Showing posts with label Poetry. Show all posts
Showing posts with label Poetry. Show all posts

Sunday, February 20, 2022

కవిత ఆమని అరుదెంచె .. జి.కె. సుబ్రహ్మణ్యం

 కవిత 

ఆమని అరుదెంచె .. 

జి.కెసుబ్రహ్మణ్యం 


వగరు చివురుల మెక్కి

ఎలకోయిలలు

వలపు రాగాలు ప్రకృతికి నేర్ప

చిగురుటాకుల తొడిగి 

ప్రతి తరువు పచ్చదనాలు మెరయ

విరిసిన పూలనెత్తావుల పులుముక 

రంగుపుట్టములు తొడిగి

నిన్న ఎరుగని వన్నెచిన్నలు

నేడు తొంగి చూడ

సొగసులు సౌదామినిగా 

ఆమని అరుదెంచె!


నవవత్సర అరుణోదయాన 

పుడమి పగడపు కాంతులందింప

గుబురు కొమ్మల తీవెలు పూరెమ్మలు

ప్రణయ వీచికల  తలలూప

కొమ్మక్రీగంటి చూపుల పులకింప

ప్రకృతి జగతి రసడోలికల తూగ

ఏటికొకసారి వేపపూల రుచిచూప

 వేడుకల నందింప ఆమని అరుదెంచె


మింట తారకల వెలుగు తోరణాల

తారణను స్వాగతింప

అవని హరిత వనాలు

హర్షమున ఆహ్వానింప

కవుల కలాలు అక్షరపూజ సేతు

సకల కళావిశారదగా

పొత్తుల పొదరిళ్ళ

పాలకుల వరాల వాగ్దానాలు

ప్రజకు కొత్త ఆశలు రేప 

మోడువారిన ఓటరు

బ్రతుకు పల్లవింప

కొత్త ప్రభుత

ఎన్నికల కలహంసలా

రాజహంసలా

ఆమని అరుదెంచే!

Monday, December 27, 2021

కవిత: యూనివర్సల్ ట్రూత్

 


కవిత: 

యూనివర్సల్ ట్రూత్


శీరోదయంతో మొదలిడి 

కపాల మోక్షంతో ముగుస్తుంది జీవితం! 

ఇదొ క'యూనివర్సల్ ట్రూత్ 

అయినా  

ప్రతివాడూ  అనుకుంటాడు

తానొక ఎక్సెప్షన్


ఈ శరీరం అగ్నిహోత్రుడికి

ఆహుతవుతున్నపుడు 

ప్రాణం గాలిలో ఏకమైనపుడు 

అస్థికలు మట్టి పాలైనపుడు 

చితాభస్మం నీటిలో కలిసి 

ఆత్మ అంబరాన్ని 

చుంచించేందుకు వెళ్లినపుడు 


అందం, ఆస్తి ఆదుకోవు 

వంశం, గోత్రం అడ్డు రావు 

బంధం. అనుబంధం తో డురావు 

జాతస్య మరణం ధృవం.


అయితే 

కొందరు బ్రతుకుతూ చస్తారు. 

కొందరు చస్తూ బ్రతుకుతారు.  

కొందరేమో చచ్చినా చావరు..  

మరుభూమిలో ఓ మజిలీవేసి 

పంచభూతాలను పలుకరించి. .. 

మళ్లీ మనలో కొచ్చేస్తారు 

లబ్ధ ప్రతిష్టులవుతారు .


-కె. సీతారామగిరి

సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

                 27-12-2021 

                 బోథెల్ ; యూఎస్ఎ 


కవిత : కానుక

కవిత : 


కానుక


( తోటి ఖైదీ, బెల్జియన్ మిత్రుడు ఆండ్రీ కోసం)

రెండవ ప్రపం యుద్ధంలో పాల్గొని మరణించిన రష్యన్ ఫ్రంట్ లైన్ కవులలో మస్సాజలీల్ ముఖ్యుడు. నాజీలు ఇతన్ని 1944లో ఉరితీశారు. నిర్బంధంలో ఉండగా జలీల్ మంచి కవిత్వం రాశాడు. అందులో ఒకటి: 


మాతృభూమిలో

జీవితం తియ్యగా ఉన్న రోజుల్లో

పువ్వుల మధ్య గడిపిన ఆ సమయాల్ని 

మళ్ళీ వెనక్కు తీసుకు రాలేను నేస్తం 

ఆ ఆనందమూ లేదు.


ఇక్కడ తోటలూ లేవు ఇళ్ళూ లేవు

స్వేచ్ఛ అసలే లేదు

ఇక్కడ 

పువ్వులు కూడా వేగంగా వాడిపోతుంది  

ఇక్కడ నేల కూడా నిర్బంధంలో మూలుగుతోంది


కానీ

నా చైతన్యం మాత్రం

సత్యంలా స్వచ్ఛంగా 

పరిశుభ్రంగానే ఉంది 

అందుకే

 నా హృదయంలో వికసిస్తున్న పాటల్ని

నీకు కానుకగా ఇవ్వనీ 

వాటికి మరణం లేదు

అవి చెరసాలలో 

ఈ ఆత్మ పూస్తున్న చెలిమి పువ్వుల్ని 

నా మాతృదేశానికి తప్పక అందిస్తాయి.


రష్యన్ కవిత : మస్సాజలీల్ 

అనువాదం : కొప్పర్తి

సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

                 27-12-2021 

                 బోథెల్ ; యూఎస్ఎ

Friday, December 24, 2021

కుమారి మొల్ల - కీ.శే. వారణాసి శ్రీనివాసరావు ( ఆంధ్రపత్రిక- 1948, జనవరి 14 - సంచిక నుంచి ) సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 24-12 - 2012



కుమారి మొల్ల 

- కీ.శే. వారణాసి శ్రీనివాసరావు 

( ఆంధ్రపత్రిక- 1948, జనవరి 14 - సంచిక నుంచి ) 

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

24-12 - 2012 


పూల మొక్కలు ఉన్న తోటలో నొక కాలుపగట్టున కూర్చున్న నన్ను సమీ

పిస్తూ కుమ్మరి మొల్ల—]

ఏం నాయనా , నన్నాహ్వానించారు? 

నేను: తమరు  నమస్కారం మానేసి, ఏకవచనాన్ని  ప్రయోగిస్తేగాని నేనేమీ మాట్లాడాను.


మొల్ల : అదేవిటి మీరు బ్రాహ్మణులు; మేము కుమ్మర్లం . 


అయితే నేమమ్మా? నాకంటే పెద్దలు అన్ని విధాలా


ఐతే మటుకు  కులమెక్కడికిపోతుంది?


మీరు దణ్ణాలు పెడితే అందుకోవడం, పేర్ల చివర రావు తగిలించుకోవడం, మీ చేత బహువచన ప్రయోగాలు  అందుకోవడం అవన్నీ మీ కాలపు వాళ్లకే తగిపోయింది. మేమేదా పాత కాలపువాండ్లం. మూర్ఖప్రపంచ సంబంధీకులం. మా వ్యక్తిత్వాన్నట్లా ఉండనీయండి .


తమ విషయం నాకు ముచ్చటగా వుంది. కాని ఐనా నా పట్ల, ప్రేమ కోరిన చనువును చూపించండి 


సరే, నీకంత పట్టుదలెందుకు? అల్లాగే కాని, నన్ను పిల్చిన కారణమేమి నాయనా ? .


మీ రాంధ్రంలో కవిత్వం చెప్పారు కదా! 


నన్నూ నా కవిత్వాన్నే చెప్పు శాయనా ! ఆంధ్రంలో కవిత్వం చెప్పి నలుగురి మెప్పు పొందుదామని ఆశ పడ్డ  మొదటి స్త్రీ వ్యక్తిని నేనే అనుకుంటా.  అది నాకేం  పొండత్యం ఉండి కవిత్వం చెబుదామని కాదు .  చిన్నప్పుడు నాకు ఎంతసేపూ  చదువు కుందామని పుండేది. మా వృత్తిలో  త్రిప్పడం కోసం మా అమ్మ కుండలిస్తే  రెండు మూడు సార్లు నా చేతుల్లో పగిలిపోయాయ్. ఆది చూచి మా ఆమ్మ తిడుతూంటే , మా వూళ్లో కొక బ్రాహ్మణ పండితుడు కని పెట్టి నాకు చదువు చెప్తా రమ్మని, కొంత కాలంలో పంచకావ్యాలు వంటపట్టించారు. ఆయన గారికి ఆంధ్రం,భారత, భాగవతాలంటే ప్రాణం. వారు రోజూ చదువుతుంటే వినేదాన్ని. కొంతకాలానికి శ్రీ సరస్వతీ కటాక్షం వల్ల నాకు పద్యాలు రాయడం అలవడ్డది . అప్ప ట్నుంచీ యేకథ వ్రాద్దామా  అనుకుని, రామ కథమీదికి మనస్సు ప్రాకితే దాన్ని వ్రాయడ మారంభించి పూర్తి చేసా. అదే నాయనా  నేను వ్రాసిన గ్రంథం. ఆదేమీ గొప్పదేంకాదు . 


