Showing posts with label Hindu. Show all posts
Showing posts with label Hindu. Show all posts

Monday, February 8, 2021

రామాయణం- ఒకే కవి విరచితమేనా? -కర్లపాలెం హనుమంతరావు



యావత్ స్థాస్యంతి గిరయః- సరిత శ్చ మహీతలే/తావద్ రామాయణ కథా- లోకేషు ప్రచరిష్యతి (బాల కాండ 2.36)’. మహీతలంపై ఎంత వరకు గిరులు, సరులు ఉంటాయో అంత వరకు లోకాల్లో రామాయణగాథ ప్రచారం జరుగుతుంద’ని వాల్మీకి రామాయణాన్ని ఆశీర్వదిస్తూ బ్రహ్మ అన్న మాట.  బ్రహ్మవాక్కు అనలేము కానీ..  రామాయణం అంత గాఢంగా ప్రపంచాన్ని ప్రభావితం చేసిన కావ్యం మరొకటి లేదు.  ఎన్నో భాషల్లో, కళాప్రక్రియల్లో  తీర్చిదిద్దిన కథ ఆదికావ్యం రామాయణంలోనిది.  పండితులను.. పామరులను, ఆస్తికులను.. నాస్తికులను    ఆకర్షించే గుణం రామాయణంలో ఉంది.

వేలాదిమంది బలశాలులు ఆయాసపడుతూ నెట్టుకొచ్చిన శివధనుస్సును బాలరాముడు సునాయాసంగా  విరవడంలాంటి అతిమానుష  సన్నివేశాలు రామాయణం నిండా ఎన్నో ఉన్నాయి. చిన్నతనంలో అవి ఆశ్చర్యానందాలను కలిగిస్తే.. ఎదిగే కొద్దీ రామచంద్రుని  మర్యాద పాలన, లక్ష్మణస్వామి సోదరప్రేమ, భరతుని త్యాగబుద్ధి, ఆంజనేయుని దాసభక్తి, సీతమ్మతల్లి పతిభక్తి వంటి సద్గుణాలు ఆకర్షిస్తాయి. వివేచనకొద్దీ ఆలోచనలు రేకెత్తించే సామాజికాంశాలు    దండిగా ఉండబట్టే రామాయణం ఒక చారిత్రక పరిశోధనాపత్రం.. ఆధ్యాత్మిక పరిచయ పత్రికను మించి  చర్చనీయమయింది. 

 

శతాబ్దాల బట్టి లెక్కలేనంత మంది సృజనశీలులు   చెయిచేసుకున్న కథ  రామాయణం. ఆ కారణంగా  భిన్నరూపాలు అనేకం ఓ క్రమం లేకుండా మూలంలో నిక్షిప్తమవడం సహజ పరిణామం.

అయితే వాల్మీకం పేరుతో ప్రచారంలో గల కథ దేశమంతటా ఒకే విధంగా లేదు. వాల్మీకి  రామాయణంలోని అన్ని భాగాలూ ఒకే కవి (వాల్మీకి) విరచితాలని కూడా గట్టిగా చెప్పేందుకు లేదు. ఒక కవి పుట్టించిన కావ్యం మరో కవి గంటంలో పెరిగి తదనంతర కాలంలో మరంతమంది కవుల  ప్రక్షిప్తాల హంగుల్ని సంతరించుకున్నదన్న వాదన ఒకటి బలంగా ప్రచారంలో ఉంది.  

‘నారదస్య తు తద్వాక్యం/ శ్రుత్వా వాక్య విశారదః/ పూజయామాన ధర్మాత్మా/ సహశిష్యో మహామునిః’ అన్న  బాల కాండ (2.1) శ్లోకం మూలకంగానే ఈ అనుమానం. కవి ప్రథమ పురుషలో (తనను గురించి తాను)వాక్యవిశారద, పూజయామాన, ధర్మాత్మ, మహాముని’ వంటి విశేషణాలతో వర్ణించుకోవడం కొన్ని  సందేహాలకు తావిస్తుంది, తరువాతి శ్లోకాలలో కనిపించే   భగవాన్ (బాల 2.9), మహాప్రాజ్ఞ, మునిపుంగవః (బాల 2.17) వంటి స్వీయ ప్రశంసలతో ఈ సందేహం మరింత బలపడుతోంది. తనకు తాను నమస్కరించుకునేటంత తక్కువ స్థాయి సంస్కారం వాల్మీకి మహర్షి ప్రదర్శించడం ఏ వివేచనపరుడినైనా ఆలోచనలో పడవేస్తుంది కదా! 

