Showing posts with label Selection. Show all posts
Showing posts with label Selection. Show all posts

Thursday, December 16, 2021

లాస్ ఆఫ్ ఇన్నోసెన్స్ - కె. శ్రీనివాస్ 25-03-2005 ( కె. శ్రీనివాస్ - సంభాషణ - నుండి ) సేకరణ - కర్లపాలెం హనుమంతరావు


 




లాస్ ఆఫ్ ఇన్నోసెన్స్

-  కె. శ్రీనివాస్ 

25-03-2005

( కె. శ్రీనివాస్ - సంభాషణ - నుండి ) 


సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 


ఆశ అన్ని వేళలా అకస్మాత్తుగా భంగమై పోదు. దీపంలాగా కొద్ది కొద్దిగా కొడిగట్టిపోతుంది. వెలుతురు లాగా మెల్ల మెల్లగా మసకబారుతుంది. దిగులులాగా ముడుతలు ముడుతలుగా ముఖాన్ని కమ్ముకుంటుంది. ధైర్యంలాగా కొద్ది కొద్దిగా ఆవిరవుతుంది.


ముందే హెచ్చరించిన శకునపక్షి చివరికి అపహసిస్తుంది. పర్యవసానాల జ్ఞానం లేనందుకు బుద్ధి కించపడుతుంది. అనుభవం ఒక కవళికగా మారి పోతుంది. పలితకేశంగా ప్రకాశిస్తుంది.


ఉమ్మనీరూ చిమ్మచీకటీ వదిలి లోకంలోకి వచ్చి నప్పుడు- ఓపలేని వెలుగులో కళ్లు మూసుకుపోతాయి, స్వతంత్రత లోని విచ్ఛిత్తికి గుక్కపెట్టి శిశువు రోదిస్తుంది.ప్రపంచం పరిచయమవుతున్నప్పుడు సకలేంద్రియాలూ విప్పారతాయి. గుండె కొంచెం కొంచెంగా విచ్చుకుంటుంది. 'కావున లోకపు టన్యాయాలూ కాల్చే ఆకలి కూల్చే వేదన' తెలియక శైశవగీతం కేరింతలు కొడుతుంది. ముక్కు పచ్చలన్నీ ఆరిపోయి ముఖంలోకి ముగ్ధత్వం వస్తుంది.


పాలబుగ్గల నిగారింపు, లేత చెక్కిళ్ల మెరుపులు, ఆశ్చ ర్యంతో మెరిసిపోయే కళ్లు, అయాచితంగా కురిసే చిరునవ్వు, తారసపడిన ప్రతి ధ్వనినీ ఆలకించే మనసూ- కాలం చిరు

జలపాతంలాగా వర్తిస్తుంది. లేగలాగా గెంతులు వేస్తుంది. చదువై, పెంపకమై, సంస్కృతై విలువలై, ధర్మశాస్త్రమై- చిరుమోతాదు విషంలాగా సమాజం లోలోపలికి ప్రవేశిస్తున్న కొద్దీ బాల్యం లౌల్యం అన్నీ మృతకణాలుగా నిష్క్రమిస్తాయి. ఉడుకు నెత్తురు యవ్వనం గరళకంఠమై ప్రతిఘటిస్తుంది. సంపాదన, సంసారం, అధికారం సుడిగుండంలో దమ్ము చెదిరి కబడ్డీ కూత ఆగిపోతుంది. ఇన్నోసెన్స్ ఇంకిపోతుంది.


సెప్టెంబర్11తో అమెరికా తన ముగ్ధత్వాన్ని కోల్పోయిందని ఎవడో ఆత్మవంచకుడు మొదట అన్నాడు. తనమీదికి ఎవరూ దాడిచేయలేరన్న నమ్మకమే ఆ ముగ్ధత్వమట. అజ్ఞానం వేరు. అహంకారం వేరు, అమాయకత్వం వేరు. ఏదయితేనేం, తొలగవలసిన భ్రమలే తొలగినాయి. ముగ్ధ అమెరికాతోటే ముప్పుతిప్పలు పడ్డ ప్రపంచం నేటి ప్రౌఢత్వంతో పరమనరకాన్ని చవిచూడవలసి వస్తున్నది. నెత్తుటి వెల్లువ కట్టలుతెంచుకున్నప్పుడు, ముగ్ధత్వం కొట్టుకు పోయిందని, ఉత్తములు నిస్పృహలో కూరుకుపోయి అధములు ఉత్సాహంతో చెలరేగిపోతున్నారని-ఐరిష్ కవి యేట్స్ మొదటి ప్రపంచయుద్ధానంతర స్థితిని వర్ణించాడు. శిశువు నుంచి మనిషి పశువుగా పరిణమించేవరకూ కోల్పోయే మానవీయ ముగ్ధత్వం - మొత్తం మానవజాతి కూడా రకరకాల కాలాలలో రకరకాల దశలలో కోల్పోతూ వస్తున్నది. కొత్తరూపాలలో వచ్చే పాతద్రోహాలు, కొత్త ఆశలవరుసలో చొరబడిన భవిష్యత్ మోసాలు  అనునిత్యం ఆవిష్కృతమవుతూనే ఉన్నాయి. ప్రతి ఆశ చివరా 'యూ టూ బ్రూటస్' మూలుగు వినిపిస్తుంది. ప్రతి నమ్మకంలోనూ కోవర్ట్ పరిహాసం ధ్వనిస్తూనే ఉంటుంది.


అయినా మనిషి ముగ్ధుడవుతూనే ఉంటాడు. మెరిసే కన్నీళ్లను, చేసే ప్రతిజ్ఞలను చూపించే స్వర్గాలను తగిలించుకున్న విశేషణాలను యథాతథంగా స్వీకరిస్తూనే ఉంటాడు. ఆకాశాలను చేరువ చేసే ఆదర్శమంత్రోచ్చాటనలకు హృదయం అప్పగిస్తూనే ఉంటాడు. సినిక్ దర్శించే అంతిమ అనివార్యతలకు అంధుడవుతూనే ఉంటాడు. భగ్నహృదయాన్ని కొత్త ప్రేమలతో కుట్టుకుంటూనే ఉంటాడు. ఎన్నిసార్లు మాయ జయించినా సరే, అసంఖ్యాక అమాయకతలను అక్షయ తూణీరంలాగా సంధిస్తూనే ఉంటాడు. జీవితం చేసిన గాయాలతో ముఖమంతా ఎడారిగా మారినా సరే, లోలోపల ఒక ఒయాసిస్సును కడుపుతో ఉంటాడు.


చురుకు చూపులు, విషపు నవ్వులు, నొసటి వెక్కిరింతలు- వయసుతో పాటు ఓడిపోయిన ముగ్ధత్వం మీద మొలిచిన విజయస్తంభాలుగా కనిపిస్తాయి. మోహం మీద కామం, మందహాసం మీద వికటాట్టహాసం, ఆలోచన మీద వ్యూహం పైచేయి అయిపోయి బతుకు అరిషడ్వర్గాలతో లుకలుకలాడుతుంది. అయినా సరే, ఇంకా పసితనం సశేషంగానే ఉంటుంది. ఏ మూలలోనో శైశవం తొణికిసలాడుతూనే ఉంటుంది. నాగస్వరానికి ఉర్రూతలాగే లక్షణం మిగిలే ఉంటుంది. కొత్తగాలిలో కొట్టుకుపోవడానికి ఒక కిటికీ తెరిచే ఉంటుంది.


నమ్మాలి. అదుపుకోల్పోయి పరవశం కావాలి. ఆశల ఎంజైమ్ నిత్యం స్రవిస్తూ ఉండాలి. జ్ఞానుల ముందు, వివేకుల ముందు, సత్యం ముందు మాత్రమే కాదు- ఆషాడభూతుల ముందు, గిరీశాల ముందు, వాగ్దానాలు చేసే నేతల ముందు కూడా మంత్రముగ్ధం కావడానికి మనసు తెరిచే ఉంచుకోవాలి. మోసకారులకు భయపడి, మనసును మాయపరచుకోగూడదు. శకునికి భయపడి ఆటను మరువకూడదు. ఓటమిలో కుంగిపోతూ అంతిమ విజయాన్ని పలవరించాలి. అంధకారంలో ఒక సూర్యు ణ్ణి భ్రమించాలి. ప్రసూతి వైరాగ్యం వలె ఆశాభంగం మరునాటికే పిగిలిపోవాలి. బుద్బుదం పగిలినా మరో బుడగలోకి దూరిపోవాలి.


నెత్తుటి వెల్లువలో ముగ్ధత్వం కొట్టుకుపోయినా సరే, ఆ అమాయకతను కీర్తించాలి. ఎండమావి అని తెలిసేదాకా దాహం తీర్చిన ఆశను గుర్తించాలి. సంకెళ్ల మధ్య మందహాసాలను, ఉక్కుపాదాల కింద చెక్కుచెదరని చిరునవ్వును, మృత్యువు చెంత మనోధైర్యాన్ని నిలుపుకున్న ధీరులందరిలో నిలిచి వెలుగుతున్న అమాయకత్వాన్ని గౌరవించాలి.