చిత్తం. తమరా గ్రంథం విషయంలో పడ్డ ఆశ నెరవేరలేదా ?


నెరవేరకేం? 


అంటే నాకర్దం గాలా! 


అర్థం కావడానికేముంది నాయనా! నేను ఆడదాన్ని, నా కవిత్వ మంతపటుత్వమైందికాదు .


అదేమిటండీ, ఆడవా  చెప్పిన కవిత్వ మని తప్పక మెచ్చుకోవాలే! 





ఆడది కుండ లోముధోకక విశ్వం చెప్పడ వేమిటి యీ మాత్రం పద్యాలు చెప్పక పోతే భాషకేం పరువుతుందాని మా కాలం లో నోగలవాండ్ల ఊహ. నీవన్న భావం మీ కాలంలో ప్రబలినంత మా కాలంలో ప్రజలలో 1: అదేం మ్యాటండీ? నాయకురాలి వీర త్వం పొగడ్త స్కెలా ?


మొ: నాయనా, ఇది కవిత్వంగా, నాయకు కాలీ ఛైన్యకయి - బ్లాగ నా కవిత్వం మగా కృమము లగూర్చోపెట్టేది కాదుగా, నే: పొరబాటన వాళుకురాలి సంగతి కడివా, స్త్రీ కవనాన్ని సున్నితమైన విషయ


ముగా వెంచకపోవడం పౌరుపలోపం. మొ : ఈ భావాల్నేటివి గాని, వాటివి కావు. 1 అంచేత తమకో స్క్ర్కీ డేర లేదన్నమాట!


వీడేరలా. పామరల్లో డొక్క శుద్ధియైన వాం చింతా అభిమానించి మల్లమ్మ కాగా చిక్కని కజనం కెళ్తారని పొగిడేవారి ఆపా X నాకు రుచిస్తుందా నాయనా : ఎవడైనా పండిత


1: ఓహో ! (కొంచెముండి) నా కిప్పుడర్ధ మౌతూంది. ఆదా రపకు నొప్పి కలిగించింది! కొన్ని శతాబ్దాలైనా యింకా మరపు పుట్టిం చంది ! చిత్తం, నాన్ని మరిచి యింత సేపు తరచినందుకు నన్ను క్షమించండి.


మొః అయితే శేం చివర కాశ్య మాడ్చా రచుకోండి. నేటికి లోపించినపుడలా యెందరున్నా "ముల్లా: చే ఇంత తొందరి బడి నిన్నిట్లాగంటిని !" అని నొచ్చు కుంటారను కోండి ఏం లాభం! అవాళలుగుల్లో తిలకంపు ___లైంది కదా!


సే పోనీందమ్మా! ఎవరో ఒక రఇక పోతే మునిగిపోయింకా, ఆంధ్రలోకమంతా ఏకగ్రీవం గా, మొల్ల రామాయణం కారు టుందంటూంటే!


మొ: ఔననుకోండి! ఆ పధలో వసభ్య వాక్యం బుట్టిందా, లేదా? నే: అనకూడదనుకోండి.


మర్నాడు... మొ : ఆC, ప్రొద్దున్న వచ్ళారు: కూర్చ న్నారు: చదువిస్తున్నారు. అన్నిపొవాదులు మరచి సాయంత్రం దాకా కూర్చుని విన్నారు. ఏమైనా ఆడదాన్నని అంత నిరసన చేసారు.


కాలంలో మావాళ్ళు మగాళ్లకు మల్లే పర్వివిష యాల్లో శక్తి మంతుల మని నిరూపించారు. అంక పని మేము చేయలేకపోలా కాలానికి మా కమః సంఘసారానికి కట్టుబడ్డాంకాని, అప్ప కీమాందరు శ్రీ రాక్రమా దేవి ఝాన్సీ och మ్మభాయంటివారు కొంత సాహసించారు...


నే తనురేదో రెండు పేర్లుమాత్రమే చెప్పారు. ప్రపంచచరిత్ర పరిశీలిస్తే పేరో గిన కాంతామణులు కొన్ని వేలమందుటారేమో?! అంతవరకెందుకు? తెల్లాళ్ళ సిద్ధాంతా ల్నిజ ‘మైతే మానససంఘంలో నో ప్రథమం లో సర్వాధి కారు డవాండ్ల దేమో ! తిమరుస్వర్గంలో • ముంటారుకదా! వారిలో పర్వహ • రంటారు. • వాల్లోనే పెద్ద పై నా అడిక్కనం క్కోకపొయ్యారా?


మొ: మీ కీవాం ధుండడం సహజమే కాని ఆ దీడిగడానికొక్క అభ్యంరముఁది, వారంతా పర్వజ్ఞరేగాని వార్లో చెవర్నైనా పలకరించే వీలుందా ? అట్లాటిరేకై నా వార్లో నెవరినై నా కదిలించడంతో లే చిరు నవ్వు నవ్వి మరొక విషయ మెత్తుతారు. నా రెంట సేపటి కీ మానవులు - తమకు భగవంతుడు కటాక్షించిన శక్తిసామర్థ్యా లతో సకలము తెలుసుకొన బ్రయత్నించాలని వుంటుందనుకుంటా. అట్లా లేకుం ప్రేమన కున్న యే కొద్దిపాటు ప్రేమలో పూర్తైం తర్వాత మనకు కాలక్షేపమెటాగా అని ఊహిస్తా దనుకుంటా. ఆటాటివిషయాలు మా కెవరి కైజా తెలిపితే మే మీరోకారికి రాకపోక


మనము అంటూంటాం. (ఆకాశంనుండి) మొల్లా, శచీదేవి గారి


: ఆరురంతో రేచి) వాయశా (నిష్క్రమణ) సే ఆరే! మిగతా వారంతా కొంత తనివి తీక మాట్లాడిజిల్లా రీమెగా రుహశాత్తు గా వెళ్లారు. పోనీ, ఐనా మన మనిగాల్సిన విక చే మున్నాయీ మెను ? పాప మేవో కవిత్వం చెప్పాగుకాని తా మెన్నడు నే విషయంలోనూ ఘనుల మనుకోలా. సరే, యింకా కవులలో నెదరు మిగి లున్నారు. మిగులకేం! చాలామం దున్నారు కాని, పైవారి పంధల పడిచిన వారేగాని వారిలో స్వతంత్రం లెక్టరూ కాన్పిం చరు, మన కాలంలో వారిని కదిలిద్దా మెంటే లాభం లేదు; పైనబడి కరుస్తారు; కొడ్తారు. కూడాను — లేకపోతే పాకిపాడొ వారి లక్ష ణాన్ని గ్రహించి పొడిర్భంపినా చంపుతారు. వీరు మనల్ను ఏదిబడితే అదడి మాత్రంవాడా అని. అకొక నేనెట్టెను కదిలించినట్లవుతుందినేని దొరకదన్న మాట. సరే ఇక చక్రవర్తుల వాప్వోసిద్దాం. ఇంఠతో ఆగుదాం. ఇంకోసారి ఎప్పుడైనా?


( ఆంధ్రపత్రిక- 1948, జనవరి 14 - సంచిక నుంచి ) 

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

24-12 - 2012

బోథెల్‌; యూ. ఎస్.ఎ

Thursday, December 16, 2021

లాస్ ఆఫ్ ఇన్నోసెన్స్ - కె. శ్రీనివాస్ 25-03-2005 ( కె. శ్రీనివాస్ - సంభాషణ - నుండి ) సేకరణ - కర్లపాలెం హనుమంతరావు


 




లాస్ ఆఫ్ ఇన్నోసెన్స్

-  కె. శ్రీనివాస్ 

25-03-2005

( కె. శ్రీనివాస్ - సంభాషణ - నుండి ) 


సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 


ఆశ అన్ని వేళలా అకస్మాత్తుగా భంగమై పోదు. దీపంలాగా కొద్ది కొద్దిగా కొడిగట్టిపోతుంది. వెలుతురు లాగా మెల్ల మెల్లగా మసకబారుతుంది. దిగులులాగా ముడుతలు ముడుతలుగా ముఖాన్ని కమ్ముకుంటుంది. ధైర్యంలాగా కొద్ది కొద్దిగా ఆవిరవుతుంది.


ముందే హెచ్చరించిన శకునపక్షి చివరికి అపహసిస్తుంది. పర్యవసానాల జ్ఞానం లేనందుకు బుద్ధి కించపడుతుంది. అనుభవం ఒక కవళికగా మారి పోతుంది. పలితకేశంగా ప్రకాశిస్తుంది.


