Showing posts with label Family. Show all posts
Showing posts with label Family. Show all posts

Wednesday, December 22, 2021

సేకరణ పాత బంగారం - కథ ఇల్లాలు రచన - వై.ఎస్. ప్రకాశరావు ( ఆంధ్రపత్రిక - వారపత్రిక - సెప్టెంబర్ 29 - 1964 సంచిక )

 పాత బంగారం - కథ 

ఇల్లాలు 

రచన - వై.ఎస్. ప్రకాశరావు 

( ఆంధ్రపత్రిక - వారపత్రిక - సెప్టెంబర్ 29 - 1964 సంచిక ) 


ಆ ఆదివారం . క్రితం రోజు నే జీతాలు ముటాయి. 


అకస్మాత్తుగా పుట్టింది కోరిక . . ఎక్కడికైనా ప్రయాణం చేసిరావాలని. వెంటనే బయలు దేరాను. 


 మెయిల్ లో కాకినాడ వెళ్ళి తిరిగి సాయం కాలానికి వచ్చేదామని. 


నీటుగా కటకప్ చేసుకొని కళ్లకు గాగుల్స్ పెట్టి రిక్షాలో రాజమండ్రి టవున్ స్టేషన్ చేరాను. తీరా వెళ్లేటప్పటికి మెయిల్ గంటలేటు అని తెలుసుకొని ప్రయాణంమీద నిరాశపడ్డాను. 


తిరిగి వెళ్ళిపోదామా అనిపించింది . . పనిలేక ప్రయాణం చేసే నాలాటి ప్రయాణీకుడు పనిపైన ప్రయాణం చేసే ఇతర ప్రయాణీకులను అవస్థ పెట్టటాని కిష్టం లేక. 


కాని ప్రయాణం చెయ్యాలని కోరుతున్న మనస్సును నిరాశ పెట్టడాని కిష్టం లేక వెనుదిరిగి వెళ్ల లేకపోయాను. 


ప్లాట్ ఫారమ్మీద కొంత సేపు తిరిగాను. కాలం గడవటం బహుకష్ట మెంది. ఇంతిలో రోడ్ మీ ద కాఫీ 'కేంటీన్' వైపు దృష్టి మరలింది. 


కేంటీన్ లోకిపోయి కాఫీ తీసుకున్నట్లయితే కొంత కాలం గడుస్తుందికదా అని బయలు దేరి వెళ్ళి 'స్పెషల్ సెక్షన్'లో పంకా క్రింద కూర్చు న్నాను. సర్వర్ కు  కాఫీకి ఆర్డర్ ఇచ్చి గాగుల్సతీసి ముఖంమీది చమటను చేతి రుమాలుతో తుడుచుకుంటుండగా ఆ బల్లకు ఎదురుగా  కూర్చున్న ఓ పెదమనిషి 'ఎక్క డకు వెళ్ళాలి, నాయనా?' అని ప్రశ్నిం చాడు. 


'కాకినాడ వెళ్ళాలి' అని సమాధాన మిచ్చాను.


ఆయన వాలకంచూస్తేనే గవర్నమెంటు ఆఫీసర్ లా కనుపిస్తు న్నాడు. తెల్లని సగం చేతుల చొక్కా, రంగువెలిసిన కాకీ ఫుల్ పేంటులో 'టకప్’ చేసి కళ్ళకు చత్వారంజోడు పెట్టాడు. ఆయన్ను చూడగానే కొంతసేపు ఆయనతో సంభాషణ చేయాలని మనస్సు పుట్టింది. '


' చదువుకుంటున్నావా?' అని మరల ప్రశ్నించాడాయన. '


' లేదు, ఉద్యోగం చేస్తున్నా' నని సమా ధానమిచ్చాను. 


సంతోషమన్నట్లుగా ఆయన ముఖసూచన చేసి మళ్ళీ ప్రశ్నించాడు. 


' ఏడిపార్టుమెంటులో పనిచేస్తున్నావు? ' 


ఆయన వేసే ప్రశ్నలధోరణిచూచి, ఇంకా వివరాలన్నీ కనుక్కుంటాడని ముందుగానే గ్రహించి, ఆయన అడగబోయే వివరాలన్నీ చెప్పేసేను. 


నామాటలు వింటూనే ఆయన ఏదో ఆలోచనలో పడ్డాడు.


'ఏమండీ అలా ఆలోచిస్తున్నారు? నేనేమైనా మీకు తెలుసా?' అని అడిగాను. 


ఆ, ఏమీలేదు, నీవు చెప్పింది వింటూంటే నాకేదో చిన్న నాటి సంఘటన జ్ఞాపకమొస్తున్నది' అన్నా డు గొంతుక సవరించుకుంటూ. 


రైలు కింకా చాల టైమున్నది కదా - ఆయనదగ్గరనుండి తెలుసుకోవాలను కునే లోపు సర్వర్ కాఫీ తీసుకొచ్చి ఇంతలో నాముందు పెట్టాడు. 


ఆ కాఫీ ఆయన కందిస్తూ, మరో కప్పు తీసుకురమ్మని సర్వర్ తో చెప్పాను. 


' నేనిప్పుడే తీసుకున్నా, ఫరవాలే, నీవు తీసుకో! '  అన్నాడాయన. 


కాఫీ ముగించి ఇరువురం బయటకు వచ్చాం. నేను రెండు కిళ్ళీలుకొని ఒకటి ఆయనకిచ్చి రెండవది నేను వేసుకున్నా. నేరుగా స్టేషన్ కు పోయి ప్లాట్ ఫారం చివర్న  ఒక పెద్ద చెట్టు క్రింద ట్రాలీమీద కూర్చున్నాం.


'రిటైరైనారండీ? ' అని ప్రశ్నించాను, విషయ మేమిటో తెలుసుకుందామని.


"

'రేడిపార్టుమెంటులో పనిచేసి రిటైరయ్యానని  ఆయన చెప్పాడు. 


ప్రభుత్వోద్యోగంలో రిటైర్ అయ్యాడు.


' నా విషయం వింటే మీ చిన్న నాటి సంఘటన జ్ఞాపకమొచ్చిం దన్నారు?' అన్నాను.


' అవును. చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది. నేను చేసిన పాపం చెప్పుకుంటే నాకూ కొంత మనస్థిమితం కలుగుతుంది. నీకూ ఒక ఉదాహరణగా ఉంటుంది, విను నాయనా! ' అన్నా డాయన. 


ఇంచుమించు ముప్పై సంవత్సరా లుండవచ్చు. ఒకరోజున ఆఫీసు పనిపైన ఒక పల్లెటూరు వెళ్ళా. అప్పటికి సాయంత్రం అయిదుగంటలు కావస్తోంది. గ్రామమునసబు గారింటికి వెళ్ళి నా హోదా చెప్పుకుని నాకు భోజన -పానాదులు సమకూర్చుకున్నా. 


గృహస్థు నలభైయేళ్లు పైబడిన మనిషి. ఇంట్లో ఆయన భార్య, మూడునాలుగేళ్ల ఆడపిల్ల తప్ప మరెవ్వరూ లేరు. 


ఆయన భార్య పెద్ద అందగత్తె కాకపోయినా కురూపి మాత్రం కాదు. ఇరవై సంవత్సరాలు పైబడిఉండవు. ద్వితీయవివాహమనుకోవచ్చు. 


నా స్నాన మైన తరువాత  గృహస్థుతో కలిసి భోజనం ముగించాను. ఆరుబయట వసారాలో నాకు మునసబు గారికి వేర్వేరు మంచాలు వేసి ఆయన భార్య వసారా సనుసరించి మంచం మీద పిల్లను  వేసుకొని పడుకొంది. 


నాకు కావలసిన సౌకర్యా లన్నీ కూడ మునసబుగారు భార్య చేతనే ఏర్పాటు చేయించారు. ఆమెకూడా అరమరిక లేక చాల చనువుగా మసిలింది. 


ఆమె నడవడికనుచూచి నే నామెను తప్పు అర్థం చేసుకున్నాను. 


రాత్రి సరిగా పన్నెండు గంటలు దాటి  ఉంటుందేమో. నాకు మాత్రం నిద్రపట్టలేదు. ప్రక్కను గృహస్థు గాఢనిద్రలో ఉన్నాడు. 


నాకు కలిగిన భావములు నన్ను ఆమెగురించి కలవరపరిచాయి. 


నే నెటువంటి ఉద్రేకానికి గురి అవుతున్నానో నా కప్పటి పరిస్థితులలో తెలియలేదు. నెమ్మదిగా లేచి చూచాను. గృహస్థు గాఢనిద్రలో వున్నా డని నిశ్చయపర్చుకొని, నెమ్మదిగా తడబడు తున్న అడుగులతో గదిలోకి వెళ్ళాను. ఆమె పిల్లపక్కన పడుకుని గాఢం గా నిద్రపోతోంది. నేను వెళ్ళి ఒణకుతున్నా..  ఆమెను తట్టాను . 


ఆమె ఆ నిద్రలో కళ్లు తెరచిరూచి కలవరపడింది. నే నామె చేయి పట్టుకో ప్ర యత్ని చేశాను. ఆమె వొణికిపోతూ "వస్తానుంఉండ ”ని చెప్పి పిల్లతో సహా బయటకు వెళ్ళి తలుపు గొళ్ళెం పెట్టింది .


ఆ రాత్రి నేను పడ్డ అవస్థ భగవంతునికే తెలుసు. మనస్సులో ఏదోభీతి దృఢంగా నాటుకుంది. నేను చేసిన తుచ్ఛమైన పని కి నన్ను నేనే నిందించుకున్నా. 


స్త్రీ మనస్తత్వ మెరక్కుండా ప్రవర్తించి నందుకు నన్ను నేనే తిట్టిపోసుకున్నా. ఆగదిలో నే తెల్లవారేలోగా ప్రాణం విడిచేద్దామా అనిపించింది. 


కాని మళ్ళీతట్టింది. నేను చేసినపని తిన్న ఇంటి వాసాలు లెఖ్క పెట్టటం. వారింట ప్రాణం తీసుకోటం మర్యాదస్తుడైన గృహస్థుకు ప్రాణాపాయం తెచ్చి పెట్టడమే కాక, వారి వంశమర్యాదను భంగపర్చటమని  భావించి వెనుదీశాను. 


గ్రామస్థుల ఎదుట నన్ను నిలదీయగలరని దృఢంగానమ్మాను.  దానితో శరీరం కంపించింది. 


తెల్లవారేలోగా ఇంచు మించు ఇరవై ముప్ఫై సార్లు తలుపులాగి చూచాను, కాని రాలేదు. దానితో మరింత భయపడ్డాను. 


తెల్లవారింది.  వారింట్లో కోడి ఎలుగెత్తి ‘కొక్కురోకో' అని చూసింది. 


అదిరిపడి మళ్ళీ వెళ్ళి తలుపులాగి చూచాను. తలుపు గొళ్లెం  తీసివుంది. 


మునసబు గారు మంచంమీది ఇంకా నిద్రపోతున్నారు. 


ఇలాలు దొడ్లో ఏ దో ఇంటిపని చేసు కుంటోంది. 


నేను గాభరాపడుతూ  సామాన్లు సర్దుకొని  అక్కడ ఉండడానికి ఇష్టం లేక వెంటనే బయలు దేరాను. 


అది గమనించి ఇల్లాలు వెంటనే భర్తను లేపింది. ఆయన లేవటంతో నాకు మరింత గాభరా ఎక్కు వైంది. 


ఆయన మరో గదిలోనికి వెళ్ళి బట్టల సవరించువచ్చి 'ఏమండీ అంత కంగారు పఉతారెందుకు? తాపీగా స్నానంచేసి కాఫీ వెళ్ళండి. అది గృహస్థధర్మం. అన్నాడు . కాని ప్రేమపూర్వకంగా  ఆయన అన్న ఆమాటలతో నాకు  శరీరం దహించుకు పోతున్నట్లయింది. 


ఎట్లాగో ముళ్ళమీద నుంచున్నట్లు వారికోరికను మన్నించి తరువాత వెళ్తూ ' వెళ్ళొస్తాను చెల్లెమ్మా' అన్నాను. 


' వెళ్లి రాండి అన్నయ్య గారూ! ' అందిఇల్లాలు. నాకామాట బల్లెంతో పొడిచినట్లయింది.


వెళ్ళి వెంటనే ఆత్మహత్య చేసుకోవడం మంచిదనిపించింది. 


స్త్రీ మనస్తత్వం నీకు తెలియంది కాదు, నాయనా. సంవత్సరాలనుండి ఈ విషయం జ్ఞాపకమొచ్చినప్పుడల్లా నేను చేసినతప్పు   ఎవరికి  చెప్పి పశ్చాత్తాపం పొంది దాని ద్వారా కొంత మనఃస్తిమితం కలుగ చేసుకుంటున్నాను'  అని ఆయన కథ ముగించాడు. 


అప్పట్లో ఆయన ముఖం చూస్తే నాకే జాలి వేసింది. 


