Showing posts with label Personalities. Show all posts
Showing posts with label Personalities. Show all posts

Wednesday, February 2, 2022

బాపూజీనే మళ్లీ బతికిరావాలా?- వ్యాసం సూర్య - 02 - 10-2019 - కర్లపాలెం హనుమంతరావు





బాపూజీనే మళ్లీ బతికిరావాలా?

-కర్లపాలెం హనుమంతరావు

తెలిసీ తిలియకుండా రాజకీయ అవసరాల కోసం ఇటీవల అమెరికన్ అధ్యక్షుడు భారతదేశ ప్రధాని మోదీజీని 'జాతిపితఅంటూ ప్రశంసించాడు. భరతీయుల నిజమైన జాతిపిత మోహన్ దాస్ కరం చంద్ గాంధీ. శతాబ్దాల బట్టీ  స్వతంత్ర జీవనం కోసం ఆరాట పడి ఎన్నో రాకాలుగా పోరాటాలు చేసిన  భారతీయుల ఆంకాక్షలను అఖరికి  వాస్తవం చేసిన మహాయోధుడు గాంధీజీ. మొదటి సారి నోబెల్ గ్రహీత  ఠాగోర్జీ నోటి నుంచి వినిపించిన వేళా విశేషం.. 'మహాత్మాఅన్న ఆ పిలుపు బాపూజీకి పర్యాయపదంగా స్థిరపడింది! ప్రపంచ నేతల చరిత్రల పరంగా చూస్తే ఇదో అపురూపమైన విచిత్రం.  1869 అక్టోబర్ నాడు గుజరాత్  పోరుబందర్‌లో జన్మించినప్పటి నుంచి  1948 జనవరి 30న హత్యకు గురైన క్షణం వరకు గాంధీజీ జీవితంలోని ప్రతీ ఘట్టంలోనూ ఒక హాలివుడ్ చిత్రం సూపర్ హిట్ ఫార్ములాకి సరితూగే స్థాయి నాటకీయత ఉంది. కాబట్టే అటెన్ బరో 'గాంధీపేరుతో శ్రమించి తీసిన మూవీ అన్నేసి ఆస్కార్ అవార్డుల పంట పండించుకుంది. 

 

'నా జీవితమే నా సందేశంఅన్న  కర్మయోగి మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ. ఆయన నీతి నిజాయితీలతో కూడిన  సత్య నిబద్ధ జీవితం నిజానికి దేశ ప్రజలతో మమేకమై జీవిస్తున్నట్లు  చెప్పుకునే  ప్రజానేతలందరికీ ఆదర్శం కావాలి. క్షేత్ర స్థాయి వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉండడం ఆందోళన కలిగించే అంశం.   

సత్యాగ్రహం అనగానే ముందుగా నేటి తరానికైనా కళ్ల ముందు కదలాడే మూర్తి  కరెన్సీ నోటు పైన బోసి నవ్వులు చిందిస్తూ దర్శనమిచ్చే బాపూజీ  ప్రొఫైల్.  సత్యాగ్రహాన్ని మించిన  పదునైన ఆయుధం మరొకటి లేదని  ఓ సందర్భంలో బాపూజీ అంటారు.    ఆయుధం బాపూజీ చేతికి  అందేనాటికే ఆంగ్లంలో 'సివిల్ డిజ్ ఒబీడియన్స్'  గా ప్రసిద్ధం. హిందూ వలస జాతులకు వత్తాసు వకీలుగా బాపూజీ వెళ్లే నాటికి దక్షిణాఫ్రికాలో   ఫస్ట్ క్లాస్ టికెట్ ఉన్నా.. తెల్లవాళ్లతో సమానంగా  విలాసవంతమైన బోగీలలో  ప్రయాణించడం నిషిద్ధం. రైలు బోగీ నుంచి కిందకు తోసివేసినప్పుడు సాటి వలస జీవులకు మల్లే   గాంధీజీ కూడా తలొంచుకుని వెళ్ళిపోయి ఉంటే ఇంత కథ ఉండేదే కాదు. తల్లి దండ్రుల ద్వారా అబ్బిన ఆత్మ సమ్మాన బుద్ధి  గాంధీజీని కుదురుగా ఉండనిచ్చింది కాదు. ఈ తరహా వివక్ష రాక్షసి అంతమయ్యే వరకూ పోరాడలన్న సంకల్పం   ఆ సందర్భంలో  గాంధీజీలో పురిగొల్పిన ప్రముఖుడు   రచయిత 'టాల్ స్టాయ్'. ఆ రచయిత వ్యాసంలోని 'సివిల్ డిజ్ ఒబీడియన్స్'   బాపూజీ చేతిలో సత్యాగ్రహ ఆయుధంగా మారి మరింత పదునెక్కింది తదనంతర కాలంలో. ఆనాటికి సూర్యుడు అస్తమించని  సామ్రాజ్యంగా ప్రసిద్ధి చెందిన బ్రిటిష్ సామ్రాజ్యంలో సైతం చీకట్లు కమ్మునేటంత దుమారం సృష్టించింది.  ఆ సత్యాగ్రహాయుధం  ధర్మ సూత్రం గురించి వివరించే సందర్భంలోనే తన పుస్తకంలో ఒక చోట బాపూజీ అంటారూ-         ప్రజాస్వామ్యం అనే అభిలాష  ఇంకెవరో వచ్చి  బలవంతాన రుద్దితే రగిలే స్ఫూర్తి కాదు.  స్వీయ వ్యక్తిత్వం  సంస్కరించుకునే అవసరం స్వయంగా గుర్తించి.. ఆ దిశగా ఆచరణాత్మకమైన కృషి కొనసాగించాలన్న సంకల్పం దృఢంగా అచరణలో పెట్టినప్పుడే కాలక్రమేణా దాని వికాస ఫలాలు అనుభవానికి వచ్చేవిఅని. ప్రస్తుతం కంటి ముందు నడిచే రాజకీయాలలో పదే పదే ప్రజాస్వామ్యం అనే పదం రామకోటికి మించి  మారుమోగుతున్నది. అయినా  ప్రత్యక్షంగా ప్రజల భాగస్వామ్యం నేతి బీరకాయలోని నేయి చందంలా మాత్రమే బులిపిస్తున్నది.  బాపూజీని జాతిపితగా చెప్పుకుంటో  నూట యాభై సంవత్సరాల  ఉత్సవాలు ఘనంగా జరిపించే ఉత్సాహంలో ఉన్న ప్రజా నేతలలో ఏ ఒక్కరికైనా  మరి సత్యాగ్రహ ఆయుధం ప్రయోగించాలనే  ఆలోచన రావడం లేదు! అదే విచారిచదగ్గ  విచిత్రం!

'చెడును నిర్మూలించే లక్ష్యంతో ఆయుధాలు చేపట్టడంలో తనకెప్పుడూ  వ్యతిరేకత లేదని బాపూజీనే స్వయంగా చెప్పుకొచ్చారు కదా చాలా సందర్భాలలో! అయితే ఆ చేపట్టిన ఆయుధం కారణంగా ఏ పక్షమూ రక్తం చిందించరాదు- అన్నదే జాతిపిత అభిమతం.  బొట్టు నెత్తురు నేల రాలకుండా శతాబ్దాల పాటు దేశాన్ని ఏలిన బ్రిటిష్ పాలకులను నిశ్శబ్దంగా సరిహద్దుల కావలకు నెట్టివేసి మరీ  అహింసా పోరాటం సాగించే పద్ధతులను ప్రపంచానికి ప్రదర్శించి చూపించిన ప్రయోగశీలి మహాత్మా గాంధీ. సుందరాంగుల ముక్కులుముఖాల మీద మోజుతో యుద్ధాలకు తెగబడి వేలాది అమాయకులను బలవంతంగా యుద్ధ రంగాల రొంపిలోకి దింపి అపారమైన ప్రాణఆస్తి నష్టాలు కలిగించడమే యుద్ధాలుగా  చదువుకున్నది ప్రపంచ చరిత్ర అప్పటి వరకు. చేతి కర్రకిర్రు చెప్పులుకొల్లాయి ధోతీబొడ్డు గడియారం,  బోసి నవ్వులనే ఆయుధాలతో కూడా  ఎంతో బలవంతుడైన విరోధిని ప్రేమతో నిరోధించవచ్చు. లాలించి లొంగదీయవచ్చని బాపూజీ ప్రదర్శించిన 'అహింసా పోరాటంచాటి చెప్పే పాఠం. ప్రపంచ చరిత్రలోని ఈ కొత్త సిలబస్  వంట బట్టించుకున్న తరువాతే  మార్టిన్ లూథర్ కింగ్ వంటి పోరాట యోధులు తమ జాతి హక్కులను అహింసాయుతంగా సాధించుకోగలిగింది. ప్రపంచం ముందు తెలెత్తుకుని బాపూజీ సగర్వంగా  నిలబెట్టిన ఆ భారతీయ అహింసా యోధ మూర్తిత్వానికి   ప్రస్తుతం కాశ్మీరం నుంచి కన్యాకుమారం వరకు సాగుతున్న హింస రచన   కళంకం తెచ్చెపెట్టే అంశం కాడం బాధాకరం. బతికివుండుంటే బాపూజీని సైతం ఎంతో    కలవరానికి గురిచేసే  అంశమయివుండేది ఖచ్చితంగాఇది.   సందర్భం వచ్చిన ప్రతీ సారీ ఐక్యరాజ్య సమితి వేదిక  నుంచి అనకాపల్లి సందు వరకు బాపూజీ భజన చేయడం మరిచిపోని మన ప్రజానేతలు మరి ఈ అహింస అనే ఆయుధాన్ని ఎందుకు అశ్వత్థామ వృక్షం ఎక్కించేసినట్లో?! ఆ అయుధం కిందికి దిగడానికి ఇంకా ఎన్ని గో గ్రహణాలు జాతి అనుభవించవలసివుందో?

ఆత్మాభిమానంగౌరవం వేరెవరో వచ్చి పరిరక్షించే శీల సంపదలు కావు కదా! 'చరిత్రలో చిరస్థాయిగా నిలబడాలన్న కాంక్ష ఉంటే  ముందుగా ఆత్మ సమ్మానాన్ని కాపాడుకోవాలిఆన్న బాపూజీ సూక్తి మీద ఆసక్తి గల ప్రజానేతలు ఎంత మంది మిగిలున్నారు ఇప్పుడు?   బి-ఫారం ఇచ్చి,  నిధులిచ్చి,  గెలించేందుకు అహర్నిశలు అంతులేని కృషి చేసిన సొంత పార్టీలకే నామాలు పెట్టేసి అధికారంవ్యాపారం వంటి వ్యక్తిగత లాభాపేక్షల నిమిత్తం గెలిచిన మరు క్షణమే పాలక పార్టీలలోకి దూకే ప్రజాప్రతినిధుల పట్లే  ఎక్కువగా ప్రజలూ ఆకర్షితులవుతున్నారిప్పుడు!అక్టోబరు రెండుకోజనవరి ముఫ్ఫైకో  బాపూజీ గుణగణాలను శ్లాఘిస్తూ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తే సరి.. ఓ పనయిపోతుందనే భావనే సర్వే సర్వత్రా. బిర్లా భవన్ ప్రాంగణంలో ప్రాణాలు గాలిలో కలిసే ముందు బాపూజీ 'హే! రామ్!అని ఆక్రోశించినట్లు ఆ సమయంలో  దగ్గరగా ఉన్నవారు చెబుతుంటారు. ఆ మహాత్ముడి ఆక్రోశానికి  కేవలం తనపై జరిగిన అఘాయిత్యం ఒక్కటే కారణం కాదేమో భావి భారత దేశ రాజకీయ దివాళాకోరుతునం ముందే ఊహించి 'హే రామ్!అని ఆక్రోశించలేదు కదా మహాత్ముడు?

'ఆచరణ కష్టమని మూలసూత్రాలను విడిచిపెట్టరాదు. ఓర్పుతో అయినా  వాటిని పాటించాలి' అన్నది  నోటి మాటగానే కాదు.. తన జీవితం ద్వారా కూడా  ఆచరించి చూపించిన నిజాయితీ బాపూజీది. మేక పాల పానం నుంచిమద్యపాన నిషేధం  వరకూ ఏ పని పట్లా ఆయనకు నీచభావన లేదు.  నేటి నేతల నోటి మాటలకు భిన్నంగా బాపూజీ  పాయిఖానాల క్షాళన పట్లా హేళన ప్రదర్శించిందిలేదు. ఆయన అడుగు జాడలలోనే తమ నడక సాగుతున్నదని నమ్మబలికే నేతలు ఆచరణ సాధ్యం కావని తెలిసే ఎన్నికలలో ఓట్లు దండుకొనే దురుద్దేశంతో  అసాధ్యమైన హామీలు అనేకం  అమాయకులపై గుప్పిస్తున్నారు.    ప్రజాస్వామ్యం పేరిట సాగే రకరకాల రొటీన్ పేరంటాల పట్ల  ఆఖరికి ప్రజల హక్కుల కోసమని పనిచేస్తున్నామని చెప్పుకునే  స్వచ్ఛంద సంస్థలు సైతం  కిమ్మిన్నాస్తి!    మరో మారు నిజమైన సత్యాగ్రహ సమరంతో దేశం  మారుమోగాలంటే మళ్లీ మహాత్ముడు వస్తే మినహా  సాధ్యం కానంత మందగొడితనం దేశమంతటా దట్టంగా అలుముకుని ఉన్న నేపథ్యంలో బాపూజీ నూట యాభై సంవత్సరాల జన్మదిన సందర్భం తటస్థించింది.   తటపటాయింపులేవీ లేకుండా జాతిపిత  జీవితాన్నే పరమాదర్శంగా తీసుకోక తప్పని దుస్థితి ప్రస్తుతం సమాజం అంతటా నెలకొని ఉంది. ప్రజాక్షేత్రంలోని ప్రతీ వ్యక్తీ   ప్రతి అడుగులోనో మహాత్ముని ప్రవచనాలను  గుర్తుంచుకుని నడిస్తేనే తప్ప  ప్రస్తుతం  దేశం ఎదుర్కొనే గడ్డు సమస్యల నుండి గట్టెక్కే పరిస్థితిలేదు. 

'కంటికి కన్నుసిద్ధాంతంతో  ప్రపంచాన్ని మరంత అంధకారంలోకి నెట్టివేసేందుకు తప్ప సాధించే మరో ప్రయోజనం లేదు. సుదీర్ఘంగా సాగిన రెండు ప్రపంచ యుద్ధాల వల్ల విశ్వవ్యాప్తంగా  వాతావరణం ఏమైనా చల్లబడిందాఓటుసత్యాగ్రహం- ఈ రెండూ ప్రజాస్వామ్యంలో ప్రజల చేతిలో ఉండే  ఆయుధాలు-అంటారు బాపూజీ! వాటి వినియోగాన్ని బట్టే ప్రజల  ఆలనా పాలనా సమర్థంగా సాగేది అని  మొదటి నుంచి గాంధీజీ గట్టి నమ్మిక. ఓటును ఓ కొనుగోలు సరుకుగా మార్చి చేజిక్కించుకోడమే కాదు.. దేశానికి స్వాత్రంత్ర్యం సాధించిపెట్టిన  సత్యాగ్రహ ఆయుదాన్ని సైతం.. ప్రస్తుతం దుష్ట రాజకీయం  ఆడే నాటకంలో ఓ అంకం ప్రాపర్టీగా మార్చివేసిన మాయాజాలం నేటి రాజకీయానిది. పాలకులను అదిలించే ఆయుధాలు రెండూ వట్టి పోవడం దురదృష్టం. బాపూజీ తిరిగి వచ్చినా ఈ పరిస్థితి ఓ పట్టాన చక్కబడేనా  అన్నది అనుమానమే!