ఉమ్మనీరూ చిమ్మచీకటీ వదిలి లోకంలోకి వచ్చి నప్పుడు- ఓపలేని వెలుగులో కళ్లు మూసుకుపోతాయి, స్వతంత్రత లోని విచ్ఛిత్తికి గుక్కపెట్టి శిశువు రోదిస్తుంది.ప్రపంచం పరిచయమవుతున్నప్పుడు సకలేంద్రియాలూ విప్పారతాయి. గుండె కొంచెం కొంచెంగా విచ్చుకుంటుంది. 'కావున లోకపు టన్యాయాలూ కాల్చే ఆకలి కూల్చే వేదన' తెలియక శైశవగీతం కేరింతలు కొడుతుంది. ముక్కు పచ్చలన్నీ ఆరిపోయి ముఖంలోకి ముగ్ధత్వం వస్తుంది.


పాలబుగ్గల నిగారింపు, లేత చెక్కిళ్ల మెరుపులు, ఆశ్చ ర్యంతో మెరిసిపోయే కళ్లు, అయాచితంగా కురిసే చిరునవ్వు, తారసపడిన ప్రతి ధ్వనినీ ఆలకించే మనసూ- కాలం చిరు

జలపాతంలాగా వర్తిస్తుంది. లేగలాగా గెంతులు వేస్తుంది. చదువై, పెంపకమై, సంస్కృతై విలువలై, ధర్మశాస్త్రమై- చిరుమోతాదు విషంలాగా సమాజం లోలోపలికి ప్రవేశిస్తున్న కొద్దీ బాల్యం లౌల్యం అన్నీ మృతకణాలుగా నిష్క్రమిస్తాయి. ఉడుకు నెత్తురు యవ్వనం గరళకంఠమై ప్రతిఘటిస్తుంది. సంపాదన, సంసారం, అధికారం సుడిగుండంలో దమ్ము చెదిరి కబడ్డీ కూత ఆగిపోతుంది. ఇన్నోసెన్స్ ఇంకిపోతుంది.


సెప్టెంబర్11తో అమెరికా తన ముగ్ధత్వాన్ని కోల్పోయిందని ఎవడో ఆత్మవంచకుడు మొదట అన్నాడు. తనమీదికి ఎవరూ దాడిచేయలేరన్న నమ్మకమే ఆ ముగ్ధత్వమట. అజ్ఞానం వేరు. అహంకారం వేరు, అమాయకత్వం వేరు. ఏదయితేనేం, తొలగవలసిన భ్రమలే తొలగినాయి. ముగ్ధ అమెరికాతోటే ముప్పుతిప్పలు పడ్డ ప్రపంచం నేటి ప్రౌఢత్వంతో పరమనరకాన్ని చవిచూడవలసి వస్తున్నది. నెత్తుటి వెల్లువ కట్టలుతెంచుకున్నప్పుడు, ముగ్ధత్వం కొట్టుకు పోయిందని, ఉత్తములు నిస్పృహలో కూరుకుపోయి అధములు ఉత్సాహంతో చెలరేగిపోతున్నారని-ఐరిష్ కవి యేట్స్ మొదటి ప్రపంచయుద్ధానంతర స్థితిని వర్ణించాడు. శిశువు నుంచి మనిషి పశువుగా పరిణమించేవరకూ కోల్పోయే మానవీయ ముగ్ధత్వం - మొత్తం మానవజాతి కూడా రకరకాల కాలాలలో రకరకాల దశలలో కోల్పోతూ వస్తున్నది. కొత్తరూపాలలో వచ్చే పాతద్రోహాలు, కొత్త ఆశలవరుసలో చొరబడిన భవిష్యత్ మోసాలు  అనునిత్యం ఆవిష్కృతమవుతూనే ఉన్నాయి. ప్రతి ఆశ చివరా 'యూ టూ బ్రూటస్' మూలుగు వినిపిస్తుంది. ప్రతి నమ్మకంలోనూ కోవర్ట్ పరిహాసం ధ్వనిస్తూనే ఉంటుంది.


అయినా మనిషి ముగ్ధుడవుతూనే ఉంటాడు. మెరిసే కన్నీళ్లను, చేసే ప్రతిజ్ఞలను చూపించే స్వర్గాలను తగిలించుకున్న విశేషణాలను యథాతథంగా స్వీకరిస్తూనే ఉంటాడు. ఆకాశాలను చేరువ చేసే ఆదర్శమంత్రోచ్చాటనలకు హృదయం అప్పగిస్తూనే ఉంటాడు. సినిక్ దర్శించే అంతిమ అనివార్యతలకు అంధుడవుతూనే ఉంటాడు. భగ్నహృదయాన్ని కొత్త ప్రేమలతో కుట్టుకుంటూనే ఉంటాడు. ఎన్నిసార్లు మాయ జయించినా సరే, అసంఖ్యాక అమాయకతలను అక్షయ తూణీరంలాగా సంధిస్తూనే ఉంటాడు. జీవితం చేసిన గాయాలతో ముఖమంతా ఎడారిగా మారినా సరే, లోలోపల ఒక ఒయాసిస్సును కడుపుతో ఉంటాడు.


చురుకు చూపులు, విషపు నవ్వులు, నొసటి వెక్కిరింతలు- వయసుతో పాటు ఓడిపోయిన ముగ్ధత్వం మీద మొలిచిన విజయస్తంభాలుగా కనిపిస్తాయి. మోహం మీద కామం, మందహాసం మీద వికటాట్టహాసం, ఆలోచన మీద వ్యూహం పైచేయి అయిపోయి బతుకు అరిషడ్వర్గాలతో లుకలుకలాడుతుంది. అయినా సరే, ఇంకా పసితనం సశేషంగానే ఉంటుంది. ఏ మూలలోనో శైశవం తొణికిసలాడుతూనే ఉంటుంది. నాగస్వరానికి ఉర్రూతలాగే లక్షణం మిగిలే ఉంటుంది. కొత్తగాలిలో కొట్టుకుపోవడానికి ఒక కిటికీ తెరిచే ఉంటుంది.


నమ్మాలి. అదుపుకోల్పోయి పరవశం కావాలి. ఆశల ఎంజైమ్ నిత్యం స్రవిస్తూ ఉండాలి. జ్ఞానుల ముందు, వివేకుల ముందు, సత్యం ముందు మాత్రమే కాదు- ఆషాడభూతుల ముందు, గిరీశాల ముందు, వాగ్దానాలు చేసే నేతల ముందు కూడా మంత్రముగ్ధం కావడానికి మనసు తెరిచే ఉంచుకోవాలి. మోసకారులకు భయపడి, మనసును మాయపరచుకోగూడదు. శకునికి భయపడి ఆటను మరువకూడదు. ఓటమిలో కుంగిపోతూ అంతిమ విజయాన్ని పలవరించాలి. అంధకారంలో ఒక సూర్యు ణ్ణి భ్రమించాలి. ప్రసూతి వైరాగ్యం వలె ఆశాభంగం మరునాటికే పిగిలిపోవాలి. బుద్బుదం పగిలినా మరో బుడగలోకి దూరిపోవాలి.


నెత్తుటి వెల్లువలో ముగ్ధత్వం కొట్టుకుపోయినా సరే, ఆ అమాయకతను కీర్తించాలి. ఎండమావి అని తెలిసేదాకా దాహం తీర్చిన ఆశను గుర్తించాలి. సంకెళ్ల మధ్య మందహాసాలను, ఉక్కుపాదాల కింద చెక్కుచెదరని చిరునవ్వును, మృత్యువు చెంత మనోధైర్యాన్ని నిలుపుకున్న ధీరులందరిలో నిలిచి వెలుగుతున్న అమాయకత్వాన్ని గౌరవించాలి.


- కె. శ్రీనివాస్ 

25-03-2005

( కె. శ్రీనివాస్ - సంభాషణ - నుండి ) 

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

                  బోథెల్ ; యూఎస్

                  16 - 11-2021 

Monday, December 13, 2021

రామకృష్ణుని గడుసుతనం సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 13 -11-2021 ( కీ.శే. దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి చాటు పద్య రత్నావళి నుంచి )

 



రామకృష్ణుని గడుసుతనం 

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

13 -11-2021 

( కీ.శే. దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి చాటు పద్య రత్నావళి నుంచి ) 


వాకిటి కావ౨  తిమ్మనికి రాయలువారెప్పుడో ఒక  మంచి శాలువ  ఇచ్చారుట . దాని నతఁడు కప్పుకొని క్రుమ్మరుటఁ జూచి, మన వికటకవి దానిపైఁ గన్ను వేసి, మెట్లనను దానిని కాఁజేయవలయునని యూహఁజేసి, యుపాయము గుదుర్చు కొని యొకనాడుఁ తిమ్మనిఁ బిలిచి మెల్లఁగా నిట్లు బోధించెను. "ఓయీ! కృష్ణ దేవరాయలవంటి మహారాజుగారి ద్వారపాలకుఁ డవై, యొక పద్యమునైనను గృతినందకుండుట నాకిష్టము లేదు.” అనఁగా "అయ్యా! తగినంత బహుమానము నియ్యనిదే కవులు పద్యములు చెప్పుదురా” యనెను. రామకృష్ణుడు “తిమ్మా, నే నుపాయముఁ జెప్పెద వినుము; ఒక్కొక్క కవి నొక్కొక్క చరణమువంతున నడిగితివేని సులభముగాఁ బదిపద్యములఁ గృతి నందఁగలవు. ఇంతకు వేఱక యుపాయము లేదని చెప్పఁగా నతఁడు సంతోషించి, మఱునాఁ డుదయమున వాకిట నిలచి మొదట వచ్చిన పెద్దన్న గారికిఁ దనకోర్కి ని దెల్పఁగా నక్కవి నవ్వి, యిట్లొక చరణమును జెప్పి లోపలికిఁ బోయెను.


