Showing posts with label Collections. Show all posts
Showing posts with label Collections. Show all posts

Thursday, December 30, 2021

మహమ్మదీయ మహాయుగంలో గ్రంధాలయాలు




 


మహమ్మదీయ మహాయుగంలో గ్రంధాలయాలు 


5. భోజరాజు గ్రంథాలయము. క్రీస్తుశకము పండెండవళతాబ్దికి చెందిన కవిపోషకు డగు భోజరాజు గ్రంథ భాండారమే రాజనిర్మిత భాండా గారములలో మనకు తెలిసినవానిలో మొదటిది. కవి పోషకుడగుటయేగాక ఈ మహారాజు స్వయము కవి; పండితుడు. ఎంజనీరింగు, ఆర్కిటెక్చరు మున్నగు కళలను గూర్చినదగు 'సమరంగన' మనుపుస్తకము అతని రచనము. గైక్వాడువారి ఓరియంటల్ సీరీసులో కొలది వత్సరములకు పూర్వము ప్రచురించు భాగ్యము నాకు గలిగేను. సిద్ధరాజను పేరుగల చాళుక్యరాజు ఈభోజ రాజు రాజ్యమును జయించి ఈతని గ్రంథాలయమునుతన రాజధానీనగరమగు అహిల్ వాడునకు గొనిపోయి తన గ్రంథ భాండాగారమున కలుపుకొనేను. ఈ ఆన్ హిల్ వాడు నేడు పేటన్ అను నామమున శ్రీ గైక్వాడ్ మహారాజానారి సంస్థానమున ఒక నగరమైయున్నది.


5. ముహమ్మదీయుల దండయాత్రలు. గజనీముహమ్మదు దండయాత్రలతో హిందూ దేశ చరిత్రమున హిందూమహాయుగమునకు ఆశ్వాసాంత మైన జనవచ్చును. గజనీముహమ్మదు దేవాలయము లను నాశనముచేసెను, అర్చకులను తన క్రూరఖడ్గము నకు బలియిచ్చెను. అట్టిస్థితిలో అర్చకులు, పండితులు తమకు సాధ్యమైనన్ని గ్రంథములను గైకొని టి బెట్టు, నేపాళము మొదలగు దూరదేశములకును, ఎడారినడుమ నుండి దుర్గమమైన కౌసల్ మియరు మొదలగు తావుల


గము : గ్రంధాలయములు


కును, తదితర ప్రదేశములకు పారిపోయిరి. ఇక ముహమ్మదీయయుగమునందలి భారత దేశ గ్రం థాలయముల చరిత్రను గూర్చి తెలిసికొనవలసియున్నది.


9. ముహమ్మదీయులు:


హిందూసాహిత్య విజ్ఞానము. సాహిత్య


దండెత్తి వచ్చిన ముహమ్మదీయులు క్రమముగ దేశ పాలకులు నిచ్చట నిలిచిపోయిరి. పాలకులు పాదు కొనినపిదప వారికి సాహిత్యవిజ్ఞానాభివృద్ధివి వయమున శ్రద్ధవహించు:ుకు సావకాశము సమకూడెన. అపుడు వారు మసీదులను కట్టించిరి; ముహమ్మదీయ మతవ్యాప కమునకై పాఠశాలలు పెట్టించిరి; ముహమ్మదీయ విజ్ఞాన ప్రచారపరిశోధనలకై కళాశాలల నిర్మించిరి. కాలక్రమ మున వారిదృష్టి హిందువులు మతగ్రంథముల పైగూడ ప్రసరింప నారంభించెను. హిందువుల ధర్మగ్రంథములు వారియాజమాన్యమున పారశీక భాషలోనికి అనువదింప బడుటకు శుభారంభము జరిగెను. 3. ఢిల్లీ నగరము.


బానిసరాజుల కాలమున ఢిల్లీ నగరము విద్యాశాలలకు విఖ్యాతినందెను. పలువురు విద్యాసంతు లానగరమునకు చేరిరి. బానిసరాజులు విద్యాగోష్ఠియందు బహుప్రీతిని చూపిరి. కవులు, పండితులు తాము రచియించిన నూతన కావ్యములను, గ్రంథములను చదువుచుండ వినుటను ఆరాజులును, ప్రధానులును ఘన కార్యముగా భావించిరి. ఖిల్జీ రాజ్యసంస్థాపనాచార్యుడగు జలాలుద్దీన్ పండిత  


రత్నమును, కవిరాజును అగు అమీర్ ఖుస్రు అనువాని రాజభాండారపాలకుని నియమించి అతనికి కొరాన్ పరిరక్షకుడు అను బిరుదమిచ్చి అతని యుద్యోగ ము నాకు మంచివేతనమును ఏర్పఱచెను. గ్రంథ భాండాగ పాలకులలో ఈ అమీర్ ఖుసుకు జరిగినంత గౌరవము మఱి యెవరికిని జరిగి ముండ లేదనుట అతిశయోక్తి గాదు.


1. చక్రవర్తి ఫిరోజ్ టూగ్లక్. మొగలాయి చక్రవర్తులకు పూర్వులైన ముహమ్మ


దీయ చక్రవర్తులలో ఫిరోజ్ టూగ్లక్ నామము భారత దేశ గ్రంథాలయోద్యమ చరిత్ర కారునకు పూజనీయ మైనది. ఫిరోజ్ స్వయము పండితుడు; విశేషించి పండితపోషకుడు. విదేశములనుండి పండితులను రప్పించి వారితో సద్దో సలుపుటకు ఆతడు ముచ్చటపడు వాడు. అల్లు వచ్చిన పండితులు ఆవాసమునకు గాను అతను రాజభవనము నొకదానిని ప్రత్యేకించెను. విద్యావంతు డగు ఈ ప్రభువు హైందవపండితులను రాజసేవలో నియమించెను. హిందువుల సారస్వతముతో పరిచయ ముసంపాదింప తన మతస్థులను హెచ్చరించెను. నాగ ర్కాట్ నందలి దేవాలయమున ఒక చక్కని సంస్కృత గ్రంథ భాండాగారముండుటను తెలిసికొని పారశీక భాష నేర్చిన హిందూపండితుల నట కార్యను లుగ నియమించి ఆచ్చటి అపూర్వ గ్రంథములను కొన్ని ని రశీక భాషలోనికి అనువదింపజేసెను. Que మరణానంతరము భారత దేశ గ్రం థాలయోద్యమము కొంత కాలముకుంటువడినదని చెప్పవచ్చును. ఈ కాల మున తైమూరు హిందూదేశముపై ఎత్తిచ్చి ఢిల్లీనగర మును కొల్లగొట్టెను.


5. మఱికొన్ని చిన్న రాజ్యములు. మొగలుల కాలమునాటి భారత దేశ గ్రంథాలయో ద్యమచరిత్రను వివరించుటకు పూర్వము ఈ కాలము నాటి మఱికొన్ని చిన్న రాజ్యములు గ్రంథాలయోద్యమ విషయమున ఎట్లు కృషి చేసినవో తెలిసికొనవలసియు 8. అహమ నగరమున బహమనీ రాజులు ఒక న్నది. చక్కని గ్రంథ భాండారమును నిర్మించి క్రమముగ నిర్వ హించిరని తెలిసికొనుట కావందముగ నున్నది. ఆ రాజులు దీనికి ఒసగిన పోషణము అనంతమును,


అత్యంతశ్లాఘాపాత్రమును ఆయినదే అయినను పదు నేనవశతాబ్దిలో వారికడ మంత్రిగనుండిన ముహమ్మదు గవాను చేసినదానము ముందు అది డిందుపాటు నొందు చున్నది. డక్కనునందలి భాండాగారములందు అక్కడ క్కడ అతని పద్యమాలికలు నేటికిగూడ మనకు దొరు కుచున్నవి. అతడు కోటికి పడగ ఎత్తినధనవంతు డేయ య్యు చేతికి ఎముక లేని నెఱ దాతగుటచే మరణకా లమునాటికి ఆతని బొక్కసమున లెక్క కాసులుమాత్ర ముండెను. ఉన్నతభావములుగల పోడిమీ జీవితమున ఆతడు ఋషివలె దినములు గడపెరు. అతని ధనమం తయు మసీదులు కట్టుటకు, పండితులను పోషించుటకు, గ్రంథ భాండాగారములను నిర్మించుటకు న్యాయపఱుప బడెను. బీజపురమున ఆదిల్ షాహి వంశపురాజులుగూడ నొకచక్కని భాండాగారమును నిర్వహించిరి. ఆ గ్రంథాలయమునందలి పలుగ్రంథములను ఔరంగజేబు ఢిల్లీ నగరమునకు గొనిపోయినను పందొమ్మిదవ తాబ్దిని అగ్రంథాలయమును సందర్శించిన డాక్టరు ఫెర్గుసన్ దాని మంచిదినములలో ఆ గ్రంథాలయము బ్రహ్మాండ మైనదైయుండవలెనని అభిప్రాయపడినాడు. వంగ దేశ మును రిపాలించిన తొలిజట్టు ముహమ్మదీయ ప్రభువు లలో క్రీస్తుశకము 1282 మొదలు 1825 వఱకు పరిపా లనము సాగించిన నాదిర్షా భారత దేశ గ్రంథాలయో ద్యమచరిత్రకారుల ఎల్లరచే స్మరింపదగినవాడు. ఇంగ భాషలోనికి మహాభారతము ప్రథమమున భాషాంతరీక రింపబడుటకు ఆతనిఆజ్ఞయే కారణము .


5. మొగలాయి చక్రవర్తుల కాలము. మొగలాయి చక్రవర్తుల కాలమున భారత దేశ గ్రం థాలయోద్యమము హుటాహుటినడలతో సాగినదని చెప్పవచ్చును. మొగలాయి చక్రవర్తులు, రాణులు, రాజకుమారులు కళాసాహిత్యములందు మంచి అభిరుచిని, అభినివేశమును చూపిరి. మొగలాయీల మూలపురుషుడగు తైమూరు రచియించిన స్వీయ చరిత్ర నేడును ఉపలబ్ధమగుచున్నది. ఈ తైమూరువలె నీతిని వంశీయులును స్వయము గ్రంథకర్తలై విలపిల్లిరి. వెంగ లాయి రాజవంశసంస్థాపకుడుగు బేబరు గొప్ప విద్వాం సుడు. 'బేబర్ నామా' అను పేరుగల ఆతని స్వీయ


చరిత్ర ఆతరగతివాఙ్మయములో ఎన్నదగినదై నేటి కిని ప్రకాశించుచున్నది. పుస్తకములలో చిత్రములను రచియించు ఆచారమునకు బేబరు ఆద్యపురుషుడన వచ్చును. పుస్తకములు సచిత్రముగ ప్రచురించు పద్ధతి కనుగొనినది మొగలులకు కీర్తిదెచ్చిన విషయము గా నేటికిని మనము చెప్పుకొనుచున్నాము. బేబరు తన గ్రంథములయం దన్నిటియందును చిత్రములను చేర్చు వాడు. బేబరు అనంతరము మొగలాయిసామ్రాజ్యము నగు నియంతయైన ఆతని తనయుడు హుమాయూను తాను జైత్రయాత్రలకు పోవు నవసరమునగూడ కూడ నొకపుస్తకభాండాగారమును తరలించుకొని పోవు వాడు. చరిత్రకు అందిన ప్రథమసంచార గ్రంథాలయ మిదియేయని నిస్సంశ తముగ చెప్పుకొనవచ్చును. ఈ సందర్భమున నెపోలియనును గూర్చిన ఒక సంగతి సాదృ శ్వనిబంధనమున జ్ఞప్తికి వచ్చుచున్నది. నెపోలియను పుస్తకములనిన చెవికోసికొనువాడు. మంచి పుస్తకములు నెంచి ఆతడు అందు ఒక్కొక్క గ్రంథమును జేబునం దిముడు చిన్న సైజున ముద్రింపించి సుందరముగ బైండు చేయించియుంచుకొని ఈ గ్రంథసంచయమును తాను ఎచ్చటికిపోయిన అచ్చటకు గొనిపోవువాడు. హుమా యూను గ్రంథాలయాభిమానము మిక్కిలి మెచ్చదగి నది. ఆతడు తన విలాసమందిరమును ఒక గ్రంథాల యముగ మార్చిపై చెను. గ్రంథాలయ ప్రియుడగు ఈ రాజొక సారి గ్రంథాలయముననుండగా కాలుజారి మేడ మెట్లపైనుండిపడి అప్పుడు తగిలిన దెబ్బలు కారణము గా మరణించెను. హుమాయూన్ తనయుడు అక్బరు పాదుషా ఒక గొప్పగ్రంథ భాండాగారమును కూర్చెను. తాను జయించిన ఒక గుజరాతు దేశపురాజుయొక్క మునుగూడ నీతడు తన స్వాధీనము లోనికి తెచ్చికొ నేను. తనకడ మంత్రిత్వమువహించి యున్న ఫెయిజి అను వాని గ్రంథ సముదాయమును సయితము అక్బరు తన సొంత గ్రంథ సముచ్చయమున చేర్చికొ నేను. ఈ పుస్తకములన్నియు మూడుభాగ ములుగ విభజింపబడెను. పద్యము, వైద్యము, జ్యోతి షము, సంగీతము అను విషయములకు చెందిన గ్రంథము లన్నియు మొదటి విభాగమున చేర్చబడెను. భాషా


తత్త్వము, వేదాంతము, మతము, ఖగోళశాస్త్రము, రేఖాగణితము అను విషయములకు చెందిన గ్రంథము అన్నియు రెండవ విభాగమున చేర్పబడెను. వాఖ్యాన ములు, వంశ చరిత్రలు, న్యాయశాస్త్రము అను విషయము లకు చెందిన పుస్తకములన్నియు మూడవవిభాగమున చేర్పబడెను. పుస్తకములలో చిత్రములను చేర్చు ఆచా రము ఈతనికాలమున బాగుగ పెంపొందెను. పుస్తక ములను సంకరతరముగ బైండింగు చేయు విషయమున ఈచక్రవర్తి హయాను. లో అతిశ్రద్ధ చూపబడెను. మొగలాయిచక్రవర్తులు స్వయముగా గ్రంథములను ప్రోవుచేయుటయందు అత్యుత్సాహమును చూపు పోయే గాక తమపూర్వులు ఏర్పఱచిన గ్రంథ భాండారములను కంటవతీడుకొని పరిరక్షించుట యందును విశేషాభి మానము చూపిరి. ఇంతటిదీక్షతో, ఇంతటిశ్రద్ధతో మొగలాయిచక్రవర్తులు సంతరించిన గ్రంధ సముదాయ మంతయు క్రీస్తుశకము 1739 వ సంవత్సరమున ఢిల్లీ నగ రముపై ఎత్తివచ్చి దానిని కొల్లగొట్టిన పారశీకుడు నాదిర్షా చేతులలో బడెను. 5. ఇతరరాజుల గ్రంథభాండాగారములు.


