Showing posts with label Music. Show all posts
Showing posts with label Music. Show all posts

Thursday, April 1, 2021

త్యాగరాజస్వామివారి లౌక్యం! సేకరణః

 

 


స్వామివారి పంచరత్నాలలో చివరగా వినిపించే శ్రీరాగంలోని 'ఎందరో మహానుభావులు.. అందరికీ వందనములు' కృతి సంగీతం రానివారికీ, స్వరలోకంతో సంబంధం లేనివారి చెవులకు కూడా సోకకుండా ఉండని చరణం.

త్యాగయ్యగారి గురువు శొంఠి వేంకట రమణయ్యపంతులుగారు. ఒకానొక సందర్భంలో గురువుగారికి ప్రతినిధిగా సంగీత సభలో పాల్గొనాల్సిన పరిస్థితి స్వామివారి మీద పడిందంటారు.  వయసులో  పిన్నవాడు అయిన కారణంగా త్యాగయ్య సంగీత సామర్థ్యం ప్రశ్నార్థకం అవడమే కాకుండా.. తనను సూచించిన గురువుగారి గౌరవం కాపాడవలసిన అదనపు బాధ్యతా ఆయన భుజస్కంధాలపై పడిన పరిస్థితి.  అయితే ఆ సందర్భానికి తగ్గట్లుగామే త్యాగయ్య  ఈ విచిత్రమైన కృతిన కల్పించి పాడి విమర్శకుల నోళ్లు మూయించినట్లు ఓ కథనం బహుళప్రచారంలో ఉంది.

 

'ఎందరో మహానుభావులు.. అందరికీ వందనములు'అంటూ మొదలయ్యే ఈ కృతిలో  'చందురు వర్ణుని అందచందమును హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించువారు..' అనే అనుపల్లవి ఒకటి వినిపిస్తుంది. శ్రీరామచంద్రుని అంద చందాలను వర్ణంచే ఈ కృతిలో 'చందురు వర్ణుడు' అనే విశేషణం చొరబడటమే విడ్డూరం అనిపిస్తుంది కదా సాధారణ శ్రోతలకు! రాముడు నీలి మేఘ శ్యాముడు. నల్లటి మబ్బు రంగు   ఆ మహానుభావుడి మేని ఛాయ . మరి రామచంద్రుని వర్ణానికి, చంద్రుని వర్ణానికి సాపత్యమేంటి?  పోలిక ఎంత అపసవ్యంగా ఉంది అనిపిస్తుంది సహజంగానే! మిడి మిడి జ్ఞానులు ఈ రంధిలో పడి కొట్టుకుంటుండగానే త్యాగయ్య తన గానచాతుర్యంలో నిజమైన శ్రోతలను మెప్పించేసి శభాష్ అనిపించుకొన్నాడని ఎక్కడో చదివిన గుర్తు. కాకపోతే శ్రీ నూకల సత్యనారాయణగారు తన పుస్తకంలో దీనికి సంబంధించి చక్కని వివరణ ఇచ్చున్నారు కనక ఆ విశేషం తెలియచేసి ముగిస్తా.

 'వర్ణో ద్విజాది శుక్లాది యజ్ఞే గుణ కధాసు చ వర్ణమంటే బ్రాహ్మణుల్లాంటి కులాలు, తెలుపు లాంటి  రంగులు, యజ్ఞం, గుణం-ఇన్ని అర్ధాలున్నాయి మరి. శ్రీ రామచంద్రుడు చంద్రుడికి మల్లే చల్లని చూపులతో ప్రకాశవంతంగా ఉంటాడు కాబట్టి అట్లా పోల్చడంలో కించిత్తైనా అన్వయదోషం లేనే లేదు అని భాష్యం చెప్పుకోవచ్చు.   పురాణపురుషుడిగా తీర్చిదిద్దిన రుషి వాల్మీకి కూడా రాముణ్ణి సోమవత్ ప్రియదర్శనః” అని కీర్తించాడన్న విషయం మరపుకొస్తేనే మరి ఈ తరహా చిన్ని చిన్ని సందేహాలు మనసుల్ని  సతాయించేది. .

ఇహ ఇక్కడ త్యాగరాజస్వామి గడుసుతనం ఏమిటంటే.. ఇట్లాంటి పదప్రయోగం ఒకటి సభలోకి వదిలేస్తే సంగీత పండితుల్లో  మధన మొదలవడం ఖాయం. అర్థ విద్వాంసుల ధ్యాసను కొద్దిగా ఆ దిక్కుకు మళ్ళించేస్తే తాను తన విద్వత్ పరీక్షలో గట్టెక్కడం సులువవుతుందన్నది ఆ సంగీత వైతాళికుడి గడసరితనం.

 సాధారణంగా విద్వత్సభల్లో నెగ్గుకురావడం తాడిచెట్టుకు ఎదురు దేకడమంత క్లిష్టం. మిడిమిడి జ్ఞానంతో అంతా తమకే తెలుసన్న అహంభావుకత అదికంగా ఉండే పండితులు అన్ని కాలాల్లో అన్ని స్థలాల్లో తారసపడుతూనే ఉంటారు. ఎదుటి మనిషిలోని తప్పులు ఎక్కడ దొరుకుతాయా.. ఎప్పుడు వాళ్ల ప్రతిభను కించపరుద్దామా అని రంధ్రాలు వెతికే బాపతు అర్థజ్ఞానులను బోల్తాకొట్టించడమే ధ్యేయంగా బహుశా త్యాగయ్యరాజస్వామి ఆనాటి పండిత సభలో ఆ పదప్రయోగ చేసివుండచ్చు.

వివాదాన్ని పెరగనిచ్చి చివర్లో సరైన సమాధానం ఇచ్చి ఈర్ష్యాపరుల నోళ్లు మూయించే గడసరితనాన్ని తప్పుపట్టలేం.   త్యాగరాజస్వా,మి 'చందురు వర్ణుని' పదప్రయోగం ఈ లక్ష్యంతోనే సాగిందనుకోవాలి. పాండిత్యమే కాకుండా లౌక్యం నేర్చుకున్నప్పుడే లోకంలో రాణింపుకొచ్చే మాట.

-సేకరణ

కర్లపాలెం హనుమంతరావు

 

 

 

 

Sunday, January 31, 2021

అన్నమయ్య కృష్ణతత్వం -కర్లపాలెం హనుమంతరావు


 


అన్నమయ్య అనగానే కళ్ల ముందు కనబడేది ఆ ఏడుకొండలవాడి మంగళకర స్వరూపం.  వేంకటాద్రిరాయడి కొలువు కూటమికి అంతకు ముందు నుండే కొండలు నెలవై  ఉండినా, కలియుగ అవతార పురుషునిగా  భక్తజన సందోహం గుండెల మీదకు చేదిన ఘనత మాత్రం నిశ్చయంగా తాళ్లపాకవారి సంకీర్తన గానామృత వైశిష్ట్యానిదే! అడుగడుగులవాడిని ఎన్నిందాల ప్రదర్శించ తగునో, అన్నిందాలా హుందాగా ప్రదర్శించి చూపించిన ప్రతిభా ప్రాగల్భ్యం  అన్నమయ్య ఘంటానిది, కంఠానిది. అయ్యతో పాటూ అమ్మకూ  స్వరార్చనాసేవలు సరిసమానంరగా అందడం అయ్యవారి ఆనాటి అభ్యుదయ భావాలకు అద్దంపడుతుంది.  ఆచార్యులవారి కీర్తిని అజరామరం చేసిన వేలాది సంకీర్తనల్లో కృష్ణ సంబంధమైన సంకీర్తన గానామృతం ఓ గుక్కెడు సేవించడమే  ఇక్కడ ముఖ్యోద్దేశం. 

