Showing posts with label Medical. Show all posts
Showing posts with label Medical. Show all posts

Sunday, December 12, 2021

ఆ'పరేషాన్ ' - చిన్న కథ - కర్లపాలెం హనుమంతరావు

 

 

మా కొలీగ్ సుబ్బారావు తనకు వంట్లో బావోలేదని ఆసుపత్రికి వెళుతుంటే నేనూ తోడు వెళ్ళా.

బైట బోలెడంత క్యూ. గంటకయినా లోపలికి పోవడం అనుమానమే. ఆఫీసుకి టైమయిపోతుందని నేను కంగారు పడుతుంటే కారిడార్లలో గుర్నాథం కనిపించాడు. నన్ను గుర్తుపట్టి పలకరించాడు.

గుర్నాథం హైస్కూల్లో నా క్లాస్ మేట్. చాలా ఏళ్ళతరువాత అనుకోకుండా ఇక్కడ కలిసాడు. నేను వచ్చిన పని కనుక్కొని చనువుగా 'డాక్టరుగారు నాకు బాగా తెలుసులేరా! నువ్వెళ్ళు! మీ ఫ్రెండు పని నేను చూస్తాలే!' అన్నాడు.

 

ఆ సాయంత్రం సుబ్బారావు గుర్నాథాన్ని ఒహటే పొగడటం! 'మీ ఫ్రెండుకి మా చెడ్డ ఇన్ఫ్లుయన్సుందండీ! చకప్పులూ అవీ చకచకా చేయించేసాడు. రిపోర్టులు తీసుకొని తనే వస్తానన్నాడు' అన్నాడు సంబరంగా.

గుర్నాథం స్కూలురోజుల్లో యావరేజి. వెనుక బెంచీలో కూర్చోని ఎప్పుడూ ఏవేవో పెన్నులు రిపేరు చేస్తుండేవాడు. వాడి సంచీలో పుస్తకాలు అన్నీ ఉన్నా లేకపోయినా.. రకరకాల కలం కేపులు, పాళీలు, నిబ్బులు, సిరాబుడ్డి, చెత్తగుడ్డపీలికలు మాత్రం నిండుగా ఉండేవి. మూడుపైసలకు కేపు, రెండు పైసలకు నిబ్బు, పైసాకి పాళీ.. పెన్నుమొత్తమయితే అణా.. అలా అమ్మేవాడు పాత కలాలని. అణాలు, పైసలు చలామణిలో ఉండే జమానాలేండి అది. అప్పట్లో ఇప్పట్లా బాల్ పెన్నులు కాకుండా సిరా నింపుకొని రాసుకొనే రకం కలాలు వాడకంలో ఉండేవి. మా మాస్టార్లుకూడా ఈ గుర్నాథం బుట్టలో పడుతుండేవాళ్ళు! అవసరం వచ్చినప్పుడు వాడు వాళ్ళకీ పేనాలు ఉచితంగా తయారు చేసిస్తుండేవాడు.  అందుకని ఏమనేవాళ్ళు కాదు.

పదో తరగతి పరీక్షలు రాసే రోజుల్లో సమాధాన పత్రాలు తారుమారు చేసాడని డిబారు చేసారు వాణ్ణి. ఆ తరువాత ఇదిగో ఇప్పుడే.. మళ్ళీ దర్శనం!

గుర్నాథం తెచ్చిన రిపోర్టులు చూసి గుండె ఆగిపోయినంత పనయింది  సుబ్బారావుకి. కిడ్నీలో ప్రాబ్లమున్నట్లు తేలింది. 'ఆపరేషన్ అవసరమంటున్నాడు డాక్టర్' అన్నాడు గుర్నాథం తాపీగా.

కిడ్నీ ట్రాన్సప్లాంటేషనంటే మాటలా? దానికి ముందు డయాలసిస్. డయాలసిస్ అంటే లక్షల్లో వ్యవహారం. ముందు డోనర్ దొరకడమే గగనం. కిడ్నీదాత బంధువు కాకపోతే ఆథరైజేషన్ కమిటీ అప్రూవల్ అవసరం. అదంత తేలికగా తెమిలే వ్యవహారం కాదు. అన్నింటికన్నా ముఖ్యంగా డాక్టర్లు రిస్కు తీసుకోవడానికి బాగా జంకుతున్నారు. మరీ ఈ మధ్య ఈ కిడ్నీ కేసుల చుట్టూతా గవర్నమెంటు నిఘా  పెరిగిన తరువాత.

'కేసులవుతాయేమోనని భయం. అవన్నీ నేను చూసుకొంటాగాని.. మనీ సంగతిమాత్రం మీరు చూసుకోండి' అని అభయమిచ్చాడు గుర్నాథం.

'ఎంతవుతుందేమిటీ?'  సుబ్బారావు సందేహం.

'సుమారు నాలుగయిదు లక్షలు'

'అమ్మో! గవర్నమెంటు ఉద్యోగినికూడా కాదు. ఎక్కణ్ణుంచి తవ్వి తేవాలీ అంత డబ్బు?' అంటూ సుబ్బారావు గుండెలు బాదుకొన్నాడు. '

'ఇదింకా చీపండీ! లివరయితే ఏడు లక్షలు. హార్టు, లంగ్సు ఆపరేషనయితే అంతకు రెట్టింపు. కంటిగుడ్డుకు వాడే కార్నియానే ఐదు లక్షలు పోస్తేగాని దొరకడంలేదు మార్కెట్లో'

రైతుబజారులో కూరగాయల దరవరల్లాగా ఏకరువు పెడుతున్నాడు గుర్నాథం.

'చూస్తూ చూస్తూ వంట్లోని పార్టుల్ని ఎవరమ్ముకొంటార్రా? ఏదో సినిమాల్లో అలా చూపిస్తుంటారుగానీ' అన్నాను నేను అక్కడికీ నమ్మకం కుదరక.

'పేదరికం ఎంత పనయినా చేయిస్తుంది బాబూ! మెదడు చచ్చిపోయినా గుండె కొట్టుకొంటుంటే చాలు.. ఇలా చాలా అవయవాలని తీసి హాయిగా వాడుకోవచ్చు. ఇవాళా రేపూ ఆ వ్యాపారం బాగా ఊపందుకొందికూడా మిత్రమా! పేపర్లలో వచ్చేవే వార్తలు కావురా బాబూ! వాటికి వెనకాల సమాంతరంగా అంతకుమించిన ప్రపంచం పరుగెడుతోంది' అన్నాడు గుర్నాథం.

'ఎంత అన్యాయం!' గుండెలమీద చెయ్యివేసుకొన్నాడు సుబ్బారావు తబ్బుబ్బయిపోతూ.

'ఇందులో అన్యాయం ప్రసక్తేముంది?అవసరం అలాంటిది. ఇంద్రుడు వజ్రాయుధంకోసం దధీచి పక్కటెముకలు లాగేసుకోలా? కవచకుండాలలనికూడా దానం చేసిన కర్ణుడికథ మనకు కొత్తా? డబ్బు పడేస్తే లివర్లయినా ఫ్లవర్లలో పెట్టి ఇస్తున్నారు సార్ ఈ కాలంలో! గుండెకాయలు బెండకాయల్లా, కంటిగుడ్లు కోడిగుడ్లలా మారకం జరిగిపోతున్నాయి. యూరప్ లాంటి డెవలప్డ్ కంట్రీసులో అయితే ఏకంగా 'యునైటెడ్ నెట్ వర్క్ ఫర్ ఆర్గాన్స్ సేల్' అని భారీ నెట్ వర్కే నడుస్తోంది బ్రహ్మాండంగా’.

'చట్టం చూస్తూ వూరుకొంటుందా?!’

'ఎందుకూరుకొంటుంది సార్? తనపని తాను చేసుకు పోతుంటుంది. నెట్ వర్కూ తనపని తాను చేసుకు పోతుంటుంది. ఇక్కడిలాగానేఒకరి పనిలో ఇంకోరు జోక్యం చేసుకోకుండా డబ్బుమూట చూసుకొంటుంది'

గుర్నాథం చెప్పిందాంట్లో అతిశయోక్తేమీ లేదనే అనిపిస్తోంది. డబ్బుకు చట్టం చుట్టం కానిది ఎక్కడలేండి?! ప్రాణంతీపిముందు ఎన్ని ధర్మపన్నాలైనా చేదుగానే ఉంటాయికదా!

'మీరు ఆలోచించుకొని కబురు చేయండి!.. వస్తా!' అని విజిటింగ్ కార్డొకటి ఇచ్చి కాఫీతాగి వెళ్ళిపోయాడు గుర్నాథం.

 

సుబ్బారావుగారింట్లో రెండు రోజులు ఒహటే మల్లగుల్లాలు. పాపం! సుబ్బారావు గవర్నమెంటు ఉద్యోగైనా కాదు.. కనీసం ఖర్చులైన్నా రాబట్టుకోడానికి. ఇంట్లోని బంగారం, ఊరి బైట అప్పుడెప్పుడో కొనుక్కున్నస్థలం అమ్మైనా సరే .. ఆపరేషన్ చేయించుకోవాల్సిందేనని పట్టుపటుకు కూర్చొంది సుబ్బారావుభార్య. 

గుర్నథాన్ని పిలిపించి పరిస్థితి వివరించాం. ‘ఉన్నంతే ఇవ్వండి. మిగతా సర్దుబాట్లేవన్నా ఉంటే చూసుకోడానికి నేనున్నాగా!’ అంటూ అభయహస్తం ఇచ్చాడు.  

డోనర్ని చూపించమన్నాడు సుబ్బారావు. అన్నంరాజు అనే అతన్ని కలవమని అదేదో అనాథ శరణాలయం చిరునామా ఇచ్చాడు గుర్నాథం.