దక్షిణ భారత దేశపు సుప్రసిద్ధులగు రాజ నొడగు టిప్పుసూల్తాను బహుళ గ్రంథములను సేక రించెను. 1799-వ సంవత్సరమున శ్రీరంగ పట్టణము పట్టు కొనబడినపుడు ఈగ్రంథ సముచ్చయమంతయు నాశ నము చేయబడెను, లక్నో స్నే పట్టణము పట్టుకొనబడినపుడు 1884వ సంవత్సరమున అయోధ్యనబాబు గ్రంథా లయముకూడ నిప్లేయయ్యెను. కాని పలువురు రాజుల భాండాగారములు కాలపురుషుని నాశనఖడ్గమునకు ఎదురొడ్డి నిలచినవి. నేపాళము, కాశ్మీరము, మైనూ రు, జయపురము, జోధపురము, భోపాల్, ఆళ్వారు రాజ్యములందు పురాతన గ్రంథ భాండాగారములు నేటి కిని సుస్థితీయందున్నవి. ఆయాభాండాగారము లందలి గ్రంథములకు నేడు మంచిమంచి కెటలాగులు తయారు చేయబడియున్నవి. తంజావూరు ప్రభువుల గ్రంథభాం డారము మదరాసు ప్రభుత్వము వారి పరిరక్షణము నంది ప్రజోపయోగకరమైన సంస్థయై ప్రకాశించుచున్నది.


( బరోడా సంస్థానంలోని గ్రంథాలయ శాఖాద్యక్షులు కీ.శే న్యూటన్ మోహన్ దత్తా గారి ఆంగ్ల వ్యాసం ఆధారంగా ) 

( ఆంధ్రభూమి - వార- అక్టోబర్ 1938 సంచిక నుండి సేకరణ ) 


కథ బొమ్మల పెళ్లిళ్లు కొడపటిగంటి కుటుంబరావు. ( ఆంధ్రభూమి - మాస- 1938, అక్టోబర్ సంచిక ) సేకరణ కర్లపాలెం హనుమంతరావు



 


కథ 

బొమ్మల పెళ్లిళ్లు 

కొడపటిగంటి కుటుంబరావు.

( ఆంధ్రభూమి - మాస- 1938, అక్టోబర్ సంచిక ) 

సేకరణ కర్లపాలెం హనుమంతరావు 

30-12-2021 

బోధెల్ - యూఎస్ఎ



ఆరోజు సరోజినికి పర్వదినం. ఆపిల్లకళ్లకు సమస్తం ఆనందమయంగా తోచింది. 


వాళ్ల బావ భైరవమూర్తి గారి మేడ టాజిమహల్లాగుంది. ఇంటిపక్క తోట నందనవనంలాగుంది. తనతో తోటలో పికారు చెయ్య టానికి వచ్చిన సావిత్రి సాక్షాత్తూ దేవకన్యకలాగుంది. 


ఆరోజున సరోజినికి సావిత్రినిచూస్తే అనురాగంపొంగి పొర్లటం మొదలు పెట్టింది. ఈ ప్రేమావేశం తాత్కా లిక మేఫనీ, పూర్వం ఉన్నదికాదనీ, ముందుండబోదనీ ఆ ఉత్సాహంమీద సరోజినికి తోచటం అసంభవం. దీనికంతా కారణం అప్పుడే ప్రవేశిస్తున్న వసంతరుతువు కాదు, ఆనాడు భైరవమూర్తిగారి శిశువు అన్నప్రాశన.


మీరు సావిత్రినికాని సరోజినిని కాని ఇద్దరినీ కాని బాగా ఎరిగుండకపోతే ఇద్దరూ కవలపిల్లలని చెప్పినా నమ్ముతారు. 


నిజానికిమటుకు సరోజిని సావిత్రికి పిన తల్లి. సావిత్రి సరోజినికన్న ఏమాత్రమో పెద్దదీ, సరోజినికన్న మితభాషి కూడా కావటంచేత చూడగానే ఇద్దరిలో కనపడే భేద మేమిటంటే సావిత్రి పినతల్లికంటె గంభీరంగా ఉండేది. అంతకుమించి ఇద్దరిలోనూ ఎక్కువ తారతమ్యం లేదు.


సరోజిని సావిత్రిని తోటంతా తిప్పి ఆఖరుకు  తన ప్రాణానికి మంచి పాదరిల్లంటిది కనపడ్డ చోటు  చూపి ఇక్కడ కాస్సేపు కూర్చుందామన్నది. 


ఇద్దరూ ఆకుల కింద కూర్చున్నారు. కొంతసేపు ఆకబుర్లూ ఈకబు ర్లూ చెప్పి సరోజిని అసలు సంగతి కొచ్చింది.


“అయితే, సావిత్రీ బావ నీ పెళ్లి చేస్తాడుట నిజవేనా ? " 


సావిత్రి సమాధానంగా పినతల్లిని చూసి నవ్వింది.


"అంతా నిశ్చయమయిందా?" 


" అదే నిశ్చయం. ఇంకా తాంబూలా లిచ్చుకో లేదు.”


2


“నీ కాబొయ్యే మొగుడెవరు ?  "


సావిత్రి చాలా నేర్పరి. ఎటువంటి ప్రశ్న కటువంటి సమాధానం చెప్పాలో ఎరుగును .


“ఎరగవు టే? మామయ్య ఇక్కడ చదువుకునేట ప్పుడు వస్తూండేవాడే—రాధాకృష్ణ మూర్తని !” 


" నాకు బాగా జ్ఞాపకంలేదు... అయితే నీకీ  సంబంధం ఇష్టమేనా?" 


" ఎందు కిష్టంకాదు?”,


సరోజిని తనావిషయం మాట్లాడదలుచుకున్నది అ యిపోయినట్టు నన్న గొంతుతో ఏదో మంగళహారతి ఎత్తిచప్పున ఆపి “ఇప్పు డీసంబంధం కాకుండాపోతే?” అన్నది.


" ఏమిటి?"


“నిన్ను ఆ అబ్బాయికిచ్చి -ఆయన పేరేమిటి? —ఆయనకిచ్చి చెయ్యరనుకో..”. 


" పోనీ!...అయినా ఎందుకు చెయ్యరు?”.


"ఇంకొకరి కిచ్చిచే స్తే!" 


" ఇంకో రెవరు?"


“అన్నయ్యకి స్తే!”


సావిత్రి నవ్వి “తాతయ్య కిష్టంలేదుగా?" అంది. 


"తాతయ్య సంగతి కాదిప్పుడు! నీ సంగతి చెప్పు!"


" ఏమో! నా కంత యిష్టంలేదు సుమా. మామయ్య ఎప్పుడూ మేనకోడలిని చేసుకోటం నీతి కాదఁటుంటాడు. అయినా ఇప్పుడెందు కాఆలోచన?”


సరోజిని సావిత్రి చెయ్యి తీసుకుని వేళ్లు సాగ దీస్తూ “ఇవాళ మా నాన్న మీ నాన్న నడగబోతున్నాడు. నిన్ను అన్నయ్య కియ్యమని. నీకింకా తెలీదేమో?” అని సావిత్రి మొహం వంక చూసింది. 


సరోజిని అనుకున్నట్టు సావిత్రి మొహాన  ఏభావం కనపళ్ళేదు. 


ఇంత రహస్యం చెప్పినా సావిత్రి చలించకపోవటంచూసి సరోజినికి ఉత్సాహభంగమైంది. ఇద్దరూ కొంతకాలం మౌనంగా కూర్చున్నతరువాత సరోజిని పోదామంటూ లేచింది.


“కాస్సేపు కూర్చోవే అబ్బ! ఇంట్లో ఏముంది?"


"ఇంకా అడుగూ బొడుగూ కాఫీ ఉందేమో తౌగి ఇప్పుడేవస్తా. లేకపోతే మంచినీళ్లైనా తాగుతా: ఏం చేస్తాం!" అంటూ చెయ్యి వదలించుకుని సరోజిని ఇంటి వైపు పరిగెత్తింది.


సరోజినటువెళ్లింది, సుందరం ఇటొచ్చాడు. అతను వెనకనించి సావిత్రిని సమీపించి “ఇక్కడున్నావుటే అమ్మాయి? అమ్మ నీకోసం వెతుకుతూంటేను,,, ఓసి!" అంటూ సావిత్రి పక్కనేకూలబడి ఒక చేత్తో సావిత్రిని దగ్గరికి తీసుకున్నాడు.


“నీపెళ్లెప్పుడే, పెళ్లికూతురా ? రాధాయి కంట గడు 

తున్నారూ నిన్ను! మంచివెధవ నీకు మంచి మొగుడవుతాడు. ఆలుసుమాత్రం ఇచ్చేవు సుమా! ఒక చెంపనించి తొక్కి పెడితే కాని మాటవినడు. జాగ్రత్త."


" ఏమ్మాటలు, మామయ్యా!"


"ఓసి! నీకెంతసిగ్గు ! ఒక్కత్తెవు కూర్చుని మొగుడి విషయం ఆలోచిస్తున్నావేమోనని మంచి  చెప్పబోతే తప్పా? నే పోతున్నా లే!”


" ఉండు! ఉండు! అట్లా అయితే నేనూ పెళ్లి విష యమే మాట్లాడతాను. ఒకటి చెప్పు. మేనమామను పెళ్లి చేసుకోవచ్చునా?”


"తప్పు!"


" నేను మరి నిన్ను చేసుకోబోతున్నా నే!"


సుందరం సావిత్రి చెంపమీద ఒక్కటి పెట్టి “ఈసారి  ఆమాటంటే నీతో మాట్లాడను," అన్నాడు. 


సావిత్రి చెంపరుద్దుకుంటూ నవ్వి, “ఈ మాట మీ నాన్న అన్నా ఇదేనా శిక్ష!” అన్నది. 


సుందరం ఆశ్చర్యంతో మేనకోడలి వంకచూసి, “నాకింకా తెలీదే! నీతో ఎవరన్నారు?" అని అడి గాడు.


"సరోజిని.”


“దాని కన్నీ తెలుసు!... హూఁ! ఆ అయిదు వేల కట్నం నాన్న గారి మతిచెడగొడుతున్నది. సంవత్సరం కిందట ఈ విషయం వచ్చినప్పుడు అయినవాళ్లలో కట్నంరాదని చాతనాయిన  వంకలన్నీ చెప్పి మనిద్దరికీ ముడిపడకుండా చేశాడు. ఈసారి బావ ఎట్లా తప్పించుకుంటాడు? ఇంకో వెయ్యి ఇస్తామంటే సగోత్రీకుల పిల్లనైనా చేసుకుంటారు నాన్న గారు. ఒక్కపాఠం నేర్చుకో, పిల్లా! నీ కెప్పటికైనా పిల్లలు పుడితే విశ్వ ప్రయత్నంచేసి వాళ్లకు పెద్దవాళ్ళ నెదిరించటం నేర్పు. నాకిన్నేళ్లు  వచ్చినై, ఇంత చదువు చదివాను! నాన్న గారు రేపు కొండముచ్చును పెళ్ళిచేసుకోమంటే కాదనేటం దుకు నాకు ధైర్యంలేదు... మీ నాన్న నీకు చనువిచ్చా డుగా! రాధాయినే చేసుకుంటానని పోట్లాడు.”


"నేను పోట్లాడను. నాన్న పెళ్ళివిషయం నన్నడగడు, నేను సిగ్గుపడతానని ఆయన నమ్మకం, నేను సిగ్గు లేనట్టు ఆయన కెట్లా తెలియచెయ్యటం?" 


" ఆహా ఏం లోకం ! ఎవరి పిల్లల మనసు వాళ్ళకు తెలీదు!"


ఆసాయంకాలం సుందరం, రాధాకృష్ణమూర్తి కృష్ణ ఒడ్డున ఇసకలో కూర్చున్నారు.


ఆ మర్నాడు సావిత్రి పెళ్ళికి ముహూర్తం ఏర్పాటు చేశారు. తాంబూలాలు పుచ్చుకున్నారు. ముహూర్తం ఇరవైరోజుల్లో ఉంది. 