తాళ్లపాకవారి రాగిరేకులు తడవని రసరహస్యం లేదనడం అతిశయోక్తి కాబోదు. అయ్యవారి కృష్ణతత్వం గురించి చేసిన గానప్రస్తావనాలను గాని గాఢంగా పరిశీలిస్తే భజగోవింద కర్త  శ్రీశంకర భగవత్పాదులు భావించిన ఆ 'ఏదో తెలియని నీలిరూప తత్వం' అన్నమయ్యనూ వదలకుండా వెన్నంటి వేధించి మరీ తన్మయత్వ అగాధంలో ముంచి తేల్చిందని చెప్పుకోవాలి.  జయదేవుని అష్టపదులకు దీటైన పాదపంక్తులను ఆ పారవశ్య పరమార్థ చింతనతోనే అన్నమయ్య అత్యద్భుత్వంగా తీర్చిదిద్దినట్లు ఒప్పుకోవాలి. 

కన్నయ్య అనగానే మనస్సుకు తటిల్లుమని తట్టేది  ఆ నల్లనయ్య కూనరూప లావణ్యం, చిలిపి చేష్టలు. ఆ యదుబాలుని ముద్దుమురిపాలను  అన్నమయ్య మథించి  మరీ కట్టిన కీర్తనల చల్లపై తెడ్డు కట్టిన వెన్నల తరకల రుచి వట్టొట్టి మాటలతో మనసుకు పట్టించడం ఒక్క నాలుక వల్ల శక్యమయే పని కానేకాదు. 'భావయామి గోపాలబాలం మన/స్సేవితం తత్పదం చింతయేహం సదా' అంటూ  చిన్నికృష్ణుని ముద్దు పాదాలను తాను తలుచుకుంటూనే తప్ప తతిమ్మా దేవుళ్ల సంకీర్తనల పర్వం సవ్యంగా సాగించలేన’ని  స్వయంగా ఆ  చెంగల్వరాయని స్వరసేవకుడే సెలవిచ్చుకున్న సందర్భం గమనీయం.

'కటి ఘటిత మేఘలా ఖచిత మణి ఘంటికా'-బుజ్జి నడుముకి కట్టిన రత్న ఖచితమైన మొలతాడును తలుచుకుని తనలో తానే సంకీర్తనా పరవశుడై మురిసిపోతాడు అన్నమయ్య వందలొందల పర్యాయాలు. 'నిరతరకర కలితనవనీతం  బ్రహ్మాది/ సురనికర భావనా శోభిత పదం' -వెన్నముద్దతో నిండి ఉండే చిన్ని చిన్ని చేతులుండే ఆ బాలగోపాల రూపాన్ని మనసులో భావించుకుంటేనే గాని..  మిగతా దేవతలకు ప్ర్రార్థనలు.. అవీ సవ్యంగా సాగే పని కాదు!'అని అన్నమయ్యే తన కృష్ణతత్వ కాంక్షాపరత్వాన్ని నిర్మొహమాటంగా బైటపెట్టిన సన్నివేశాలు ఎన్నో!  

'చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ/బంగారు మొలతాడు పట్టుదట్టి' అన్న పద్యం నోట బట్టని బాలలు తెలుగునేలల మీద కనిపించడం చాలా అరుదు  నిన్న మొన్నటి దాక. ఆ తరహా వెన్నముద్ద వంటి  కృష్ణ కీర్తననే అన్నమయ్య మన జిహ్వలకు అందించింది. అనుభవిస్తూ ఆలపిస్తే సాక్షాత్తూ ఆ బుజ్జికృష్ణుడే తనకు తానై వచ్చి మన గుండెల మీదెక్కి కూర్చుని ఆడుకుంటున్నంత ఆనందం ఖాయం! బ్రహ్మానంద పారవశ్యం కలిగించే పదబంధాలతో వేలాది సంకీర్తనలు సృజించిపోయిన అన్నమయ్యను ఒక్క నోటితో మాత్రమే పొగిడితే చాలునా? అదే శ్లోకంలో చిట్టచివరన 'పరమపురుషం గోపాలబాలం' అని కృష్ణతత్వాన్ని పరమ క్లుప్తంగా, ఆప్తంగా  ముక్తాయించడం వెనక, స్వరూపానికి స్వల్పుడే అయినప్పటికీ  పరమపురుష తత్వం శ్రీకృష్ణపరంధామునిది    అన్న కృష్ణతత్వం వెలయించడమే అన్నమయ్యవారి పరమార్థం! ఆ వాగ్గేయకారుని ఎన్ని వేల జిహ్వలతో స్తుతిస్తే న్యాయం జరిగినట్లు?  

'చిన్ని శిశువు చిన్ని శిశువు /ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు' అంటూ కృష్ణయ్య ముద్దుమురిపాలు ఒలికే బాలుని స్వరూపాన్ని కళ్లకు కట్టించే ప్రయత్నం చేసాడు అన్నమయ్య అనేక పర్యాయాలు.  అలతి అలతి పదాలతో ఇంత అందమైన వర్ణనలతో మరి  మరో కవి ఇంకెవరైనా   పాలచారలు తెడ్డు కట్టిన కృష్ణయ్య బుజ్జి బొజ్జను గూర్చి కూడా భజించాలన్న బుద్ధిపుట్టిందా? ఏమో..  తెలియదు.  అదే అన్నమయ్యలోని విశిష్టత. అణువు నుంచి బ్రహ్మాండం వరకు, అనంతం నుంచి చింతాకు చిగురు వరకు ఏదీ ఆ వాగ్గేయకారుని  సంకీర్తనల స్వర గాలాలకు తగలకుండా తప్పించుకోలేకపోయింది. 

ఇళ్లలోని పసిపిల్లలు తాగే తాగే పాలను ఒక్కోసారి వంటి మీదకు వంపేసుకున్నప్పుడు  చటుక్కున చూసిన వెంటనే ముందు మనకు తెగ ముద్దొచ్చేస్తారు. బాలుడు భగవంతుడెలాగో.. భగవంతుడూ బాలుడుకు మల్లే అయిపోతాడు కాబోలు ఒక్కో మారు.  సంపూర్ణ సత్యస్వరూపుడైన శ్రీకృష్ణపరమాత్ముడిని ముగ్ధమనోహరమైన ఆ బాల్యస్థాయికి దింపుకొచ్చి భగవంతుని మీది ముప్పిరిగొనే భక్తిభావాన్ని ముద్దుమురిపాల రూపంలో తీర్చుకునే అవకాశం భక్తలోకానికి అందించిన అన్నమయ్య అక్షరాలా ధన్యజీవి. 

దేవకీసుతుడు బాలకృష్ణుడి ఫాలభాగం మీద జారిపడే ముంగురులను పైకి నెట్టి మురిపెంగా సవరించే భాగ్యం యశోదమ్మ తల్లికి దక్కింది చివరకు. అదృష్టమంటే యశోదమ్మదే కదా అని కృష్ణయ్యను అమితంగా కామించే అన్నమయ్యలోని తల్లిహృదయం అసూయచెందే కీర్తనల పర్వం ఇది. 'పాయక యశోద వెంట పారాడు శిశువు' గా వేదోద్ధారకుణ్ణి భావించిన  వైరుధ్య వైదుష్యం తాళ్లపాక అన్నమయ్యలవారిది. ఆ మాటకొస్తే అండ పిండ బ్రహ్మాండ నాయకుడిని ఓ బాల వెన్నదొంగ స్థాయికి దింపి వర్ణించే ఆలోచన అన్నమయ్యకు  కలగడం వాస్తవానికి తెలుగువారి వాగ్గేయసాహిత్య ప్రక్రియ చేసుకున్న అక్షరాల నోముఫలంగా చెప్పుకోవాలి. 