గుర్నాథం మనుషులమని నమ్మకం కుదిరాక  సగం రేటుకే బేరం కుదురుస్తానని ఉత్సాహం చూపించాడా అన్నంరాజు.

డోనర్ని మాత్రం ఇప్పుడే చూపించకూడదంట! 'లోపాయికారీ వ్యవహారాలు  కదండీ ఇవన్నీ! పదేళ్ళబట్టీ ఈ వ్యాపారంలో ఉన్నాను. నన్ను మీరు నమ్మాలి' అన్నాడు అన్నంరాజు. నమ్మకమాత్రం చేసేదేముంది గనక?

సగం పైకం ముందే గుంజుకొన్నాడు అన్నంరాజు.

'డాక్టరుగారు ఆపరేషన్ డేట్ ఇచ్చిందాకా కిడ్నీకి రెంట్ కడుతుండాలి. నెలకు నాలుగువేలు. డోనరు కిడ్నీని వేరేవారికి అమ్ముకోకుండా ఆపటానికి, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి.. ఆ మాత్రం భరించక తప్పదు. ఆఫ్ట్రాల్ ఆపరేషన్ అయిన తరువాత  ఆ కిడ్నీ మనదే అవుతుంది కదండీ చివరికి?' అని ఆ పెద్దమనిషి లా పాయింటూ!

డాక్టరుగారి డేట్ మూడు నెలలకుగాని దొరకలేదు. అంత బిజీట ఆయన! ఈ మూడు నెలలు క్రమం తప్పకుండా డయాలసిస్ తప్పటంలేదు సుబ్బారావుకి.

 

సుబ్బారావీ మధ్య చిత్రంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. 'ప్రతీ మనిషికి కనీసం నాలుగు కిడ్నీలైనా ఉండాలి. అలాగే ఆరేడు జతల చేతులు, పది జతల కాళ్ళు, నాలుగైదు జోళ్ళ చెవులు, కళ్ళు, రెండు మూడు ముక్కులు, వందనాలికలు, నాలుగయిదు  గుండెలుకూడా ఉంటే బావుంటుంది.' ఇలా సాగుతోంది సుబ్బారావు ధోరణి.

రెండు చేతులుంటేనే మనిషిచేసే ఆగం తట్టుకోలేక పోతోంది లోకం. ఇహ పదులు.. ఇరవైలు మొలుచుకొస్తే జరిగే ఆగడాలని ఊహించగలమా?!

'ఒక్క తలకే  ఇంత లావున తిరుగుతోంది మీకు! పదేసుంటే ఇహ పట్టుకోగలమా తమర్నీ.. తమ తి.క్కనీ! ' అని శాపనార్థాలకు దిగింది సుబ్బారావుగారి శ్రీమతి. భర్త పిచ్చిమాటలు  విని విని పాపం ఎంతగా విసిగిపోయిందో ఆ ఇల్లాలు!

'ఇందులో తిక్కేముందే పిచ్చిదానా! శివుడికి మూడు కళ్ళు లేవూ? విష్ణుమూర్తికి నాలుగు చేతులు, బ్రహ్మదేవుడికి నాలుగు ముఖాలు, రావణాసురుడికి పది తలకాయలు, కార్తవీర్యుడికి వెయ్యి చేతులు, దేవేంద్రుడికి వెయ్యి కళ్ళు!  దేవుళ్లందరికీ అన్నేసి అవయవాలుండగా లేనిది మానవులకు అందులో కనీసం సగమైనా ఉండాలని కోరుకోవడం తిక్కా?!'

ఒక అవయవం పాడైనా మరోటి పనికొస్తుందని కాబోలు సుబ్బారావు ఆశ. 'ఈసారి దేముడు కనబడితేమాత్రం రకానికో జత స్పేరుగా ఇవ్వమని పట్టుబట్టడం ఖాయం' అంటో సుబ్బారావు కన్నీళ్ళు పెట్టుకుంటుంటే మనసంతా దేవినట్లయిపోయింది.

 

ఎలాగైతేనేం.. సుబ్బారావుకి ఆపరేషన్ అయిపోయింది.

మూడో రోజు గుర్నాథం పేరు వార్తాపత్రికల్లో వచ్చింది ప్రముఖంగా ఫొటోలతో సహా. ఏ టీవీ ఛానల్లో చూసినా ఆ రోజంతా ఆ మహానుభావుణ్ణి గురించిన సమాచారమే!

మానవ శరీరావయవావలను అమ్మే వ్యవహారంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని ఓ ప్రముఖ వార్తాపత్రిక వివరాలతోసహా వరుస కథనాలను ప్రచురించడం మొదలుపెట్టింది. ఈ గోల్ మాల్ మొత్తంలో గుర్నాథానిదీ ఓ ప్రధాన పాత్ర!

అరెస్టు చేయడానికని వెళ్ళిన పోలీసులు అతగాడు గుండెనొప్పి వచ్చిందన్నాడని కోర్టు ఆదేశాలమీద నిమ్సు ఆసుపత్రిలో చేర్చి బైట పహరా కాస్తున్నారు.

నేర పరిశోధక బృందం అన్నంరాజు అనాథ శరణాలయంమీద ఆకస్మిక దాడి చేసినప్పుడు బోలెడన్ని అవయవాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నవి బైటపడ్డాయని వార్త! కిడ్నీలు, లివర్లు, కళ్ళు.. వంట్లో అమ్ముకోవడానికి వీలున్న ఏ అవయవాన్నైనా సరే చెట్టుమీదనుంచి కాయలు కోసిచ్చినట్లు కోసిచ్చే ఏర్పాట్లు ఆ అనాథ శరణాలయంలో  జరుగుతున్నాయిట! అందుకు అనుగుణంగా అక్కడ  పెరుగుతున్న అనాథ బాలబాలికలను చూసి  నోరు వెళ్లబెట్టడం నేర పరిశోధక బృందం వంతయిందట!

కూరగాయలే సరిగ్గా దొరకని ఈ కరువురోజుల్లో అంతంత మందని  సేకరించి పెంచడమంటే మాటలా?!

ఆ ముక్కే ఎవరో పనిలేని చానెల్ వాళ్ళడిగితే ఆసుపత్రి శయ్యమీద విలాసంగా శయనించిన గుర్నాథంగారు చిద్విలాసంగా నవ్వి వినయపూర్వకంగా ఇచ్చిన సమాదానం

'అంతా ఆ పై వాడి దయ. ఆపైన సర్కారు పెద్దల సహకారం'

అన్నంరాజు అనాథశరణాలయంలోని పసిపిల్లలు తరుచుగా చనిపోతున్నారన్న విషయం అప్పుడు బైటపడింది! అనుమాన నివృత్తికోసం ముందురోజు పోయిన పిల్లలిద్దరి బాడీలను రీపోస్టుమార్టమ్ చేయిస్తే.. వచ్చిన రిజల్టు ‘షాకింగ్’!

 

బాడీల్లో చాలా పార్టులు మిస్సింగు!

ఉదయంబట్టీ వరసబెట్టి వస్తున్న ఆ వార్తల్ని చూసి చూసి సుబ్బారావు ఇంట్లో కళ్ళు తిరిగి పడిపోయాడు! మళ్లా ఆసుపత్రిలో అడ్మిట్ చేయాల్సొచ్చింది మాకు అర్జంటుగా!

ఎందుకైనా మంచిదని సుబ్బారావుబాడీని ఫుల్ స్కానింగు చేయించాం.  మా అనుమానం నిజమే అయింది. సుబ్బారావు వంట్లోని కిడ్నీలు మాయం!

గుర్నాథం రికమెండ్ చేసిన డాక్టరు  ఆపరేషన్ చేసింది- సుబ్బారావు కిడ్నీజబ్బు మాయం చేయడానికి కాదు. మంచి కిడ్నీని మాయం చేయడానికని ఆలస్యంగా తెలిసింది!

కిడ్నీధర కనీసం నాలుగయిదు లక్షలకు తక్కువ  పలికని రోజుల్లో .. నాలుగో వంతుకే ఆపరేషన్ చేయిస్తానని గుర్నాథం ఆఫరిచ్చినప్పుడే  అన్నిరకాలుగా ఆలోచించుకొని ఉండాల్సింది మేం!

'ఎలాగూ పోయే శాల్తీనేగదా అని ఆయన మంచి కిడ్నీని మా ఆపరేషన్ ఖర్చులకింద రాబట్టుకొన్నాం.. వ్యాపార ధర్మంగా! అదీ తప్పే?!' అంటూ బుకాయింపులకి దిగాడు బైలునుంచి  L బైటికొచ్చిన పిదప అతికష్టంమీద సెల్లో దొరికినప్పుడు గుర్నాథం!


( సూర్య  -దిన పత్రిక ప్రచురణ ) 

***

-కర్లపాలెం హనుమంతరావు

14 మార్చి 2021 

బోథెల్ ; యూ ఎస్ ఎ 





Monday, February 15, 2021

ధర్మ నిర్ణయం - కథానిక - కర్లపాలెం హనుమంతరావు

 


ధర్మనిర్ణయం- కథానిక 

- కర్లపాలెం హనుమంతరావు 


 

బ్యాంకుడ్యూటీనుంచి ఇంటికి వస్తూ వసూ రామకృష్ణాపురం ఓవర్ బ్రిడ్జిమీద వెనకనుంచీ వస్తున్న ఇసుకలారీ గుద్ది బైకుమీదనుండి పడిపోయాడు గోవిందరావు.