" రాధా! నా పెళ్ళికి తప్పక రావాలిసుమా , చెల్లెలిని చేసుకుంటున్న వాడి పెళ్ళి నీకెక్కడ తటస్తపడుతుంది?" అన్నాడు సుందరం దీనంగా.


‘‘అర్ధంలేకుండా మాట్లాడతావేంరా, సుందరంగా !  అప్పకూతుర్ని చేసుకుంటున్న వాడివి నువ్వే నేం లోకం లో! నీకు మళ్ళీ అటువంటి పిల్లవస్తుందీ?”


"అటువంటి పిల్ల మాసరోజా ఒకతె ఉందిగా!" 


" ఛీ! అప్రాచ్యుడా! వాళ్ళిద్దరూ ఒకటిగా ఉంటారను కుంటున్నావుకాని, నక్కకూ —ఇద్దరికీ ఎంతో భేదం ఉంది. నాకు సంబంధమే కనపడదు.” 


“ఇంకేం? నాకు భేదమే కనపడదు. నిన్నా ఇవాళ లోపల   వందసార్లు సావిత్రిని సరోజిని పేరు పెట్టి పిలిచాను. అది పలకదు!" 


" నీ మొహం! దానిక్కోపం, వళ్ళుమంట, ఎందుకుండదు ? చిత్రంచూడు. ప్రకృతి మనల్ని వెక్కిరించటాని కిట్లాచేసిందికాని వాళ్ళిద్దరిలో నీకు కనపడ్డభేదం నాకు  కనపడి నీ కాభేదం కనపడకుండా ఉంటే ఎంత బాగుండేది. నేను సావిత్రిని కొంతవరకు నిశ్చింతగా - పెళ్ళిచేసుకునేవాణ్ణి. సరోజానీకు కుదిరేది.” 


ఇక్కడ రాధాకృష్ణమూర్తి ఈడుకుమించిన మాటన్నాడు.


"ఎందుకు దిగులుపడతావురా? పెళ్ళయిన మరుక్షణం నుంచీ  ప్రయత్నంచేసినా ఇద్దరికీ సంబంధం కనపడదు.” 


" నీదయవల్ల  అట్లా అయినా బాగుండును."


" నాన్నక్కోపం వచ్చింది మీ బావగారిమీద.”


" పెద్దకట్నం పోయిందే అని.” 


" సామెత చెప్పినట్టుంది.”


పూర్తిగా పొద్దుకూకకుండానే ఇద్దరూ ఇంటిదారి పట్టారు. భైరవమూర్తి గారి మేడముందు రాధాకృష్ణ మూర్తి గుడ్ నైటన్నాడు.


సుందరం  రాధాకృష్ణమూర్తి చెయ్యిపట్టుకున్నాడు. "ఒక కప్ కాఫీ తాగిన తరువాత. " 

" కాఫీ! అవశ్యం ”


ఇద్దరూ మూలగదిలో చేశారు. సుందరం లోపలికి వెళ్లాడు, సరోజినితో రెండు  కప్పులు కాఫీ తయారు చెయ్యమన్నాడు. అందుకని సరోజిని మూడు కప్పుల కాఫీచేసి తనకోకప్పు దాచుకుని మిగిలిన కాఫీ తెచ్చి ఇద్దరికీ ఇచ్చింది. తరవాత కొంచెం ఎడంగా నుంచుని రాధాకృష్ణమూర్తిని పరీక్ష చెయ్యటం మొదలు పెట్టింది. 


రాధాకృష్ణ మూర్తి కాఫీ కాస్త రుచి చూచి కప్పుబల్ల మీద పెట్టి "ఫైన్ ” అన్నాడు.


సుందరంకూడా కొంచెం తాగి మొహం చిట్లించి, “నాకు కాఫీ రుని తెలీదురా ఖర్మం!" అన్నాడు


" సావిత్రికీ అంతే, అన్నయ్యా దానివన్నీ నీగుణా లే" అన్నది సరోజిని నవ్వుతూ. 


రాధాకృష్ణమూర్తి కొంచెంసేపు సరోజిని వంకచూసి, తలగోక్కుని కాఫీతాగటం సాగించాడు.


ఈ కాఫీ మాత్రం ధుమాగా ఉందిరా. యమాగా ఉందనుకో! అద్భుతంగా ఉందంటేనమ్ము . ఎందుకూ? నెంగరం అయ్యరు కాఫీకి నకలు. అసలుకు సరియయిననకలు" 

 సరోజిని తల ఒక పక్కకు  ఒరగేసి  రాధాకృష్ణమూర్తి  వంక చూస్తూ "పాపం, సావిత్రికి సుందరమే మొగుడయే వాడు?" అనుకుంది.


" నేను పోతున్నాను. మీకింకేమన్నా కావాలా? " 


"నీళ్ళు” సుందరం.


" తాగటానికేనా?"…రాధాకృష్ణ మూర్తి. “


" తప్పకుండా! లేకపోతే ఈ చేదుఇట్లాగే ఉండనీమంటావా ఏమిటి?”


సరోజిని  బిగ్గరగా నవ్వుతూ పరిగెత్తిపోయింది.


రొండు నిమిషాలపాటు స్నేహితులిద్దరూ మౌనంగా  కూర్చున్నారు. చివరకు రాధాకృష్ణమూర్తికి మాట్లాడబుద్ధయింది. "మీ చెల్లెలికీ మీ మేనకోడలికి భేదం లేదంటావేంరా? " 


“ఆఁ?" అన్నాడు సుందరం పరధ్యానంగా,


" ఇద్దరికీ లక్షభేదం ఉంది.” 


" ఎవరు?"


" మీ చెల్లెలికీ- మీ సావిత్రికీ "


"ఏమిటి?"


భేదం —లక్ష భేదం—”


"ఏంభేదం?"


" ఉంది " 


"ఎందుకుంది. "


"ఎందుకు లేదు.”


ఇప్పుడు సుందరం దోవకొచ్చాడు.


‘నాఆలోచనంతా పాడు చేశావు! ఏమిటా మనం మాట్లాడుతున్నది?”


రాధాకృష్ణమూర్తి మళ్ళీ వెనక్కి రాదలుచుకోలేదు. "సావిత్రి ఇంత ఉత్సాహంగా ఉండదు.”


స్నేహితు డేంమాట్లాడుతున్నాడో తెలీక సుందరం " ఆఁ?" అన్నాడు. ‘


" ఇంక మాట్లాడదు.".


" ఎవరు?" 


'' సావిత్రి.” 


" సావిత్రంటే  . ఓహో సావిత్రా? ఇంకాసావిత్రేమో ననుకున్నా!"


" ఇంక నవ్వ దసలు .”


"ఎవరు? సావిత్రేనా?"


" ఆ! అంటే సావిత్రికాదు? సావిత్రి!"


"సావిత్రి నవ్వదా ?”


"నవ్వదు. ఎందుకు నవ్వాలి? నవ్వు నాలుగందాల చేటు  " 


రాధాకృష్ణమూర్తి తలగోక్కుని అకస్మాత్తుగా " గుడ్ నైట్" అని వెళ్లిపోయినాడు.




జరిగిన సంగతి  ఏమిటంటే రాధాకృష్ణమూర్తి మొదట సావిత్రికోసం ఉబలాటపడ్డప్పుడు తనమనస్సును ఆపిల్ల కర్పించుకున్నాడు. ఒకపిల్ల తన అనుజ్ఞ లేకుండా తన మనసును ఎత్తుకుపోయినట్లు   అతనికి కొత్త అనుభవం. అనుభవంలేనివాడు కనకనే పని పెట్టుకొచ్చి సరోజిని తన మనస్సును   ఆకర్షిస్తుంటే చూస్తూ ఊరుకున్నాడు. దానికి అతనికివ్వబడ్డ విశేషేమిటంటే సరోజిని !


రాధాకృష్ణమూర్తి మాట్లాడుతున్నది వినిపించుకో కుండా సుందరం ఆలోచిస్తున్న దేమిటంటే తన చెల్లెలికీ సావిత్రికీ ఏం సంబంధం ఉందా  అని. దానిక్కారణం ఉంది. 


అతను సావిత్రిని సరిగా చూసింది కిందటిరోజు ఉదయం. చెల్లెలిని సరిగా చూసిందంతకు పూర్వమే! మగ వాడికి పెళ్లియావ లేనంత కాలం ఆడపిల్లలంతా ఒకటి గానే ఉంటారు. వాళ్ళిద్దరికీ కొంతపోలికకూడా ఉండే చెప్పేదేమిటి?


అన్నిటికన్న ముఖ్యమైనవిషయం మొదటినించీ సావిత్రికి దిగులు తన్ను తనమామ కియ్యరనే .


—కొడపటిగంటి కుటుంబరావు.

( ఆంధ్రభూమి - మాస- 1938, అక్టోబర్ సంచిక ) 

సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

30-12-2021 ; బోధెల్ ; యూఎస్ఎ


Monday, December 27, 2021

కథ ఆప్తబంధువు - ఏల్చూరి విజయరాఘవరావు సేకరణ - కర్లపాలెం హనుమంతరావు

 కథ 

ఆప్తబంధువు 

- ఏల్చూరి విజయరాఘవరావు 

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 


“ధన్ ధనా- టక్ టకా - ధన్ ధనా- ట౯కా- తక తకిట తకతకిట--- తకతకిట తకతకిట 

ఖండజాతి లయలో..  శరవేగంతో పరిగెత్తుతోంది రైలు బండి. 

బెజవాడ రావడానికింకా ఎనిమిది గంటలన్నా పట్టచ్చు. పానకాల్రావుకు నిద్ర రావడంలా. 


అమావాస్య చీకటి రాత్రుల్లో చెట్లూ, చేమలూ, గుళ్ళూ- గోపురాలూ, పల్లెలూ- పట్నాలూ, గతంలోకి మాటుమణిగి పోతుంటే, ముందు రాబోయే స్టేషన్లన్నీ భవిష్యత్తులో పొంచి కూర్చున్న ఆశల్లా వువ్విల్పూరిస్తూ పానకాల్రావు మనస్సును పదే పదే పీకుతున్నాయి. .  గమ్యం దగ్గర కొస్తున్న కొద్దీ! 


అతని తొండర వాటికేం తెలుసు మరీ! ఇవ్వాళన్నా యీ మాయదారి రైలును మరికాస్త తొందరగా పరిగెత్తించే నాధుడే  లేడా? 


తెలుసు. అల్లా జరగడం అసంభవమని. అయినా బాణం తగిలిన జింకలా కొట్టుకుంటున్న పానకాల్రావు గుండెల్లో తర్కశక్తి నెప్పుడో మింగేసింది ఆవేశం!


' మదర్ సీరియస్... కమ్ సూన్' మామయ్యిచ్చిన టెలిగ్రామిది... 


ఇదమిదం తెలియడంలో అలాంటి పరిస్థితిలో పానకాల్రావేమిటి , పాపారావైనా, పార్వతమ్మయినా ఆ సందిగ్ధావస్థలో .. ఎవరైతేనేం తడబడక తప్పుడు గదా! 


ప్రాణాలతో తల్లిని చూసి తీరాలి. "నాన్నా! ఎల్లా వున్నావురా? ఎన్నాళ్లయిందో నిన్ను చూచి!..." అంటూ ఆప్యాయంగా తల్లి బుజ్జగిస్తూ పలికితే, తను గంగా యమునా సరస్వతు లీదుకుంటూ వొడ్డు చేరుకుని, స్వర్గానికి నిచ్చెనకట్టి , గంధర్వగానంతో అప్సరసలు నృత్యం చేస్తున్న ఇంద్రసభలో జారిబడ్డట్టు మురిసిపోడూ మరి! 


ఏమిటో!


రాత్రింబవళ్ళూ కవిత్వం రాసే పిచ్చితో ఇలాంటి వూహలే. రైల్లో కూర్చున్నా! 


తెల్లగా 'ధగ' 'ధగ'లాడే గడ్డం, లాల్చీ, ధోవతీ- 'ఫట్టు 'మని పరాయి వాళ్ళు చూస్తే, విశ్వకవి టాగూరు గారి వేలువిడిచిన తమ్ముడిలా కనిపిస్తాడు పానకాల్రావ్! 


పత్రికలో పని చేస్తున్నాడు. సబ్ ఎడిటర్. "క్షణం తీరిక లేదు. దమ్మిడీ ఆదాయం లేదు" అంటుంటాడు పదే పదే . అయినా చేసే పనిలో మామిడికాయ రసం తాగుతున్నట్లు సంతృప్తి కనబడడంతో, “మనసు గుర్రం' కళ్ళాలింకా చేజారి పోలేదు! 


ఎన్నాళ్ళ నుంచో " అమ్మ"ను చూడాలనుకుంటూ, ఢిల్లీ నుంచి బెజవాడకు పోయే విమానాలవీ, రైళ్ళ "టైమ్ టేబుల్స్" రోజూ తన పత్రికలో అచ్చవుతుంటే బట్టీ పెట్టడం తప్ప. పని కల్పించుకుని టిక్కెట్టుకొని బెబవాడ వైపు ప్రస్థానం  చేసే ఘడియలిల్లా తల్లి అనారోగ్యంతో తన్ను పీక్కుతినబోతున్నాయని అతను కలగన లేదెప్పుడూ...


"ధన్ ధనాటకకా.." 


రెండవ తరగతి పెట్టె కిక్కిరిసి, నిండు  చూలాల్లా కదలలేక కదులుతున్నట్టు తూలుతోంది. అర్థ నిద్రతో వున్మీలితమైన కొందరు ప్రయాణీకుల కళ్ళల్లో రైలు....