 

భారతావని  వేలాది సంవత్సరాల పాటు పరాయి పాలకులకు ఊడిగం చేయవలసి వచ్చింది. బిడ్డల అంతర్గత కుమ్ములాటలే భరతమ్మ పారతంత్ర్యానికి  మూల కారణంగా మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ మొదటి నుంచి నమ్ముతూ వచ్చారు. మళ్లీ కులాలుగా, మతాలుగా, పార్టీలుగా, వర్గాలుగా, ప్రాంతాలుగా మనలో మనం కలహించుకుంటూ   కలసి మెలసి సాధించుకున్న స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను తిరిగి పరాయి పంచలపాలుచేసే పరిస్థితికి తెచ్చుకుంటున్నాంఇటీవల అమెరికన్ అధ్యక్ష మహాశయుడు ట్రంప్ అమెరికాలో హౌడీ-మోడీ కార్యక్రమ సందర్భంగా స్వంత రాజకీయ లబ్ది కోసం చిలకరించిన కాస్తింత  లాలింపు పన్నీరు జల్లులకే మనం  పులకరించిపోవడం బతికి వుంటే బాపూజీని బాధించే అంశం అయివుండేదే!    

స్వాతంత్ర్యం సాధించుకొన్న నలభైల నాటి తరం ఇప్పుడేమంత ఉనికిలో లేదు. పుట్టుకతోనే  ఆయాచితంగా దక్కిన కారణంగా  స్వేచ్ఛాయుత జీవితం ఎంత అమూల్యమైనదో నేటి తరాలకు తెలిసే అవకాశం లేదు. అందుకే ఇప్పటి కుర్రకారు దృష్టిలో బాపూజీ అంటే కేవలం అటెన్ బరో తీసిన  చిత్రంలో కిన్ బెన్స్ లే వేసిన కథానాయిక పాత్ర. అదీ తెలియని మరీ కుర్ర తరానికి ఆ బోసినవ్వుల తాతయ్యంటే రూపాయి నోట్ల మీద కనిపించే ఓ గ్రాఫిక్ బొమ్మ.

 

   మార్పుకు సిద్ధంగా ఉన్నప్పుడే  కొత్త బంగారు లోకం గురించి స్వప్నించే అర్హత సిద్ధించేదని సిద్ధాంతరీకరించిన  నిత్య చైతన్యశీలి మహాత్మాగాంధీ. కుటీర పరిశ్రమలుగ్రామస్వరాజ్యంస్వదేశీ వస్తు ఉద్యమంనిరాడంబర జీవన శైలిదేశవాళీ వైద్య విధానంస్వచ్ఛంద బ్రహ్మచర్యంరామ్ రహీమ్ లిద్దరినీ సమాన దృష్టితో కొలిచే తీరుబలహీనుల పట్ల అనురాగంస్త్రీల పట్ల ప్రత్యేక గౌరవ ప్రపత్తులుసమాజంలోని అన్ని తరగతులూ సామరస్య భావనతోసహజీవనం కొనసాగించడంనిత్య జీవితానికి అక్కరకొచ్చే ఏ పని పట్లా ఉపేక్ష వహించకపోవడంవృత్తులతో నిమిత్తం లేకుండా అన్ని కులాలనుజాతులను  సోదరవర్గంలో చేర్చుకోవడంముఖ్యంగా దిగువ తరగతుల పట్ల సమాదరణ, స్త్రీల పట్ల సమ్మనభావన, సనాతన ధర్మం పట్ల నిరసన లేని విశాల దృక్పథంతో నవీన సంస్కృతలను మనసారా ఆహ్వానించడంఅన్ని భాషల పట్ల ఒకే తరహా ఆదరణప్రజల పలుకుతో ప్రత్యేక అనుభంధం ఏర్పరుచుకోవడం.. 'సత్యంతో నా ప్రయోగాలుపేరిట బాపూజీ రాసుకున్న 'ఆత్మకథనిండా ఈ తరహా  నిత్య స్వచ్ఛ జీవన శైలికి సంబంధించిన ఎన్నో అంశాలు చదువరులలో ఉత్కంఠ రేకెత్తించే తీరులో ప్రతి పుటలో  కనిపిస్తాయి. తన జీవితంలోని    ఎత్తు పల్లాలనువెలుగు నీడలను  ప్రపంచం ముందు తెరిచిన పుస్తకంలా బాపూజీ పరిచిన తీరు ప్రపంచంలోని మరే ఇతర ప్రముఖ వ్యక్తీ ఊహలో అయినా ప్రదర్శిచలేనంత సాహసపూరితమైనది. బాపూజీ వారసులుగా ప్రజల ముందుకు వచ్చి ప్రజానేతలుగా వ్యవహరించే నేటి నాయకులలో మచ్చుకకైనా ఒక్క మహాత్ముని మంచి లక్షణం కనిపించక పోవడం దేశప్రజలు చేసుకున్న దురదృష్టం. 

రాజకీయాలే కాదు.. సామాజిక జీవన సరళీ బాపూజీ బోధించిన బాట నుంచి క్ర్రమక్రమంగా  దూరంగా జరగడం కలవరం కలిగించే అంశం. 

పాముకాటు శరీరానికి చేసే హానికి కన్నా మద్యపానం ఆత్మకు కలిగించే నష్టం ఎక్కువ-అంటారు బాపూజీ. కనీసం ఆ జాతిపిత మాట మీద గౌరవం చూపించాలన్న సంస్కారం లోపించడం వల్లే గాంధీజీ జయంతివర్ధంతుల రోజులలో కూడా మత్తు పదార్థాల వినియోగాల రేటు తగ్గడం  లేదు! పుస్తక పఠనం కాదు..  మనిషిలోని ఉత్తమ వ్యక్తిత్వాన్ని వెలికితీయడమే అసలైన విద్య  లక్ష్యం- అన్నది బాపూజీకి విద్య మీద ఉన్న అభిప్రాయం.  ఆలోచనఆచరణా క్రమబద్ధంగా లేని పక్షంలో ఎన్ని విద్యలు నేర్చినా ఆ నైపుణ్యమంతా వృథానే కదా! 'మానవతను మించిన మంచి పుస్తకం మరొకటి లేదుఅన్న బాపూజీ సూక్తి చెవిన పెడుతున్నదెవరు విద్య వ్యాపారంగా మూడు పువ్వులు, ఆరు కాయలు పూయించే ఈ కాలంలో? 

 

 

'ప్రేమ  అన్నిటి కన్నా అత్యంత శక్తివంతమైనది.    శక్తి ముందు సాక్షాత్ భగవంతుడైనా  చేతులెత్తేయవలసిందే!అని ఉవాచించే బాపూజీ భావనలో ఆధ్యాత్మికత మీద కన్నా ఆత్మీయత వైపే తూగు ఎక్కువ కనిపిస్తుంది.   పెదాలపైన చిరునవ్వులు ధరించకుండా వంటికి ఎన్ని విలువైన దుస్తులు వేలాడదీసినా ఆ అలంకరణ రాణించేది కాదు-అన్నాడు అర్థ నగ్న యోగి బాపూజీ. బ్రిటిష్ మాజీ ప్రధాని విన్ స్టన్ చర్చిల్ 'హాఫ్ నేకెడ్ పకీర్గా హమేశా ఎద్దేవా చేసిన మహాత్మాగాంధీ ఆ కొల్లాయి ధోతీ బిగించి సబర్మతీ ఆశ్రమం నుంచి కాలు  బైట పెడితే  చాలు.. ఆసేతు హిమాచల పర్యంతం ఆనంద పరవశమై అభిమానంతో చిందులుఉ వేసే పరిస్థితి. ప్రపంచం నలుమూలలకు సుపరిచితుడైన ప్రఖ్యాత హాస్యనటుడు ఛార్లీ చాప్లిన్ సైతం ఒక సందర్భంలో 'తాను గాంధీజీ గ్లామర్ చూసి అసూయ చెందుతున్న'ట్లు ప్రకటించుకున్నాడు.   అన్ని కళల కన్నా జీవితం గొప్ప కళ. సౌజన్యంతో జీవించే వ్యక్తి కన్నా గొప్ప కళాకారుడు లేడని బాపూజీ విశ్వాసం. ఆ లెక్కన చూస్తే మహాత్మా గాంధీ తరువాతే ఎంతటి మెగా హాలివుడ్కథానాయకుడైనా!  

బాపూజీ దృష్టిలో ప్రార్థన   పరమార్థం హృదయ శోధన. అనుభూతికి తప్ప లొంగని ఏ అదృశ్య శక్తి ఆశీస్సులు లేకుండా ఎంత గొప్ప కార్యమైనా సంపూర్ణంగా విజయవంతం కాలేదన్నది గాంధీజీ భావన. ఆ కనిపించని శక్తి మహిమే వెనక ఉండి తనను ఎల్లవేళలా సన్మార్గం నుంచి తూలకుండా కాపాడుతూ వచ్చిందని బాపూజీ తన సందర్శనార్థం వచ్చిన వారితో సందర్భం తటస్థించిన ప్రతీ సారీ చెప్పుకొస్తుండేవారు. 

 

ఆయా సందర్భాలలో  స్పందించిన తీరును ఒక క్రమ పద్ధతిలో గమనించ గలిగితే బాపూజీ సంపూర్ణ వ్యక్తిత్వంలోని కొంత భాగాన్ని మనం పట్టుకోవచ్చు. కైరా సత్యాగ్రహం పాక్షికంగా మాత్రమే విజయవంతమైన సమయంలో ప్రజల సంతోష సంబరాలను చూసి గాంధీజీ   'సంపూర్ణ విజయ లక్షణాలు లోపించడం  నాకు బాధ కలిగిస్తున్నది' అని బాహాటంగానే తన అసంతృప్తిని  బైటపెడతారు. రిలే నిరాహార దీక్షల వంకతో నాలుగేసి గంటల పాటు  నిరసనల నాటకం  నడిపించేసి లక్ష్యం నేరవేరినట్లు ఆనక  విజయయాత్రలు భారీ ఎత్తున నిర్వహించే  నేటి తరం నాయకులను చూసి మరి బాపూజీ బతికుంటే ఏ విధంగా స్పందిస్తారో!

రౌలత్ చట్టం ఆచరణలోకి వచ్చిన తరువాత ఢిల్లీలో అశాంతి నెలకొన్నది.   బాపూజీ బోధనలు ఆలకించైనా  జనం కాస్త చల్లబడతారేమో అన్న ఆశతో అక్కడి ప్రాంతీయ నేతలు గాంధీజీని ఢిల్లీ పిలిపించుకుంటారు. జాతినేతగా అప్పటికే బాపూజీకి జనంలో  గొప్ప గుర్తింపే ఉంది. సెక్యూరిటీకి విఘాతంవంకతో  రైలు దిగీ దిగగానే గాంధీజీని అరెస్టు చేసేందుకు సిద్ధంగా ఉన్న పోలీసు సిబ్బందితో  'నేనిక్కడకు వచ్చింది శాంతి భద్రతలు తిరిగి సాధించుకోవడం కోసం.  అశాంతి జ్వాలలను మరింత ఎగదోయడం  కోసం కాదుఅంటారు. అకారణంగా కక్షలు రేకెత్తించి ఆ కార్పణ్యాల మధ్య తమ పబ్బం గడుపుకునేందుకు చూసే కుళ్లు రాజకీయాలకే ప్రస్తుతం చెల్లుబాటు. 

 బాపూజీ బోసి నోటితో చేసిన వ్యాఖ్య  జనం మధ్య తిరిగే  ప్రజానేత  బాధ్యత ఎంత సున్నితమైనదో చెప్పకనే చెబుతుంది. సీనియారిటీని ఓ అనర్హతగా ప్రకటించి  పక్కన పెట్టే నేటి రాజకీయాలలో  బోసి నవ్వుల తాతయ్య బోధనలు ఆకాశవాణి సంస్కృతం  వార్తలకు మించి విలువిస్తుందా నేతాగణం? ఎవరిని తమకు ప్రతినిధులుగా ఎన్నుకొనాలోనన్న విషయంలో ఏడు దశాబ్దాలు దాటినా జనావళిలో ఓ స్పష్టత రాకపోవడం రామరాజ్యం గురించి కలలు కన్న బాపూజీకి బాధ కలిగించే అంశం కాదా? 

నాగపూర్ జాతీయ కాంగ్రెస్ మహాసభల వేదిక మీద నుంచి నియంత పోకడల వల్ల పజాస్వామ్యానికి  ఏర్పదే పెను ప్రమాదం గుర్తించమని గాంధీజీ హెచ్చరించారు. 'స్వీయాభిప్రాయాలను ఇతరులపై బలవంతంగా రుద్దడం వల్ల   నిజమైన స్వాతంత్ర్యం సాధించుకొనే అర్హత కోల్పోతామన్న ఆ హెచ్చరికకు పూర్తి విరుద్ధంగా ప్రతిపక్షం పొడే గిట్టనంత అసహనం అధికార పక్షాలలో విశ్వరూపం దాలుస్తున్నది రోజు రోజుకీమహాత్ముడే మళ్లీ ఏ వామనావతారమూర్తిగానో దిగి వచ్చి నియంత బలి మాడును పాతాళానికి అణగదొక్కితే తప్ప సాగే ప్రజాస్వామ్య క్రతువు సలక్షణంగా సంపూర్ణమయే పరిస్థితి కనిపించడంలేదిప్పుడు.  

ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‍స్టీన్ అచ్చెరువొందినట్లు 'ఇటువంటి ఒక వ్యక్తి భూమ్మీద నిజంగానే పుట్టి మన మధ్య సంచరించాడా?' అనే అనుమానం మరింత పెరగక తప్పదు మహాత్ముని జీవితం తరచి చూసే కొద్దీ! బాపూజీ భావనలలోని మన్నికమిగతా నేతలంతా యధాతధంగా వాటిని అనుసరించక తప్పని ఆవశ్యకతను గురించి వక్కాణించే సందర్భంలో మరో హక్కుల నేత మార్టిన లూధర్ కింగ్ చెప్పిన ఒకే ఒక్క ముక్కలో మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ మూర్తిత్వం మొత్తం కళ్ల ముందు కనబడుతుంది. 'కోరుకొన్నదాని కోసం అహింస దారిలో పయత్నించడంఅన్యాయం అని తోచినప్పుడు సాయమందించేందుకునిరాకరించడం యేసు సూచించిన బాట. ఆ బాటలో ఎలా సాగి లక్ష్యం సాధించాలో మొదటి సారి  స్వయంగా నడిచి ప్రపంచానికి చూపించిన ఘనత మహాత్మా గాంధీది.' అన్న నీలిజాతుల హక్కుల నేత మాటలు నూటికి నూరు పాళ్లు నిజం. 