క్రౌంచపక్షి హననంతో ఖిన్నుడైన వాల్మీకి ముఖతః అప్రయత్నంగా వెలువడ్డ ‘మా నిషాద’ శ్లోకం కాకతాళీయంగా అనుష్టుప్ ఛందస్సులో ఉండటం, తదనంతరం అదే ఛందస్సులో రామాయణం చివరి వరకు కథనం చేయాలని కవి సంకల్పించినట్లు చెబుతారు. కానీ వాల్మీకి రామాయణ శ్లోకాలలో అనుష్టుప్ ఛందస్సుకు భిన్నమైన ఛందస్సూ కనిపిస్తుంది! అనంతర కాలంలో వేరే మరి కొంతమంది కవులు  ప్రక్షిప్తపరిచిన శ్లోకాలగా వీటిని విశ్లేషించే సాహిత్య విమర్శకులూ కద్దు!    

నారదుడు వాల్మీకి మహర్షికి కథనం చేసిన సంక్షేప రామాయణంలో, మహాభారత అరణ్యపర్వంలోని రామోపాఖ్యానంలో బాలకాండకు సంబంధించిన కథ ఏమంత విస్తారంగా ఉండదు. ఆదికావ్యం పేరున ప్రాచుర్యంలో ఉన్న రామాయణ  బాలకాండలో  అప్రస్తుతం అనిపించే కథాభాగమంతా వాల్మీకేతరుల ప్రక్షిప్త నై’పుణ్యం’గా అనుమానించే విశ్లేషకులూ లేకపోలేదు. 

బ్రహ్మర్షి విశ్వామిత్రుడు క్షత్రియుడు. దశరథ మహారాజు ఏనుగని  భ్రమించి వధించిన బాలకుడు ఒక శూద్ర తపస్వి కన్నకొడుకు. ఇంకా లోతుల్లోకి వెళ్లి తరచి చూస్తే ఇతిహాసాల నిండా వివిధ వర్ణాలవారు ఉగ్రతపస్సులు చేసిన ఉదాహరణలు  పుష్కలంగా కనిపిస్తాయి. వాల్మీకి రామాయణంలోని ఉత్తరకాండ ‘శంబూక వధ’ కథలో తపోదీక్షకు అర్హమైన వర్ణాల ప్రస్తక్తి వస్తుంది. కృతయుగంలో బ్రాహ్మణులు,  త్రేతాయుగంలో  అదనంగా క్షత్రియులు, ద్వాపరంలో ఆ ఇద్దరికీ అదనంగా వైశ్యులు,  కలియుగంలో నాలుగు వర్ణాలవారూ అర్హులయిన్నట్లుగా ఒక విశ్వాసం ప్రచారంలో ఉంది. అందుకు విరుద్ధంగా త్రేతాయుగంలోనే  దీక్షకు దిగినందున ‘శూద్ర’ శంబూకుడు వధ్యార్హుడయినట్లు ఒక  వాదన ఒక వర్గంవారు ముందుకు తెస్తున్నారిప్పుడు. పిట్టల మీద వడిసెలరాయి ఎక్కుపెట్టినందుకే కిరాతకుడి మీద కృద్ధుడైన రుషి  వాల్మీకి. అటువంటి సామాజిక తత్త్వవేత్త వర్ణార్హతల ఆధారంగా ఒక నిర్దోషి మానవుడి వధను సమర్థించే విధంగా కథ రచించాస్తాడంటే  నమ్మబుద్ధికాదు.  తదనంతర కాలంలోనే వాల్మీకేతర కవులెవరో తాము నమ్మిన విశ్వాసాలకు ప్రామాణికత ఆపాదించుకొనే నిమిత్తం అప్పటికే సామాజికామోదం పొందిన వాల్మీకి రామాయణంలో ఈ తరహా కథలను చొప్పించినట్లు అభ్యుదయవాదులు అభియోగిస్తున్నారు.  

మొదటి రామాయణ కర్త వాల్మీకి రామునికి సమకాలీనుడని  భావన! కథ జరగక ముందే ఉత్తరకాండను ఆ కవి ఊహించి రాసాడా?   హేతువుకు దూరంగా లేదా ఈ ఆలోచన? కావ్యారంభంలో వాల్మీకి తయారు చేసుకున్న కథాగమన ప్రణాళికలో ఉత్తరకాండ కూడా ఉంది కదా అని వాదించ వచ్చు. కానీ ఆ సర్గలో సైతం మార్పులకు అనుగుణంగా   చేర్పులు చేయడం ఏమంత కష్టం?