ఈ మధ్య టీ. పీ. జోరుకదా! ఆదివార మొస్తే "మహాభారతం” తప్పదందులో కొందరు ప్రయాణీక ప్రేక్షకులకు! కానీ రైల్లో ఎల్లా?! 


సొంత జీవితపు "భారతం"లోని వొడుదుడుకులు మరిచిపోవడానికి "మహా భారతం" పుస్తకం చదువు కుంటున్నాడు పానకాల్రావు... 


అనుకోకుండా వచ్చిన ప్రయాణం గనక "అన్ రిజర్వుడు" పెట్టెలో ఎలాగో కాళ్ళు ముడుచుకుని కాలక్షేపం చేస్తున్నాడు. 


బెజవాడ రావాలి. స్టేషన్లో మామయ్య కనపడి "అమ్మకేం ప్రమాదం

లేదులే, భయపడకు పానకాలూ" అనాలి.... "


నజాయతే మ్రియతేవా కదా చిన్నాయంభూత్వా

భవితా వాసభూ యా ః..." 


భగవద్గీత" పేజీలు తిరుగుతున్నాయి.....


"వాట్ ఎ రాటెన్ రష్?” సూటూ బూటూ, 'ఫెదర్' హ్యాటూ, చేతిలో ఎ.ఐ.పి. ఫాన్సీ బ్యాగూ, అర్థరాత్రయినా 'ఆరంజీ కలర్' కూలింగ్ గ్లాసులూ.... మిగలక మిగలక మిగిలిన అర ఇంచీ ఖాళీ స్థలం వైపు పానకాల్రావును "జరగమ"ని "ఫారిన్ జంటిల్మన్" ఠీవితో సంజ్ఞ చేస్తూ, ఏం జరుగుతున్నదో అర్థం చేసుకునే లోపలే బిత్తర చూపులు చూస్తున్న పానకాల్రావు పక్కన "దఢీలున" కూర్చుండి పోయాడొక   ఆగంతకుడు!! 


సంగీత సాహిత్యా లెవరినైనా మనస్కుల్ని శాంతింప  చేస్తాయేమో! హఠాత్తుగా జరిగిన అన్యాయానికి బాధపడుతూ కూడా నెమ్మదస్థుడైన పానకాల్రావు "ఏమనాలో" తెలీకుండానే"నమస్తే" అనేసి. ఇంకొంచెం జరిగి కూర్చున్నాడా పెద్ద మనిషి “వసతి" కోసం!


"అతిథి దేవో భవా!"


ఇది మన భారతీయుల నిండుతనం! 


" ఎందాకా?" తన పై వుద్యోగస్తుడిలా ప్రశ్నించాడా పెద్దమనిషి!


"బెజవాడ."


"ఇంకేం. నేను బెజవాడే. ఎప్పుడూ విమానంలో తప్ప ప్రయాణం చేయలేదు. అమెరికా నుంచి మేం దిగి నాల్గు రోజులైనా కాలా. అబ్బ! ఇలాంటి చెత్త రైళ్ళల్లో మీరెలా ప్రయాణం చేస్తారర్రా! ఇట్ ఈజ్ ఎ షేమ్! మా వూళ్ళో ఇంట్లో కన్నా రైల్లోనే కమ్మటి  నిద్దరొస్తుంది! వాషింగ్టన్ లో  పడుకుంటే న్యూయార్క్ లో బెహరా వొచ్చి కాఫీ యిచ్చి లేపిందాకా మూసిన కన్ను తెరవపన్లా ! .... అది సరేగాని, ఏమిటా పుస్తకం?"


" మహా భారతం."


పానకాలావు కయోమయంగా వుంది. అయినా ఈయన లెక్చర్లు వింటూ ఎలాగోలా రాత్రి గడిచి కొంప జేరుకొంటే కొంత ఆదుర్దా తగ్గుతుందేమో! మరి వేరే గత్యంతరం?


"మీకు థ్రిల్స్ కావాలంటే “మహా భారతం" చదివేం లాభమండీ! ఇదిగో "గాన్ విత్ ది విండ్" నేను ముఫ్ఫయ్యొకటో సారి చదువుతున్నా. మనం బెజవాడ చేరే లోపల మళ్ళీ చదువడం పూర్తయితే మీకిస్తా లేండి... అయినా యీ రైళ్ళల్లో ఫ్యాన్లు బాగు చేసే నాథుడే లేడాండీ! ఇక్కడ గాలిరాదు.  కిటికీ తెరవాలంటే సుత్తితో కొట్టినా బిగుసుకు పోయి కదలదు ! చూశారా ఆ "బల్బు"లన్నీ ఎలా పగిలి పోయాయో! వెనక పెట్టెలో బాత్రూమ్లో నీళ్ళబొట్టు లేదు. అందుకే ఇక్కడి కొచ్చా. మిమ్మల్ని ఇబ్బందిపెడుతూ - పాపం! మీ ఇండియా ఇంకా, స్టోన్

ఏజ్ కాలంలోనే నిద్రపోతున్నట్టుంది! ఇప్పుడు తెలుసా మీకు?" చంద్రలోక మేంటి "- "సూర్యలోక మేంటి " "అంగారక లోకమేంటే"- చివరకు "బ్రహ్మలోకం"లో కూడా చక్కర్లు కొట్టి , పొద్దున భూమి మీద "టీ" త్రాగి వెళ్ళిన వాళ్ళం, మళ్ళీ భార్యాబిడ్డల్తో  బాతాఖానీ కొట్టడానికి రాత్రి భోజనాల వేళ కిల్లు చేరుకోగలం!! గణితమండీ! అంతా శుద్ధ గణితం మహిమంటే నమ్మండి! అదీ అమెరికా అంటే! అలాంటి లెక్కలు  తెలిసిన మహానుభావు డొక్కడైనా మీ వూళ్ళో పుట్టాడా చెప్పండి?


వొళ్ళు మండుకొస్తోంది ఆవేశంతో పానకాల్రావుకు. ఒక్కుమ్మడిగా లేచి "రామానుజం రామానుజం" అంటూ మన మేథమేటిక్స్ మేధావి పేరు తలుచుకుంటూ, పక్కవాడి పళ్ళు రాలేట్టు చంప చరుద్దామనుకున్నాడు... కానీ...


తనలో నివురుగప్పిన నిప్పులా. .   భూమిగర్భంలో బంగారంలో దాక్కున్న సాహిత్య సంస్కారమలా చేయనిస్తుందా! 


 వీడెవడు? మన భారతీయుడేనా? చూడ్డానికి మాత్రం అలాగే వున్నాడే! అదేమి ? పచ్చి తెలుగు మాట్లాడుతుంటే! ఎరువుకు తెచ్చుకున్న సూటూ బూట లాగేస్తే..  కళ్ళూ, కాళ్ళూ.. ముక్కూ. నోరూ- అన్నీ, మనలాగే వున్నాయి మరి! అయితే ఇంత "దర్జా వాగుతున్న పెద్దమనిషి తనతో  "రెండో తరగతి" (అదీ. అన్‌ రిజర్వ్ డ్‌!)లో దేని కిరుక్కున్నట్టు?!! 


పోనీ తనకెందుకీ గొడవంతా? తనకున్న దిగుళ్ళు చాలకనా! ఇలాంటి "బేవార్సు" వాళ్ళని పదిమంది వెతుక్కుపోతుంటే... 


అయినా, అతన్ని "బేవార్సు" వాడనుకోవడం తన పొరపాటే అయితే?!! 


తను మాత్రం విమానంలోనో, ఫస్ట్ క్లాస్ రైలు పెట్టెలోనో

ప్రయాణం చేయగల అర్హత లేనివాడా మరి! అనుకోకుండా తనూ యీ "గరీబీ " పెట్టి "గలీజు" లో కళ్ళు మూసుకుని కాలక్షేపం చెయ్యాల్సిరాలా?! 


అతనికీ, అలాంటి అవసర ప్రయాణం కాకతాళీయ న్యాయంగా తటస్పంచిందేమో .. పాపం!


నెమ్మదిగా అడిగాడు పానకాల్రావు " మీదసలే వూరండీ?"


" కొన్నాళ్ళు జపాన్లో వుండే వాళ్ళం. మా ఫ్యామిలీలో సగం మంది కెనడాలో పెద్ద పెద్ద పుద్యోగాల్లో హేమాహేమీల్లా  పని చేస్తున్నారు. నాకో రెండేళ్ళ క్రితం అమెరికాలో వరల్డ్ బ్యాంకులో కి ట్రాన్స్ఫర్ అయింది. మీ ఆంధ్రా గవర్నమెంటు వాళ్ళు "బీదల కోసం ఇళ్ళు కట్టించే పథకం" కింద మా దగ్గర నాలుగు మిలియన్ల డాలర్ల అప్పు కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. ఆ సందర్భంలోనే, మీటింగ్ కోసం బెజవాడ వెళ్తున్నా. "సీదా ప్లేన్ లేదు. రైలే తొందరగా చేరుతుందని ఎవరో చెప్పారు. అందుకూ యీ రభస!"


న్యాయంగానే వుందతని వుదంతం! కానీ తన అసలు ప్రశ్నకు జవాబు రాలేదింకా. "ఇతను స్వతః తెలుగువాడా, కాదా" అని. ఈ ధర్మసందేహం తీర్చుకుని తీరాలి... అనుకున్నాడు పానకాల్రావు .


"అవునండీ! రైల్లోనే  నయం. ఈ రోజుల్లో విమానాలైనా మనల్ని "టైమ్"కు అందించి చస్తాయి గనకనా... ఒక్క మాట .. మీరు తెలుగు ఇంత స్వచ్ఛంగా మాట్లాడుతున్నారు. తెలుగు వాళ్ళేనా?"


ఇంగ్లీషులో సమాధానమిచ్చాడాయన.


"యస్. బేసికల్తీ వుయ్ ఆర్ ఆంధ్రాస్, బట్ నౌ వుయ్ ఆర్ అమెరికన్ సిటిజన్స్".


ఏమైనా, అతనికీ విషయం మీద చర్చ రుచించినట్లు లేదని, అతని ముఖ కవళికలే చెబుతున్నాయ్! 


"ధనాధనా టక్ టకా ”


మేం మేం మాట్లాడుకుంటున్నా రైలుకేం బట్టింది! శరవేగంతో 'కాలం'లా పరుగెడూనే వుంటుందది! 


బెజవాడ సమీపిస్తున్న కొద్దీ  పానకాల్రావు  పక్క మనిపి దౌర్జన్యంగా  తన సగం సీటు లాక్కుని, వారి వింతలన్నీ ఏకరువు పెడుతూ, సోది కబుర్లు చెబుతున్న మాటే మరిచిపోయి తన కోసం పంచప్రాణాలు ధారబోసె  మాతృదేవతను గురించే "వదే పదే" ఆలోచిస్తూ, ఆమె ఆయురారోగ్యాల కోసం భగవంతుణ్ణి ప్రాధేయపడుతూ, మళ్లీ ప్రయాణ బడలికలో మగత నిద్ర ముంచెత్తుకొచ్చే లోపల, "మహాబారతం" లోంచి "భగవద్గీత" పేజీలు తిప్పడం మొదలెట్టాడు అటు కన్నతల్లి అనారోగ్యపు అశాంతికీ ఇటు యీ ఆగంతకుడి "మాతృదేశ విమర్శ "దాడికీ", "కృష్ణార్జున సంవాద' మే శరణ్యమని నమ్మిన పానకాల్రావు. 


ఇంతలో ఆయనన్నాడు "అవర్ డెస్టినేషన్ ఈజ్ నియరింగ్ . ఇంతలో బాత్రూమ్ కెళ్లొస్తా ; నా బ్యాగ్ లో  ఫారిన్ ఎక్చేంజి కొల్లలుగా వుంది. కాస్త జాగ్రత్తగా చూస్తుండండేం'' 


పానకాల్రావు కాశ్చర్యమేసింది. తలా తోకా తెలియని తన మీద ఎంత “భరోసా" ఈయనకు! " ఆ డబ్బు బ్యాగ్ లోపలికే తీసుకు పోదురూ" అందామనుకుంటున్న తన సమాదానం వినకుండానే జనాన్ని తోసుకుని బాత్రూంలో కెళ్లి పోయాడా

" పారెన్ రిటరన్ !"


నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః I

న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః || 


ఇలా చదువుతూ, చదువుతూ ఎంత సేపైందో! 


మైమరచి బాహ్య ప్రపంచంతో సంబంధమే లేనట్టు గాఢమైన సుషుప్తిలోకి చొచ్చుకు పోయింది పానకాల్రావు మనస్సు . 


మధ్య మద్య ఎక్కేవాళ్లూ. దిగేవాళ్లూ "నీడ నీడ"గా కనబడుతున్నారంటే ఒకసారి టికెట్ కలెక్టరొచ్చి చెక్ చేసి పోతూ పోతూ టాగూర్ అందమైన గడ్డంతో, అపురూపమైన వదనారవిందంతో "మాంచి". పెద్దమనిషిలా  కనబడుతున్న పానకాలావు నడిగాడు కూడా " ఇక్కడెవరన్నా టిక్కెట్టు లేకుండా ఎక్కి మిమ్మల్ని అవస్థ పెట్టలేదు కదా సార్? అన్ రిజర్వుడు కంపార్టుమెంట్లలో  మాకు రోజూ ఇదే గొడవ కదా! అందుకే అడుగుతున్నా"


"ఎబ్బె! ఏం లేదండీ!" మాట వరసకనేశాడు పానకాల్రావు టిక్కెట్ కలెక్టర్ కు  ' థాంక్స్'  చెప్పి


 "ధన్ ధనా- టక్ టకా.." 


