Showing posts with label Health. Show all posts
Showing posts with label Health. Show all posts

Tuesday, April 20, 2021

ప్రమదల పునరుత్పత్తి హక్కులు- కోవిడ్ మహమ్మారి ప్రవేశంతో మరింత అధ్యాన్నం! --కర్లపాలెం హనుమంతరావు

 


కోవిడ్-19 మహమ్మారి కారణంగా మహిళల్లో హింస, నిరుద్యోగమే కాదు..  లైంగిక పరమైన ఆరోగ్య సంరక్షణా కొరవడింది. ఫలితం.. పునరుత్పత్తి నాణ్యత దిగజారడం. 

మనదేశం వరకే చూసుకుందాం.  లభిస్తున్న గణాంకాలను బట్టి ప్రభుత్వ సేవల అసమానతలు, సమన్వయలోపాలు సుస్పష్టం. 

 

స్వీయ హక్కుల పట్ల ఆట్టే అవగాహన లేని సమూహాలలో స్త్రీలది ప్రథమ స్థానం. విద్య, రవాణా వంటి  ప్రాథమిక  సౌకర్యాల కల్పనలోనే సమన్వయ లోపాలు ఇంత స్పష్టమవుతున్నప్పుడు ఇక   ఆరోగ్య పరిరక్షణ పరంగా ప్రస్తుతముండే దైన్య పరిస్థితిపై కథనాలు రాసుకోడం  వృథా కాలయాపన. ఎబోలా, జికాల వంటి మహమ్మారులు విజృంభించిన తరుణంలో దెబ్బతిన్న మాతాశిశువుల ఆరోగ్య పరిస్థితులేవీ పాలకులకు కోవిడ్-19  సంక్షోభంలో పాఠాలు నేర్పించినట్లే  లేవు! మహిళల ఆర్థిక శ్రేయస్సుతో పాటు ఆరోగ్య సంరక్షణ అత్యయిక పరిస్థితినీ ఎప్పటికి  గుర్తిస్తారో  మన  ప్రభువులు! 

 

కోవిడ్ అనంతర ప్రపంచంలో మహిళలను మళ్లా వారి మానానికి వారిని విడిచిపెడితే మానవజాతి మనుగడకే మొత్తంగా ప్రమాదం. స్త్రీల పునరుత్పత్తి సమస్యలు స్త్రీలకు మాత్రమే  పరిమితం కాదు. 

  అంశం చుట్టూతా అనేక సమస్యలు మూగున్నాయి; వాటిలో చట్ట సంబంధమైనవే కాదు, నైతికపరమైనవి కూడా ఉన్నాయి. వాటిని గురించే ఈ క్షోభంతా!

 

జనాభాలో సగంగా ఉన్న స్త్రీ జాతికి నేటికీ తన కుటుంబ పరిణామాన్ని   నిర్ణయించుకునే స్వేచ్ఛ లేదు!   సహజ న్యాయాన్నీ ఒక  హక్కుగా  స్త్రీలు  దేబిరించే దశకు తెచ్చిన ఈ మగ ప్రపంచాన్ని ఏం చేసినా తప్పులేదు!

 

కనే బాధ్యత మాత్రమే అప్పగించేసి .. ఎంత మందిని, ఏ సమయంలో ప్రసవించాలో,  సంతానాన్ని ఏ   తీరున పెంచాలో అన్న  కీలకమైన నిర్ణయాలను ఇంటి పెద్దలు తామే  పుచ్చేసుకున్నారు!   గుడ్లప్పగించి చూసే దైన్యమే  ఆధునిక స్త్రీ దైనా!

 

కరోనా మహమ్మారి కారణంగా ఉనికిలోకి వచ్చిన లాక్ డౌన్ వాతావరణంలో మహిళ పరిస్థితి మరింత దయనీయం.  ముఖ్యంగా పునరుత్పత్తి పరంగా!

 

జాతీయ మహిళా కమీషన్ దగ్గర నమోదయిన గృహహింస ఫిర్యాదుల పెరుగుదల చూస్తే గుండెలు అవిసిపోతాయి. తక్షణ సహాయం అందే పరిస్థితులు కరువైన లాక్-డౌన్ వాతావరణంలో మెజారిటీ స్త్రీల వ్యథలు పడకటింటి నుంచే మొదలు!  జాతీయ మహిళా కమీషన్ లో గృహహింస    బాధితుల సౌకర్యార్థం   వాట్సప్ విభాగం ఓటి  ప్రత్యేకంగా ఏర్పడటమే  దిగజారిన పరిస్థితులకు దర్పణం.  

 

గృహహింస అంటే కేవలం దేహం మీద జరిగే బౌతిక దాడి ఒక్కటే కాదుగా! ఆంక్షలు, ఆరోగ్య రక్షణకు ఆటంకాలు, మానసిక పరంగా  వేధింపులు.. ఏ తరహా ఒత్తిళ్లయినా సరే  గృహహింస కిందకే వస్తాయి.  సన్నిహితంగా మసిలే జీవిత భాగస్వామి చేసేదయితే  ఆ హింస ప్రభావం మహిళ పునరుత్పత్తి  నాణ్యతను మరంత  తీవ్రంగా దెబ్బతీస్తుందని వైద్య నిపుణుల హెచ్చరిక కూడా  . 

కరోనా- 19 లాక్ డౌన్ వాతావరణం పునరుత్పత్తి ఆరోగ్య పరిస్థితులపై మహిళల  నియంత్రణ శక్తిని  మరంతగా  బలహీనపర్చినట్లు ఐక్యరాజ్య సమితి స్వయంగా నిర్ధారించడం  ఆందోళన కలిగిస్తుంది . సుమారు 12 మిలియన్ల మంది మహిళల గర్భనిరోధక వినియోగ చర్యలకు అంతరాయం ఏర్పడ్డట్లు  ఓ అంచనా. దీని ఫలితంగా 2020 అనంతరం కాలంలో సుమారు 1.4 మిలియన్ల అనాలోచిత గర్భధారణాలకు అవకాశం కలిగినట్లని ఆ నివేదికే తేటతెల్లం చేస్తోంది!

 

సమయానికి అందని కుటుంబ నియంత్రణ సేవలు, లాక్ డౌన్ కారణంగా విధించిన పరిమిత ప్రయాణాలు.. నిషేధాలు,  అవసరానికి అందుబాటుకు రాని  అనేక ఇతరేతర ఆరోగ్యసౌకర్యాల చలవ .. ఈ గందరగోళమంతా! 

 

 పునరుత్పత్తికి సంబంధించిన  హక్కులు, కుటుంబ నియంత్రణ.. గర్భస్రావం వంటి  సేవలను పొందే విషయమై  చట్టపరంగా ఉండే  హక్కులు  అన్నీ నామ్ కే వాస్తేనే!  వాస్తవ          లభ్యత విషయంలో ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మన్నన.

 

 మనదేశం    వంటి  అభివృద్ది చెందుతున్న దేశాలలో సహజంగానే ప్రజలకు అందే ప్రభుత్వ సేవలు అరకొరగా ఉంటాయి  . అందులోనూ  తరాల తరబడి అణచివేతకు  గురవుతోన్న    స్త్రీజాతికి ..  ఆరోగ్య పరమైన లైంగిక  హక్కుల పట్ల               అవగాహన ఉండే అవకాశం తక్కువ. ఈ క్రమంలోనే పునరుత్పత్తికి సంబంధించిన హక్కుల పరిజ్ఞాన లేమి అతివల అవాంఛిత గర్భధారణలకు  ముఖ్య కారణమవడం!