ఆ సమయంలో చీకటి. వర్షంకూడా జోరుగా పడుతోంది. రాత్రి ఎనిమిది గంటలు దాటితే సాధారణంగా ఆ బ్రిడ్జిమీద జనసంచారం కనిపించదు అంతగా.

దాదాపు రెండు మూడు గంటలు అపస్మారక స్థితిలో పడివున్నాడు గోవిందరావు.

ఎవరో గమనించి అతని దగ్గర ఉన్న సెల్ఫోనులోనుంచి ఇంటివాళ్ళకు ఇన్ఫర్మేషన్ అందించారు. ఆయన్ను దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించేసరికి అర్థరాత్రి దాటిపోయింది. 

మెడికో లీగల్ కేసు కనక ముందు పోలీసు రిపోర్టు అవసరం. ఆ తతంగమంతా పూర్తయి చికిత్స ఆరంభమయే వేళకి తెలిసింది.. పేషెంటు కోమాలోకి వెళ్ళిపోయాడని!

గోవిందరావు కొడుకు శరత్ గ్రూప్ త్రీ సర్వీస్ కమీషన్  ఇంటర్వ్యూలకని ఢిల్లీ వెళ్ళివున్నాడా సమయంలో. ఇంటార్వ్యూ ముగించుకొని ఇంటికి ఎలా వచ్చిపడ్డాడో తెలిదు.. ఇల్లంతా శోకసముద్రంలో మునిగివుంది.

'లాభంలేదు.. ఇంటికి తీసుకువెళ్లమంటున్నార్రా డాక్టర్లు! ఏం చేద్దాం?' అనడిగాడు గోపాలరావు. ఆయన శరత్ కి బాబాయి. అన్నగారు చేసే బ్యాంకులోనే లీగల్ ఆడ్వైజరుగా ఉన్నాడు. 

'నాన్న ఉన్నది కోమాలో కదా! ఎంత డబ్బు ఖర్చైనా సరే బతికించుకుంటాం బాబాయ్' అన్నాడు పళ్లబిగువున పొంగుకొచ్చే దుఃఖాన్ని ఆపుకొంటూ శరత్. 

'విషయం ఖర్చును గురించి కాదురా!..' ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు గోపాలరావుకి. 

'మరి?'

'శరత్ ని ఆసుపత్రి బయటవున్న కేంటిన్ కి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి విపులంగా చెప్పే ప్రయత్నం చేసాడు గోపాలరావు. 'నాన్న కోమాలో ఉన్న మాట నిజమేకానీ.. డాక్టరులు చెబుతున్నదాన్నిబట్టి ఇంక హోప్స్ లేవురా!.. మనకింకో రెండు మూడు లక్షలు ఖర్చవడం తప్ప! ఇలా అంటున్నందుకు నాకూ బాధగానే ఉందిగానీ.. కొన్ని కొన్నిసార్లు వాస్తవాన్ని డైజస్టు చేసుకోక తప్పదు' 

'వాస్తవమేంటి బాబాయ్! నాన్న సజీవంగానే ఉన్నాడు. డబ్బుకోసం చూసుకొనే సమయం కాదిది. అమ్మకు తెలిస్తె చాలా బాధ పడుతుంది. పదండి.. వెళదాం!' అని లేచాడు శరత్.

బలవంతంగా శరత్ ని కూర్చోబెట్టాడు గోపాలరావు. 'అమ్మలాగా నువ్వూ ఎమోషనల్ గా ఆలోచిస్తే ఎలారా! ప్రాక్టికాలిటీ కావాలి. ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో!' 

'బతికున్న మనిషిని డబ్బుఖర్చు చూసుకొని ఆసుపత్రినుంచి డిశ్చార్చ్ చేయించుకొని పోవడమేనా ప్రాక్టికాలిటీ అంటే!' 

శరత్ గొంతులోని వెటకారాన్ని అర్థం చేసుకోలేనంత అమాయకుడేమీ కాదు గోపాలరావు. 'చిన్నపిల్లాడు. జీవితమంటే ఏంటో అనుభవం లేనివాడు. తండ్రి అంటే విపరీతమైన ప్రేమాభిమానాలున్న ఏ కొడుకైనా అలాగే ఆలోచిస్తాడు. అన్నీ తెలిసిన తనే ఎలాగో నచ్చచెప్పి అన్నయ్యకుటుంబాన్ని ఈ కష్టంనుంచి గట్టెక్కించాలి' అనుకొన్నాడు గోపాలరావు.

'మీ నాన్న తరువాత నాన్నంత వాణ్ని. ముందు నేను చెప్పేది ప్రశాంతంగా వినరా!'అన్నాడాయన.

'తొందరగా చెప్పు బాబాయ్! అమ్మెందుకో కాల్ చేస్తోంది' అంటూ రింగ్ టోన్ కట్ చేసి అసహనంగా కూర్చున్నాడు శరత్.

గోపాలరావు చెప్పాడు' మీ నాన్న రిటైర్మెంటు ఇంకో వారంలో ఉంది. కంపాషియేనెట్ గ్రౌండ్సుమీద బ్యాంకునుంచి బెనిఫిట్స్ రావాలంటే రూల్సు ప్రకారం ఎంప్లాయీ రిటైర్మెంటునాటికి  సజీవుడై ఉండకూడదు'

'డెత్ బెనిఫిట్స్  అంటే మనీనా? ఆ ముష్తి రెండు మూడు లక్షలకోసం జన్మనిచ్చిన తండ్రిని బతికుండగానే చంపేయడం నావల్ల కాదుగానీ.. పద బాబాయ్.. ఇక వెళదాం!.. డాక్టర్లతోకూడా మాట్లాడాల్సిన పని చాలా ఉంది' 

లేవబోయిన శరత్ ని బలవంతంగా లాగి కూర్చోబెట్టి అన్నాడు గోపాలరావు 'సాంతం వినిపోరా! బెనిఫిట్స్ అంటే నాటోన్లీ మనీ.. ఎంప్లాయిమెంటుకూడా! మీ నాన్న సర్వీసులో ఉన్నప్పుడే పోయాడని డాక్టర్లు సర్టిఫై చేస్తేనేగానీ మీ ఇంట్లో ఒకళ్లకి ఉద్యోగం రాదు. ఇది నీ ఒక్కడికే సంబంధించిన విషయం కాదు. చెల్లాయి పెళ్ళి చెయ్యాల్సి ఉంది. మీ నాన్న చేసిన అప్పులున్నాయి!'

గోవిందరావు ఇంటిపరిస్థితులు గోపాలరావుకు తెలియనివి కావు. నీతికి, నిజాయితీకి నిలబడే అధికారిగా మంచిపేరైతే ఉందిగానీ.. కుటుంబాన్ని ఆర్థికంగా పరిపుష్టం చేయడంలో అన్నగారు విఫలమయ్యారనే ఒప్పుకోవాలి. శరత్ కి బాగా చదువు అబ్బినా విదేశాలకు పంపించి ఊడిగం చేయించడానికి ఇష్టపడలేదు. కొడుకుచేత ఇక్కడే ఎమ్మెస్సీ చేయించాడు. కూతురు పెళ్ళి ఇంకా వరాన్వేషణ దశలోనే ఉంది.

అయినా బిడ్డలకు ఆయనంటే వల్లమాలిన ప్రేమ. తండ్రి బతికుండగానే 'నీ వల్ల నాకేంటి ప్రయోజనం? వ్యాపారం చేసుకోవాలి.. పెట్టుబడి తెచ్చివ్వు! నీ ఉద్యోగం నాకిప్పించేసి నువు విశ్రాంతి తీసుకో!' అనే సంతానం అంతకంతకూ అధికమవుతున్న ఈ కాలంలో ఇలాంటి బిడ్డల్ని కలిగివుండటంకూడా అదృష్టమే!'శరత్ ను మనసులోనే అయినా  అభినందించకుండా ఉండలేకపోయాడు గోపాలరావు. 

'ఈ విషయాన్ని ఎలాగూ తల్లితో, చెల్లితో సంప్రదించడు వీడు! పోనీ తనే నేరుగా ఒకసారి వదినతో మాట్లాడితేనో!' అనిపించింది గోపాలరావుకి.

***

గోవిందరావుకి ఇంకో ఆపరేషన్ అవసరమన్నారు ఆసుపత్రి వైద్యులు. ఫస్టు ఆపరేషను వల్ల ఫర్దర్ డేమేజీ కంట్రోలయింది. ఈ ఆపరేషను సక్సెస్ అయితేనే పేషెంటు తొందరగా రికవరయే అవకాశం ఉంది. వికటిస్తేమాత్రం ప్రాణానికి ముప్పు. రిస్క్ ఫ్యాక్టరుమాతం కాస్త ఎక్కువే! ఈ విషయం దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోండి! బట్.. మేటర్ అర్జంట్! 'ఓకే' అనుకొంటే మాత్రం ఒక హాఫ్ ఇన్స్టాల్మెంటుకింద రెండు లక్షలు కౌంటర్లో కట్టేయండి' అంటూ పెద్ద ఫార్మాలిటీస్ లిస్టే చదివాడు ఆసుపత్రి సూపరింటెండు శరత్ ని పిలిచి కూర్చోబెట్టుకొని.

తల్లితో, చెల్లితో సంప్రదించి బాబాయిచేత రెండులక్షలు కౌంటర్లో కట్టిస్తున్నప్పుడు మాత్రం శరత్ కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి. 