'కొల్లాయి గట్టితేనేమి.. మా గాంధి కోమటై పుట్టితేనేమిఅని   బసవరాజు అప్పారావు అప్పారావు పాట కట్టిన తీరును తప్పు పట్టవచ్చునేమో కాని..  ఆ పాటలో బాపూ నడిచి చూపించిన బాటను ఎవరం ఈ నాటికీతప్పు పట్టలేం. ప్రపంచమంతా గౌరవించి నెత్తిన పెట్టుకుంటున్న బాపూజీ భావజాలాన్ని.. పుట్టిన దేశంలోని పాలనాసామాజిక వ్యవస్థలు పూర్తిగా పక్కన పెట్టేయడమే బాధాకరం. పెరటి చెట్టు మందుకు పనికి రాదన్న సామెతను నిజం చేస్తే ముందు నష్టపోయేది మనమే సుమా! గాంధీజీ జన్మించి ఈ 2019, అక్టోబర్ నాటికి  నూటయాభై ఏళ్లునిండుతున్నాయి.  ఆ మహాత్ముడి జీవన విధానంఆలోచనా ధారఆచరణ మార్గాల పరంగా పునర్విమర్శ చేసుకోవలసిన అవసరం మునుపటి కన్నా మరింత పెరిగిందనే సత్యం మనం జీర్ణించుకోక తప్పదు.   బాపూజీ భావజాలం నేటి సాంకేతిక యుగానికి అనువుగా ఎలా మలుచుకోవాలో ఒక చర్చగా అయినా తక్షణమే ఆరంభమవడం భరతజాతికి అన్నివిధాలా  మేలు. లేని పక్షంలో  హక్కుల సాధన పట్ల తప్ప బాధ్యతల నిర్వహణ పైన బొత్తిగా శ్రద్ధ చూపని నేటి సమాజం పోకడలను చక్కదిద్దడానికైనా  బాపూజీ పుడమి పైకి తిరిగి రావడమొక్కటే చివరికి మిగిలే దారి- అనిపించక మానదు!

- కర్లపాలెం హనుమంతరావు 

( సూర్య- దినపత్రిక - 02 -10 - 2019 - ప్రచురితం ) 

***

 

***

 

 

 

Wednesday, December 29, 2021

చార్లెస్ ఫిలిప్ బ్రౌన్


 



చార్లెస్ ఫిలిప్ బ్రౌన్


( జననం : నవంబరు 10, 1788)


నూరార్లు లెక్క చేయక

పేర్లెక్కిన విబుధ వరుల బిలిపించుచు వే

మార్లర్థ మిచ్చు వితరణి 

చార్లెసు ఫీలిప్సు బ్రౌను సాహెబు కరుణన్.


ఎవరయ్యా ఈ చార్లెసు ఫిలిప్సు బ్రౌన్ సాహెబు? 


పేర్లెక్కిన విబుధవరులను ఎందుకు పిలిపించేవాడు? అర్థ వితరణం ఎందుకు చేసేవాడట? 


మన దేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ పాలిస్తూ ఉండిన కాలంలో ఆ కుంఫినీ కొలువులో ఉండి కడప, మచిలీపట్నం మొదలైన చోట్ల చాలా సంవత్సరాల పాటు జడ్జీగా  పనిచేసిన ఇంగ్లీషు దొర-  బ్రౌన్. 


ఎందరు దొరలు మన దేశానికి రాలేదు? ఎందరు ఇక్కడ కొలువు చేయలేదు? తమ దేశం కొలువు చేస్తూ మనదేశాన్ని కొల్లగొట్టలేదు? ఐతే ఈ బ్రౌన్ దొర విశేషం ఏమిటి?


ఈ బ్రౌన్ దొర తన దేశాన్ని కొలుస్తూ ఆ కొలువుకు ఏమాత్రమూ భంగం కలగకుండా అంతకంటే ఎక్కువగా తెలుగు దేశపు కొలువు చేశాడు. మనలను కొల్ల గొట్టలేదు సరికదా తన డబ్బే విస్తారంగా మనకోసం వెచ్చించాడు. నిస్వార్థంగా తెలుగు భాష సేవలో, తెలుగు సాహిత్యం ఉద్ధరణకోసం ఎన్నో ఉత్తమ గ్రంథాలను చెదపురుగుల నోట పడకుండా కాపాడాడు. అనేక కావ్యాల వ్రాత ప్రతులను సంపాదించి తప్పుల కుప్పలుగా ఉన్న వాటిని శ్రద్ధగా పరిశీలించి సంస్కరించి ముద్రింపించాడు. తెలుగు ఇంగ్లీషు నిఘంటువును, ఇంగ్లీషు తెలుగు నిఘంటువును కూర్చాడు.  ఈ మహా భాషా సాహిత్య వ్య యానికి ఆయనే మదుపు పెట్టాడు. మదుపు పెట్టిన దానికి ఆయన ఆపేక్షించిన ప్రతిఫలం ఆంధ్రుల విజ్ఞానమూ, వికాసమూను. 


మరి ఆ భాషా సేవలో తనకు సహాయ పడడానికోసమే బ్రౌన్ దొర పేరెక్కిన విబుధ వరులను పిలిపించి తాను పోషించాడు. వేతనాలు ఇచ్చి ఆయన వేమార్లరమిచ్చు వితరణి కూడా. 


కష్టంలో ఉన్న ఒకాయన కొంత పాండిత్యం ఉన్నవాడై ఉండాలికూడా తనకు సహాయం చేయవలసినదిగా బ్రౌన్ దొరగారిని అర్థిస్తూ దొరగారు పండితుడు కనుక ఆయనను కొంచెం మెప్పించినట్లవుతుందని భాగవతం గజేంద్ర మోక్ష ఘట్టంలోని పద్యం వ్రాసి పంపించాడట!


లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్

ఠావుల్ దప్పెను మూర్ఛవచ్చె తనువున్ డస్సెన్ శ్రమం బయ్యెడిన్ నీవే తప్ప ఇతఃపరం బెరుగ మన్నింపన్ దగున్ రావే యీశ్వర కావవే వరద సంరక్షించు దీనునిన్ భద్రాత్మకా


బ్రౌన్ దొర కొంత సొమ్ము ముట్టజెప్పాడట. ఆ వచ్చిన పద్యపు అర్జీమీద పద్యంలోనే ఒక ఎండార్స్ మెంట్  కూడా వ్రాశా డట. ఆ పద్యంకూడ భాగవతంలోనిదే:


ఏను మృతుండ నౌదునని యింత భయంబు మనంబులోపలన్ 

మానుము సంభవంబుగల మానవకోటికి చావు

నిక్కమౌ గాన హరిం దలంపు ఒక గందు జన్మము నీకు ధాత్రిపై

మానవ నాథ పొందెదవు మాధవలోక నివాస సౌఖ్యముల్ .


బ్రౌన్ దొర పండితుడు. పండితాభిమాని, న్యాయమూర్తి. రావణ దమ్మీయ ద్వ్యర్థికావ్యాన్ని రచించిన పిండిప్రోలు లక్ష్మణ కవి మేనల్లునికి ఒక వ్యాజ్యెంలో అన్యాయం జరిగింది. న్యాయాధి కారి లంచం తీసుకొని అన్యాయమైన తీర్పు చెప్పాడు. అప్పుడు రాజమహేంద్రవరంలో జిల్లా జడ్జీగా ఉన్న బ్రౌన్ దొర దగ్గరికి అప్పీలు వచ్చింది. లక్ష్మణ కవి దొరగారిని దర్శించి ఒక పద్యం చెప్పాడు.


మధువైరికిన్ వనమాలికి గౌస్తుభ

హారునకును సంశ్రితావసునకు రాధికా ప్రియునకు రామసోదరునకు 

జగదీశునకు దయాసాగరునకు 

శ్రీ నాథునకును రక్షిత దేవ సమితికి 

బ్రౌఢ భావునకు నారాయణునకు 

నురగేంద్ర తల్పున కరి శంఖ ధరునకు 

దొగల రాయని గేరు మొగము దొరకు 

రణ నిహత దుష్ట రాక్షస రమణునకును 

గాన మోహిత వల్లవీ కాంతునకును

రిపు విదారికి హరికి శ్రీ కృష్ణునకును 

కిల్పిషారికి నే నమస్కృతి యొనర్తు.


శ్రీ కృష్ణునికి నమస్కారం అని చెప్పిన ఈ పద్యం ప్రతి పాదంలోని మొదటి అక్షరాలను వరసగా చదివితే 'మహారాజశ్రీ బ్రౌన్ దొరగారికి' అని అవుతుంది. 


జరిగిన అక్రమాన్ని ఆలకించి న్యాయమూర్తి బ్రౌన్ దొర న్యాయం చేకూర్చాడట.


విదేశీయులు తెలుగు నేర్చుకోవడానికి సహాయపడే తెలుగు వ్యాకరణాన్ని రచించాడు బ్రౌన్. తెలుగు వారికి ఎంతగానో ఉపకరించే తెలుగు ఇంగ్లీషు నిఘంటువును, ఇంగ్లీషు తెలుగు నిఘంటువును తయారు చేశాడు.


బ్రౌన్ దొర అభ్యుదయ వాది. ఛాందస పండితులు పట్టు కొని వ్రేలాడే అర్ధానుస్వార శకట రేఫాలు వాడుక నుండి ఏనాడో నిష్క్రమించిన అర్థరహితమైన సంజ్ఞలు అని ధైర్యంగా చెప్పగలి గాడు. 


ఆయన తరువాత దాదాపు ఒక శతాబ్దానికి కాని గిడుగు రామమూ ర్తి పంతులు గారి కృషి ఫలితంగా వ్యావహారిక భాషకు మన్నన కలుగలేదు. బ్రౌన్ దొర ఏనాడో వ్యావహారిక భాషకు గౌరవం కలగజేశాడు.


బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో పాఠశాలా పరీక్షలలో తరుచు అడుగుతూ ఉండే ప్రశ్న ఒకటి ఉండేది. 

 "బ్రిటిష్ పాలన వలన మనకు కలిగిన లాభములేవి"? అని. 


రైళ్ళు, తపాలా ఆఫీసులు వగైరా ఏవేవో విద్యార్థులు జవాబుగా వ్రాస్తూ ఉండేవారు. 


వాటి మాట ఎలా ఉన్నా బ్రిటిష్ పరిపాలన వలన తెలుగు దేశానికి కలిగిన ఒక పెద్ద ప్రయోజనం..  చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అని నిస్సం దేహంగా చెప్పవచ్చు


- ఎన్. శివనారాయణ

Friday, December 24, 2021

కుమారి మొల్ల - కీ.శే. వారణాసి శ్రీనివాసరావు ( ఆంధ్రపత్రిక- 1948, జనవరి 14 - సంచిక నుంచి ) సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 24-12 - 2012



కుమారి మొల్ల 

- కీ.శే. వారణాసి శ్రీనివాసరావు 

( ఆంధ్రపత్రిక- 1948, జనవరి 14 - సంచిక నుంచి ) 

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

24-12 - 2012 


పూల మొక్కలు ఉన్న తోటలో నొక కాలుపగట్టున కూర్చున్న నన్ను సమీ

పిస్తూ కుమ్మరి మొల్ల—]

ఏం నాయనా , నన్నాహ్వానించారు? 

నేను: తమరు  నమస్కారం మానేసి, ఏకవచనాన్ని  ప్రయోగిస్తేగాని నేనేమీ మాట్లాడాను.


మొల్ల : అదేవిటి మీరు బ్రాహ్మణులు; మేము కుమ్మర్లం . 


అయితే నేమమ్మా? నాకంటే పెద్దలు అన్ని విధాలా


ఐతే మటుకు  కులమెక్కడికిపోతుంది?


మీరు దణ్ణాలు పెడితే అందుకోవడం, పేర్ల చివర రావు తగిలించుకోవడం, మీ చేత బహువచన ప్రయోగాలు  అందుకోవడం అవన్నీ మీ కాలపు వాళ్లకే తగిపోయింది. మేమేదా పాత కాలపువాండ్లం. మూర్ఖప్రపంచ సంబంధీకులం. మా వ్యక్తిత్వాన్నట్లా ఉండనీయండి .


తమ విషయం నాకు ముచ్చటగా వుంది. కాని ఐనా నా పట్ల, ప్రేమ కోరిన చనువును చూపించండి 


సరే, నీకంత పట్టుదలెందుకు? అల్లాగే కాని, నన్ను పిల్చిన కారణమేమి నాయనా ? .


మీ రాంధ్రంలో కవిత్వం చెప్పారు కదా! 


నన్నూ నా కవిత్వాన్నే చెప్పు శాయనా ! ఆంధ్రంలో కవిత్వం చెప్పి నలుగురి మెప్పు పొందుదామని ఆశ పడ్డ  మొదటి స్త్రీ వ్యక్తిని నేనే అనుకుంటా.  అది నాకేం  పొండత్యం ఉండి కవిత్వం చెబుదామని కాదు .  చిన్నప్పుడు నాకు ఎంతసేపూ  చదువు కుందామని పుండేది. మా వృత్తిలో  త్రిప్పడం కోసం మా అమ్మ కుండలిస్తే  రెండు మూడు సార్లు నా చేతుల్లో పగిలిపోయాయ్. ఆది చూచి మా ఆమ్మ తిడుతూంటే , మా వూళ్లో కొక బ్రాహ్మణ పండితుడు కని పెట్టి నాకు చదువు చెప్తా రమ్మని, కొంత కాలంలో పంచకావ్యాలు వంటపట్టించారు. ఆయన గారికి ఆంధ్రం,భారత, భాగవతాలంటే ప్రాణం. వారు రోజూ చదువుతుంటే వినేదాన్ని. కొంతకాలానికి శ్రీ సరస్వతీ కటాక్షం వల్ల నాకు పద్యాలు రాయడం అలవడ్డది . అప్ప ట్నుంచీ యేకథ వ్రాద్దామా  అనుకుని, రామ కథమీదికి మనస్సు ప్రాకితే దాన్ని వ్రాయడ మారంభించి పూర్తి చేసా. అదే నాయనా  నేను వ్రాసిన గ్రంథం. ఆదేమీ గొప్పదేంకాదు . 


చిత్తం. తమరా గ్రంథం విషయంలో పడ్డ ఆశ నెరవేరలేదా ?


నెరవేరకేం? 


అంటే నాకర్దం గాలా! 


అర్థం కావడానికేముంది నాయనా! నేను ఆడదాన్ని, నా కవిత్వ మంతపటుత్వమైందికాదు .