 

మొత్తం భారతీయ మహిళల్లో దాదాపు సగం మందికి గర్భనిరోధానికి  పాటించే  ఉపాయాలు తెలియవు; తెలిసినవారికేమో  వివిధ కారణాల వల్ల  ఆయా  సౌకర్యాలు బహుదూరం. ఒక్క ముక్కలో చెప్పాలంటే కుటుంబాల నియంత్రణ   ప్రణాళికల్లో స్త్రీ భాగస్వామ్యం దాదాపు శూన్యం .. అదీ విడ్డూరం!

 

గర్భనిరోధ వినియోగం చుట్టూతా ఉన్న డేటానే  ఈ స్త్రీ స్వయంప్రతిపత్తి లోపానికి ఓ కీలక ఉదాహరణ. 'ఏ అపాయమూ లేకపోయినా వాసెక్టమీలకు కేవలం 0.3% మంది పురుషులు మాత్రమే సంసిద్ధమవుతున్న నేపథ్యంలో    వివాహిత మహిళల్లో హానికరమైనప్పటికీ నూటికి 36  మంది  స్టెరిలైజేషన్ ఆపరేషన్లకు సిద్ధపడుతున్నారు!  

 

సంస్కృతీ సంప్రదాయాల పరంగా ఈ తరహా అంశాల మీద  బాహాటమైన చర్చలకు ఆస్కారం ఉండటంలేదు. అవివాహితులైన స్త్రీలకు ఏ విధమైన కుటుంబ నియంత్రణ పద్ధతులు అవలంబించే అవసరం లేదనే ఒక నైతిక  భావన కద్దు,

 

కానీ  మారుతున్న కాలం ప్రభావం!   ఈ దేశంలో లైంగికపరంగా ప్రస్తుతం  చైతన్యం కలిగివున్న గ్రామీణ అవివాహితులే  27% ఉన్నట్లు అనధికార గణాంకాలు నిగ్గు తేలుస్తోన్న  నేపథ్యం! ఎంత సమర్థవంతమైన ఆరోగ్య సేవా కార్యకర్తలు ఉన్నప్పటికీ,  ఈ తరహా వర్గాలను  ఏ గణనలోకీ తీసుకోలేని   పక్షంలో, చర్చల ద్వారా  సాధించే సానుకూల ఫలితాంశాలు ప్రశ్నార్థకమే అవుతాయి కదా?

 

2020 లో దేశవ్యాప్తంగా కొనసాగిన లాక్ డౌన్ సమయంలో కుటుంబ నియంత్రణ, పునరుత్పత్తి ఆరోగ్య సేవా క్షేత్రాలు  తీవ్రంగా దెబ్బతిన్న మాటయితే  వాస్తవం. గృహ నిర్బంధ పరిస్థితుల  కారణంగా,  దేశంలో 25 మిలియన్ల జంటలకు గర్భనిరోధక సదుపాయాలు అందుబాటులో లేకుండా పోయాయి. నిజం చెప్పాలంటే రాబోయే ఏడాదిన్నర కాలంలో భారతదేశం    జననాల విషయంలో రికార్డు నమోదుచేసుకునే అవకాశం దండిగా ఉందంటున్నారు ఆరోగ్య శాస్త్ర నిపుణులు!  

 

'అన్ని వర్గాలకు సమాన హక్కులు'  అని సర్వత్రా వినవస్తున్న   సామాజిక వ్యవస్థ నినాదమే మూహిళల    పునరుత్పత్తి హక్కుల అంశంలోనూఉంది. పునరుత్పత్తి  అతివ  జీవితాన్ని అత్యంత అధికంగా ప్రభావితం చేసే ప్రధాన అంశం. అందులో స్త్రీ   పురుషునితో సమానంగా స్వతంత్ర ప్రతిపత్తికై డిమాండ్ చేయడంలో  అసమంజసమేమీ లేదు.

పునరుత్పత్తికి సంబంధించిన నిర్దిష్ట సమాచారం యావత్తూ ఆమెకు సకాలంలో అందుబాటులో ఉంచడం.. ఆ చైతన్యం ద్వారా ఆమె తీసుకునే పునరుత్పత్తి సంబంధమైన నిర్ణయాలను మన్నించగలగడం పురుష ప్రపంచం..  ముందు అహం చంపుకొనైనా అభ్యసించడం అవసరం. ఇది నేరుగా ఆర్థిక, సామాజిక పరంగా స్త్రీని  పురుషునితో సమానంగా ఎదిగే అవకాశం

కల్పించడమే!  స్త్రీల జీవితాల మీద స్తీలకు, స్త్రీ దేహం మీద స్త్రీకి మాత్రమే సర్వహక్కులు కల్పించినప్పుడే ఇది సాధ్యమయే సామాజిక న్యాయం. ఈ సామాజిక న్యాయం సాకారం అయ్యే ఆశ కనుచూపు మేరలో ఉండగానే కోవిడ్ - మహమ్మారి స్త్రీ జీవితాన్ని మరింత ఛిద్రం చేయడమే విషాదకరం!

-కర్లపాలెం హనుమంతరావు

18 04 -2020

Sunday, February 14, 2021

సేవ -కర్లపాలెం హనుమంతరావు -కథానిక

 




సెల్  మోగుతోంది అదే పనిగా! 

నెంబరు చూసి 'సారీ ఫ్రెండ్స్! మీరు కంటిన్యూ చేయండి! ఫైవ్ మినిట్సులో నేను మళ్ళీ జాయినవుతా!' అంటూ కాన్ఫెరెన్సు ఛాంబర్నుంచి బైటకొచ్చాడు సుబ్బారావుగారు.

'మీరు  ఇక్కడకు రావాల్సుంటుంది. ఎంత తొందరగా వస్తే అంత మంచిది. అన్ని విషయాలు ఫోన్లో డిస్కస్ చెయ్యలేం గదా!' అంది అవతలి కంఠం.

సుబ్బారావుగారికి పరిస్థితి అర్థమైంది. ఫ్లైటుకి టైము కాకపోవడంతో కారులో బైలుదేరారు. 'వీలైనంత వేగంగా పోనీయ్! బట్ బీ కేర్ ఫుల్!' అని డ్రైవర్ని హచ్చరించి సీటు వెనక్కి  వాలిపోయాడాయన.

సుబ్బారావుగారు విజయవాడ దగ్గర్లోని ఓ గాజు ఫ్యాక్టరీ యజమాని.  సంగం మిల్కు ఫ్యాక్టరీలో,  మార్కాపూరు పలకల ఫ్యాక్టరీలో ముఖ్యమైన వాటాదారుడు కూడా. తరాలనుంచి వస్తున్న చీరాల చేసేత  అమెరికన్ షర్టింగ్ ఎక్స్పోర్టింగు వ్యాపారం ఒకటి  నడుస్తోంది. ఆ పనిమీద ఒకసారి చెన్నై వెళ్ళివస్తూ తిరుపతి వెళ్లారు సకుటుంబంగా. పనిపూర్తి చేసుకుని ఘాట్ రోడ్ నుంచి దిగివస్తుంటే ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి లోయలోకి జారిపోయింది వాళ్లు ప్రయాణించే కారు. పెద్దవాళ్లకేమీ పెద్ద దెబ్బలు తగల్లేదుకానీ.. పిల్లాడికే బాగా గాయాలయ్యాయి. ప్రమాదం జరిగే సమయంలో పెద్ద గాలివాన! కరెంటు తీగలు తెగి అంతటా కటిక చీకటి. దూసుకు పోయిన బస్సుకూడా కనుచూపుమేరలో లేదు. బిడ్డ ఏడుపు వినబడుతుందేగానీ.. ఆ చీకట్లో ఏ పొదలో చిక్కుకున్నాడో అర్థమవడం లేదు. భార్య ఏడుపుతో బుర్ర్ర అస్సలు పనిచేయడం మానేసింది. సెల్ ఫోనుకి సిగ్నల్ అందడం లేదు. 'బిడ్డను దక్కించు తండ్రీ! నీ కొండకు  వచ్చి నిలువుదోపిడీ ఇచ్చుకుంటా!' అని మొక్కుకున్నాడు సుబ్బారావుగారు.