- కె. శ్రీనివాస్ 

25-03-2005

( కె. శ్రీనివాస్ - సంభాషణ - నుండి ) 

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

                  బోథెల్ ; యూఎస్

                  16 - 11-2021 

Wednesday, December 15, 2021

వ్యాసం మేనరికాలు ( మూలం - తాపీ ధర్మారావు గారి 'పెళ్లి - దాని పుట్టుపూర్వోత్తరాలు' నుంచి ) సేకరణ- కర్లపాలెం హనుమంతరావు


 


వ్యాసం 

మేనరికాలు 

( మూలం - తాపీ ధర్మారావు గారి 'పెళ్లి - దాని పుట్టుపూర్వోత్తరాలు' నుంచి ) 

సేకరణ- కర్లపాలెం హనుమంతరావు 


మానవ సమాజంలో మొట్టమొదట వుండిన విచ్చలవిడిగా జతకూడే పద్ధతి, రాను రాను కొన్ని నియమాలకు లోబడవలసివచ్చింది. ఈ వ్యక్తితో జతకట్ట వచ్చును, ఈ వ్యక్తితో జతకట్టరాదు అని నిషేధాలు కలిగాయి. తల్లి పిల్లల జతలు ఈ నిషేధాల కిందికే వచ్చాయి. 


రాజకీయ కుటుంబాలలో మాత్రం ఇతర రక్తాలు కలియకుండా వుంచుకోడానికి అక్కా తమ్ముడు జతలు కట్టే పద్ధQ కొంత సాగింది. మరి కొన్నాళ్ళకు అదే  ఒక్క తల్లికి పుట్టినవారు తప్ప తక్కిన బాపతు అక్కా తమ్ములు జతకట్టే పద్ధతి ఆమోదనీయమైంది. 


మరి కొంత కాలం తరువాత మరికొన్ని నిషేధాలు వచ్చాయి. రక్తసంబంధం వుంటే జతకట్టడం మంచిది కాదన్న అభిప్రాయం కలిగింది. ఆ దృష్టిని చూసేసరికి ఒక గూడెం ఒక జట్టులో  అంతా, బీరకాయ పీచు సంబంధాలే .  . ఒక్క వేలు విడిచిన సంబంధం, రెండు మూడు నాలుగు..వేళ్ళు విడిచిన సంబంధం అందరూ సంబంధం వున్నవాళ్ళే . 


కాబట్టి, ఒక జట్టులో ఉన్నవారు ఆడవారు కానీ, మగవారు కానీ-అదే జట్టులో నుండేవారిని పెళ్ళి చేసుకో కూడదన్నారు. 


జతల కోసం ఇంకొక జట్టుకు పోవాలి. దీనికి "ఎక్సాగమీ" అని పేరు పెట్టారు. 


మరికొన్ని దేశాలలో దీనికి విరుద్ధంగా వుంది నియమం. ఏ జట్టువారు ఆ జట్టులోనే జతకట్టుకోవాలి అని. దీనిని "ఎండాగమీ" అన్నారు. దీనికి కారణం ఎవరి జాతి మహత్తుమీద వారికి ఆధిక్యత ఎక్కువ అనిపించడం. 


పై జట్టు పెళ్ళి..  ఆ జట్టు పెళ్ళి అన్న ఈ రెండూ రెండు రకాలా, ఒకటే రకమా అనిగూడా వివాదం వుంది. పై జట్టుమీదనే ఆధారపడిపోతే, అలా జతలు కట్టడానికి అవకాశాలు ఉండవచ్చును, ఉండకపోవచ్చును. ఈ రెండు జట్టులకు ఉన్న సఖ్యాన్నిబట్టి, వైరాన్నిబట్టి కథ నడపవలసి వస్తుంది. అదే సూత్రంగా పెట్టుకుంటే, ఒక జట్టు ఇంకొక ಜಟ್ಟು వారితో పోట్లాడి, ఆ జట్టువారి ఆడవారిని తెచ్చుకోవలసి వస్తుంది. ఇలాంటి వివాహాలూ ఉన్నాయి. కాని, ఇదంతా చాలా బెడద వ్యవహారం. పెళ్లే కావాలి అంటే పోట్లాడాలన్న మాట వస్తుంది. నిత్యజీవితంలో ఇంత బెడద పెట్టుకుంటే చాలా కష్టం. ఆ రోజులలో వాళ్ళంత బెడద తెచ్చిపెట్టుకొని ఉంటారా?


ఒక్క జాతిలో రెండుమూడు జట్టులుండవచ్చును కదా? కొండ మీద ఒక జట్టు, లోయలో ఒక జట్టు, కొండ అవతల ఒక జట్టు అన్నట్టు ఉండవచ్చును. ఈ మూడు జట్టులూ ఒక్క తెగవే. సఖ్యంతో  ఉండేవి. అలాంటప్పుడు, పై జట్టునుంచే పెళ్ళి చేసుకోవాలి అని ఒక నియమం పెడితే ఏమయింది? కొండమీది వారు లోయలోని వారితోనూ, లోయవారు అవతలివారితోనూ సంబంధాలు చేసుకోవచ్చు నన్నమాట. లోయలోనివారు, లోయలోనివారిని పెళ్ళిచేసుకోరని అర్థం. ఈ పద్ధతిని జట్టునుపట్టి చూస్తే ఇది ఎక్సాగమీ! జాతినిపట్టి చూస్తే ఇది ఎండాగమీ అవుతుంది. నిత్యజీవితానికి అడ్డు, ఆటంకమూ వుండవు.


ఇలాంటిదే మన గోత్రాల పద్ధతి. ఏ గోత్రం వారు ఆ గోత్రంలో పెళ్లి చేసుకోకూడదు. ఇతర గోత్రం వారినే చేసుకోవాలి. ఇది ఎక్సాగమీ; బయటి సంబంధం. కాని, వారందరు ఒక్క కులంవారే అవడంచేత ఇదే ఎండాగమీ; లోపలి లోపలి సంబంధం. ఈ దృష్టిని చూస్తే ఈ రెండూ ఒక్కటే అని తేలుతుంది.


బయటి సంబంధమయినా సరే, లోపలి సంబంధం అయినాసరే, జతకూడే హక్కులూ, పద్ధతులూ అన్నీ ఇంతకుముందు నేను మనవిచేసినట్టే- అందరికీ హక్కు వుంటుంది. ఒక ఇంటిలో ఒకడు పెళ్ళి చేసుకున్నాడు. అంటే, ఆ ఇంటివారు అందరూ ఆ పెళ్ళికూతురితో జతకట్టవచ్చును. ఒకడికి భార్య అయితే ఆ అన్నదమ్ముల కందరికీ

భార్య అవుతుంది. ఒక ఆమె ఒకడ్ని పెళ్ళిచేసుకుంది అంటే, ఆమె అక్కచెల్లెళ్ళందరూ అతనితో జతకట్టవచ్చును. అతనికి పెళ్ళాం ఇతనికి పెళ్ళాం అని విచక్షణ లేదు. ఇంటందరికీ పెళ్ళామే అవుతుంది. ఇంటికోడలు  అవుతుంది.


ఆశ్చర్యపడకండి. భారతంలో పాండవులు చేసుకున్న పెళ్ళి ఇలాంటిదే. ద్రౌపది ఇంటందరికీ ఇల్లాలే. నాయర్లలో గూడా ఈ ఆచారం వుంది. టిబెట్లో ఇలాంటి ఆచారమే వుంది. నీలగిరి తోడాజాతిలో గూడా ఈ ఆచారం వుంది.


అంతేకాదు, రామాయణంలో రాముడు మాయలేడిని పట్టుకోడానికి పోయిన తరువాత "హా లక్ష్మణా" అన్న ధ్వని వినిపించినప్పుడు సీత లక్ష్మణుడ్ని వెళ్ళమంటుంది. అన్న చెప్పినమాట తప్పకూడదని లక్ష్మణుడు కదలడు . అప్పుడు' సీత  నిష్ఠురాలు  పలుకుతూ, 'మీ అన్న పోయినట్టయితే నన్ను పొందాలనా ఇలా కదలకుండా ఉన్నావు ? ' అని అన్నది.


సీతమ్మ అజ్ఞానురాలు కాదు. ఇంత నీచమయిన మాట ఆడదు. అయినా ఆ మాటలు వాల్మీకి అంతటివాడు వ్రాశాడు. ఏమి? అప్పటి ఆచారం; అన్న భార్యను తమ్ముడు చేసుకోవచ్చు. వచ్చుకాదు; చేసుకోవాలి. గూడాను. వాలి సుగ్రీవులు చేసినపని ఇదే. తార ఇద్దరికీ భార్యయే. అన్నభార్యలను చేసుకొన్న బృహస్పతులు అనేకు లున్నారు.