తెల్లవారుతోంది. ఈ స్టేషను గాక, ఇంకొక్కటి దాటితే బెజవాడ! 


 "ఇడ్లీ..  కాఫీ అరుపులు ! " ప్లాట్ ఫోరమ్ నిండా మోగుతున్నాయి.


తన ఎలాగో  వూగుతూ వూగుతూ, వోరబడి కాస్తో కూస్తో  నిద్రకు దిగి  లేచాడు పానకాల్రావు.  బాత్రూమ్ లో  గంటకు పైగా గడిపి, ముస్తాబై వచ్చిన పారిన్" పెద్దమనిషి' " బెజవాడ వచ్చేస్తోంది.  మీరూ బాత్రూమ్ వగైరా వెళ్లొచ్చి ప్రెష్ గా కూర్చోరాదూ?" 


ఆప్యాయంగా సొంత చుట్టంలా ఆయన అలా అంటే “వద్ద”న బుద్ధేయలేదు .  పయనమైనాడు పానకాల్రావు కాలకృత్యాలు తీర్చుకోవడానికి. 


ఖండలయలోంచి ఆదితాళంలోకి దిగి, చివరకు తాళం తప్పినట్లు రైలు రొద ఆగింది నెమ్మది నెమ్మదిగా. 


"బెజవాడ వచ్చింది’' 


అమ్మను చూడాలి! మామయ్య నాకోసం వెతుకుతున్నాడేమో!" 


అసలు రైలాగినా ఆదుర్దాతో  పానకాల్రావ్ గుండెల్లో కొత్త కొత్త రైళ్లు పరుగెడుతున్నాయి! 


బాత్రూమ్ తలుపు తీసుకుని, దిగే జనాన్ని తోసుకుంటూ సొంత సీటు దగ్గర చేరేడు. 


తన పెట్టే, బెడ్డింగూ కూచున్న చోట శూన్యం! 


ఆ పారిన్ పెద్దమనిషి లేడక్కడ! 


పరిగెడుతున్న గుండెకాయ, ఒక్కసారిగా  కొట్టుకోడమే మానేసి నట్టయింది. 


సామాను పోతే పోయింది అమ్మకు తెచ్చిన మందులన్నీ, అందులో నే వున్నాయి! 


ఏం చేయడమో ఆలోచించే లోపల మామయ్య గొంతు వినిపించింది.


“పానకాలూ- పానకాలు-"


ఇద్దరూ. కొత్తగా పెళ్లయిన  భార్యాభర్తలు పడగ్గదిలో కౌగలించుకున్నట్లు  కౌగలించుకున్నారొక్కసారి! 


" మామా” అమ్మెలా వుంది? " 


"గండం తప్పిందోయ్! నీ కోసమే కలవరిస్తోంది .. పద ! కూలీని పిలుస్తా..  సామానేదీ?"


చావు కబురు చల్లగా చెప్పమంటారు. అయినా తల్లిని ప్రాణాలతో చూడగలుగుతున్నానన్న ఆశలో పానకాల్రావుకు సామాను పోయిన దుఃఖం కించిత్తు కూడా బాధపెట్టలేదా క్షణంలో . 


గొంతులోంచి చేదు కాకరకాయ కక్కేసినట్టు "దబా" "దబా" సామాను పోయిన వ్యవహారమంతా మామయ్యతో చెప్పేశాడు.


"ఆరి నీ తస్సదియ్యా!  పట్నాల్లో కాపురం జేస్తూ ఆమాత్రం జాగ్రత్త లేకపోతే యెల్లాగోయ్! రైలు కదిలే లోపల త్వరగా .. పదమరి రైల్వే సబ్ ఇన్స్పెక్టర్ మనవాడే. గోపాలంగారు.... నడూ ! చెప్పిచూదాం! " ఇంకాయేమేమిటో అంటున్నాడు మామయ్య. 


ఈ లోపల కిందటె  స్టేషన్లో అవతరించిన “టక్కెట్ కలెక్ట"రే, మన "ఫారిన్ గెస్టు" నొక పోలీసు బంట్రోతుతో సహా నెట్టించుకొస్తూ, వీళ్ళ పెట్టి దగ్గరికి చేరుకున్నాడు!


"ఏమండీ! ఈయన టిక్కెట్టు మీ దగ్గరుందా? " 


"అదేమిటీ? ఆయన టిక్కెట్టు నా  దగ్గరెందుకుంటుందండీ?!


"అయితే ఆయన మీ "బావమరిది" కాడా మరి?" .


మామయ్య, పానకాల్రావు దిగాలుపడి చూస్తున్నారు! 


వరల్డ్ బ్యాంకు మెంబరు గారి ముఖాన కత్తి వేస్తే నెత్తురు చుక్క లేదు. 


"ఈ కొత్త బావమరి దెక్కడ దాపరించాడో" అని మామయ్య నిర్ఘాంతపోతున్నాడు! .


అప్పుడు అన్నాడు పోలీసు బంట్రోతు "మరి అతని చేతిలోని యీ పెట్టి మీది మీ చిరునామా.. మీ వుద్యోగ వివరాలూ, పేరూ వూరూ, అన్నీ అతనికి ఎంతో పరిచయంలా, గోపాలంగార్ని నమ్మించేశాడండీ! ఆ వొక్క  టిక్కెట్ట ముక్క చేతిలో లేకపోబట్టి గోపాలంగారి కనుమాన మొచ్చి. . సరిగ్గా యీయన గేటు దాటేసుకుంటున్న సమయానికి లంకించుకుని, వాకబు చెయ్యమని మమ్మల్నిలా పంపారండీ!"


"ఓరి భగవంతుడా నా పెట్టా, బేడా పాకుండా రక్షించడమే కాకుండా నాకొక కొత్త ' ఆప్తబంధువు ' ను  కూడా సృష్టించావు గదరా! ప్యాన్ లు పని చేయని, బల్పులు పగిలి, కిటికీలు

బిగుసుకుపోయిన భారతదేశపు రైళ్లల్లో హిమాలయాల నుంచి కన్యాకుమారి ప్రతిక్షణం వేలాది భారతీయులు దైనందిన కృత్యాల్లో ముగ్ధులై ప్రయాణం చేస్తూనే వుంటారు.  అవి మన కోసం- మనం వాటి కోసం జీవిస్తూనే కాలం గడుస్తుంది. 


అయితే వాటిల్లోనే, "అమెరికా, ఇంగ్లండు" వగైరాలూ, "అంగారక గ్రహం"- "బ్రహ్మలోకం" వగైరాలూ, చక్కర్లు కొట్టి ఎప్పుడోప్పుడు  తిరిగొచ్చే సమయానికి టికెట్ లెస్  ట్రావెల్ కోసం శ్రీకృష్ణ జన్మసానం పోబోతూ, మన మన "బావమరుదు" లయ్యే సదవకాశం, ఎంత మందికి దక్కుతుందో మరి! '' అనుకుంటూ “దేశపు అమ్మనూ", "కడుపున కన్నతల్లినీ"- ఇద్దర్నీ తలుచుకుంటూ, మధ్య మధ్య తన విచిత్ర ప్రయాణపు కబుర్లతో సతమత మవుతూ, మామయ్యతో సహా గుర్రబ్బండెక్కాడు పానకాల్రావ్. 

***

- ఏల్చూరి విజయరాఘవరావు 


( ఆంధ్రసచిత్రవారపత్రిక - 31-8-1990 ) 

సేకరణ : 

కర్లపాలెం హనుమంతరావు 

27-12-2021 

బోథెల్; యూఎస్ ఎ 






కవిత: యూనివర్సల్ ట్రూత్

 


కవిత: 

యూనివర్సల్ ట్రూత్


శీరోదయంతో మొదలిడి 

కపాల మోక్షంతో ముగుస్తుంది జీవితం! 

ఇదొ క'యూనివర్సల్ ట్రూత్ 

అయినా  

ప్రతివాడూ  అనుకుంటాడు

తానొక ఎక్సెప్షన్


ఈ శరీరం అగ్నిహోత్రుడికి

ఆహుతవుతున్నపుడు 

ప్రాణం గాలిలో ఏకమైనపుడు 

అస్థికలు మట్టి పాలైనపుడు 

చితాభస్మం నీటిలో కలిసి 

ఆత్మ అంబరాన్ని 

చుంచించేందుకు వెళ్లినపుడు 


అందం, ఆస్తి ఆదుకోవు 

వంశం, గోత్రం అడ్డు రావు 

బంధం. అనుబంధం తో డురావు 

జాతస్య మరణం ధృవం.


అయితే 

కొందరు బ్రతుకుతూ చస్తారు. 

కొందరు చస్తూ బ్రతుకుతారు.  

కొందరేమో చచ్చినా చావరు..  

మరుభూమిలో ఓ మజిలీవేసి 

పంచభూతాలను పలుకరించి. .. 

మళ్లీ మనలో కొచ్చేస్తారు 

లబ్ధ ప్రతిష్టులవుతారు .


-కె. సీతారామగిరి

సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

                 27-12-2021 

                 బోథెల్ ; యూఎస్ఎ 


కవిత : కానుక

కవిత : 


కానుక


( తోటి ఖైదీ, బెల్జియన్ మిత్రుడు ఆండ్రీ కోసం)

రెండవ ప్రపం యుద్ధంలో పాల్గొని మరణించిన రష్యన్ ఫ్రంట్ లైన్ కవులలో మస్సాజలీల్ ముఖ్యుడు. నాజీలు ఇతన్ని 1944లో ఉరితీశారు. నిర్బంధంలో ఉండగా జలీల్ మంచి కవిత్వం రాశాడు. అందులో ఒకటి: 


మాతృభూమిలో

జీవితం తియ్యగా ఉన్న రోజుల్లో

పువ్వుల మధ్య గడిపిన ఆ సమయాల్ని 

మళ్ళీ వెనక్కు తీసుకు రాలేను నేస్తం 

ఆ ఆనందమూ లేదు.


ఇక్కడ తోటలూ లేవు ఇళ్ళూ లేవు

స్వేచ్ఛ అసలే లేదు

ఇక్కడ 

పువ్వులు కూడా వేగంగా వాడిపోతుంది  

ఇక్కడ నేల కూడా నిర్బంధంలో మూలుగుతోంది


కానీ

నా చైతన్యం మాత్రం

సత్యంలా స్వచ్ఛంగా 

పరిశుభ్రంగానే ఉంది 

అందుకే

 నా హృదయంలో వికసిస్తున్న పాటల్ని

నీకు కానుకగా ఇవ్వనీ 

వాటికి మరణం లేదు

అవి చెరసాలలో 

ఈ ఆత్మ పూస్తున్న చెలిమి పువ్వుల్ని 

నా మాతృదేశానికి తప్పక అందిస్తాయి.


రష్యన్ కవిత : మస్సాజలీల్ 

అనువాదం : కొప్పర్తి

సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

                 27-12-2021 

                 బోథెల్ ; యూఎస్ఎ

చిన్న కథ మనసులోని మాట రచన - పిళ్లా సుబ్బారావు శాస్త్రి ( ఆంధ్రపత్రిక - వా - 02- 07 - 1956 ) సేకరణ - కర్లపాలెం హనుమంతరావు

 


చిన్న కథ 

మనసులోని మాట 

రచన - పిళ్లా సుబ్బారావు శాస్త్రి 

( ఆంధ్రపత్రిక - వా - 02- 07  - 1956 ) 


సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

                  26-12-2021 

                   బోథెల్, యా. ఎస్.ఎ



ఆ నగరంలో మంచి పేరున్న వ్యాపారి నారాయణ్ సేఠ్ . అతని తాతల కాలం నుంచీ వస్తున్న వ్యాపారం. నమ్మకస్తుడు . అతను అమ్మే సరుకు ఎప్పుడూ వివాదం కాలేదు. 


సేఠ్ దగ్గర గుమాస్తా మోహన్ లాల్ . బీదవాడు. సేఠ్ కు అతని మీద నమ్మకం జాస్తి . మోహన్ రాసే లెక్కలు తనిఖీ చేయడం గానీ, తాను లేనప్పుడు అతను కొట్లో కూర్చున్నప్పుడు గానీ ఏ ఫిర్యాదుబా ఉండేవి కాదు. మోహన్ లాల్ నిజంగా డబ్బు అవసర పడ్డప్పుడు సేఠ్ కు చెప్పి ఒప్పించుకుని మాత్రమే తీసుకునేవాడు . 


ఎన్నేళ్లు గడిచినా గొర్రెకు బెత్తెడే తోక అన్నట్లు మోహన్ లాల్  కూడబెట్టుకున్నది ఏదీలేదు . పిల్లవాడి  చదువుకు ఖర్చులు పెరుగుతున్నాయి , ఆడపిల్ల పెళ్లీడు కొస్తున్నది .. ఆలోచించరా? ' అని భార్య సతపోరడం మొదలుపెట్టింది. 


సేఠ్ ఇచ్చే జీతం ఇంటి ఖర్చులకే సరిపోతుంది. ఆయనకు మీ మీద నమ్మకం ఎక్కువా కదా! ఆలోచించండి .. అదనంగా ఎట్లా రాబట్టాలో ! ' అంది ఆ ఇల్లాలు . 