ఆ దేవుడే పంపిచినట్లు కనిపించాడు సాంబయ్య అక్కడ ఆ క్షణంలో!  ఆ సమయంలో అతను అక్కడెందుకున్నాడో? కారు లోయలోకి జారే సమయంలో చెలరేగిన ఏడుపులు, పెడబొబ్బలు విని వచ్చినట్లున్నాడు. అలవాటైన చోటులాగుంది!  ఏడుపు వినిపించే లోతట్టులోకి అత్యంత లాఘవంగా  దిగి..  పొదల్లోనుంచి బైటకు తెచ్చాడు బిడ్డడిని.  రెస్క్యూ టీం ఆ తరువాత అరగంటకు వచ్చి అందర్నీ ఆసుపత్రికి చేర్చిందిలే కానీ.. ఆ సమయంలోగానీ సాంబయ్య చొరవ లేకపోతే పిల్లాడు తమకు దక్కే మాట వట్టిదే!


ఒక్కడే వంశోధ్ధారకుడు. అదీ పెళ్లయిన పదేళ్లకు ఎన్ని తంటాలు పడితేనోగానీ పుట్టలేదు. ఎన్ని  వేల కోట్లు, ఫ్యాక్టరీలుంటే మాత్రం ఏం లాభం? వంశాన్ని ఉద్ధరించేందుకు ఒక్క అంకురం అవసరమే గదా! సాంబయ్య ఆ పూట కాపాడింది ఒక్క పసిప్రాణాన్నే కాదు..  ఆగర్భ శ్రీమంతుడైన సుబ్బారావుగారి వంశం మొత్తాన్ని!


సాంబయ్యకు ఒక పదివేలు ఇచ్చాడు అప్పట్లో! తిరుపతి ఫారెస్టు ఏరియాలో దొంగతనంగా కంప కొట్టి అమ్ముకుని జీవనం సాగించే అశేషమైన బడుగుజీవుల్లో సాంబయ్యా ఒకడని తరువాత తెలిసింది. సాంబయ్యచేత ఆ పని మానిపించి బస్టాండు దగ్గర ఒక బంకు  పెట్టించాడు సుబ్బారావుగారు.

సుబ్బారావుగారు తిరుపతి ఎప్పుడు వచ్చినా సాంబయ్యను పిలిపించుకుని మంచి- చెడు విచారించడం అలవాటు. తన ఫ్యాక్టరీల్లో ఏదైనా పనిచేసుకోమని సలహా ఇచ్చినా ససేమిరా అన్నాడు సాంబయ్య 'ముసిలోళ్ళు తిర్పతి దాటి బైట బతకలేరయ్యా సామీ! ఈ వయసులో ఆళ్లనొదిలేసి నా దారి నే చూసుకోడం నాయవా?' అంటాడు. పని వత్తిళ్లమధ్య ఈ మధ్య తిరుపతి వెళ్లడం కుదరడం లేదు. సాంబయ్య కలిసి చాలా కాలమే అయింది.  ఇప్పుడిలా కలుస్తాడని కలలోకూడా అనుకోలేదు.


నెలరోజుల కిందట ఒకసారి తిరుపతినుంచి ఈ డాక్టరే కాల్ చేసి చెప్పాడు 'పేషెంటు ఫలానా సాంబయ్య.. అతని తాలూకు మనుషులు మీ పేరే చెబుతున్నారు. అందుకే మిమ్మల్ని డిస్టర్బ్ చేయాల్సొచ్చిం'దంటూ.

కొత్త అసైన్ మెంటుని గురించి చర్చలు జరుగుతున్నాయప్పట్లో. ఇన్ కమ్ టాక్సు తలనొప్పుల్నుంచి తప్పించుకునే దారులు వెతుకుతున్నారప్పుడు ఆడిటర్సు. వాళ్ళు ఇచ్చిన సలహా  ప్రకారం ఆదాయం నుంచి కనీసం ఒక్క శాతంతోనైనా ఏదైనా ఛారిటబుల్ ట్రస్టు ఏర్పాటుచేస్తే రెండిందాలా లాభం. గుడ్- విల్ వాల్యూ పెంచి చూపించుకోవచ్చు. త్రూ ట్రస్ట్.. గవర్నమెంటు ఏజన్సీలతో  వ్యవహారాలు స్మూత్ అవుతాయి.  మెయిన్ బిజినెస్  ఇస్యూసుని తేలిగ్గా  సాల్వ్ చేసుకోవచ్చన్నది ఆ సలహా. ఎలాంటి ట్రస్టు పెట్టాలన్న దానిమీద చర్చ సాగుతున్నప్పుడే తిరుపతి నుంచి కాల్ వచ్చింది.

సుబ్బారావు తిరుపతి చేరేసరికి బాగా చీకటి పడింది. నేరుగా ఆసుపత్రికి వెళ్లాడు. బెడ్ మీద పడున్న సాంబయ్య అస్తిపంజరాన్ని తలపిస్తున్నాడు. తనకు పరిచయమయిన కొత్తల్లో పిప్పిళ్ల బస్తాలాగుండేవాడు. డాక్టర్ని కలిసాడు సుబ్బారావుగారు.

'సాంబయ్యకు డయాబెటెస్ టైప్ ఒన్. వంశపారంపర్యంగా ఉంది. ఇప్పుడు జాండిసూ  ఎటాకయింది. కిడ్నీలు రెండూ పనిచేయడం మానేశాయి. ఆల్మోస్టు లాస్ట్ స్టేజ్..'

'హెరిడటరీ అంటున్నారు. మరి వాళ్ళ పిల్లాడికీ…?'

'వచ్చే చాన్సు చాలా ఉంది. జువెనైల్ డయాబెటెస్ అంటాం దీన్ని. అబ్బాయికిప్పుడు ఆరేళ్ళే కనక బైటకు కనిపించక పోవచ్చు. ముందు ముందయితే ఇబ్బందే!'

ఎమోషనలయాడు సుబ్బారావుగారు 'ఏదన్నా చేయాలి డాక్టర్ సాంబయ్యకు! అతని భార్యను చూడ్డం కష్టంగా ఉంది. ఆ రోజు పొదల్లో మా బాబు పడిపోయినప్పుడు మా ఆవిడా ఇలాగే ఏడ్చింది'

'విధికి కొంత వరకే మనం ఎదురు ఈద గలిగేది. సాంబయ్యది హెరిడటరీ ప్రాబ్లం. ఆశ పెట్టుకొనే దశ దాటిపోయింది సార్! ఏం చేసినా ఆ పసిబిడ్డకే చేయాలింక!' అన్నాడు డాక్టరుగారు.

పలకరించడానికని వెళ్ళిన సుబ్బారావుగారిని చూసి కన్నీళ్ళు పెట్టుకున్నాడు సాంబయ్య. ఏదో చెప్పాలని ఉందిగానీ అప్పటికే మాట పడిపోయిందతనికి. కొడుకు చేతిని పట్టుకుని పిచ్చి చూపులు చూసాడు పాపం!

'సాంబయ్యకు ఆట్టే బంధుబలగం కూడా ఉన్నట్లు లేదు. 'పిల్లాడి మంచి చెడ్డలు మనం చూసుకుందాం లేండి! వాళ్లకిష్టమైన చోట మంచి హాస్టల్లో పెట్టించి ఓపికున్నంతవరకు చదివిద్దాం.  ఆ కుటుంబానికి ఏ లోటూ రాకుండా ఏర్పాటు చేద్దాం. ఆ పూచీ నాదీ!' అన్నాడు సుబ్బారావుగారు తిరుగుప్రయాణమయేటప్పుడు  సాంబయ్య భార్య వినేటట్లు.