'కూలి పనయినా చేసి నీ సొమ్ము అణాపైసలతో సహా చెల్లిస్తాను బాబాయ్!' అని తన రెండు చేతులూ పట్టుకొన్న అన్నకొడుకుతో అన్నాడు గోపాలరావు 'ఆ కూలీపని చేసే ఖర్మనీకు పట్టకూడదనే అంతగా నీకు చెప్పుకొచ్చింది. ఇప్పుడైనా చెప్పు! మరోసారి ఆలోచించుకొన్న తరువాతే డబ్బు కడదాం!'

'ఈ నిర్ణయం నాదొక్కడిదే కాదు బాబాయ్! అమ్మకూ, చెల్లాయిక్కూడా నాన్నను మళ్లీ మామూలు మనిషిగా చూడాలని ఉంది' అని శరత్ అన్న తరువాత గోపాలరావు మౌనంగా సొమ్ము చెల్లించేసాడు.

ఆ సాయంత్రమే ఆపరేషన్ అయిపోయింది. రాత్రంతా కండిషన్ బాగానే ఉందన్నారు డాక్టర్లు. తెల్లారుఝామునుంచి కంగారు పడటం మొదలుపెట్టారు. 

సోర్యోదయానికన్నా ముందే గోవిందరావు అస్తమించాడు. ఏడుపులు.. పెడబొబ్బలు.. అయినవాళ్ళొచ్చి పరామర్శించడాలు.. చివరిచూపులకని ఎక్కడెక్కడివాళ్లో తరలివచ్చారు. ఫార్మాలిటిసన్నీ యథావిధిగా జరిగిపోయాయి. శరత్ తండ్రి చితికి కొరివిపెట్టాడు.

కొత్తసంవత్సరం ప్రపంచమంతా వేడుక జరుపుకొంటుంటే.. గోవిందరావు లేని లోటును  జీర్ణించుకొంటూ విషాదంగా గడిపింది శరత్ కుటుంబం.

శిశిరం శాశ్వతం కాదు. వసంతం మళ్ళీ రాక మానదు. ప్రకృతి చెప్పే పాఠం ఇదే!

మళ్లీ ఏడాది గడిచేసరికల్లా ఆ ఇంట్లో మరో బుల్లి గోవిందు కేరింతలు వినిపించాయి. తండ్రిపోయిన ఆర్నెల్లలోపే కూతురికి పెళ్ళి జరిపిస్తే ఆ కన్యాదానఫలం తండ్రికె దక్కుతుందని- శరత్ పంతంకొద్దీ చెల్లికి మంచిసంబంధం చూసి కళ్యాణం జరిపించాడు.

శరత్ కి తండ్రి చేసే బ్యాంకులోనే ఉద్యోగం వచ్చింది కంపాషియనేట్ గ్రౌండ్సుమీద. గోవిందరావు యాక్సిడెంట్ సందర్భంలో అయిన ఖర్చంతా బ్యాంకే భరించింది రూలు ప్రకారం. 

గోవిందరావు- రిటైర్మెంటుకి సరిగ్గా ఇరవైనాలుగ్గంటలముందు ఆసుపత్రిలో చేసినా ఆ రెండో ఆపరేషన్ విఫలమై చనిపోవడంవల్లే ఇవన్నీ సంభవమయాయి!

ఆసుపత్రి సూపరింటెండెంటుగారి సహకారంలేనిదే ఇవన్నీ సాధ్యమయేవి కాదు. గోవిందరావు చొరవవల్లె బ్యాంకునుంచి లభించిన రుణం సాయంతో చిన్న ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయికి పెంచగలిగాడు సూపరింటెండెంటు. గోవిందరావు ఇంటి పరిస్థితి వివరించి ఆ కుటుంబాన్ని ఆదుకొమ్మని ప్రాఢేయపడింది మాత్రం గోపాలరావే!

డెసెంబరు ముప్పైఒకటో తారీఖునే అంత అర్జంటుగా అవసరం లేకపోయినా.. ఉన్నట్లు కలరిచ్చి రెండో ఆపరేషను చేయాలని నిర్ణయించడం వెనకున్న అంతరార్థం ఇప్పటికీ శరత్ కుటుంబానికి తెలీదు.

***

'ఇంతకాలం మీరు తోటివైద్యులందరికీ నిత్యం బోధించే మెడికల్ ఎథిక్సన్నీ ఇలా గాలికి వదిలేయడం న్యాయమేనా?' అని అడిగింది సూపరింటెండెంటుగారి భార్యామణి భర్తద్వారా ఇంట్లో అసలు విన్నతరువాత.

''నేను ఎథిక్సుని ఎప్పుడూ జవదాటను. ఇప్పుడూ జవదాటలేదు  మైడియర్ శ్రీమతిగారూ! మైండిట్.. ప్లీజ్! ఒక పేషెంట్ అన్ని రోజులు కోమాలో ప్రోగ్రెస్ లేకుండా పడివున్నాడంటేనే మెడికల్ భాషలో 'క్లినికల్లీ డెడ్'.  రిటైర్మెంటుకి ముందే గోవిందరావుగారి మరణాన్ని ధ్రువీకరించడంవల్ల ఏజ్ బార్ కి దగ్గరగా ఉన్న అతని కొడుక్కి బ్యాంకు ఉద్యోగం వచ్చింది. ఎన్నో ఆర్థికపరమైన చిక్కుల్నుంచి ఆ కుటుంబం బైటపడింది. నేనా రోజున లోనుకోసం బ్యాంకుకి వెళ్ళినప్పుడు ఈ గోపాలరావుగారు ఏమన్నాడో తెలుసా! 'ఏ వృత్తికైనా ఎథిక్సుంటాయండీ! ఎథిక్సంటే రూళ్లకర్రపట్టుకొని చండశాసనం చేసి నిజాయితీపరుడనిపించుకోవడం ఒక్కటేనా? మేథస్సిచ్చిన వివేకాన్ని  ఉపయోగించి నిజమైన అర్హులను ప్రోత్సహించడంకూడా  కదా! అఫ్ కోర్సు  ఆయనే అన్నట్లు అది అన్నంపెట్టే తల్లిలాంటి సంస్థకి కన్నంపెట్టి చేసే ఘనకార్యంమాత్రం కాకుడదనుకో! నాలాంటి ఎంతోమందికి కొత్తజీవితాలను ప్రసాదించిన ఆ మంచిమనిషికి ఎవరికీ నష్టం, కష్టం కలగకుండా ఇలా సాయంచేయడంలో ఎథిక్సును ఎక్కడ అతిక్రమించినట్లు! మరో ముఖ్యమైన విషయం చెప్పనా! అసలీ ఆలోచన చేసిందే ఆ గోవిందరావుగారి తమ్ముడు గోపాలరావుగారు. వృత్తిపరమైన ఎథిక్సుకి ఆయన పెట్టింది పేరు 'అన్నాడు ఆసుపత్రి సూపరింటెండుగారు. 

***

-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్;  యూఎస్ఎ 

(స్వప్న కథలపోటీలో 'శ్రీమతి గొర్రెల అప్పాయమ్మ పురస్కారం పొందిన కథ- జూన్ 2012 సంచికలో ప్రచురితం)

 

 