'ఝుమ్మని మడి శృతి గూడగను/ కమ్మని నేతులు కౌగగ చెలగే' ననే ఒకానొక కీర్తనలో 

'పాలు పితుకుచును బానల కేగుల/సోలి పెరుగు త్రచ్చుచు చెలరేగే' నేతులు కాగుతుంటే వెలికొచ్చే ధ్వనులు, గోవుల పొదుగుల కింద చేరి గోపాలురు పాలు పితికే సందర్భంలో పుట్టే సవ్వడులు.. ఇట్లా సర్వం ఝుమ్మనే నాదాల మాదిరి పొంగిపొరలుతున్నట్లు అన్నమయ్య సందు దొరికిన ప్రతీ సందర్భంలోనూ కర్ణపేయమైన ఆ సప్తస్వర మిశ్రితాలను  తాను విని ఇహలోకాలూ తన్మయమయేలా  వినిపించడం వాగ్గేయ సంగీత విభాగానికి ప్రత్యేకంగా కలిసొచ్చిన  స్వరాలవిందు! 

'దది మధన నినాదైః త్యక్త నిద్ర ప్రభాతే/ నిభృత పదమగారం వల్లవానాం ప్రవిష్టః/ముఖ కమల సమీరైః ఆశు నిర్వాప్య దీపాన్/కబళిత నవనీతః పాతు గోపాలబాలాః'- పరగడుపునే పెరుగు చిలికే శబ్దాలు విని లేచి, నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లి దీపం ఆర్పి మరీ వెన్న దొంగిలించే ఆ కొంటె కృష్ణుడికి మనకు లాగా ఆ చౌర్యం పాపహేతువు కాదు. సరికదా, కృష్ణచౌర్య స్మరణం ముక్తిఫలదాయకమని నమ్మి ఎంతో మంది భక్తిభావుకులు దానినో  ఓ తత్వం కింద తీర్చిదిద్దారు. అందులో జయదేవుడు, లీలాశుకుడు, మన తెలుగులో పోతనా.. ఆయనకు తోడుగా  అన్నమయ్య ఇప్పుడు! 

వాస్తవానికి లోకంలో దొంగతనం చేయని జీవి ఎక్కడైనా ఉందా? ముఖ్యంగా మనిషి మౌలిక ప్రవృత్తే చోరబుద్ధి. తల్లి గర్భంలో చేరినప్పటి బట్టి అమ్మకు వంటబట్టిన తిండి సారాన్ని  తస్కరించడం  మరిగిన తండ్రి జీవకణమే కదా నవమాసాల అనంతరం భూమ్మీద మనిషిగా అవతరించడం! కన్నవారి ముద్దుమురిపాలను, రక్తమాంసాల ఫలసాయంతో సహా తోబుట్టువులతో కలసి మరీ దొంగిలించి తినే మనం, తినే తిండి నుంచి పీల్చే గాలి వరకు అనుభవించే అన్నింటా అంతో ఇంతో ఏమిటి.. ఆసాంతం.. ప్రకృతి నుంచి, సాటి జీవజాతికి న్యాయంగా దక్కవలసిన  భాగాన్నుంచి  కాజేసి కదూ మరీ ముదురుతున్నది?  ఇదేమని  ఎదురడిగేవారిని మరేదో కట్టుకథలతో దారి మళ్లించే మనిషితత్వం కృష్ణతత్వంతో కలగలసిపోయి అన్నమయ్య అత్యద్భుత ఆధ్యాత్మిక సంకీర్తనల సారంగా రూపుదిద్దుకొన్నదనిపిస్తుంది. వెన్న కాగుతుంటే తినేందుకని చెయ్యి పెట్టి చుర్రుమంటే చీమ కుట్టిందని చిన్నికృష్ణుడు బుడిబుడి రాగాలు తీసినా, తోడుదొంగలమైనందుకేనేమో మనకూ చీమ కుట్టినంతైనా  కోపం రానిది! కన్నయ్య చిన్ననాటి  కొంటె కథలన్నీ ఇట్లాగే ఉంటాయని అన్నమయ్యలోని భక్తిసాధకుని తన్మయత్వ  భావన. ఆ గోపాలుడి నిద్ర మెలుకువే పాలు చిలికే కవ్వం సవ్వళ్లతో మొదలవుతుంది. తరకలు కట్టే వెన్నముద్దలు దొంగిలించే ఆలోచనతోనే ఆ నల్లనయ్య కళ్లు నులుముకుని మరీ నిద్ర  లేచేదని లీలాశుకుని 'శ్రీకృష్ణకర్ణామృతం' కృష్ణతత్వాన్ని వర్ణించింది  గోపీజన మానస చోరుడుగా  కన్నయ్యకు మరో మనోహరమైన  బిరుదు ఎలాగూ ఉంది. క్రౌర్యం, నైచ్యం వంటి మరెన్నో మానసిక బలహీనతలు అన్నిటిని చౌర్యం చేసైనా సరే మనిషిని శుద్ధిచేయడం భగవంతుని బాధ్యతగా  భాగవతులంతా భావించిన తీరులోనే అన్నమయ్య  భావనా వాగ్గేయమార్గంలో అచ్చమైన తెలుగులో అద్భుతంగా సాగిందనుకోవాలి. 

'సా రోహిణి నేల మసూతరత్నం/కృతాస్పదం గోప వధూ కుచేషు' (రోహిణి కృష్ణుడనే నీలిరత్నాన్ని కన్నది. గోపికలు ఎప్పుడూ దానిని తమ వక్షస్థలంలొ ధరిస్తారు) అని లీలాశుకుడు చమత్కరిస్తే, అంతకు రెండాకులు ఎక్కువ చదివినట్లు కృష్ణతత్వం ఆసాంతం నవరత్నాలతో పోల్చదగ్గదని అన్నమయ్య  తెలుగులో చేసిన భావన పరమాద్భుతం. 'ముద్దుగారె యశోద ముంగిట ముత్యము వీడు'సంకీర్తనలో అన్నమయ్య  ఆ నవరత్నాలను పొదిగిన లాఘవం అమోఘం.  యశోదమ్మ ముంగిటి ముత్తెం మరెవరో కాదు.. తిద్దరాని మహిమల దేవకీ సుతుడైన బాలకృష్ణుడే! అతగాడే అంత నింత గొల్లెతల అరచేతి మాణిక్యం; పంతమాడే కంసుని పాలిట  వజ్రం కూడా అతగాడే. ముల్లోకాలకు కాంతులిచ్చే గరుడ పచ్చపూసట చిన్నికృష్ణుడు. రతికేళికి ఎదిగే వేళకు ఆ మదనుడే రుక్మిణమ్మ పాలిటి  పగడంగా మారాడుట! గోవుల గుంపు మధ్య  గోమేధికంలా మెరిసిపోయే నల్లని కృష్ణుడు, శంఖ చక్రాలు ధరించినప్పుడు వాటి సందులో వైడూర్యంలా మెరుపులీనుతాడుట. భక్తజాతికి అంతిమ గతిగా భావించబడే  కమలాక్షుడు కాళింగుడనే సర్పం శిరస్సు మీద కళ్ళు చెదిరే   పుష్యరాగం మాదిరి మిరిమిట్లు గొలుపుతాడని, పాలకడలిలో మెరిసే ఇంద్రనీలం వంటి ఆ శ్రీవేంకటాద్రి పద్మనాభుడే ఆన్నెపున్నేలేమీ ఎరుగని పసిబాలుడి మాదిరి  మన మధ్యనే  పారాడే  దివ్యరత్నమని అన్నమయ్య భావించడం కృష్ణతత్వానికి పట్టిన  అపూర్వ వాగ్గేయ హారతి పళ్లెం.  