ఓ విధంగా ఓదార్చకపోతే బాగుండదని మొదలు పెట్టా.

' తప్పు మానవుడు చెయ్యకపోతే పశువు  చేస్తుందిటండీ? చేసిందానికి మీరు పశ్చా త్తాపం చెప్పుకోనే చెప్పుకుంటున్నారు. చేసిన తప్పు ఈ రోజుల్లో ఎవరు చెప్పు కుంటారండీ? మీరు చేసినపాపం చెప్పు కున్నందువల్ల అప్పుడే పోయింది. ' అని సముదాయించేప్పటికి ఆయనముఖంలో కొంత వికాసం కన్పించింది. . ' 


' నాయనా!  యువకుడవు. నాకథ జ్ఞాపకముంచుకోవడం  నీకు మంచిది  నాయనా.; . అని తలవంచుకుని మౌనంగా కూర్చున్నాడు. 


నేను ఆలోచనలో పడ్డాను, ఆయన చెప్పిన సంఘటనలో ఆయన పడ్డ అవస్థకన్న ఆ ఇల్లాలి తెలివి తేటలు, సహనం ఆలోచనలు ప్రథమ స్థానం  పొందాయి. ఎంతో  నేర్పరితనంగా తన మానం  రక్షించుకొని అతిథిని అగౌరవపర్చ కుండా పంపింది! 


ఆడవాళ్ళందరూ అంత తెలివిగా ఉంటే ప్రపంచ మే బాగుపడి పోను- అనిపించింది.


రచన - వై.ఎస్. ప్రకాశరావు 

( ఆంధ్రపత్రిక - వారపత్రిక - సెప్టెంబర్ 29 - 1964 సంచిక ) 


Sunday, December 12, 2021

కథానిక - కర్పూరం రచన - కర్లపాలెం హనుమంతరావు

 







కథానిక : 

కర్పూరం 

రచనః కర్లపాలెం హనుమంతరావు


(ఆంధ్రభూమి- వారపత్రిక- 17 సెప్టెంబరు 2015 నాటి సంచికలో ప్రచురితం)



అయినవాళ్ళందరికి కబుర్లు వెళ్ళాయి. కొడుకులూ కోడళ్ళూ, కూతుళ్ళూ అల్లుళ్ళూ, సంతానంతోసహా అంతా వచ్చేసారు. ఇంట్లో ఒహటే హడావుడి.


సుందరమూర్తే బెడ్ మీద పడున్నాడు అచేతనంగా. కానీ అతని మనసుమాత్రం  పనిచేస్తోంది..  ఎప్పటికన్నా చురుకుగా!


పక్కగదిలో అందరూ ఏదో 'పారాయణం'లో ఉన్నట్లున్నారు. 


నవ్వులు, చలోక్తులు జోరుగా వినపడుతున్నాయి. 


' అయితే ఓడిన పార్టీ గెలిచిన పార్టీని సినిమాకు తీసుకెళ్ళాలిరా.. అదీ పందెం’ అంటున్నాడు పెద్దకొడుకు.


'వట్టి సినిమానేనా? డిన్నరుకూడా ఉండాలి.. అప్పుడే మజా'  పెద్దల్లుడి వంత.


'బావగారి చూపెప్పుడూ మీల్సుప్లేటుమీదే!' చిన్నకూతురు కౌంటరు. అందరూ విరగబడి నవ్వుకోవడాలు.


ఇవతల గదిలో సుందరమూర్తి మాత్రం మూతిమీద వాలిన ఈగను తోలుకోలేక తంటాలు పడుతున్నాడు. ఒహటే దురద! 


తోలుకొనేందుకు చేతులు లేవు. అవి నెల  కిందట జరిగిన బండిప్రమాదంలో నజ్జునజ్జయిపోయాయి. 


' అసలు ప్రాణానికే ప్రమాదం’ అన్నారు ముందు పెద్దాసుపత్రి వైద్యులు. ఆనక 'చేతుల వరకు  తీసేస్తే ప్రాణానికి కొంతవరకు భరోసా ఇవ్వచ్చు' అని తేల్చారు. 


' యాంప్యుటేషన్’ అంటే మాటలా? మూటలతో పనికానీ!

సుందరమూర్తి చేసేదేమీ సర్కారుద్యోగం కాదు. ఏదో ప్రైవేట్ పుగాకు కంపెనీలో అకౌంటెంటు. 


' యాక్సిడెంటయింది ఆదివారం డ్యూటీ-ఆఫ్ లో ఉన్నప్పుడు కాబట్టి  రూల్సు ప్రకారం  ముట్టేదేమీ లేదు పొమ్మ’న్నారు కంపెనీవాళ్ళు. 


నెలనెలా  జీతంలోనుంచి దాచుకొంటున్న పి. ఎఫ్ కూడా ఆడపిల్లల పెళ్ళిళ్ళకని చేసిన అప్పులకే చెల్లిపోతోంది. 


పెళ్లాం మెళ్ళో వేళ్ళాడే పుస్తెలు మినహా మరేమీ మిగల్లేదు ఇంట్లో.. ఇన్నాళ్ల పిల్లల చదువులు, పెళ్ళిళ్ల తంతులన్నీ ముగిసాక.


అప్పట్లో సుందరమూర్తి అన్ని పాట్లు అట్లా పడబట్టే.. ఇవాళ పెద్దాడు ఇన్ కమ్ టాక్సు ఆఫీసురుగా  కుదురుకొన్నది. చిన్నాడు బ్యాంకాఫీసరు కాగలిగింది. ఉండటానికి సొంత నీడంటూ ప్రస్తుతానికి మిగలక పోతేనేమి.. ఇద్దరు కూతుళ్ళకూ కుదురైన అత్తారిళ్ళు కుదిరిపోయాయి. 


‘ఆఖరివాడి విషయంలోనే కాస్త అన్యాయం జరిగింది. టొబోకో బోర్డులో వేయించగలిగాడుగానీ.. అది అన్నలకు మల్లే అధికార హోదాకలది కాదు.  నాలుగు డబ్బులు చేతుల్లో ఆడుతుంటే చివరాడికి మాత్రం  చిన్నగుమాస్తాగిరీతో సరిపెట్టేవాడినా!' అని మధన పడుతుంటాడెప్పుడూ సుందరమూర్తి ఒంటరిగా ఉన్నప్పుడు. 


ఆ కారణంగా వాడికి తనమేదెంత కోపమో తలుచుకుని తలుచుకొని అపరాధభావనతో  కుంగిపోవడం సుందరమూర్తి బలహీనత.


తండ్రీ బిడ్డలకు ఈ  విషయం మూలకంగా అంతగా మాటలు  లేవు.


' తనకిలా యాక్సిడెంటయిందని అందరితో పాటూ కబురెళ్ళినా..  చివరోడు తీరిగ్గా ఆఖర్లో మాత్రమే  ఎందుకొచ్చాడో తనకు తెలుసు. వచ్చి ఒక్కరోజైనా కాకుండానే 'సెలవుల్లేవు.. అర్జంటు పన్లున్నాయ'ని పెట్టేబేడా ఎందుకు సర్దుకుంటున్నాడో కూడా తనకు తెలుసు’ . 


దీర్ఘంగా నిటూర్చాడు సుందరమూర్తి.


గంటక్రితం అదే గదిలో కుటంబసభ్యులమధ్య జరిగిన సంభాషణలు గుర్తుకొచ్చాయి సుందరమూర్తికి.


' నాన్నగారి ఆపరేషనుకి తలా కొంత ఇచ్చుకోవాలిరా!' అని అడిగింది సుందరమూర్తి భార్య సుగుణమ్మ.. అందరికీ కాఫీలు అందిస్తూ.


' అరె! ఆ సంగతి ముందే చెప్పాలి కదమ్మా! పోయిన్నెల్లోనే పెద్దాడి కాలేజీ సీటుకోసమని ఐదు లక్షలు అప్పు తీసుకొచ్చాను బ్యాంకునుంచి. మళ్లీ అంత సొమ్మంటే మా ఆఫీసురూల్సు ఒప్పుకోవు' అనేసాడు పెద్దాడు వెంటనే. ముందే తయారు చేసిపెట్టుకున్నట్లుంది అతగాడా  స్పందించిన తీరు చూస్తుంటే!


సుందరమూర్తికి నవ్వొచ్చింది అంత బాధలోనూ. 'నాన్నా!పోయిన్నెలకు ముందే నువ్వెందుకు చేతులు పోగొట్టుకోలేదు?' అని ఆడిగినట్లనిపించింది. 


అయినా పెద్దాడి తత్వం తనకేమన్నా కొత్తా! వాడిప్పుడు అచ్చంగా వాళ్ల మామగారి అడుగుజాడల్లోనే కదా నడుస్తున్నదీ! మామగారి దయవల్లే తనకు ప్రమోషనొచ్చింద'ని ఎన్ని వందల సార్లు తనముందు అనివుంటాడో!


అయినా సుగుణకు వాడిమీదే ప్రేమ జాస్తి. 'మీకులాగా కాదు. నా పెద్దకొడుకు బతకనేర్చినవాడు' అని గర్వంగా చెప్పుకుంటుంటుందెప్పుడూ. '


తగిన శాస్తి చేసాడు తనకిప్పుడు' అనుకున్నాడు సుందరమూర్తి మనసులో చిన్నగా నవ్వుకొంటూ.


సుగుణమ్మ వెర్రిమొహమేసుకొని రెండోవాడివంక చూసినప్పుడు వాడూ అంతకుమించిన  మహానాటకానికే తెరతీసాడు. 


మొహం వేలాడేసుకొని 'ఇంతర్థాంతరంగా లక్షలంటే నా వల్లవుతుందా? నా వంతుగా ఓ పదో.. పాతికో అంటే ఎలాగో తంటాలు పడతాగానీ! దానికీ టైము కావాలమ్మా! లోనుకి అప్లై చేసిన వెంటనే సాంక్షనంటే అయే రోజులా ఇవి?' అని ముక్తాయించేసాడు. అదీ పెళ్లాం వంక బితుకు బితుకుమని చూస్తూ. 


పదికీ పాతిక్కీ కమిటయినందుకు అర్థాంగిగారు ఆనక గదిలో ఏం క్లాసు పీకుతుందోనన్న భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే వుంది వాడి కళ్ళల్లో.


పెద్దల్లుడే నయం. 'కొడుకులు మీరట్లా అనడం ఏం బాగోలేదోయ్! మరీ అంత ఇబ్బందయితే చెప్పండి. సర్దడానికి నేను రెడీ! ఆనక మీదగ్గరున్నప్పుడే ఇద్దురుగానీ' అన్నాడు. 


కానీ వెంటనే పెద్దకూతురు అందుకోనే అందుకంది'అవ్వ! బావమరదులకు అప్పిస్తానంటారా! లోకం వింటే నవ్విపోతుంది. అయినా మీదగ్గర అంత సొమ్ము మూలుగుతున్నట్లు నాకూ తెలీదే! కాలేజీకెళ్లే పిల్ల మెడ బోసిగా ఉంది.. కనీసం ఒక చిన్నగొలుసైనా చేయిద్దామని ఎంతకాలంబట్టీ మొత్తుకుంటున్నాను! ఆప్పుడు లేదన్న డబ్బు ఇప్పుడు కొత్తగా ఎక్కణ్ణుంచి పుట్టుకొచ్చిందో?!  పెళ్ళికి చెల్లాయికి అమ్మ మంచి గొలుసు చేయించి ఇచ్చిందిగదా! ఏమే!  అది బ్యాంకులో పెట్టినా నాన్న అవసరాలు తీరిపోతాయిగదా .. ఇలా అమ్మావాళ్ళు అందరి కాళ్ళు..  గడ్డాలు పట్టుకొని బతిమాలేబదులు!' అంటూ సన్నాయినొక్కులు మొదలుపెట్టింది.


అనుకోకుండా గాలి తనవేపుకి తిరగడంతో వెంటనే ఎలా స్పందించాలో తోచక బిక్కమొగమేసుకుంది చిన్నకూతురు. 


సుగుణమ్మే కలగజేసుకొని అనాల్సొచ్చింది 'కొత్తగా పెళ్లయిన పిల్ల, వంటిమీదకని ఇచ్చిన సొమ్మును ఎంతవసరమొస్తేమాత్రం తిరిగి తీసుకుంటామా? వదిలేయండింకా ఈ టాపిక్కుని ఇక్కడితో!' అనడంతో అమ్మగన్న సంతానమంతా గమ్మునయిపోయారు. 


'అమ్మయ్య! ఈ పూటకీ గండం ఎలాగో గడిచిపోయింద’న్నసంబరమే అందరి కళ్ళల్లో కనిపిస్తున్నది' అనుకున్నాడు సుందరమూర్తి. 


