవు ఇందాక తిట్టిపోస్తివే.. ఆ 'తోలు మందమేమూల కారణం పంతులూ! గురువే బ్రహ్మగురువే విష్ణువు. గురువే మహేశ్వరుడు- అని నీవే ఓ శ్లోకం అందుకుంటివి గదా ఇందకా! పిల్లల అల్లరి మాటల పట్ల బ్రహ్మ చెముడు  పాటించు. పెద్దల చిల్లర చేష్టలనే మాత్రం పట్టించుకోని మహేశ్వరుడి మందపాటి తోలు మనసుకు ధరించు. కలియుగం కాబట్టి నేను అందించిన ‘దణ్ణం’ రెండు చేతుల నిండుగా పట్టు! అప్పుడు తప్కుండాక నీ శ్లోకంలోని  ఆ రెండో భాగం 'గురుస్సాక్షాత్ పరబ్రహ్మం'  నిజం కాక చస్తుందాఅప్పుడు వద్దన్నా అన్ని లోకాలూ 'తస్మై శ్రీ గురువే నమ:!అంటూ మోకాళ్ల మీద తలవంచి మరీ నీ ఆశీర్వాదం కోసం క్యూ కడతాయి అయ్యవారూ! ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా  అందుకో మా త్రి మూర్తుల  తరుఫు నుంచి ఆయుధాలూఅభినందనలు! 

-కర్లపాలెం హనుమంతరావు

***


ఆచార్యదేవోభవ! ఉపాధ్యాయ దినోత్సవం - కర్లపాలెం హనుమంతరావు

 







 'గురువూ, దేవుడూ ఒకేసారి కనిపిస్తే ముందు నేను గురువుకే నమస్కారం చేస్తాను. దేవుడిని నాకు ముందు చూపించినవాడు గురువే కదా!' అంటాడు షిర్డీ సాయిబాబా

యుద్ధరంగం మధ్య విషాదయోగంలోపడ్డ అర్జునుడికి 'సుఖదుఃఖే సమైకృత్వా' అంటూ గీతోపదేశం చేసిన శ్రీకృష్ణుడిని మనం 'జగద్గురువు'గా భావిస్తాం. అద్వైతబోధ చేసిన ఆదిశంకరులు మరో జగద్గురువు. రాయికి రూపం ఇచ్చేవాడు శిల్పి. శిష్యుడికి రూపం తెచ్చేవాడు గురువు. 'గు' అంటే చీకటి, 'రు' అంటే పోగొట్టేది. అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేవాడు గురువే కనకే, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తరవాత పూజనీయుడవుతున్నాడు. గురువును పరబ్రహ్మ స్వరూపంగా సంభావించే సంప్రదాయం మనది.

అధర్వణ వేదంలోని శిష్టాచార సంప్రదాయం ప్రకారం- చదువుకు







కూర్చునే ముందు శిష్యుడు ఇష్టదేవతా ప్రార్థన తరవాత 'స్వస్తినో బృహస్పతిర్దదాతు' అంటూ గురువును స్మరించే విధానం ఉంది. మహాభారతం అరణ్యపర్వంలో యక్షుడు 'మనిషి మనీషి ఎలాగవుతాడు?' అనడిగినప్పుడు- 'అధ్యయనం వలన... గురువుద్వారా' అని సమాధానం చెబుతాడు ధర్మరాజు.  అందరూ ప్రణామాలు చేసే ఆ శ్రీరామచంద్రుడు కూడా విశ్వామిత్రుడి ముందు చేతులు జోడించి నిలబడి ఉండేవాడు. సమాజంలో గురుస్థానం అంతటి ఘనమైనది కనకనే శ్రీకృష్ణుడు చదువుచెప్పిన సాందీపునికోసం అతని మృతశిశువును తిరిగి తెచ్చేందుకు అంత లావు శ్రమ తీసుకున్నది!.

 గురువును గౌరవించటం రానివారు జీవితంలో రాణించలేరనటానికి కౌరవులే ప్రబల  తార్కాణం.చిన్నతనంలో విద్యాబుద్ధులు చెప్పిన గురువును ఔరంగజేబుకూడా చక్రవర్తి అయిన తరవాత దారుణంగా అవమానించాడు.