భార్య సలహా విని ఇంతెత్తున లేచాడు మోహన్ లాల్ ' నమ్మిన వాడిని మోసం చెయ్యడం మా ఇంటా వంటా లేదు . చాటుగా సేఠ్ సొమ్ము కొట్టేయడం .. అనే ఆలోచన రావడమే పాపం '  అంటూ . 


అన్నాడే కానీ, రోజా భార్య పెట్టే సోది కారణంగా క్రమంగా మోహన్ లాల్ మనసు కూడా మారడం మొదలు పెట్టింది. బిడ్డ చదువు, కూతురు పెళ్లి . . ఖర్చులు కొండల్లా ఎదురు నిలబడి ఉండేసరికి మోహన్ లాల్ మనసు పూర్తిగా మార్చేసుకున్నాడు. 


అదను కోసం ఎదురు చూసే మోహన్ లాల్ కు అవకాశం రానే వచ్చింది. తప్పుడు లెక్కలు రాసి కనీసం ఐదు  వేల రూపాయలైనా కొట్టేయాలని అనుకున్న రోజునే అదృష్టం కలిసొచ్చినట్లు సేఠ్ దుకాణం వదిలి బైటకు వెళ్లిపోయాడు.  


సేఠ్ వెళ్లంది ఎక్కడికో కాదు, రోజూ ఇంట్లో భార్య పోరు పెడుతుంది ' ఎంత నమ్మకం ఉన్నా యజమాని కింది ఉద్యోగి మీదపూర్తిగా భరోసా ఉంచడం ప్రమాదం. మోహన్‌ లాల్ పాతికేళ్ల బట్టి మన దగ్గర పని చేస్తున్నాడు. మీ పేరు చెప్పుకొని బైట ఎంతసొమ్ము వసూలు చేసుకుంటున్నాడో? ఒకసారి మన కాతాదారులు కొంత మందినైనా విచారించి రండి! చేతులు కాలాకఆకులు పట్టుకుని లాభం ఉండదు ' ఆవటా అని . అర్థాంగి మాటలలోనూ సబబు ఉందనిపించింది. ఈసారి సేఠ్ కి అందుకే బైట తనిఖీకి బైలుదేరాడు. 


ఇక్కడ గుండె నిబ్బరం చేసుకొని... ఐదు వేల రూపాయలూ ఇనప్పెట్టినుంచి తీశాడు మోహన్ లాల్ . చేతులు వణికినయ్! ఏదో భయం వేసింది! మనసులో ఆలోచనలు తిరగటం మొదలు పెట్టాయి .' సేఠ్ కి నేనంటే ఎంతో నమ్మకం! పాతికేళ్ళ బుట్టి , కొట్లో పని చేస్తూ, సేఠ్ డబ్బు తిని సేఠ్ కి ద్రోహం చెయ్యడం ద్రోహం. అంతకు మించి నీచం మరొహటి లేదు. సేఠ్ ఒక వేళ  లెక్కలు అడి గితే  తాను తప్పక దొరికిపోతాడు !పాతికేళ్ల నుంచీ యీ దొంగపని చేస్తున్నానని సేఠ్ కి అనుమానం కలుగుతుంది ! నన్ను పనిలో నుంచి తొలిగిస్తే మళ్లీ తిరిగి యిటువంటి పెద్దమనిషి దగ్గరే నాకు కొలువు అవుతుందన్న  భరోసా కూడా లేదు. ఇంత వయస్సు వచ్చిన తర్వాత కోరి పాపాన్ని తెచ్చు కున్న వాణ్ని అవుతాను. ఈ పని యీజన్మలో చెయ్యను. లక్ష్మీ దేవి తోడు| అనుకుంటూ తీసుకున్న  ఐదు వేలు తిరిగి  ఇనప్పెట్టెలో పెట్టేశాడు!


సేఠ్ కు సగం దూరం వచ్చిన తరు వాత ఆలోచన వచ్చింది . ' మోహన్ లాల్ ని నేను పాతికేళ్ల  నుంచి లెక్కల పనిలో ఉంచుకున్నాను. ఇంత వరకు తాను  లెక్కలు అడిగి ఎరుగడు. అయినా ఎక్కడి నుంచి ఏ ఫిర్యాదు కూడా వచ్చింది కాదు. తనే దొంగతనం చేసేవాడు అయితే చిన్న చిన్న ఖర్చులకు కూడా తనను అడిగే ఎందుకు తీసుకుంటాడు. ఇవాళ హఠాత్తుగా లెక్కలు అడిగితే లాల్ బాధపడకుండా ఉంటాడా ? ఆత్మాభిమానం దెబ్బతింటే  తన దగ్గర చేసే కొలువు మానేసే ప్రమాదం ఉంది.  తనకు మళ్లీ  అంత నమ్మ కస్తుడు దొరకడం అసంభవం.  ' అనుకుని వెనక్కి తిరిగి వచ్చేశాడు. భర్తకు అటువంటి తప్పుడు సలహా ఇచ్చినందుకు సేఠ్ భార్యలో తరువాత బాధ కలిగింది. 


" ఇన్నాళ్లు మన దగ్గర గొడ్డులా పని చేస్తున్నాడు.  అంత విశ్వాసంగా పనిచేసే ఉద్యోగుల మంచీ చెడు చూసుకోవడం మంచి యజమాని ధర్మం. అతనికీ పిల్లలు ఉన్నారు. ఎదుగుతున్నారు, చదువులకు, పెళ్లిళ్లకు చేతిలో సొమ్ము ఆడాలి. వెంటనే పిలిచి ఒక ఐదు వేలన్నా అతని చేతిలో పెట్టండి! ' అంది సేఠ్ భార్య . 




మోహన్ లాల్ డబ్బు ఇనప్పెట్టె లో పెట్టేశాడు! సేఠ్ బండీవి యింటికి తిప్పించేశాడు.……తిరిగి వాళ్ళు నుంచీ నేటివరకూ లాల్ కి అటు వంటి కోరికలు కలుగనూ లేదు ! నేఠ్ లెక్కలు చూడనూ లేదు !! *


నారాయణ్ సేఠ్ తనను దగ్గరికి పిలిచి ఇనప్పెట్టె నుంచి ఒక ఐదు వేలు కట్టతీసి చేతిలో పెడుతుంటే మోహన్ లాల్ కళ్లల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. 


రచన - పిళ్లా సుబ్బారావు శాస్త్రి 

( ఆంధ్రపత్రిక - వా - 02- 07 - 1956 )


సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

                  26-12-2021 

                   బోథెల్, యా. ఎస్.ఎ



Sunday, December 26, 2021

మన ప్రాచీన కవుల చమత్కారాలు

 


మన ప్రాచీన కవుల చమత్కారాలు 


( ఆంప- వా - 28 -08 - 1957 ) 


6 అంగములలోనే మే లుత్తమాంగమందు ను తమంబులు కన్నుల ఉర్విజనుల కట్టి కన్నులు 'లేపను టం తేకాక


ఉ తీసుఁడు కౌఁడె సద్గుణయు కిసతఁడు" కూతురుని ధృత రాష్ట్రున శివ్వడానికి నిశ్చ యించానని గాంధారపతి చెప్పగా బంధు పులు అన్న మాటలు.


‘సర్వస్య శాత్రస్య శిరఃప్రధానఆ సర్వేంద్రియాణాం నయనం ప్రధానమ్ '


అంటారు పెద్దలు. అవయవా అన్నింటా తల ఉత్తమం - సర్వేంద్రియాలలో నయనం ముఖ్యం. ఆలాటి కన్నులు లేవుగాని ధృత రాష్ట్రునికి లో టేమిటీ? ఎన్ని ఉంటే ఏంలాభం? కళ్లులేవు. బలే మంచి పెండ్లి కొడుకు అన్నారు. ఏపిల్ల అయినా, చివరికి నీ రేశిలింగం గారి చౌదస్తపు చలమమ్మకూడా ఒప్పుకోదు "పిండాడడానికి కొని గాంధారి అలా ఉంది. ఒప్పుకొంది. ణీ పెళా


గురువుగారుకోరినట్టు అర్జునుడు ద్రుపదుడై జయించి రథానికి కటి తెచ్చి గురుదక్షిణగా అప్పగించాడు. అప్పుడంటాడు ద్రోణుడు_


‘వీరెవ్వరయ్య ద్రుపదమ హారాజులె ఇట్లు కృపణులయి పట్టుబడక వీరికివలసె నె అహహ! మ హారాజ్యమడాంధి కొర సుదీ వాసెనోరో


అని 9


పిల్లవాడికి పాలకోసం ఆపుకోవాలనీ, సహాధ్యాయికజా ఆమాత్రం ఉపకారం చేయకపోతాడా అనీ ద్రోణుడు ద్రుపగుణ్ణి అర్థించాడు. అప్పుడు మహారాజైన గ్రుహ శారతమ్యం తెలుసుకోకుండా మాటాడుతున్నావు. పరమదరిద్రుడివి నువ్వు మహారాజు నేను. నాకూ నీకూ స్నేహ *మేమిటి పోశా అని తూలనాడాడు ఐ గర్వంతో, - దానికి ఈ నాడు ద్రోణుక - జనాబు చెబుతున్నాడు


ఓహో ద్రుపదమహారాజులా? వీరు? మహా రాజత్వం మాసిపోయినట్టుండే ఇంత దిని


పోయారేమిటి ఎరే, - అని హాసృసూరు అధిక్షేపించాడు.


ఏఘటంలో నేనాసరే సన్న పొర్యుని హాస్యం అంతర్నాళలకు సూది పోటు పొడిచినట్టుంటుంది. స్థూలదృష్టిలో సున్నితీ గానూ, సూక్ష్మవిచారణలో చురుకుగానూ


యామిజాల పద్మనాభస్వామి


తగిలే హాస్యం ప్రకటించడములో నన్నయ సిద్ధహస్తుడు.


విచిత్రవీర్యుడు రాజ కార్యాల ప్రసక్తి వర్ణించి సంతతి కొమోపభో గాలతో కాల క్షేపం చేయడంవల్ల షేయ రోగి అయి పోయాడు. దీనిని నన్నయ


రాజయతీ, బాధితుడయి దేవలోక సుదతీప్రియడయ్యె విచిత్రవీర్యుడున్'


అని అంటాడు. సచ్చిపోయాడని వాద్యంగా అనడు. ఐహిక శాసవాంఛతో తృప్తితీరక దేవలోకంలో ఉన్న నడతులకు ప్రియు ఉయాడంటాడు,


రాజై పట్టం గట్టళన్నాక ప్రజాక్షేమం కోసం రాజకార్యాలు పరిశీలించి పరిపాలస చేయడం నాని విధి. అది మానేసి కొను వాసుడై రోగి అయి చచ్చాడు. గారిని ఆవ ళ పూర్వకంగా సూచిస్తున్నాడు శబ్ద శాసనుడు.


ఆరి వీడి కామం తగలడా! నల విడి ఎ సాము చేశా డుం వీడు,- అనే బుద్ధి చెబుతూ అయింగా' ఇక అన భవించరా, అన్నకుండి


ఒకౌసురవన ఘట్టములో బ్రాహ్మణ వేషా లతో నివసిస్తున్నారు పాండవులు. వారున్న యింటి యజమానివంతు వచ్చింది బకాసురు ఆనాడు ఆహారం గా ఎవరో ఒకరు వెళ్ళలి తల్లి, తండ్రి, కూతురు, చిన్న కొడుకు ఇది వారికుటుంబం నేనంటే నేను అని పెద్దవాళ్ళు ముగ్గురూ ఎనించుకొంటు ఆ సందర్భంలో అవ్యక్త పరను డిన పిల్లవాడు తల్లిదండ్రులకూ, అక్క కూ కన్నీళ్ళు తుడుస్తు


దండుకుల చేత ఏన రెక్క సుఁ గిట్టి చంపి


బులుకి వత్తు మీరేశ్వ గా వలవదనుచు కలయి నూకా ర్చ తీశతొక్కు పలుకు


(వాడి ను టలుకున) వాళ్ళయేడుపు కొసరుణి దంపడానికి ఒక పోయింది చిన్న కర్రపట్టుకొని వారువెళ్ళి చంప వస్తా డట. ఏమి’లో అనుకొన్నాడు వాడు.


పాము పాము అని పెద్దవాళ్ళు గాభరా పడుతూ ఉంటే ఏదీ నేను పంపేత్తాను " అంటాడు ఆ యి దారేళ్ళ వయసువాడు, చేపాటి కర్రలో పరుగెత్తుతాడు. దూచేవారి కందరికీ వింత గానూ నవ్వుగానూ ఉంటుంది.


ఈలాటి భావాలు వెల్లడించే ఘట్టాలలో కూడా నన్నయ ఎదురు లేని వ్యాఖ్యాత గా కనబడతాడు.


జీవితములో సముద్రతరంగాలవలె రేగే బాధలు అనేకం ఉంటాయి. మనస్సుబరువెక్కి సర్వేంద్రియాలకూ సంకెల వేసినట్టు చలనం లేకుండా ఆయి బరువు తలకెత్తినట్టు ఉంటుంది. ఆ బరువును ఇట్లే దింపడానికి మందు హాస్యం. మనస్సుకి వికాసం కలిగించేది హాస్యం.