- కర్లపాలెం హనుమంతరావు 

బోథెల్  ; యూ ఎస్ ఎ 

30-01. 2021


***

Monday, September 14, 2020

దీపక రాగం - మేఘమల్లార్ రాగం - సేకరణ - కర్లపాలెం హనుమంతరావు

 



దీపక రాగం ఆలపిస్తే దీపాలు వెలుగుతాయంటారు! మేఘమల్లార్ రాగం ఆలపిస్తే మేఘాలు వర్షిస్తాయని నమ్మిక!  మొదటి రాగం వేడిని రగిలిస్తే, రెండో రాగం చల్లదనం కలిగిస్తుందన్న అర్థంలో ఈ హిందూస్తానీ రాగాలను గురించి  అతిశయోక్తి అలంకారంలో జనం చెప్పుకునే మాటలు. సామాన్యులలో ఆసక్తి రేకెత్తించేందుకు సాధారణమైన విషయాలని అసాధరణ రీతిలో చెప్పడం 'కథనం' ప్రక్రియలో ప్రత్యేక విశిష్టిత. ప్రధానమైన అంశాన్ని ఒక కథగా మలచి వినిపిస్తే విన్నంత సేపూ విసుగు పుట్టదు. తరువాత మననం చేసుకునేందుకు కథా విధానం ఒక మంచి పద్ధతి. ఈ దీపకరాగం, మేఘమల్లార్ రాగాల చుట్టూ కూడా ఇలాగే ఎవరో ఒక కాల్పనిక జీవి సృజనాత్మకమైన చక్కని కథ అల్లాడుః


అక్బర్ పాదుషాను గొప్ప కళాభిమాని, కళాపోషకుడుగా చెప్పుకుంటారు కదా! ఆయన కొలువులో అన్ని రకాల కళలకు చెందిన నిష్టాతులకు గౌరవం దక్కేదని వినికిడి. తాన్ సేన్ ఆ బాపతు హిందూస్తానీ సంగీత కళాకారుడు.

అక్బర్ దగ్గర చనువుగా ఉండే బీర్బల్ ఒకరోజు దీపకరాగం గురించి పాదుషాలో కథలు కథలుగా చెప్పి ఆసక్తి రేకెత్తించాడు. అక్బర్ తాన్ సేన్ ను నిండు సభలో తనకు ఆ దీపకరాగం ఆలపించి వినపించమని ఆదేశించాడు. అప్పటి దాకా సుఖంగా గడిచిపోయే తాన్ సేన్ సంగీత జీవితానికి ముప్పు  ఏర్పడిందన్న మాట. దీపకరాగం తాన్ సేన్ కు రాక కాదు. అది ఆలపించి ఇంచక్కా దీపాలు వెలిగించి చూపరులకు ఆనందం కలిగించవచ్చు. కానీ గానం చేసిన గాయకుడు కొద్ది రోజులలోనే అనారోగ్యం పాలవుతాడని, చికిత్సలేని రుగ్మత వల్ల దుర్మరణం సంభవిస్తుందన్న ఒక  నమ్మకం  ప్రచారంలో ఉంది. పాదుషా ఆజ్ఞాపించిన మీదట కాదనేందుకు లేదు కదా! కనక, దీపకరాగం ఆలపించి నిండుసభలో పాదుషా ప్ర్రశంసలు పొందినా, తాన్ సేన్ తొందర్లోనే అనారోగ్యం పాలయ్యాడు. చికిత్స చేసిన రాజవైద్యులు పెదవి విరిచి 'దీపకరాగం వల్ల వచ్చిన పీడకు మేఘమల్లార్ రాగం ఒక్కటే మందు. అది పాడినా, విన్నా క్రమంగా తగ్గుముఖం పట్టాల్సిందే తప్ప ఈ గుండెల్లో మంట రోగానికి మరో  ఉపశమనం లేదు.' అని తేల్చిచెప్పారు. తాన్ సేన్ కు ఆ రాగం రాదు. అది వచ్చినవారు ఎక్కడ ఉంటారో .. ఆ వివరాలు కూడా తెలీవు.  వెదుకులాట మొదలయింది. 'పాడేవారు దొరికేదాకా  గుండెల్లో ఆరని ఆ మంటకు ఉపశమనంగా ఉండేందుకు వీలుగా తాన్ సేన్ ను ఏదైనా చల్లని నదీ తీరానికి పంపించండి' అని సలహా  ఇచ్చారు వైద్యులు.

అక్బర్ అనుమతితో  గుజరాత్ లోని శబర్మతీ నదీ తీరాన ఒక కుటీరం వేసుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు తాన్ సేన్.

రాష్టం మీద మొగలాయీల కన్ను పడిందన్న అనుమానంతో ఉన్న  గుజరాతీ సమాజంలో దానికి తగ్గ విధంగా ఆడవారు తమ నడవడికను మార్చుకున్నారు. పగలు బయట మొహాలూ చూపించడం దాదాపుగా తగ్గించేశారు. ఇంటి అవసరాలకు కావలసిన నీళ్లు తెల్లవారు ఝామున చీకట్లలోనే నదీ తీరానికి గుంపులుగా వెళ్లి తెచ్చుకునేవాళ్లు.  ఆవిధంగా నీరు తెచ్చుకునేందుకు నదీ తీరానికి వచ్చిన అక్కచెల్లెళ్ళు నది ఒడ్డున కుటీరం బైట గుండెలోని ఆవేదన ఆగక బాధపడే తాన్ సేన్ ను చూశారు. 'అక్కడెవరో దీపకరాగం ఆలపించి పాపం అనారోగ్యం పాలయినట్లున్నారే!' అంది ఒక ఆడగొంతు. రెండో గొంతు 'ష్.. ష్.. మనకెందుకు? పోదాం పద!' అంది. ఆడవాళ్ళిద్దరూ గబగబా బిందెలో నీరు నింపుకొని గట్టు ఎక్కి పైకి రాసాగారు. గట్టు మీద నిలబడి ఉన్న తాన్ సేన్ వాళ్లను చూశాడు. ఆ ఆడవాళ్లిద్దరు పడుచువయసులో, అందంగా, పొందికగా ఉన్నారు. 'నేను దీపకరాగం ఆలపించినట్లు మీకు ఎలా తెలుసు తల్లులూ?' అని అడగాలని తాన్ సేన్ ఉద్దేశం. ఆయన పెదవి విప్పి అడిగే లోపలే  ఆ ఆడవాళ్లు ఇద్దరూ ఎవరో తరుముతున్నట్లు వెళ్లిపోయారు!