వాతావరణాన్ని తేలిక పరచడానికని తనే కలగజేసుకొన్నాడు చివరికి 'మీ ఆమ్మ పిచ్చిది.  పాతకాలం మనిషి. ఆమె మాటల్నేమీ పట్టించుకోకండర్రా! ఇక్కడున్న నాలుగురోజులు సంతోషంగా గడిపిపోండంతా. మళ్ళా ఎప్పుడు కలుస్తారో  ఏమో ఇట్లా అందరూ! పిల్లాపాపలతో మీరంతా చల్లంగా ఉండటమే మాకు కావాల్సింది' అన్నాడు.


తరువాత తనగదిలోకి వచ్చినప్పుడు సుగుణమ్మ కన్నబిడ్డల మాటల్ని తలుచుకొని తలుచుకొని గుడ్లనీరు కుక్కుకుంటుంటే సుందరమూర్తే సర్దిచెప్పాల్సి వచ్చింది. 


' వూరికే అనవసరంగా  వాళ్లని బాధ పెట్టడమెందుకు? నువ్వూ బాధ పడ్డమెందుకు? ఇప్పుడంత అర్జంటుగా నేనీచేతులు బాగుచేయించుకొని వరగబెట్టేది మాత్రం ఏముంది చెప్పు! ఎలాగూ  రిటైరవబోతుంటిని. ఆర్నెల్లకు  ముందే పదవీవిరమణ చేసానని సర్దిచెప్పుకొంటే సరిపోదా సుగుణా!' అంటూ.


ఎప్పుడు వచ్చాడో లక్ష్మీనారాయణ.. అంతా అప్పుడే  విన్నాడో.. సుగుణమ్మ అంతకుముందే చెప్పుకుందో.. లోపలికొచ్చి కూర్చున్నాడు. 'చూసావుగా సుందరం! నేనాడే హెచ్చరించాను. ఈ కాలం కుర్రసజ్జే అంత. పిలల్ని మనం 'బంగారు కొండల'నుకుంటాం. ఆ కొండలే విరిగి నెత్తిమీద పడితే?  అయ్యో.. మన త్యాగమంతా వృథా అయిపోయిందిగదా అనుకుంటూ అల్లాడిపోతుంటాం.. ఇలాగా!' అంటూ వేదాంతం మొదలుపెట్టాడు.


'పోనీలేరా! కన్నందుకు పిల్లల్ని వృద్ధిలోకి తేవడంకూడా ఓ గొప్పత్యాగమేనా! పుట్టీపుట్టంగానే డొక్కల్లో తంతూ నడక నేర్పించడానికి మనమేమీ ఒంటెలం కాదు. జిరాఫీలం అంతకన్నా కాదు. రెక్కలిరిగినప్పుడు ఆదుకుంటాయనేనా పిట్టలు గువ్వలకి నోళ్ళు పగలదీసి మరీ బువ్వ పెట్టేది! మన రక్తసంబధాలు విచిత్రంగా ఉంటాయిరా! కనకనే మనం మనుషులం. ఎవరి అదృష్టాలనిబట్టి వాళ్లకవి లభ్యమవుతాయి. నా అదృష్టం ఇదీ! దానికింకెవర్నోనిందిస్తూ కూర్చుంటే మనశ్శాంతి తిరిగొస్తుందా!. వస్తుందంటే చెప్పు.. నీ మాటే వింటాను’


'సరేలే! నీ వెర్రివేదాంతం నాకింతప్పట్నుంచీ తెలిసిందేగా! నువ్వెలాగూ వృద్ధాప్యంలో కష్టమొచ్చినప్పుడు ఇలాంటి గోతిలోనే పడతావని  ముందే తెలుసు. ఏడేళ్లకిందట ఇల్లు కట్టేటప్పుడు నీ దగ్గర అప్పు తీసుకున్నాను. గుర్తుందా? ఆ మూడు లక్షలు ఎప్పుడు తిరిగిస్తానన్నా'ఫ్రెండు దగ్గర బాకీ వసూలు చేసుకునే ద్రోహినా?' అంటూ సినిమా డైలాగులు కొట్టేవాడివి. 'కనీసం వడ్డీలేకుండానైనా తీసుకోరా దేవుడా!' అని ఎంత బ్రతిమిలాడాను! నీ  డబ్బుమొత్తం  ఆ రోజుల్లోనే  బ్యాంకులో వేసేసానబ్బాయ్ రికరింగ్ డిపాజిట్టుగా. నిన్ననే మెచూరయింది.. అదిచ్చిపోదామనే వచ్చింది' అని డబ్బున్న సంచీ అక్కడేవున్న సుగుణమ్మ చేతిలో పెట్టేసి  'లెక్క పెట్టించు తల్లీ! మొత్తంఆరున్నర లక్ష ఉండాలి' అన్నాడు లక్ష్మీనారాయణ. 


'లక్ష్మీ! నీకెందుకురా నామీద అంత ప్రేమ?'


'నేను నీ బాల్యస్నేహితుణ్ణి కనక. మరీ ముఖ్యంగా నువ్వు నా కన్నతండ్రివి కాదు కనక' అని నవ్వాడు లక్ష్మీనారాయణ. 


భోరున ఏడ్చేసాడు సుందరమూర్తి. అప్పటిదాకా అదిమిపెట్టుకొనున్న ఉద్వేగమంతా ఒక్కసారిగా కట్టలు తెంచుకొన్నట్లయింది. 


కాఫీ తాగి లేచివెళ్ళే సమయంలో  లక్ష్మీనారాయణని దగ్గరికి పిలిచి చెప్పాడు సందరమూర్తి 'సుగుణదగ్గరున్న ఆ క్యాష్  మా మూడోవాడు రాజుకాతాలో వేసెయ్యరా! వాడు చాలా రోజులబట్టీ డబ్బుకావాలని ఒహటే గోలపెడుతున్నాడు. ఏదో బండికొంటాట్ట! అదికొనిస్తేగాని వాళ్లబాసు ప్రసన్నం కాడనీ.. పైపోస్టుకి తన పేరు క్లియర్ కాదనీ మొత్తుకుంటున్నాడు చాలా రోజులబట్టీ.. పాపం! తప్పేముందిలే! వాడికి మాత్రం వాడి అన్నలకు  మల్లే పెద్ద హోదాలో ఉండాలని ఎందుకుండ కూడదు? ఈ మొండిచేతులు పెట్టుకొని ఇహ ముందు మాత్రం  వాడికి నేను చేసేది ఏముంటుంది? ప్రైవేట్ కంపెనీలో ఓ బోడి గుమస్తాపోస్టు ఇప్పించానని కదా ఇంతకాలం  వాడికి నామీద ఆ  గుర్రు!' అన్నాడు భార్యవైపు తిరిగి.


'మరి మీ సంగతేమిటండీ?' అని లబలబలాడింది అప్పుడే హారతిపళ్లెంతో లోపలికొచ్చిన సుగుణమ్మ.


'సుగుణా! ఈ లక్ష్మీగాడు  నీకు చెప్పడానికి జంకుతున్నాడు. నిన్న వాడే డాక్టరుదగ్గరికి వెళ్ళొచ్చాడు 'సమయం చాలా మించిపోయిందని.. ఇప్పుడు యాంప్యుటేషనంటే అసలు ప్రాణానికే ముప్పు' అని డాక్టర్లు చెబుతున్నార్ట. ఏరా!?' అని గద్దించి అడిగాడు మిత్రుణ్ణి సుందరమూర్తి.


' అవున'నాలో.. 'కాద'నాలో' తేల్చుకోలేక నీళ్ళునిండిన కళ్ళతో అలాగే నిలబడిపోయున్నాడు లక్ష్మీనారాయణ.


సుగుణమ్మ చేతిలో వెలుగుతున్న  హారతికర్పూరం  వాసన గుప్పున అతగాడి   ముక్కుపుటాలకు సోకింది.


- రచనః కర్లపాలెం హనుమంతరావు

***

(ఆంధ్రభూమి- వారపత్రిక- 17 సెప్టెంబరు 2015 నాటి సంచికలో ప్రచురితం)














నాన్నగారూ! నన్ను క్షమించండి!- కథానిక -కర్లపాలెం హనుమంతరావు (నవ్య వారపత్రిక ప్రచురితం )

 


గోపాలకృష్ణయ్యగారు వణికే చేతుల్తో ఆ కాగితం మడతలు విప్పారు. అక్షరాలు అలుక్కుపోయినట్లున్నాయి. కూడబలుక్కుని చదువుకోడం మొదలుపెట్టారు గొణుక్కుంటున్నట్లు.

 

‘ప్రియమైన నాన్నగారికి,

నమస్కారం. నేనిలాంటి ఉత్తరం రాయాల్సొస్తొందని కలలో కూడా అనుకోలేదు. కానీ.. రాస్తున్నాను. లోకంలో ఏ కొడుకూ తండ్రికి రాయకూడని విధంగా రాస్తున్నాను. నన్ను క్షమించండి!

నన్ను కని అమ్మ కన్ను మూసినప్పటి నుంచి నాకన్నీ మీరే అయి పెంచారు. తాతయ్య మీకు మరో పెళ్లి చేస్తానని పంతంపట్టినా, సవతి తల్లొస్తే నన్నెక్కడ సరిగ్గా చూసుకోదోనని మరో పెళ్ళికి మొరాయించిన మంచి నాన్న మీరు. అమ్మ బతికున్నా  మీ అంత బాగా చూసుకునేదో లేదో తెలీదు.

పదేళ్ళు  వంటి మీదకు వచ్చినా మీరే నాకు వళ్లు రుద్ది స్నానం చేయించేవారు. నా కిష్టమైనవన్నీ చేసి దగ్గరుండి కడుపు నిండా తినిపించేవారు. మంచి బట్టలు వేసి, శుభ్రంగా తయారుచేసి బడిదాకా వచ్చి దిగబెట్టేవారు. గేటు  దగ్గర నిలబడి లోపలికి పోనని నేను మారాం చేస్తే, 'బాగా చదువుకోవాలి. పెద్ద ఇంజనీరవాలి. అప్పుడే మంచి పెళ్లామొచ్చేది. మనింట్లో అమ్మ లేదు కదా! అప్పుడు నీ పెళ్లామే నాకూ, తాతయ్యకూ అమ్మ అవుతుందంటూ..' ఏవేవో తమాషా కబుర్లు చెప్పి లోపలికి పంపించేవారు.

క్లాసులో ఫస్ట్ ర్యాంకు వచ్చి స్కూల్ ఫంక్షన్ లో నేను ప్రైజ్ తీసుకోడానికి స్టేజ్ మీదకు వెళుతుంటే చిన్నపిల్లవాడిలా సంబరపడిపోయేవారు. మీకు కష్టం కలిగించే పని ఎప్పుడూ చేయనని ఒట్టేసుకున్నాను అప్పట్లో. ఆ ఒట్టు తీసి ఇప్పుడు గట్టు మీద పెట్టేస్తున్నాను నాన్నగారూ! నన్ను క్షమించండి!

సెవెన్త్ గ్రేడులో జిల్లా ఫస్టొచ్చినప్పుడు మీరు కొనిచ్చిన 'ప్రసాద్' మార్క్ పెన్నుఇంకా నా దగ్గరే భద్రంగా ఉంది. దానితోనే రాస్తున్నాను ఈ ఉత్తరాన్నిప్పుడు. మధ్యలో కొన్ని రోజులు శ్రావణి అడిగిందని ఇచ్చా. కానీ, తను మళ్లా తిరిగిచ్చేసిందిలేండి! శ్రావణి ఎవరనుకుంటున్నారు కదూ! అక్కడికే వస్తున్నా! ఆ సంగతి చెప్పడానికే ఈ ఉత్తరమిప్పుడు నాన్నగారూ!

తను టెన్త్ లో నా క్లాస్ మేట్. ఇంటర్ లో పోటీ. మా గ్రూప్ లో ఫస్ట్ ర్యాంక్ కోసం ఇద్దరం కొట్టుకు చచ్చేవాళ్లం. నేను ఎం.పి.సి తీసుకుని ఐ. ఐ. టి చెయ్యాలని మీ కోరిక. మొదటి సారి మీ మాట కాదన్నాను. బైపిసి కెళతానని మారాం చేశాను. శ్రావణి బైపిసి కెళ్ళింది. అందుకూ ఆ గోల. అప్పుడు మీకు చెప్పలేదు.

ఎమ్.సెట్ చేసే రోజుల్లో ‘గవర్నమెంట్ సీటంటే ఏదో తంటాలు పడతా. కానీ, ప్రయివేట్ కాలేజీ అంటే మాత్రం నేను పడలేనురా!' అని రోజుకోసారి హెచ్చరించేవారు మీరు. 'మంచి రేంకు తెచ్చుకుంటా'నని ప్రామిస్ చేశాను. మంచి రేంకే వచ్చినా కాకినాడ కాలేజీలో డొనేషన్ కట్టయినా చేరాల్సిందేనని మొండికేశాను. ఎందుకో తెలుసా నాన్నగారూ? శ్రావణి కొచ్చిన రేంకుకు అందులో మాత్రమే సీటొచ్చింది మరి. ఎక్కడ క్లాసు పీకుతారొనని ఆ సంగతీ మీకు చెప్పలేదు.'