అదేమిటండీ, ఆడవా  చెప్పిన కవిత్వ మని తప్పక మెచ్చుకోవాలే! 





ఆడది కుండ లోముధోకక విశ్వం చెప్పడ వేమిటి యీ మాత్రం పద్యాలు చెప్పక పోతే భాషకేం పరువుతుందాని మా కాలం లో నోగలవాండ్ల ఊహ. నీవన్న భావం మీ కాలంలో ప్రబలినంత మా కాలంలో ప్రజలలో 1: అదేం మ్యాటండీ? నాయకురాలి వీర త్వం పొగడ్త స్కెలా ?


మొ: నాయనా, ఇది కవిత్వంగా, నాయకు కాలీ ఛైన్యకయి - బ్లాగ నా కవిత్వం మగా కృమము లగూర్చోపెట్టేది కాదుగా, నే: పొరబాటన వాళుకురాలి సంగతి కడివా, స్త్రీ కవనాన్ని సున్నితమైన విషయ


ముగా వెంచకపోవడం పౌరుపలోపం. మొ : ఈ భావాల్నేటివి గాని, వాటివి కావు. 1 అంచేత తమకో స్క్ర్కీ డేర లేదన్నమాట!


వీడేరలా. పామరల్లో డొక్క శుద్ధియైన వాం చింతా అభిమానించి మల్లమ్మ కాగా చిక్కని కజనం కెళ్తారని పొగిడేవారి ఆపా X నాకు రుచిస్తుందా నాయనా : ఎవడైనా పండిత


1: ఓహో ! (కొంచెముండి) నా కిప్పుడర్ధ మౌతూంది. ఆదా రపకు నొప్పి కలిగించింది! కొన్ని శతాబ్దాలైనా యింకా మరపు పుట్టిం చంది ! చిత్తం, నాన్ని మరిచి యింత సేపు తరచినందుకు నన్ను క్షమించండి.


మొః అయితే శేం చివర కాశ్య మాడ్చా రచుకోండి. నేటికి లోపించినపుడలా యెందరున్నా "ముల్లా: చే ఇంత తొందరి బడి నిన్నిట్లాగంటిని !" అని నొచ్చు కుంటారను కోండి ఏం లాభం! అవాళలుగుల్లో తిలకంపు ___లైంది కదా!


సే పోనీందమ్మా! ఎవరో ఒక రఇక పోతే మునిగిపోయింకా, ఆంధ్రలోకమంతా ఏకగ్రీవం గా, మొల్ల రామాయణం కారు టుందంటూంటే!


మొ: ఔననుకోండి! ఆ పధలో వసభ్య వాక్యం బుట్టిందా, లేదా? నే: అనకూడదనుకోండి.


మర్నాడు... మొ : ఆC, ప్రొద్దున్న వచ్ళారు: కూర్చ న్నారు: చదువిస్తున్నారు. అన్నిపొవాదులు మరచి సాయంత్రం దాకా కూర్చుని విన్నారు. ఏమైనా ఆడదాన్నని అంత నిరసన చేసారు.


కాలంలో మావాళ్ళు మగాళ్లకు మల్లే పర్వివిష యాల్లో శక్తి మంతుల మని నిరూపించారు. అంక పని మేము చేయలేకపోలా కాలానికి మా కమః సంఘసారానికి కట్టుబడ్డాంకాని, అప్ప కీమాందరు శ్రీ రాక్రమా దేవి ఝాన్సీ och మ్మభాయంటివారు కొంత సాహసించారు...


నే తనురేదో రెండు పేర్లుమాత్రమే చెప్పారు. ప్రపంచచరిత్ర పరిశీలిస్తే పేరో గిన కాంతామణులు కొన్ని వేలమందుటారేమో?! అంతవరకెందుకు? తెల్లాళ్ళ సిద్ధాంతా ల్నిజ ‘మైతే మానససంఘంలో నో ప్రథమం లో సర్వాధి కారు డవాండ్ల దేమో ! తిమరుస్వర్గంలో • ముంటారుకదా! వారిలో పర్వహ • రంటారు. • వాల్లోనే పెద్ద పై నా అడిక్కనం క్కోకపొయ్యారా?


మొ: మీ కీవాం ధుండడం సహజమే కాని ఆ దీడిగడానికొక్క అభ్యంరముఁది, వారంతా పర్వజ్ఞరేగాని వార్లో చెవర్నైనా పలకరించే వీలుందా ? అట్లాటిరేకై నా వార్లో నెవరినై నా కదిలించడంతో లే చిరు నవ్వు నవ్వి మరొక విషయ మెత్తుతారు. నా రెంట సేపటి కీ మానవులు - తమకు భగవంతుడు కటాక్షించిన శక్తిసామర్థ్యా లతో సకలము తెలుసుకొన బ్రయత్నించాలని వుంటుందనుకుంటా. అట్లా లేకుం ప్రేమన కున్న యే కొద్దిపాటు ప్రేమలో పూర్తైం తర్వాత మనకు కాలక్షేపమెటాగా అని ఊహిస్తా దనుకుంటా. ఆటాటివిషయాలు మా కెవరి కైజా తెలిపితే మే మీరోకారికి రాకపోక


మనము అంటూంటాం. (ఆకాశంనుండి) మొల్లా, శచీదేవి గారి


: ఆరురంతో రేచి) వాయశా (నిష్క్రమణ) సే ఆరే! మిగతా వారంతా కొంత తనివి తీక మాట్లాడిజిల్లా రీమెగా రుహశాత్తు గా వెళ్లారు. పోనీ, ఐనా మన మనిగాల్సిన విక చే మున్నాయీ మెను ? పాప మేవో కవిత్వం చెప్పాగుకాని తా మెన్నడు నే విషయంలోనూ ఘనుల మనుకోలా. సరే, యింకా కవులలో నెదరు మిగి లున్నారు. మిగులకేం! చాలామం దున్నారు కాని, పైవారి పంధల పడిచిన వారేగాని వారిలో స్వతంత్రం లెక్టరూ కాన్పిం చరు, మన కాలంలో వారిని కదిలిద్దా మెంటే లాభం లేదు; పైనబడి కరుస్తారు; కొడ్తారు. కూడాను — లేకపోతే పాకిపాడొ వారి లక్ష ణాన్ని గ్రహించి పొడిర్భంపినా చంపుతారు. వీరు మనల్ను ఏదిబడితే అదడి మాత్రంవాడా అని. అకొక నేనెట్టెను కదిలించినట్లవుతుందినేని దొరకదన్న మాట. సరే ఇక చక్రవర్తుల వాప్వోసిద్దాం. ఇంఠతో ఆగుదాం. ఇంకోసారి ఎప్పుడైనా?


( ఆంధ్రపత్రిక- 1948, జనవరి 14 - సంచిక నుంచి ) 

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

24-12 - 2012

బోథెల్‌; యూ. ఎస్.ఎ

Monday, December 13, 2021

తెలుగు సాహిత్యానికి పాశ్చాత్యుల సేవ కర్లపాలెం హనుమంతరావు ( మూలం - భాషా సాహిత్య స్వరూపం - డా॥ జె. చెన్నయ్య )










తెలుగు సాహిత్యానికి పాశ్చాత్యుల సేవ 

కర్లపాలెం హనుమంతరావు 

( మూలం - భాషా సాహిత్య స్వరూపం - డా॥ జె. చెన్నయ్య ) 




బెంజమెన్ షుల్జ్ - తొలి తెలుగు ముద్రాపకుడు


తెలుగులో తొలిసారిగా గ్రంథాన్ని ముద్రించి చరిత్రకెక్కిన బెంజమెన్ షుల్జ్ చిరస్మరణీయుడు. ఇతడు 1689లో జర్మనీలో జన్మించాడు. 1719 × తన 29వ ఏట దక్షిణ భారతదేశం వచ్చాడు. డెన్మార్క్ రాజు ఐదవ ఫ్రెడరిక్ పంపగా జర్మనీ నుంచి దక్షిణ భారతదేశంలోని తరంగంబాడికి క్రైస్తవ మత ప్రచారం కోసం వచ్చిన రెండవ జట్టు ఫాదరీల్లో షుల్జ్ ఒకరు. చెప్పులు సైతం లేకుండా నిరాడంబరంగా పాదచారిగా మత ప్రచారం చేశాడు. అనారోగ్య కారణాల వల్ల స్వదేశం తిరిగి వెళ్లిన తర్వాత కూడా తెలుగు టైపులు పోతపోయించి, తెలుగు గ్రంథాలు రచించి ముద్రించాడు. జర్మన్ లూథరన్ తత్త్వవేత్త జోహాన్ ఆర్నెడ్ (1555-1621) రచించిన నాలుగు గ్రంథాలను షుల్జ్ తెలుగులోకి హాలేలో ముద్రించాడు. 23 సంవత్సరాల ముద్రణారంగంలో శ్రమించాడు. స్వదేశం వెళ్లిపోయాక కూడా 17 సంవత్సరాల పాటు తెలుగు పుస్తకాలు ముద్రించాడు. స్వయంగా 'GRAMMATICA TELUGICA' (1728) పేర 8 ప్రకరణాల్లో తెలుగు వ్యాకరణం రచించాడు. దీనిని హాలే విశ్వవిద్యాలయం వారు భద్రపరచి 1984లో తొలిసారి ముద్రించారని ఆరుద్ర తెలియజేశారు.8 తమిళం, పోలీసు, డేనిష్ భాషల్లో 20 పుస్తకాలను ఆరేళ్లలో ముద్రించాడు. మద్రాసులో సెంట్ జార్జ్ కోటలో కుంపిణీ గవర్నరు ఒప్పించి భారతీయుల కోసం పాఠశాల పెట్టించడమే గాక అందులో తెలుగు విభాగాన్ని ప్రారంభించి పిల్లల్లో తానూ ఒకనిగా కేవలం రెండు నెలల్లో తెలుగు నేర్చుకున్నాడు. అంతేకాదు బైబిల్ను సాహసోపేతంగా తెలుగులోకి అనువదించి ముద్రించాడు. 1760 నవంబర్ 25న షుల్జ్ కన్నుమూశాడు.


K. జేమ్స్ గ్రాంటు - దేశీయ విద్యలపై దృష్టి


కుంపిణీ వారికి మన దేశంలో మొట్టమొదట వశమైనవి ఉత్తర సర్కారులు. ఈ ప్రాంతాల సంక్షిప్త రాజకీయ చరిత్రను, విపులమైన రెవెన్యూ చరిత్రను వ్రాసిన తొలి ఆంగ్లేయిడు జేమ్స్ గ్రాంటు నిజాం దర్బారులో బ్రిటిషు రాయబారిగా పనిచేశాడు. దేశీయ విద్యలు మూలపడ్డాయని, వాటిని ఉద్దరించాలని చెప్పాడు.


ఛార్లెస్ వైట్ - నిఘంటు నిర్మాణానికి అంకురార్పణ


సెంట్ జార్జ్ కోటలో సివిల్ సర్వెంట్ హోదాలో పనిచేసిన ఛార్లెస్ వైట్ తెలుగులో నిఘంటు నిర్మాణానికి 1793 ప్రాంతాల్లో అంకురార్పణ చేశాడు.మంచి నిఘంటువు తయారు చేసిన వారికి బహుమతులివ్వాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశాడు. అంతేకాదు తెలుగు నేర్చుకొనేవారికి ఉపయోగపడే ప్రాథమిక గ్రంథాలను రాయించాలని సూచించాడు. ఈయన సూచనవల్లే సెంట్ జార్జి కోట

పాలకులు మామిడి వెంకయ్య 'ఆంధ్ర దీపిక' హక్కులను కొన్నారని భావించవచ్చునని తెలుగు భాషా సారస్వతాల రంగాన్ని బ్రౌసు మహోజ్వల కాంతులతో నింపాడు. తెలుగు భాషా సాహిత్యాల పునరుద్ధరణకు, పునరుజ్జీవానికి అతడు ధారవోసిన శ్రమ అపారం. 1798 నవంబర్ 10న కలకత్తాలో జన్మించాడు. ఇంగ్లండులో విద్యాభ్యాసం తర్వాత 1817లో కుంపిణీ ప్రభుత్వ సివిల్ సర్వెంట్గా భారతదేశంలో అడుగుపెట్టాడు. దక్షిణ భారత క్యాడర్లో బ్రౌను నియామకం ముఖ్యంగా తెలుగు వారు చేసుకున్న పుణ్యం.

కలెక్టరు సహాయకునిగా, మెజిస్ట్రేటుగా, పర్షియన్, తెలుగు పోస్ట్మాస్టర్ జనరల్ కునిగా, గా, విద్యామండలి సభ్యునిగా, కాలేజ్ బోర్డు కార్యదర్శిగా అనేక హోదాల్లో అనేక ప్రాంతాల్లో ఉద్యోగం చేశాడు. 38 సంవత్సరాలు కుంపిణీ వారి కొలువులో ఉన్నాడు. తాను దేశంలోనూ, తిరిగి ఇంగ్లండు వెళ్లాకకూడా మొత్తం దాదాపు ఐదున్నర దశాబ్దాల కాలం తెలుగు భాషా సాహిత్యాల వికాసం కోసం అవిశ్రాంతంగా కృషి చేశాడు. ఇది ఒక వ్యక్తికి సాధ్యమయ్యే పని కాదు. తెలుగు గ్రంథాల రచనలో, తాళపత్ర గ్రంథాల సేకరణలో, ఉద్ధరణలో, భద్రపరచడంలో, పరిష్కరణలో, ముద్రణలో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పనిచేశాడు బ్రౌన్. బ్రౌన్ వేమన పద్యాల ఆంగ్లానువాదం 1825లోనే చేపట్టాడు. తెలుగు ఛందస్సు (1827) ముద్రించాడు. తెలుగు-ఇంగ్లీషు, ఇంగ్లీషు-తెలుగు నిఘంటువులు, తెలుగు వ్యాకరణం, ఆంగ్లంలో తెలుగు వ్యాకరణం ప్రచురించాడు. ది లిటిల్ లెక్సికాన్, ది జిల్లా డిక్షనరీ కూర్చాడు. కొత్త నిబంధనను అనువదించాడు. వేమన పద్యాలను ఆంగ్లంలో 1829లో 693 పద్యాలతో, 1839లో 1164 పద్యాలతో ప్రచురించాడు. ఆయన ఎన్నో విధాలా శ్రమించి వ్యయప్రయాసల కోర్చి సేకరించిన తెలుగు, సంస్కృత గ్రంథాల సంఖ్య వేలల్లో వుంది. మాజేటి సర్వేశలింగం సంకలనం నుండి సేకరించిన గ్రంథాలు 613 కాగా 227 గ్రంథాలు తెలుగు, 386 సంస్కృత గ్రంథాలు. మచిలీపట్నంలో కొన్నవి 1830 గ్రంథాలు. ప్రత్యేకంగా కడపలో భవనాన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి, దిగ్ధంతులైన పండితులను నియమించి అనేక కావ్యాలు, శతకాలకు సంబంధించిన వేరు వేరు చోట్ల లభ్యమైన ప్రతులను పోల్చి చూపి (Collation) శాస్త్రీయ పద్ధతిలో పరిష్కరింపజేశాడు. వాటిల్లో వసు చరిత్ర, మనుచరిత్ర, రాఘవపాండవీయం, రంగనాధ రామాయణం, పండితారాధ్య చరిత్ర, పల్నాటి వీర చరిత్ర, దశావతార చరిత్ర మొదలైనవి ఉన్నాయి. పోతన భాగవతాన్ని పరిష్కరించడమే కాక తెలుగు భారతం 18 పర్వాల పరిష్కరణకు, శుద్ధ ప్రతుల తయారీకి 2714 రూపాయలు ఖర్చు చేశాడు. తెలుగు నేర్చుకోదలచే ఇంగ్లీషు వారి కోసం, ఇంగ్లీషు నేర్చుకోదలచే తెలుగు వారి కోసం వాచకాలు తయారు చేశాడు. మద్రాసులో, కడపలో, మచిలీపట్నంలో స్వంత ఖర్చులతో ఉచిత పాఠశాలలు నడిపాడు. ఆయనే అన్నాడు " In 1825 found Telugu Literature dead in thirty years I raised it to life "10 అని. అది అక్షరాలా నిజం. 1855 ఏప్రిల్లో ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తిరిగి ఇంగ్లండు వెళ్లిపోయాడు. లండన్ యూనివర్సిటీలో తెలుగు గౌరవ ఆచార్యునిగా పనిచేశాడు. గ్రంథ రచన, ముద్రణ నిర్వహించాడు. ఆయన చివరి ప్రచురణ 'తాతాచార్యుల కథలు'. 1884లో కన్నుమూశాడు. పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్న వేమన పద్యానికి నిదర్శనంగా తెలుగుజాతి ఎన్ని తరాలకైనా మరువరాని పుణ్య పురుషుడు సి.పి. బ్రౌన్.