క్రీస్తు పుట్టుకకు మూడు శతాబ్దాల ముందే మహామేధావి అరిస్టాటిల్‌ ఏథెన్స్‌లో ఒక పెద్ద విశ్వవిద్యాలయన్నే స్థాపించి అలెగ్జాండర్‌లాంటి విశ్వవిజేతను తయారుచేశాడు. అదేదారిలో చంద్రగుప్తుడిని తీర్చిదిద్దిన మహాగురువు మన కౌటిల్యుడు.  కృష్ణదేవరాయలుకు తిమ్మరుసు మామూలు మంత్రేకాదు, గురువు కూడా. మనిషి భూమిమీద పడిననాడే బడిలోపడినట్లు లెక్క. ఇంటివరకూ తల్లే ఆది గురువు. తల్లితండ్రులు ప్రేమపాశంచేత కఠిన శిక్షణనీయలేరు గనక గురువు అవసరం కలిగింది. గురుకుల సంప్రదాయంలో మహారాజు కుమారుడైనా కౌమారదశలో గురుకుల విద్యాభ్యాసం చేయవలసిందే! మహాచక్రవర్తి అయిన హిరణ్యకశిపుడు కూడా చెక్కిట పాలుగారే ప్రహ్లాదుడిని మంచి విద్యాబుద్ధులు నేర్పించమని చండామార్కులవారికి అప్పగించాడు.  పాటలీపుత్రాన్ని ఏలే సుదర్శనుడు తన బిడ్డలు విద్యాగంధంలేక అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉన్నారనే గదా వారిని విష్ణుశర్మ అనే పండితుడి వద్దకు విద్య నేర్చుకోవటానికి సాగనంపింది! నాటి చదువులు నేటి విద్యలంత సుకుమారంగా ఉండేవికావు. వేదాధ్యయనం తరవాత పరీక్షలు మరింత కఠినంగా ఉండేవి. నింబ, సారసమనే రెండు పరీక్షలు మరీ సంక్లిష్టం. సామవేదం సంగీతమయం. తలూపకుండా వల్లించటం తలకు మించిన పని. బోడిగుండుమీద నిమ్మకాయ పెట్టుకుని అది దొర్లకుండా వల్లింపు పూర్తిచేస్తేనే పరీక్ష అయినట్లు, అది నింబ పరీక్ష. మెడకు రెండువైపులా సూదులుతేలిన నారసంచుల్ని కట్టి సామగానం చేయమనేవాడు గురువు. తల కదిలితే సూదులు నేరుగా గొంతులో దిగుతాయి! అది నారస పరీక్ష. గురువు మాట వేదవాక్కుగా సాగిన కాలం అది.

మన పురాణాలు, ఉపనిషత్తులు, చరిత్రల్లోనే కాదు- ప్రపంచవ్యాప్తంగా కూడా గురుప్రసక్తి లేని, గురుప్రశస్తి చేయని సంస్కృతులే లేవు. జార్జి చక్రవర్తి తన కొడుకు 'ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌' చదివే పాఠశాలకు వెళ్ళి కొడుకు ఎలా చదువుతున్నాడో చూడాలని ఉబలాటపడ్డాడు ఒకసారి. చక్రవర్తి వస్తున్నాడని తెలిసి ఆ పాఠాలు చెప్పే పంతులుగారు 'మహాప్రభో! మీరు రావద్ద'ని కబురు చేశాడు. 'ఎందుకయ్యా?' అనడిగితే 'తమరు వస్తే నేను మర్యాదపూర్వకంగా నా తలపాగా తీసి, లేచి నిలబడాలి. ఇంతవరకూ నా విద్యార్థుల దృష్టిలో నేనే పెద్దను. నాకంటే పైన మీరొకరున్నారని తెలిసిపోతే, నా మాట విలువ తగ్గిపోతుంది. అది వారి భవిష్యత్తుకు మంచిది కాదు!' అని విన్నవించుకున్నాట్ట. రాజుగారు మన్నించి అటువైపు వెళ్లటం మానుకున్నారు. అదీ ఆ రోజుల్లో గురువుకిచ్చిన విలువ!