పక్కగదిలో అలికిడయితే ఓపికచేసుకుని  లేచి వెళ్లి చూసొచ్చారు గోపాలకృష్ణయ్యగారు. మళ్లా ఉత్తరం చదువుకోడం మొదలుపెట్టారు.

 

'.. సాదర ఖర్చులకని డబ్బవసరమయితే హాస్టల్ ఛార్జీలు పెంచారనీ, బుక్సనీ, పరీక్ష ఫీజులనీ ఏదో ఓ వంకతో డబ్బులు పంపమని డిమాండ్ చేస్తుంటే.. ఒక్కసారైనా మీరు 'ఎందుకురా ఇంత డబ్బు?' అని ఆరా తీయలేదు. ఎంత తంటాలు పడేవారో! టంచన్ గా టి.ఎం.ఓ వచ్చేది! అంత పిచ్చిప్రేమ మీకు నా మీద. శ్రావణి మైకంలో పడి కొట్టుకుపోయే నాకు అవేమీ పట్టేవికాదు అప్పట్లో.

 

ఆమె ఫాదర్ ఇన్-కంటాక్సులో ఓ పెద్ద ఆఫీసర్. అందుకు తగ్గట్లే ఉండేవి ఆమె సరదాలు. తన ముందు తేలిపోకూడదని నేనూ తలకు మించిన భారం మోసేవాడిని. శ్రావణి ప్రేమ కోసం నేను పడని పాట్లు లేవు నాన్నగారూ! అందులో సగమైనా స్టడీస్ మీద చూపించుంటే ఫస్ట్ ఇయర్ అలా పోయేదే కాదు. శ్రావణి ఒకేడు ముందుకు పోయిందని నేనేడుస్తుంటే.. అదంతా పరీక్ష పోయినందుకని ఓదార్చారు మీరు. అప్పుడైనా చెప్పలేదు అసలు సంగతి.

శ్రావణి ఒన్ ఇయర్ సీనియర్ అయిపోయినా మా మధ్య స్నెహం చెదరలేదు సరికదా.. ప్రేమగా మారింది. మా ఎఫైర్ గురించి లోకమంతా కోడై కూస్తున్నా మీ చెవి దాకా రానేలేదు. వచ్చినా 'ఛఁ! మా శీను అలాంటి వాడు కాద’ని కొట్టిపారేసేవాళ్లే మీరు. మీ పిచ్చి ప్రేమ సంగతి నాకు తెలుసు కదా! దానికి ఆకాశమే హద్దు'

గ్రాడ్యుయేషన్ అయి పి.జిలో చేరగానే శ్రావణిని తెచ్చి మీకూ తాతయ్యకూ చూపించి 'ఇదిగో 'నాన్నగారూ! మీ అమ్మ!' అని సర్ప్రైజ్ చెయ్యాలని నా పిచ్చి ఆలోచన.

అన్నీ మనమనుకున్నట్లే అయిపోతే మధ్యలో దేవుడెందుకూ? శ్రావణి హౌస్ సర్జన్ లో ఉండగానే వాళ్లింట్లో పెళ్లి యావ ప్రారంభమయింది. తను వాళ్ల డాడీకి నా గురించి చెప్పింది. నన్ను తీసుకుని వెళ్లి పరిచయం చేసింది. శ్రావణివాళ్ల డాడీ మా డాడీలాగా కాదు నాన్నగారూ! చాలా ప్రాక్టికల్. "ప్రేమ అనేది ఒక అమ్మాయి.. అబ్బాయి మధ్య వ్యవహారం. అది పెళ్లి దాకా రావాలంటే రెండు కుటుంబాల మద్దతు అవసరం శ్రీనివాస్! నా దురదృష్టం కొద్దీ శ్రావణి మా బాస్ కొడుకు కంట్లో పడింది. ‘నో’ అంటే నా కెరీరుక్కూడా 'రిస్క్'. ఈమెకు కాక ఇంకో ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయాలి నేను. నా పొజిషన్ లో నువ్వుంటే ఏం చేస్తావో చెప్పు.. నేనూ అదే చేస్తాను' అన్నాడు ఆయన. నేనేమీ చెప్పక ముందే తను చేయాల్సిందేదో చేసేశాడు. బాస్ కొడుకుతో నిశ్చితార్థం సంగతి తెలిసి అడుగుదామని వెళితే ఆ ఇంట్లో అందరూ 'ఔటాఫ్ రీచ్'! పెళ్లయిన మర్నాడు రాత్రి శ్రావణి ఫోన్ చేసి 'సారీ! శీనూ! పెద్దవాళ్ల మాట కాదనలేకపోయాను' అని ఒక ముక్క చెప్పి లైన్ కట్ చేసేసింది.

శ్రావణి కోసం నేను తొమ్మిదేళ్ల బట్టీ వందల కొద్దీ అబద్ధాలు చెబుతూ వచ్చాను. ఆర్థికంగా మిమ్ములను ఎన్నో ఇబ్బందులు పెట్టాను. ఇంకొక్కసారి.. చివరిసారి..  ఇబ్బంది పెట్టక తప్పడం లేదు నాన్నగారూ! నన్ను క్షమించండి!

 

నా చిన్నతనంలో మన పెరట్లోని జామకాయల కోసం చెట్టెక్కినప్పటి సంగతి గుర్తుకొస్తోంది. చెట్టైతే ఎక్కాను గానీ.. దిగడం రాక ఏడుస్తున్నాను. మీ రొచ్చి 'దూకు! నేను పట్టుకుంటా!' అని భరోసా ఇచ్చారు. మీ మీది నమ్మకంతో దూకేశాను. మీరు పట్టుకోలేకపోయారు. మోకాలు చిప్పలు పగిలి ఏడుస్తుంటే కట్టు కట్టించి 'నీకు నువ్వే దిగడం వచ్చు అన్న ధీమా వచ్చిందాకా ఎక్కకూడదురా శీనూ!' అన్నారు. ఇరవై ఏళ్ల తరువాత సరిగ్గా మళ్లా అదే పొరపాటు చేశాను నాన్నగారూ!

వంటికి తగిలిన దెబ్బయితే మందు వేసుకుని మానిందాకా ఓ మూల ముసుగేసుకు పడుకోవచ్చు. ఇది మనసుకు తగిలిన గాయమే! తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది నాన్నగారూ! చిన్నప్పుడు మీరు నన్ను పట్టుకోకుండా వదిలేశారు కదా! నేనిప్పుడు మిమ్మల్ని వదిలేస్తున్నాను. చెల్లుకు చెల్లనుకోండి.. క్షమించండి నాన్నగారూ!

 

ఇన్నేళ్లు దాచిపెట్టి ఇదంతా ఇప్పుడే ఎందుకు చెబుతున్నావని మీరు అడగవచ్చు. ఇప్పుడు కూడా చెప్పకపోతే ఇంకెప్పుడూ చెప్పే ఛాన్స్ నాకు లేదు నాన్నగారూ! నేనేమీ చెప్పకుండా సైలెంటుగా వెళ్లిపోతే నా ఓటమికి కూడా మిమ్ములను మీరు బాధ్యులను చేసుకుని కుమిలిపోతారు. మీ పెంపకంలోని లోపం అనుకుంటారు. అది తప్పు. 'లోకంలోని ఏ తండ్రీ.. ఆ మాటకొస్తే.. ఏ తల్లీ.. తన బిడ్డను ప్రేమించలేనంత గొప్పగా మీరు నన్ను ప్రేమించారు. ఇది చెప్పడానికే ఈ చివరి ఉత్తరం ఇప్పుడు రాస్తున్నది. ఈసారి జన్మలో మళ్లీ మీకే కొడుకుగా పుట్టి నా తప్పుల్ని సరిదిద్దుకొంటా! గాడ్ ప్రామిస్! ఉంటా! .. టాటా! తాతయ్యకూ నా నమస్కారాలు, క్షమాపణలు తెలియచేయండి!'

ఇట్లు

ప్రేమతో

శ్రీనివాస్

 

పోలీసువారికి సూచనః నేను కృష్టలో స్నానానికని పోతున్నాను. తీరానికి తిరిగొచ్చేది నా నిర్జీవమైన శరీరమే! అనవసరంగా ఎవరినీ విసిగించవద్దని మనవి!

శ్రీనివాస్

---

నలిగి మాసిపోయి మడతలు దగ్గర పట్టుకుంటే చిరిగిపోయేటంతలా చీకిపోయిన ఆ పాత ఉత్తరాన్ని మళ్లా భద్రంగా మడతలు పెట్టి టేబుల్ సొరుగులో దాచి లేచారు గోపాలకృష్ణయ్యగారు నిట్టూరుస్తూ.

ఏడవడానికి ఆయన కళ్లలో నీళ్ళు లేవు. తొంభై ఏళ్లు దాటిన పండు ముదుసలి ఆయన ఇప్పుడు.

గోడ మీద ఉన్న దందేసిన ఫొటోలో నుండీ శ్రీనివాస్ చిరునవ్వుతో చూస్తున్నాడు.

'నీకేంరా నాయనా! నవ్వుతాలుగానే ఉంటుందిప్పుడు. ఏడాది కిందట నువ్వు క్రిష్ణాలో పడ్డావు. మీ నాయన కోమాలో పడ్డాడు. నీ ఉత్తరం చదువుకొనేందుకు వాడెప్పుడు స్పృహలో కొస్తాడో తెలీదు. నువ్వంటే జన్మనిచ్చిన తండ్రిని పున్నామ నరకానికి వదిలేసి పోయావు కానీ, జన్మనిచ్చిన పుణ్యానికి నేను నా కొడుకుని అట్లా అర్థాంతరంగా వదిలిపోలేను కదా! కొడుకుతో సేవలు చేయించుకొనే వయసులో కొడుకుకు సేవలు చేయమని భగవంతుడే నా నొసటన రాసి పెట్టాడు. భగవంతుడు కాదు నాయనా.. నువ్వే రాసి పెట్టి పోయావురా మనవడా!' అని గొణుక్కుంటూ కోమాలో పడివున్న కొడుకు మూలుగులు విని చూసేందుకు పక్కగదిలోకి వెళ్లారు గోపాలకృష్ణయ్యగారు.

-కర్లపాలెం హనుమంతరావు

(నవ్య వారపత్రికలో ప్రచురితం)

.

Saturday, December 11, 2021

నాన్నగారూ! నన్ను క్షమించండి!- కథానిక -కర్లపాలెం హనుమంతరావు (నవ్య వారపత్రికలో ప్రచురితం)


గోపాలకృష్ణయ్యగారు వణికే చేతుల్తో ఆ కాగితం మడతలు విప్పారు. అక్షరాలు అలుక్కుపోయినట్లున్నాయి. కూడబలుక్కుని చదువుకోడం మొదలుపెట్టారు గొణుక్కుంటున్నట్లు.

ప్రియమైన నాన్నగారికి,

నమస్కారం. నేనిలాంటి ఉత్తరం రాయాల్సొస్తొందని కలలో కూడా అనుకోలేదు. కానీ.. రాస్తున్నాను. లోకంలో ఏ కొడుకూ తండ్రికి రాయకూడని విధంగా రాస్తున్నాను. నన్ను క్షమించండి!

నన్ను కని అమ్మ కన్ను మూసినప్పటి నుంచి నాకన్నీ మీరే అయి పెంచారు. తాతయ్య మీకు మరో పెళ్లి చేస్తానని పంతంపట్టినా, సవతి తల్లొస్తే నన్నెక్కడ సరిగ్గా చూసుకోదోనని మరో పెళ్ళికి మొరాయించిన మంచి నాన్న మీరు. అమ్మ బతికున్నా  మీ అంత బాగా చూసుకునేదో లేదో తెలీదు. పదేళ్ళు వచ్చినా మీరే నాకు వళ్లు రుద్ది స్నానం చేయించేవారు. నా కిష్టమైనవన్నీ చేసి దగ్గరుండి కడుపు నిండా తినిపించేవారు. మంచి బట్టలు వేసి, శుభ్రంగా తయారుచేసి బడిదాకా వచ్చి దిగబెట్టేవారు. గేటు  దగ్గర నిలబడి లోపలికి పోనని నేను మారాం చేస్తే 'బాగా చదువుకోవాలి. పెద్ద ఇంజనీరవాలి. అప్పుడే మంచి పెళ్లామొచ్చేది. మనింట్లో అమ్మ లేదు కదా! అప్పుడు నీ పెళ్లామే నాకూ, తాతయ్యకూ అమ్మ అవుతుందంటూ.. 'ఏవేవ్ తమాషా కబుర్లు చెప్పి లోపలికి పంపించేవారు.