మర్నాడు అదే చోట వాళ్ళ కోసం కాపు కాసి కష్టపడి ఎట్లాగైతేనేం ఆడపిల్లలు ఇద్దరిని నిలబెట్టాడు తాన్ సేన్. తన పేరు ఫలానా అని, అక్బర్ పాదుషా కొలువులో పాటలు పాడే ఉద్యోగిన'ని చెప్పుకోగానే ఇద్దరిలో పెద్దపిల్ల 'అమ్మో! అక్బరు పాదుషానే! ' అంటూ కంగారుపడుతూ చెల్లెలు చెయ్యి పట్టుకుని  లాక్కెళ్లిపోయింది. విచారణ  మీదట తాన్ సేన్ కు ఊరిలో మొగలాయీల మీద ఉన్న బెదురు అర్థమైంది

మర్నాడు తెల్లారుఝాము చీకట్లలో మళ్లీ ఆ అప్పచెల్లెళ్లను కలుసుకుని 'చెల్లెమ్మల్లారా! నన్ను చూసి భయపడనక్కర్లేదు! మీరు చూస్తే  సంగీతజ్ఞులకు మల్లే కనిపిస్తున్నారు. మేఘమల్లార్ రాగం మీకు గాని తెలిస్తే పాడి నాకు సాయం చేయండమ్మా! లేదా ఆ రాగం తెలిసినవాళ్ల వివరాలు చెప్పినా మీ పుణ్యం వృథా పోదు తల్లులూ!' అంటూ  పరిపరి విధాల ప్రాథేయపడ్డాడు


అమ్మాయిలు ఇద్దరకూ జాలి కలిగింది. చిన్నపిల్ల అన్నది' మాకూ కొద్దిగా సంగీతం వచ్చు. మేఘమల్లారం పాడి వినిపిస్తామురేపు పౌర్ణమి కదా! తెల్లారుఝామున చీకట్లు విడకముందే ఈ నదీ తీరానికి వచ్చేయండి. ఇట్లా వస్తున్నట్లు ఎవరికీ చెప్పకండి!' అన్ని వెళ్లిపోయారు

మర్నాడు అనుకున్న సమయానికే అక్కచెల్లెళ్లిద్దరూ ఆ నది తీరంలొ ఎదురుచూస్తూ కూర్చునివున్న  తాన్ సేన్ ను కలుసుకున్నారు. చిన్న అమ్మాయి కుటీరంలోకి వెళ్ళి తాన్ సేన్ సితారా తీసుకువచ్చింది. అక్కచెల్లెళ్ళిద్దరూ ఆ పండు వెన్నెలలో ప్రశాంత వాతావరణంలో నదీ తీరాన అత్యంత మధుర స్వరాలతో మేఘమల్లార్ రాగం అలపిస్తుంటే వింటూ తన్మయుడయిపోయాడు స్వయంగా  సంగీత విద్వాంసుడు అయిన తాన్ సేన్. మేఘమల్లార్ ఆలాపన  వింటుంటే తాన్ సేన్ కంటి వెంట నీరు ఆగలేదు. గానం పూర్తవగానే 'మీరు మానవులు కాదు తల్లులూ! దివి నుంచి దిగివచ్చిన గంధర్వులు. మీ స్వరాలకు చిక్కి సంగీతలక్ష్మి స్వయంగా తానే పునీతమయింది తల్లుల్లారా' అన్నాడు  కంటి వెంట కారే బాష్పధారలను తుడుచుకోకుండానే. మరంత విచారించిన మీదత తమ పేర్లు 'తానా.. నానా' అని మాత్రం చెప్పుకొచ్చారు ఆడపిల్లలు


తానా నానాలు మూడు రాత్రులు మొదటి ఘడియల్లో అట్లా మేఘమల్లార్ రాగం ఆలపించగానే తాన్ సేన్ గుండెల్లోని జ్వాల చల్లారింది. మనుషుల్లో పడ్డ  తాన్ సేన్ తిరిగి వెళ్లిపోయే సమయంలో తానా నానాలకు బహుమానాలు ఇవ్వబోతే  తీసుకోలేదు 'మా గురించి మూడో కంటికి తెలియనీయకండి! అదే మీరు మాకు ఇచ్చే అతి పెద్ద బహుమానం అన్నయ్యగారూ!' అని మాత్రం మాట తీసుకున్నారు.

కోలుకొని తిరిగివచ్చిన తాన్ సేన్ ను చూసి అక్బర్ పాదుషా అమితంగా ఆనందించాడు.  కానీ సాటి సంగీత కళాకారులలో ఈసు రగిలింది. 'మేఘమల్లార్ రాగం పాడి వినిపించమని మీరే స్వయంగా అడిగినా  రాదని తాన్ సేన్ తమకు చెప్పాడు. ఆ మాట అబద్ధం అని ఇప్పుడు తేలింది కదా హుజూర్ఆ తప్పుకు దండన ఉండద్దా?' అన్నది వాళ్ల ప్రశ్న.

 అక్బరు కూడా  ఇదే ప్రశ్న వేసినప్పుడు  సమాధానం ఏం చెప్పాలో తెలీక బిక్కమొగమేశాడు తాన్ సేన్. అక్కచెల్లెళ్లకు ఇచ్చిన మాట ప్రకారం వారి గురించి ఎవరికీ చెప్పకూడదు కదా! ఎంత అడిగినా మేఘమల్లార్ రాగాలాపన చెయ్యడానికి గాని, అందుకు సంబంధించిన వివారాలు చెప్పడానికి గాని మొరాయించే తాన్ సేన్ మీద అక్బర్ పాదుషాకు పీకల దాకా కోపం ముంచుకొచ్చింది. 'వారం రోజులు గడువు ఇస్తున్నాను. ఈ లోగా పాడి తీరాలి. లేదా ఆ పాట ఎవరి ద్వారా విన్నావో  ఆ వివరాలైనా చెప్పి తీరాలి. కాదంటే ఉరిశిక్ష ఖాయం. చక్రవర్తితో అబద్ధాలాడిన నేరానికి ఇంత కంతే మరో పెద్ద శిక్షలేదు మరి' అని  హుకూం జారీ చేశాడు అక్బర్ మహారాజు.

ప్రాణాల మీద తీపితో 'తానా నానా' ల   గురించి బైటపెట్టేశాడు తాన్ సేన్అక్కచెల్లెళ్ల నోట ఆ మేఘమల్లార్ రాగం వినాలని ఉవ్విళ్ళూరాడు అక్బర్. ఉన్నపళంగా దండు  శబర్మతీ నదీ తీరానికి తరలింది. ముదే తాన్ సేన్ తానా నానాలను కలసి తన వల్ల జరిగిన తప్పును కాయమని, 'ఒక్కసారి వచ్చి పాదుషా సమ్ముఖంలో మేఘమల్లార్ రాగం ఆలపించకపోతే తన ప్రాణాలు  పోవడం ఖామయ'ని దుఃఖిస్తూ చెప్పాడు. అక్కచెళ్లెళ్లిద్దరూ విన్నారు ఓపిగ్గా. తాన్ సేన్ స్థానం హిందూస్తానీ సంగీతంలో ఎంత ఉన్నతమైనదో వాళ్లకి తెలుసు. పాదుషా సమ్ముఖంలో రాగం ఆలపించడానికి సమ్మతించారు.

నిండు సభలో ఆ బంగారు బొమ్మలు ఎత్తైన వేదిక మీద మేలి ముసుగుల వెనుక నుంచి చెవులు రిక్కించి ఆలపించిన మేఘమల్లార్ రాగం సభ్యులను అవాక్కయేలా చేసింది. ఆగకుండా కరతాళధ్వనులు! అక్బర్ పాదుషా ఆనందానికయితే హద్దే లేదు. మెడలోని ముత్యాల సరం తెంపి తానా నానాల మీదకు విసిరిపేసాడు. అయినా ఆ అభిమానవతులు వాటి వంక తేరిపారయినా చూసింది లేదు.