మహారాజులు ఎందరెందరో తమ కూతుళ్ళను ఇద్దరు ముగ్గురివి కాదు యాభై మందిని, నూరుమందిని, ఒక్క ఋషి గారికి ఇచ్చి వివాహాలు చేశారని మన గాథలున్నాయి. అన్ని వివాహాలూ జరపరు. ఏదో పెద్దదానికి మాత్రం పెళ్ళిచేస్తే చాలు; తరువాత పెళ్ళిళ్ళు తమంతట అవే జరిగిపోతాయి. వాటికోసం వేరే బెడద పడనక్కరలేదు.


ఈ ఆచారం ఇప్పుడు కొంచెం వెగటుగా కనిపిస్తుంది; నిజమే. కాని, ఆ రోజులలో వెగటు ఉండేదికాదు. పైగా చాలా రుచిగా ఉండేదనే చెప్పాలి. ఎందుచేతనంటే, చూడండి. అదే అసహ్యం అయినపని అయితే, దానిని వట్టి రోతతో చూచి, ఈపాటికి దాని మచ్చుమాయా కనిపించకుండా  మరిచిపోయి ఉండేవారం; దాని సంపర్కం రవ్వంతయినా కనబడకుండా చేసేవారం.


కాని, అలా జరపలేదు.  ఇప్పటికీ మనలో ఈ వాసన ఉంది. మరదళ్ళూ, వరస మాటలు ఇప్పటికీ ఉన్నాయి. వాళ్ళ హాప్యాలు బావలూ చాలా దూరం పోతాయని వారి మాటలు విన్న వారందరూ అంగీకరిస్తారు. ఇంటిలో ఉన్నవారు ఎవ్వరూ ఆ హాస్యాలకు ఆక్షేపణ చెప్పరు. అంతా నవ్వేవారే.  ఆనందించేవారే  అంటే, సంఘం ఆ వరసలను అంగీకరించిందన్న మాట. ఆ రూపంగా మన పూర్వాచారల లక్షణం.  మనలో ఇప్పటికీ ఉన్నది. ఇలాంటి వరసలే . . మేనమామ మేనకోడల వరసలు.  జతకూడడానికి అవకాశం వున్న జట్టులు- పైని చెప్పినలాంటివి- 


మేహన అన్నమాటకే జతకట్టడం అని అర్థం చెప్పడం న్యాయం. ఈ మాటను నేను "దేవాలయాల మీద బూతుబొమ్మ లెందుకు? అన్న గ్రంథంలో సూచించాను. ఎందరు విసుగుకున్నా అర్థం తప్పదు. మేహన సంబంధమే మేన సంబంధం.  మేనరికం అయింది. మేనరికం ఉంది అంటే జతకట్టుకోడానికి అవకాశం ఉందనికదా, మనలో అర్థం? అంతేకాదు, కొన్ని సంఘాలలో తప్పకుండా పెళ్ళి చేసుకోవాలి కూడాను. తప్పించకూడదు. పెళ్ళి చేసుకున్నా, చేసుకోకపోయినా, ఈ మేనరికం ఉన్నవారు పైని చెప్పిన బావమరదళ్ళ లాగానే పచ్చి పచ్చిగా హాప్యం ఆడుకుంటారు. వారికా అధికారం ఉంది. ఇంత పచ్చిగా మాటలాడినారే అని ఒక్కరయినా చీకాకుపడరు. . చీవాట్లు పెట్టరు . అదీ మన మేనరికం వరస లక్షణం.

( మూలం - తాపీ ధర్మారావు గారి 'పెళ్లి - దాని పుట్టుపూర్వోత్తరాలు' నుంచి ) 

సేకరణ- 

కర్లపాలెం హనుమంతరావు 

 16 -12-2021  


Sunday, December 12, 2021

నారికేళపాకం - ఆవశ్యకత -కర్లపాలెం హనుమంతరావు

 

కావ్యం ఒక జగత్తు.

లోకంలోని మిట్టపల్లాల మాదిరే కావ్యాలలోనూ ఎగుడుదిగుడులుంటాయి. అనివార్యం. కావ్యజగత్తు, బౌతిక జగత్తు అన్యోన్యాశ్రయాలు. బౌతిక జగత్తు లేనిదే కావ్యజగత్తు లేదు. కావ్యజగత్తు వినా బౌతిక జగత్తుకు వెలుగూ లేదు.

ఇహ కావ్యరసాల విషయానికి వస్తేః

గుత్తి నుంచి ద్రాక్షపండును ఇట్టే కోసి నోట్లో వేసుకోవచ్చు. అరటిపండు ఆరగించడం అంటే గెల నుండి కోయడమే కాకుండా, తోలు వలుసుచుకొనే కొంత ప్రయాస తప్పదు. కొబ్బరికాయ దగ్గరి కొచ్చే సరికే ఆ ప్రయత్నం మరింత  అవసరం. కావ్యపాకాల తంతూ ఈ తరహాలోనే ఉంటుందంటుంది అలంకారశాస్త్రం!

లోకంలో ద్రాక్షపండుతో మాత్రమే సర్దుకుపోతున్నామా మనమందరం! ప్రయత్న పరిమితిని బట్టి సాఫల్య పరిమితి. ఆ సూత్రం అవగతమయిన వారితో వాదు లేదు. కానివారితోనే లేనిపోని పేచీ. ఆనందం కోసమే కావ్య పఠన అనుకున్నప్పుడు.. ఆ ఆనంద రసానుభవానికి బుద్ధి తాలూకు వైవిధ్యం మరంత విశిష్టత చేకూరుస్తుంది.  ఆ వైశిష్ట్యంలోని అంతస్తుల అమరిక అర్థమవకో.. వద్దనుకొనే భావన వల్లనో అయోమయమంతా.

'భోజనం దేహి రాజేంద్ర! ఘృతసూపసమన్వితమ్ /మాహిషం శరచ్చంద్రచంద్రికా ధవళం దధి'అన్న శ్లోకంలోని మొదటి భాగం ఒక్కటే కాదు.. రెండో భాగమూ సమన్వియించుకోవాలి. అదీ సాహిత్యవేత్త లక్షణం.

ఏతావాతా చెప్పొచ్చేదేమంటే, ఒక్క ద్రాక్షాపాకంలో మాత్రమే కవిత్వం ఉండాలనే  కవిత్వానికే అన్యాయం చేయడమవుతుంది. కదళీపాకం వరకు చదివి ఆనందించేవారితో కూడా కవిత్వానికి సంపూర్ణ న్యాయం జరిగినట్లు కాబోదు. నారికేళపాకం కోరుకొని ఆస్వాదించి ప్రోత్సహించినప్పుడే ఉగాది సంబర ప్రసాదం వంటి కవిత్వం రూపుదిద్దుకొనేది. అయితే ఆ అంతస్తు చేరుకోనే చదువరికి శబ్దశక్తి పట్ల అవగాహన మాత్రమే సరిపోదు.. రసనిష్ఠ సహకారమూ అనివార్యం.

నారికేళపాక రసాస్వాదనకు ప్రాచీన కావ్యజగత్తులో అగ్రతాంబూలం. ఆ గౌరవం అందుకునేటందుకు చదువరికి ముందు అవసరమయేది శబ్దార్థపరిజ్ఞానమే అయినప్పటికీ, అంతకన్నా ముఖ్యమైనది ప్రాక్తనసంస్కారం. ఇది సంపన్నమయివున్నప్పుడే నారికేళపాక రసస్వరూపాన్ని సమగ్రంగా స్వానుభవంలోకి తెచ్చుకొనే భావాత్మ బలం పుంజుకునేది. పాండిత్య శబ్దవాచ్యతా, రసికపదలాంఛనప్రాప్తీ కొరవడుతున్న వాతావరణంఎ కఠినపాకం, బీరఆఆఆపీచుక్రమమనే అలంకార శాస్త్రం ఉగ్గడించని విచిత్ర పదాలు పుట్టుకురావడానికి కారణం.

దోషం కావ్యసృజనలో లేదు. ఉన్న మెలికంతా రసాస్వాదన అసక్తత వల్ల సంభవించిందే!

- కర్లపాలెం హనుమంతరావు

22 -05 -2021

(శ్రీపాదవారి కావ్యజగత్ భావన)

Friday, December 10, 2021

సాహిత్య వ్యాసం నివేదనం - కాటూరి వేంకటేశ్వరరావు సేకరణ - కర్లపాలెం హనుమంతరావు

 


సాహిత్య వ్యాసం 

నివేదనం


- కాటూరి వేంకటేశ్వరరావు

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు




భావము కుదిరి, ఉపక్రమోపసంహారాలతో, రమణీయార్ధములతో, సంవాద చతురతతో నడచిన ఈ కావ్యానికి ప్రబంధ మనే నూతన' సంకేతం ఏర్పడింది. వలసినంత భావనాసమృద్ధితో, అలంకారశిల్పముతో, రసభావనిరంతరంగా, గద్యపద్యాత్మకంగా రచితమైన ప్రబంధ మనే ఈ కావ్య పరిషియ ఆంధ్ర సాహితికి సొంతమని చెప్పదగును. ఆవేలమైన భావనకు రాయల ఆముక్తమాల్యదా, అద్భుతకథాకల్పనకు సూరన కళాపూర్ణోదయం నిదానములు. కావ్యానికి కావలసిన సకలలక్షణాలు సంపాదించుకొను టేకాక, శ్రవ్యరూపాన ఉన్న ప్రథమాంధ్రదృశ్య కావ్యమని పేరుగన్నది ప్రభావతీ ప్రద్యుమ్నం. కవిరాజ శిఖామణి నన్నెచోడుడు, ఎఱన, శ్రీనాథుడు, పినవీరభద్రుడు మున్నగువా రీ స్వతంత్ర కావ్యావిర్భూతికి బీజావాపం చేసినా, దీనికి ప్రత్యేక నామరూపాలు కల్పించిన మాన్యుడు అల్లసాని పెద్దన.