క్లాసులో ఫస్ట్ ర్యాంకు వచ్చి స్కూల్ ఫంక్షన్ లో నేను ప్రైజ్ తీసుకోడానికి స్టేజ్ మీదకు వెళుతుంటే చిన్నపిల్లవాడిలా సంబరపడిపోయేవారు. 'మీకు కష్టం కలిగించే పని ఎప్పుడూ చేయనని ఒట్టేసుకున్నాను' అప్పట్లో. ఆ ఒట్టు తీసి ఇప్పుడు గట్టు మీద పెట్టేస్తున్నాను. నాన్నగారూ! నన్ను క్షమించండి!

సెవెన్త్ గ్రేడులో జిల్లా ఫస్టొచ్చినప్పుడు మీరు కొనిచ్చిన 'ప్రసాద్' మార్క్ పెన్నుఇంకా నా దగ్గరే భద్రంగా ఉంది. దానితోనే రాస్తున్నాను ఈ ఉత్తరాన్ని. మధ్యలో కొన్ని రోజులు శ్రావణి అడిగిందని ఇచ్చా. కానీ, తను మళ్లా తిరిగిచ్చెసిందిలే! శ్రావణి ఎవరనుకుంటున్నారు కదూ! అక్కడికే వస్తున్నా! ఆ సంగతి చెప్పడానికే ఈ ఉత్తరం నాన్నగారూ!

తను టెన్త్ లో నా క్లాస్ మేట్. ఇంటర్ లో పోటీ. గ్రూప్ లో ఫస్ట్ ర్యాంక్ కోసం ఇద్దరం కొట్టుకు చచ్చేవాళ్లం. నేను ఎం.పి.సి తీసుకుని ఐ. ఐ. టి చెయ్యాలని మీ కోరిక. మొదటి సారి మీ మాట కాదన్నాను. బైపిసి కెళతానని మారాం చేశాను. శ్రావణి బైపిసి కెళ్ళింది. అందుకే ఆ గోల. అప్పుడు మీకు చెప్పలేదు. ఎమ్.సెట్ చేసే రోజుల్లో గవర్నమెంట్ సీటంటే ఏదో తంటాలు పడతా. కానీ, ప్రయివేట్ కాలేజీ అంటే నేను పడలేనుర!' అని రోజుకో సారి హెచ్చరించేవారు మీరు. 'మంచి రేంకు తెచ్చుకుంటా'నని ప్రామిస్ చేశాను. మంచి రేంకే వచ్చినా కాకినాడ కాలేజీలో డొనేషన్ కట్టయినా చెరాల్సిందేనని మొండికేశాను. ఎందుకో తెలుసా నాన్నగారూ? శ్రావణి కొచ్చిన రేంకుకు అందులో మాత్రమే సీటొచ్చింది మరి. ఎక్కడ క్లాసు పీకుతారొనని ఆ విషయమూ మీకు చెప్పలేదు.'

పక్కగదిలో అలికిడయితే ఓపికచేసుకుని  లేచి వెళ్లి చూసొచ్చారు గోపాలకృష్ణయ్యగారు. మళ్లా ఉత్తరం చదువుకోడం మొదలుపెట్టారు.

 

'.. సాదర ఖర్చులకని డబ్బవసరమయితే హాస్టల్ ఛార్జీలు పెంచారనీ, బుక్సనీ, పరీక్ష ఫీజులని ఏదో ఓ వంకతోడబ్బులు పంపమని డిమాండ్ చేస్తుంటే.. ఒక్కసారైనా మీరు 'ఎందుకురా ఇంత డబ్బు?' అని ఆరా తీయలేదు. ఎంత తంటాలు పడేవారో! టంచన్ గా టి.ఎం.ఓ వచ్చేది! అంత పిచ్చిప్రేమ మీకు నా మీద. శ్రావణి మైకంలో పడి కొట్టుకుపోయే నాకు అవేమీ పట్టేవికాదు అప్పట్లో.

 

ఆమె ఫాదర్ ఇన్-కంటాక్సులో ఓ పెద్ద ఆఫీసర్. అందుకు తగ్గట్లే ఉండేవి ఆమె సరదాలు. తన ముందు తేలిపోకూడదని నేనూ తలకు మించిన భారం మోసేవాడిని. శ్రావణి ప్రేమ కోసం నేను పడని పాట్లు లేవు నాన్నగారూ! అందులో సగమైనా స్టడీస్ మీద చూపించుంటే ఫస్ట్ ఇయర్ అలా పోయేది కాదు. శ్రావణి ఒకేడు ముందుకు పోయిందని నేనేడుస్తుంటే.. అదంతా పరీక్ష పోయినందుకని ఓదార్చారు మీరు. అప్పుడైనా చెప్పలేదు అసలు సంగతి. శ్రావణి ఒక్ ఇయర్ సీనియర్ అయిపోయినా మా మధ్య స్నెహం చెదరలేదు సరికదా.. ప్రేమగా మారింది. మా ఎఫైర్ గురించి లోకమంతా కోడై కూస్తున్నా మీ చెవి దాకా రాలేదు. వచ్చినా 'ఛఁ! మా శీను అలాంటి వాడు కాదని కొట్టిపారేసేవాళ్లే మీరు. మీ పిచ్చి ప్రేమ సంగతి నాకు తెలుసు కదా! దానికి ఆకాశమే హద్దు'

గ్రాడ్యుయేషన్ అయి పి.జిలో చేరంగానే శ్రావణి తెచ్చి మీకూ తాతయ్యకూ చూపించి 'ఇదిగో 'నాన్నగారూ! మీ అమ్మ!' అని సర్ప్రైజ్ చెయ్యాలని నా పిచ్చి ఆలోచన.

అన్నీ మనమనుకున్నట్లే అయిపోతే మధ్యలో దేవుడెందుకూ? శ్రావణి హౌస్ సర్జన్ లో ఉండగానే వాళ్లింట్లో పెళ్లి యావ ప్రారంభమయింది. తను వాళ్ల డాడీకి నా గురించి చెప్పింది. నన్ను తీసుకుని వెళ్లి పరిచయం చేసింది. శ్రావణివాళ్ల డాడీ మా డాడీలాగా కాదు నాన్నగారూ! చాలా ప్రాక్టికల్. "ప్రేమ అనేది ఒక అమ్మాయి.. అబ్బాయి మధ్య వ్యవహారం. అది పెళ్లి దాకా రావాలంటే రెండు కుటుంబాల మద్దతు అవసరం శ్రీనివాస్! నా దురదృష్టం కొద్దీ శ్రావణి మా బాస్ కొడుకు కంట్లో పడింది. నో అంటే నా కెరీర్ క్కూడా 'రిస్క్'. ఈమెకు కాక ఇంకో ఇద్దరు ఆడపిల్లలకు కూడా పెళ్లిళ్లు చేయాలి నేను. నా పొజిషన్ లో నువ్వుంటే ఏం చేస్తావో చెప్పు.. నేనూ అదే చేస్తాను' అన్నాడు ఆయన. నేనేమీ చెప్పక ముందే తను చేయాల్సింది చేసేశాడు. బాస్ కొడుకుతో నిశ్చితార్థం సంగతి తెలిసి అడుగుదామని వెళితే ఆ ఇంట్లో అందరూ 'ఔటాఫ్ రీచ్'. పెళ్లయిన మర్నాడు రాత్రి శ్రావణి ఫోన్ చేసి 'సారీ! శీనూ! పెద్దాళ్ల మాట కాదనలేకపోయాను' అని ఒక ముక్క చెప్పి లైన్ కట్ చేసేసింది.

శ్రావణి కోసం నేను కొన్ని తొమ్మిదేళ్ల బట్టీ వందల కొద్దీ అబద్ధాలు చెబుతూ వచ్చాను. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పెట్టాను. ఇంకొక్కసారి.. చివరిసారి..  ఇబ్బంది పెట్టక తప్పడం లేదు నాన్నగారూ! నన్ను క్షమించండి!

 

నా చిన్నతనంలో మన పెరట్లోని జామకాయల కోసం చెట్టెక్కినప్పటి సంగరి గుర్తుకొస్తోంది. చెట్టైతే ఎక్కాను గానీ.. దిగడం రాక ఏడుస్తున్నాను. మీ రొచ్చి 'దూకు! నేను పట్టుకుంటాను!' అని భరోసా ఇచ్చారు. మీ మీది నమ్మకంతో దూకేశాను. మీరు పట్టుకోలేకపోయారు. మోకాలు చిప్పలు పగిలి ఏడుస్తుంటే కట్టు కట్టించి 'నీకు నువ్వే దిగడం వచ్చు అన్న ధీమా వచ్చిందాకా ఎక్కకూడదురా శీనూ!' అన్నారు. ఇరవై ఏళ్ల తరువాత సరిగ్గా మళ్లా అదే పొరపాటు చేశాను నాన్నగారూ! వంటికి తగిలిన దెబ్బయితే మందు వేసుకుని మానిందాకా ఓ మూల ముసుగేసుకు పడుకోవచ్చు. ఇది మనసుకు తగిలిన దెబ్బే! తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది నాన్నగారూ! చిన్నప్పుడు మీరు నన్ను పట్టుకోకుండా వదిలేశారు కదా! నేనిప్పుడు మిమ్మల్ని వదిలేస్తున్నాను. చెల్లుకు చెల్లనుకోండి.. క్షమించండి నాన్నగారూ!

ఇన్నేళ్లు దాచిపెట్టి ఇదంతా ఇప్పుడే ఎందుకు చెబుతున్నావని మీరడగవచ్చు. ఇప్పుడు కూడా చెప్పకపోతే ఇంకెప్పుడూ చెప్పే ఛాన్స్ నాకు లేదు నాన్నగారూ! నేనేమీ చెప్పకుండా సైలెంటుగా వెళ్లిపోతే నా ఓటమికి కూడా మిమ్ములను మీరు బాధ్యులను చేసుకుని కుమిలిపోతారు. మీ పెంపకంలోని లోపం అనుకుంటారు. అది తప్పు. 'లోకంలోని ఏ తండ్రీ.. ఆ మాటకొస్తే.. తల్లీ.. తన బిడ్డను ప్రేమించలేనంత గొప్పగా మీరు నన్ను ప్రేమించారు.' ఇది చెప్పడానికే ఈ చివరి ఉత్తరం రాస్తున్నాను. ఈ సారు జన్మలో మళ్లీ మీకే కొడుకుగా పుట్టి నా తప్పుల్ని సరిదిద్దుకొంటా! ..గాడ్ ప్రామిస్! ఉంటా .. టాటా! తాతయ్యకూ నా నమస్కారాలు , క్షమాపణలు తెలియచేయండి!'

ఇట్లు

ప్రేమతో

శ్రీనివాస్

పోలీసువారికి సూచనః నేను కృష్టలో స్నానానికని పోతున్నాను. తీరానికి తిరిగొచ్చేది నా నిర్జీవమైన నా శరీరమే! అనవసరంగా ఎవరినీ విసిగించవద్దని ఆఖరి మనవి!

శ్రీనివాస్

---

నలిగి మాసిపోయి మడతలు దగ్గర పట్టుకుంటే చిరిగిపోయేటంతలా చీకిపోయినా ఆ పాత ఉత్తరాన్ని మళ్లా భద్రంగా మడతలు పెట్టి టేబుల్ సొరుగులో దాచి లేచారు గోపాలకృష్ణయ్యగారు నిట్టూరుస్తూ.

ఏడవడానికి ఆయన కళ్లలో నీళ్ళు లేవు ఇప్పుడు. తొంభై ఏళ్లు దాటిన పండు ముదుసలి ఆయన ఇప్పుడు.

గోడ మీద ఉన్న దందేసిన ఫొటోలో నుండీ శ్రీనివాస్ చిరునవ్వుతో చూస్తున్నాడు.

'నీకేంరా నాయనా! నవ్వుతాలుగానే ఉంటుందిప్పుడు. ఏడాది కిందట నువ్వు క్రిష్ణాలో పడ్డావు. మీ నాయన కోమాలో పడ్డాడు. నీ ఉత్తరం చదువుకొనేందుకు వాడెప్పుడు స్పృహలో కొస్తాడో తెలీదు. నువ్వంటే జన్మనిచ్చిన తండ్రిన పున్నామ నరకానికి వదిలేసి పోయావు కానీ, జన్మనిచ్చిన పుణ్యానికి నేను నా కొడుకుని ఇట్లా అర్థాంతరంగా వదిలిపోలేను కదా! కొడుకుతో సేవలు చేయించుకొనే వయసులో కొడుకుకు సేవలు చేయమని భగవంతుడే నా నొసటన రాసి పెట్టాడు. భగవంతుడు కాదు.. నువ్వే రాసి పెట్టి పోయావురా మనవడా!' అని గొణుక్కుంటూ కోమాలో పడివున్న కొడుకును చూసేందుకు పక్కగదిలోకి వెళ్లారు గోపాలకృష్ణయ్యగారు.

-కర్లపాలెం హనుమంతరావు

(నవ్య వారపత్రికలో ప్రచురితం)

Saturday, April 10, 2021

ఉల్లి పగ - ఈనాడు - వ్యంగ్యం -కర్లపాలెం హనుమంతరావు


యమధర్మరాజుగారి దగ్గరకో విచిత్రమైన కేసు విచారణకొచ్చిందా రోజు.