లంకాధిపతి విశిష్ట వేదపాండిత్యమున్న   పౌలస్త్య బ్రాహ్మణుడన్న వాదనా ప్రశ్నార్హమే. వేదవిధుల మీద విశ్వాసమున్న వ్యక్తి యజ్ఞాయాగాదులు భగ్నత కోరుకుంటాడా?! పోనీ పౌలస్త్య వంశజుడు రావణుడు రాక్షసుడు. అసురుడుగా జరిగిన ప్రచారం చరిత్ర దృష్ట్యా  దోషం’ అనుకుందాం. కానీ సుందరకాండలో దానికి విరుద్ధమైన భావం (సుందర 20. 5-6) పొడగడుతుందే! మనసు దిటవు పరుచుకొనేటందుకు వీలుగా   ఎత్తుకొచ్చిన స్త్రీకి ఒక సంవత్సరం పాటు అవకాశం ఇవ్వాలని రాక్షసవివాహ నీతి. అప్పటికీ ఒల్లని ఆడదానిని భక్షించడం ఆదిమజాతుల్లో తప్పుకాదు. రాక్షసజాతికి చెందినవాడు కాబట్టే రావణుడు సీతను చంపి తింటానని బెదిరించాడు గానీ బలాత్కరిస్తానని ఎక్కడా అనినట్లు కనిపించదు! ‘కామం కామః శరీరే మే/యథా కామం ప్రవర్తతాం’ (మన్మథుడు నా శరీరంలో ఎంత యధేచ్చగానైనా ప్రవర్తించనీయి నా పై కామనలేని నిన్ను నేను తాకను) అంటాడు. ఒక ఉదాత్త ప్రేమికుడి  ఆదర్శనీయమైన భావన రాక్షసుడిలో! ప్రధానపాత్రలలోనే  ఇన్ని పరస్పర వైరుధ్యాలున్న నేపథ్యంలో రామాయణ రచన ఒకే కవి చేతి మీదుగా మాత్రమే సాగిందనుకోవడానికి మనసొప్పడంలేదు.  

ఆచారాలనుబట్టి, భాషలనుబట్టి రామాయణంలోని వానరలు సవర జాతివారు అయివుండవచ్చని గో. రామదాసుగారు (భారతి 1926 మార్చి, ఏప్రియల్ సంచికలు)  ఓ వ్యాసంలో అభిప్రాయ పడ్డారు. సవర భాషలో ‘ఆర్శి’ అంటే కోతి. ఆర్శిలలో మగవాళ్ళు లంగోటి కట్టే విధానం వెనక వేలాడే తోకను తలపిస్తుంది. రామాయణంలోని లంక, జన స్థానాలకి  ‘లంకాన్, జైతాన్’ అనే సవర పదాలు  మూలాలని రామదాసుగారు  ఊహిస్తున్నారు. ‘దండకా’ అన్న పదానికీ వ్యుత్పత్తి  చెప్పారాయన. సవర భాషలో ‘దాన్’ అంటే నీరు. ’డాక్’ అన్నా నీరే. ‘దాన్ డాక్’ అంటే నీరే నీరు. ‘దాన్డాక్’ మీద ‘ఆ’ అనే షష్టీ విభక్తి ప్రత్యయం చేరి ‘దన్డకా’.. (దండకా) అయిందని రామదాసు గారి ప్రతిపాదన. దండకారణ్యంలో  విశేషంగా నీరు ఉండబట్టే  అరణ్యకాండ (11. 40-41) లో ‘స్థాలీప్రాయే వనోద్దేశే పిప్పలీవన శోభితే/బహుపుష్పఫలే రమ్యే నానా శకుని నాదితే/పద్మిన్యో వివిధా స్తత్ర ప్రసన్న సలిలాశ్రితాః/హంసకారండవాకీర్ణా శ్చక్రవాకోశోభితాః’ అనే శ్లోకంలో చెప్పినట్లు అగస్త్యాశ్రమం పిప్పిలోవన శోభితమైన సమతలం మీద రకరకాల పుష్పాలు, ఫలాలు,  పక్షుల రవాలు,  హంసలు, సారసాలు, చక్రవాకాలతో శోభాయమానంగా ఉంద’నే వర్ణనకు  అతికినట్లు సరిపోతుంది.