భారతాదులయందువలె కథాకథనము, ధర్మోపదేశము ఈ కావ్యములందు ప్రధానము కాదు. విభావాను భావాదులచే పరిపుష్టమగు రసనిష్పత్తియే ఇందు ప్రాధాన్యము వహించును. ఈ కాలపుగ వీశ్వరులు తమయెదుట కన్పట్టు మహా రాజ్యవిభవాన్నీ, అప్పటి రాగభోగాలను, నడతనాగరీశాలను మనసులందు నిల్పికొని వానికి రూపాంతరాలు కల్పించి, రసమయమైన గంధర్వలోకాన్ని సృష్టించారు. భువనవిజయం సుధర్మగాను, తుంగభద్ర మం దాకీని గాను, విద్యానగరళ్ళం గారవతులే కథానాయికలుగాను, ఆనాటి సాహసరనికులే నాయకులు గాను వీరి కావ్యాలలో అందందు రూపాంతరం పొందిరేమో ! ఆనాటి కవులకు, ప్రజలకు హస్తప్రాప్యములైన రసభోగాలనుండి వంచితులమైన మనకు నే డా కావ్యసృష్టి వింతగా, విపరీతంగా కన్పించినా సర్వర్తుధర్మసంశోభిత మై, అద్భుతర సస్యందియైన ఆరామంవంటిది ఆనాటి సాహిత్యం.


ఈ ప్రబంధకవులలో సహజశ్లేషలకు శయ్యాసౌభాగ్యానికి రామరాజ భూషణుడు, భక్తిపారమ్యానికి ధూర్జటి, ముద్దులొలుకు పలుకుబళ్ళకు తిమ్మన, అర్థభరితమైన పదబంధానికి రామకృష్ణుడూ — ఇలా ఒకరొకరే పేరుగాంచిరి. ఆంధ్రమున మొదటి ద్వ్యర్థి కావ్యమూ, యక్ష గానమూ ఈ కాలంలో నే పుట్టినవి. ఆత్మపరము, భక్తిభరితము అయిన శతకరచనం వెనుకటికాలంలోనే ఆరంభ మైనా ధూర్జటి కాళహస్తీశ్వరశతకం అట్టిరచనలకు మకుటాయమానమయింది. మెట్ట వేదాంతులను, దాంభికులను, మూఢమానవులను ఆధిక్షేపించి, పరిహసిస్తూ వేమయోగి అలవోకగా చెప్పిన ఆటవెలదులకు లోకుల నాలుకలే ఆకులైనవి.


విజయనగర సామ్రాజ్యం తల్లికోట యుద్ధంతో స్తమించిన పిమ్మట చోళ పాండ్య దేశాలలో రాజ్య స్థాపనం చేసికొన్న నాయక రాజులు ఆంధ్ర సాహిత్యానికి వూరు, మధుర, పుదుక్కోటలందు విస్తరిల్లిన ఈనాటి వాఙ్మయ మంతా కేవలళ్ళంగారపరమైనది. స్వయము కవియై, సర్వవిధాల కృష్ణరాయలకు దీటైన రఘునాథరాయల అనంతరమందు నాయక రాజులలోను,. వారిపిమ్మట రాజ్యమేలి మహారాష్ట్ర ప్రభువులలోను భోగపరాయణత


 విసరిలినది. ఆంధ్రజాతి జవసత్యాలు ఉడిగి, పౌరుష ప్రతాపము ల సంగతములు కాగా, మిగిలిన కామపరతనుండి ప్రభవించిన ఆనాటి కావ్యాలు సంయమం కోలుపోయి పరకీయాశృంగారానికి పట్టముగట్ట నారంభించినవి. ఈ 150 ఏండ్లలో పొడమిన సాహిత్యంలో విజయవిలాసంవంటి ఒకటి రెండు కావ్యాలు పూర్వకావ్య గౌరవాన్ని కొంత అందుకొన్నవి. యక్షగానము జై కటి ఈ కాలమందే వరి లినది. నాయక రాజులలో పెక్కురు, మహారాష్ట్రప్రతాపసింహాదులు, నాయక రాజుల సామంతులు, దండ నాధులు గూడ కావ్యములు రచించుటొకటి, పెక్కురు విదుషీమణులు కవయిత్రు లగుట యొకటియు ఈశాలమందలి విశేషాలు, గేయకవితకు ద్వితీయాచార్యు డగు క్షేత్రయ్యయు, దాక్షిణాత్యకృంగార కావ్యభూషణమైన రాధికాసాంత్వనం రచించిన ముద్దుపళనియు, ఆనాటివారే.


కోకొల్లలుగా బయలు దేరిన యక్షగానాలు, శృంగారపదాలు అభిన యిస్తూ రాజసభలలో నాట్యం చేసే వేశ్యల పదమంజీరధ్వనులే అప్పటి కావ్యా లలో ధ్వనించుచుండును. రాజాస్థానాలలో తెరపిలేకుండా సాగే కామ దేవతారాధనమే నాగరులకు అనుకార్యమై, త్యాగ భోగ రాయుళ్ళయిన నాయక రాజులే శృంగార కావ్య నాయకు లైనారా అనిపిస్తుంది. సకలేంద్రియసంతర్పణం చేసే కామపురుషార్థమహాఫలంకోసం రనికనరనారీలోకం నూటయేబదియేండు 3 ఇలా సాహిత్య సముద్రమథనం చేయగా చేయగా తుదకు రామనామామృత భాండం చేబూని వాగ్గేయకార సార్వభౌముడైన త్యాగరాజస్వామి అవతరిం చెను.


3. క్రీ. శ. 1850—1955


19వ శతాబ్ది పూర్వార్ధంలో రెండుమూడర్థాల కావ్యాలు, శ్లేష చిత్ర బంధ కవిత్వాలూ బయలు దేరినవి. హాస్యనీతిశతకాలవంటివితప్ప స్వతంత్ర కావ్యములు పొడమలేదు. దేశం క్రమంగా ఆంగ్లేయాక్రాంతమై, క్రిస్టియనుమత ప్రచారము, ఆంగ్లవిద్యాభ్యాసం ప్రబలినవి. వీనికి దోడు భౌతికదర్శనముల ప్రభావం వల్ల విద్యావంతులు ప్రత్యక్ష ప్రమాణబుద్ధులు కావొడగిరి. భారతీయధర్మము, సంప్రదాయాలు, ఆచారాలు పునర్విచారణకు పాత్రములై, స్వస్థాన వేష భాషాభి మానం సడలుటతో, సంఘసంస్కారోద్యమాలు సాగినవి. సముష్టి చిర కాలంగా తనచుట్టు నిర్మించుకొన్న ప్రాకారాలు శిథిలము లగుటయు, వానినుండి విడివడజూచే వ్యష్టి తనకే మం తాను విచారించుకోజొచ్చింది. భారతీయ ధర్మాన్ని నవీన కాలానుగుణంగా సంస్కరించుట కి ట్లొకవంక యత్నం జరుగు చుండగా, మరొకనంక ఆంగ్లప్రభుత్వ బంధనంనుండి విడివడాల చేకోర్కె బలీయ మయ్యెను. అంతట భారతీయపూర్వేతిహాసాన్ని, ధర్మ ప్రపంచాన్ని మథించి, స్వస్వరూపసాక్షాత్కారం పొందవలెననే కాండా, అభిజనాభిమానము ప్రబలమయ్యెను. ఆంగ్లభాషాకళాశాలల్లో ఆంగ్లేయసాహిత్యాన్ని అవ గాహిస్తున్న పడుచువాండ్రు ఈ రెండు ఉద్యమాల చే ప్రేరితులై అందరమైన


నివేదనం


ix


అద్భుతర సదర్శనానికి, మద్రమై, బంధనాగారపదృశమై కనిపించే బాహ్య లోకానికి పొత్తుకుదరక, తమవేదనలను చెప్పికొనుటకై మాటలను, మార్గములను


ఇంతలో తిరుపతి వేంకటకవులు ఈ కాలపువారి కష్టసుఖాలను చెప్పికొనుట కనువైన సులభసుందర శైలిచే కావ్యరచనం చేయనారంభించిరి. గురుజాడ అప్పారావు మానవధర్మాన్ని, దేశభక్తిని ముత్యాలసరమనే ఛందముచే గానము ఇట్లు దేశకాలానుగుణమైన కావ్య శైలియు, ఛందము దొరకి సంతట 20వ శతాబ్ది ప్రథమపాదమున తరుణవయస్కులు, గొంతులు విడివడినప్లై, ఆత్మనాయకములగు మధురకవితలను చెప్ప మొదలిడిరి.