క. “వాకిటి కావలి తిమ్మా


తర్వాత వచ్చిన భట్టుకవి నాశ్రయింపఁగా సాతఁడు..... 


"ప్రాకటమగు సుకవివరుల పాలిటిసొమ్మా


అనుచరణమును వ్రాసియిచ్చిపోయెను. పిమ్మట వచ్చిన తిమ్మకవి కీసంగతిని విన్న నింపఁగా నతఁడు


“నీ కిదె పద్యము కొమ్మా”


అని చెప్పి పోయెను. వీరి రాకను గనిపెట్టియుండి నాలు గవ వాఁడుగా వచ్చిన మన రామకృష్ణుఁడు -


“నా కీపచ్చడమె చాలు నయముగ నిమ్మా.”


అనిపూర్తిచేయఁగా తిమ్మఁడు మాఱుపలుక నేరక సెలువ నిచ్చివేసెను.” 


ఈకథవిని రాయలునవ్వి తిమ్మనికి వేఱక సేలువ నొసంగెనంట.


సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

13 -11-2021 

( కీ.శే. దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి చాటు పద్య రత్నావళి నుంచి ) 

కవిత్వ ప్రయోజనము : - కర్లపాలెం హనుమంతరావు




విత్వ ప్రయోజనము :

- కర్లపాలెం హనుమంతరావు


అభినవగుప్తుడు లెక్క ప్రకారం వాఙ్మయుం  ప్రభుసమ్మితం , మిత్రసమ్మితం, కాంతాసమ్మితం.  


వేదాయి  ప్రభునమ్మిఅలు . పురాణములు మిత్ర సమ్మితాలు.  కావ్యాలు  కాంతాసమ్మితాలు . 


కాంతాసమ్మితాలు  అంటే స్వాధీనపతిక సాథ్వీమణి తన రూప లావగ్యాలతో భర్తను వశపరుచుకునే పద్ధతి. ఆమె భర్తకు ఆ సందర్భంలో చేసే ఉపదేశం కావ్యం అవుతుంది, ఆ కావ్యం పరమార్ధం హృదయానందం. 



తరువాతి  కాలంలో ఈ కావ్య ప్రయోజనాల జాబితాను భరతుడు అనే మరో అక్షణికుడు ధర్మకామాలు, ఉత్సాహం , హితోపదేశం , విశ్రామజనకత్వం లాంటి వాటితో పెంచేశాడు.  

ఆ విశ్రామజనకత్వ'మే క్రమంగా  'ఆనంద' రూపంలో కలసిపోయింది.  


భామహుడు అనే మరో లాక్షణికుడు కావ్య ప్రయోజనాలకు ఆనందానికి అదనంగా కలిపాడు. 


 దండి  - సాహిత్యానికి  సామాజిక జీవన చిత్రణం  ప్రయోజనమన్నాడు.  


ఆనందవర్ధనుడయితే  తనకు ముందున్న  లాక్షణికులు కావ్యప్రయోజనాలుగా చెప్పుకొచ్చిన  ప్రీతి, కీర్తి, హితోపదేశాలలో  ఒక్క మనోప్రీతిని మాత్రమే కావ్యప్రయోజనంగా ఒప్పుకున్నాడు.  అభినవగుప్తుడూ కావ్యప్రయోజనాలన్నిం టిలోనూ ' ప్రీతిరేవ ప్రధానమ్' అన్నాడు. 


మమ్మటుడు ప్రాచీనాలంకారికులు కావ్యప్రయోజనాలుగా చెప్పుకొచ్చినవాటివన్నంటినీ ఒక జాచితాకి కుదిస్తూ  వాటన్నింటిలో   సద్యఃపర నిర్వృతి, ఉపదేశం ఎన్నదగినవి అన్నాడు .


ఇక పాశ్చాత్యుల దగ్గరికొస్తే,  ఆనంనం, ఉపదేశాలనే ప్రధానమైన  కావ్యప్రయోజనాల తీసుకున్నారు. 


వర్డ్సువర్తుది  ఆనందమే ప్రధానమనే వాదన . డ్రైడెన్, బ్లేక్ లు అ అందంతో పాటు నీతిబోధకం కూడా  అయివుండాలని అభిప్రాయపడ్డారు.   మిల్టన్ అయితే కేవలం నీతిబోధే  ప్రధానం అన్నాడు.   ఎడ్గర్ ఎలన్ పో కవిత్వధర్మం-   ఆనందానికి  సత్యంతో నిమిత్తంలేని ఆనంద అనుసంధానం.    ఫిలిప్ సిడ్నీకి  కవిత్వప్రయోజనాలకు  ఆనందసందేశాలు రెండూ ముఖ్యమే.  


చివరికి బ్రాడ్లీ మహానుభావుడు కావ్యప్రయోజనాలు ఏంటా అని తర్కించుకుంటూ కూర్చంటే అసలు కవిత్వమే పలచబడి పోతుంది  పొమ్మని కొట్టేశాడు . 


 ఆస్కార్ వైల్డ్  మరీ దారుణం. కళలన్నీ నీతిబాహ్యాలని ఈసడించుకుంటాడు .   నీతి అనేది మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్లకే తప్పించి మేథావులకు అక్కర్లేదని  ఆయన వాదన. 


పాశ్చాత్యులకు .. ప్రాచ్యులకు మధ్య తేడా ఒక్కటే! నీతిబోధ విషయంలో ఏకీభావం ఉన్నా .. నీతి బాహ్యం  విషయంలో  మాత్రం మరీ పడమటి అలంకారికుల్లాగా ప్రాచ్య మేధావులు  పోలేదు . 


నిజానికి అందంగా అల్లినంత మాత్రాన ఏ కావ్యమూ ఉత్తమమైనది కాలేదు . ముద్దుపళని  ' రాధికా సాంత్వనం ' ఇందుకో ఉదాహరణ. ఆ కావ్యం చదివే సమయంలో హృదయం  ఓ రకమైన ఆనంద డోలికల్లో ఊగవచ్చు .  కానీ, మొత్తంగా చూసుకుంటే ఆ అనుభూతి సభ్యతా సంస్కారాలకు అనువుగా ఉండదు. 


నీతిబాహ్యమైన వస్తువే  రమణీయంగా ఉంటుందని అనుకుంటే పేక్స్పియర్ ' క్లియోపాట్రా ' గానీ,  అభిజ్ఞాన  శాకుంతలం ' శకుంతల ' గానీ అనుభోగ్యాలు అవాలి . అదెంత మాతం సమ్మతం కాదు ' అంటారు దువ్వూరి రామిరెడ్డి ఒక సందర్భంలో. 


కావ్యాలలో నీతిప్రస్తావన  కూడా అనవసరమేనరి బ్రాడ్లీ చేసిన వాదనా సమంజసంగా లేదు. సదుద్దేశాలను ఉపదేశిస్తుండ బట్టే న్యూ టెస్టిమెంట్ గానీ పిల్ గ్రిమ్స్  ప్రొగ్రెస్  కానీ వాల్టేర్, బైరన్, స్విఫ్ట్ రచనలు గానీ రామాయణ భారతాదులు గానీ కాళిదాసు రఘువంశ చరిత్రగానీ చదివేటప్పుడు ఆత్మానందం కలిగిస్తాయి . అయినా వాటిని 'కావ్యాలు  అనటానికి లేదు. .  అందులో కవిత్వమే లేదు ' అని బుకాయించగలమా? వాటిలో ఉత్తమ పరమార్ధాన్ని ప్రబోధించే ఉపదేశాలు ఉన్నాయి. చదివే సమయంలో ఆ పరమార్ధం గ్రహింపుకు రావడం వల్ల పాఠకులలో కలిగే ఆత్మానందమే ఇక్కడ కావ్యప్రయోజనం. అలాంటి ఉత్తమ పరమార్థాలు లోపించనందువల్లనే ' ఏన్సియంట్ మారినర్ , శుక సప్తశతి. తారాశశాంకం లాంటివి కావ్యాలే అయినా ఉత్తమ కావ్యాలు కాలేవు. 