తమ కోసం గాను ఏర్పాటు చేసిన సభామధ్యమం లోని ఎత్తైన ఆ వేదిక నుంచి కిందికి దిగి ఒకరి వంక ఒకరు సాభిప్రాయంగా చూసుకుంటూ కౌగలించుకున్నారు. ఉత్తర క్షణంలో అలంకరించిన అందమైన పందిళ్లు హఠాత్తుగా నేలకూలినట్లు  కుప్పకూలిపోయారు. వారి డొక్కల్లోని బాకులు రక్తసిక్తమై ఆ ఘనకార్యం చేసింది తామే అన్నట్లు ఎర్రగా నవ్వుతున్నాయి!

అదే క్షణంలో సభలోకి దూసుకొచ్చిన ఇద్దరు యువకులు ఘొల్లుమన్నారు. వాళ్ళిద్దరు తానా నానా భర్తలు. సభకు బైలుదేరే ముందు భర్తలను క్షమించమని వేడుకుంటూ  రాసిన ఉత్తరాలు అప్పుడు గాని అందరి కంటపడ్డాయి కాదు. 'మహా సంగీత విద్వాంసుడు తాన్ సేన్ విలువైన ప్రాణాలు కాపాడవలసిన అవసరం గుర్తించాము. అందుకని నిండు సభలో అక్బర్ పాదుషా ముందు మేఘమల్లార్ రాగం ఆలపించవలసి వచ్చింది. ముందుగా భర్తలైన  మీ అనుమతి తీసుకోలేదు. మా వల్ల తప్పు జరిగింది అని తెలుసు. మన జాతి నీతి ప్రకారం భర్తల సమ్మతి లేకుండా భార్యలు పరపురుషుల కంటబడకూడదు. ఆ రివాజును తప్పినందుకు మేము నిస్సందేహంగా శిక్షకు అర్హులమే. మీకు మా మీద ఉన్న ప్రేమ తెలుసు. మీరు మమ్ములను శిక్షించలేరు. కాబట్టి మమ్మల్ని మేమే ఇలా శిక్షించుకుంటున్నాము. మిమ్ములను మనసారా ప్రేమిస్తున్న భార్యలుగా మమ్ములను క్షమించమని ఆఖరి విన్నపం'. 

ఉత్తరం బిగ్గరగా చదివి భర్తలిద్దరూ 'మా తానా నానాలను తిరిగి ఎవరైనా తెచ్చివ్వగలరా?' అని హృదయవిదారకంగా రోదిస్తుంటే అక్బర్ తన తొందరపాటుకు తలదించుకోవలసి వచ్చింది.

తాన్ సేన్ యువకులు ఇద్దరిని పైకి లేపి పరితాపంతో అన్నాడు 'చెల్లెళ్లు ఇద్దరిని నేను తిరిగి తెచ్చి ఇస్తానని హామీ ఇస్తున్నా. భౌతికంగా నాకు సాధ్యమవని ఆ పనిని కళాకారుడుగా సాధించి చూపిస్తాను. ఇక నుంచి నేను ఆలపించే సంగీత స్వరాలలో ఇప్పటి వరకు  ధ్వనించిన 'ఓం' అనే స్థానంలో 'తోమ్ తానా నానా' అంటూ ఆలపిస్తాను.  ఆ రకంగా మీ తానా నానాలను కాలానికి అతీతంగా శాశ్వతం చేస్తాను ' అని వాగ్దానం చేసాడు.

 తానా, నానాల పేరున శబర్మతీ నదీ తీరాన ఒక స్వరాలయాన్ని నిర్మించాడు తాన్ సేన్.

తరువాతి కాలంలో కాలగర్భంలో ఆ సంగీతాలయం కలిసిపోయింది. మహా పాదుషా అక్బర్ చక్రవర్తి  ఉనికీ మలిగిపోయింది. చివరికి శాశ్వతంగా మిగిలింది మాత్రం  హిందుస్తానీ మహా సంగీతవిద్వాంసుడు తాన్ సేన్ గొంతులో తారట్లాడే 'తోమ్ తానా నానాలలోని  ఆ తానా నానా' లు మాత్రమే!

***

సేకరణః

-కర్లపాలెం హనుమంతరావు

14 -09 -2020

Friday, July 24, 2020

వేటూరి పాటలతో ఆట



వేటూరి ఓ  పాటలోని  చిత్రమైన చతురత
సినిమా పాటలంటే సాహిత్యపరంగా పల్చగా ఉంటాయన్న చులకన భావం సాహిత్యంలో ఓ మాదిరి లోతు  పాతులు తమకు తెలుసును అనుకునే వాళ్లకి మనసులోనైనా కొద్దిగా కద్దు. (నాకూ ఒకానొకప్పుడు ఆ మాద్రిరి భావం ఉండేది, రవి వీరెల్లి గారి అంతర్జాతీయ మాసపత్రికలో ఆ అంశం మీద ఒక సినీరచయిత సాగించిన చర్చలో కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించినట్లు గుర్తు. ఇప్పటికీ ఆ భావనలో మార్పు అంతగా లేదు. కానీ  గత కాలపు సినీకవులు కొసరాజు, శ్రీశ్రీ, ఆరుద్ర.. ఆత్రేయ  .. మరీ  ముఖ్యంగా వేటూరి వంటి విద్వత్ కవుల  కలంపోటుల్లో మాత్రం  తరచి చూసే ఓపిక ఉన్నవాళ్ల కళ్లకి తరచూ  మెరుపులు తటిల్లుమని మెరిసి మురిపిస్తాయి. తార్కాణానికి ఒక మచ్చు తునకః శంకరాభరణం- ఓంకార నాదానుసంధానమౌ గానమే శంకరాభరణము- అనే పాట. ఆ పాటలోని - 'రసికుల కనురాగమై, రసగంగలో తానమై(స్నానం చేసి), పల్లవించు సామవేద మంత్రము'  అనే చరణంలో   సంగీతానికి ముఖ్యప్రాణులైన రాగం, తానం, పల్లవి- అనే మూడు పదాలను(అనురాగంలోని 'రాగం'; రసగంగలో చేసిన 'తానం'- సామవేద మంత్రం పల్లవించడంలోని 'పల్లవి'- పట్టు పీతాంబరంతో చుట్టిన   చందన గంధపు చితుకుల చందంగా దాచి మరీ వాడిన చతురత సుందరమూర్తిది.!  ఈ మూడు పదాలే ఆనక మరో పాట పల్లవికి తొలి పాదంగా మారడం అదనంగా అలరించే ముక్తపదగ్రస్తమంతటి చిత్రాలంకారం కూడా కదా!
-కర్లపాలెం హనుమంతరావు