ఆ మర్నాడే సాంబయ్య పోయినట్లు కబురొచ్చింది విజయవాడకి.  ఆ విషయం చెబుతూ  ' మీరు వెళ్ళిపోయిన తరువాత నేనూ చాలా ఆలోచించాను సుబ్బారావుగారూ! పిల్లాణ్ణి హాస్టల్లో పెట్టి చదివించడం, జీవితాంతం వాళ్ళు నిశ్చింతగా బతకడానికి ఏర్పాట్లు చేయడం.. చిన్న సాయమేమీ కాదు. కానీ.. మీ లాంటి వాళ్ళు చేయదగ్గది.. మీలాంటి వాళ్ళు మాత్రమే  చేయగలిగే కార్యం ఒకటుంది సార్!' అన్నాడు డాక్టర్ శ్రీనివాస్.

'ఏమిటో చెప్పండి.. తప్పకుండా చేద్దాం.. వీలైనదైతే!' అన్నాడు సుబ్బారావుగారు.

'జువెనైల్ డయాబెటెస్ కి ఒక విరుగుడు ఉంది సార్! స్టెమ్ సెల్సుతో చికిత్స మంచి ఫలితాన్నిస్తుంది. పిల్లల వూడిపోయే పాలదంతాలను వూడిపోవడానికి ఒక పదిరోజులముందే తీసి భద్రపరిస్తే.. భవిష్యత్తులో  వచ్చే పెద్ద రోగాలకి చికిత్స చేయడం తేలికవుతుంది. పాలదంతాల్లోని మూలకణాల ద్వారా ఈ వైద్యం సాధ్యమేనని రుజువయింది. దంతాల పల్సులో ఉండే మూలకణాలని ముఫ్ఫై నలభై ఏళ్లవరకు భద్రపరిచే ల్యాబులు ఇప్పుడు ఇండియాలో ఢిల్లీ, ముంబై, పూనేవంటి నగరాల్లో పనిచేస్తున్నాయి. మా కొలీగ్ ఒకతను వాళ్ల పాప పాలపళ్ళు అలాగే ముంబై బ్యాంకులో డిపాజిట్ చేయించానని చెప్పాడండీ!'

సుబ్బారావుగారికీ ఆలోచన బాగా నచ్చింది. కంపెనీ తరుఫు నుంచి పంపించిన వైద్యులు  ఢిల్లీ  బ్యాంక్ పని విధానాన్ని పరిశీలించి సమర్పించిన పత్రంలో మరిన్ని అనుకూలమైన వివరాలు ఉన్నాయి. 'మూలకణాలు శరీరంలో కొన్ని భాగాల్లో ఎక్కువగా.. కొన్ని భాగాల్లో తక్కువగా ఉంటాయి. దంతాల వంటి వాటినుంచి ఒక రెండు మూడు మూలకణాలని రాబట్టినా చాలు.. వాటిద్వారా కొన్ని లక్షల కణాలని సృష్టించుకోవచ్చు. శరీరంలో పాడైన భాగాలను  ఈ కణాలు వాటికవే బాగుచేసుకుంటాయి. బొడ్డుతాడునుంచి మూలకణాలను సేకరించే విధానం చాలా కాలంనుంచి ప్రాచుర్యంలో ఉన్నదే. ఆ అవకాశం లేకపోయినవాళ్ళు నిరాశ పడనవసరం లేదంటున్నారు ఇప్పుడు. పాలదంతాల విషయంలో తగిన జాగ్రత్త పడితే ఫ్యూచర్లో బోన్ మ్యారో, కిడ్నీలవంటి వాటికి సమస్యలొస్తే పరిష్కరించుకోవడం తేలికవుతుంది'.

దంతాలనుంచి మూలకణాలను సేకరించి భద్రపరిచే స్టెమేడ్ బయోటిక్ సంస్థలు ఢిల్లీలోలాగా ముంబై, పూనా, బెంగుళూరు, చెన్నైలలో ఉన్నా..  విభజనానంతరం ఏర్పడ్డ రెండు తెలుగు రాష్ట్రాల్లో  ఇంకా  ఏర్పడలేదన్న విషయం  సుబ్బారావుగార్లో  మరింత ఉత్సాహం పెంచింది.

సాంబయ్య కొడుక్కి ఆరేళ్లే. అతగాడి పాలపళ్లను గనక భద్రపరిస్తే భవిష్యత్తులో వాడికొచ్చే జువెనైల్ డయాబెటెస్ కి చికిత్స అందించడం సాధ్యమవుతుంది. ఆ రకంగా సాంబయ్య రుణం మనం తీర్చుకున్నట్లూ అవుతుంది' అంది సుబ్బారావుగారి సతీమణి ఈ విషయాలన్నీ భర్తనోట విన్నతరువాత.

'నిజమే కానీ.. ఇది కాస్త  ఖరీదైన వ్యవహారంలాగుందే?  ప్రారంభంలోనే అరవై వేల వరకు వసూలు చేస్తున్నాయి ల్యాబులు! ఆ పైన మళ్ళీ ఏడాదికో ఆరేడువేలదాకా రెన్యువల్ ఫీజులు!'

సుబ్బారావుగారిలోని వ్యాపారస్తుడి మథనను పసిగట్టింది ఆయన సతీమణి. 

'సాంబయ్య మనింటి దీపాన్ని నిలబెట్టాడండీ! అతనింటి దీపం కొడిగట్టకుండా చూసే పూచీ మనకు లేదా?  మనకింత ఉంది.. ఏం చేయలేమా?' అనడిగింది భర్తను. 

భార్యదే కాదు.. భర్తదీ చివరికి అదే ఆలోచనయింది.

సుబ్బారావుగారికి ఛారిటబుల్ ట్రస్టు తరుఫున ఏంచేయాలో సమాధానం దొరికింది.  బోర్డు మీటింగులో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టరు హోదాలో ప్రపోజల్ టేబుల్ చేసాడు 'సాధారణంగా కన్నవారు బిడ్డ పుట్టగానే  వాళ్ల బంగారు భవిష్యత్తు కోసం ఆర్థికంగా ఆలోచిస్తారు. కలిగినవాళ్ళు బ్యాంకులో డిపాజిట్లు.. సేవింగ్సు కాతాలు ప్రారంబిస్తారు. చదువుల కోసం, పెళ్ళిళ్ళ కోసం ముందస్తు ప్రణాళికలు వేసుకుంటారు. అన్నింటికన్నా ముఖ్యమైన ఆరోగ్యాన్ని గురించి ఆలోచించే స్పృహ మాత్రం ఇంకా మన సమాజానికి అలవడలేదు. పుష్టికరమైన ఆరోగ్యాన్ని అందించినంత మాత్రానే ఆరోగ్యభద్రత కల్పించినట్లు కాదు. ప్రాణాంతకమైన వ్యాధులు వస్తే ఎంత సంపద ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయతే! స్టెమ్ సెల్సుని సేకరించి భద్రపరిచే ల్యాబులను మన ట్రస్టు తరుఫున ప్రారంభిద్దాం. పేద పిల్లల పాలపళ్లను సేకరించి వాటినుంచి మూలకణాలని రాబట్టి భద్రపరిచే ఏర్పాట్లూ చేయిద్దాం. ఇదంతా ట్రస్టు తరుఫున మనం సమాజానికి అదించే ఉచిత సేవా సౌకర్యం'

సభ్యులంతా ఆమోదపూర్వకంగా బల్లలమీద చిన్నగా చరిచారు.