Monday, August 31, 2020

ఖర్చు తక్కువ వైద్యం. పిలవగానే పలికే వైద్యుడు - ప్రకృతి -కర్లపాలెం హనుమంతరావు






ప్రకృతితో ఒక్కోరికి ఒక్కోరకమైన అక్కర. కవి, గాయకుడు ప్రకృతిని చూసి స్పందించే మంచి కవిత్వం, గానం ప్రసాదించేది.  ఆ మధ్య చైనీస్ యువకులు కొంత మంది ప్రకృతిలో దొరికే గుమ్మడి, బీర, దోస వంటి కూరగాయలను సంగీత పరికరాలుగా ఎలా ఉపయోగించవచ్చో ఒక యూ ట్యూబ్ వీడియోలో చూపించి అందరిని అవాక్కయేటట్లు చేసారు. నిజానికి ప్రకృతిలో దొరికే కాయగూరలు, దుంపలు, పండ్లు ఫలాలు సౌందర్య పోషణకు ఉపయోగించుకునే తెలివితేటలు పెంచుకుంటున్న మహిళామణులు వాటి అవసరం ముందు తిండి తిప్పలకు, మందుమాకులకు ఎంత వరకు ముఖ్యమో తెలుసుకుంటున్నారా?
మందుల దుకాణాలలో  ఔషధాలకు కొదవ ఉండదు, నిజమే కాని, అన్ని రకాల మందులు అందరు వాడటం అంత క్షేమం కాదు. కొన్ని సార్లు వికటించే ప్రమాదం కద్దు. ఏవి హాని చెయ్యనివో తెలుసుకోవడానికి మళ్ళీ  ఏ అలోపతి వైద్యుడి దగ్గరకో పరుగులెత్తాలి. వేళకు అన్ని చోట్లా డాక్టర్లు అందుబాటులో ఉండే దేశమా మనది? భారతదేశం వరకు అందరికీ అందుబాటులో ఉండే వైద్యుడు ప్రకృతి నారాయణుడు. ఆ వైద్యనారాయణుడి థెరపీని నమ్ముకుంటేనే  మన ప్రాణాలకు తెరిపి.
ఉదాహరణకు, గోళ్ల కింద గాయమయిందనుకోండి. ఒక్కో సందర్భంలో కొనుక్కొచ్చుకున్న మందు గోరు చివుళ్ల సందున సరిగ్గా అమరదు. వాడినట్లే ఉంటుంది కాని, ఫలితం కనిపించదు. కనిపించినా దాని ప్రభావం నెమ్మది మీద గాని తెలిసే అవకాశం లేదు. అదే వంటింట్లోనే కూరగాయల బుట్టలో ఏ వేళకైనా దొరికే బంగాళా దుంపను ముక్కలుగా కోసి ఒక ముక్కతో ఆ గాయమయిన భాగం కవర్ అయే విధంగా కట్టుకట్టుకుంటే సరి. మూడు రోజులు వరసగా ఉదయాన్నే పాత ముక్క స్థానంలో కొత్త ముక్కను పెట్టి కట్టుకుంటే నాలుగో రోజున అక్కడ గాయమైన ఛాయలు కూడా కనిపించవు.  చర్మం పైన పొక్కులు, బొబ్బలు కనిపిస్తే బంగాళా దుంపల ముక్కలతో గట్టిగా రుద్దితే వెంటనే మంచి గుణం కనిపిస్తుంది.  అలాగే బంగాళా దుంపను ఉడకబెట్టిన నీరు షాంపూ కండిషనర్ కన్నా మంచి ప్రభావం చూపిస్తుంది. రెగ్యులర్ షాంపూతో తల శుభ్రం చేసుకున్న తరువాత ఆరబోసిన వెంట్రుకలను ఉడికిన బంగాళా దుంపల నీళ్లతో కడిగి ఆరబెట్టుకుంటే ఆ శిరోజాల మెరుపు సహజంగా ఉందటమే కాదు, జుత్తుకు భవిష్యత్తులో హాని కూడా కలగదు. బూడిద రంగుకు తిరుగుతున్న జుత్తును దారిలోకి తేవాలన్నా ఈ బంగాళాదుంపల ద్రవంతో కడిగే అలవాటు క్రమం తప్పకుండా చేస్తే సరిపోతుంది. కాణీ ఖర్చు లేని వైద్యం. పిలవగానే పలికే వైద్యుడు ప్రకృతి.
బంగాళా దుంపలు కళ్ల ఉబ్బును తగ్గిస్తాయి. తడిగా ఉన్న భాగం వేపుని కొద్దిసేపు కళ్ల కింద పెట్టుకుని, ఆ తరువాత రుద్దుకుంటే  ముడతలు బిగిసుకుంటాయి. క్రమం తప్పకుండా చేసేవారికి కళ్ల కింద ఉబ్బు బాధ నుంచి విముక్తి కలుగుతుంది. మో చేతుల కింద అదే పనిగా వత్తిడి  ఉన్నవాళ్లకు ఆ ప్రదేశంలో నల్లటి మరకలు నిలబడిపోతాయి, వాటి మీద  క్రమ తప్పకుండా బంగాళాదుంప ముక్కలను రుద్దుతుంటే మరకలు తొలగిపోతాయి.
బంగాళాదుంపలకు చర్మానికి భలే లింకు. దుంపలు కడిగిన నీళ్లలో నిమ్మ రసం పిండుకుని దానితో మొహం శుభ్రం చేసుకోవడం అలవాటుగా ఉన్నవాళ్ల మొహంలో ఆ కళే వేరు. వదనం  సమ్మోహనంగా మారుతుందిఎండపొడికి చర్మం కమిలిన  చోట బంగాళా దుంపల తడి చెక్కలు ఉంచితే చర్మం అతి తొందరలో తిరిగి సహజ స్థితికి  వచ్చేస్తుంది. ఉడికించిన బంగాళా దుంపల ముద్దలో వేళ్లతో ఎత్తిపెట్టిన పెరుగు రవ్వంత కలిపి ఆ పేస్టును మొహానికి పట్టించుకోవడం అలవాటు చేసుకుంటే మొగం ఎప్పుడూ మంచి  నిగారింపుతో కళకళలాడుతుంది. బంగాళా దుంపల పేస్టుకు దోసకాయ పేస్టు, సోడావుప్పు కలిపి ఆ పేస్టుతో  మొహం శుభ్రం చేసుకునే అలవాటు ఉన్నవారికి వయసు పైబడిన తరువాత  చర్మం మీద ఏర్పడే ముడతలు వెనకడుగు పడతాయి.
పిల్లలు తిరుగుతున్న ఇంటిలో గోడలకో, గడపలకో పెయింటింగు వేయించాల్సిన అవసరం వస్తుంటుంది ఒక్కోసారి. పెయింట్లలో వాడే పదార్థాలకు తోడు, వార్నిష్ నుంచి వచ్చె గాలి ఇంటి వాతావరణంలోఒక రకమైన ఘాటుతనం పెంచి, ఒక్కోసారి వాంతులు అయేంత వరకు పరిస్థితి వికటిస్తుంది. పసిపిల్లలను, ముసలివాళ్లను ఎక్కువగా బాధించే ఈ కాలుష్య సమస్యకు ఉపాయం, పెయింట్ చేసే స్థలంలో సగం తరిగిన ఉల్లి ముక్కలు ఉంచితే ఆ ఘాటుకు ఈ ఘాటు సరితూగి కాలుష్య ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. ఉల్లిపాయలో గంధకం ఉంటుంది. ఆ ధాతువు విషానికి విరుగుడుగా పనిచేస్తుంది. చెవికి సంబంధించిన వ్యాధులకు ఉల్లిపాయ బ్రహ్మౌషధం. చెవిపోటు వచ్చిన సందర్భాలలో చెవి దగ్గర ఉల్లిపాయ ముక్క ఉంచి కట్టు కట్టి రోజంతా వదిలేస్తే కర్ణభేరిలోని కాలుష్యకారకాలు నశించి బాధ నుంచి ఉపశమనం తప్పక కలుగుతుంది.  
పాదాలపైన గాయాలు, వ్రణాలు అయినప్పుడు తేనెను మందులా ఉపయోగించాలి. గాయమైన చోట తేనె రాస్తూ ఉంటే కొత్త కణాలు తొందరగా పుట్టుకొచ్చి గాయం పూడే సమయం తగ్గిపోతుంది.  తేనెకు సూక్ష్మక్రిములను నాశనం చేసే గుణం ఉంది.
వంటి దురదలకు యవలు మంచి మందు. యవల జావను ఒక గుడ్డలో కట్టి  నీటిలో ముంచి ఆ తడి మూటను దురద పుట్టిన చోట రుద్దుతూ పోతే బాధ  క్రమంగా తగ్గిపోతుంది. మశూశికం పోసినప్పుడు చర్మం మీద పొక్కులు లేచి దురద పుట్టిస్తాయి. వాటిని గోకినందువల్ల చుట్టు పక్కలకు ఆ దురద క్రిములు మరంతగా విస్తరించే అవకాశమే ఎక్కువ. ఈ తరహా సందర్భాలలో యవల జావ వైద్యం అపకారం చేయనై ఉత్తమ ఉపశమనం.
తాజా నిమ్మరసం వాసనచూడడం వల్ల, మద్యం అతిగా తాగిన హాంగోవర్ బాధ నుంచి ఉపశమనం సాధ్యమే. నిమ్మ, ద్రాక్ష, నారింజ, తొక్కలను మూడు నాలుగు రోజుల పాటు ఎండకు పెట్టి ఆనక నిల్వచేసుకుంటే సబ్బులాగా వాటిని వాడుకోవచ్చు. బొప్పాయి తొక్కల గుజ్జును అరికాళ్ల కింద రాసుకుంటే అందులో ఉండే రసాయనాల ప్రభావం వల్ల అక్కడ ఉండే మృత చర్మకణాలన్నీ తొలగిపోయి పాదాలు పరిశుభంగా కనిపిస్తాయి. అరటి తొక్కల గుజ్జు భాగం వైపు పంధదార జల్లి స్నానం చేసే ముందు వంటికి పట్టిస్తే చర్మం మీద చేరిన మకిలంతా తొలగి స్నానానంతరం శరీరం నిగనిగలాడుతుంది
ఇండియాలో కూడా ఇప్పుడు దొరుకుతున్నాయనుకుంటా మన బేరీ పండ్లను పోలి ఉష్ణమండలాలలో పెరిగే ఒక రకమైన కాయ అవకాడో! దానితో ఎండలో తిరిగి వచ్చిన తరువాత ముఖం రుద్దుకుంటే మొహం చల్లగా హాయిగా ఉండి శరీర ఉష్టోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. పనసపండులోని రసాయనాలు మనిషి శరీరం మీది మృతకణాలను తొలగించడానికి బాగా ఉపయోగిస్తాయి
స్ట్రా బెర్రీ పళ్లు దంతాలను ధవళ కాంతితో  ధగధలాడించే ఇంద్ర్రజాలం ప్రదర్శిస్తాయి. వడదెబ్బకు పుచ్చకాయలు మంచి ఔషధం. చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడంలోనూ పుచ్చకాయల పాత్ర అమోఘమైనది.
ప్రకృతిలో లభ్యమయ్యే వస్తువుల నుంచి లాభం పొందే కళ అభివృద్ధి చేసుకోబట్టే మనిషి మిగతా జీవజాతులతో పరిణామదశ పోటీలో ముందున్నది.  ప్రాణమిచ్చి, ఆ ప్రాణం నిలబెట్టే ప్రకృతిని ప్రాణప్రదంగా చూసుకోవాలే తప్పించి, ప్రకృతి వైద్యుడి ఉనికికే చేటు తెచ్చే విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆ కష్టనష్టాలు చివరికి మనుషులుగా మనకు మనమే కొని తెచ్చుకున్నట్లే అవుతుంది!
-కర్లపాలెం హనుమంతరావు
31 -08 -2020

Friday, August 14, 2020

రష్యా ‘కరోనా-దాని టీకా- తాత్పర్యం’ -కర్లపాలెం హనుమంతరావు - సూర్య దినపత్రిక ప్రచురణ