చిన్నవాడు పెద్దవాడి భార్యను పెండ్లాడవచ్చు. పెద్దవాడు చిన్నవాడి భార్యను మాత్రం ముట్టుకోకూడదన్నది సవరల ఆచారం. రామాయణంలోని వాలిసుగ్రీవుల కథ తదనుగుణంగానే ఉంది కాబట్టి రామాయణంలోని వానరులు ఒకానొక సవర జాతివారేనని గో. రామదాసుగారి సిద్ధాంతం. తథాస్తు అందామనిపించినా తత్ సిద్ధాంతానికి తభావతు కలిగించే అంశాలు వాల్మీకంలోనే నిక్షిప్తమై ఉన్నాయి! 

చరిత్ర ప్రకారం వానరులు దక్షిణభారతంలో మహా బలవంతులు. ప్రముఖులు. బుద్ధిమంతులు. ఆర్యులకు స్నేహపాత్రులు. రామ లక్ష్మణులతో ప్రథమ పరిచయం వేళ హనుమంతుడు ధరించిన  భిక్షు రూపం, ప్రదర్శించిన భాషాపాటవం, సముద్ర లంఘనంలో లాఘవం, సందర్భశుద్ధితో  పెద్దలకు వందనాదులు చేసే సంస్కారం  వానరజాతి నాగరికలక్షణ విశేషాలు. అభివృద్ధిపరంగా  ఎంతో వెనకంజలో ఉండే సవర జాతిగా వారు  ఏ కారణం చేత ఎప్పుడు దిగజారిపోయినట్లు? నమ్మదగ్గ  అదారాలేమీ దొరకనంత వరకు రామదాసుగారి ‘సవర’ సిద్ధాంతాన్ని సంపూర్ణంగా స్వీకరించలేమనుకోండి.  కిష్కింధగా చెప్పుకునే ఆ ప్రాంతంలో ఇప్పుడు సవర జాతివారూ దాదాపుగా  లేరు. కోతులు మాత్రం చాలా ఎక్కువ.  అదో  వింత!

రామాయణంలోని జటాయువూ ఒక ఆటవిక జాతి మనిషని సురవరం ప్రతాపరెడ్డిగారి సిద్ధాంతం. కొమర్రాజు వెంకట లక్ష్మణరావుగారు ప్రకటించిన విష్ణుకుండి మూడవ మాధవశర్మ శాసనం ప్రస్తావించిన ‘గుద్దవాది’.. ఇప్పటి గోదావరి జిల్లాలోని రామచంద్రాపురం తాలూకు రంపచోడవరమని మల్లంపల్లివారూ అభిప్రాయపడ్డారు. ఆ గుద్దవాదే పూర్వం గుద్రహారము. గృధ్ర శబ్దం సంస్కృతీకరించిన గుద్ర శబ్దంకాగా  కాలక్రమేణా అది గద్దగా  ‘పెంచిన రామాయాణం’లో రూపాంతరం చెందివుంటుందని  పెద్దల ఊహ. కానీ వాల్మీకి రామాయణంలో రావణుడు సీతమ్మవారిని ఆకాశమార్గానే తీసుకు పోయినట్లుంది. జటాయువూ ఒక పక్షిమాత్రంగానే వర్ణితం. ఈ వైవిధ్యాలకీ ప్రక్షిప్తాలే కారణాలా? 

ముందా జాతిని గురించి ఒక వ్యాసం రాస్తూ శరశ్చంద్రరాయ్ గారు ‘ముందాలలోని  ఉరోవన్ అనే ఒక  శాఖ తాము రావణ సంతతికి చెందిన వారమని చెప్పుకుంటుంద’న్నారు. ఆయన సిధ్ధాంతం ప్రకారం కోరమండల్  తీరం ఖరమండలం అనే మూలపదం  నుంచి ఉద్భవించింది.  రామాయణంలో చెప్పిన ఖరమండలం ప్రాంతం ఇదే  కావచ్చన్న రాయ్ గారి  అభిప్రాయం సత్యానికి ఎంత సమీపంలో ఉందో చెప్పలేని పరిస్థితి. శాస్త్రబద్ధంగా పరిశోధనలేవీ సవ్యంగా సాగని నేపథ్యంలో రామాయణంలోని ప్రతి అంశమూ, ప్రాంతమూ ఇలాగే పలుప్రశ్నలకు గురవుతున్నవన్న మాట ఒక్కటే అంతిమ సత్యంగా మిగిలింది.