 

ప్రేమ విఫలమయితేనో, పరీక్షలు ఫెయిలయితేనో, అప్పుల వత్తిడి తట్టుకోలేకనో, పెళ్లాం   బాధలు ఓర్చుకోలేకనో, వ్యాపారం కుదేలయితేనో, పెళ్లీ పెటాకులు కుదరకుంటేనో.. సాధారణంగా ఈ బాపతు సవాలక్ష కారణాలు కద్దు సాధారణ మనుషులు ప్రాణాలు రద్దుచేసుకోడానికి. కిలో ఉల్లి వంద పెట్టి కొనే తాహతు లేక ఉసురు తీసుకున్న సగటు జీవిని విచారించే చేదనుభవం ఇదే మొదటిసారి ఇన్ని మన్వంతరాలుగా ధర్మవిచారణ బాధ్యత నిర్వహించే యమధర్మరాజులుంగారికి.

 

విచారణ మొదలయింది.

 

'నేరం నాది కాదు మహాప్రభో! ఉల్లిపాయది. ముందు తమరు విచారించి శిక్షించవలసింది ఉల్లిగడ్డను' అని గుడ్ల నీరు కుక్కుకుంది సగటు జీవి ఆత్మ.

 

ఉల్లితొక్కు సమవర్తి సమ్ముఖానికి కొనిరాబడింది.

 

'అంతలేసి ధరలకు నన్నమ్మిన వ్యాపారిని విచారించడం ధర్మం.. నన్నిలా బోనులో నిలబెట్టడమే న్యాయానికి మహా అన్యాయం!'  కన్నీళ్ల వంతు ఈసారి ఉల్లిదయింది.

 

'లాభానికి కా’పోతే నష్టానికి చేసుకుంటామా ఎవరవై’నా ఏ వ్యాపారమైనా! టోకుదారుడి దగ్గర నుంచి సరుకు కొన్నదే కిలో అరవైకి; రవాణా, కూలీ మోత వగైరా ఖర్చులన్నీ అచ్చుకుంటే చివరకు  మిగిలేదే రూపాయికి రెండు పైసలు యమధర్మరాజా! డాలరుకే విలువలేని మాయదారి కాలంలో రెండు పైసల్లాభవూఁ  దారణమంటం మహాదారుణం దయామయా!' అంటూ పద్దు బుక్కులు చూపించి మరీ బుకాయించేసింది చిల్లర వ్యాపారి టక్కరి ఆత్మ.

 

టోకు వ్యాపారి ఆత్మేమన్నా తక్కువ 'తిన్న'దా? 'ఉల్లి పండించే రైతేమీ ఫలసాయం ఉదారంగా మాకు ధారపోయటంలా సామీ! ధర గిట్టుబాటు కాకుంటే దారికడ్డంగా అయినా పారబోసుకుంటాడే తప్పించి తమాషాకైనా  తక్కువ రేటుకు మా తక్కెట్లో తూకానికేయడంలా! ఈ ఉల్లితొక్క వ్యాపారం తప్ప మరో చెత్త పని చేతరాని చెవటంలం, ఇంకో దారి లేకనే ఇంకా ధర పడిందాక నిలబడే ఓపిక లేక, చెప్పిం ధరకు చచ్చినట్లు కొనిచావడం! సీజన్లో కొన్న సరుకు కరువు రోజుల్దాకా కుళ్లు బైటక్కనబడకుండా దాచాలంటే.. ఇనుమా  బంగారమా ఇది! ఎన్ని ఇడుములు పడితే రెండు రాళ్లు ఈ గడ్డల వ్యాపారంలో కళ్లచూడ్డం..  దేవరవారు దయుంచాల. గోదాముల నుంచి గోతాల వరకు అన్నింటికీ ఎదురు దేకుళ్లే మహాదేవరా! మా లోకం పందికొక్కు పర్మినెంటు అడ్డాలు  గిడ్డంగులే మహాప్రభో.. ఎన్ని శతాబ్దాలకని లీజుకు తీసుకుచచ్చాయే దేవుడికే ఎరిక! ఎంత మంది లంచగొండులకు ఎన్నిందాలుగా అవీ.. ఇవీ సమర్పించుకుంటే మేమీ ముత్తెమంత లాభంతో అయినా గట్టున పడ్డం! ముందు న్యాయం జరగాల్సింది ఆగమాగమయ్యే మా టోకు వ్యాపారుల త్యాగానికి' ఆవటా  అంటూ హోలుసేలు వ్యాపారస్తుడాత్మ విన్నవింపులు.

 

యమధర్మరాజుగారికి ముందుకు పోయే  దారేదీ దరిదాపుల్లో కనిపించింది కాదు.

 

'మానవులు మహా మాయదారి జీవులు మహాప్రభో!  సత్యవంతుడి కథలోనే తమరా చేదనుభవం చవిచూసుంటిరి గదా! గిడ్డంగులు, గోతాలు గట్రా సరుకు సరఫరాలో తాత్సారానికి కారకులెవ్వరు? ఆ దిశగా విచారణ తిరిగి కొనసాగితే గాని శుద్ధసత్యమేదో బైటపడే యోగంలేదు'

 

చిత్రగుప్తుడి సూచనతో ఉత్సాహం తిరిగి పుంజుకుంది యమధర్మరాజుగారి బుర్రలో.

 

నిపుణుల కమిటీ ఏర్పాటవడం.. నిమిషాల మీదట నివేదిక  సమర్పణవడమూ అయింది. 

 

'గోదాములు లేకుంటేనేమి? అంత కన్నా ధారాళంగా ప్రభుత్వ పాఠశాలల భూమి అందుబాటులో ఉంది  బడావ్యాపారులకు. వాస్తవ  పందికొక్కులు తిండి  కోసమే  అంతలేసి ధరలు పెట్టి ఉల్లితుక్కును ఏ తుగ్లక్కూ కొనడు; వాస్తవానికి  బైటి కొక్కుల బొక్కుళ్లక్కూడా సరిపడా ఆదాయం ఉండక తప్పదు.. కాబట్టే   వృత్తిధర్మ రీత్యా  నిబద్ధతో దోపిడీ కొనసాగడం! తప్పట్టలేం!  కష్టించే   ప్రతీ శ్రమజీవికీ.. తన వంతు మూల్యం దక్కడమే న్యాయం. చెమటోడ్చనిదే  చెమట దోపిడీ అయినా సక్రమంగా సాగదు. అక్రమార్జన అయినప్పటికిన్నీ ఆ ఆదాయానికి గండికొట్టే చర్యలు తగవు. విత్తు మొలకెత్తు వరకు నకిలీదో కాదో కొనేవాడికి మల్లేనే అమ్మి సొమ్ముచేసుకొనే దొంగవ్యాపారికీ తెలిసే అవకాశం  లేదు. నకిలీ సరుకు అమ్ముకునే వాడి మీద కొరదా ఝళిపించడం సమధర్మానికి భంగకరం. పురుగుమందు నాణ్యతలో లోపమే  ఫలసాయం తరుగుదలకు ప్రధాన కారణమని  బాధిత రైతు అత్మ అభియోగం! అదే పురుగుమందు తాగిన కారణంగానే   ఇదే రైతు నిరాటంకంగా ఇప్పుడు మన ముందు నిలబడి ఉన్నాడు;  ఆ కారణంగా ఆ అభియోగం నిష్కారణంగా మోపబడిందని భావిస్తున్నాం.

 

నీటి వనరుల కొరత ఒక కారణమైతే; వానలు సకాలంలో పడక కొంత, పడ్డా అది అకాలమవడమో, అవసరానికి మించి పడడమో మరికొంత.. పంట దిగుబడి దెబ్బతినేందుకు ఈ తరహా ఇతరేతర  ముఖ్య కారణాలింకెన్నెన్నో. రుతుపవనాల క్రమశిక్షణారాహిత్యంపైన కఠిన చర్యలు  ఆహ్వానీయమే.. కాని వరుణదేవుని పై విచారణ  యమధర్మరాజు పరిధిలో లేదు. చివరగా, చేతికందిన పంటను బతుకుతెరువు కోసమై అధిక ధరలకు అమ్ముకునే అన్నదాతను తప్పట్టడమే అన్నిందాలా ఉచితం.  సాగుభూమిని లాభాపేక్షతో భవననిర్మాణ  రంగాలకు ధారపోసే రైతూ  సహనిందితుడే! కానీ, రైతన్నే రాజు కనుక, రాజుని శిక్షించే అధికారం యమధర్మరాజుకైనా రాజ్యాంగం ధారపోయలేదు కాబట్టి...'

 

విచారణ సంఘం చేంతాడు నివేదిక  అనంతరమూ ఎవరి పై ఏ చర్య తీసుకొనడం ఉచితమో సాక్షాత్ యమధర్మరాజులవారికే అంతుబట్టింది కాదు. అయోమయం మరింత పెరిగడం ఆఖరి ఫలశ్రుతి. 

 

కేసు విచారణ మన్వంతరాల తరబడి నాన్చడమూ న్యాయసమ్మతం కాదనే నియమం కూడా ఉంది. ఈ నేపథ్యంలో మయధర్మరాజుగారి మేధ  నుంచి వచ్చిన  తీర్పు నరకలోక   నేర విచారణ చరిత్రలోనే కొత్త సంప్రదాయానికి నాంది పలికింది.

 

కోరుకున్న జన్మను సగటు జీవికి ఆత్మకు ప్రసాదించి తిరిగి భూమ్మీదకి పమ్మించేయడమే ఆ విచిత్రమైన తీర్పు!

 

'మహాప్రభో! అన్నదాత బతుకు పగవాడికైనా వద్దు. పేరుకే దేశానికి అతగాడు వెన్నెముక కాని, కన్నా   గాడిదకు మించిన దైన్యం అతగాది  హీనం. చిల్లర మల్లర వ్యాపారి బతుకైతే అసలుకే  వద్దు. అల్లరి చిల్లర అయిపోవడం మించి  ఒరిగేదేమీ లేదు చిరువ్యాపారికి.  టోకు వ్యాపారి బతుక్కథా డిటోనే స్వామీ!  పైన పటారం.. లోన లొటారం! ఆ పద్దు బుక్కుల  వ్యాపారమూ నా కొద్దనే వద్దు. పంది కొక్కు బతుకు కొద్దిగా సుఖమే కాని, చూస్తూ చూస్తూ మరీ బొక్కుడు బతుకా? నో.. వే! పురుగు మందుగా పుట్టడం బెటరే! కానీ.. నకిలీల పుణ్యమా అని చంపాలన్నంత పగ కచ్చితంగా తీరుతుందో లేదో..   చివరిదాకా తేలదు.'

 

అందుకే  ముందే ఆలోచించి పెట్టుకున్నట్లుగా.. అందరి మీదా ఒకే సారి ఎప్పుడైనా టోకున బదలా తీర్చుకునే జన్మను చివరకు ఎంచుకున్నది సగటు జీవి అత్మ. 

అదే ఉల్లి జీవితం.

 

ఎవరు అడ్డంగా, నిలువునా కోసినా కన్నీళ్లు కార్పించడమే కాదు, ఎన్నికల వేళల్లో హఠాత్తుగా అటకెక్కి  కిందకు దిగకుండా.. ఓటరును రెచ్చగొట్టి ఠపీమని పాలకులను పడగొట్టేయడం ఉల్లి స్పెషాలిటీ!'

 

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు- వ్యంగ్యం - 25నవంబర్, 2013 ప్రచురితం)



Wednesday, March 3, 2021

పరిష్కారం - కథానిక- ఈనాడు ఆదివారం అనుబంధం -కర్లపాలెం హనుమంతరావు

 


బ్యాంక్ ఇన్ స్పెక్షన్ పని మీద బాపట్ల వచ్చా. బయలుదేరినప్పటి నుంచి ఒకటే ముసురు. మధ్యలో వచ్చిన ఆదివారం చీరాల బయలుదేరా. అక్కడ మా మా మరదలు జయలక్ష్మి భర్త సాల్మన్ ఆసుపత్రిలో కాంపౌండర్ గా పనిచేస్తున్నాడు. ప్రసాద్ అనుకుంటా అతని పేరు.

జయ ఇంటి అడ్రస్ పట్టుకునే వేళకు చీకటి చిక్కబడింది. వర్షానికి బట్టలు బాగా తడిశాయి. నన్ను చూడగానే జయ మొహం చాటంతయింది.