సుబ్బారావుగారి సంస్థల తరుఫున ప్రారంభమయిన మూలకణాల సేకరణ, భద్రత ల్యాబు ప్రారంభోత్సవంలో లాంఛనంగా డిపాజిట్ చేయబడిన మొదటి స్పెసిమన్ సాంబయ్యకొడుకు పాలపళ్లనుంచి సేకరించిన మూలకణాలే!

సాంబయ్యకొడుకు మంచి హాస్టల్లో చేరి చక్కగా చదువుకొంటుంటే.. సాంబయ్యభార్య ట్రస్టువారి  బ్యాంక్ ల్యాబులోనే పనికి చేరింది.

-కర్లపాలెం హనుమంతరావు

(ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురితం)

బోథెల్, యూఎస్ఎ

***

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Sunday, August 30, 2020

రక్తదానం- కర్లపాలెం హనుమంతరావు-




తారతమ్యాలు లేకుండా దానం ఇవ్వగలిగింది రక్తం. ఆ దానానికి మనుషులందరిని మానసికంగా సిద్ధం చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ జూన్. 14 వ తేదీని రక్తదాన దినోత్సవంగా నిర్దేశిస్తే, ఆ విధంగా రక్తం ఉదారంగా దానం చేసే కర్ణులను గుర్తించి గౌరవించేందుకు 'ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లడ్ డోనర్స్' అనే అంతర్జాతీయ రక్తదాతల సమాఖ్య స్థాపించబడింది. స్వచ్ఛందంగా రక్తాన్ని దానం చేసే దాతలను గుర్తించి వారిని గౌరవించడం ద్వారా సమాజంలో రక్తదాన స్ఫూర్తిని మరింత పెంచే లక్ష్యంతో ఏర్పాటు చేయబడిన సంస్థ ఇది.
రక్తానికి గడ్డకట్టే స్వభావం ఉంది. అయినప్పటికీ ఒక పరిమిత కాలం వరకు దానిని నిలువచేసే సాంకేతిక పరిజ్ఞానం అభివృధ్ధి చెందింది. ఆ తరువాతనే 'బ్లడ్ బ్యాంకులు' స్థాపన అభివృద్ధి చెందింది. బ్యాకులు దేశ దేశ ఆర్థికరంగ పరిపుష్టికి ఎంత అవసరమో, బ్లడ్ బ్యాంకులు దేశ ఆరోగ్య రంగ పరిపుష్టికి అంతే అవసరం. కొన్ని కొన్ని ప్రదేశాలలో, రహదారుల వెంట ప్రమాదాలు తరచూ జరిగే అవకాశాలు కద్దు. ఆ తరహా ప్రాంతాలను గుర్తించి ఆ దారి పొడుగూతా రక్త బ్యాంకులు ఏర్పాటు చేయడం ఉచితం. అందుకోసమైన ప్రజలలో రక్తాన్ని ఉచితంగా దానం చేసే అలవాటు అభివృద్ధి చెందవవలసిన అవసరం ఉంది.
శరీరం ఉత్పత్తి చేసే రక్తాన్ని గురించి చాలా మందికి సరి అయిన అవగాహన ఉండదు. రక్తాన్ని దానం చేయడం అంటే ఒంట్లోని రక్తాన్ని తోడేయడంగా భావించరాదు. ఎంత రక్తం బైటికి పోతుందో అంతే మోతాదులో రక్తం కొత్తగా శరీరం ఉత్పత్తి  చేస్తుంది. కొత్త రక్తం వంటికి పట్టిన తరువాత మనిషిలోని పూర్వపు మందగొడితనం కొంత తగ్గి,  నూతనోత్సాహం అనుభవంలోకి వస్తుంది కూడా.  వంటి రక్తంలోని చిన్నిపాటి కొవ్వు, మాంస కృత్తుల అసమతౌల్యత  దానికదే సర్దుకుని రక్తదాత ఆరోగ్యంలో మెరుగుదల శాతం పెరుగుతుంది కూడా
అట్లాగని అందరి శరీరాలు రక్తదానానికి అనువుకావు. 17 - 18 సంవత్సరాల వయసు దాటిన వారి దగ్గర నుంచి మాత్రమే రక్తం సేకరిస్తారు. దీర్ఘరోగ పీడితులు, పసిపిల్లలు, పెద్ద వయస్సువారు, మెన్సుయేషన దశ దాటిన స్త్రీల వంటి వారి రక్తం దానానికి స్వీకరించడం శ్రేయస్కరం కాదని ఆరోగ్యశాస్త్రం హితవుచెబుతోంది.
రక్తదానం చేయాలనుకునేవారు తమ పేరును ప్రభుత్వ ఆసుపత్రులలో స్వచ్ఛందంగా నమోదు చేసుకోవచ్చు. దాత ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి అర్హుడు అని నిర్ధారణ అయితే స్వచ్ఛంద దాతగా పేరు నమోదు చేసుకుంటారు. అవసరమైన సందర్భంలో రక్తదానం చెయ్యడానికి పిలుపు వస్తుంది. రాకపోయినా ఏ పుట్టినరోజు వంటి సందర్భాన్ని మనమే  కల్పించుకుని రక్తాన్ని స్వచ్ఛందంగా దానం చేయనూవచ్చు. తమ అభిమాన సినీకథానాయకుడు జన్మదినోత్సవమనో, తమ రాజకీయ అధినేత పిలువు ఇచ్చాడనో సామూహికంగా రక్తదానం చేసే సందర్భాలు మనం తరచూ చూస్తూ ఉంటాం. స్వఛ్ఛదంగా రక్తం దానం చెయ్యడం కూడా ఒక రకమైన సామాజిక సేవా కార్యక్రమం కిందే లెక్క