ఇకపోతే, డ్రైడెన్ చెప్పినట్లు ఆనందసందేశాలు ఉన్న కావ్యాలలో ఆనందం ప్రథమం .. ఆ తరువాతే సందేశం  అన్న సిద్ధాంతమూ ఎన్నదగినదేమే . 

సంస్కృతలాక్షణికులలో అభినవగుప్తుడు లాంటి వాళ్లు కూడా  'తథాపి ప్రీతిరేవ ప్రధానమ్' అని ఇట్లాంటి  అభిప్రాయాన్నే వెలిబుచ్చినట్లు ఇందాకే చెప్పుకున్నాం కదా! 


' తైతరీయోపనిషత్ భృగవల్లి ' ఆనందం'  తాలూకు మహిమను గూర్చి  వివరిస్తూ అంటుందీ  .. 


'ఆనందాద్ధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే

ఆనందాద్ధ్యేవ  జాతాని జీవంతి 

ఆనందం ప్రయాం త్యభిసంవిశంతి.' 


  ఆ ఆనందం తాలూకు అనుభూతిని  ఉత్తమాభిరుచి గల పాఠకులకు  కలిగిస్తో  క్రమక్రమంగా  వాళ్లను కర్తవ్యం  దిశగా తీసుకువెళ్లడమే కవిత్వ ప్రక్రియ  పరమ ప్రయోజనం. 

పేరుకు పోయిండే మాలిన్యం మొత్తాన్ని   ప్రక్షాళన చేసి మనిషి మనసును శరత్కాల కాసారం లాగా మార్చేసే మంతశక్తి  ఆనందం సొంతం .  ఆ ఆనందం ఆత్మకు సిద్ధింప చేస్తూనే  సంఘానికి ఉపయుక్తమయే కర్తవ్యాన్ని ప్రబోధించడమే అంతిమంగా ఏ కావ్యానికయినా, కవిత్వానికయినా ఉండవలసిన ప్రధాన ప్రయోజనం . 


- కర్లపాలెం హనుమంతరావు 

13 - 12 -2021 

బోథెల్; యూ . ఎస్.ఎ


( ఆధారం: డా॥ సి.నారాయణ రెడ్డి గారి ' ఆధునికాంధ్ర కవిత్వము  - సంప్రదాయములు ; ప్రయోగములు )  





 

Sunday, December 12, 2021

-మార్మిక గాథలు - గాథాసప్తశతి కవితలు - తెలుగు అమవాదం : దీవి సుబ్బారావు అమవాదం: దీవి సుబ్బారావు - సేకరణ : కర్లపాలెం హనుమంతరావు ( ఆంధ్రజ్యోతి - వివిధ - సౌజన్యంతో )

 సేకరణ : 

మార్మిక గాథలు - గాథాసప్తశతి కవితలు 

- తెలుగు అమవాదం : దీవి సుబ్బారావు 


గాథాసప్తశతి పేరు వినే ఉంటారు. స్తప్తశతి అంటే ఏడు వందలు. హాలుడు అనే మహారాజు పాకృత భాషలో అప్పటికి జనసందోహంలో ప్రచులితంగా ఉన్న అనేకానేక  గాథలను సేకరించాడు. వాటిలో సుమారు ఏడువందలు తనకు ఒదిగిన పరిభాషలో ఒక క్రమం ఏల్పాటు  చేసుకుని మార్మికత"  పండులో రుచిలాగా..  కూర్చి చేసిన సంకలనం గాథాసప్తశతి. పామర జనం నోటిలో  నానే పలుకుబళ్లు శిష్ట సాహిత్య ప్రక్రియలో వదగలేవన్న పండితుల  విశ్వాసాన్ని ప్రశ్నిస్తున్నట్లు చేసిన  ఈ చిట్టి కవితల నుంచి ఆనందవర్ధనుడు, ముమ్ముటుడు వంటి ప్రఖ్యాత ఆలంకారికులు ఉదాహరణలుగా తీసుకున్న సందర్భాలు  కద్దు. 

అన్నట్లు, హాలుడు క్రీ.శ 1 వ శతాబ్దికి చెందిన శాతవాహనవంశానికి చెందిన రాజు . తెలుగువాడు. నేటి తెలంగాణా కరీంనగర్ జిల్లాకు చెందిన ' కోటి లింగాల' ను రాజధానిగా చేసుకుని శాతవాహనులు పాలించినట్లు చరిత్రకారులు నిర్ధారిస్తున్నారు. 

ఆ గాథాసప్తశతి నుంచి శ్రీ దీవి సుబ్బారావు గారు అక్టోబర్ 22, 2012 నాటి ఆంధ్రజ్యోతి దిన పత్రిక సోమవారపు సాహిత్యపుటలో ప్రచురించిన కొన్ని కవితలను  రుచికోసం శాస్త్రార్థం మీ ముందు ఉంచుతున్నాను : 

- కర్లపాలెం హనుమంతరావు 


ఒక పేదింటి ఇల్లాలి కటిక దారిద్ర్యాన్ని కవి ఇంత  కరుణారసాత్మకంగా నాలుగే  నాలుగు పాదాల్లో వర్ణిస్తున్నాడు; 


ఇంటిచూరు నుండి కారే వాననీరు 

కొడుకు మీద పడకుండా తల అడ్డుపెట్టింది/  కానీ 

తన కన్నీరే వాడిని తడుపుతొందని 

ఆ తల్లికి తెలియడం లేదు. 

( ప్రకృతి పొంగను నిరోధించగలిగినా అంతరంగ ప్రకృతిని అడ్డుకోవడం మనిషికి ఎంతటి అసాధ్యమో తెలియచేసే చిట్టి గాధ ఇది. ఇక్కడ తల్లిని మనిషికి ప్రతినిధిగా ఎంచుకోవడంలోనే కర్త ప్రతిభంతా కంటికి కడుతుంది. 


ఆనాటి కాలంలో సమాజంలో వివాహేతర సంబంధాలు విపరీతమైన మోతాదులో ఉండి వుండవచ్చు. సప్తశతిలో చాలా గాధలు ఈ వైపరీత్యాన్ని చమత్కారపూర్వితమైన మార్మికతతో వెలువరించడం గమనించవచ్చు. ఉదాహరణగా రెండు: 


అండిపెట్టి కుక్కకు 

ఆమె ఎలా తర్ఫీదు ఇచ్చిందో చూడు 

మొగుడు వస్తే మెరుగుతుంది 

మిండడొస్తే తోకాడిస్తుంది 


ఆమె చాపల్యాన్ని ఓ కుక్క ద్వారా ప్రదర్శించే మార్మికత ఈ గాధలోని విశిష్టత. 


మరొకటి: 

తొలికోడి కూతకు బెదిరి  

పక్క మీద నుంచి లేచిన వన్నె కాడా

ఇది నీ సొంత ఇల్లు, సొంత భార్య 

భయపడకుండా కౌగలించుకుని పడుకో 


సంసార సంబంధమైన చిటపటలు, అసూయాద్వేషాలు ఇప్పటికి మల్లేనే అప్పుడూ ఉన్నాయి.  ఆ గాధలకు కవితారూపాలు కల్పిస్తూ కనిపించే వాటిలో మచ్చుక్కి  మరో రెండు:


నన్నెప్పుడూ పైకి రమ్మని 

సురతము జరిపే సొగసుకాడా 

పిల్లలు కలుగలేదని 

నామీద నేరం మోపుతావెందుకు? 

బోర్లించిన కుండలో 

చుక్క నీరైనా నిలుస్తుందా ?

    నేడు ఏ డాక్టర్ సమరం చెబితేనో గాని అవగాహనకు రాని సెక్స్ సమస్యకు మూలం నాడు ఓ సామాన్యమైన  గృహిణికే ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ సమస్యకూ ఉన్న కారణాన్ని బోర్లించిన కుండతో పోల్చడం మన వేమన పద్యం శైలిని మరపిస్తుంది కదూ! 


ఇళ్లలోని సవతుల మధ్య సహజంగా ఉండే ఈర్ష్యా సూయలు  ఇక్కడ కవి ఎంత మార్మిక భావనతో వెలిబుచ్చుతున్నాడో చూడండి: 

ఆమె పెదాల  ఎరుపుదనం 

క్రితం రాత్రి 

ప్రియుడు ముద్దులలో చెరిపివేసినా 

మర్నాడు పొద్దున

సవతుల కళ్లల్లో ప్రత్యక్షమయింది 


కొంత మంది స్త్రీలు  తప్పు దారిలో నడిచారు గదా అని స్త్రీలందరినీ ఆ గాటకే కట్టివేయడం సబబు కాదు.  ఒక ఇంటి ఇల్లాలు తనకు భర్త మీద ఉండే అపరిమితమైన ప్రేమను ఈ చిట్టిగాధ ఎంత గాఢంగా వివరిస్తుందో చూడండి! 