ప్రసాద్ ఊళ్లో లేడు. చెల్లెలి కొడుక్కి బారసాలని అద్దంకి వెళ్లాట్ట. 'రాత్రి కొస్తాడులే బావా! రాక రాక వచ్చావు. ఈ పూటకు ఉండిపో!' అంటూ మహా బలవంతం దానిది. ప్రసాదుకి ఫోన్ చేసి 'మనల్ని చూడ్డానికి మా ప్రసాదు బావ వచ్చాడండీ! ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా మీరు బైలుదేరిరావాల్సిందే' అని ఫోన్ లోనే ఆర్డరేసింది. అవతల అతనే మన్నాడో గాని సెల్ నా చేతికందింస్తే 'సారీ బ్రదర్! సమయానికి ఇంట్లో లేకుండా పోయా. ఇక్కడా బ్రహ్మాండమైన వర్షం. లాస్ట్ బస్ డౌటే! మాగ్జిమమ్ ట్రయ్ చేస్తా! మీరయితే ఉండి పోండి.. రేపు మాట్లాడుకుందాం' అన్నాడు. ‘గాలికి, వానకు ఈపూరుపాలెం దగ్గర కాలువ పొంగి రోడ్డు మీదకు నీళ్ళు పారుతున్నాయ్! బస్సులూ రైళ్ళూ ఎక్కడివక్కడ బంద్!' అని చెప్పిపోయాడు  పాలు పోసెళ్ళే అబ్బాయ్. ఇహ చేసేదేముంది? జయ వాళ్లాయన పొడి బట్టల్లోకి మారి టి.వి చూస్తూ కూర్చున్నా.

 

జయలక్ష్మి మా మేనమామ కూతురు. చిన్నప్పుడు దీన్నంతా నా పెళ్లామంటూ ఆటపట్టించేవాళ్లు. నేను వైజాగ్ లో ఎమ్మెస్సీ చేసే రోజుల్లో తను ఇంటర్. కోచింగ్ సెంటర్ మాష్టారెవరో వెంట బడితే ..పిచ్చిది.. నమ్మింది. ఇద్దరూ కలసి ఓ రోజు మాయం. మామయ్యెంత వెదికించినా ఆచూకీ దొరకలేదు. అత్తయ్య మంచం పట్టింది. మూణ్ణెల్ల తరువాత తనొక్కతే ఏడుస్తూ తిరిగొచ్చిందని విన్నా. నాకు చేసుకోన్నాడు మామయ్య. అమ్మ పడనీయలే. ఆ తరువాతే ఈ యానాం సంబంధానికి ఇచ్చి చేసింది.  పెళ్ళికి ఎవరికీ పిలుపుల్లేవు. మామయ్య పోయిం తరువాత అత్తయ్య చాలాకాలం కూతురు దగ్గరే గడిపింది. ప్రసాద్ మొన్నీ మధ్య దాకా దుబాయ్ లో ఉండొచ్చాడు. అల్లుడు తిరిగి రాగానే అత్తయ్య తన తమ్ముడు పంచన చేరింది ఎందుకో! జయలక్ష్మికి ఇప్పుడు ఏడాదిన్నర పాప.

జయలో మునుపటి కళ లేదు. 'చూసి చాలా కాలమయింది కదా! అందుకే అలా అనిపిస్తిందేమోలే!' అనుకున్నా. ఆ చీకట్లోనే విందుభోజనంలోలా చాలా చేసింది. తనింత బాగా చేస్తుందనుకోలేదు. శ్రద్ధగా అసలు చేస్తుందనుకోలేదు.

పాప అప్పటికే నిద్రకు పడింది. వంటిల్లు సర్దుకుంటూ 'తనింక రాడు కానీ, నువ్వెళ్లి మా బెడ్ రూంలో పడుకో బావా! నేనొస్తున్నా' అంది.

అటు వైపు తొంగి చూస్తే అక్కడ ఒకటే సింగిల్ కాట్! నేను షాక్!

షాకివ్వడం జయకు ఇది మొదటిసారి కాదు.

నా డిగ్రీ  రోజుల్లో ఓ సారి ఇంతకన్నా పెద్ద షాకే ఇచ్చింది మహా తల్లి. ఆ సారి వేసవి సెలవులకని  మామయ్యావాళ్ళ ఊరు వెళ్లాం మేం. ఆ ఊరికి సముద్రం దగ్గర. అందరం స్నానాలకని బైలుదేరాం. పెద్దాళ్లు సరుగుతోటల్లో భోజనాలు సిద్ధం చేస్తున్నారు. జయను మంచి నీళ్లు తెమ్మంటే బిందె తీసుకుని బైలుదేరింది. వెనకాలే చేదతో తోకలా నేను. ఇదా రోజుల్లో దోరమామిడి పండులా ఉండి కుర్రాళ్లను బాగా ఇబ్బందిపెట్టేది. బిందెను చంకలోకి ఎత్తే టైములో తట్టుకోలేక నేనూ చటుక్కుమని ఓ చెంప మిద ముద్దెట్టేశా.  అది షాకయింది. వెంటనే తేరుకొని 'ఒకసారి బిందె దించు బావా!' అంది తాపీగా. ఇంకో ముద్దు కోసమేమోనని నేను సంబర పడ్దంత సేపు పట్టలే. చేతులు ఖాళీ అవగానే నా రెండు చెంపలు రెండు సార్లు టపటపా వాయించేసింది. 'ఒక ముద్దేగా ఇచ్చింది. రెండు సార్లెందుకే కొట్టావ్ రాక్షసీ?'అనడిగితే

'ఒకటి ఇప్పుడు చేసిన పిచ్చి పనికి. ఇంకోటి ఇక ముందెప్పుడూ చెయ్యకుండా ఉండటానికీ! నా బుగ్గల్ని టచ్ చేసే హక్కు ఒక్క నాగరాజు సార్ కే ఉంది.. మైండిట్' అంది.

'వాడెవడే?' అనడిగా నా మైండ్ ఖారాబయి.

'నాక్కోయే మొగుడండీ బావగారూ!' అంది.

అదీ నా మొదటి షాక్! తేరుకుని 'ఇంట్లో తెలుసా?' అని అడిగితే.

'చెప్పలేదు. నువ్వూ చెప్పద్దు! చెప్పావో నేను చచ్చినంత ఒట్టే' అని బిందె మీదికి తీసుకుంది.

ఇది నిజంగా ఎక్కడ చస్తుందో అన్న భయంతో నేనూ ఇంట్లోవాళ్లవరికీ చెప్పలేదప్పట్లో.

***

పాప ఏడుపుతో ఈ లోకంలోకొచ్చి పడ్డా. కేండిల్ ఆరిపోయివుంది. చీకటికి భయపడనుకుంటా ఆ ఏడుపు. కొవ్వొత్తి వెలిగించి పెట్టి పాపను జోకొట్టి నిద్రపుచ్చి ఇంకో వెలిగించిన కేండిల్తో ఈ గదిలో కొచ్చింది. గాలికి కొవ్వెత్తి ఆరిపోకుండా కిటికీ తలుపులు మూస్తూ 'నువ్వొచ్చినప్పట్నుంచి చూస్తున్నా. ఏంటి బావగారూ ఊరికే తెగ ఆలోచించేస్తున్నారూ?' అని అడిగింది జయ.

ఏమని చెప్పాలి దీనికి?

'నాకంతా తెలుసులే! అసలిక్కడేం జరుగుతుందో కూపీ తీసి రమ్మని పంపించింది కదూ అత్తయ్య? మా అమ్మేదో అత్తయ్యకు చెప్పుకుని ఏడ్చుంటుంది. అవునా?' అని సూటిగా అడిగేసిందీసారి ఓ కుర్చీ నా బెద్ పక్కకే లాక్కుని కూర్చుని.

'జయ ఈ మధ్య మాటి మాటికి అత్తయ్యకు ఫోన్ చేసి ఇంటి కొచ్చేస్తానని ఏడుస్తోందిట్రా! ఏం జరుగుతుందో.. ఏంటో కాస్త కనుక్కో వీలయితే!' అని అమ్మ నేనిక్కడకొచ్చే ముందు హెచ్చరించిన మాట నిజమే.

'ఒక రకంగా అమ్మావాళ్లే నా బతుకును నరకం చేశారు బావా! వద్దన్నా నాన్న నాకీ పెళ్లిచేశాడు' అంది నిష్ఠురంగా. ఎప్పుడో పోయిన మామయ్యను ఇప్పుడిది తప్పుపడుతోంది  అన్యాయంగా.. చేసిందంతా తను చేసుకుని.

'ప్రసాదు మంచివాడు కాదా?' అనడిగాను హఠాత్తుగా. వచ్చినప్పట్నుంచి అడగాలనుకుంటున్న సందేహం అది.

'నువ్వు మంచాడివా కాదా?!' ఎదురడిగింది జయ.

‘ఆ సంగతి నువ్వు కదే చెప్పాలి!’ అన్నా ఈ సంగతి ఎటు తిరిగి ఎటు మళ్లుతుందోనని కొద్దిగా బంగతో.

'నన్నడిగితే నువ్వూ అంత మంచోడివేం కాదులే బావా?'

'మధ్యలో నేనేం చేశానే దయ్యం?' బిత్తరపోతూ అడిగాను.

'నిజంగా నువ్వు మంచోడివే అయ్యుంటే ఆ రోజు నేను నాగరాజుగాడిని గురించి చెప్పినప్పుడు నా రెండు చెంపలూ వాయించుండేవాడివి. లేదా ఆ నాగరాజు ఎలాంటి నిక్రిష్టుడో విచారణ చేసుండేవాడివి. కనీసం మా ఇంట్లోనైనా హెచ్చరించుండేవాడివి'

'చెబితే చస్తానని బెదిరిస్తివి గదే?'

'చిన్నపిల్లవాడేదో తెలీక నిప్పు ముట్టుకుంటామని మారాం చేస్తే ముట్టుకోస్తామా? నిప్పునన్నా ఆర్పేస్తాం. లేదా పిల్లవాడినైనా దూరంగా తీసుకెళతాం. ఏదీ చెయ్యలేదు కదా  నువ్వు!' అంటూ లేచెళ్లిపోయింది.

జయలక్ష్మి అభియోగానికి విస్తుబోయాను. మొత్తానికి ఇదెందుకో బాగా బాధపడుతోంది. సమస్యేమిటో తెలిస్తేనే గదా పరిష్కారం వెదకడానికి!

***

ఎప్పుడు నిద్రపట్టిందో తెలీదు. ఎక్కడి నుంచో సన్నగా ఏడుపు వినిపిస్తుంటే ఆ మూలుక్కి ఉలిక్కిపడి లేచా. కేండిలెప్పుడో ఆరిపోయినట్లుంది. అంతా చిమ్మచీకటి.

పక్కగదిలో  నుంచే ఆ మూలుగులు. పాప పక్కన పడుకునున్న జయలక్ష్మి నిద్రలోనే ఉండి ఉండి ఏడుస్తూ కలవరిస్తోంది. కలవరిస్తో ఏడుస్తోంది. తట్టి లేపే ప్రయత్నం చేస్తే సగం నిద్రా, సగం మెలుకువలో ఉన్నట్లుంది ఇంకా ఏదేదో వాగుతోంది అస్పష్టంగా. 'ప్రసాదు మంచివాడే బావా! పాపనూ, నన్నూ బానే చూసుకుంటాడు. ఏదడిగినా కాదనడు పాపం. అయినా ఆడది అన్నీ అడగుతుందా? అదే ఉప్పూ కారం కదా మగాళ్లు మీరూ తినేది? సంసారం వద్దనుకుంటే ఈ పెళ్లెందు కసలు చేసుకోవాలి పురుషపుంగవా?' ఏడుపు మధ్యలో ఇట్లాంటివే ఏవేవో కలవరింతలు. బలవంతాన నిద్రలేపే నా ప్రయత్నంలో రెండు మట్టిగాజులు కూడా చిట్టినట్లున్నాయి.

కరెంటు రావడంతో జయకు పూర్తిగా మెలుకువొచ్చేసింది. కొంత నయం.  జరిగింది తనర్థం చేసుకునే లోపే తలుపు టకటక చప్పుడయింది!

జయే వెళ్లి తలుపుతీసింది

'రెండు దాటింది. ఇంకా పడుకోలేదా?' అంటూ మగమనిషి ఒకతను లోపలికొచ్చాడు చొరవగా!  అతనే ప్రసాదని ఇట్టే అర్థమయింది 'మీరు పొద్దున్నే వెళ్లిపోతారుట గదా! ఎట్లాగైనా రావాలని మా మహరాణిగారి ఆజ్ఞ. లారీ పట్టుకునొచ్చేసే సరికి ఈ వేళయింది.'అంటూ అతను  గలగలా మాట్లాడే తీరులోనే మనిషెంత బోళానో అర్థమయిపొయింది. ఈ మనిషి మీదనా జయకన్ని కంప్లయింట్స్! నమ్మబుద్ధికాలే!

 బెడ్ రూంలోకి తొంగి చూసి 'మీరు పడుకోండి బ్రదర్! తెల్లారి అన్నీ మాట్లాడుకుందాం!' అంటూ పాప మంచం పక్కనే  ఓ చాప పరుచుకుని క్షణాల్లో నిద్రలోకి జారుకున్నాడు ప్రసాద్ పసిపిల్లాడికి మల్లె! జయ కొద్దిగా ఎడంగా పడుకుండిపోయింది.