సంఘములో, నిత్య జీవితంలో తెలిసి, తెలియక వస్తున్న దురాచారాలనూ, దుష్ట బంధాలనూ రూపు మా పి విడగొట్టడానికి హాస్యం ఎంతో ఉపయోగపడుంది కాని దానిని విరివిగా ఉపయోగించి జీవితంలో చైతన్యాన్ని సమగ్రంగాకలిగించేవిధానంలో గ్రంథాలు తెలుగులో ఆటే వెలువడ లేదు. ఎక్కడో నాటా నూటా ఆయా సందర్భాలలో ఒకటి రెండు పద్యాలలో వెక్కిరిస్తున్నట్టు ము డి పెట్టి సవితప్ప హాస్యాన్ని అంగిరసముగా చేసికొని ఆవిర్భ వించిన కౌవ్యాలు లేవు.


నన్నెచోడుని కుమారసంభవములో దక్షాధ్వరధ్వంసం పట్టులో కొంత హాస్యం గోచరిస్తుంది రుద్రుని సైన్యాలు యజ్ఞవాటి కను ధ్వంసం చేసి దేవతౌబృందాన్ని చీకాకుపరచిన ఘట్టం చదువుకూ ఉంటే పకాలున నవ్వు వస్తుంది.


ప్రమథగణాలబారినుండి తప్పించుకో వాలని బ్రహ్మ తన వాహనమైన హంసను అధిరోహించబోయి భయంతో నేలమీద పడిపోయాడు. అప్పుడు హంస తామర తూడుని కఱిచి పట్టుకొన్నట్టు బ్రహ్మను పట్టుకొని పరుగెత్తిందట. వాహనంబు నెక్కి వచ్చి భయంబుళ


వడఁకి నేలఁబడ్డ వనజగర్భుఁ


గమిచికొని మరాళకము నా


కఱచికొని రయమునఁ బఱచి విష్ణువు గరుత్మంతుణ్ణి కౌగలించుకొని


దాని కాళ్లు' వేళ్లూ పట్టుకొని ఇంటికి పారి పోయా ఉంటాడు' “గరుడి నడుము మెడయు కాలును శైలును,


ఇఱికికొనుచు చక్రి వెఱచి పఱ చె కుబేరుడు సరవాహనుడు. ప్రమధగణాల


బాధ తప్పించుకొ నేందుకు ఆయన గారు పడ్డ పాటు 'తన యెక్కిన మానినిఁ దా


సనయము నెక్కంగ మఱచి యాతనిఁ


దన మ పున నిడికొని పటిచె భయం బున ధనపతి తన్నుఁ బిఱుద భూతము వాహనమైన వాడిమీద తాను కూర్చో


దానికి 


బదులు తనమీద వాణి ఎక్కించు కొని పారిపోయాడు. ప్రమధగణాలు 'ఓ అని అరుస్తున్నాయి వాడి తెలివి తేటలు చూసి. అప్పుడు యుక్తాయు కజానం ఎక్కడ వస్తుంది పాపం తన బ్రతుకేమవు తుందో అని కుబేరుడి భయం. వాడి చేష్ట మాత్రం మనకి నవ్వు పుట్టిస్తుంది. ఈలాగే ఒక్కొక్క దిక్పతి పొందిన అవస్థను కవి బీభత్సంగా వర్ణించినా అది తాత్కాలికవర్ణనలో హాస్యభంగిమ నే సూచిస్తుంది.


విరాటపర్వంలో కీచకునివల్ల


జరిగిన అవమానాన్ని సైరంధ్రి వేషంలో ఉన్న ద్రౌపది కొలువుకి వచ్చి విరటునితో మొర పెట్టుకొంటుంది. ఆసమయంలో శంకభట్టయి వున్న ధర్మరాజు 'సభలో ఇల్లాలు ఇంతసేపు మాటాడడం, ఎదిరించడం తగునా? చాలు వెళ్ళు' అంటాడు. 'సైరంధ్రి వినలేదు. కంక భట్టుకి కోపం వచ్చి, 'పలుపోకలఁ బోవుచు వి చ్చలవిడి నాట్యంబు సూపు చాడ్పున


గులసతుల గఱువ చందము దొలగక నిటునికి దగ్గు తోయజవదనా.' అని ఆక్షేపించాడు. అప్పుడు సైరంధ్రి


అన్న మాటలు చురుక్కు లే తగిన హాస్యపు


.


పోటు.


‘నాదు భల్ల భుండు నటుడింత నిక్కంబు పెద్దవారియట్ల పిన్న వారు, కొన పతులవిధమ కాకయే శెలూషి గాననంగరాదు. అంతే కాదు. జూదఱి యాలికి గఱువతనం


బెక్కడిదయ్యా'—అంటుంది. ఒక్కపంక్తిలో తిక్కన తన అసాధారణ • మైన హాస్యరేఖాచిత్రం చూపి కవిబ్రహ్మ అయాడు.


రానురాను ప్రబంధయుగం అవతరించి హస్యానికి స్థానం లేకుండా చేసుకొంది. ప్రాచీన కావ్యాలలో ఈ మాత్రమేనా హాస్యానికి తావుందిగాని తరువాతి వానిలో ఆ ప్రసంగానికే నెలవు లేదు.


శ్రీనాథుని కావ్యాలలో ప్రత్యేకించి హాస్యానికి స్థానం కనబడదుగాని చాటువులలో కొంత సున్నితమైన హాస్యం కనబడుతుంది. ముందే చెప్పాను. ఆశేప ణలో, సంస్కారపక్షంలో చెప్పిన దానిలో హాస్యానికి తావు ఉంటుందని శ్రీనాథుడు పల్నాటిని ఉద్దేశించి చెప్పిన పద్యాలలో ఆ ధోరణి కొంత కనపడుతుంది.


'రసికుడు పోవడు పల్నా డెసగంగా రంభయైన ఏకులు వడకునా


* మన ప్రాచీన


వసుధేశు డైన దున్నును కుసుమాస్త్రం డైనజొన్నకూడే కుడుచున్ దో సైడు గొంపలో పసుల త్రొక్కిడి మంచము దూడ రేణమున్ చేసిన వంటకంబు పని బాలుర కౌచము వి స్తరాకులు చూసిన గుడ్డలున్ తలకు మాసిన ముండలు వంటకుండలుకో


శాసెడు కట్టెలున్ తలప కాదు పురోహితు వింటి కృ


కృత్యముల్ పలనాడు అంటే ఆనాడు శ్రీనాథుడు తనకు కావలసే భోగాలన్నీ ఇట్టే లభించే సీమ అనుకొని వెళ్ళాడు. అవి యేవీ లేవు. చీకాకు వేసి "బీదరమీద ఆ ఉంటాడు పాపం! గరళము మ్రింగితి నంచున్ ఇలా ఏడ్చి


పురహర! గర్వింపఁబోకు పోపోవా! నీ


బిరుదింక గానవచ్చెడు మెరసెడి రేనాట జొన్న మెతుకులు


కొండవీడులో గాడిద నుద్దేశించి


అక్కడి చిల్లర కవులను నవ్వుల చేశాడు. గాడిద! నీవునుకో కవివి కావుగదా! ఇట కొండవీడు లోక పాలు


అని ఎంత గడు గాయితనం ఇది!


వెలులిం దిలపిషమున్ "మెసవితి


విశ్వస్త వడ్డింపగా' అన్నాడు


ద దేశిసంచారంలో ఒక యింట విందా


కన్నడ రగించిన సందర్భంలో- అసలే అది తెలకపిండి గుండ. దానిలో


వెలులి కలిసింది. రుచికె తే బాగానే ఉంటుందిగాని పరమశివభక్తుని


కది వెగటుగా తోచినట్టుంది. దానికి తోడు గాజులచేయి కాదు వడ్డించింది. విశ్వస్త. కవిసార్వభౌముని అవస్థ ఏమి చెప్పడం!.... తెనాలి రామకృష్ణుణి హాస్య కవి గా చెప్పుకుంటారేగాని అంతి రసవంతమైన హాస్యం ఆయన కృతులలో కన్పడదు. అమవసనికి అన్నమాట అలసని పెదనా' ఇత్యాది బాటుపద్యాలు ఎవడో కల్పించినవి గాని చరిత్రాధారాన్ని బలపరచేవి కావు. “కాదుపోదంటే పాండురంగ మాహాత ములో నిగమ శ రోశ్రీ ఖ్యా పౌరస్య సము లో బోఢ లో కొంత ఆక్షేపగర్భమైన హాస్యం స దేమో; శీలం పిల్లిశీలమనీ, చదువులు చిలకల చదువులనీ అన్నది అక్క నిగమశర్మని... అంతే.. దానికి తార్కాణగా వాడు ఆరాత్రి అందరూ నిద్రిస్తూఉంటే చేసిన అక్క


ముక్కుపుడకతో సహా నగలన్నీ ఒలిచి పట్టుకుపోయాడు. నాని ప్రవృత్తి మాత్రం హాస్యాన్ని సూచిస్తుంది. తుంటరితనానికే అది జయపతాక,


ఈ నిగమశర్మోపాఖ్యానాన్ని దృష్టిలో పెట్టుకొని కందుకూరి రుద్రయ్య నిరంకుశో పాఖ్యానం అనే నాలు గాళ్వాసాల కావ్యం వ్రాసి అక్కడక్కడ చక్కని హాస్యం సూచించాడు. నిగమశర్మ ప్రవృత్తికీ నిరం కుశుని ప్రవృత్తికీ సాజాత్యం సరిపోవడమే కాక కొన్ని గుణాలలో నిరంకుశుడు నిగమ శర్మకి ఒక మెట్టు పైన కూర్చున్నట లేడు.


వేశ్యనూత పెట్టిన చకొరగుళ్లు తృప్తిగా నిక్కి నిరంకుశుడు పోయాడు. అక్కడ ఒక లింగము కనబడ్డాది. నిరంకుశుడు ఆ లింగాన్ని చూచి నాతోడుతన్


సౌగటాలా డెదవే న వేందుకు సుమ


స్తోతవ్య జూటాంతి కా!”


అని


ధించి జూదరులలో తాను అగ్రణినని బిరుదు మాటలాడుతాడు. కొంగున మూటగట జొన్న సొగటాలు తీసి గెల్పినవాడికి ఓడిన వాడు లంజను తెచ్చి యివ్వాలని పందెం పెటి లింగం పంతుకూడా తెనే సొగటా లాడి దైవగతివల్ల తానే గెలిచాడు. గెలిచి నందుకు దేవ వేశ్య అయిన రంభను తెచ్చి యిమ్మన్నాడు. ఎంతకీ లింగం జవాబివ్పదు. దానిమీద నిరంకుశుడికి కోపంవచ్చి, తగునె పన్నిదమిక యీగతిఁ


దప్పు మౌనముఁ జాల్పఁగా దగు న నీకు ను నాకుఁ బెద్దల దండఁ బెటెదఁ జండి పై గగన కేశ! యటంచుఁ జందురు కాని పేలు


పొగడ దండయిన ర్చైనా విట


భూసురాగ్రణి దిట్టయె తన గుడ్డతీని ఈశ్వరలింగానికి చుట్టి పెద్దలదగ్గర తగపు పెడతాను రమ్మని లాగు తాడు. చక్కని తగవు. విటుని గుర్మా వాన్ని వెల్లడించే హాస్యగర్భితి మైన ఆక్షేపణ ఇది.


పొరంగు తమ్మయ్య వైజయంతీ విలాస దేవ జీవి విప్రనారాయణుని వేశ పరచుకొన్న సందర్భంలో అతి సుకుమార మైన హాస్యం సవరించాడు. దేవదేవి నిట్టూ రులలో, హొలుచూపులలో, లలో, పైట ఊపులలో తిమ్మయ్య శృంగా రానికి చేయూత గా ఇచ్చిన హాస్యం సువర్ణ లేపనంగే భానిస్తూంది.


దేవ దేవీ మధురవాణులు విప్రనారాయ


ణుని దర్శించి సమస్కరించగా, 'చందురుఁ గను నరవిందము


చందంబున మోమువంచి సంయమికులపతి డా డారామగ్రుమ


బృందము పుచక్కిని కిమ్మనకుండా పోయారు. ఆదశీ చూసి ఇతడు చాలా గొప్పవాడే అన్నాది మధుర వాణి. దేవదవి అందుకు ఒప్పుకోక “ఇటువంటయ్యలు కొరా చిటుకుమనక యుండ సందెచీకటి వేళ్ళ శా


ఘట చేటీవిటు లై క్కటకంబున తిరుగువారు కంజదళాక్షీ ! 'కడసిచూడ ఘోటక బ్రహ్మచర్యంబు పింగళోజపంబు పిల్లి శీల


మజగరోపవాస మల ఒక ధ్యానంబు


నక్క వినయ మిట్టి నయములెల్ల


అని హేళన చేసింది


- సస మాటే


అయింది. వేశ్యా స హ వాసాలు శ్రీ వైష్ణవులకు తగునా! కొమ్మా! ఆవల మమ్ములోకు లేమంటారో అని జీవదేవీ సేవకు అనుమా నించిన మహానీయుడు కాలుజార్చాడు.