సర్ థామస్ మన్రో ప్రజల గవర్నరు -

తన 19 ఏళ్ల వయసులో మద్రాసుకు సైనిక విద్యార్థిగా వచ్చిన సర్ థామస్ మన్రో తన 66వ ఏట మద్రాసు గవర్నర్ గా చేస్తూ చనిపోయాడు. తెలుగు నేర్చుకున్న తెల్ల దొరల్లో ఈయన సుప్రసిద్ధుడు. రాయలసీమ తెల్లదొరల అధీనంలోకి వచ్చాక ఈయనను పాలకునిగా నియమించారు. దత్త మండలాల్లో ఉన్న 80 మంది పాలెగాండ్లను అదుపులోకి తెచ్చి రైతులకెంతో ఉపకారం చేశాడు. పాఠశాలలు నెలకొల్పేందుకు, ప్రజోపయోగకరమైన విద్యావిధానాన్ని ప్రవేశపెట్టడానికి పథకాలు రూపొందించాడు. రాయలసీమ అంటే ప్రాణం.

1783లో రైటర్గా మద్రాసు వచ్చిన విలియం బ్రౌన్ మచిలీపట్నం, విజయనగరం, విశాఖ, గంజాం, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో అనేక హోదాల్లో 50 సంవత్సరాల పాటు పనిచేశాడు. 1817లో 'జెంటూ' (తెలుగు) వ్యాకరణం ముద్రించాడు. అందులో పూర్వ వ్యాకర్తలను స్మరించడమే గాక కొన్ని పూర్వ వ్యాకరణాలు నిరుపయోగాలన్నాడు. 1818లో ఆయన ప్రచురించిన జెంటూ వొకాబులరీ వల్ల ఆనాటి సాంఘిక చరిత్ర తెలుసుకోవచ్చు. 1832లో తెలుగు అనువాదకునిగా పనిచేశాడు. మచిలీపట్నంలోని మామిడి వెంకయ్య, గుండుమళ్ల పురుషోత్తం వంటివారు విలియం బ్రౌను తెలుగు వ్యాకరణ రచనకు సహాయం చేశారు. ఆయన తెలుగు వ్యాకరణం చాలా విశిష్టమైనది. ఇంగ్లీషు వర్ణక్రమం ప్రకారం తెలుగు అక్షరాలు 22 మాత్రమేనని వర్గీకరించాడు. ఇది ఇంగ్లీషు వాళ్లు తెలుగు నేర్చుకొనేందుకు దోహదం చేసింది. తెలుగు భావ ప్రకటనకు గంభీరంగానూ, వినడానికి కమ్మగానూ ఉంటుందని అన్నాడు.


ఎ. డి. క్యాంబెల్ - ప్రామాణిక వ్యాకరణం


అలెగ్జాండర్ డంకన్ క్యాంబెల్ 1807లో రైటర్గా మనదేశానికి వచ్చాడు. బళ్లారి, తంజావూరు కలెక్టరుగా పనిచేశాడు. ప్రభుత్వ తెలుగు, పర్షియా అనువాదకునిగా పనిచేశాడు. బళ్లారి మిషన్కు ఈయన కృషివల్లే ముద్రణశాల లభించింది. 1817లోనే సెంట్ జార్జికోట కాలేజ్ బోర్డుకు కార్యదర్శి అయ్యాడు. రెవెన్యూ బోర్డు కార్యదర్శిగా కూడా పనిచేశాడు. తెలుగును నిశితంగా అధ్యయనం చేయడమేగాక తెలుగులోనూ, తెలుగును గురించి ఆంగ్లంలోనూ ప్రామాణిక రచనలు చేసిన కొద్ది మందిలో క్యాంబెల్ ఒకరు. ఉదయగిరి నారాయణయ్య అనే పండితుని దగ్గర ఆంధ్ర శబ్ద చింతామణిని ఆమూలాగ్రం చదువుకున్నాడు. మామిడి వెంకయ్య ఆంధ్ర దీపిక పీఠిక, ఆంధ్రకౌముది, అహోబిల పండితీయం మొదలైనవి 10 ఏళ్లపాటు శ్రద్ధగా పఠించాడు. ఈ పరిజ్ఞానంతో తర్వాతి వారికి ఉపయుక్తంగా ఉండేలా ఆరు అధ్యాయాలు, 519 సూత్రాలతో తెలుగు వ్యాకరణాన్ని ఇంగ్లీషులో రచించాడు. అప్పట్లో ఇంగ్లీషు వచ్చిన తెలుగు వ్యాకరణాల్లో క్యాంబెల్ వ్యాకరణ గ్రంథం ప్రామాణికమైనదిగా పరిగణనకెక్కింది.


1812 నుంచి దేశ భాషల అధ్యయన సంఘానికి కార్యదర్శిగా ఉన్నాడు. అదే తర్వాత కాలేజ్ బోర్డుగా మారింది. 1816లో వ్యాకరణం ముద్రణ జరిగింది. 1812 నుంచి 1820 వరకు ఎనిమిదేళ్లు కాలేజ్ బోర్డు కార్యదర్శిగా, పరీక్షాధికారిగా పనిచేశాడు. ఆయన ప్రతిభా విశేషాలకు మెచ్చి ప్రభుత్వం వారు నిఘంటువు రాయమన్నారు. క్యాంబెల్ ఆంధ్ర దీపికను ప్రాతిపదికగా తీసుకొని కొత్త పదాలు కలుపుకుంటూ తెలుగు ఇంగ్లీషు అర్థాలిస్తూ నిఘంటువు పూర్తి చేశాడు. దాని తొలి ముద్రణ 1821లోనూ, రెండవ ముద్రణ 1848లోనూ జరిగింది. తన వ్యాకరణానికి ఆయన రాసిన ప్రవేశిక చాలా గొప్పది. ఆంధ్ర భాషా చరిత్రను, ఆంధ్రదేశ చరిత్రను సంక్షిప్తంగా రాసినా అది కూడ ప్రామాణికమైనది. ఆంధ్ర చరిత్ర రచించిన వారిలో క్యాంబెల్ మొదటివాడు కావచ్చునని ఆరుద్ర అభిప్రాయపడ్డారు.11 తన గ్రంథంలో త్రిలింగ శబ్దానికి విపులమైన పీఠిక రచించాడు. ప్రాచీన పాశ్చాత్య చరిత్రకారులు ఆంధ్రదేశం గురించి భావించిన అంశాల్ని ప్రస్తావించాడు. వివిధ భారతీయ పురాణాల్లో ఆంధ్రప్రసక్తి ఉన్న ఘట్టాలను క్రోడీకరించాడు. మెకంజీ సేకరించిన వ్రాత ప్రతులను, శాసనాలను ఆధారం చేసుకొని విజయనగర రాజుల జాబితా రూపొందించాడు.


ఫ్రాన్సిస్ వైట్ ఎల్లిస్ - తులనాత్మక అధ్యయనం


మద్రాసులో రైటర్ 1796లో సివిల్ సర్వీసు ప్రారంభించిన ఎల్లిస్ 1802లో రెవెన్యూ బోర్డు సభ్యునిగా, జిల్లా జడ్జిగా, కలెక్టర్ గా అనేక హోదాల్లో పనిచేశాడు. మచిలీపట్నంలో జడ్జిగా పనిచేస్తున్నప్పుడు తెలుగు బాగా నేర్చుకున్నాడు. తెలుగు, తమిళం, మళయాళం భాషల్లో ప్రావీణ్యం సంపాదించడంతో పాటు దక్షిణ భారతీయ భాషల విషయంలో చెప్పుకోదగిన కృషి చేశాడు. తమిళ, సంస్కృత, మళయాళ భాషలలో తెలుగును తులనాత్మకంగా అధ్యయనం చేసి ద్రావిడ భాషావాదం బలపడడానికి ఎల్లిస్ దోహదం చేశాడు.


ఎ. డి. క్యాంబెల్ తెలుగు వ్యాకరణానికి పరిచయంగా ఎల్లిస్ తెలుగుతో ద్రావిడ భాషకు గల సామ్యాన్ని గురించి రాసిన నోటును (1816) పొందుపరచడం జరిగింది.


భారతీయుల సాంఘిక పరిస్థితుల పట్లా, చరిత్ర పట్లా ఎంతో శ్రద్ధ కనబరచి ఆ విషయాలపై ప్రామాణిక రచనలు చేశాడు. "జనని సంస్కృతంబు సకల భాషలకును" అన్న కొందరు ఆంగ్ల పండితుల వాదాన్ని ఎల్లిస్ ఖండిస్తూ తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషలు ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాషలనీ, సంస్కృతం నుంచి జనించినవి కావని నిరూపించాడు. వాక్య నిర్మాణ పద్ధతిలో దక్షిణాది భాషలు సంస్కృతంతో ఎలా విభేదిస్తున్నాయో రాశాడు. మామిడి వెంకయ్య 'అంధ్ర దీపిక' ఉపోద్ఘాతంలో చెప్పిన తత్సను, తద్భవాలను గురించి చర్చించాడు. లక్ష్మధరుని షడ్భాషా చంద్రికను ఉటంకించాడు. ఇది భాషా శాస్త్ర విషయకంగా ప్రాముఖ్యాన్ని సంతరించుకోదగింది. ఎల్లిస్ మరణానంతరం ఆయన భాషా శాస్త్ర పరిశోధన పత్రాలన్నిటినీ సర్ వాల్టర్ ఇలియట్క అందే ఏర్పాటు జరిగింది. ఇలియట్ డాక్టర్ పోపు ఇచ్చి ఆక్స్ఫర్డ్ బోదిలియన్ గ్రంథాలయంలో భద్రపరచేట్లు చేశాడు.


కోలిన్ మెకంజీ - చారిత్రక సంపద


తెలుగుతో పాటు 15 భారతీయ భాషల్లో వేలాది వ్రాతప్రతులు సేకరించి అనంతర తరాలకు అమూల్యమైన విశేషాలను అందించిన పాశ్చాత్య ప్రముఖుడు కోలిన్మెకంజీ. లూయిస్ ద్వీపానికి చెందిన మెకంజీ 1783లో ఈస్టిండియా కంపెనీ వారి ఇంజనీర్స్ క్యాడెట్లో ఎంపికై భారతదేశం వచ్చాడు. మద్రాసు ప్రెసిడెన్సీ సర్వేలో పాల్గొన్న ఇంజనీర్లలో మెకంజీ ఒకరు. కోయంబత్తూరు, దిండిగల్, నెల్లూరు, గుంటూరు ఎక్కడికి సర్వే కోసం వెళ్లినా తనతో జిజ్ఞాసువులైన పండితులను తీసుకెళ్లేవాడు. 1809లో మద్రాసు సర్వేయర్ జనరల్, 1817లో కలకత్తా సర్వేయర్ జనరల్ గా ఉండి దాదాపు 70 వేల చదరపు మైళ్ల మేర సర్వే జరిపించాడు. కావలి వెంకట బొర్రయ్య. లక్ష్మయ్య అనే ఇద్దరు ప్రతిభావంతులైన తెలుగు సోదరుల సహాయంతో దేవాలయాలు, చెరువులు, రిజర్వాయర్లు, శాసనాల ప్రాచీన చరిత్రను మెకంజీ వెలికితీశాడు. ఆయన కృషిని సెంట్ జార్జి కోట ప్రభుత్వం కూడా ఎంతగానో ప్రశంసించింది.

తాను సేకరించిన 1620 ప్రాంతాల స్థానిక చరిత్రల కైఫీయతుల విశ్లేషణ, కేటలాగింగు చేపట్టిన కొంత కాలానికి 1821లో కలకత్తాలో మెకంజీ మరణించాడు. మెకంజీ సేకరించిన సమాచారన్నంతటినీ గపిండియా కంపెనీ కొనుగోలు చేసింది. 

ఏషియాటిక్ జర్నల్ మెకంజీ సేకరించిన విషయ సంపదను మొదటిసారిగా వెలుగులోకి తెచ్చింది.


విల్సన్స్ మెకంజీ కలెక్షన్స్ పేరుతో 1828లో కలకత్తాలో కేటలాగింగ్ ఆరంభమైంది. మెకంజీ సేకరించిన 176 తెలుగు లిఖిత ప్రతుల వివరాలు అందులో చోటు చేసుకున్నాయి. 36 పౌరాణిక, వైతాళిక సాహిత్య గ్రంథాలు, 23 స్థానిక చరిత్రలు, 82 ప్రతులు కావ్యాలు, నాటకాలు, గాధలకు సంబంధించినవి ఉన్నాయి. వీటి సహాయంతో సాధికారికమైన స్థానిక చరిత్ర నిర్మాణం చేయవచ్చు.