'మొగుడూ పెళ్లాల మధ్య ఏం జరిగుంటుందీ? తను మూడో మనిషి. కలగజేసుకోడం ఎంత వరకు భావ్యం? ఇలాంటి ఆలోచనలతోనే నాకు  ఆ మిగతా రాత్రంతా సరిగ్గా నిద్రే పట్టలేదు.

తెల్లారి ఇన్ స్పెక్షన్ చివర్రోజు. పని ఎక్కువగా ఉంటుంది సహజంగా. ప్రసాద్ నిద్రలో ఉండగానే బట్టలు మార్చుకుని జయ ఇచ్చిన కాఫీ తాగి   బాపట్ల వచ్చేశా. సాయంత్రానికల్లా రిపోర్ట్ సబ్మిట్ చేసి లాడ్జ్ రూమ్ ఖాళీచేసే పనిలో ఉండగా ప్రసాద్ ఫోన్ చేశాడు 'సారీ! బ్రదర్! తీరిగ్గా మాట్లాడుకోవడమే కుదిరింది కాదు. మీరే ట్రెయిన్ కండీ వెళ్లేదీ?'

'చార్మీనార్! రాత్రి పదిన్నరకండీ డిపార్చర్' చెప్పాను.

'స్టేషన్లో ఆటో దిగుతుంటే నవ్వుతో ఎదురొచ్చాడు ప్రసాద్.. ఓ ప్యాకెట్ అందిస్తో. 'ఏంటిదీ?' అనడిగితే 'యేఁ అందర్ కి బాత్ హైఁ' అన్నాడు చిలిపిగా కన్నుగీటుతూ. విప్పి చూస్తే నా అండర్ వేర్. తెల్లారి సగం చీకట్లో నాదనుకొని అక్కడే పడున్న ప్రసాద్ డ్రావర్ వేసుకొచ్చిన సంగరి లాడ్జ్ కి రాగానే తెలిసింది.  కానీ, అలాంటివి తిరిగెలా ఇవ్వడం? బావోదని లాడ్జ్ రూమ్ లోననేవదిలేసి వచ్చా. చిన్నపిల్లవాడి తత్వం కాబట్టి ప్రసాద్ భద్రంగా ప్యాక్ చేసి మరీ పట్టుకునిచ్చాడు! సాటి వ్యక్తులపై అతని 'కన్ సర్న్' నన్ను బాగా ఇంప్రెస్ చేసిన మాట్ నిజం.

ఇంత మంచి వ్యక్తి ముందు జయ చేసిన అభియోగాన్ని చర్చకు పెట్టడం ఎలాగా? అన్న నా ఆలోచనలో నేనుండగానే తనే అన్నాడు 'రాత్రి జరిగిందానికి జయ తరుఫున నేను సారీ చెబుతున్నా బ్రదర్! గాజు ముక్కల విషయం నేనడక్క పోయినా తనే చెప్పిందంతా. తనెందుకో కొంత కాలంగా రోజూ అలాగే బిహేవ్ చేస్తోంది'

'జయ ఇంతప్పట్నుంచీ నాకు తెలుసు ప్రసాద్ గారూ! బైటికి అట్లా రూడ్ గా అనిపిస్తుంది కానీ, షి ఈజ్ వెరీ సెన్సిటివ్! ఎందుకో బాగా అప్సెట్టయిన మూడ్ లో ఉన్నట్లనిపిస్తోంది నాకు. సమస్యేంటో భర్తగా మీరే కనుక్కోవలసింది!' అన్నాను నిష్టురంగా!

'మీరేమనుకుంటున్నారో నాకు అర్థమవుతూనే ఉంది సుందరంగారూ! అందుకే నేనింత దూరం వచ్చింది. అన్ని సంగతులూ ఫోన్లలోనో, త్రూ ఈ-మెయిల్సో చెప్పడం కుదరదు కదా! బండికింకా అరగంట టైముంది. కూర్చుందాం రండి!' అన్నాడు ప్రసాద్.

అక్కడే ఉన్న సిమెంట్ బెంచీ మీద చతికిలబడ్డాం ఇద్దరం. తను చెప్పడం మొదలుపెట్టాడు.

'పెళ్లికి ముందే నాకు నాగరాజును గురించి మామయ్యగారు వివరంగా చెప్పేరు. పెళ్లి నాటికి జయ మూడు నెలల గర్భవతి. రహస్యంగా అబార్షన్ చేయించాలని యానాం తీసుకువచ్చారు. అప్పటికే పిండం గట్టిపడివుంది. ఆ దశలో అబార్షన్ అంటే పెద్దప్రాణానికి రిస్క్ చాలా ఎక్కువని డాక్టర్లు చెబుతున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. మా చిన్నచెల్లాయికి చాలా రోజుల నుంచి బాలేకపోతే  అదే ఆసుపత్రిలో వైద్యం నడుస్తోంది. మా నాన్నగారు అక్కదే చనిపోయారు ఎయిడ్స్ తో.. ఆ గొడవల్లో చదువు సరిగ్గా సాగక డిగ్రీలో ఫెయిలయివున్నా నేను  అప్పట్లో. ఉద్యోగం లేదు. చిన్నచెల్లి జబ్బు. పెద్దచెల్లికి ముదిరిపోయే పెళ్ళి వయసు.  నా ఇంటి సమస్యలను తీరుస్తానంటే జయలక్ష్మిని పెళ్లాడతానని నేనే బేరం పెట్టాను మామయ్యగారితో. చెల్లెలి పెళ్లి, నా కాంపౌండర్ ఉద్యోగం మామయ్యగారి చలవే.'

'మరి అన్నీ తెలిసుండి చేసుకుని మా జయను ఎందుకండీ ఇంకా బాధపెట్టడం! సారీ! ఇలా అడిగానని మరోలా అనుకోవద్దు! జయ నాకు కేవలం మరదలే కాదు.. చిన్ననాటి నుంచి గాఢస్నేహితురాలు కూడా!'

'అవన్నీ తెలుసు. జయ ఎప్పుడూ మీ గురించి చెబుతుంటుంది. అందుకే నేనింత దూరం వచ్చి వివరణ ఇచ్చుకోడం! జయంటే నాకూ ప్రాణమే సార్! అందుకే కష్టమైనా నేను తనకు దూరంగా ఉంటున్నది. పెళ్లయిన వెంటనే దుబాయ్ వంకతో దూరంగా వెళ్ళిపోయిందీ అందుకే!'

ప్రసాద్ గొంతు వణుకుతోంది సన్నగా. అతనేదో చెప్పాడు. ట్రైన్ ఎరైవల్ ఎనౌన్స్ మెంట్ గోలలో సరిగ్గా వినబడలేదు. బండి ఫ్లాట్ ఫారం మీదకు ధనాధనా దూసుకురావడం, ప్యాసింజర్ల హడావుడీ హఠాత్తుగా మొదలవడంతో.. నేనూ అలర్టయ్.. లగేజీతో సహా నా రిజర్వుడ్ కంపార్డ్ మెంట్ వైపుకు పరుగెత్తాను.

సీటులో సెటిలయే వేళకి డిపార్చర్ ఎనౌన్స్ మెంటు స్టార్టయింది. ఎప్పుడు కొనుక్కొచ్చాడో ఓ డజన్ ఏపిల్సూ, డజన్ ఆరెంజెస్.. వాటర్ బాటిల్ .. విండో గుండా అందించాడు ప్రసాద్.

'థేంక్యూ ఫర్ యువర్ కన్సర్మ్ మిత్రమా! ఇందకా మీరేదో అన్నారు గాని, ట్రైన్స్ అనౌన్స్మెంట్స్  గోలలో సరిగ్గా వినిపించలా! మళ్లీ చెప్పండి ప్లీజ్!'

గార్డ్ విజిల్ వేశాడు 'ఆ గజిబిజిలోనే ప్రసాద్ పెద్దగా అన్నాడు 'నా పెళ్లయిన వారానికల్లా నా చిన్నచెల్లెల్లూ చనిపోయింది సార్.. అదే ఎయిడ్స్ ప్రాబ్లమే! అనుమానం వచ్చి నేనూ టెస్టులు చేయించుకున్నా తరువాత! హెచ్చైవి పాజిటివ్ అని వచ్చింది. ఏడెనిమిదేళ్లకు మించి లైఫు ఉండదన్నారు.. పూర్తి ఆరోగ్యం ఇంక అసాధ్యమని కూడా చెప్పారు. పాపకు తండ్రిని నేనెలాగూ ఉండను. తల్లిని కూడా లేకుండా చెయ్యడం నా వల్లయ్యే పని కాదు సార్! ఈ సంగతులేవీ జయకు తెలీవు. చెబితే తట్టుకోలేదు. అందుకే రోజూ రాత్రి.. ఆ దెబ్బలాటలు.. ఏడుపులు'

బండి క్రమంగా స్పీడందుకుంటున్నప్పుడు 'పిన్నిగారినీ, డాక్టర్ గారినీ అడిగానని చెప్పండి!' అని చేతులూపుతూ ఫ్లాట్ ఫామ్ మీద నవ్వుతూ నిలబడిపోయిన ప్రసాద్ వంక అలా చూస్తూ షాకయిపోయాను.

***

డాక్టర్ గారు అంటే నా భార్య శ్యామల. ప్రసాదు చెప్పిందంతా తనకూ చెప్పి జయకు అడుగడుగునా ఇలా అన్యాయం  ఎందుకు జరుగుతుందో అర్థం కాకుండా ఉంది?' అని బాధపడ్డాను.

'నా అనుమానం నిజమైతే ప్రసాదుకలా హెచ్చైవి పాజిటివ్ అయ్యే అవకాశం లేదు సుందరం!' అనేసింది శ్యామల.

'ఎలా?!'

'ప్రసాద్ గారి పెద్దచెల్లెలు చక్కగా కాపురం చేసుకుంటుదన్నారుగా! ఆయన తండ్రికి హెచ్ ఐ వి అఫెక్టయ్యే నాటికే మొదటి ఇద్దరు పిల్లలూ పుట్టేసున్నారు. ఆయన పాజిటివ్ అయిన తరువాతనే చివరి అమ్మాయి పుట్టినట్లుంది. సరైన టైములో తెలుసుకుని మంచి ట్రీట్ మెంటు ఇచ్చి ఉంటే ఆ పిల్ల కూడా భేషుగ్గా బతికుండేది. ఇవాళ హెచ్చైవి అసలు  ఫాటల్ డిసీజెస్ జాబితాలోనే లేదు. మెడిసన్ లైన్లో ఉండీ మీ ప్రసాదు ఇంత  మూర్ఖంగా ప్రవర్తించడం ఆశ్చర్యంగా ఉంది' అంది శ్యామల.

***

మా కొత్తింటి గృహప్రవేశం వంకతో జయలక్ష్మి దంపతులను హైదరాబాద్ రప్పించాను. అదను చూసుకుని ప్రసాదుకి పరీక్షలు జరిపిస్తే శ్యామల చెప్పిందే నూటికి నూరు పాళ్లు నిజమయింది.

'మరి మా యానాం డాక్టర్లు అలా ఎలా చెప్పారు మేడం?' అని ఆశ్చర్యపోయాడు ప్రసాద్.

'మీరు ఖర్చుకు జంకి ఎవరో నకిలీ డాక్టరును ఆశ్రయించారు. మీ దురదృష్టం కొద్దీ వాడెవరో డబ్బు గుంజటానికి రోగుల జీవితాలతో ఆడుకొనే ధనపిశాచి అయిపోయాడు! ఇట్లాంటి రోగాలు వచ్చినప్పుడు ఒకటికి రెండు సార్లు వేరే వేరే మంచి డాక్టర్లకు చూపించుకుని గాని ఒక నిర్ధారణకు రకూడదనేది అందుకే!' ఆన్నది శ్యామల.

'మా జయను నిష్కారణంగా క్షోభకు గురిచేసినందుకు  మీకు పనిష్ మెంటు తప్పక వేయాల్సిందే బ్రదర్! ఇన్ స్టాంట్ హనీమూనుకు ఓ వారం వెళ్లిరండి ఇద్దరూ! పాపను గురించి బెంగ వద్దు! మీ అత్తగారు అట్లాంటి  డ్యూటీలకే  ఎదురుచూస్తోంద’ అన్నా పరిష్కరించమని నాకో సమస్యను చుట్టబెట్టిన మా అత్తయ్య వంక చూసి నవ్వుతూ.

 

ఏడాది తరువాత  జయలక్ష్మి కొడుక్కి బారసాలంటే వెళ్లాం నేనూ శ్యామలా. 'పేరేం పెడుతున్నావే?' అని జయనడిగితే, ఎప్పట్లానే తల బిరుసుగా 'నీ డొక్కు పేరు ఒక్కటే కాదులే బావా! అక్క పేరు కూడా కలుపుకుంటాం’ అంది బుజ్జి శ్యామసుందరాన్ని నా ఒళ్లో పడుకోబెడుతూ!

********


-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు ఆదివార అనుబంధం ప్రచురితం)

03 -03 -2021 










మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...