‘రామాయణంలోని లంక నేటి సింహళం. సముద్ర తీరానికి అది నూరు యోజనాల దూరం’ అన్నది బహుళ ప్రచారంలో ఉన్న ఒక విశ్వాసం. సురవరం ప్రతాపరెడ్డిగారి అభిప్రాయం మరో విధంగా ఉంది. చుట్టూ రెండు మూడు దిక్కుల నీరున్నా లంకలుగానే చలామణి అయ్యేవని.. గోదావరీ ప్రాంతంలోని ఒక లంక రామాయణంలోని లంకయి ఉండవచ్చని రెడ్డిగారి అంచనా.  ఆంజనేయుడు సముద్ర లంఘనం చేసాడని రామాయణంలో స్పష్టంగా ఉన్నప్పుడు గోదావరీ ప్రాంతంలోని ఏదేని ఒక కాలవను మాత్రమే దాటాడని అనడం దుస్సాహసమే అవుతుంది!  రామాయణ కాలంనాటి నైసర్గిక స్థితిలో భారతదేశానికి లంకకు మధ్య నూరు యోజనాల దూరం ఉండేదా! నాటి లంక నైసర్గిక స్వరూపం నిర్ధారణ అయేదాకా సింహళంలోని లంకే రామాయణంలోని లంక అనుకోవడం మినహా మరో మార్గం ఏముంది?

ఆధార లవలేశాలపై చేసిన ఈ కేవల ఊహావిశేషాలూ  సందేహాతీతాలేమీ కావు కూడా. ప్రథమ రామాయణ కర్త రాముడికి సమకాలికుడు కాకపోయే అవకాశమూ కొట్టి పారేయలేం. నిజంగా సమకాలీనుడే అయితే ఎంత కావ్యమైనా  గోరంత వాస్తవికతకు  కొండంత అభూత కల్పనలు కల్పిస్తాడా? గతంలో జరిగిన కథేదో కాలమాళిగలో వూరి వూరి  ప్రథమ రామాయణ కర్తృత్వం జరిగే నాటికి కల్పనలు, కవితోక్తులతో  ఓ అందమైన కావ్యానికి సరిపడినంత  సరంజామాగా సమకూరిందనుకున్నా పేచీ లేదు. తదనంతర కాలంలో  ఆ కావ్యంలోకొచ్చి పడ్డ  ప్రక్షిప్తాల తంతు  సరే సరి! 

అనుష్టుప్ కి భిన్నమైన శ్లోకాలయితేనేమి? అందులోనూ ఎంతో ప్రతిభావంతమైన కవిత్వం  ఉంది. రెండో వాల్మీకీ(ఉండి ఉంటే) మొదటి వాల్మీకులవారికి ప్రతిభాపాటవాలలో తీసిపోని మహాకవే. కాబట్టే ప్రక్షిప్తాల పోలికల్లో ఇంత సంక్లిష్టత! 

రామాయణం భారతానికి సుమారు వెయ్యి సంవత్సరాల ముందైనా జరిగి వుంటుందని  ఒక అంచనా. నాటి సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక  పరిస్థితులకు అనుగుణంగా అల్లిన కథ రామాయణం. నేటి సమాజ విలువలతొ వాటిని బేరీజు వేయబూనడం సబబు కూడా కాదు.  

సాహిత్యంలో ప్రధానంగా ఎంచవలసింది నాటి విశ్వాసాలు.. ఆ విశ్వాసాలు ఆయా పాత్రలను నడిపించే తీరు.. అంతిమంగా మానవత్వం ప్రకటితమైన వైనం. ఆ దృష్టితో  చూస్తే రామాయణం నిశ్చయంగా అత్యుత్తమమైన  విలువలతో కూడిన మనోవికాస గ్రంథమే.