పాశ్చాత్య సాహిత్య ప్రపంచమును, రవీంద్రనాథగీతావళిని ఆరగ్రోలిన సంస్కారపుష్టిచే ఆరంభమైన ఈ మధురకవితలందు అలనాటి రాయల సాహిత్యంలో లభించే అద్భుతమైనరసదర్శనం మల్లా లభించింది. అయితే ఆనాటి దర్శనం భోగభాగ్యములచే తులదూగే జీవనపొష్కల్యమునుండి లభింపగా, ఈనాటిది ప్రతికూల పవనహతినుండి ఆత్మజ్యోతిని కాపాడుకొనుటకై వాయు మండలో పరిపథాన కెగిరి, ఆచట నిర్మించుకొన్న ఏకాంతజీవనంనుంచి పుట్టింది. ఆచట కవి నిజానుభవాలకు రూపాంతరం కల్పింపగా, ఇచట కవి మనోరథాలకు రూపకల్పన జరిగింది. కాగా, అందు సంయోగ సుఖము, ఇచట తరచు విరహ పరిదేవనమాధురియు లభించినవి. మేఘదూతలోని యక్షులవంటి ఈ కవుల కా అలకానగరసుందరి దవుదువ్వులనే ఉండిపోయింది. పార్థివగంధస్పర్శ లేని ఆసుందరి ఆరాధ్య దేవతయై, పూజాపీఠ మలంకరించింది. ఆదేవిని ప్రసన్న నొనర్చుకొనుటకై వీరు పాడిన మధురకవితలలో అద్భుతమైన భావస్ఫూర్తీ, రమణీయారాలు కోకొల్లలుగా మనకు లభిస్తవి.


ఆక్మనాయకములైన మధురకవిత లోకవంక ఇట్లు చెల్లుచుండ రెండవ వంక పూర్వేతిహాసములను రసమయంగా ప్రత్యక్షం చేసే వీరకథాకావ్యాలు, పర దాస్యబంధనాన్ని సహించని దేశభక్తి గేయాలు వెలువడజొచ్చెను. స్వస్థాన స్వధర్మాభిమానములనుండి ఆవిర్భవించిన ఈజాతికావ్యములు గూడ గుణ గౌరవ ముచే పొగడ్త కెక్కినవి.


ఇవి యిటులుండ ఇంకొక తెగ కవీశ్వరులు పామరజనజీవనమాధుర్యాన్ని పదకవితలందు అందీయసాగిరి. లోకానికి అన్న పత్రం పెట్టే కర్షకభాగ్యశాలిని, సంఘానికి సుఖభోగ పరికరాలను సమకూర్చియిచ్చే మంటిపుట్టువుల వితరణాన్ని కీ ర్తించుతూ వీరు ఈశ్వరాంశను మానవత్వమందు ప్రతిష్ఠ గావింపజొచ్చిరి.


ఈ వివిధ కావ్యసృష్టి యిలా జరుగుచుండగానే గాంధీజీ భారతరాజకీయ రంగాన ప్రధానభూమిక వహించడం, స్వాతంత్య్రచ్ఛ జనసామాన్యానికి గూడా ప్రాకడం, భాషారాష్ట్రములకొరకు ఆందోళన చెందడం, స్వతంత్రభారతంలో సంఘస్వరూప మెలాఉండాలి అనే వాదోపవాదాలు చెలరేగడం, ద్వీపాంత 


రాలనుండి ఆ సేకనూతనోద్యమమారుతాలు దేశంలో వీచడం వీని యన్నిటి భావుకులు చి తవీధులందు క్రొ ఆలోచనలు పొడమినవి. దీనితో కాల్పనిక మైద రసభావసృష్టి వెనుకబడి, దేశకాలాల యథాస్వరూపాన్ని చిత్రిస్తూ, నవసంఘ స్వరూపానికి రూపరేఖలు దిదేరచనలు బయలుదేరినవి. పరపీడనాన్ని, పరోప జీవనాన్ని శపించడం, కష్టజీవులందు అభిమానాన్ని ఉద్దీపింపజేసి ఆశాజ్యోతి వెలిగించడం __ఈ కాలపు కావ్యములకు సామాన్యలక్షణా లని చెప్పవచ్చు.


భావస్రవంతి పలుపోకల పోతున్న ఈ నవీనకాలంలో తొల్లి ఎన్నతు లేనంత వైవిధ్యము, గుణబాహుళ్యం కావ్యసృష్టియందు కనిపిస్తున్నవి. భావాను గుణములైన నూతవచ్ఛందాలను కవులు వాడుతున్నారు. కొందరు వృత్తగంధి వచనరచన చేస్తున్నారు. సంస్కృతపురాణేతిహాసాలకు మళ్ళా కొందరు కేవలానువాదాలు చేస్తుంటే, కొందరు వానిని స్వోపజ్ఞంగా క్రొత్త వెలయిను న్నారు. జానపద గేయాలు, వీరకథాగేయాలు ఎక్కువగా ప్రజాదరం పొందు తున్నవి. దేశకాలాలను వ్యాఖ్యానించుటకు కొందరు శతకపద్ధతి నవలంబిస్తు న్నారు.


ఏకాలమందైనా క్రొత్తదారి త్రొక్కేవా రొకరిద్దరే ఉంటారు. తక్తిన వారొక అడుగు అటూ యిటూగా ఆధారినే పోతూ, కొంత విలక్షణతను గూడ చూపెట్టుతారు. కొందరిరచనలు ఉపజ్ఞామహితములు కాకున్నా, తత్కాల పరిస్థితులకు, ఉద్యమాలకు ప్రతిబింబాలుగా ఉంటవి. ఇలా వేయేండ్లనుంచి ఎప్పటికప్పుడు నవనవంగా వర్ధిల్లుతున్న ఆంధ్రసాహిత్యమందలి కావ్యభేదాలను, రీతులను ఇందు ప్రదర్శించుటకు యత్నించితిని. ఆంధ్రసాహిత్యంలో కేవలం మేలేర్చి కూర్చేయత్నం కాకపోవడంవల్ల, ఆంధ్రరసజ్ఞలోకానికి పరమాదర పాత్రములైన కొన్నికొన్ని రచనల నిందు చేర్చలేకపోతిని. రుచిభేదంవల్ల, పరిశీలనాలోపంవల్ల, స్థలసంకోచంవల్లకూడా ఈ కూర్పు కొంత అసమగ్రతకు పాల్పడిఉంటుంది.


నా యీలోపములను సహృదయులు మన్నింపవేడెదను. ఇతర భాషా ప్రాంతములందలి సోదరభారతీయులకు ఆంధ్ర సాహిత్య సంపద నంతటిని, శృంగ గ్రాహికగా కాకున్నా, స్థూలారుంధతీన్యాయంగానైనా ఈ గ్రథవం చూపెట్ట గలదేని కృతార్థుడ నగుదును.


- కాటూరి వేంకటేశ్వరరావు

( తెలుగు కావ్యమాల - నుంచి ) 

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు

Friday, March 5, 2021

చుట్ట, ఉడుత, నల్లి, చీమ ల, క్షురకర్మల మీద పద్యాలు

 చుట్ట కంపుః

అగ్గిపెట్టె తీసి ఆత్రముతో అతడును

పట్టి కాల్చి పీల్చె చుట్ట నతడు

యేమి ఖర్మయనుచు ఇతరులు తిట్టిరి

ఎవరి కంపు వారికి ఇంపుగాదె!

*

ఉడుతః

అటు జూచు నిటు జూచు నన్ని దిక్కుల జూచు

 నిమిషమైనను నొకట  నిలువలేదు-

వీపున నానాడు ప్రేమతో  రాముడు

 చేతగీటె ననుచు జీరిచూపు-

మెడను ద్రిప్పుచు జూచు మింటి వైపు

చిటిక వేసినంత చిందిలిపాటున

పరుగెత్తుకొని పోవు భయము తోడ

చిన్ని యుడుత ఉండదగునె కన్ను మూసి-

నిముసమొక్క యుగమగు నిజము జూడ!

*

మనుజుల రక్తము ద్రాగుచు

చనెదవు నీ దారి నీవు సరసర నల్లీ!

మనుజుల రక్తము పిండుచు

కనుచుందురు మరలిపోక ఖలులీ ధరణిన్.

*

చీమలు

కలసి మెలసి మీరు కట్టుబాతు కలిగి

మనుట జూడలేము మనుజల లిలను'

తెలివి యున్నదంచు ధీరుల మనుచును

చెప్పుకొనుట సరియె చీమలార!