ఊరు విడిచి వెళ్లిన భర్త 

తిరిగి వచ్చే రోజు  రాసిపెట్టింది ఆమె గోడమీద 

ఇంటి పైకప్పు చిల్లులో నుంచి 

వర్షపునీరు దిగి చెదిరిపోకుండా 

చేతులడ్డం పెట్టి కాపాడుతోంది 


మరొకటి ఇట్లాంటిదే! 


అత్తా! మలయ మారుతం వీచే పనిలేదు 

మామిడి కొమ్మలు చివురు తోడిగే పనిలేదు 

నావోడు వస్తున్నాడంటేనే 

వసంతకాలం వచ్చేసినట్లు 


ఒక ముగ్ధ తన ప్రేమ భావనతో  గాధను  ఇంత కవితాత్మకంగా మార్చేస్తుంది . నాయుడుబావను ఊహించుకుంటూ ఎంకి ప్రేమ కొద్దీ పడే భ్రాంతిలా తోచే ఈ లోతైన ప్రేమ కవితను చూడండి! 


ఎటు చూస్తే అటు 

కళ్లెదుట కనిపిస్తుంటావు 

దిక్కలన్నిటికీ నీ చిత్రపటాలు 

వేలాడగట్టినారా ఏమిటి? 


ఇక చివరగా : 

ఒక ఊరునో , సమూహాన్నో కాపాడే బాధ్యతనెత్తిమీద వేసుకున్న వీరుడి గాధ ఇది. అతని వీరోచిత రక్షణ కారణంగా ఊరంతా నిశ్చింతగా నిద్రపోతుందిటి గానీ , ప్రియాతి ప్రియమైన తన భర్తకు ఆ ధర్మకార్య నిర్వహణలో ఎట్లాంటి ముప్పు  సంభవిస్తుందో అని ఇంటి ఇల్లాలు పడే ఆందోళనా మామూలుగా ఉండదు. ఈనాటి వీరజవానుల ఇళ్లలోని పరిస్థితులు కూడా అలాంటివే. 


కత్తి గాట్లతో 

ఎగుడు దిగుడుగా ఉన్న  

వీరుడి ఎదురు రొమ్ము మీద 

భార్య సమంగా నిద్రపోలేదు గానీ, 

ఊరు మొత్తం 

హాయిగా కునుకు తీస్తుంది. 


- తెలుగు అమవాదం: దీవి సుబ్బారావు

 - సేకరణ : కర్లపాలెం హనుమంతరావు   

( ఆంధ్రజ్యోతి - వివిధ - సౌజన్యంతో ) 


 19 -09-2021 

  బోథెల్ ; యూ. ఎస్.ఎ






 


 


Saturday, December 11, 2021

కవిత: బాలగోపాల్, ఓ బాలగోపాల్ - పి.రామకృష్ణ సేకరణ : కర్లపాలెం హనుమంతరావు

 





మాకులాగే  నీకూ ఒక్క బ్రతుకే ఉన్నా 

ఆ ఒక్క బ్రతుకులో 

వంద బ్రతుకులు జీవించావు కదా బాలగోపాల్ 


మాకులాగే నీకూ రెండు కాళ్లూ,  రెండు కళ్లే ఉన్నా 

దేశంలో నీ కాళ్లు నడవని ప్రదేశం లేదు  

నీ కళ్లకు కనిపించని  హక్కుల అణచివేతలేదు 


చీమంత  పని చేసామేమో  

కొండంత అలసటతో కూచున్నాం మేము  

ఇదిగో.. ఈ మరణం దాకా 

నువ్వెప్పుడైనా అలసిపోయావా బాలగోపాల్ 

సీమవాడినని అనుకోవడానికి సిగ్గేసింది 

సీమనీటి వివరాల గురించి  నువు  చెప్పాక

పల్లం నుంచి మిట్టకు కూడా ప్రవహించావు  గదా బాలగోపాల్ 

నమ్మకాన్నీ, అపనమ్మకాన్నీ అంతే ధైర్యంగా 

అంతే నమ్మకంగా ప్రకటించావు గదా బాలగోపాల్ 

మేమైతే  నమ్మకం  మీద అపనమ్మకం కలిగినా 

నమ్ముతున్నట్లే కనిపిస్తూ వుంటాం 

ఇప్పుడు నీ కోసం ఏడ్వాలా 

మాకోసం ఏడ్వాలా 

నీ కోసం ఏడిస్తే, నువ్వింకా ఏదో చెయ్యాలనుకోవడం 

లేదా , ఏదో చెయ్యలేదు అనుకోవడం, వద్దు . 

నువ్వు చెయ్యవలసినవన్నీ చేశావ్ 

ఏసుక్రీస్తు చెప్పినట్టూ  ఇక మా కోసమే ఏడుస్తాం... 

- పి. రామకృష్ణ 


( పి.రామకృష్ణ రచనలు నుంచి ) 

సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

                 22-09-2021 

                  బోథెల్, యూ. ఎస్.ఎ


( బాలగోపాల్ భౌతికకాయం దగ్గర కూర్చున్నప్పుడు కలిగిన ఆలోచనలతో తను కూర్చిన కవిత ( పి. రామకృష్ణ దృ ష్టిలో ఇది కవితకాదు . బాలగోపాల్ ను ఒక కవితలో ఇమడ్చటం కష్టం అంటారాయన )  

 


Friday, December 10, 2021

సాహిత్య వ్యాసం నివేదనం - కాటూరి వేంకటేశ్వరరావు సేకరణ - కర్లపాలెం హనుమంతరావు

 


సాహిత్య వ్యాసం 

నివేదనం


- కాటూరి వేంకటేశ్వరరావు

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు




భావము కుదిరి, ఉపక్రమోపసంహారాలతో, రమణీయార్ధములతో, సంవాద చతురతతో నడచిన ఈ కావ్యానికి ప్రబంధ మనే నూతన' సంకేతం ఏర్పడింది. వలసినంత భావనాసమృద్ధితో, అలంకారశిల్పముతో, రసభావనిరంతరంగా, గద్యపద్యాత్మకంగా రచితమైన ప్రబంధ మనే ఈ కావ్య పరిషియ ఆంధ్ర సాహితికి సొంతమని చెప్పదగును. ఆవేలమైన భావనకు రాయల ఆముక్తమాల్యదా, అద్భుతకథాకల్పనకు సూరన కళాపూర్ణోదయం నిదానములు. కావ్యానికి కావలసిన సకలలక్షణాలు సంపాదించుకొను టేకాక, శ్రవ్యరూపాన ఉన్న ప్రథమాంధ్రదృశ్య కావ్యమని పేరుగన్నది ప్రభావతీ ప్రద్యుమ్నం. కవిరాజ శిఖామణి నన్నెచోడుడు, ఎఱన, శ్రీనాథుడు, పినవీరభద్రుడు మున్నగువా రీ స్వతంత్ర కావ్యావిర్భూతికి బీజావాపం చేసినా, దీనికి ప్రత్యేక నామరూపాలు కల్పించిన మాన్యుడు అల్లసాని పెద్దన.


భారతాదులయందువలె కథాకథనము, ధర్మోపదేశము ఈ కావ్యములందు ప్రధానము కాదు. విభావాను భావాదులచే పరిపుష్టమగు రసనిష్పత్తియే ఇందు ప్రాధాన్యము వహించును. ఈ కాలపుగ వీశ్వరులు తమయెదుట కన్పట్టు మహా రాజ్యవిభవాన్నీ, అప్పటి రాగభోగాలను, నడతనాగరీశాలను మనసులందు నిల్పికొని వానికి రూపాంతరాలు కల్పించి, రసమయమైన గంధర్వలోకాన్ని సృష్టించారు. భువనవిజయం సుధర్మగాను, తుంగభద్ర మం దాకీని గాను, విద్యానగరళ్ళం గారవతులే కథానాయికలుగాను, ఆనాటి సాహసరనికులే నాయకులు గాను వీరి కావ్యాలలో అందందు రూపాంతరం పొందిరేమో ! ఆనాటి కవులకు, ప్రజలకు హస్తప్రాప్యములైన రసభోగాలనుండి వంచితులమైన మనకు నే డా కావ్యసృష్టి వింతగా, విపరీతంగా కన్పించినా సర్వర్తుధర్మసంశోభిత మై, అద్భుతర సస్యందియైన ఆరామంవంటిది ఆనాటి సాహిత్యం.


ఈ ప్రబంధకవులలో సహజశ్లేషలకు శయ్యాసౌభాగ్యానికి రామరాజ భూషణుడు, భక్తిపారమ్యానికి ధూర్జటి, ముద్దులొలుకు పలుకుబళ్ళకు తిమ్మన, అర్థభరితమైన పదబంధానికి రామకృష్ణుడూ — ఇలా ఒకరొకరే పేరుగాంచిరి. ఆంధ్రమున మొదటి ద్వ్యర్థి కావ్యమూ, యక్ష గానమూ ఈ కాలంలో నే పుట్టినవి. ఆత్మపరము, భక్తిభరితము అయిన శతకరచనం వెనుకటికాలంలోనే ఆరంభ మైనా ధూర్జటి కాళహస్తీశ్వరశతకం అట్టిరచనలకు మకుటాయమానమయింది. మెట్ట వేదాంతులను, దాంభికులను, మూఢమానవులను ఆధిక్షేపించి, పరిహసిస్తూ వేమయోగి అలవోకగా చెప్పిన ఆటవెలదులకు లోకుల నాలుకలే ఆకులైనవి.