కరోనావైరస్ వ్యాక్సిన్‌ రష్యా ఆమోదం పొందినట్లు వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం ప్రకటించారు.
తొలిదశల్లో జరిగిన పరీక్షల సమాచారం ఏమీ లేకుండానే పెద్దెత్తున చివరిది, కీలకమయినది అయిన మూడో దశను రెండో దశతో కలిపి వేసి మెక్సికో, సౌదీ, అరబ్ ఎమిరేట్స్, బ్రెజిల్ దేశాల సహకారంతో సుమారు 2000 మంది ఆరోగ్య వాలంటీర్ల మీద బుధవారం నుంచి  పరీక్షలు ప్రారంభించబోతున్నట్లూ, సమాంతరంగా వాక్సిన్ ‘స్ఫుత్నిక్ -వి’ ని సామాన్య ప్రజల ప్రయోజనార్థం వ్యాపార ఫక్కీలో ఉత్పత్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అదే సమావేశంలో ఆరోగ్యశాఖ అమాత్యులు అధికారిక ప్రకటన సైతం చేసేసారు! యావత్ ప్రపంచం  నివ్వెరపోయే ఈ హఠాత్పరిమాణాన్ని ఏ  కోణంలో మనం పరిశీలించాలన్నదే ప్రస్తుతం ప్రపంచమంతటా నడుస్తున్న పెద్ద చర్చ!
నమ్మదగ్గ ఆధారాలేవీ ప్రపంచం ముందు  ప్రదర్శనకు పెట్టకుండా రష్యన్లు తీసుకునే ఈ  దుందుడుకు చర్యను దుస్సాహంగా గర్హిస్తున్న మేధావుల శాతమే ఎక్కుగా ఉంది ప్రస్తుతానికైతే.  జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తాలూకు ఇన్స్టిట్యూట్ ఫర్ వ్యాక్సిన్ సేఫ్టీ డైరెక్టర్ డేనియల్ సాల్మన్ ఆందోళనే ఇందుకు ఉదాహరణ,  ఆయన వాదన ప్రకారం 3వ దశ ప్రయోగాలలోనే  టీకా ప్రయోగాలలోని  పని తీరు తేటతెల్లమయ్యేది. టీకా తీసుకున్న సాధారణ ఆరోగ్యకరమైన వ్యక్తికి ఏ రకమైన  హానీ కలగదని నికరంగా తేలేదీ ఈ తుది అంచలోనే.  మొదటి ఒకటి, రెండు అంచల ప్రయోగాల కన్నా భిన్నమైన పద్ధతిలో సాగే ఈ దశ ప్రయోగాలలో లక్షలాది మంద ఆరోగ్యవంతులు భాగస్వాములు అవుతారు.  ఈ టీకా కారణంగా దుష్ప్రభావాలు సాధారణ స్థాయికి మించకుండా వెల్లడయినట్లు తేలితే చాలు.. వాక్సిన్ భ్రద్రతా ప్రమాణల విషయమై  భరోసా దక్కినట్లే!  ఆ తరహా పరీక్షలు ఏవీ జరిపే అవకాశం లేని రష్యా ఇంత హఠాత్తుగా కరోనా వైరస్ పని పట్టే టీకాను ఏ విధంగా ఉత్పత్తి చేయబోతున్నట్లన్నదే ప్రస్తుతం పెద్ద మిస్టరీ!
టీకాల పరీక్షలకు  సంబంధించి గత శతాబ్దం నుంచే  పరిశోధకులు చాలా శక్తివంతమైన  మార్గాలను అభివృద్ధి చేస్తున్నారు.  కొత్త టీకా ప్రయోగించిన సందర్భంలో ఎదురయ్యే క్లిష్టమైన  పరిస్థితులను అధిగమించేందుకు సంబంధించిన నైపుణ్యాలెన్నో శాస్త్రీయ విధానంలో ఆవిష్కరించబడిన నేపథ్యంలో రోగ నిదాన విధానం మీద కన్నా, రోగ నిరోధ విధానలకే ప్రాధాన్యత పెరుగుతున్నది. అయితే  పరిశోధన, ప్రయోగం, ప్రయోజనాల విషయంగా టీకాల పట్ల ఔషధాలకు మించి ఎక్కువ అప్రమత్తత అవసరమన్నది వైద్యరంగం హెచ్చరిక.
అసంఖ్యాకంగా ప్రయోగాలకు గురయ్యే జనసందోహం మీద ఆయా టీకాల ప్రభావం ఏ విధంగా ఉంటుందో నికరంగా తేల్చేందుకు నిర్దిష్ట కాలపరిమితి కుదరదు. కనుక ఉత్పత్తి చేసి ప్రయోగించే దశల్లోనే టీకా సామర్థ్యం కచ్చితంగా నిగ్గు తేల్చుకోవాలి. రష్యా గత్తరగా తయారు చేస్తున్న’ప్రస్తుత ‘స్ఫుత్నిక్ -వి‘ వాక్సిన్ విషయమై ఈ అప్రమత్తత ఏ మేరకు పాటింపబడిందో సమాచారం లేదు! 