*

గడియారం

నీవు లేపిన గాని నిదుర లేవను లేడు

కునుకు తీయుచునుండు కొసరి కొసరి

నీవు చెప్పిన గాని పోవగ నేరడు

బ్రదుకు తెరువు చూపు పనులు చేయ

నీ చలనము చూచి నిలువగ లేడింక కమ్మగ మెక్కును కడుపు నిండ

నిన్ను చూచిన గాని కన్ను మూయగ లేడు

నీవె దైవమంచు నిలిచి మొక్కు

నీకు బానిస అయ్యె నరుడు నిజము

కాలమహిమంబు తెలియంగ గాదు జగతి

నడిచి గడియారమా! యింక నన్ను నడిపి

కట్టుకుని పొమ్ము పుణ్యమ్ము కరుణ కలిగి!

*

క్షుర మర్ధనంః

తలవంచని వీరుండును

కలిగినవాడైనగాని ఖలుడే యైనన్

పలుమారును దీనముగా

తలవంచును నీకు సరియె ధరలో క్షురకా?

-శ్రీ రాళ్లపల్లి సుందరం

 (ప్రాస్తవిక పద్యములు- ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక- పక్ష పత్రిక - 69 -5 )

సేకరణః కర్లపాలెం హనుమంతరావు

05 -03 -2021

 

 

Tuesday, February 23, 2021

లియో టాల్ స్టాయ్-కౌంటు బిరుదు ఎలా వచ్చింది?- - సేకరణ :

 

""


 




జార్ ప్రభువుల కాలంలో 'కౌంట్' అనేది ఒక రకమైన రాజగౌరవ చిహ్నం.ఇప్పటి మన మిలటరీ హోదాలాగా. విఖ్యాత చక్రవర్తి పీటర్ కాలంలో టాల్ స్టాయ్ వంశం వారికి అలాంటి 'కౌంటు' బిరుదు దక్కింది.  ఆ బిరుదు వచ్చిన విధానాన్ని గురించి ఒక తమాషా కథ ప్రచారంలో వుంది.

జారు చక్రవర్తిని కలుసుకోవాలని ఒకసారి ఒక ఉన్నత వంశం తాలూకు పెద్దవ్యక్తి(ఆ దేశంలో అటువంటివాళ్లను 'ప్రభువు' అంటారు)వేళకాని వేళలో అంతఃపురానికి వచ్చాడు. ద్వారం దగ్గర కాపలాకాసే సైనికుడు ఆ ప్రభువును అడ్డగించాడు. ఆ ప్రభువుకి ఆ సమయంలో లోనికి ప్రవేశించడానికి అనుమతి లేదు. ఒక మామూలు ద్వారపాలకుడు తనని అడ్డగించడం ఆ ప్రభువుకు ఆగ్రహం తెప్పించింది. "నేనెవరో తెలిసే అడ్డగిస్తున్నావా?" అని గర్జించాడు ఆ ప్రభువు. "చిత్తం. మిమ్మల్ననే కాదు  ఎవర్నైనా సరే.. ఈ సమయంలో లోనికి అనుమంతించడానికి నాకు ఆదేశాలు లేవు. మీరు దయచేసి రేపు తగిన అనుమతితో రండి. తప్పక లోపలికి వెళ్ళవచ్చు" అన్నాడు ద్వారపాలకుడు వినయంగానే. ఐనా ఆ ప్రభువుకి ఇది ధిక్కారంలాగే అనిపించింది. "నీ అహంకారానికి బహుమానమేమిటో తెలిసే అలా మాట్లాడుతున్నావా?" అని హూంకరించాడు. ద్వారపాలకుడినుంచి మౌనమే సమాధానం.

ప్రభువుకి కోపం కట్టలు తెగింది. చేతిలోని కొరడాతో ఆ సైనికుడిని వళ్ళంతా రక్తాలు కారేటట్లు కొట్టటం మొదలు పెట్టాడు.

నొప్పులన్నీ మౌనంగా భరింస్తున్నాడే కానీ ఎదురు తిరగలేదు.అలా అని  దొరను లోపలికి అనుమతించనూ లేదు ఆ సైనికుడు.

అదే సమయంలో పీటర్ మహారాజు అటుగా వస్తూ ఈ దృశ్యం చూశాడు. ఏం జరుగుతుందో ముందు అర్థం కాలేదు. తెలిసిన తరువాత అంతులేని ఆశ్చర్యం ఆగ్రహం కలిగాయి. ద్వారపాలకుడితో "ఆ ప్రభువు నిన్ను అలా గొడ్డులా మోదుతుంటే ఒక సైనికుడివి అయి వుండీ  మౌనంగా భరిస్తావా! ఇదిగో కొరడా.. ఇప్పుడు నీ ప్రతీకారం యథేచ్చగా  తీర్చుకోవచ్చు" అని కొరడా అందించాడు.

ఆ మాటకు ప్రభువు అభ్యంతరం చెప్పాడు "మహారాజావారు విడ్డూరంగా మాట్లాడుతున్నారు. అతనొక తుచ్చ సైనికుడు. నేనేమో ప్రభువును. ఎలా దండిస్తాడు?"

"అదే అభ్యంతరమైతే నేనతన్ని ఈ క్షణమే జనరల్ చేస్తున్నాను" అన్నాడు పీటర్.

"జార్ చక్రవర్తులు క్షమించాలి. ఒక గొప్ప వంశస్థుడ్ని ఒక క్షుద్ర సేద్యగాడు శిక్షించడం మన సంప్రదాయం ఏమాత్రం ఒప్పుకోదు" అన్నాడు మళ్ళీ పెడసరంగా.

పీటరు చక్రవర్తికి అతని దుష్ప్రవర్తన సహించరానంతటి క్రోధం తెప్పించింది.

"ఈ ద్వారపాలకుడికీ తక్షణమే 'కౌంట్' బిరుదు ప్రసాదిస్తున్నాను. నా పాలనలో కౌంటులు ఆత్మగౌరవం లేనివారిగా ప్రవర్తించడం నాకు అవమానం" అని ఉరిమి చూసాడు ద్వారపాలకుని వైపు.

అంతే.. రాజుగారి సమక్షంలోనే రాజావారి కొరడాతోనే రాజగౌరవం నిలబడేటట్లు కొత్త కౌంటు ఆ ప్రభువుని మళ్ళీ లేవలేని విధంగా  దండించి వదిలిపెట్టాడు.

మర్నాడే ఆ కౌంటుకు 'జనరల్' పదవి కూడా  ఇస్తున్నట్లు ప్రకటన వెలువడింది.

'కౌంట్' బిరుదూ రాజుగారి స్వహాస్తాలతో ప్రసాదించబడింది.

'వార్ అండ్ పీస్' లాంటి ఎన్నీ అత్యున్నమైన మానవతావాదాన్ని బలపరిచే రచనలు చేసిన గొప్ప రచయిత  లియో టాల్ స్టాయ్ కి కౌంట్ బిరుదు  అలా వారసత్వంగా వచ్చిందే.

అలాంటి రాజచిహ్నాలు ప్రజాస్వామ్యవాది అయిన టాల్ స్టాయికి ఇష్టముం
డేవి కాదు. వాటిని తొలగించుకోవడాని  తరువాత చాలా తంటాలు పడ్డాడనుకోండి..అది వేరే కథ

***

 సేకరణః కర్లపాలెం హనుమంతరావు

Friday, November 8, 2013

Wednesday, February 10, 2021

ఆంధ్రకల్పవృక్షం-తాడి చెట్టు- వేటూరి ప్రభాకర శాస్త్రి గారు-

 

తాటి చెట్టు ఆంధ్రుల కల్ప వృక్షం. తాటాకు చుట్టతో కట్టడాన్ని బట్టి తాళికి ఆ పేరు వచ్చిందిస్త్రీ కర్ణ భూషణాలు తాటాకు కమ్మలుతాటి తోపులు ప్రతిగ్రామంలో తప్పని సరి.యనభై తొంభై ఏళ్ళ వయసుగల వారి చేతే తాటిగింజలు నాటించేవారు ఊరి పెద్దలు.తాడి కాపు పట్టే లోపు మరణం తప్పదన్న భయం కారణం.పదిహేనేళ్ళకు గాని తాటి కాపు పట్టదు.' ముత్తాడి' అంటే మూడు తరాల తాడిని చూచిన మొనగాడని అర్థం.తను నాటిన తాటి కాపుకు పండు పడితే దాని గింజను మళ్లా నాటి మళ్లా దాని పండునూ నాటి అది కాపుకు వచ్చినదాకా నూకలు చెల్లకుండా ఉన్నాడంటే వాడు నిజంగా దీర్ఘాయుష్మవంతుడేగా! 