విజయనగర సామ్రాజ్యం తల్లికోట యుద్ధంతో స్తమించిన పిమ్మట చోళ పాండ్య దేశాలలో రాజ్య స్థాపనం చేసికొన్న నాయక రాజులు ఆంధ్ర సాహిత్యానికి వూరు, మధుర, పుదుక్కోటలందు విస్తరిల్లిన ఈనాటి వాఙ్మయ మంతా కేవలళ్ళంగారపరమైనది. స్వయము కవియై, సర్వవిధాల కృష్ణరాయలకు దీటైన రఘునాథరాయల అనంతరమందు నాయక రాజులలోను,. వారిపిమ్మట రాజ్యమేలి మహారాష్ట్ర ప్రభువులలోను భోగపరాయణత


 విసరిలినది. ఆంధ్రజాతి జవసత్యాలు ఉడిగి, పౌరుష ప్రతాపము ల సంగతములు కాగా, మిగిలిన కామపరతనుండి ప్రభవించిన ఆనాటి కావ్యాలు సంయమం కోలుపోయి పరకీయాశృంగారానికి పట్టముగట్ట నారంభించినవి. ఈ 150 ఏండ్లలో పొడమిన సాహిత్యంలో విజయవిలాసంవంటి ఒకటి రెండు కావ్యాలు పూర్వకావ్య గౌరవాన్ని కొంత అందుకొన్నవి. యక్షగానము జై కటి ఈ కాలమందే వరి లినది. నాయక రాజులలో పెక్కురు, మహారాష్ట్రప్రతాపసింహాదులు, నాయక రాజుల సామంతులు, దండ నాధులు గూడ కావ్యములు రచించుటొకటి, పెక్కురు విదుషీమణులు కవయిత్రు లగుట యొకటియు ఈశాలమందలి విశేషాలు, గేయకవితకు ద్వితీయాచార్యు డగు క్షేత్రయ్యయు, దాక్షిణాత్యకృంగార కావ్యభూషణమైన రాధికాసాంత్వనం రచించిన ముద్దుపళనియు, ఆనాటివారే.


కోకొల్లలుగా బయలు దేరిన యక్షగానాలు, శృంగారపదాలు అభిన యిస్తూ రాజసభలలో నాట్యం చేసే వేశ్యల పదమంజీరధ్వనులే అప్పటి కావ్యా లలో ధ్వనించుచుండును. రాజాస్థానాలలో తెరపిలేకుండా సాగే కామ దేవతారాధనమే నాగరులకు అనుకార్యమై, త్యాగ భోగ రాయుళ్ళయిన నాయక రాజులే శృంగార కావ్య నాయకు లైనారా అనిపిస్తుంది. సకలేంద్రియసంతర్పణం చేసే కామపురుషార్థమహాఫలంకోసం రనికనరనారీలోకం నూటయేబదియేండు 3 ఇలా సాహిత్య సముద్రమథనం చేయగా చేయగా తుదకు రామనామామృత భాండం చేబూని వాగ్గేయకార సార్వభౌముడైన త్యాగరాజస్వామి అవతరిం చెను.


3. క్రీ. శ. 1850—1955


19వ శతాబ్ది పూర్వార్ధంలో రెండుమూడర్థాల కావ్యాలు, శ్లేష చిత్ర బంధ కవిత్వాలూ బయలు దేరినవి. హాస్యనీతిశతకాలవంటివితప్ప స్వతంత్ర కావ్యములు పొడమలేదు. దేశం క్రమంగా ఆంగ్లేయాక్రాంతమై, క్రిస్టియనుమత ప్రచారము, ఆంగ్లవిద్యాభ్యాసం ప్రబలినవి. వీనికి దోడు భౌతికదర్శనముల ప్రభావం వల్ల విద్యావంతులు ప్రత్యక్ష ప్రమాణబుద్ధులు కావొడగిరి. భారతీయధర్మము, సంప్రదాయాలు, ఆచారాలు పునర్విచారణకు పాత్రములై, స్వస్థాన వేష భాషాభి మానం సడలుటతో, సంఘసంస్కారోద్యమాలు సాగినవి. సముష్టి చిర కాలంగా తనచుట్టు నిర్మించుకొన్న ప్రాకారాలు శిథిలము లగుటయు, వానినుండి విడివడజూచే వ్యష్టి తనకే మం తాను విచారించుకోజొచ్చింది. భారతీయ ధర్మాన్ని నవీన కాలానుగుణంగా సంస్కరించుట కి ట్లొకవంక యత్నం జరుగు చుండగా, మరొకనంక ఆంగ్లప్రభుత్వ బంధనంనుండి విడివడాల చేకోర్కె బలీయ మయ్యెను. అంతట భారతీయపూర్వేతిహాసాన్ని, ధర్మ ప్రపంచాన్ని మథించి, స్వస్వరూపసాక్షాత్కారం పొందవలెననే కాండా, అభిజనాభిమానము ప్రబలమయ్యెను. ఆంగ్లభాషాకళాశాలల్లో ఆంగ్లేయసాహిత్యాన్ని అవ గాహిస్తున్న పడుచువాండ్రు ఈ రెండు ఉద్యమాల చే ప్రేరితులై అందరమైన


నివేదనం


ix


అద్భుతర సదర్శనానికి, మద్రమై, బంధనాగారపదృశమై కనిపించే బాహ్య లోకానికి పొత్తుకుదరక, తమవేదనలను చెప్పికొనుటకై మాటలను, మార్గములను


ఇంతలో తిరుపతి వేంకటకవులు ఈ కాలపువారి కష్టసుఖాలను చెప్పికొనుట కనువైన సులభసుందర శైలిచే కావ్యరచనం చేయనారంభించిరి. గురుజాడ అప్పారావు మానవధర్మాన్ని, దేశభక్తిని ముత్యాలసరమనే ఛందముచే గానము ఇట్లు దేశకాలానుగుణమైన కావ్య శైలియు, ఛందము దొరకి సంతట 20వ శతాబ్ది ప్రథమపాదమున తరుణవయస్కులు, గొంతులు విడివడినప్లై, ఆత్మనాయకములగు మధురకవితలను చెప్ప మొదలిడిరి.


పాశ్చాత్య సాహిత్య ప్రపంచమును, రవీంద్రనాథగీతావళిని ఆరగ్రోలిన సంస్కారపుష్టిచే ఆరంభమైన ఈ మధురకవితలందు అలనాటి రాయల సాహిత్యంలో లభించే అద్భుతమైనరసదర్శనం మల్లా లభించింది. అయితే ఆనాటి దర్శనం భోగభాగ్యములచే తులదూగే జీవనపొష్కల్యమునుండి లభింపగా, ఈనాటిది ప్రతికూల పవనహతినుండి ఆత్మజ్యోతిని కాపాడుకొనుటకై వాయు మండలో పరిపథాన కెగిరి, ఆచట నిర్మించుకొన్న ఏకాంతజీవనంనుంచి పుట్టింది. ఆచట కవి నిజానుభవాలకు రూపాంతరం కల్పింపగా, ఇచట కవి మనోరథాలకు రూపకల్పన జరిగింది. కాగా, అందు సంయోగ సుఖము, ఇచట తరచు విరహ పరిదేవనమాధురియు లభించినవి. మేఘదూతలోని యక్షులవంటి ఈ కవుల కా అలకానగరసుందరి దవుదువ్వులనే ఉండిపోయింది. పార్థివగంధస్పర్శ లేని ఆసుందరి ఆరాధ్య దేవతయై, పూజాపీఠ మలంకరించింది. ఆదేవిని ప్రసన్న నొనర్చుకొనుటకై వీరు పాడిన మధురకవితలలో అద్భుతమైన భావస్ఫూర్తీ, రమణీయారాలు కోకొల్లలుగా మనకు లభిస్తవి.


ఆక్మనాయకములైన మధురకవిత లోకవంక ఇట్లు చెల్లుచుండ రెండవ వంక పూర్వేతిహాసములను రసమయంగా ప్రత్యక్షం చేసే వీరకథాకావ్యాలు, పర దాస్యబంధనాన్ని సహించని దేశభక్తి గేయాలు వెలువడజొచ్చెను. స్వస్థాన స్వధర్మాభిమానములనుండి ఆవిర్భవించిన ఈజాతికావ్యములు గూడ గుణ గౌరవ ముచే పొగడ్త కెక్కినవి.