కర్తృత్వం సంగతి కాసేపు పక్కన ఉంచుదాం! ఆ ఆదికావ్యంలోని కవిత్వం, కథా నిర్వహణ, పాత్ర పోషణ అపూర్వం. వివాదాలన్నింటికీ అతీతం. పురుషోత్తముడైన రాముని కథ ఎవరైనా కానీయండి ఒక కవిశ్రేష్టుడు  మలిచిన తీరు అనితర సాధ్యం. శోకం, శృంగారం, శౌర్యం, వేదాంతం, నీతి.. మహాకవి పట్టుకున్న ప్రతీ రసం మన మానసాలని   తేనెపట్టులాగా పట్టుకుని ఒక పట్టాన వదలదు.  పురంనుంచి, వనంవరకు కవి కావ్యంలో చేసిన వర్ణనలో? అత్యద్భుతం. సహజ సుందరం.  కథ కల్పనల్లో విహరించినా.. వర్ణనలు వాస్తవికతకు అద్దం పడుతుంటాయి.  ప్రతి సన్నివేశం విస్పష్టం. విశిష్టం.  వెరసి రామాయణం వంటి కావ్యం న భూతో న భవిష్యతి. సీతారాముల దాంపత్య సరళిని వాల్మీకి మలిచిన తీరుకి విశ్వజనావళి మొత్తం నివాళులెత్తుతున్నది ఇవాళ్టికీ. 

మానవుడైన రాముణ్ణి వాల్మీకి తన లేఖినితో దేవుణ్ణి చేసాడు. భారతావనిలో ఇవాళ రాముడులేని ఊరులేదు. రామకథ వినబడని పుణ్యస్థలం లేదు. సీతారాముల్ని చిత్రించని  కళారూపం అసంపూర్ణం. ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో స్పర్శిచని భారతీయ సాహిత్యం అసమగ్రం.   దేశదేశాలలో, పలు భాషలలో సైతం గుబాళిస్తుదా రామకథా సుగంధ సుమం. 

ఎక్కడో ఆకాశంలో విహరించకుండా.. మన మధ్య మసలుతూనే  మానవ విలువలను గురించి, మంచి పాలన గురించి, కుటుంబ నిష్ఠతను గురించి   ఉత్తమ మార్గమేదో స్వీయప్రవర్తన ద్వారా రుచి చూపించిన పురుషోత్తముడు రాముడు. కల్పనో.. వాస్తవమో.. రెండు చేతులా నిండు మనసుతో మనం చేసే సునమస్సులకు నూరు శాతం యోగ్యులు సీతారాములు. ఆ ఆదర్శ దంపతులను క్షుభిత జాతికి అందించిన కవియోగులు.. ప్రథములైనా..ద్వితీయులైనా.. అందరూ 

- కర్లపాలెం హనుమంతరావు 

బోథెల్ ; యూఎస్ఎ

09 -02 -2021 


సంప్రదించిన కొన్ని రచనలుః

వాల్మీకి రామాయణము- ఉప్పులూరి కామేశ్వరరావు

రామాయణ సమాలోచనము- కాళూరి హనుమంతరావు

రామాయణ విశేషములు- సురవరం ప్రతాపరెడ్డి

రామాయణమునందు వానరులు ఎవరు? - గో. రామదాసు

రామాయణము- బాలకాండము- కాళూరి వ్యాసమూర్తి

The Riddle of Ramayana- C.V. Vaidya


కర్లపాలెం హనుమంతరావు


Saturday, July 18, 2020

భారతదేశం హిందూదేశమా? -కర్లపాలెం హనుమంతరావు= సూర్య దిన[పత్రిక ప్వాసం



'సప్త ద్వీపా వసుంధరా'. భూమి ఏడు ద్వీపాల సంపుటం. ద్వీపం అంటే నీటి
మధ్యలో ఉండే భూభాగం. 'జంబూ ద్వీపే, భరత ఖండే, భరత వర్షే' అనే మంత్రం
పూజాదికాలలో వింటూ ఉంటాం. జంబూ అనే ఓ ద్వీపం మధ్య ఉన్న భరత ఖండంలోని ఒక
భాగం భరతవర్షం(దేశం). అంటే పురాణాల ప్రకారం చూసుకున్నా మనం ఉన్నది
హిందూదేశం కాదు. భారతదేశం. మరి ఇప్పుడు తరచూ మారుమోగే ఈ 'హిందూ' పదం
ఎక్కడ నుంచి   దిగుమతయినట్లు? కాస్త చరిత్ర తిరగేస్తే ఈ అనుమానం సులభంగా
నివృత్తి అవుతుంది.

'హిందూ' పదం నిజానికి ఒక మతాన్ని సూచించదు. అది ఒక సంస్కృతికి సూచిక.