నేల  నాణ్యతతో  చదునుతో తాటికి నిమిత్తం లేదు.నీటి వసతి అక్కర్లేదు. విస్తీర్ణం తక్కువున్నా ఎక్కువ మొక్కలు నాటుకోవచ్చు.నాటిన మూడేళ్లకే ఆకులు మట్టలు ఉపయోగానికి వస్తాయి. కట్టుబట్ట మినహా మిగతా జీవితావశ్యక వస్తువులన్నీ తాటి చెట్టునుండి సేకర్ంచుకుని జీవయాత్ర గడుపుకున్న రోజులు ఉన్నాయి. గుడిసెకు నిట్రాడ దూలం.గోడల కొంపకైతే తనాబీలు దూలాలు, స్తంభాలు, కొమరులు, గుజ్జులు, వాసాలు, పెండెలు, అన్నింటికీ తాటిచెట్టు ఆటి వస్తుంది. కట్టడానికి తాటనార. ఇంట పడకలకి తాటియాకులుసామానుల భద్రానికి తాటి పెట్టెలు, బుట్టలు. తాటి డొక్కుతో నీరు తోడే చేద. నారతో చేంతాళ్ళు సరే సరితాటి మ్రానులు రెండుగా చీల్చి నీళ్లు పారే దోనెలుగా వాడుకోవచ్చు. తాటి ముంజెలు, తాటి పండ్లు, తాటి(నిలవ చేసిన పేసము) చాప, బుర్రగుంజు, తాటి తేగలు, తాటి బెల్లం, తాటి కల్కండ, తాటిపానకం, తాటి కల్లు వమ్టికి మేలు చేసే మంచి ఆహార పానీయాలు.

(ఆంధ్రకల్పవృక్షం-తాడి చెట్టు-వేటూరి ప్రభాకర శాస్త్రి గారు- భారతి- -46-6-1)

-సేకరణ; కర్లపాలెం హనుమంతరావు

బోథెల్, యూ ఎస్ ఎ

10 -02 -2021

Saturday, December 5, 2020

వేంపల్లి షరీఫ్ కథ ' పర్దా - నా పరామర్శ - కర్లపాలెం హనుమంతరావు





ఇప్పుడే చదివాను . ముగిసిన తరువాత మనసంతా అదోలా చేదయిపోయింది . 
మనిషి జీవితంలోని  కష్టసుఖాలకు  తిండి, బట్ట, తలదాచుకునే  ఇంత నీడ .. ఇవి కరవు అవడమే కారణమనుకుంటాం సాధారణంగా. నిజమే ఇవి ప్రాథమిక అవసరాలే .. తీరనప్పుడు జీవితం దు:ఖ  భాజనం తప్పక అవుతుంది. ఇవన్నీ ఆర్థికంతో ముడిపెట్టుకుని ఉన్న అంశాలు . చాలినంత డబ్బు సమకూరితే ఇక మనిషికి  ఏ తరహా కష్టాలు  ఉండవు. కష్టాలు ఉండనంత మాత్రాన బతుకంతా సుఖమయమయిపోతుందనా అర్ధం? జీవితం ఒక ముడి పదార్థం మాత్రమే అయితే, లాజిక్ ప్రకారం  నిజవే అనిపిస్తుంది. అదే నిజమైతే మరి  బాగా డబ్బుండి ప్రాథమిక అవసరాలు అన్నీ తీరిపోయే వారికి ఇక ఏ కష్టాలు ఉండకూడదు. . కదా మరి ? కానీ వాస్తవ జీవితాలు ఆ విధంగా లేవే!  అన్నీ సదుపాయాలు సమకూరి బైటికి సలక్షణంగా జీవితం గడుపుతున్నట్లు కనిపించేవాళ్లూ లోలోన ఏవో కుంగుబాటుల్లో .. తాము పరిష్కరించుకోలేని తాము ఏర్పరుచుకోని కట్టుబాటుల మధ్య ఇరుక్కుపోయి బైటికి రాలేక... వచ్చే మార్గం తెలేక .. తెలిసిన వాళ్లు అందుబాటులో లేక  అనుక్షణం బైటికి చెప్పుకోలేని సంక్షోభం మధ్య  నలిగిపోతుండటం కనిపిస్తుంది. అట్లాంటి నిష్ప్రయోజనమైన,   నిరాధారమైన  ( మూఢ ) విశ్వాసాల మధ్య  ఇరుక్కుని నలిగిపోయే బడుగు తరగతి సంసారుల సంఘర్షణ ఇతివృత్తంగా అల్లిన వేంపల్లి షరీఫ్ 'పర్దా' కథ కరుణరసార్ద్రంగా ఉంది. 

కథలో రచయిత ప్రధమపురుషలో  వినిపిస్తున్నట్లు అనిపించే దిగువ మధ్య తరగతి పట్టణ  ముస్లిం కుటుంబ నేపథ్యంలోని ఒక ముసలి అవ్వ కథ  ఇది .  కాని, నిజానికి ప్రతి ముస్లిం పేద కుటుంబంలోనూ పొద్దు వాటారే దశలో ఉండే స్త్రీలు ఎదుర్కొనే  విచిత్రమైన సమస్యను ఈ కథకు వస్తువుగా ఎంచుకున్నందుకు రచయిత అభినందనీయుడు  .  
ఇస్లాం కుటుంబాలలో ఇప్పటికీ  ' పర్దా' పద్ధతి  స్త్రీ లోకం పాలిట ఒక పెను శాపంగానే లోలోపల రగులుతూనే  ఉంది. ప్రభుత్వం తాను తెచ్చినట్లు చెప్పుకునే   చట్టాలు నిత్య జీవితాలలో ఆమోదయోగ్యమై ఆచరణ స్థాయి దాకా ఎదిగిరావాలంటే ముందు అందుకు సంబంధించిన  సమాజాలలో మానసికపరమైన పరిణతి స్థాయి పెరగడం అవసరం .  ఆచరణ స్థాయి దాకా తీసుకురాలేని సంస్కరణలు  ఎన్ని  సంక్షేమ పథకాలు, చట్టాల రూపంలో  ప్రదర్శనకు పెట్టినా అవి కేవలం ఏ బుక్కుల్లోనో  నమోదయి .. ఉండేందుకు, మరీ అత్యయిక పరిస్థితుల్లో ' షో ' చేసేందుకు మాత్రామే  పనికివస్తాయి. 
ఇంట్లో ఎదిగిన ఆడపిల్ల ఉండి వెంటనే పెళ్లి చేసి పంపేయగల  తాహతు  లేని ముస్లిం కుటుంబాలలో ' పరువు ' భయం కోసం పరదాల మరుగున ఆడపిల్ల సరదా సంతోషాలకు ఓ రెండు గదుల హద్దులు గీసేయటం ఒక అమానుష దృశ్యమయితే   .. ఏ పరదాల మరుగునా తిరిగే అవసరం లేని గ్రామీణ వాతావరణంలో బిడ్డల ఎదుగుదల కోసం మత విన్వాసాలను కూడా కాదనుకుని  సంసారం నెట్టుకొచ్చిన ఒకానొక తరం నాటి  ముసలవ్వ  ఇప్పుడు ఆ పర్దా .. గోషాల మధ్య  కొత్తగా ఇరుక్కుని మసలవలసిన పరిస్థితులు తోసుకురావడం మరింత అమానుషంగా  ఉంటుంది. తెంచుకోలేని మతమూఢ  విశ్వాసాల మూలకంగా మానవ సంబంధాలు, కుటుంబసంబంధాలు, చివరికి పేగు బంధాలు కూడా ఎంతటి  కఠిన పరీక్షకు నిలబడవలసి  వస్తుందో   అతి సహజంగా చిత్రించాడు రచయిత. కధ ఆసాంతం ఎక్కడా ఏ అతిశయోక్తులు.. అలంకారాల జోలికి  పోకుండా నిరలంకారప్రాయంగా రచయిత చెప్పుకొచ్చిన శైలీ శిల్పాల  కారణంగా కథ చదివినంతా సేపే కాదు , చదిలిన తరువాతా చెదిరిన మనసును కుదుటపడనీయదు . 
కాలం మినహా మరెవ్వరూ  పరిష్కారం చూపించలేని ఈ తరహా సమస్యలను ఎప్పటికప్పుడు సాహిత్యంలో చర్చించకపోతే.. సమాజం సంస్కారయుతంగా మారాలన్న ఆలోచనే ఆరంభమయే అవకాశాలు సన్నగిల్లిపోతాయి. 
తనకు తెలిసిన తన ప్రపంచపు తమ ఒకానొక  తీవ్రమైన సమస్యను పది మంది ముందు ఏ మెహర్చానీ పెట్టుకోకుండా చక్కని కథ రూపంలో చర్చకు పెట్టి ప్రగతిపథకాముకుల మనసుల్లో అలోచనలను ప్రేరేపించినందుకు  మిత్రుడు వేంపల్లి షరీష్ బహుధా అభినందనీయుడు! సాహిత్య లోకం నుంచి కృతజ్ఞతలకు అర్హుడు. 👏👏❤️✌️😎
- కర్లపాలెం హనుమంతరావు.
5, డిసెంబర్ 2020 
బోథెల్; వాషింగ్టన్ రాష్ట్రం 
యు.ఎస్.ఎ 
వాట్సప్: +918142283676 


Sunday, November 29, 2020

తాడికొండ శివరామశర్మ ' రహస్యం ' మంచి కథానిక - నా పరామర్శ

 తాడికొండ శివకుమార శర్మ కథానిక ' రహస్యం '  ప్రెన నా పరామర్శ 

కథను ఉత్కంఠతో చదివించే అనేక సుగుణాలలో ఒకటి -కథకుడి దృష్టి కోణం . అందరికీ తెలిసి అందరం ఒక విధంగా భావించే ఒకానొక ప్రముఖ సంఘటనను వస్తువుగా ఎంచుకొని .. దానిని విస్మయం కలిగించే మరో అనూహ్య కోణంలో ఆవిష్కరించడం ! ' ఆహా( ' అని అబ్బురపరచే ఆ కొత్త కోణం తర్కానికి అనువుగా సాగితే ఆ కథ నిస్సందేహంగా  గుర్తుంచుకోదగ్గ కథలలో చేరుతుంది. రచన  శాయి గారి కథావాహిని - 2005 లో కనిపించే తాడికొండ శివకుమార శర్మ కథానిక ' రహస్యం 'ఈ తరహా మరపురాని కథలలో ఒకటి.