వీరేగాక ఇంకా ఎందరో తెల్లదొరలు తెలుగు ప్రాంతాల్లో, తెలుగువాళ్ల మధ్య తెలుగు భాషా సాహిత్యాల వికాసానికి కృషి చేశారు. వారందరి గురించి విపులంగా చర్చించడం ఈ అధ్యయనంలో సాధ్యమయ్యేది కాదు. అయితే వారిని నామమాత్రంగానైనా స్మరించడం బాధ్యత. బెంజిమెన్ బ్రాన్ఫీల్, జాన్. పి. మారిస్, థామస్ కన్ సెట్టస్, సర్ విలియం జోన్స్, చార్లెస్ విల్కిన్స్, హెన్రీ థామస్, కోల్ బ్రూక్, జె. బి. గిల్ క్రిస్ట్, విలియం కేరీ, జార్జి అబ్రహం గ్రియర్ సన్, రెవరెండ్ డేవిడ్ బ్రౌన్ (సి. పి. బ్రౌన్ తండ్రి) క్లాడినస్ బఛ్యస్, జాషువా మార్ష్మన్, హెన్రీ మార్టిన్, డేనియల్ కోరీ, డా. జాన్ లీడెన్... ఇలా వారి వారి స్థాయిల్లో, పరిమితుల్లో తెలుగు భాషా సాహిత్యాల వికాసానికి కృషి చేశారు.


- కర్లపాలెం హనుమంతరావు 

( మూలం - భాషా సాహిత్య స్వరూపం - డా॥ జె. చెన్నయ్య

వ్యాసం స్వామి వివేకానంద -రచన - కర్లపాలెం హనువుంతరావు ( సూర్య సంపాదకీయ పుట ప్రచురణ )



వ్యాసం 

స్వామి వివేకానంద 

 -రచన - కర్లపాలెం హనువుంతరావు 

( సూర్య సంపాదకీయ పుట ప్రచురణ ) 



స్వామి వివేకానంద డాంబిక ప్రదర్శన లేని విరాగి.  ప్రాపంచిక విషయాల తరహాలోనే రాజకీయ వ్యవహారాలనే తామరాకు పైన   తనను  తాను ఓ నీటి బిందువుగా భావించుకున్న ఆధునిక యోగి.  ఆ పరివ్రాజకుడికి ఆ అంటీ ముట్టనితనం   సాధ్యమయిందా?  పరిశీలిద్దాం. 

తన జీవితకాలంలో ఎన్నడూ రాజకీయరంగం దిశగా స్వామి అడుగులు పడిన సూచనలు కనిపించవు.  ఏ రాజకీయ పక్షానికీ ఆయన మద్దతు లభించిన  దాఖలాలూ దొరకవు. తన స్వంత  పరివ్రాజక సంస్థలోనూ రాజకీయరంగ ప్రస్తక్తిని నిషేధించిన స్వామీజీ.. ఆ నిబంధనను అధిగమించినవాళ్లని సభ్యత్వం నుంచి తొలగించేందుకైనా సందేహించినట్లు కనిపించదు. రామకృష్ణ మిషన్ నుంచి నివేదిత రాజకీయ సంబంధిత  కారణాల  వల్ల వైదొలగినప్పటి బట్టి స్వామీజీలో ఈ రాజకీయ విముఖత మరింత కరుడుగట్టినట్లు  భావిస్తారు. వివేకానందుడు నివేదితకు పరివ్రాజక సంఘంలో సభ్యత్వం నిరాకరించడం  ఈ సందర్భంగా గమనించవలసిన ముఖ్యాంశం.  

మనిషి పట్ల స్వామికి ఉండే ప్రేమ, సానుభూతి అపారమైనవి. అయినా సందర్భం వచ్చిన ప్రతీసారీ  వివేకానందుడు రాజకీయాల పట్ల తనకున్న విముఖతను నిర్మొహమాటంగా బైటపెట్టేవారు. స్వామి దృష్టిలో రాజకీయాలు మనిషిని సంకుచిత మార్గంలోకి మళ్లించేవి. రాజకీయం మిషతో ఎదుటి మనిషిని పీడించడమే కాదు, తనను గూర్చి తాను  డాంబికంగా  ఊహించుకునే మానసిక రుగ్మత మొదలవుతుందన్నది  వివేకానందుడి నిరసన వెనక ఉన్న భావన. ప్రస్తుతం నడుస్తున్న రాజకీయ ప్రహసనాలు చూస్తున్నప్పుడు వివేకానందుడి నాటి ఊహలో వీసమెత్తైనా అసత్యం లేదనే అనిపిస్తుంది.  

స్వామి దృష్టిలో ఈ దేశం పుణ్యభూమి. ఇక్కడి అణువణువు అత్యంత పవిత్రమైనది.  రుషులు,  జాతి వివక్షతకు తావీయని పద్ధతుల్లో  సర్వ మానవాళికి  ఉచితంగా  ఆధ్యాత్మిక జ్ఞానసంపదను పంచిపెట్టారు. వారి అనుయాయులదీ అదే సన్మార్గం. భారతీయుల  మానవతావాదం యావత్ ప్రపంచం దృష్టిలో గౌరవనీయమైన స్థానం సాధించుకునేందుకు ఇదే ముఖ్య కారణం. సర్వశ్రేష్టమైన మానవత్వం పట్ల   భారతీయుల ఆధ్యాత్మిక సంస్కృతి కనబరచిన శ్రద్ధాసక్తులు  ప్రపంచం దృష్టికి తేవడమే లక్ష్యంగా చికాగో సర్వమత మహాసభ తాలూకు   వివేకానందుడి తొలి  ప్రసంగం సాగింది కూడా. 

 ప్రపంచం భారతీయ సంస్కృతి ఔన్నత్యం గూర్చి చర్చించడానికి భారతీయులు కేవలం భారతీయుల మాదిరిగానే ఉండి తీరాలని స్వామి ప్రగాఢంగా విశ్వసించారు. కేవలం ఆ కారణం చేతనే మరే ఇతర దేశమో, సంస్కృతో మన దేశం మీదనో,  సంస్కృతి మీదనో పెత్తనం చెలాయించే అత్యుత్సాహం ప్రదర్శించినప్పుడు, చెత్త రాజకీయాల ద్వారా  జోక్యం చేసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు వివేకానందుడు తీవ్రంగా అసహం వ్యక్తపరిచింది.  

ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే భారతీయుల పుణ్యభూమి పై పరాయివారి పాలన కొనసాగకూడదన్నదే స్వామి ప్రగాఢ కాంక్ష. ఆ చింతనాపరుడి ఆలోచనల నుంచి రగిలిన దేశభక్తి భావనలే అప్పటి ఈ దేశపు యువతను తెల్లవారి పాలనకు ఎదురు నిలిచే దిశగా ప్రోత్సహించింది. స్వీయ వ్యక్తిత్వ వికాస నిర్మాణం దిశగా ధ్యాస పెట్టేందుకూ దోహదించిన భావజాలం వివేకానందునిది. ఆ పరివ్రాజకుడి ప్రబోధాల ప్రభావమే మరణానంతరమూ  బ్రిటిష్ దొరల దృష్టిలో స్వామిని  విప్లవకారుడి కింద ముద్ర వేయించింది. 

నైతిక పతనం వల్ల నిజమైన ఆర్థిక స్వాతంత్ర్యం  సాధ్యం  కాదు. రాజకీయాలదే మనిషి పతనానికి చాలా వరకు ప్రధాన బాధ్యత- అన్నది రాజకీయాలపై వివేకానందుని తిరుగులేని సూత్రీకరణ. 'చట్టం, ప్రభుత్వం, రాజకీయాలు మాత్రమే సర్వస్వం కాదు. అవి కేవలం మనిషి జీవన పరిణామ క్రమంలో కొన్ని దశలు మాత్రమే. మానుషత్వ సాధన ఆయా రంగాల ఊహకైనా అందనంత ఎత్తులో ఉంటాయన్న'ది  వివేకానందుడి ఆలోచన. మనిషి అంతరంగ పరంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన నీతి నిజాయితీల  పట్ల రాజకీయాలకు ఎప్పుడూ బొత్తిగా ఆసక్తి ఉండదు’ అన్నది వివేకానందుడి ఫిర్యాదు. కులం, మతం, వర్గం -ఇత్యాదుల పరంగా ప్రజావళిని  విభజనకు గురి చేసే రాజకీయాలు ఈ దేశాన్ని పట్టి వదలకుండా పీడిస్తున్న ప్రధాన రుగ్మతలుగా స్వామి ఆనాడే గుర్తించి గర్హించారు. రెండో ప్రాధాన్యంగా ఉండవలసిన ‘గుడి- మసీదు- చర్చి’ రాజకీయాలు మొదటి స్థానం ఆక్రమించడం స్వామీజీకి బొత్తిగా  గిట్టేది కాదు. మానుషత్వం సంకుచితమయిపోతూ, దేవుళ్లూ దయ్యాలనే భావనల పట్ల వెర్రితనం ప్రబలిపోవడం మనిషికి, మనిషికి మధ్య పూడ్చలేని అగాథాలను సృష్టికేనన్నది ఆయన భావన. రాజకీయక్షేత్ర అనైతిక క్రీడల పట్ల స్వామీజీ క్రుద్ధుడు కాని క్షణం లేదు. 'ఉన్న పరిమిత అనుభవంతో నేను సేకరించిన జ్ఞానం నాకు బోధిస్తున్నది ఏమిటంటే.. మతం మీద మనం ప్రదర్శించే విముఖత్వానికి  మతం అసలు కారణమే కాదు. మనిషిలోని విద్వేషగుణానికి మతాన్ని తప్పు పట్టి ప్రయోజనంలేదు. ఏ మతమూ మనిషిని నిట్టనిలువుగా తగలవేయమని చెప్పదు; సాటి మనిషిని పీడించమనీ రెచ్చగొట్టదు. ఆ తరహా  దుష్కృత్యాలు చెయ్యమని మనిషి మీద వత్తిడి చేసేందుకుగాను మతం పుట్టలేదు. అంతులేని అమానుష కార్యాలన్నిటికి మనిషిని  ప్రేరేపిస్తున్నవి నిజానికి జుగుప్సాకరమైన రాజకీయాలే. కానీ,  ఆ తరహా  అవాంఛనీయ రాజకీయాలనే నిజమైన మతమని జనం నమ్ముతున్నారిప్పుడు! ఈ విషాదకర పరిణామాలకు బాధ్యులెవరో గ్రహించినప్పుడే మనిషికి నిజమైన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లభించేది' అన్నారో సందర్భంలో స్వామి వివేకానంద మతానికి రాజకీయాలకు మధ్య గల అపవిత్ర సంబంధాలను ఎండగడుతూ.  

మతం అసలైన పరిమళం ఆధ్యాత్మికత. నిజమైన ఆధ్యాత్మిక విశ్వాసి దుష్కృత్యాల మీద ధ్యాస పెట్టడు. పరులకు దుఃఖం కలిగే చర్యలు చేపట్టడు.  స్వానుభవం నుంచి వెలికి తీసిన వెన్నముద్దల వంటి సూక్తులు పంచిపెట్టే ఒక సందర్భంలో స్వామి వివేకానందుడు 'మనిషి మేధస్సు చేయదగిన అత్యుత్తమైన ఆరోగ్యకరమైన దారుఢ్య సాధన.. స్వచ్ఛమైన అంతరంగంతో మతాన్ని అనుసరించడం మాత్రమే' అని హితవిచ్చారు.  

జంతువు, మనిషి, దేవుడు- ఈ ముగ్గురికి  ముఖ్య ప్రవృత్తుల సంగమమే మనిషి. అతనిలో అంతుబట్టకుండా దాగి  ఉండి అంతర్గతంగా చెలరేగే రాగద్వేషాల వంటి దుర్లక్షణాలను అణచివేయడం ద్వారా పశుప్రవృత్తిని సాధ్యమైన మేరకు కుదించి మనిషిలో నిద్రాణమై ఉన్న దైవత్వాన్ని తట్టిలేపడమే 'మతం' అసలు లక్ష్యం. 'కాబట్టే  దేశానికి ఒక రాజ్యాంగం ఎంత అవసరమో, మనిషికి మతమూ అంతే అవసరం' అని వివేకానందుడు భావించింది. ఈర్ష్యాసూయలు, క్రోధావేశాలు వంటి విద్వేష భావనలకు మాత్రమే ఆలవాలమైన రాజకీయాలు సర్వమానవళి పట్ల సరిసమానమైన ప్రేమాభిమానాలను పంచవలసిన మనిషికి మేలు చేయవని స్వామి గట్టిగా నమ్మారు. ప్రతికూల దృక్పథ రాజకీయాలతో ప్రపంచమంతా పొంగి పొర్లిపోతున్న సన్నివేశాల మధ్య జీవిస్తున్న స్వామి పౌరుల మనసులు దుర్మార్గమైన ఆలోచనలతో కలుషితం కాక  ముందే, వారి మెదళ్లను అందుకే ఉదాత్తమైన ఆధ్యాత్మిక భావనలతో ముంచెత్తెయ్యాలని  అనుక్షణం ఆరాటపడిపోయింది.  

యూరోపియన్ మేధావుల సదస్సులో ఉటంకించిన భావాలను పునరాలోచిస్తే వివేకానందుడికి భారతీయ సోషలిజమ్ పట్ల ఎంత  చక్కని  అవగాహన ఉందో అర్థమవుతుంది. 'భారతదేశంలోనూ సోషలిజమ్ ఉంది. కానీ  అదీ యూరోపియన్ తరహా ద్వంద్వ విధానం కన్నా విభిన్నంగా ఉంటుంది. అద్వైతమనే అఖండ జ్యోతుల వెలుగుల్లో కళాకాంతులీనే సాంఘిక వ్యవస్థ మాది. యూరప్ లో ప్రాచుర్యంలో ఉన్న సోషలిజమ్ భావనలో మాత్రమే ఆర్థిక సోషలిజమ్. అర్థికపరమైన  కోణంలో చూడడమే అందులోని ప్రధాన  లోపం. బైటకు  వ్యక్తివాదానికి చోటిచ్చే వ్యవస్థగానే  కనిపించినప్పటికీ,  వాస్తవానికి అది వ్యక్తిలోనే నిత్యం సంఘర్షించే రెండు పరస్పర విరుద్ధమైన శక్తుల(మనసు, మెదడు)ను పరిగణలోకి తీసుకునేపాటి శ్రద్ధ చూపించలేదు’ అని స్వామి కుండబద్దలు కొట్టినట్లు చెప్పిన మాట. మార్క్సిజమ్ ఒక  రాజకీయ భావజాలంగా యూరప్ నంతటా ముంచెత్తుతున్న దశలో, దాని తాకిడి హిందూదేశపు ఎల్లలలను కూడా తాకుతున్న నేపథ్యంలొ వివేకానందుడు నిర్భీతిగా వెల్లడించిన మనసులోని మాటలు ఇవి. ఆ నాటి రాజకీయ యుగసంధిలోని పరిణామాలన్నింటిని బాగా ఆకళింపు చేసుకున్న ఆధ్యాత్మిక చింతనాపరుడు కాబట్టే వివేకానందుడు సోషలిజమ్, మార్క్సిజమ్ వంటి సాంఘిక చైతన్య భావజాలాలలోని  'సామాన్యుణ్ణి ఉద్ధరించే లక్ష్యం'  వైపుకు ఆకర్షితుడై తనను తాను ఒక 'ఆధ్యాత్మిక సోషలిష్టు'గా ప్రకటించుకున్నాడు. ఒక పరివ్రాజకుడు సోషలిజమ్ పట్ల ఆకర్షితుడవడం వరకు నిజంగా ఒక అద్భుత సన్నివేశమే! కాని ఆ పోలిక అక్కడి వరకే సరి.