రక్తదాతల కరవు వల్ల రక్తాన్ని అమ్ముకునే దురాచారం ఒక వృత్తిగా అభివృద్ధి చెందే అవకాశం తగ్గుతుంది
 'రక్తం ప్రాణులను కాపాడుతుంది. ఆ రక్తదానం నాతో మొదలవుతుంది. స్వచ్ఛమైన రక్తం అందిస్తాను' అన్న నినాదంతో తొలి రక్తదాన దినోత్సవం ప్రారంభమయింది. ఆ నినాదాలు మానవజాతిని శాశ్వతంగా నిలబెట్టే విలువైన నినాదాలు. 'మోర్ బ్లడ్.. మోర్ లైఫ్' లాంటి నినాదాలు ఒక్కో ఏడు ఒక్కొక్కటి తీసుకుని  రక్తదాన దినోత్సవాలు సంరంభంగా జరపడం రివాజుగా వస్తోంది 2004 నుండిమొదటి రక్తదాన దినోత్సవం దక్షిణాఫ్రికా జోహాన్స్ బర్గ్ నగరం నుంచి నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతీ ఏడాది క్రమం తప్పకుండా ప్రపంచమంతటా ఈ రక్తదాన దినోత్సవాలు నిరాటంకంగా జరుగుతున్నాయి.
రక్తానికి ఉన్న విలువను గుర్తించడం ముఖ్యం. అయినవారు ఆపదలో ఉన్నప్పుడు, బంధువులు రోగికి సరిపడా రక్తం కోసం వెదుకులాడుతున్న దృశ్యాలు చూస్తున్నప్పుడు రక్తం విలువ మనకు అర్థమవుతుంది. రైలు, రోడ్డు ప్రమాదాలు వంటివి పెద్ద ఎత్తున జరిగినప్పుడు ఒకేసారి ఎక్కువ మోతాదులో రకరకాల రక్తం అవసరమవుతుంది. రక్తం ముందే సేకరించి భద్రపరిచి ఉంచిన సందర్భాలలో అధిక మోతాదులో జరగబోయే ప్రాణనష్టాన్ని నివారించవచ్చు. స్త్రీల ప్రసవాల సందర్భంలోనూ, కేన్సర్ వంటి రోగులకు.. దీర్ఘకాలిక రోగాల నుంచి కోలుకునేవారికి చికిత్సలు అందించే సందర్భంలోనూ రక్తం ప్రాధాన్యత బాగా పెరుగుతుంది.
మనిషి ప్రాణం ప్రమాదంలో పడినప్పుడు బాధితుడిని కాపాడే దేవుడు వైద్యుడు అయితే, ఆ దేవుడికైనా సమయానికి అందుబాటులో ఉండవలసిన ముఖ్యమైన సాధనాలలో రోగికి సరిపడే  రక్తం చాలినంత ఒకటి. సరయిన గ్రూపు రక్తం, సరిపడా సమయానికి  దొరికినప్పుడే ఫలితం అనుకూలంగా ఉండే అవకాశం.  అంత గొప్ప విలువైన సాధనం ప్రతి మనిషి వంట్లోనూ నిరంతరం రక్తం రూపంలో ప్రవహిస్తూనే ఉంటుంది. దానిని పరిమితులకు లోబడి దానం చేసినందువల్ల నష్టం ఏమీ ఉండకపోగా లాభాలే అదనం. ఆ విశేషం ప్రతీ వ్యక్తీ గుర్తించాలి. ఆ విధంగా గుర్తించే దిశగా ప్రభుత్వాలుగాని, ఆరోగ్య సంఘాలు గాని స్వచ్ఛంద అవగాహనా శిబిరాలు ఏర్పాటు చేయాలి.  
రక్తదానంతో మరో ప్రాణి జీవితాన్ని కాపాడవచ్చన్న సత్యం ఆరోగ్యశాస్త్రం పసిగట్టినప్పటి నుంచి రక్తదానానికి ప్రాముఖ్యత పెరుగుతూ వచ్చింది. రక్తంలోని కణాల నిర్మాణం గ్రూపుల ద్వారా నిర్దారించబడుతుంది. ఓ పాజిటివ్ గ్రూప్ గల మనుషులు సాధారణంగా ఎక్కువ సంఖ్యలో లభ్యమవుతుంటారు. రక్తానికి సంబంధించిన ప్రత్యేక ఆరోగ్య శాస్త్రం 'హెమటాలజీ' రక్తానికి ఉన్న భిన్నమైన గ్రూపులు, ఆర్ హెచ్ లక్షణం గుర్తించి, వ్యక్తి నుంచి మరో వ్యక్తిలోనికి రక్తాన్ని ఎక్కించే సాంకేతిక ప్ర్రరిజ్ఞానాన్ని మరింత  అభివృధ్ధి పరిచింది, అప్పటి నుంచే 'రక్తదానం' ఆలోచన ఒక ముఖ్యమైన ఆదర్శ సామాజిక అంశంగా రూపుదిద్దుకొన్నది. దానిని మరింత ప్రచారంలో పెట్టడం అంటే పరోక్షంగా అయినా మానవ ఆరోగ్యానికి ఇతోధికంగా సాయం అందిస్తున్నట్లే లెక్క. మన శరీరంలో పారే ఒక్కక్క రక్తపు చుక్క మన ఒక్కళ్లకే కాదు.. అవసరమైనప్పుడు లక్షలాది మంది ఇతరుల ప్రాణాలను రక్షించే క్రతువులో సమిధ కింద కూడా సమర్పించవచ్చు. ఈ దిశగా ఒక సదాలోచన ప్రతీ వ్యక్తిలో కలిగించడం, స్వయంగా స్వచ్ఛందంగా ఆ తరహా రక్త దానం చెయ్యడం= రెండూ మనిషిగా పుట్టినందుకు మానవజాతికి ఇతోధికంగా మనం చేసుకునే ఉత్తమ సేవాకార్యక్రమాలే!
-కర్లపాలెం హనుమంతరావు
(జూన్. 14 వ తేదీ రక్తదాన దినోత్సవం)
***