దేవతలకూ గురువున్నాడు బృహస్పతి. రాక్షసులకు శుక్రాచార్యుడు గురువు. మృతసంజీవనీ విద్య అతనికొక్కనికే తెలుసు. కచుడు ఆ తంత్రం తెలుసుకునేందుకే శిష్యరికం చేయటానికి వచ్చి చచ్చి బతికిన కథ మనకు తెలుసు. 'ద్రోణ' పేరుతో గురువులకు ఇవాళ బిరుదులిస్తున్నారు. ఆ ద్రోణాచార్యుడి దగ్గర విలువిద్య నేర్చుకోవాలని తంటాలుపడి భంగపడినా ఆయన పిండి విగ్రహం ముందు పెట్టుకుంటేగాని ఏకలవ్యుడికి ఆ శాస్త్రరహస్యం పట్టుబడలేదు.

బలి అమాయకంగా వామనుడి రూపంలో వచ్చిన విష్ణువుకు సర్వం ధారబోసే ప్రయత్నంలో ఉండగా, శిష్యవాత్సల్యంతో అడ్డుపడి కన్నుపోగొట్టుకున్నాడు గురువు శుక్రాచార్యుడు.

 

గురుస్థానం అంత గొప్పది కనకనే మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం దేశాధ్యక్షుడి పదవికన్నా బడిపిల్లలకు పాఠాలు చెప్పటానికే ఎక్కువ మక్కువ చూపుతున్నాడు. ఓ తమిళ పత్రికలో బాలలకు ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో ఓ చిన్నారి 'చిన్నతనంలో మీరు చాలా కష్టాలు పడి ఓ పెద్ద శాస్త్రవేత్త, ఉపాధ్యాయుడు, రాష్ట్రపతి అయ్యారుగదా! మీ విజయానికి కారణం అదృష్టమా?' అని అడిగితే 'అవును. చిన్నతనంలో నాకు మంచి దారిచూపించే ఉపాధ్యాయులు దొరికిన అదృష్టం' అని బదులిచ్చాడు కలాం. అలాంటి గురువుకి నేటి మన సినిమాల్లో పడుతున్న గతిని చూస్తుంటే దిగులు కలుగుతుంది.

'గురువు' అంటే గుండ్రాయి కాదు అంటాడు ఓ సినిమా కవి. కాదు గుండ్రాయే! మనిషి అజ్ఞానాన్ని, మొండితనాన్ని చితక్కొట్టే గుండ్రాయే నిజమైన గురువు. తాను ఆనాడు 'గోడకుర్చీ' వేయించాడు గనకే మనమీనాడు ఓ 'కుర్చీ'లో కూర్చుని గొప్పగా పనిచేసుకోగలుగుతున్నాం.

 గురువులు అష్టవిధాలు.

అక్షరాభ్యాసం చేయించినవాడు,

గాయత్రి ఉపదేశించినవాడు,

వేదాధ్యయనం చేయించినవాడు,

శాస్త్రజ్ఞానం తెలియజెప్పేవాడు,

పురోగతి కోరేవాడు,

మతాది సంప్రదాయాన్ని నేర్పించేవాడు,

మహేంద్రజాలాన్ని విడమరిచి చెప్పేవాడు,

మోక్షమార్గాన్ని చూపించేవాడు

అని పురాణజ్ఞానం తెలియజేస్తున్నా వాటిని పట్టించుకొనే శిష్యులు ఇప్పుడు లేరు. గురువుకు నామాలు పెట్టే శిష్యులు తయారవుతున్నారు.

దొంగలపాలు కానిది, దొడ్డకీర్తిని తెచ్చేది, పరమ సౌఖ్యానిచ్చేది, భద్రతనిచ్చేది, యాచకులకిచ్చినా రవంత తరగనిది, గొప్ప నిధి అయిన జ్ఞానాన్ని ఇచ్చే గురువును లఘువు చేయకుండా ఉంటేనే ఏ జాతికైనా మేలు జరిగేది.

(ఈనాడు, 05-09-2009)

 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...