సోషలిజమ్ లోని శ్రామిక పక్షపాతం స్వామిని బాగా ఆకర్షించిన సద్గుణాలలో ఒకటే కానీ, అదే సమయంలో పీడితుని బాధా విముక్తికై సోషలిజమ్ సూచించిన మార్గమే సమగ్రమైనదిగా భావించడానికి ఆయన సమ్మతించలేదని కూడా గమనించడం ముఖ్యం. సోషలిజమ్ భావనను ఆయన 'సగం ఉడికిన ఆహారం'గా భావించారు.  

అంతర్గతంగా దాగిన లోపాల వల్ల ఉన్నవారికి, లేనివారికి మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చే  శక్తి సోషలిజానికి చాలదన్న భావన వివేకానందుడిలో ఉంది.  సోషలిజమ్ ప్రవచించే మేధావుల మధ్య గల అభిప్రాయ భేదాలనూ ఆయన గుర్తించకపోలేదు.

 సోషలిజమ్ అన్న భావన ఆధునిక ప్రపంచానికి సైంట్ సైమన్ (1760 -1825), ఫ్యూరర్ (1772 -1832), రాబర్డ్ ఓవెన్ (1804 -1892) ద్వారా పరిచయం చేయబడింది.  త్రిమూర్తుల ద్వారా ప్రవచితమైన ఈ సామాజిక సూత్రాలు  ఎవరి వల్లా నమ్మదగిన స్థాయిలో సవ్యంగా నిర్వచించబడలేదన్నది ఒక ఫిర్యాదు. 'ఎవరి శక్తిని బట్టి వారికి దక్కవలసిన భాగం, ఎవరి అవసరాన్ని బట్టి వారికి దక్కవలసిన భాగం' అన్నది మార్క్స్ భావజాలమయితే,  విభేదించిన లెనిన్ మహాశయుడు దాని స్థానే  'ఎవరి శక్తిని బట్టి వారికి దక్కవలసిన భాగం.. ఎవరికి శ్రమను బట్టి వారికి దక్కవలసిన భాగం' అని కొత్త నిర్వచనం వెలువరించాడు. బెర్నార్డ్ షా ఆ ఇద్దరినీ ఖండిస్తూ ' సోషలిజమ్ మీద స్వామీజీ  చేసిన అధ్యయనమే సరళంగా, సవ్యంగా, సూటిగా సాగింద'ని  కితాబిచ్చాడు.  పారిశ్రామిక దేశాలు కాకపోయినప్పటికీ రష్యా, చైనాలలో కమ్యూనిస్టు విఫ్లవాలు చెలరేగడమే స్వామి పరిశీలనలోని సంబద్ధతకు నిదర్శనం' అని జి.బి.షా భాష్యం. 1897 సంవత్సరంలోనే  'మరో అర్థ శతాబ్దానికి భారతదేశం సంపూర్ణ స్వాతంత్ర్యం సాధిస్తుంద'ని స్వామి చెప్పిన జోస్యం సత్యం కావడం బట్టి  ఆయన పరిశీలనలోని బుద్ధినైశిత్యం వెల్లడవుతుంది. ఆ రోజుల్లో అసంభవమనిపించిన భారతదేశ స్వాతంత్ర్య హోదా స్వామి చెప్పిన విధంగానే సరిగ్గా 1947లో సాకారం కావడం మిడతంభొట్టు జోస్యమైతే కాదు గదా! నిశిత పరిశీలనా ప్రజ్ఞ గల ఘటికులే ఈ విధమైన నిర్దుష్ట ప్రతిపాదనలు ధైర్యంగా ముందుకు తెచ్చి ‘ఔరా!’ అనిపించుకోగలిగేది. 

స్వామి ప్రస్థానించిన 1902 కి అర్థ శతాబ్ది తరువాత భూగోళ   రాజకీయం పూర్తిగా గందరగోళ పరిస్థితుల్లో పడిపోయింది. అధికారం కోసం, అర్హతలతో నిమిత్తంలేని పెత్తనాల కోసం ప్రపంచదేశాలు  ప్రదర్శించే అత్యంత హీనమైన దౌర్జన్య రాజకీయరంగాలు ప్రపంచాన్ని పేలబోయే అగ్నిగుండంగా  మార్చేసాయన్న మాట నిజం. 

 సామ్రాజ్యవాదం, జాతీయవాదం, ఉగ్రవాదాలకు తోడు నియంతృత్వ పోకడలు ప్రబలి నేరాలకు, మూకుమ్మడి హత్యలకు అణచివేతలకు అంతమనేది లేకుండా కొనసాగుతున్నది ప్రపంచ రాజకీయమంతా.  రెండు సోషలిష్టు విప్లవాలు బలిగొన్న రక్తపాతం ఎంతో లెక్కలు అందనంత గాఢమైనది.  రెండు ప్రపంచయుద్ధాలు, అణుబాంబు విస్ఫోటాలు, ట్రేడ్ సెంటర్ దాడి వంటి దుర్ఘటనల వల్ల మానవత్వానికి జరిగిన చెరుపుకు  లెక్కలు కట్టడం ఎవరి తరమూ కాదు. అత్యంత సూక్ష్మ దార్శనిక దృష్టి గల స్వామి వివేకానందుడు అందుచేతనే ఈ తరహా దుర్ఘటనలు చోటు చేసుకోవడానికి చాలా ముందు నుంచే ' ప్రపంచం అగ్ని పర్వతం అంచున నిలబడి ఉంది. అది ఏ క్షణంలో అయినా భగ్గుమని పేలి సర్వమానవాళికి పూడ్చలేనంత నష్టం  కలిగించే అవకాశం ఉంది' అంటూ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ వచ్చారు. ఈ తరహా కష్టనష్టాల భారం తగ్గించే దిశగా అందుకే స్వామి యూఎన్ఓ వంటి  అంతర్జాతీయ స్థాయిలో సంస్థలు ఏర్పాటయి చురుకుగా పనిచేయాలని అభిలషించింది. 

కొన్ని దశాబ్దాల కిందట వరకు జాతీయ స్థాయిలో ఏర్పడ్డ సమస్యలను  జాతీయ స్థాయి సంస్థలే సమన్వయించి  సర్దిచెప్పేవి. పరిస్థితి మారింది. రెండు దేశాల పిట్టగోడ సరిహద్దు వివాదాలు కూడా ఊహించడానికైనా  సాధ్యం కానంత ఉత్పాతాలకు దారితీసి ప్రపంచదేశాలన్నింటిని  రచ్చలోకి ఈడ్చుకొస్తున్నాయి. ఇదంతా గామనించిన స్వామి ఆ తరహా సమస్యల పరిష్కారం అంతర్జాతీయ స్థాయిలో ఏర్పడ్డ  సంస్థల ద్వారానే సుసాధ్యమౌతుందన్న మాట వాస్తవం. అంతర్జాతీయ సంస్థలు, అంతర్జాతీయ కూటములు, అంతర్జాతీయ న్యాయచట్టాల ఆవశ్యకత నానాటికి పెరగక తప్పదు' అని ముందుగా గుర్తించి  ప్రకటింనిన వాస్తవిక రాజకీయ పరిశీలకుడు స్వామి వివేకానంద.   

నేటి మనిషి జీవితంలో రాజకీయాలు అంతర్గత విభాగాలవక తప్పడంలేదు.  రాజకీయాలతో నిమిత్తంలేని బతుకులు సాధ్యం కాదన్న పచ్చి వాస్తవం స్వామి అనుభావానికేమీ అందకుండా పోలేదు ఎప్పుడూ. అందు చేతనే సామాన్య గృహస్తును రాజకీయాల నుంచి దూరంగా ఉండమని ఆయన ఏనాడూ కోరలేకపోయివుండవచ్చు. కానీ రాజకీయాలతో అనుసంధానం ఏర్పరుచుకునే విధానంలోనే కొత్త పుంతలు తొక్కమని మాత్రం  ప్రబోధించేందుకు ప్రయత్నం చేసారాయాన. ‘భారతీయ వేదాంతం రాజకీయాలలో తెచ్చే సగుణాత్మకమైన మార్పులను  ఊతం చేసుకోకుండా ఇంగ్లాండ్ దేశానికి  నేను మతం  అగత్యాన్ని గురించి ప్రబోధించలేకపోయాను. ఇక్కడ ఇండియాలో కూడా సంఘసంస్కరణలు ప్రవేశపెట్టే ముందు  ఆధ్యాత్మిక రంగం  మానవాళికి చేకూర్చే మేళ్ళను గురించి ముందు  చర్చించవలసిన అగత్యం ఉందని మాత్రం హెచ్చరిస్తున్నాను. రాజకీయ భావజాలాన్ని ప్రబోధించే సమయంలోనూ అది భారతదేశానికి అవసరమైన ఆధ్యాత్మిక సంపదలో ఏ మేరకు అభివృద్ధి  సాధించగలదో ముందు చెప్పాలి.'  అన్నది  రాజకీయాల  వరకు చివరకు స్వామి వివేకానందుడు తీసుకున్న వైఖరి.  

వివేకానందుడి స్వంత వ్యక్తిత్వానికి సంబంధించినంత వరకు రాజకీయ ప్రభావానికి అతీతమైన రాజకీయ పరిశీలకుడు ఆయన. ఏ జాత్తీయ, అంతర్జాతీయ రాజకీయాలకూ ఆయన మనస్తత్వాన్ని మార్చే శక్తి చాలదు. కానీ స్వామి రాజకీయ పరిశీలన అర్థవంతంగా ఉంటుంది.  నిర్దుష్టత శాతం ఎక్కువ. నైపుణ్యంతో కూడిన సునిశితత్వంతో, సూక్ష్మ పరిశీలనతో  నిరపాయకరంగా సాగే వివేకానందుని ప్రసంగాలంటే అందుకే మానవ జీవితంలోని అన్ని పార్శ్వాల మేధావులు అత్యంత శ్రద్ధగా ఆలకించడానికి ఇష్టపడేది. ఆఖరుకు అవి రాజకియ సంబధమైన  ప్రసంగాలైనా సరే.. మినహాయించడానికి వీలులేనివి!  

'స్వామి వివేకానందుని సంపూర్ణ మేదోశక్తిని ఒకే చోట పోగేసి పరిశీలించేవారికి నోటమాట  రాకపోవడం సాధారణంగా జరిగే అనుభవమే. జాతీయవాదానికి, అంతర్జాతీయవాదానికి  మధ్య మరేదో నూత్న భావజాలంతో నిండిన మానవతావాదంలా పరమ ఆకర్షణీయంగా ధ్వనింపచేయడమే వివేకానందుని ప్రసంగాలలోని ప్రధాన ఆకర్షణ' అంటారు  'గుడ్ బై టు బెర్లిన్' రచయిత క్రిస్టోఫర్ ఐషర్ వుడ్. భారతీయుల చరిత్ర, భాషా సాహిత్య సంస్కృతులలో లోతైన అధ్యయనం చేసిన ప్రముఖ ఇండాలజిస్ట్ ప్రొఫెసర్ ఎ.ఎల్. భాషమ్  'రాబోయే కొన్ని శతాబ్దాల వరకు స్వామి వివేకానంద  ఆధునికి ప్రపంచ నిర్మాతల వర్గంలోని చింతనాపరులలో ఒక ప్రముఖునిగా గుర్తుండిపోవడం ఖాయం' అని స్వామీజీ రచనలు అన్నీ సుదీర్ఘ కాలం అధ్యయనం చేసిన తరువాత వెలిబుచ్చిన ఆఖరు మాట. కాదని మనం మాత్రం ఎట్లా అనగలం!

*** 

                                            

-రచన - కర్లపాలెం హనువుంతరావు 

( సూర్య సంపాదకీయ పుట ప్రచురణ ) 

Tuesday, December 7, 2021

పేరడీ ప్రక్రియ - రుక్మిణీనాథశాస్త్రి - పరిశీలన – కె.వి.ఆర్ - జరుక్ శాస్త్రి పేరడీలు ( P. 19-25 ) కె.వి. రమణారెడ్డి

 




పేరడీ ప్రక్రియ - రుక్మిణీనాథశాస్త్రి


పేరడీ ప్రక్రియమాత్రం తెలుగుకి కొత్తదే. పేరడీ అంటే కోతి కొక్కిరాయి కవిత్వమని నోరి నరసింహశాస్త్రి వర్ణించినట్లుగా ఇటీవల శ్రీశ్రీ రాశాడు. ఏ సాహిత్యంలోనైనా అలాంటిది వుంటుంది. ఎమి తిని కపితము సెపితివి గానీ, అండజ భీము ఉండ గానీ, మేక మెకమేక మెకమేక గానీ నోరివారి కోతికొక్కిరాయి కవిత్వమే. చంద్రరేఖా విలాసాన్ని చంద్రరేఖా విలాపంగా సాంతం మార్చింది. విదూషక తత్వం కాదు. దూషక తత్వమే. పేరడీ కవిత్వం అలాంటిది కాదు. ధూర్జటికవిని తెనాలి రామలింగకవి తెలిసెన్ భువనైక మోహనోద్ధత సుకుమార వార వనితా జనతా ఘనతాపహారి... పద్ధతిలో ఏడ్పించడం పేరడీ అవుతుందా ? దీని దినుసు వేరే. ఇలాంటి ప్రక్రియను తెలుగులో ప్రవచించడానికి ఏ నమూనా దొరికిందో తెలీదు కాని, రుక్మిణీ నాథశాస్త్రి మాత్రం శ్రీశ్రీ విదూషకాంశను పట్టేసినట్టుంది. కుటుంబరావు ఒక మాటన్నాడు.


పేరడీ ప్రక్రియమాత్రం తెలుగుకి కొత్తదే. పేరడీ అంటే కోతి కొక్కిరాయి కవిత్వమని నోరి నరసింహశాస్త్రి వర్ణించినట్లుగా ఇటీవల శ్రీశ్రీ రాశాడు. ఏ సాహిత్యంలోనైనా అలాంటిది వుంటుంది. ఎమి తిని కపితము సెపితివి గానీ, అండజ భీము ఉండ గానీ, మేక మెకమేక మెకమేక గానీ నోరివారి కోతికొక్కిరాయి కవిత్వమే. చంద్రరేఖా విలాసాన్ని చంద్రరేఖా విలాపంగా సాంతం మార్చింది. విదూషక తత్వం కాదు. దూషక తత్వమే. పేరడీ కవిత్వం అలాంటిది కాదు. ధూర్జటికవిని తెనాలి రామలింగకవి తెలిసెన్ భువనైక మోహనోద్ధత సుకుమార వార వనితా జనతా ఘనతాపహారి... పద్ధతిలో ఏడ్పించడం పేరడీ అవుతుందా ? దీని దినుసు వేరే. ఇలాంటి ప్రక్రియను తెలుగులో ప్రవచించడానికి ఏ నమూనా దొరికిందో తెలీదు కాని, రుక్మిణీ నాథశాస్త్రి మాత్రం శ్రీశ్రీ విదూషకాంశను పట్టేసినట్టుంది. కుటుంబరావు ఒక మాటన్నాడు.