Monday, December 16, 2019

తేనీరు సంజీవని -కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు- ఆదివారం సాహిత్య సంపాదకీయఁం - 26, జూన్, 2011




లోకంలో నీరు తరువాత తేనీరే అధికంగా వినియోగమయే ద్రవం. కప్పు కాఫీనో, తేనీరో పడకపోతే పడక దిగడానికి పెద్దలే పస్తాయిస్తున్న కాలం ప్రస్తుతం నడుస్తున్నది. ఓ ఆధునిక తేనీటి ప్రియుడు వాపోయినట్లు 'కిటికీలోంవి వానా ఉరుములూ  వినిపిస్తున్నప్పుడు/ శవంలా ఒరిగున్న నీరసం/ నిప్పుల పులిలా లేచి నుంచోవాలంటే' కావలసింది ఓ కప్పుడు చాయ్. ఒకప్పుడే కాదు ఇప్పుడూ ఆ కవి చాయాలపన  నూటికి నూరు శాతం వాస్తవమే! ఎంతలా వేధించకపోతే పోకూరి కాశీపతి వంటి ఉద్దండ పండితులు కూడా దండకాలు చదువుతూ ఈ కాఫీ టీల ముందు సాష్టాంగ ప్రణామాలకు పాల్పడివుంటారు! 'శ్రీ మన్మహాదేవీ! లోకేశ్వరీ! కాళికా సన్నిబాకరణీ! .. అంబా కాఫీ జగన్మోహినీ!' అంటూ ఏకరువు  పెట్టిన  గుణగణాలన్నీ పేరుకే కాఫీకి కానీ తేనీటి వంటి అన్ని ఉత్సాహ ప్రసాద తీర్థాలన్నింటికీ అక్షరాలా వర్తించే స్తుతిమాలలే  వాస్తవానికి!  'శ్రీకృష్ణుడా స్వర్గమున్ జేరి  ఊతంబునే పారిజాతంబున్ దెచ్చియున్  నాతికిన్ బ్రీతిగ నిచ్చు కాలంబు నందా సుమంబునందునం గల్గు బీజంబు లుర్విస్థలిన్ రాలి' ఏ కాఫీ చెట్టుగానో, తేయాకు మొక్కగానో పుట్టుకొచ్చిందన్నంత దాకా ఆ అవధానిగారి ప్రేమగానం  ముదిరిపోయిందంటే ఆ దోషం వారి పాండిత్యంలో లేదు. కాఫీ టీలకు కవులూ కళాకారులకూ మధ్య ఉన్న బంధం అంత బలమైనదిగా అర్థంచేసుకోవాలి. 'కాఫీ టీ లయినా సర/ దాకైనా మందొ కింత తాగరు సిగిరె/ ట్టూ కాల్చరు మరి వారె/ ట్లీ కవులైరొ తెలియనగునా!' అంటూ కోవెలవారు ఓ శతావధానంలో ఆదే పనిగా ఆబ్బురపడిపోతారు! 'సరదాకే' అని ఆ కవిగారన్నా  కాఫీ టీ లు కేవలం కవుల  సరదాకేనా?! 
'తింటే గారెలు తినాలి.. వింటే భారతం వినాలి' అనే నానుడి బహుశా వేడి వేడి కాఫీ టీలు వాడకంలోకి రాని కాలం నాటివై ఉండాలి. గారెలు తినగ తినగ చేదు. కాఫీ చాయిలకు ఆ దోషం లేదు. తెల్లవారగానే తేనీటికి వెంపర్లాడే బుద్ధి తెల్లవాడు వచ్చి మనకు మప్పినన కాలానికి  ముందు పుట్టబట్టే అల్లసానివారు సత్కృతులకు అవసరమైన సరంజామాలో 'అల్లం టీ' ని కలపలేదు. కాఫీ టీల యుగంలోనే గాని ఆ కవితాపితామహుడు ప్రభవించుండి ఉంటే 'రా! నడిచే నగరంలానో / నిద్రించే పల్లెలానో  వచ్చి/ నా ముఖం మీద దుప్పటి లాగిపారెయ్/ బోర్లించుకున్న రాత్రిళ్లూ/ పొర్లించుకున్న పాటలూ/ నిరామయ ప్రపంచాలూ చెరిసగం పంచుకుందాం ఇరానీ కప్పులో.. గోర్వెచ్చగా' వంటి ఈ నాటి కవితలకు దీటైన 'టీ కవితలు' టీకా తాత్పర్యాలతో సహా రాసుండేవారు. నాయుడుబావ ప్రేమ కోసం నండూరివారి వెంకి అట్లా గుత్తొంకాయ కూరలు, పూరీలు, పాయసాలు చేసి అంతలా హైరానా పడింది కానీ -చారెడు ఏలకులు గుండ కొట్టి కలిపిన తేనీటీని ఓ కంచు లోటాకు నిండుగా పోసిచ్చి ఉంటే  జుర్రుకుంటూ తాగి వెర్రిత్తిపోయుండేవాడా ప్రియుడు. 'దిగిరాను దిగిరాను దివి నుండి భువికి' అంటో భావకవి కృష్ణశాస్త్రి అన్నేసి మారాములు చేయడానికి 'మసాలా చాయి' రుచి పరిచయం కాకపోవడమే కారణం కావచ్చును. 'క్షీరసాగర మధనంలో  సాధించిన సుధ  జగన్మోహిని దేవ దానవులకు పంచే వేళ  ఒలికిపడ్డ ఓ రెండు మూడు  చుక్కలే  భూమ్మీద మొలకెత్తిన ఈ తేయాకు మొక్కలు' అన్నది గురజాడ గిరీశంగారికి అన్నలాంటి మేధావి తీసిన థియరీ! భగీరథుడు అంతలా పరిశ్రమ చేసి భూమ్మీదకు సురగంగను పారించింది ఎందుకైనా ..   లాభం  అందుతున్నది  మాత్రం ఈనాటి మన తరాలకే సుమా! గంగ పారే నేల సారం, గంగ వీచే గాలి తరంగం భారతీయుల  తేయాకుకు అందుకే అంతలా బంగారపు రంగు, సుగంధాల రుచి.. వెరసి విశ్వవిపణిలో విపరీతమైన గిరాకీ!  చైనాకు చాయ్ ఒక ఔషధమయితే, జపానుకు అదే 'ఛదో' అనే ఓ కళ.  భారతీయులకు మాత్రం అన్నివేళలా అవసరమయే ఓ నిత్యావసర పానీయం.  పేటెంట్ హక్కుల కోసమై  తమిళనాట సుదీర్థకాలంగా సాగిన న్యాయ వ్యాజ్యమే తేయాకు మీద భారతీయులకున్న అవ్యాజప్రేమాభిమానాలకు నిదర్శనం.
నీల్ ఆమ్ స్ట్రాంగ్ చంద్రమండలం మీద పాదం మోపిన మరుక్షణమే 'హుర్రే! పరాయి గ్రహం మీద కాలుపెట్టిన మొదటి మొనగాడిని నేనే!' అని ఓ వెర్రికేక వేయబోతే..'అంతొద్దు! నీకు టీ.. కాఫీలు అందించేందుకు ముందుగానే ఓ అయ్యర్ ను అక్కడ దింపి ఉంచాం' అంటూ భూ కేంద్ర నుంచి సందేశం అందిందని.. ఓ జోక్! కాఫీ.. చాయ్ లు దొరకని స్థలి భువన భాండములో  ఎక్కడా ఉండదు' అన్నదే ఈ ఛలోక్తి సారాంశం. మూడు వేల రకాల 'టీ'లను పదిహేను దేశాలవారు రోజుకు మూడు కప్పులకు తగ్గకుండా తాగుతున్నారంటే తేనీటి మహిమ చెప్పతరమా? రుచికి ఆరోగ్యంతో పొసగదని కదా సామాన్య సూత్రం! కాకర చేదు. కరకరలాడే కారబ్బూందితో గుండెకు ఇబ్బంది. మద్యంతో అందేది పెగ్గుల కొద్దీ అనారోగ్యమే! తేనీటిలోనూ చూపుకు దొరకని రోగకారకాలుంటాయనే వైద్యనిపుణులు కద్దు. ' 'ఆరోగ్యానికి అమరదు'  అని ఎవరేమి అనుకున్నా   కాఫీ చాయిల వంటి అమృత పానీయాల పైన  మనిషి చాపల్యం అమరం.   'కడుపులోకి  ప్రవేశించాక/ కరెంటు లావాలా ఉరకలు వేస్తుంది/  ఆ వేడి నీటిపూల నీరు కాటుకు గుండె  కంట్రోల్ టవర్ నుంచి / తల వెంట్రుకలు కూడా ఫిలమెంటులవుతాయం'టూ మానేపల్లివారు వినిపించిన గిటారు సంగీతం కాఫీ గురించే కావచ్చునేమో కానీ.. నిజానికి ఇరాన్ నుంచి దక్కన్ దాకా ఏ రకం చాయ్ కప్పు చేతికి తీసుకున్నా అంతకు మించిన మరపురాని  ఉత్తేజాన్నందిస్తుంది. ఉత్త ఉత్తేజమే కాదు.. వాషింగ్టన్ అంతర్జాతీయ ఆరోగ్యనిపుణుల తీర్మానం ప్రకారం తేనీరు ప్రాణాంతక వ్యాధులను నిరోధించే దివ్యౌషధం కూడా! ఒక కప్పు చాయ్ కిలో కాయగూరల సారాన్ని ప్రసాదిస్తుందన్నది ఆరోగ్యశాస్ర నిర్ధారణ. చురుకుదనం, జ్ఞాపకశక్తి, రేడియేషన్ కు విరుగుడు, కంటికి చలువ- వంటి ప్రయోజనాలు ఎన్నింటినో  జనాలకు అందించేదీ వేడి వేడి ఔషధమే! అధిక రక్తపోటుకు, నరాల నిస్సత్తువకు, రక్తనాళాలలో అధికమయ్యే కొవ్వు పదార్థాలకు, పంటి చిగుళ్ల సమస్యలకు.. తేనీరు ఓ సంజీవనీ ఔషధం. బ్లాక్ టీ లోని థియాఫ్లావిన్-2 కేన్సర్ కణాల సంహరణకే కాక ఆ ధర్మం నిర్వర్తించే జన్యుకణాల క్రియాశీలతకూ తిరుగులేని మందులా పనిచేస్తుందని అమెరికా విశ్వవిద్యాలయ  పరిశోధనల్లో తాజాగా తేలింది. కేన్సర్ వ్యాప్తికి కారణమైన సివో ఎక్స్ -2 నీ నిర్వీర్యం చేసే చాయ్ నిజానికె సంజీవనీ జేషధమే! చెయ్యెత్తి  ఆ తేనేటి మందుకు  'జై' కొట్టకుండా  ఎట్లా ఉండగలం?
-కర్లపాలెం హనుమంతరావు
(ఈనాడు- ఆదివారం సాహిత్య సంపాదకీయఁం - 26, జూన్, 2011)