ఎలుకలు, కోతులు వంటి జంతువుల పై చేసే ప్రయోగాలు ఫలించాలి ముందు. ఆ  తరువాతే మొదటి దశ ప్రయోగంగా మనుషల మీద ఆయా టీకాల ప్రభావం పరిశీలించాలి. రోగి శరీరంలో వచ్చే క్రమాగతమైన మార్పుల సూక్ష్మాతి సూక్ష్మ పరిశీలనకు కొన్ని రోజులు, వారాలు, చాలా సందర్భాలలో నెలల వ్యవధానం కూడా అవసరమయే నేపథ్యంలో రష్యా వైద్యపరిశోధకులు ఎప్పుడు ప్రారంభించి ఎప్పుడు సత్ఫలితాలు రాబట్టినట్లో? ఆ సమాచారం పంపకాలలో అంత గుప్తత ఎందుకన్నదే మరో సందేహం! కాలక్రమేణా వాటంతటవే సర్దుకునే  మామూలు రుగ్మతలకు మించి మరే పెద్ద ఇబ్బందులు కలగలేదని నిగ్గుతేలేందుకైనా పరిశోధకుల దగ్గర తగిన సమయం ఉండాలి కదా! రెండు, మూడు దశల ప్రయోగాలు రష్యన్లు ఇప్పుడు జమిలిగా నిర్వహిస్తామంటున్నారు! ప్రయోగాల శాస్త్రబద్ధత ప్రశ్నార్థకం కాకుండా ఉంటుందా? 
కరోనా వైరస్ వాక్సినేషన్ వరకు రష్యన్ల ప్రయోగాల టైమ్ -లైన్ పసిపిల్లవాడి పరిశీలనకు ఇచ్చినా సందేహించక మానడు. ప్రపంచ వ్యాప్తంగా చూసినా కరోనా వైరస్ నిరోధం కోసంగానూ ప్రత్యేక ఔషధాల అగత్యం మార్చి నెలలో గాని ప్రపంచానికి తట్టింది కాదు.   ప్రస్తుతానికి ప్రపంచ వ్యాప్తంగా నడుస్తున్న ప్రయోగాలు సుమారు 29 వరకు అంటున్నా అందులో రష్యన్ల ఊసు ఎక్కడా కనిపించదు.  మరి కొన్ని తొందర్లో ప్రారంభించే అవకాశముందంటున్నారు. కానీ .. రష్యా వైద్య రంగం అప్పుడే అన్నీ ముగించుకుని ఉత్పత్తి రంగం  వైపూ దృష్టిసారించేసింది!   ఆస్ట్రాజెనెక్స్, మోడెర్నా, నోవావాక్స్, ఫైజర్ వంటి ప్రతిష్ఠాత్మకమైన పరిశోధనా సంస్థలు ఆశాజనకమైన ఫలితాలను ప్రకటిస్తున్న రోజుల్లో  కూడా రష్యన్లు ప్రయోగాల విషయమై ఎక్కడా చర్చల్లో కనిపించనే లేదు! పెద్ద సంస్థల ప్రయోగాలలో పెద్దగా ఆందోళన  పడే స్థాయిలో సైడ్ ఎఫెక్ట్స్ ఏవీ లేకపోయినా, వాలంటీర్లలో కొందరు యాంటీ బాడీస్ ఉత్పత్తి చేయడం, మరి కొంత మంది రోగులు రుగ్మతల నుంచి పూర్తిగా బైటపడ్డం జరిగినా మూడో దశ తాలూకు విజయాన్ని గురించి  ఆ సంస్థలేవీ ఇంకా భరోసా ఇవ్వడం లేదు!  రష్యా ప్రభుత్వం మాత్రం
 వాక్సినేషన్  ప్రయోగానికి, ప్రజాబాహుళ్య ప్రయోజనానికి  తామన్నీ  సిద్ధం చేసేసినట్లు అధికారికంగా కూడా ప్రకటించేసింది!   అందుకే ఫ్లోరిడా విశ్వవిద్యాలయం బయోస్టాటిస్టిషియన్,  అంటువ్యాధి నిపుణులూ అయిన నటాలీ డీన్ ‘ రష్యన్ల టైమింగ్ పైన అనుమానం వ్వక్తంచేస్తున్నది. ఆ మేధావి దారిలోనే ప్రపంచంలోని మరెంతో మంది వైద్య నిపుణులూ ‘స్ఫుత్నిక్ -వి’ టీకా సామర్థ్యం గురించి సందేహాలు వెలిబుచ్చుతున్నదీ!
 'తొందరపడి జనం మీద నిర్దయగా ప్రయోగాలు చెయ్యొద్ద'ని రష్యాను హెచ్చరించే వైద్య రంగం పెద్దలు ఎందరో   నటాలీ డీన్ తరహాలో కనిపిస్తున్నారు. రెండు దశల ఫలితాలు అనుకూలంగా ఉన్నటికీ మూడో దశ ప్రయోగాలు ఘోరంగా విఫలమయిన  సందర్భాలు ఎన్నో కద్దు- అన్నది ఆ పరిశోధకుల ముందస్తు హెచ్చరిక.
ఇప్పటికే కరోనా వైరస్  నియంత్రణ విధానంలో భాగంగా భారీ ఎత్తున ప్లేసిబో  టీకా ప్రయోగాలు జరిగివున్నాయ్!   'ఉంటారో.. ఊడతారో! రోగం నుంచి బైట పడతారో.. మరంత రోగాల పాలవుతారో జనం? ఫలితాల కోసం వేచిచూడొచ్చు కదా! ‘ఒళ్లో పెట్టా.. దళ్లో పెట్టా’ అన్నట్లు ఇప్పుడెందుకు ఇంత గత్తర?' అనేదే సందేహం ప్రఖ్యాత టీకా నిపుణుడు  డాక్టర్ స్టీవెన్ బ్లాక్ తరహాలో.
.
‘జూన్ మాసం లో, రష్యన్ ఫెడరేషన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాలూకు  'గమలేయ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ'  'గామ్-కోవిడ్-వాక్ లియో' అనే టీకాపై ఒకటి, రెండు దశలు రెండింటిని కలిపి జమిలిగా పరిశోధనలు చేపట్టినట్లు  చెప్పుకొచ్చింది.  అదీ కేవలం 38 మంది వాలంటీర్ల మీద మాత్రమే  ఈ పరీక్షలు చెయ్యడానికి సిద్ధపడినట్లు అప్పట్లో బైటికొచ్చిన సమాచారం! అందుతున్న సమాచారాన్ని బట్టి రష్యా సక్రమమైన పద్ధతుల్లో క్లినికల్ ట్రయల్సుకు ఎంత వరకు వెళ్లిందో అనుమానమే!'  అని మూతి విరువిరుపులు మొదలయ్యాయి అప్పుడే ప్రపంచ ప్రముఖ వైద్య సంస్థలు చాలా వాటి నుంచి.
 టీకా అడెనోవైరస్ అనే   హానిచేయని ఒక రకమైన కోల్డ్ వైరస్ నుండి తయారయినదని రష్యా చెబుతున్న మాట.    ఈ కోల్డ్ వైరస్ కరోనా వైరస్ జన్యువునే కలిగి ఉంటుందని. ఆస్ట్రాజెనెకా.. జాన్సన్ & జాన్సన్ కంపెనీలూ తమ వ్యాక్సిన్లలో ఇవే ధాతువులను వాడుతున్నట్లు రష్యా వాదన. తాము చేపట్టింది ఓ కొత్త రకమైన సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన టీకా అని, ఏ రకమైన వ్యాధికైనా వాడే అడెనోవైరస్  మొదటి సారి జూన్ లో ఎబోలాకు  వాడినట్లు  రష్యా చెప్పుకొచ్చే మాట.  ఆ ధాతువు ఊతంతోనే  ఇప్పుడు తాము  కరోనా వైరస్ కూ మందు కనుక్కునే పనిలో ఉన్నట్లు రష్యా  చెప్పుకొస్తోంది.
ఏదేమైనా పుతిన్ సమక్షంలో రష్యా ఆరోగ్య శాఖా మంత్రి మైఖేల్ మురాష్కో 'వాలంటీర్స్ అందరూ అత్యధిక స్థాయి యాంటీ బాడీస్ ను ఉత్పత్తి చేయడంతో పాటు, ఒక్క వ్యక్తిలో కూడా ఇమ్యునైజేషన్ కు సంబంధించిన పెద్ద ఆరోగ్య సమస్యలేవీ పొడసూపలేదని చెప్పడం ముఖ్యం.  ‘సాధారణంగా  మొదటి దశలో అందరూ ఆశించే ఫలితాలు ఇవే కదా! ఏ టీకా కూడా ఎప్పుడూ ఫలానా జబ్బు పూర్తిగా నయమయిపోయిందని ఘంటాఫథంగా అక్కడికక్కడే నిర్ధారణగా చెప్పదు.. చెప్పలేదు కూడా' అని ఆయన చురకలు అంటించడం గమనిస్తే ఏమనిపిస్తుంది?
ఎప్పటి నుంచో రష్యన్ వైద్య  పరిశోధకులు చేస్తూ వస్తున్న ఈ తరహా వాదనలు ఈ  మంగళవారం దేశాధ్యక్షుడు పుతిన్ సమక్షంలో మంత్రి స్థాయిలో మైఖేల్ మురాష్కో  కూడా చెయ్యడంతో రష్యా కరోనా వైరస్ కు టీకా తయారు చేయబోయే మొదటి దేశంగా ప్రపంచం ఇప్పుడు పరిగణించవలసిన పరిస్థితి  కచ్చితంగా వచ్చిపడింది. 
న్యూయార్క్ నగరం వెయిల్ కార్నెల్ మెడికల్ కాలేజీ వైరాలజిస్ట్ జాన్ మూర్ తరహాలో  ‘మూర్ఖత్వం.. మహా మూర్ఖత్వం’ అని మొత్తుకున్నా సరే.. 'పుతిన్ దగ్గర ఉన్నది టీకానో, కేవలం సామ్రాజ్యవాదుల మార్కెట్ పెత్తనాన్ని ధిక్కరించే రాజకీయ వ్యూహమో' తెలిసేందుకు  కొంత సమయం అవసరం.
కొత్త టీకా సత్తా కాలం గడిచిన మీదట గాని తేటతెల్లంకాదన్నది  అసలు తాత్పర్యం.
-కర్లపాలెం హనుమంతరావు
(సూర్య దినపత్రిక సంపాదకీయ పుట ప్రచురితం)
*** 