భారతంలోని చిన్న కథ - ద్రోణాచార్యులవారు   ఉదరపోషణార్థమై రాచ కొలువులో ఉద్యోగం కోసరం అన్వేషించేనాటి కథ. హస్తిన రాచవీధులలో బాల కురుపాండవులు ఆడుకునే బంతిని బావిలో గిరాటేసుకుని  బైటికి తీసే సాధనాలు , ఉపాయాలు అందుబాటులో లేక బిక్కమొగాలతో  నిలబడి ఉన్నప్పుడు కాకతాళీయంగా అటుగా వచ్చిన ద్రోణాచార్యులు శర సంధానంతో సమస్యను పరిష్కరించడం- దరిమిలా ఆచార్యులవారికి  రాచ కొలువులో గురు పదవి  ఖాయం కావడం అందరికీ తెలిసిన కథ . నీటిలో పడిన బంతి శాస్త్రరీత్యా శరసంధానం ద్వారా బైటికి రావడం  అసాధ్యం. బంతి జడత్వాని కన్నా ఎక్కువ జడత్వం కలిగిన బాణం ఎంత చెక్క పదార్ధంతో చేసినదైనా నిట్టనిలువుగా నిలబడదు. బాణానికి బాణం సంధించి తాడులా పేని బంతిని బైటికి తీసినట్లు మా చిన్న తనంలో బాలల బొమ్మల భారతంలో బొమ్మ వేసి మరీ    చెప్పిన  కథను బాలలం కనక నమ్మాం. కానీ చిన్న పిల్లల మల్లే కాకుండా బుద్ధి వికాసం సాధించిన పెద్దలూ  అంత బలంగా  ఎలా నమ్ముతున్నారో !  

' కథకు కాళ్లుండవు ; ముంతకు  చెవులుండవు' అన్న సూత్రం అండ చూసుకొని మరీ చెవుల్లో    పూలుపెట్టే కాల్పనిక సాహిత్యం విశ్వవ్యాప్తంగా వినవస్తున్నదే !  కానీ ఆ తరహా కాల్పనికత బాలల్లో మాత్రమే మనోవికాస అభివృద్ధిని ఉద్దేశించినది.  పెద్దలకు కాదు . పురాణ,ఇతిహాసాలలో  పుట్టలు  పుట్టలుగా కనిపించే ఈ వింత కట్టు  కథానికల పరమార్ధ౦ మరేమైనప్పటికీ , ఆ తరహా అభూత కల్ప నను కథాంశంగా ఎంచుకొని దానికి ఓ శాస్త్రీయత ఆపాదించే తాడికొండ శివకుమార  శర్మ ప్రయత్నం నిశ్చయంగా తెలుగు కథ వరకు సరికొత్త ప్రయోగం ; సదా అభినందనీయం ! 

నూతిలోని నూలు బంతిని శర సంధానంతో కాకుండా పై మీది  అంగవస్త్రంలోని తేలికపాటి దారపు పోగులతో   తాడుగా పేని బాణానికె  కట్టి  సంధించడం ద్వారా బంతిని గురువులు బైటికి  తీసినట్లు కథకుడు చేసిన ఊహ శాస్త్రీయ పరిధులలో ఉంటూనే సమస్యకు  చక్కటి పరిష్కారంగా అనిపిస్తుంది! అంతకు మించిన లౌక్యం ప్రదర్శిస్తాడు ద్రోణాచార్యులు పాత్ర  ద్వారా .. అతగాని శిష్యుల శస్త్ర ప్రయోగ నైపుణ్యం పరీక్షకు పెట్టే సందర్భంలో !

చెట్టు మీద ముందే పెట్టించిన మట్టిపిట్ట కంటిని గురి చూసి కొట్టమన్నప్పుడు 105 మంది కురుపాండవులలో ఒక్క అర్జునుడు మినహాయించి  అందరూ వైఫల్యం చెందిన కథ మనకు సుపరిచితం.   శిక్షణ బాధ్యత నెత్తికెత్తుకున్న గురువుల సామర్ధ్యం  శిష్యుల పనితనాన్ని (performance) ను బట్టి బేరీజువేసే నేటి రివాజు భారత కథ నడిచిన రోజులకూ అన్వయించి రచయిత చేసిన కల్పన   తెలుగు కథకు   కొత్త ప్రయోగం! చెట్టుమీది పిట్ట కంటిని సూటిగా కొట్టడంలో విజయం సాధించింది 105 మంది శిష్యులలో ఒక్క అర్జునుడే! ఆ నిజం భీష్మాచార్యులవారి   దాకా చేరితే పరువుతో సహా ద్రోణాచార్యులవారి  కొలువుకూ ముప్పు ఖాయం. ఉదరపోషణ కోసం    మరో దారి వెతికే శ్రమ  తప్పించుకునే నిమిత్తం ఆచార్యులవారు ఆ పద్ధర్మంగా  ప్రదర్శించిన లౌక్యం నేటి కాలపు విద్యా రంగంలోని మాయా మర్మాలకు ఏ మాత్రం తీసిపోనిది! విద్యార్థుల నైపుణ్య ప్రదర్శనకు  నలుగురికీ తెలిసే బహిరంగ విధానం కాకుండా in- door మెథడాలజీని ఆశ్రయిస్తాడు ద్రోణాచార్యులు. భోజనానంతరం శస్త్ర పరీక్షలకు ముందు   మరికొన్ని పరీక్షలు నిర్వహించిన మీదట రచయిత గురువుగారి  పాత్ర ద్వారా చమత్కారంగా చెప్పిన అసలు రహస్యం  ఏమిటంటే ఒక్క అర్జునుడికి మినహా మిగతా శిష్యులందరికీ దూరాన ఉండే వస్తువులు సృష్టంగా  కనిపించని కంటి దోషం! భారత కాలం నాటికి చికిత్స ప్రక్రియ ద్వారా కంటి దోషాలు సరిదిద్ద గలిగే వైద్య విజ్ఞానం అభివృద్ధి చెందలేదు.. ఉన్న విషయం బైటపెట్టి కొలువు ఇచ్చిన పెద్దల ఆగ్రహానికి గురికాకుండా నేడు  ప్రభుత్వాంగాలలోని అధికారులు , ఉద్యోగులు ఏ విధంగా తిమ్మిని బెమ్మిని చేస్తారో అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే ! అదే రహస్య పంథాని     అనుసరించిన ద్రోణాచార్యులు  కురుపాండవుల  కంటి సమస్యలను ధృతరాష్ట్ర , భీష్మాచార్యుల నుంచి  దాచిపెట్టి.  వేరే రాచ విద్యలు నేర్పించేందుకు  అనుమతి తీసుకుంటాడు. విలువిద్య అంటే గురి చూసి ప్రయోగించే యుద్ధ కళ. దుర్యోధన, భీమసేనుల వంటి వాళ్లకు వంటబట్టించిన గదాప్రహారం తరహా విద్యలకు గురితో పనిలేదు కదా ! విల్లు కాకుండా మరే ఇతర ఆయుధాలు ప్రయోగించినా కనీసం  కుడి వైపు వారి మీదో , ఎడమ వైపు వారి మీదో దెబ్బ పడటం ఖాయం' అంటూ గడుసుగా ముక్తాయించడం  కథాంతంలో రచయిత ప్రదర్శించిన  చక్కని చమత్కారం.    ' రహస్యం' కథానిక కలకాలం గుర్తుండి పోయేందుకు కారణం కథనం, శిల్పం కన్నా  రచయిత ఎంచుకున్న కథాంశం . . దానికి ఆపాదించిన శాస్త్రీయ దృక్పథం, కొత్త తరహా ప్రయోగశీలత; చమత్కారం అదనం. కథలన్నింటినీ బలాత్కారంగా ' సామాజిక స్పృహ ' బరిలోకి దించనవసరం లేదు. నవీన ప్రయోగం, సృజనాత్మక కాల్పనిక దృష్టి వంటివీ  కథానికకు పుష్టి చేకూర్చే దిట్టమైన సరుకులే! '

తాడికొండ శివకుమార శర్మగారికి మనసారా అభినందనలు! 

 - కర్లపాలెం హనుమంతరావు

బోథెల్ ; యూఎస్.ఎ 

29 - 11 - 2019











మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...