Long rolling a ruinous red eve And lifting a mutinous lid


To all monarchs and matrons I said" | Would shock them" and did !


మాతృక లాగానే వుంటూ అర్ధాన్ని లఘువు చేస్తూ, అపహసిస్తూ తల్లివేలితో తల్లికన్నే పొడిచేలా రూపొందే రచనా పుత్రికను పేరడీ అనవచ్చు. మాతృకను మక్కీకి మక్కీ అనుసరించనక్కరలేదు. మొక్కట్లు కనిపిస్తే చాలు. రాయప్రోలువారి శైలిని హితోపదేశంలో ఎంత సరసంగా దురుద్దేశరహితంగా హేళనచేశారో(పుట103) తెలుపుతుంది. తల్లి నోట్లోంచి వూడిపడ్డట్టుగా తల్లినే మరిపించేదానికి ఆ పక్క పుటలోని కొత్త ఎంకిపాట చాలు. అబ్సర్డ్ స్థాయిని కొంచెం దించి హాస్యం పుట్టించేది మృత్కణానికీ, మత్కుణానికి సంబంధించింది (పు.113114లు). శుద్ధహేళనకు గొప్ప తార్కాణం, మల్లవరపు విశ్వేశ్వరరావుగారి రచనను యెద్దేవాచేసిన “కఞ-కఞ (పు 126-128లు). నాయని సుబ్బారావు ఖండిక "ఆసురకృత్యము" ముగ్ధప్రణయ విఘాతకుణ్ని గంభీరంగా నిరసిస్తే, పేరడీలోవాడు దగుల్బాజీ అయ్యాడు. విదూషకత్వం పరాకాష్ఠ పొందింది విశిష్టాదైత్వంలో. అక్షింతలు పేరడీ కాదు. ఆ ప్రయోగం విచిత్రమైన హస్తలాఘవంలాటి కూర్పు నేర్పరితనం. వీటన్నిటినీ తలదన్నేది వచన పేరడీలో వున్న ఒక శిలాశాసనం. రుక్మిణీనాథశాస్త్రి వ్యుత్పన్నత ప్రతిభాదీప్తిచేత అసాధారణంగా రాణించింది. నీదు మార్గాన నియంత నేతలేడు అని పేరడీ సందర్భంగా ఆయన మాటలను ఆయనకే అప్పజెప్పవచ్చు. శ్రీశ్రీ దేశచరిత్రలు కూడా పేరడీ అయిందట గాని కనిపించి చావందే ?


ఏ కాకి చరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం ?


ఇలా మొదలైందని శ్రీశ్రీ, ఆరుద్రా చెబుతూన్న యీ పేరడీ విషయంలో చెరో చరణమో అంగులో గుర్తుందిగాని పూర్తిపాఠం ఎవరికీ


కంఠోపాఠం కాలేదు. ఆ లోటుని మాచిరాజు దేవీప్రసాద్ బాగానే భర్తీ చేశాడు. ఏమైనా రుక్మిణీనాథశాస్త్రి హస్తవాసి వేరే, పేరడీశాస్త్రం సారమెరిగి తాను పేరడీశాస్త్రి కాలేదు. శాస్త్ర నిర్వచనాలూ, గట్రా చూదామా?


అలెక్ట్ ప్రేమింజర్ ఎడిట్ చేసిన ప్రిన్స్టన్ ఎన్సైక్లోపీడియా పొయిట్రీ అండ్ పొయిటిక్స్ (1974)లో, PARODIA అనే గ్రీక్ మూలంనుంచి ఇంగ్లీషు శబ్దం పేరడీ ఏర్పడిందని వుంది. ఎదురు పాట (Counter song) అనే కావ్య విశేషం ఒకటి సుప్రసిద్దమే గదా, సదరు ఓడ్ను తలపించే ఎదురు ఓడ్ పేరోడియా అవుతుంది. వెబస్టర్ న్యూ వరల్డ్ డిక్షనరీ" (1956)లో రెండర్థాలిచ్చారు.


1. Literary or musical composition imitating the characteris tic style of some other work or of a writer or composer but treating a serious subject in a nonsensical manner in an attempt at humour or ridicule..


2. A poor or weak imitation.


మనకు కావలసింది పై వాటిలో మొదటిదే. సంగీత సాహిత్యాలలో ఒకానొకని కృతికి విలక్షణమైన శైలిని అనుకరిస్తూనే, గంభీరమైన ఆకృతి విషయాన్ని హాస్యం కోసమో, హేళన కోసమో అర్థరహితమయ్యేట్టు చూపే సాహిత్య సంగీత అనుకృతి పేరడీ.


విషయాన్ని అలాగే వుండనిచ్చి వికృతరూపమిస్తే ట్రేవెస్టీ అవుతుందనీ, నిజానికి మరీ అతిశయంగా, అడ్డూ ఆపూ లేనట్టుగా మూలాన్ని పేరుకి మాత్రమే అనుకరిస్తే బర్ట కాగలదనీ Cassell's Encyclopaedia of Literatureలో అనుకరణ భేదాల వివరణ వుంది. పరమోత్తమమైన పేరడీ, మూలరూపానికి మాత్రం విధేయంగా వుంటూ వస్తువుకేమో చేటు కలిగించేదని కొద్దిలో చెప్పారు. అయితే అలాంటి పరమోత్తమత చాలా అరుదట. ప్రాచీనకాలంలో ఆరిస్టొఫేనీజ్ మొదలు ఆధునిక యుగంలో జేమ్స్ జాయిస్ దాకా గొప్ప పేరడిస్టులుగా పేరు తెచ్చుకున్నవాళ్ళు విడి


విడి కావ్యఖండికలను గాక, కవులనూ, కవితారూపాలనూ అనుకరించారు. ఒకే ఒక కృతిని పేరడీ చేసి సెబాసనిపించుకున్న వారిలో బైరన్ ఒకడు. సౌతీ ఖండిక "ది విజన్ ఆఫ్ జడ్జ్మెంట్ (The vision of judgement) ను అనుకరించాడు. అలాగే వర్డ్స్ వర్త్ రచన పీటర్ బెల్ను షెల్లీ అద్భుతంగా అనుకరించాడు. అనుకరణలో సృజనాత్మకత ఎంత వుంటుందో విమర్శ అంత వుంటుంది పేరడీ ప్రతిసృష్టి.


ఉదాహరణకు సరదాపాట పెట్టినందువల్ల కూడా చిత్రమైన ఫలితం − ( 12\


కేవల విదూషక చర్యకు కోతి చాలు. నోరి నరసింహశాస్త్రి కోతి యిదే. కుశాగ్రబుద్ధి అయిన ప్రతిభాన్వితుడు ఎవరిని అనుకరించాలనుకుంటాడో వారి ఆనుపాను లెరిగి, వాటినేమిచేస్తే తానుద్దేశించిన ఫలితం కలుగుతుందో తెలుసుకోగలగాలి. మహోదాత్త మనిపించే మూలరచన పేరడీకి బాగా పనికిరాగలదు. దాన్ని తెలివిగా కదిపి కుదిపితే ఆ వుదాత్తత వుల్టా సీదా అవుతుంది. సందర్భశుద్ధి తప్పిందా, దాని గంభీరభావం అభావమై హేళనపాత్రమౌతుంది. అసలు శీర్షికను మార్చి తమాషా శీర్షిక కలుగుతుంది. శ్రీశ్రీ నవకవిత యిలా మారింది గాని దాని అర్థపుష్టికి ఏమీ కాలేదు గనక యిలాంటి పేరడీ మేలురక మనిపించుకోదు. పేరడీ అంటేనే అతిశయత్వం. మూలానికి గల సందర్భాన్ని మార్చినందుచేత దానిలో ప్రముఖంగా వుండిన అంశాలను విడగొట్టి వూతమిచ్చి చూపినట్ల వుతుంది. గొప్ప పేరడీలు కొన్ని వేరే సందర్భాలలోనైతే మూల కృతులుగానే చలామణి కావచ్చు. ఏవో కొన్ని మాటలను మాత్రమే అరువు తెచ్చుకుని అనుకృతిలో చేరిస్తే, దాన్ని పేస్టీష్ (Pastiche) అనవచ్చునేమో గాని పేరడీ రూపభేదమనడం సరి కాదు. కాల్పనిక కవిత పేరడీలకు భేషైన సదవకాశం. ద్వాదశి చూడండి. విశిష్టాద్వైతం కూడా ప్రణయం సైతం. దీనికి కారణం, ఆ ధోరణి కవితలోని భావోల్బణం.


హేళనకోసం హేళనే పేరడీ లక్షణం కాదు. దానికో కారణం వుండాలి. సకారణ హేళన పరోక్ష విమర్శ, పేరడీకారుడు తన కాలపు ఆచారు


వ్యవహారాలనూ, రాజకీయ, నైతిక పద్ధతులనూ, విలువలనూ వ్యంగ్యంగా నిరసించడం అవసరమౌతుంది. లేకుంటే పేరడీకి ప్రయోజనం లోపిస్తుందని ఎన్సైక్లోపీడియా బ్రిటానికాలో (14వ ఎడిషన్, 17వ వాల్యూము) ఇ.వి. నాక్స్ రాశాడు. ఇవేవీ లేనిపక్షాన పేరడీ పేరుతో వెలువడుతూ వున్నది క్షుద్రవినోదం అయే ప్రమాదం వుంది. ఛందస్సు, దాని నియమాలు ఎక్కడా భంగపడగూడదు. ఇది కత్తిమీద సామేగాని గారడీ మాత్రం కాదన్నమాట.


ధేసోస్ నివాసి హేజిమాన్ పేరడీ ప్రక్రియకు పితామహుడని ఆరిస్టాటిల్ అభిప్రాయం. హోమర్ మహేతిహాసం ఇలియాడ్ కు ఇఫీనస్ వాస్తవ్యుడైన హిప్పోనార్స్ అద్భుతమైన పేరడీ సృష్టించాడట. ఈస్కిలస్, యూరిపిడీజ్ గొప్ప నాటకకర్తలు. ఆరిస్టోఫేనీజ్ కూడా అంతే ఘనుడు. అయినా మొదటి యిద్దరికీ తాను పేరడీ చేశాడు. మధ్యయుగాల వీరశృంగార గాథాసంప్రదాయాన్ని సెర్వాంటెస్ డాన్ క్విక్సోట్లో చేసింది పేరడీయే. షేక్స్పియరంతటివాడు మార్లోను మర్కటించాడు. ఇంగ్లీషు సాహిత్యంలో పోప్ూ, థామ్సన్నూ, యంగ్నూ అనన్యంగా పేరడీ చేసి వదిలింది ఐజాక్ హాకిన్స్ బ్రౌన్. ఇతనితోటి పేరడీకి స్వర్ణయుగం ప్రారంభమైనట్టు భావిస్తున్నారు. ఇది నేటికీ అనుస్యూత మవుతూంది. ఏమైనా అనుకరణకు లక్ష్యం సంస్కరణ. హేళన మూలంగా ఇది సూచ్యం కావాలి. ఈర్ష్యాసూయలకూ, ద్వేషానికీ ఇది చోటివ్వగూడదు. a critical act of imaginative reproduction అనే నిర్వచనం సార్థకం కావాలి. మరెందుకైనా కాకున్నా, పేరడీ ప్రక్రియను ప్రచురం చేసి తెలుగు కవిత్వంలో దానికి ప్రసిద్ధి చేకూర్చినందుకు రుక్మిణీనాథశాస్త్రి కీర్తి చిరంజీవి.


5


రుక్మిణీనాథశాస్త్రి కావ్యాలు లభించినంతమట్టుకు ఈ సంపుటాని కెక్కుతున్నాయి. ఇది సమగ్రమని అనడం లేదు. సహకరించదగినవాళ్ళు


మాటకు కట్టుబడి వున్నా యిది సమగ్రమయేది కాదు. ఎందుకంటే, అవి మరెన్ని పత్రికలలో పడివున్నాయో నిశ్చితంగా తెలియదు. మారు పేర్లతో రాసే దురలవాటు వుండినందుచేత ఏవి ఆయనవో, ఏవి ఇతరులతో తెలిసే వీలు తక్కువ.


ఈ సంపుటానికి యీ మాత్రం నిండుదనమైనా చేకూరడానికి ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, బంగోరె, అనంతం వంటివారు తలా ఒక చెయ్యి వెయ్యడం కొంతవరకు కారణం. పేరడీలకేగాక సాదా రచనలకు కూడా పూర్వాపరాలు చెప్పి విషయపరిజ్ఞానానికి తోడ్పడినవారు ఇం.హ.శా. ఆరుద్ర నడిగితే దీనికి అక్షింతలు అని పేరెట్టి వుండును. నేనాపని చెయ్యడం లేదు. ఆ పేరైనా రుక్మిణీనాథశాస్త్రి అంగీకారం పొంది వుండేదా? నమ్మకం లేదు.


నిజానికి శరత్పూర్ణిమ (జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి కథల సంపుటి) కంటె ఇది ముందు రావలసింది. బాపు చిత్రరచన వగైరా అవసరమైనందు చేత రెండవదిగా వెలువడుతోంది. నాటికలు, వ్యాసాలు, సమీక్షలు, ఇతర వచన రచనలు మూడో సంపుటిగా వస్తే రచయితగా రుక్మిణీనాథశాస్త్రి పూర్ణవ్యక్తి లోకం ఎదుట అక్షరరూపంలో సాక్ష్యాత్కరిస్తుంది. పెద్దమనస్సు చేసుకున్న నవోదయ పబ్లిషర్సు అభినందనీయులు. గైషామ్స్ వంటిదొకటి తెలుగు సాహిత్యంలో ఇప్పుడు మంచి దాన్ని కిందుజేసి కీతసరుకుని లాభసాటి చేస్తూ బళ్ళకు బళ్ళు దించుతున్న సమయంలో మరుగునపడిన మంచి రచయితలకు మళ్ళీ సూర్యాలోకం కలిగించడం విశేషం కాదా మరి? కనీసధర్మంగా, మధ్యే మధ్యే యిలాంటి మేలిరచనలను ప్రకటించినా ఫర్వాలేదనుకోవచ్చు. వెలలకోసం గాక, విలువలకోసం సాంస్కృతిక పోరాటం సాగుతూంది. సంస్థ నష్టపోగూడదుగాని, లాభాల వేటకు ఉత్తమత్వాన్ని బలిపెట్టనూ గూడదు. 


- పేరడీ ప్రక్రియ - రుక్మిణీనాథశాస్త్రి - పరిశీలన – కె.వి.ఆర్ - జరుక్ శాస్త్రి పేరడీలు ( P. 19-25 ) 


కె.వి. రమణారెడ్డి

జవహర్ భారతి కావలి

జరుక్ శాస్త్రి పేరడీలు

15-4-1982


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...