Sunday, February 20, 2022

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

 మతాల స్వరూపాలు


కొడవటిగంటి రోహిణీప్రసాద్

08-09-2010 


మతభావనలుమనిషికీ నరవానరానికి తేడాలు తలెత్తినప్పటినుంచీ మొదలైనవిగానేభావించవచ్చుప్రాథమికస్థాయిలోసముదాయాలుగా గుహల్లో తలదాచుకునివేటాడుతూబతికిన ఆదిమానవులకు ఆహారసేకరణ అన్నిటికన్నా ముఖ్యమైన వ్యాపకంగా ఉండేదిఏదైనా జంతువును మాటువేసి చంపగలిగినప్పుడు వారికి  జంతువుపట్ల కృతజ్ఞతాభావంకలిగేదేమోతమ కడుపులు నింపితమ ప్రాణాలు కాపాడిన  ప్రాణి తమను భవిష్యత్తులోకూడా 'కరుణించాలనివారు కోరుకోవడంలో ఆశ్చర్యంలేదుప్రాంతాన్నీతెగనీబట్టి ఒక్కొక్కజంతువు ఆదిమానవులకు పూజనీయంగా తయారయిందిఇప్పటికీ పాతపద్ధతులనువిడనాడని చాలా ఆటవికతెగలకు చిహ్నాలుగా టోటెమ్ జంతువులు కనిపిస్తాయివారువాటిని ఆరాధిస్తారుతమ తెగకు వాటిని గుర్తుగా భావిస్తారు.


తరవాతి దశల్లో ఇటువంటివాటి విగ్రహాలను తయారుచేసి పూజించడం కూడామొదలయిందిముఖ్యంగా పశ్చిమాసియాలో ఇలా ఒక్కొ తెగకి ఒక్కొక్క జంతువు ప్రతినిధికావడం తెగలమధ్య పోటీలు పెరిగి కొట్లాటలు జరగడం ఆరంభమయిందిప్రాచీనమతాలలో ఒకటైన యూదుమతంలోనూ తరువాత వచ్చిన ఇస్లాంలోనూ విగ్రహారాధనను గర్తించే పరిస్థితులు ఏర్పడ్డాయిపది దైవశాసనాలను తీసుకొచ్చిన మోసిస్అయినామహమ్మద్ ప్రవక్త అయినా భగవంతుడసేవాడికి రూపం ఏదీ ఉండదనిచెప్పవలసివచ్చిందిఎందుకంటే ఎటువంటి రూపాన్ని ఆమోదించినా కొందరికి సంతోషమూతక్కినవారికి ఆగ్రహమూ కలిగే ప్రమాదం ఏర్పడిందినిత్యమూ చిహ్నాల పేరుతో కయ్యాలకుకాలుదువ్వే తెగలన్నిటినీ ఏకం చెయ్యడానికి 'నిరాకారుడైనభగవంతుణ్ణి నిర్వచించడం తప్పమరో మార్గం లేకుండాపోయింది.


మన దేశంలోనూ ఇటువంటి పరిస్థితులే ఉండేవికాని పురోహితఅర్చకఋత్విజుల వర్గాలు సమస్యను మరొక పద్ధతిలో పరిష్కరించినట్టుగా తెలుస్తోందిఉదాహరణకు శివుడినోపశుపతి నాథుణ్ణి ఆరాధించేవారు సర్పాలను ఆరాధించేవారితో పోట్లాడకుండా ఉండడానికిపాములను శివుడి మెడలో వేశారుఅలాగే ఎద్దును శివుడికి వాహనం చేశారు విధంగావిడిగా ఉన్న తెగలను ఏకం చేసే ప్రయత్నాలు ప్రాచీనకాలంలోనే విజయవంతంగా జరిగాయిమరొకవంక ఆదిశక్తిని స్త్రీరూపంలో పూజించే సంప్రదాయంశివుడితో వైరం పెట్టుకోకుండాఆమెను శివుడి భార్య అన్నారురానురాను  కుటుంబం మరింత విస్తరించడంతోవినాయకుణ్ణి (ఏనుగును ఆరాధించే తెగవాళ్ళ కొడుకుగా పేర్కొన్నారుదక్షిణాదిలోఎప్పటినుంచో ఆరాధిస్తున్న వేల్ మురుగన్ (కుమారస్వామినిమరొక కుమారుడన్నారుహిందూ సంప్రదాయంలో పాతనమ్మకాలను త్యజించడం అనేది ఎప్పుడూఎక్కడా జరగదుప్రాచీన కాలపు నమ్మకాలన్నిటికీ ఏవో భాష్యాలూవివరణలద్వారా కొనసాగించడమేకనబడుతుంది.