***

Thursday, December 12, 2019

జగదానందకారకం- ఈనాడు ఆదివారం సాహిత్య సంపాదకీయం -కర్లపాలెం హనుమంతరావు





'నాదాధీనమ్ జగత్ సర్వం' అని సామవేద వాదం. బ్రహ్మ సామవేద గానాసక్తుడు. వాణి వీణాపాణి. శంకరుడిది ఓంకార నాద ప్రీయత్వం. అనంతుదు సంగీత స్వరాధీనుడు.   మతంగ, భరత, శుక, శౌనక, నారద, తుంబుర ఆంజనేయాది రుషిసత్తములందరూ మోక్ష సామ్రాజ్యాన్ని సాధించింది నాదబ్రహ్మోపాసనా మార్గంలోనే అన్నది శ్ర్రుతి స్మృతి పురాణేతిహాసాదుల మాట. సామవేదం ప్రకారం చేతనాచేతనాలైన సమస్త భూతజాలాన్ని ఆకర్షించే ఐహిష్కాముష్కికాలైన చతుర్విధ పురుషార్థాలను ప్రసాదించే శక్తి ఉన్నది ఒక్క సంగీత విద్యకే. 'సరిగమపదని'సలనే సప్త స్వరాల పునాదులపై నిర్మించిన భారతీయ సంగీత మహాహార్మ్యం ఎంతో అనాదిది. ఆరంభంలో ఒకే లక్ష్య లక్షణ సంప్రదాయాలతో విరాజిల్లినా విజాతీయుల పాలనా ప్రభావం ఉత్తర దక్షిణాలనే అంతరాన్ని ఏర్పరిచింది. ఆంధ్ర కవితాపితామహుడుగా పేరుగాంచిన నన్నయ భట్టారకునికి చాలా ముందు నుంచే ఏలపాటలు, తుమ్మెద పాటలు వంటి జానపద గులాబీలు సౌరభాలు గుబాళించేవి. అన్నమాచార్యులు, పురందరదాసు, క్షేత్రయ్య వంటి పదవాగ్గేయకారులూ   ప్రచారం చేసిన జనసాహిత్యమూ అపారమే! 'సంగీతం' అంటే 'తంజావూరు పాట' అన్నంతగా స్థిరపడిన నాయజరాజుల పాలనలో తెలుగు నేలల నుంచి  గుర్తింపు కోసం వలసపోయిన మహానుభావులు ఎందరో! ఆ వలసజాతి కాకర్లవారి వంశంలో సుస్వర జనసంగీత పునరుద్ధరణార్థమై భువికి దిగివచ్చిన అపర పరమేశ్వరుడు 'శ్రీరామ తారక మహా మంత్రోపాసన' మహిమతో అసంఖ్యాకంగా భగవత్ సంకీర్తనా సాహిత్యం సృజించిన కర్ణాటక సంగీత వైతాళికుడు  త్యాగరాజు. పద్దెనిమిదో శతాబ్ది పూర్వార్థంలో తంజావూరు సంగీత సాహిత్య క్షేత్ర వృక్షాల 'అంటు'గా ప్రవర్థిల్లిన 'త్యాగరాజం' అనే కొమ్మ వెదజల్లిన ఫలాలు, పుష్పాలు, బీజాలే నేటికీ మహావృక్షాలుగా ఎదుగుతూ నేల నలు చెరగులా పరిమళాలు ప్రసరిస్తున్నది.
సరిగమలతో పరిచయం ఉండని సామాన్యుడిని సైతం సమ్మోహనపరిచే ఆ సంగీత మాయావినోదం మూలాలు- రాగాలలో అంతర్లీనంగా ఒదిగుండే పదాల పొహళింపులో ఉంటుంది. పండితులు అంత వరకు తమ సొంత సొమ్ముగా భావిస్తూ వచ్చిన సంగీత సాహిత్యాలు రెండింటినీ తనదైన అజరామర సృజన ముద్రతో సామాన్యజన పరంచేసిన రాగ భగీరథుడు త్యాగరాజయ్యర్. 'ప్రాచీనాంధ్ర సాహిత్యంలో ముగ్గురే కవిబ్రహ్మలు' అంటారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ; తిక్కన, పోతన, వారిద్దరి తేటతనం, భక్త్యావేశాలను వాగ్గేయరూపంలో తేటపరిచిన  త్యాగరాజు. త్యాగయ్య పల్లవులు, చరణాల నిండా కండ గల కలకండ తెలుగు పలుకులే! నిత్య వ్యవహారం నుంచి పక్కకు తప్పుకున్న అచ్చతెనుగు పలుకుబడులను పునరుజ్జీవింపచేసిన త్యాగరాజుది భాషాశాస్త్రవేత్తల దృష్టిలో సైతం వైతాళిక పాత్ర.  'సానుభూతి' అనే పదానికి సాధారణంగా మనం వాడే అర్థం 'జాలి'. 'త్యాగరాజు 'నగుమోము గనలేని'  అనే కీర్తనలో 'నా 'జాలి' దెలిసి నను బ్రోవగ రాద' చరణంలో ఆ పదం 'నిస్సహాయత' అనే అర్థంలో ధ్వనిస్తుంది. పాటకజనం నిత్యవ్యవహారంలో సన్నిహితులను చనువుతో పిలిచే విధంగా 'రారా మా ఇంటి దాకా' అంటూ మనసారా ఆహ్వానించడంలోని మర్మం; రాముణ్ని ఎప్పుడూ త్యాగయ్య మానవాతీతుడిగా భావించకపోవడమే! తెలుగు వాజ్ఞ్మయంలోని గేయ సంప్రదాయాన్ని స్వీకరించి ఉత్తమోత్తమమైన సంగీత సాహిత్యాలను సమపాళ్లలో ప్రజాబాహుళ్య ప్రయోజనార్థం మేళవించిన జనవాగ్గేయకారుడు త్యాగయ్య. అంతకు మించి  వైదేశిక రాటుపోట్లతో అగ్గలమయిపోయిన తెలుగువాణిని సముద్ధరించిన శుద్ధ భాషాసేవకుడు కూడా!

ఉపనిషత్తుల ప్రకారఁ అన్నం, ప్రాణం, మనసు, విజ్ఞానం, ఆనందం - అనే అయిదు అంచల సోపాన మార్గాన మాత్రమే ఈశ్వర తత్వ సాధన సాధ్యమన్నది భారతీయ ఆధ్యాత్మిక  చింతన. త్యాగరాజస్వామి పంచరత్నమాల అంతస్సూత్రమూ అందుకు అనుగుణంగా సాగుతుంది. పరమేశ్వరాత్మతో తాదాత్మ్యత సాధించే నిమిత్తం సాధించవలసిన బ్రహ్మానందం కోసమై ఆలపించే 'జగదానందకారక' కీర్తన ఆలాపనకు మిగిలిన నాలుగు ఘనరాగరత్నాలను సోపానాలుగా ఆ రాగయోగి మలచిన తీరు నిరుపమానం! ఆనందమయ, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాల శుద్ధిని ఉద్దేశించి సృజించినవని ఘనరాగపంచరత్నాలను యోగ శాస్త్రజ్ఞులూ సమర్థిస్తున్నారిప్పుడు. రామకృష్ణుడు ప్రవచించిన సర్వమత సహన సూత్రాన్ని తన సంకీర్తనల ద్వారా లోకానికి ఎలుగెత్తిచాటిన మత సంస్కర్త త్యాగరాజస్వామి. రాగకళకు రాగద్వేవాలతో నిమిత్తం లేదని త్యాగరాజయ్యవారి శిష్యకోటిలోని ఆంధ్రేతరులు చాటిచెప్పే మాట.  'జయదేవుని కడ క్రోధమై రాధ చరణాలు-ముద్దుల మోళిపై మోసి మోసి/ అన్నమాచార్యుల సమక్షమందేడు కొండల- నొంటిగా కాపురముండి  యుండి/ క్షేత్రయ్య రసమయ్య క్షేత్రమున పలు నాయికల బిగి కౌగిళ్ల నలిగి నలిగి/ విసిగిపోయి సుంత విశ్రాంతి కోసమై- సీత తోడ అనుగు భ్రాత తోడ / విశ్వమయుడు ప్రభువు వేంచేసియున్నాడు- రాముండగుచు త్యారరాజు నింట' అంటారు కవి కరుణశ్ర్రీ! నిజానికి ఆ రామచంద్రుడు లౌకికమైన చీకాకులకు అలసి రవ్వంత సాంత్వనకై తపించే మనలోని ఆత్మారాముడికి ప్రతీక. 'ఇంద్రియ జ్ఞానానికి, ఆత్మానందానికి మధ్య స్థానాన్ని సంగీతం ఆక్రమిస్తుంది' అంటారు ప్రముఖ  ఆంగ్లకవి బ్రౌనింగ్. ఎంతో అదృష్టం ఉంటేనే ఆ  'లోచెవి' కలిగిన సంగీత సాహిత్యశాస్త్రవేత్త కాగలిగేది. త్యాగరాజస్వామి అంతటి అదృష్టవంతుడు. ఆ స్వామి తెలుగువాడు కావడం తెలుగువాడి అదృష్టం. స్వామి 'తన్మయ సమాది' నుంచి తన్నుకువచ్చిన సంగీత ఝరిని దోసిళ్లకు పట్టి శిష్యులు స్వరసాహిత్యంగా పదిలపరచని పక్షంలో జాతికి ఈ మాత్రమైనా 'సుస్వర గంగ' సంప్రాప్తమైవుండేదా? ఎనభై ఐదేళ్లు అఖండంగా వెలిగిన ఆ త్యాగరాగజ్యోతి ఈ బహుళ పంచమి నాటికి 'నచ పునారావర్తి' పదవిని అలంకరించి 173 ఏళ్లు
(2020 నాటికి). ప్రతీ ఏటా జరుపుకునే త్యాగరాజ సంగీత ఉత్సవాలు వాస్తవానికి స్వర,సాహిత్యాలు రెండింటికీ జరిగే మహోత్సవాలు.
-కర్లపాలెం హనుమంతరావు
(ఈనాడు- ఆదివారం సాహిత్య సంపాదకీయం 15 -12 -2012)