ఇవి యిటులుండ ఇంకొక తెగ కవీశ్వరులు పామరజనజీవనమాధుర్యాన్ని పదకవితలందు అందీయసాగిరి. లోకానికి అన్న పత్రం పెట్టే కర్షకభాగ్యశాలిని, సంఘానికి సుఖభోగ పరికరాలను సమకూర్చియిచ్చే మంటిపుట్టువుల వితరణాన్ని కీ ర్తించుతూ వీరు ఈశ్వరాంశను మానవత్వమందు ప్రతిష్ఠ గావింపజొచ్చిరి.


ఈ వివిధ కావ్యసృష్టి యిలా జరుగుచుండగానే గాంధీజీ భారతరాజకీయ రంగాన ప్రధానభూమిక వహించడం, స్వాతంత్య్రచ్ఛ జనసామాన్యానికి గూడా ప్రాకడం, భాషారాష్ట్రములకొరకు ఆందోళన చెందడం, స్వతంత్రభారతంలో సంఘస్వరూప మెలాఉండాలి అనే వాదోపవాదాలు చెలరేగడం, ద్వీపాంత 


రాలనుండి ఆ సేకనూతనోద్యమమారుతాలు దేశంలో వీచడం వీని యన్నిటి భావుకులు చి తవీధులందు క్రొ ఆలోచనలు పొడమినవి. దీనితో కాల్పనిక మైద రసభావసృష్టి వెనుకబడి, దేశకాలాల యథాస్వరూపాన్ని చిత్రిస్తూ, నవసంఘ స్వరూపానికి రూపరేఖలు దిదేరచనలు బయలుదేరినవి. పరపీడనాన్ని, పరోప జీవనాన్ని శపించడం, కష్టజీవులందు అభిమానాన్ని ఉద్దీపింపజేసి ఆశాజ్యోతి వెలిగించడం __ఈ కాలపు కావ్యములకు సామాన్యలక్షణా లని చెప్పవచ్చు.


భావస్రవంతి పలుపోకల పోతున్న ఈ నవీనకాలంలో తొల్లి ఎన్నతు లేనంత వైవిధ్యము, గుణబాహుళ్యం కావ్యసృష్టియందు కనిపిస్తున్నవి. భావాను గుణములైన నూతవచ్ఛందాలను కవులు వాడుతున్నారు. కొందరు వృత్తగంధి వచనరచన చేస్తున్నారు. సంస్కృతపురాణేతిహాసాలకు మళ్ళా కొందరు కేవలానువాదాలు చేస్తుంటే, కొందరు వానిని స్వోపజ్ఞంగా క్రొత్త వెలయిను న్నారు. జానపద గేయాలు, వీరకథాగేయాలు ఎక్కువగా ప్రజాదరం పొందు తున్నవి. దేశకాలాలను వ్యాఖ్యానించుటకు కొందరు శతకపద్ధతి నవలంబిస్తు న్నారు.


ఏకాలమందైనా క్రొత్తదారి త్రొక్కేవా రొకరిద్దరే ఉంటారు. తక్తిన వారొక అడుగు అటూ యిటూగా ఆధారినే పోతూ, కొంత విలక్షణతను గూడ చూపెట్టుతారు. కొందరిరచనలు ఉపజ్ఞామహితములు కాకున్నా, తత్కాల పరిస్థితులకు, ఉద్యమాలకు ప్రతిబింబాలుగా ఉంటవి. ఇలా వేయేండ్లనుంచి ఎప్పటికప్పుడు నవనవంగా వర్ధిల్లుతున్న ఆంధ్రసాహిత్యమందలి కావ్యభేదాలను, రీతులను ఇందు ప్రదర్శించుటకు యత్నించితిని. ఆంధ్రసాహిత్యంలో కేవలం మేలేర్చి కూర్చేయత్నం కాకపోవడంవల్ల, ఆంధ్రరసజ్ఞలోకానికి పరమాదర పాత్రములైన కొన్నికొన్ని రచనల నిందు చేర్చలేకపోతిని. రుచిభేదంవల్ల, పరిశీలనాలోపంవల్ల, స్థలసంకోచంవల్లకూడా ఈ కూర్పు కొంత అసమగ్రతకు పాల్పడిఉంటుంది.


నా యీలోపములను సహృదయులు మన్నింపవేడెదను. ఇతర భాషా ప్రాంతములందలి సోదరభారతీయులకు ఆంధ్ర సాహిత్య సంపద నంతటిని, శృంగ గ్రాహికగా కాకున్నా, స్థూలారుంధతీన్యాయంగానైనా ఈ గ్రథవం చూపెట్ట గలదేని కృతార్థుడ నగుదును.


- కాటూరి వేంకటేశ్వరరావు

( తెలుగు కావ్యమాల - నుంచి ) 

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు

Wednesday, December 8, 2021

విషాదం - కవిత



 విషాదం 

- కర్లపాలెం హనుమంతరావు 

( సాహిత్య ప్రస్థానం - మాసపత్రిక - ప్రచురణ ) 


కాలం ముందు చేతులు కట్టుకుని నిలబడ్డావు. పాటా!... 

పడింది నవ్వే కాదు... నీ పాదాలు పట్టుకుని వేలాడుతున్నందుకు అందరం


నీ స్వచ్ఛంద మరణంతో చైతన్యం ఒక క్షణం స్పృహ తప్పిన మాట నిజమే. 

కానీ తొందరగానే తేరుకుంటుందిలే....


జీరబోయిన నీ రాగమే తిరిగి సర్దుకోవడం కష్టం. 

తాకట్టు కొట్టు వాకిట్లో తచ్చాడుతున్నప్పుడు 

నీకిదంతా ఎందుకు తోచలేదో...

ఇలాంటి ఒక విషాద పశ్చాత్తాప ఘడియ ఏ గేయానికి రాకూడదు.


'చే' స్పర్శకే వజ్రం పగలటం విషాదం కాక మరేమిటి?

చెమట బిందువు మీదపడి

పరావర్తనం చెందే కిరణానికున్న వెలుగు 

చెమ్కీ దండ  మీద పడితే వస్తుందా?! 


తెలిసి తెలిసీ పాటా!... 

నువ్వు ఈ పరకాయ ప్రవేశం ఎందుకు చేసినట్లో! 

భ్రాంతినీది... దిగ్భ్రాంతి మాది. 

వసంతానికి తప్ప దేనికీ గొంతు విప్పని పిట్ట 

చిలుకలాగా పలకాలని ఎందుకనుకుందో! 

కత్తి అంచున నిలబడి గొంతెత్తి ఆడిపాడిన ఆ పాట నిజమా?... 

చేతిలో చెయ్యేసి చెట్టపట్టాల్ పట్టి 

కొత్త రాగంతో పాడుతున్న ఈ పాట నిజమా! 


ఒకటా... రెండా... ఎన్నియుగాల బట్టి 

నిప్పు కణికలను పుక్కిటబట్టి 

రవ్వలు వెదజల్లావు పాటా!


పుటిక్కుమని ఇలా 

రెండు రూపాయలు కొక నీటి పాకెట్ గా మారిపోయావేమిటి?! 

కలల్ని హరాయించుకోవటం అంత తేలికా? 

నిన్ను మోసిన భుజాలే నడిబజార్లో నిన్నిలా నిలదీస్తుంటే 

నీ గురించి కాదు గానీ 

నిన్ను నమ్ముకుని వచ్చిన ఆ కలల్ని గురించే 

జాలిగా ఉంది. 


వేళ్లు నరికినా, తలను తెంపినా 

ఆ కలలు మొండేలు నీ పాటే పాడుకున్నాయి 

వాటి పెదాల కిప్పుడు పదాలు తట్టని పరిస్థితి

తాత్కాలికంగానైనా తెచ్చిపెట్టింది. .. నీవేగా! తప్పు నీదే! 


సుడిగాలి నెదుర్కునేదేగా అసలైనపాట! 

నెత్తురు మీద పూచిన పువ్వు అంత తొందరగా వాడిపోదులే! 

మడుగును అడుగుకింతని నువ్వమ్ముకున్నా 

అడుగునున్న తడిని అమ్మటం నీ తరం కాదు... 

కొనటం వాడబ్బ తరమూ కాదు 


పాట మెలికపడొచ్చేమోగాని దాని ఆత్మది సూటి దారే! 

శ్రమజీవుల చెమట నుంచి పుట్టినది 

ఏ పరిశ్రమల జీవోలకు లొంగదు 

ఒక పాటకు రెండు నాలికలుంటాయని చెప్పి 

నువ్వే ఎటూ కాకుండా పోయావు. పిటీ! 


కవాతుకు ఒకపాట తగ్గటం మాత్రం ఒక విషాదమే!


- కర్లపాలెం హనుమంతరావు 

( వంగపండు.. బూర్జువా రాజ్యాన్ని పొగుడుతూ చిందేయడం చూసిన విషాదంలో  ) 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...