ఆర్యభాషీయులు క్రీ.పూ. 1400-1200 ప్రాంతాల సింధునది ప్రాంతాలకు వచ్చినప్పుడు వారుఆరాధించినది తమ ప్రాణాలు కాపాడే అగ్నినీప్రకృతిదేవతలైన వరుణుడినీసూర్యుడినీ(మిత్రుడుమాత్రమే తరవాత వీరి ప్రాధాన్యత తగ్గిందిఆర్యభాషీయులకుసమకాలికులుగా మన దేశానికి వచ్చిఏవో అభిప్రాయభేదాల కారణంగా తిరిగి వెళ్ళిపోయినఇండో ఇరానియన్ భాషీయులు ఋగ్వేద కాలానికి చెందిన పార్శీ మతగ్రంధం జెంద్ అవస్తారాసుకున్నారుఅందులో అసుర శబ్దానికి చాలా గౌరవం ఉండేదిసృష్టికర్తను ఆహురమ్మఅనేవారువారికి దైవ అనే శబ్దం పాపిష్టిదిమన దేశంలో స్థిరపడ్డవారు మాత్రం  పదాలకువ్యతిరేకార్ధాలు ఆపాదించుకున్నారుజెంద్ అవస్తాలో మహనీయుడుగా పేరు పొందినజొరాస్టర్ (జరతుష్టకశ్మీరుకు చెందినవాడనీఅతన్నే మనవాళ్ళు వశిష్టుడంటారనీ కొందరిఅభిప్రాయం.


ఆర్యభాషీయులు మన దేశంలో స్థిరపడ్డాక వారికి ఇంద్రుడు గొప్ప దేవత ఆయాడుకానికొంతకాలానికి పటమీదాఏరుకుతినడంమీద మాత్రమే ఆధారపడిన  ప్రజలు ముందుపశుపాలననూ తరవాత వ్యవసాయాన్నీ వృత్తిగా స్వీకరించారు దశలో ఇంద్రుడిప్రాభవం తగ్గి 'గోపాలుడైనకృష్ణుడికి, 'హలధరుడైనబలరాముడికి ఆదరణ పెరిగిందిఅంతేకాక అడుగడుగునా ఇంద్రుడు కృష్ణుడి చేతిలో పరాభవం చెండడం చూస్తాంఇదంతాఅప్పటి సమాజంలో తలెత్తిన మార్పులకు ప్రతిబింబంలాగా అనిపిస్తుందిక్రీ.పూ.2400 ప్రాంతాల మొదలైన సింధునాగరికత నాటి నుంచీ ఉన్న శివుడి ఆరాధనమటుకుకొనసాగింది.


అతిప్రాచీనదశలో హిందూదేవతలమధ్య తలెత్తిన విభేదాలు ఏనాడో సమసిపోయాయిమళ్ళీ క్రీ.ఎనిమిదో శతాబ్దం తరువాత వైదికఅర్చకవర్గాలకు మాత్రమే పరిమితంగా ఉండినభగవదార్చనకు ప్రజాస్వామిక లక్షణాలు ఏర్పడ్డాయిక్రైస్తవమతంలో  తరవాత జరిగినపెనుమార్పులన్నీ మనదేశంలో ఎప్పుడో మొదలయ్యాయివీరశైవులుగానూవైష్ణవులుగానూబ్రాహ్మణేతరులు చాలామంది అధికసంఖ్యలో దేవతార్చనలు మొదలుపెట్టారుకేవలంసంస్కృతి మంత్రాలేకాక హిందీతమిళంకన్నడంతెలుగువంటి స్థానికభాషల్లో భక్తిగీతాలూపాటల రచన జరిగిందిపురాణాలు అనువాదం జరిగిందిసమాజంలో

అంతకంతకూ జరుగుతూ వచ్చిన మార్పులు మతిస్వభావాలను కూడా ప్రభావితం చేశాయి.