Saturday, September 17, 2016

అపనా తనా మనా -మారోరె భైరన్నా!-అంటే ఏ౦టిట?- -బాలాంత్రపు రజనీ కాంతారావు రావు గారి వివరణ

అరవైఏళ్ళ  క్రిందట ఆంధ్ర దేశంలో అన్ని 
పల్లెలు.. పట్టణాలలో.. బజారుల్లో పాటక
(మాములు) జనంనోట తరచూ వినిపించిన  చౌకబారు పాట పల్లవిది.
అప్పట్లో ఒక సినిమాలో హాస్యగాడు కూడా  పల్లవి తోనే ఒక పాట ఎత్తుకుని పాడాడు కూడా. దాంతో అది మరింతగా జనం నాలికల మీద నాట్యమాడింది.
సరే... ఇంతకీ ఈ పాటకి అర్థం ఏమిటి?
'అప్పన్నా' అని వుంది కనక 
ఇదేమన్నా విశాఖపట్నం ప్రాంతం లోనిసింహాచలం దేవుడు అప్పన్న పేరున
కట్టి పాటా అలాంటిదే అయివుంటే  ప్రాంత ప్రసిద్ధ కవులు,మేధావులు 
పురిపండా, శ్రీ శ్రీ,ఆరుద్ర  లాంటి 
వారన్నా ఎప్పుడో ఏదో ఒక సందర్భంలో ప్రస్తావించివుండాలి కదాఅలా ప్రస్తావించిన దాఖలాలు ఎక్కడ కనపడవు! కానీ ఆ ప్రాంతపు సంగీత కళానిధి ద్వారం వెంకట స్వామి నాయుడుగారు తమ కర్ణాటక సంగీత కచేరీ చిట్టచివరి అంశంగా వినిపించే జానపదాల గీతాల తోరణ మాలికలలో  పాట కచ్చితంగా వినిపిస్తుండేది. కాకినాడ శెమ్మా 
గోష్టులలోకూడా  పాట 
వరసల్లోనే దశావతారాలు పాడుతుండే వారని ప్రతీతి"జాలమూ ఏలనురా, నీల మేఘ శ్యామ.. పాలించు గుణధామ భద్రాద్రిరామ!"అని అన్ని అవతారాలు  వరసల్లోనే సాగుతుండేవి.
దీని సంగీతం హిందూస్థానీ- దేశ్ రాగాలకు దగ్గరలోవుండేది
దీనికిమూలమయిన గేయ మాత్రం "అప్పన్నా తనా మనా"నే అంటారు రజనికాంతారావు గారు.
అసలు ఇంతకీ ఇంతగా ప్రాచుర్యం 
పొందిన  పదాలకి అర్థం ఏమిటి?
ఒక్కొక్కరు ఒక్కో రకమయిన అర్థం చెప్పటమే ఈ పదాలలోని విశేషం.
'ఇద్దరు తాగుబోతుల మధ్య సాగిన సంవాదం' అంటూ ఆయన సరదాగా ఇలా వివరణ ఇచ్చేవారట. "అప్పన్నా 
తన్ననా?.. మాననా?" అని ఒకడు మత్తులోఅడుగుతుంటే రెండో వాడు "మారోరె భైరన్నా!"(కొట్టరా కొట్టు) అని రెచ్చగొట్టేవాడుట! జ్ఞాని, తపస్వి, కలకత్తా నుంచి కేరళ వరకు దేశంలోని 
అన్ని ప్రాంతాలు దర్శించిన శ్రీ 
బాలాంత్రపు రజని కాంతారావు గారి 
బాబాయి సూర్యనారాయణరావుగారు సంగీతంలోని  జానపదబాణీలనుంచి, బజారు మట్టపు కబుర్ల దాకా 
బ్రహ్మపదార్థాల్లాంటి  విషయాలనుకూడా చక్కగా అర్థసహితంగా వివరించగల ఘటనా ఘటన సమర్థుడు.  అయన 
గారికి రజనీ కాంతారావుగారు  పాట 
అర్థం తత్త్వసమన్వయం చేసి ఇలా సెలవిచ్చారుట. 'ఇది తెలుగు తాగుబోతుల పాట కాదు. సూఫీ సంబంధమయిన   వేదాంతగర్భితమయిన హిందూస్థానీ 
ఫకీరు ఉపదేశ సారం ."అపనా తన్ న మాన్ నా(నీ శరీరం  సంగతి పట్టించు 
కోవద్దు. మరోరె భయ్ రహ్ నా! (చనిపోయినవాడు ఉండే స్థితిలో ఉండరా సోదరా!).అని ఉపదేశార్థంట!. చనిపోయిన మనిషి
 ఎంత ప్రశాంతంగా వుంటాడో అంత ప్రశాంతంగావుండమ'ని ని రామదాసుకు 
తారక మంత్రం బోధ చేసిన  కబీరుదాసువంటి మహానుబావుడో మన ప్రాంతపు జానపదులకు చేసిన ఉ పదేశమని రజనీగారి 'భాష్యం'!

తెలుగు భాషలోని పదబంధాలతో  ఎన్ని చమత్కారాలు చెయ్యవచ్చో!  ఆ విషయం సోదహరణంగా  చెప్పటానికే  ఎప్పుడో చదివిన ఈ సరదా సంఘటనని  ఇక్కడ ఇప్పుడు పొందుపరిచింది!
(బాలాంత్రపు రజని కాంతారావు గారి 'రజనీ భావ తరంగాలు' నుంచి సేకరించి దాచుకున్న  చమత్కార గుళిక ఇది)
***
-కర్లపాలెం హనుమంతరావు

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...