స్వాతంత్ర్యం సాధన తరువాత లౌకిక ప్రజాతంత్ర విధానంలో పాలన జరగాలని
తీర్మానించుకున్న మనం  రాజ్యాంగంలో 'హిందూ' అన్న పదానికి పాలనాపరంగా
ప్రాధాన్యత ఇవ్వలేదు. దాని స్థానే 'భారత్' 'భారత్ దేశ్' అనే పదాలు
కనిపిస్తాయి.

యురోప్ ఖండంలో మన దేశానికి 'ఇండియా'గా గుర్తింపుంది. ఆ పాపం తెల్లవాడి
వల్ల. 'ఇండికా' 'ఇండిగో' అంటే నల్లమందు అని అర్థం. నల్లమందు కోసం
వెతుక్కుంటూ వచ్చిన తెల్లవాళ్లకు ఇక్కడ ఆ నీలిమందు పుష్కలంగా పండే భూములు
కనిపించాయి. పాడి- పంట చేసుకు బతికే అన్నదాతల చేత బలవంతంగా నీలిమందు
సాగుచేయించిన బీహార్ 'చంపారన్' కథ మనందరికీ తెలుసు. అక్కడి రైతులు బాపూజీ
ఆధ్వర్యంలో చేసిన ప్రతిఘటనతోనే మన మలిదశ స్వాతంత్ర్యపోరాటానికి బీజం
పడింది.

రాజ్యాంగం 'హిందూ' పదాన్ని గుర్తించలేదు. అటు సంస్కృతీ, ఇటు రాజ్యాంగమూ
రెండు గుర్తించని ఈ 'హిందూ' పదానికి మరి ఇప్పుడు ఇంత ప్రాధాన్యత ఎందుకు
పెరుగుతున్నట్లు? ఇంకాస్త లోతుకుపోయి తరచి చూస్తే మరిన్ని ఆసక్తికరమైన
విషయాలు వెలుగు చూస్తాయ్!

ఇప్పుడున్న భావన ప్రకారం ఈ దేశంలో అధిక సంఖ్యాకులు ఆచరిస్తున్న మతం
'హిందూ మతం'. అలాంటి ముద్ర వేసిపోయింది ఆంగ్లపాలకులు.  స్వార్థప్రయోజనాల
కోసం రాజకీయాలలోకి 'హిందూ' పదాన్ని ఒక మతరూపంలో చొప్పించి పబ్బం
గడుపుకుపోయిన మహానుభావులు ఆంగ్లేయులు.



నిజానికి భారతదేశానికి ఒక మతమంటూ పత్యేకంగా లేదు. భారతీయత ఒక తాత్వికత.
తాత్వికత అంటే ఓ ఆలోచనా రూపం. వేదాల నుంచి పుట్టిన భావుకత కూడా కాదు.
వేదాలే భారతీయనుంచి రూపు దిద్దుకొన్న వాఙ్మయం. గతాన్ని గురించి
స్మరించినా.. వర్తమానమే భారతీయతకు ప్రధానం. ఆదీ భవిష్యత్తును దృష్టిలో
ఉంచుకొని నిరంతరం కొత్త వికాసమార్గాలలో ప్రస్థానిస్తుంది భారతీయం. ఒక
ప్రాంతానికో, ప్రజలకో పరిమితం కాకుండా సమస్త మానవాళి కళ్యాణం కోసం
పరితపిస్తుందది. మానుషధర్మం నుంచి పక్కకు తొలగకపోవడం భారతీయతలోని విశిష్ట
లక్షణం. ఇందుకు చరిత్ర నుంచి ఎన్నైనా ఉదాహరణలు చూపించవచ్చు. ముందు ఈ
'హిందూ' పదం పుట్టుపూర్వోత్తరాలను గురించి కాస్త తెలుసుకొందాం.

తురుష్కులు ఈ దేశం మీదకు దండెత్తి వచ్చినప్పుడు  ముందుగా వాళ్ల కంటబడ్డది
సింధునది. సింధూని వాళ్లు హిందూగా పిలుచుకున్నారు. ఈ దేశాన్ని హిందూదేశం,
ఇక్కడి జనాలను హిందువులు అన్నారు. ముసల్మానుల పెత్తనం వెయ్యేళ్లకు పైనే
సాగింది ఈ దేశం మీద. ఆ పాలకుల నోట నలిగి నలిగి చివరికి ఈ దేశం ప్రజల
నాలుకల మీదా  'హిందూస్తాన్' గా స్థిరబడింది.