ప్రస్తుత పరిస్థితి ఏమిటిఇప్పటికీ  మతంలోనైనా ప్రార్ధన చేసే పద్ధతి ఆటవికదశనేతలపిస్తుందిఎక్కువగా దేవుడి పేరు తలుచుకోవడమే చూస్తాంఅది.. పిలుపేఎన్నో సార్లుపిలిస్తేగాని పట్టించుకోని సాటిమనిషిని పరిగణించినట్టి భక్తులు ప్రవర్తిస్తారుసామాజికకారణాలవల్ల తలెత్తిన జీవిత సమస్యల పరిష్కారానికి ఆకాంపుచూడడం మనుషులకుఅలవాటయిందిఅలాంటి ప్రయత్నాలవల్ల ఫలితం ఉంటుందా అనే ప్రశ్నని పక్కనపెడితేదానివల్ల చాలామందికి మనశ్శాంతి కలుగుతుందనే విషయంలో సందేహమేమీ లేదుపట్టణంలోని వ్యవస్థ సరిగా లేదని అధికారులకు విన్నవించుకున్న పద్ధతిలోనే భక్తులుప్రవర్తిస్తారుఅతని 'దయఉంటే పరిస్థితులు చక్కబడతాయిలేకపోతే లేదుమనబాధ్యతల్లా చిన్నవించుకోవడమే!




ఇదంతా మతభావనలను వెక్కిరించడానికి చేస్తున్న ప్రయత్నం కాదుసంగతేమిటంటే తక్సినవిషయాల్లో చాలా తెలివిగా ప్రవర్తించేవారుకూడా మతం విషయంలో హేతువాదపైఖరినివిడనాడతారని మనం గమనించవచ్చుఅంతేకాక తాము స్వయంగా పరిష్కరించుకోగలఎటువంటి సమస్యకూ వారు 'దైవసహాయంకోసం ఎదురుచూడరుతెలియనివిఅస్పష్టంగాఅనిపించేవీచిక్కుముడ్తగా తమనను సవాలుచేసేవీ అయిన కష్టాలు ఎదురైనప్పుడే  భక్తివెల్లడవుతుంది.


మనిషికి అనాదిగానూఅనుభవపూర్వకంగానూ అలవడిన కార్యకారణ సంబంధం మతంవిషయంలో బలంగా పనిచేస్తుంది. 'ఎవరో ఒకరు తిప్పకపోతే తారలచుట్టూ గ్రహాలూఅణువులోని న్యూక్లియసచుట్టూ ఎలక్ట్రాన్లూ ఎలా తిరుగుతాయిఏదైనా 'తనంతటతానుగాఉనికిలోకి వస్తుందనే భావనను

చాలామంది జీర్ణించుకోలేరు భగవంతుడు  వర్క్ షాప్లో కూర్చుని అన్నిటినీ సృష్టిస్తాడోఎవరికీ తెలియనప్పటికీ అలాంటిదేదో జరుగుతుందని జనం


నమ్ముతారు.


మనిషికన్నా శక్తివంతుడైన ఒక పాతకాలపు భగవంతుణ్ణి ఆమోదించలేని పాశ్చాత్యులు'ఇదిగో పులి అంటే అదిగో తోకఅన్న పద్ధతిలో గ్రహాంతర జీవుల గురించీఫ్లయింగ్ సాసర్లగురించి వదంతులు లేవనెత్తుతారుతమతమ సంస్కృతీసంప్రదాయాలనుబట్టి తమనుచుట్టుముట్టిన బాధలనుంచి విముక్తి ఎలా పొందాలో తెలియక జనం రకరకాలుగా భ్రమలకులోనవుతారుమరణించిన తరవాత ఏమవుతుందో తెలియక అయోమయానికి లోనవడంమరొక ఇబ్బందితక్కిన కీటకాలూజంతువులూసాధారణ ప్రజలే కాకి కోట్లమందిజీవితాలను ప్రభావితం చేసిన 'యుగ పురుషులుసైతం చనిపోయాక నామరూపాలులేకుండాపోతారని తెలిసినప్పటికీ 'మరణాంతర జీవితంగురించిన ఆశలు మనుషులమనసుల్లో బలంగా పాతుకుని ఉంటాయి.


మనకు కనబడే ప్రపంచం గురించి వాస్తవికభౌతికవాదదృక్పధం అలవరుచుకోవటానికిఎవరూ వేదాంతులు కానవసరంలేదుమనం బడిలో చదువుకున్న


విజ్ఞానాన్ని సరిగా అవగాహన చేసుకుంటే చాలు

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...