Thursday, June 23, 2016

యమలీల

గీతాంజలి చిత్రం గుర్తు ఉందా? త్వరలో చనిపోతానని తెలిసీ నాగార్జున.. చివరి రోజులు ఉల్లాసంగా గడిపేందుకు తల్లిదండ్రులకు దూరంగా పోయి .. అక్కడి ఆహ్లాదకర వారావరణం నేపథ్యంగా కథానాయికతో కలసి ప్రేక్షకులను చివరికంటా   రొమాంటిక్ గా ఎంటర్ టైన్ చేస్తాడు.
మ‌నిషి మ‌ర‌ణానికి ముందు య‌మ‌ధ‌ర్మ రాజు  నాలుగు మృత్యు సూచ‌న‌ల‌ను పంపుతాడ‌ని  హిందువుల విశ్వాసం. పురాణ కాలంనాటికి సంబంధించిన ఓ కథ ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. య‌మునానదీ తీరంలో అమృతుడు అనే   వ్యక్తికి ఒకానొక సంద‌ర్భంలో  మృత్యుభ‌యం ప‌ట్టుకుంది.   య‌ముడి గురించి ఘోర‌ త‌పస్సు చేస్తాడు.  య‌ముడు ప్ర‌త్య‌క్ష‌మై 'ఏం వ‌రం కావాలో కోరుకో!' అని అడ‌గితే గడుగ్గా  అమృతుడు  చ‌నిపోయేందుకు చాలా ముందే తనను ఒక్కసారి హెచ్చరించాలని కోరుకొంటాడు .  ముందు జాగ్రత్తలతో  త‌న  బరువు బాధ్యతలను సక్రమంగా వారసులకు అప్పగించి పోవాలని అమృతుడి ఆలోచన.  'ఒక్క సారి కాది.. నాలుగు పర్యాయాలు  సూచ‌న‌ల‌ను పంపుతాన‌' ని మాట ఇచ్చి మాయమైతాడు మృత్యుదేవుడు. కాగా చివ‌రికి ఒక రోజు య‌ముడు వ‌చ్చి 'ఆయువు తీరిందిప్రాణాల‌ను తీసుకుపోతాన‌'ని అమృతుడి ముందుకొచ్చి నిలబడతాడు.  'చావు సూచ‌న‌లు ఏవీ ఇవ్వకుండానే  ప్రాణాల‌ను తీసుకుపోతాను' అనడం వాగ్దానభంగం అవుతుందని ధర్మరాజుతో వాదనకు దిగుతాడు అమృతుడు.  'నా మాట ప్రకారం  నీకు నాలుగు సార్లూ   చావు సూచ‌న‌ల‌ను అందించాను. వెంట్రుక‌లు తెల్ల‌బ‌డ‌డం, ప‌ళ్లు ఊడిపోవ‌డం, చూపు మందగించడం, శరీరం సహకరించక పోవడం..రాబోయే చావుకు ముందు నేను పంపించే సూచనలే ! గ్రహించక పోవడం నీ గ్రహచారం!' అంటాడు యమధర్మరాజు.  ముందుగా సంభవించే అనారోగ్యాలే  మ‌ర‌ణాగమనానికి సూచనలు.  వంట్లో మెరుగుపడని రుగ్మత పెట్టుకుని.. తెలిసి కొంతమంది.. తెలియక కొంతమంది ఆఖరి శ్వాసవరకూ ఆరోగ్యవంతులకు మల్లేనే ఆడుతూ.. పాడుతూ.. గడిపే ఇటువంటి   ఇతివృత్తాలతో విశ్వసాహిత్యంలో  సినిమాలు.. కథలూ వంటి కళారూపాలు చాలానే వచ్చాయి.
జీవితం ఏమిటీ?.. వెలుతురూ చీకటీ..' అంటూ కృష్ణ దేవదాసు వాపోతూ  విలపిస్తే.. ' బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్, ఆ ఎరుకే నిశ్చలనాందమోయ్, బ్రహ్మానందమోయ్' అంటూ వేదాంతం ఒలికించాడు ఏ ఎన్నార్ దేవదాసు. 'జగమే మాయ.. బతుకే మాయ ' అంటూ వేదాలు ఎంత సారం పిండి బోధించినా.. 'తన దాకా వస్తే గాని తత్వం' తలకెక్కని పచ్చి నిజం జీవితం. 'మేక్ ఏ విష్' ఫౌండేషన్ స్థాపనలోని ఉద్దేశం గ్రహించగలిగేవారికి జీవితంలోని నికర సారం తెలిసి వస్తుంది. కేన్సరు వంటి ప్రాణాంతక వ్యాధులు వంటిని ఆవరించి భావిని  శూన్యంగా మార్చబోతున్నాయని ఆ చిన్నారులకు  తెలియదు.. తోటి పిల్లలకు మల్లేనే తోటలో అప్పుడే అరవిరిసే పూల మాదిరి అల్లరి చేయడం మినహా!  'పాపం, పుణ్యం, ప్రపంచమార్గం, కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ.. ఏమీ ఎరుగని ' పసిమొగ్గలు వారు. 
కూచిమంచి రవి అనే కవి ఒక మంచిచెడ్డ జీవిత సత్యాన్ని కవిత రూపంలో  వినిపించారు ఒకసందర్భంలో.
శైశవ గీతం దాని పేరు. చనిపోయిన పసికందు- బతికున్న మూన్నాళ్ళూ అమ్మ నాన్నలతో.. బంధుమిత్రులతో గల సంబంధ బాంధవ్యాలు నిష్క్రమణ వేళ ఎటువంటి భావనాత్మకమైన రూపాంతరాలకింద మార్పు చెందుతాయో కవితాత్మకంగా చెప్పే 'శిశు జ్ఞానం' అది.
'ఆపైన ఏం జరిగిందో/నాకంతగా గుర్తు లేదు కానీ/నిద్దురలోకి జారుకునేముందు/నేననుకునే ఉంటాను/మా అమ్మ చెక్కిట కన్నీటిని తుడిచి ముద్దిడిన వ్యక్తి/మా నాన్నే అయి ఉంటాడని/ఆ రాత్రే/మా ఇంటి ఇరుగు పొరుగు వచ్చి/నేను నిద్దురలోనే కనుమూస్తానని చెప్పినప్పుడు/నాకు గుర్తు లేదు గానీ/నేను మా అమ్మను ఊరడించడానికి ప్రయత్నించే ఉంటాను/“నాకేం ఫరవాలేదమ్మా/నువ్వేం ఏడవద్దమ్మా” అని ప్రయత్నించే ఉంటానూ అంటూ సాగే  మృతశిశువు అమృత స్మృతి గీతిక అది.
చావు పుట్టుకలకు పసిమితనం.. ముదిమితనం.. అని తేడా ఏమి ఉంటుంది? కన్ను తెరవడం జీవి స్పృహలో లేకపోవచ్చు. కన్ను మూసే వేళా అపస్మారకం లోతుల్లోకి జారిపోవచ్చు. కానీ ఊహ ముదిరిన పిదప మిట్ట మధ్యాహ్నం పూటే అసుర సంధ్య చీకట్లు అలుముకుంటున్నాయని తెలిస్తే అలమటించని ప్రాణి అరుదుగానైనా ఉంటుందా లోకంలో? అలిసెట్టి ప్రభాకర్ ఒక  పొట్టి కవితలో - ఎంతో గట్టిదిగా మనం భావించే  ఈ దేహం ప్రాణదీపం నిలిచే ఒక మట్టిప్రమిదకన్నా ఓటిది సుమా! దీపశిఖ వెండికొండలా  వెలుగడానికి .. కొండెక్కి మలగడామికి  మధ్య  ఉండే  అంతరం.. కంటిరెప్పపరంగా చెప్పాలంటే.. కేవలం తెరవడం.. మూయడమంత' సునాయాసం అని  చెపుకొచ్చాడు.
'బతుకి ఉండేందుకు .. బతకు ఏటి ఆవలవైపుకు వెళ్ళి పడేటందుకు మధ్య పట్టేది  కేవలం కంటిరెప్ప పాటు కాలం' అన్న ఆ కవి మాటా కొట్టిపార వేయలేం.
కానీ అదంతా దంతవేదాంతం. ఒక ప్రాణి కంటిముందు జీవయాత్ర విరమించుకుని.. మహాప్రస్థానానికని బైలుదేరే వేళ  'ఇంతేరా ఈ జీవితం.. తిరిగే రంగుల రాట్నమూ' అనే భావోద్వేగం ముప్పిరిగొనవచ్చు. శ్మశానంలో కపాలభాతి  జరిగే వేళ  జనించే వైరాగ్యం  నెత్తిమీద పోసుకొన్న చన్నీటితో పాటే ఆవిరవకపోతే.. క్షణభంగురం అని  మునిపుంగవులు క్షణం క్షణం సెలవిచ్చే  ఈ బతుకుని చివరివరకు  హంగు పొంగులతో.. అంగరంగ వైభోగంగా   గడిపేందుకు మనిషి అన్నేసి ఆటు పోట్లు ఎందుకు పడుతున్నట్లు?
మహాభారతంలో యక్షుడు ధర్మరాజుని అడిగే వంద సందేహాలలో  అత్యంత గహ్యమైనది మృత్యు సంబంధమైనదే! ' మానవ మనస్తత్వంలో అత్యంత వింత గొలిపే లక్షణం ఏది?' అన్న ప్రశ్నకు ధర్మరాజు ఇచ్చే జవాబు సబబైనదే. యుధిష్ఠిరుడు  అభిప్రాయ పడ్డట్లు 'రేపు  మరణించే మనిషి ఈ రోజు  మరణించిన ఆప్తులను  చూసి శొకతప్తుడు అవడం' విశదంగా పరిశీలిస్తే  విచిత్రమైన విషయమే !
కానీ..  ఎవరి ప్రాణం  వారికి తీపి.  జీవితంమీదున్న  మమకారం  మామూలుదా? ఉప్పూ కారాలు తిన్నా తినకున్నా.. సప్లిమెంటరీ విటమిన్లతో  కాలం నెట్టుకొస్తున్నా .. చప్పగా సాగే  బతుకుబండిని  కాలుడి నోటికి చటుక్కుమని అందించేందుకు సిద్ధపడేది ఎవరు?సిద్దులని చెప్పుకొనేవారు సైతం ఏ రాద్ధాంతాలూ చేయకుండా చెయ్యలేని కార్యం ప్రాణత్యాగం.
పెనురోగాల ఉనికి వంట్లో  ఉందని పెందళాడే  పసిగట్టినప్పుడు ఆ చేదునిజం  రోగి చెవిలో వేయడం మంచిదా. .కాదా? అన్నచర్చ సీమదేశాల్లో పెద్ద ఎత్తున సాగుతున్న సందర్భం ప్రస్తుతానిది.  కాబట్టి  చావు బతుకుల ప్రస్తావనలు ఇప్పుడు ఇంత విస్తారంగా   చర్చించుకోవలసి  వస్తున్నది.
రోగి శరీరంలో జబ్బు ముదురుతోందని వైద్యులు ముందే  గుర్తించడం.. రోగికి ఆ సమాచారం అందిచడం-- రెండు వైపులా పదునున్న కత్తి వంటిదని  కొందరు మానసిక శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు.
రుగ్మత  ముందే పసిగట్టి తెలియచేయడం  వైద్యపరంగా రోగికి అన్ని వేళలా మేలు చేసే చర్య కాకపోవచ్చన్నది ఆ మానసిక శాస్త్రవేత్తల ఆలోచన. ఈ తరహా మృత్యుజ్ఞానం చావు పుట్టుకుల మధ్య  సంఘర్షణను మరింతగా ప్రేరేపిస్తుందని.. ఆ ఘర్షణ అన్ని వేళలా మనం భావించిన రీతిలోనే రోగికి మేలు కలిగించాలని లేదన్నదీ  వైద్యుల అభిప్రాయంగా కూడా ఉన్నది. తన శరీర  క్షేత్రంలో  ప్రాణాంతకమైన రుగ్మతా బీజాలు వెదజల్లబడి ఉన్నాయని ముందే తెలుసుకొన్న రోగి మిగతా జీవితమంతా తతిమ్మా  ఆరోగ్యవంతులంత  సంతోషంగా గడుపుతాడన్న భరోసా లేదు. సరికదా  కొత్తగా బైటపడిన అనారోగ్య సమచారం రోగి మానసిక స్థైర్యంమీద  తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించే అవకాశాలే ఎక్కువని  మానస్థత్వ శాస్త్ర వేత్తలూ అభిప్రాయపడుతున్నారు. నార్వే విశ్వవిద్యాలయం - ట్రాన్ ధియమ్  విజ్ఞాన సాంకేంతిక  విభాగాల ప్రజా ఆరోగ్య   రంగంలో  పరిశోధనలు సాగించే జోర్గెన్సన్ వాదన ప్రకారం- ప్రాణాంతక వ్యాధులకు సంబంధించిన  రుగ్మత శరీరంలో బీజదశలో ఉందని తేలినప్పటికీ.. ఆ దురదృష్ట సమాచారం రోగిదాకా రాకుండా జాగ్రత్తపడడమే రోగి జీవితకాలం  మరింత కుచించుకుపోకుండా  ఉండేందుకు తీసుకొనే మంచి చర్యగా నిర్ధారిస్తున్నారు.

-కర్లపాలెం హనుమంతరావు 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...