Wednesday, February 8, 2017

అతనొస్తున్నాడు!- కౌముదిలోని- మరీ చిన్న కథ



'అతనొస్తున్నాడంట ఇవాళ!'
'ఇవాళా?!'
'అవును. మీ బాస్ ఫోన్ చేసాడు. నువ్వు రిఫ్రెషింగ్ రూంలో ఉన్నావని నేనే లిఫ్ట్ చేసా.. సెల్'
'…'
'నీ కివాళ ఆఫ్ కదా?'
'అవును. అందుకే ఆంటీకి ఆర్థోపెడిక్ అప్పాయింట్ మెంట్ తీసుకుంది. ఇప్పుడు కాకపోతే.. మళ్లా మూణ్నెల్లగానీ డేట్ దొరకదు కృష్ణా!'
'మరేం చేద్దామనుకుంటున్నావ్! పోనీ మేటర్ ఇది అని మీ బాస్ కి చెప్పేసెయ్! ఏమన్నా ప్రాబ్లమా?'
'తనకేం ప్రాబ్లం! నాకే కదా ప్రాబ్లం! రాక రాక వచ్చిన అవకాశం  ఇది. లూజ్ చేసుకోకూడదని మా గురూజీ గొడవ. రానంటే ఏమీ అనరు కానీ.. నాకే ఏదోలా ఉంది'
'నో ప్రాబ్లం రాణీ! పోనీ నేను వెళతాలే అమ్మతో డాక్టరు దగ్గరికి. నువ్వెళ్ళి పో! అంతలా ఫీలవాల్సిన అవసరం లేదు. అవతల వచ్చే పర్సన్ ఎంత ఇంపార్టెంటో.. అదీ చూసుకోవాలిగా.. ప్రొఫెషన్లో!'
'థేంక్యూ డార్లింగ్.. సిట్యుయేషన్ అర్థం చేసుకొన్నావు..  గ్రేట్!'
***
'అందరు వచ్చినట్లేనా! వాటెబౌట్ రమా?'
'తన కివాళ పెళ్లి చూపులున్నాయి సార్!'
'హ్మఁ! బ్యాడ్ లక్ టు హర్! అతి కష్టం మీద దొరికిందీ ఛాన్సు! మీకు తెలుసు. మళ్లీ రారు కనకనే ఇలాంటి వాళ్లు.. మిమ్మల్నందర్నీ ఇంతలా అలర్ట్ చేస్తున్నది. ఒక రకంగా చెప్పాలంటే  మీరంతా చాలా లకీ గైస్! మా రోజుల్లో ఒక్కడంటే ఒక్కడైనా ఇలాంటి వ్యక్తి తగల్లేదు మాకు. జస్ట్ ఎవరో చెబితే వినటమే! ఇంకెక్కడికో వెళ్లాలనుకున్న వ్యక్తి ఆఖరి  నిమిషంలో మనసు మార్చుకొని మన సంగతి తెలుసుకొని మరీ  వెతుక్కుంటూ  ఇక్కడకు రావడం నిజంగా నాకైతె ఇప్పటికీ ఒక మిరకల్లాగానే అనిపిస్తుంది'
'సార్! ఆ మెరికల్ మీలోనూ ఉంది.  ఆయనకా నమ్మకం కలిగించింది మీరు. మీ లాంటి వాళ్లు దొరకడం ఆయనకూ.. మాకూ.. ఇద్దరికీ లకీనే!'
'ఓకే.. ఓకే.. గైస్! వచ్చిన వాళ్లంతా పెంటనే ప్రిపేరయి పోండి! ఎక్కడా మన వైపునుంచి మిస్టేక్ ఉండ కూడదు. అమెరికా వెళ్లే మనిషి. ఇక్కడికి తిరిగొచ్చింతరువాత మళ్లీ మనల్నే  వెతుక్కుంటూ రావాలి. అదే మీ అందరికి ఇప్పుడు అసలు టెస్టు. మూవాన్ గైస్! సెల్ రింగవుతుంది. అతనొచ్చేస్తున్నాడు.'
***
'మ్యాడమ్!  నాకివాళ అప్పాయింట్మెంటుంది కదా! ఎందుకిలా అర్థాంతరంగా కేన్సిల్ చేసారు?'
'సారీ సార్! అనవాయిడబుల్ సర్కమస్టెన్సస్! అర్థం చేసుకోండి'
'ఏమర్థం చేసుకోవాలమ్మా! అవతల ఇంకెవరో పెద్దమనిషి వస్తున్నాడని.. ఎప్పడో ఇచ్చిన మా డేటుని సడెన్ గా ఇలా కేన్సిల్ చేస్తారా! ఇదేమన్నా బావుందా?'
'చెప్పాంగా! తప్పనప్పుడే కదా ఇలా చేస్తాం.  మిమ్మల్ని డిజ్ రెస్పేక్ట్ చెయ్యాలని మాకెందుకుంటుంది? అవతల వచ్చే వ్యక్తికి ఇబ్బంది ఉండకూడదనే మా కన్సర్న్.. మళ్లీ మరో డేటు తీసుకోండి. మరేం ఫరవాలేదు, ఇవన్నీ నిదానంగా చూసినా ప్రమాద ముండదు అని చెప్పమన్నారండి మిమ్మ్లని చూసే డాక్టరుగార్.'
ఫోన్ కట్ అయింది.
***
'ఎవరితోనే అంతలా గొడవ పడుతున్నావ్? ఇచ్చిన అప్పాయింట్ మెంటును కూడా కాదని.. హఠాత్తుగా వస్తున్న మనిషికి అంత ఇంపార్టెన్సిస్తున్నారు! ఎప్పుడూ లేంది.. ఈ చిన్నడాక్టర్లంతా ఇవాళ ఒకేసారి కనబడుతున్నారు ,,, అసుపత్రిలో! వచ్చే పేషేంట్ మరీ అంత ఇంపార్టెంటా?'
'వెరీ ఇంపార్టెంట్ తల్లీ! అందుకే కదా పొద్దుట్నుంచీ ఇంతలా హంగామా! ఆయన ఆ వాసన్   ఆసుపత్రి పేషెంటంట.. చాలా కాలం బట్టీ. కొత్తగా హెల్త్ కార్డు స్కీములొచ్చాయి కదా! అక్కడ ఉచితంగా వైద్యం దొరకదని తెలిసి మన దగ్గరుందని తెలిసి  వచ్చాడు. ఈ పేషెంటుది ఎడ్వాన్స్డ్ కేసు గ్లాకోమియా.
'అంటే చూపు మెల్ల మెల్లంగా తగ్గిపోతుందీ.. కొంత కాలాని కసలు చూపే పోతుందీ.. ఎన్నటికీ నయంకాని జబ్బు!అదేనా?'
'అవును.ఇప్పటికే ఎడం కన్ను పూర్తిగా పాడయిందతగాడికి. కుడి కంటిక్కూడా అంటుకుంది జబ్బు. ఇలాంటి కేసులు లక్షల్లో ఒకటి కానీ ఉండవంట. దొరక్క దొరక్క దొరికింది కదా! ఈ రేర్ కేసును  మన చిన్న డాక్టర్లందరికి పత్యక్షంగా   చూపించి ట్రీట్మెంటు ప్రాక్టీస్ చేయించాలని మన పెద్ద డాక్టరుగారి హడావుడి.' అంది రిసెప్షన్ కౌంటర్లో కూర్చున్న పిల్ల ఈ మధ్యనే  డ్యూటీలో చేరిన మరో పిల్లతో.
ఆ అమ్మాయి ఇంకా ఏదో అడగబోతుంటే వరండాలో సందడి మొదలయింది.
'నీ సందేహాలన్నీ ఆనక. ముందీ పేష్ంట్ కేస్ షీటు దగ్గర్రడీగా ఉంచుకో.. అతనొస్తున్నాడు' అని లేచింది రిసెప్షనిష్టు.
***

-కర్లపాలెం హనుమంతరావు

(కౌముది- అంతర్జాల మాసపత్రికలో ప్రచురితం)-

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...