“శిరసుపై పేసు పొడగన్న చేరబోయి హింస సీయకుమని చేతికిచ్చే పరిస్థితిలోకి డేకింది వజ్రపంజరనిభ మైన వాని సర్భావం లోహ మై గ్రాప మై, దృఢదారువై, తరుణవృతమై, యమై పూవై దానిలో మకరందమై పోనుపోను నీళ కంటెనూ పల్చనై కరగిపోయింది.ఒక్కడికే కాలుచాచి పరుండడానికి చాలని కుటీరం వర్షంపడిన నాటి రాత్రి దేవదేవికీ విప్ర నారాయణునికీ కూడా శరణ్యమైంది. అవు తుంది మరి


అయ్యెడ మిక్కిలి శైత్యం బియ్యడ తెమ్ము నీవు నింతీ! అని ప్రియురాలిని నోరారా, మనసారా పిల్చి దాపునకు చేర్చుకొన్నా బోడి దాసరయ్య-రంగరంగా అని రంగనాథ స్మరణమే జీవిత పరమార్థంగా ఇనపకచ్చడం కట్టుకొన్న వే వాడు నో చ్ఛిష్ట యేస విటజనో. కుటిల వేశ్యను అంటుకొని బ్రాహ్మణ్య మంటు చేశాడంటాడు తిమ్మయ్య


రానురాను హాస్యాన్ని తీవ్రంగానూ, మృదువు గానూ చెప్పకుండా రచనలో నీరుపోసి పెంచినవాడు వేమన్న - కులను తౌచాశాలను విమర్శిస్తూ దంభ వేషాలను ఆ క్షేపిస్తూ తిట్టులో నవ్వు పుట్టించినదిట వేసునయోగి


పుణ్య క్షేత్రాలకు గిం చుకున్న వారికి మంత్రిజలసుకున్న మంగలి జల మెచ్చు' - అని బోధ చేసున్నాడు..


పోయి


ణుని దర్శించి సమస్కరించగా, చందురుఁ గను నరవిందము


చందంబున మోమువంచి సంయమికులసం


క్రందనుఁ డారామగ్రుమ బృందము పడుచక్కిని కిమ్మనకుండా పోయారు. ఆదశీ చూసి


ఇతడు చాలా గొప్పవాడే అన్నాది మధుర వాణి. దేవదవి అందుకు ఒప్పుకోక ఇటువంటయ్యలు కొరా చిటుకుమక యుండ సందెచీకటి వేళ్ళ


ఘట చేటీవిటు లై క్కటకంబున తిరుగువారు కంజదళాక్షీ ! 'కడసిచూడ ఘోటక బ్రహ్మచర్యంబు పింగళోజపంబు పిల్లి శీల


మజగరోపవాస మల ఒక ధ్యానంభ నక్క వినయ మిట్టి నయము లెల్ల. అని హేళన చేసింది 'సస


అయింది. వేశ్యా సహవా సాలు శ్రీ వైష్ణవులకు తగునా! కొన్మూ! ఆప ల మమ్ములోకు లేమంటారో అని దేవదేవీ సేవకు అనుమా నించిన మహానీయుడు కాలుజార్చాడు.


శిరసుపై పేసు పొడగన్న చేరబోయి హింస సేయకుమని చేతికిచ్చే పరిస్థితిలోకి డేకింది వజ్రపంజరనీభి మైన వాని సర్భావం లోహ మై గ్రాప మై, దృఢదారువై, తరుణవృక్ష మై, ఫలప్రాయమై, పూవై దానిలో మకరందమై పోనుపోను నీళ కంటెనూ పల్చనై కరగిపోయింది.ఒక్కడికే కాలుచాచి పరుండడానికి చాలని కుటీరం వర్షంపడిన నాటిరాత్రి దేవదేవికీ విప్ర నారాయణునికీ కూడా శరణ్యమైంది. అవు తుంది మరి


అయ్యెడ మిక్కిలి శైత్యం బియ్యడ తెమ్ము నీవు నింతీ! అని ప్రియురాలిని నోరారా, మనసారా పిల్చి దాపునకు చేర్చుకొన్నాడా దాసరయ్య-రంగరంగా అని రంగనాథ స్మరణమే జీవిత పరమార్థంగా ఇనపకచ్చడం కట్టుకొన్న వె వాడు విటజనో చ్ఛిష్టమైన ఆ కుటిల వేశ్యను అంటుకొని బ్రాహ్మణ్య మంటు చేశాడంటాడు తిమ్మయ్య


రానురాను హా ప్యాన్ని తీవ్రంగానూ, మృదువు గానూ చెప్పి చెప్పకుండా రచనలో నీరుపోసి పెంచినవాడు వేమున్న కులమతౌచాశాలను విమర్శిస్తూ దంభ వేషాలను ఆ క్షేపి సూతిటులో నవ్వు


పుట్టించినదిట వేమనయోగి ----


పుణ్య క్షేత్రాలకు గించుకున్న వారికి మంత్రిజలసుకున్న మంగలి జల మెచ్చు' - అని బోధ చేసున్నాడు...


పోయి


గొడుటావు బిసుక కుండ గొంపోయిన


పాల నీదు పండ్లు రాలదన్ను' అని చివరి


చరణంలో ‘లోఖవాని నడుగ లాభంబు లేదయా?


అంటాడు......


మోక్షానికిపోతే మొస లెత్తుక పోయిం


ఉంటారు. గుహలలోకి పోయి జపం చేయ


బోతే పులి ప్రత్యక్షమై మోష్ o


యాసంగా ఇస్తుందన్నాడు వేమన్న -


'మోక్ష మేకదా కౌవలసింది జీవికి తఱచి చదవవలసే రచన వేమన శతకం.. హాస్యంకోసం ప్రాచీన కవుల గ్రంథాలు సాలీపులాక న్యాయంగా ఇంతవరకూ


స్పృశించాము.


ఇటీవలి వారిలో వారి జీవితాలకు సంబం ధించే ముచ్చటలు కొంచెం అనుకొందాము. వీరేశలింగం గారి ప్రహసనాలూ, పాను గంటివారి సాక్షి కొంచెం కరకుగానూ, అక్కడక్కడ చాదస్తంగానూ ఉన్నా హాస్యప్రధానములైన రచనలుగా దానికి ఎన్నుకోవచ్చు:


గ్రంథాలు వ్రాయకపోయినా నడిమింటి సర్వమంగ ళేశ్వర శాస్త్రులు గారు సరసంగా మాట్లా డే కవి అని ప్రసిద్ధి. చెల్లెలూ, తానూ భోగీపండుగకు ఆత వారింటికి వెళ్లారట. తెల్లవారిన తరువాత చెల్లెలు వరహాకుంచెతో నగలు తోముకుం టూంది. శాస్త్రి గారి వదిన గారు ఆ మెను చూచి 'వ ది నే! పందివా? ఏదుపందివాళి అడివిపందివా' అని అడిగిందట. శాస్త్రిగా గారి చెల్లెలు కొంచెం బొద్దుగా ఉంటుంది. అందుకు ఆవిడ హాస్యమాడింది. అక్కడికి కులందోము పుడక కోసం వచ్చిన శాస్త్రులు ఏదుపందివో అడివిపందివో తెలియదుగాని మొత్తంమీద పందివే అన్నా రట. చటుక్కున వదినె గారు లోపలికి పోయారట. వరహాకుంటే ఏపందిరోమంతో కట్టారనే ప్రశ్న చమత్కరించబోయి నది చె గారు పొందిన జవాబిది.


శాస్త్రులుగారు వామనావతారం. వడ్డన బంతి జరిగింది. ఆకుకొసను కందకూర వడిం చారు--వదిన గారు - తె లి సీ. కందకూరంటే శాస్త్రులుగారికి మహాప్రీతి. చూస్తూ కూర్చు న్నారు. అప్పుడు వదిన గారు 'ఏమిటి మరిది గారు అలా కూర్చున్నారు? ఆ కందకా అని అడిగారట. 'ఔను వదినే! ఆ కందకే” అన్నారట. సరేలెండని మళ్ళీ ఇంత కూర తెచ్చి అందేట్టు చేశారట ఆమె. శాస్త్రులుగారు జగన్నాధస్వామి దర్శనానికి పూరీ క్షేత్రానికి వెళ్ళారు. స్వయంపాకం చేసుకొని మత్తాకుల వి సరిలో భోజనం చేస్తు రు. ఆ సమయంలో పెద్దపండా వచ్చి


'ఏమిటి శాస్త్రులుగారూ! అన్నీ తెలిసిన పెద్దలు తమరు. ఏంత అఘాయిత్యప్పని చేస్తున్నారు? మా అవతారం పండుకొనే మఱ్ఱాకును ఉచ్ఛిష్టం చేశేసేరా?' అని ఆక్షే పించాడు. చటుక్కున శాస్త్రులుగారు 'భయపడకండి. మీకంటే నేనుచేసే దానిలో విచారించవలసేది లేదు. నేను మీ అవతారం పాన్పును ఉచ్ఛిష్టంచేశానేకాని మీరు అవ తారాలకు అవతారాలనేమింగేసు రుగా' అన్నారు నదురు బెదురూ లేకుండా. ఆ దెబ్బతో పెద్దపండా తలదిమ్మంది. మరి కంటిచూపులేదు. ఏవ్యం అయిపోయాడు.


ఈ శాస్త్రులుగారు వ్రాసిన జే సమాస కుసుమావళి. సంస స్కృ ఏమాత్రం చదివిస తెలుగు వారికీ అది పరిచి దానిలో విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ శాస్త్రులుగారు సహజహాస్యప్రియత్వమును


చమత్కారంగా వెలిబుచ్చారు. ‘భూనాయకం నా ధవనాయకం బా


భజ భువం వా ధనమేతి లోళ తద్విఘ్న నాథం న భజామి కింతు సహస్రశస్తం ప్రణమామి నిత్యమ్' లోకంలో భూనాయకుణ్ణిగాని, ధన నాయకుణ్ణిగాని భజిస్తే భూమిని గాని, ధన ముసుగాని పొందుతాడు. అందువల్ల విఘ్న నాధుణ్ణి "నేను భజించను. వేయి విధాలా వానికి మొక్కులు మాత్రం చెల్లించు కొంటాను అంటారు శాస్త్రులుగారు. విఘ్ను నాయకుణ్ణి సేవిస్తే విఘ్నాలు వస్తాయని చమత్కృతి.


అడిదం సూరకవికూడా ఈ ధోరణి కణ వాడే అని అంటారు.


ఒకనాడు నూరకవి గారి భార్య భర్తన చూసి 'ఏమండీ! అవునండీ మన అబ్బాయి


మీద ఓపద్యం చెప్పరండీ అని అడిగింది. వెంటనే చెప్పాడు సూరకవి.


‘బాబా బూచులలో పల


బాచన్నే పెద్దబూచి భావింపంగన్ బూచం బూచంటే రా| రా వెఱతురు


బాచన్నను చూచి పట్టపగలే నెఱతుర్ అని చదివాడు.


(బాచన్న ఆ నేది ముద్దు పేరు. ఈ బాచ స్నే శుద్ధాంధ్ర రామాయ ణ • వ్రాసిన బాల భాస్కరుడు.)


కొడుకు అంత చక్క من నీవాడట. రఘువంశాది కావ్యాలకు వ్యాఖ్యా సంవ్రాసి ఆసేతుశీతాచలం పేరు పొందిన ప్రతిభాశాలిమల్లి నాథసూరిని ఒక నాడు భార్య


రచయితలు: *


'అవునండీ! నామీద ఒక శ్లోకం చెప్పరూ.' అని అడగగా వెంట నే 'ఇదుగో చెబు తున్నాను విను.” అని


'తింత్రిణీదళ విశాలలోచనా నింబపల్లవ సమానకుంతలా మేరుమందర సమానమధ్య రూ మల్లి వాథగృహిణీ విరాజతే '


అని చదివాడట.


చింతాకులవలె వెడల్పయిన కళ్ళు వేప చిగుళ్లకు పొటి వచ్చేకుదులు, మేరు ముందర పర్వతాలను పోలిన నడుము కలదై మల్లి నాధుని యిల్లాలు విరాజిల్లుతూంది. యిల్లాలు ఇది విని ఎల్లా సహించిందో గాని యీరోజులో 'జుల్లో అయితే ?. (1)


ప్రస్తావికంగా చెప్పినదే అయినా తిరుపతి వెంకటక వులలో ఒక రైన తిరుపతిశాస్త్రి గారు చెప్పిన యీ పద్యం ఎంతో గంభీరమైప


అర్థాన్ని చెబుతూ పక్కున నవ్విస్తుంది.


"మును సౌగంధిక పుష్పమున్ గొనగ భీముండే డైరం బోపు త్రో పను సాక్షాత్కృతిచేసి ఖడ్గమృగమున్ వారింపగా సంజనా


తనయుం డెక్టుడు పేర్మి నిచ్చిన పదార్థంచే న యీపయీస్


జసువా డార్జనసేయు వెంకటకవి ! సారస్య మట్లుండుటన్


ఈ పయిని లోకంలో సారస్యమునుబట్టి ఆర్జనకుపోతే వచ్చేది వెండ్రుకలే అనే భావాన్ని శాస్త్రులుగారు ఇంత గంభీర ధ్వనితో చెప్పారు.


చాలా శ్రమపడి హాస్యరసం పోషించి వ్రాయాలనే సదుద్దేశం గల ప్రతిభావంతు ఆలాటి గ్రంథాలు చాలా యేమిటి వేళ్ళమీద చెప్పాలన్నా అటే లేవు.


కూచిమంచి జగ్గకవి చంద్రరేఖావిలాపం తిట్టుక విత్వం గా ఉంది. పొందిన అందులో పేరు బాగా నే హాస్యం లేకపోలేదు. కాని దానిని ప్రమాణగ్రంథం గా పండితులు అంగీకరించినట్టు కప్పట్టగు ఏమైనా హాస్యం ప్రధాన రసంగా ఉద్భవిల్లవలసే కథావస్తు వును తీసుకొని కావ్యాలు ప్రత్యేకం అది మాటలతో కాదు.


వ్రాయవలసే అవసరం ఎంతైనా ఉంది. అయేపనిమాత్రం కాదు. 

--- 


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...