ముసల్మానులతో పాటు ఇస్లామూ వారి వెంట  వచ్చింది. ఇస్తాం ఒక శుద్ధమతం. ఆ
మతం ముమ్మరంగా ప్రచారంలోకి వచ్చిన తరువాతే ఇక్కడి ముస్లిమేతరుల మీద
'హిందువులు' అనే ముద్ర స్థిరపడింది. ఆ హిందువులు ఆచరిస్తున్న ధర్మం
హిందూధర్మంగా గుర్తింపబడింది.

'హిందూ' విదేశీయుల మనకు అంటగట్టిన ఒక ‘బానిస ట్యాగ్’ అంటారు దాశరథి
రంగాచార్య ‘హిందూత్వంపై ఇస్లాం ప్రభావం’ అనే వ్యాసంలో. బానిసత్వం పోయినా
ఇంకా ఆ పరాధీన సూచిక పదాన్నే గర్వంగా చెప్పుకు తిరగడం మనకే చెల్లింది!

స్వాతంత్ర్యం రావడం వేరు. బానిసత్వం పోవడం వేరు. జాతీయభాషగా రాజ్యాంగంలో
మనం గుర్తించిన 'హిందీ' పదం అసలు జాతీయపదమే కాదు. అది విదేశీయుల నోటి
నుంచి వచ్చిన నిమ్నపదం. ఈ నిజం గుర్తించలేకపోవడానికి పన్నెండేళ్లకు పైగా
బానిసలుగా బతకేందుకు అలవాటు పడటమే కారణం కావచ్చు.

మహమ్మదు ప్రవక్త ఇస్లాం మతాన్ని ఒక సంఘటిత శక్తిగా రూపొందించారు.
రాజ్యవిస్తరణ, మతప్రచారం.. అనే రెండు ధ్యేయాలతో ఇస్లాం ఆయుధం పుచ్చుకొని
బైలుదేరింది. ఇస్లాం ఆక్రమించుకొన్నంత భూభాగాన్ని, విశ్వాసాన్ని బహుశా
చరిత్రలో అంత తక్కువ వ్యవధిలో మరే ఇతర మతం ఆక్రమించి ఉండదేమో!



ఆ ఇస్లాం వెయ్యేళ్లు పాలించిన భూభాగం భారతదేశం. ముసల్మానుల ప్రమేయం
లేకుండా భారతదేశ చరిత్ర లేదు. ఇస్లామును తుడిచి పెడతామన్న
రాజకీయాపార్టీలు సైతం  మహమ్మదీయులను సంతోషపెట్టే ఓటు రాజకీయాలు
చేస్తున్నాయిప్పుడు!

హింసతోనే ప్రచారం ప్రారంభమయినా.. కాలక్రమేణా ఈ దేశ సంస్కృతిలో
అంతర్భాగమయింది ఇస్లాం. 'స్వర్గ మన్నది ఎక్కడున్నది?' అంటే ‘ఇదిగో..
ఇదిగో.. ఇక్కడున్నది' అనే వరకు మచ్చికయింది భారతీయతకు. భారతీయ తాత్విక
చింతన ఇస్లామును అంతగా ప్రభావితం చేసింది. వెయ్యేళ్ల చరిత్రలో కొన్ని
దుర్మార్గాలకు ఒడిగట్టినా.. మొత్తం మీద భారతీయ ధర్మ, సంస్కారాల
ప్రభావానికి లొంగిపోయింది ముస్లిముల సంస్కృతి. భారతీయుల మత సహిష్ణుత
అలవడ్డం వల్లే.. మిగతా దేశాలలోని దూకుడు కాలక్రమేణా ఇక్కడ తగ్గింది.
మతమార్పిడులు జరిగినా.. ఇస్లామేతరాన్ని పూర్తిగా తుడిచిపెట్టే ప్రయత్నం
చివరి వరకు కొనసాగలేదు. ఆదిశంకరుడి అద్వైతం, రామానుజుడి విశిష్టాద్వైతం,
వల్లభాచార్యులు, జయదేవుల మధుర భక్తి, తులసి రామాయణం, కబీర్, మీరా,
త్యాగయ్య, రామదాసు, అన్నమయ్యల భక్తివాఙ్మయం ముస్లిం పాలకుల కాలంలోనే
దేశానికి దక్కింది. ఇంత సాహిత్య, సంగీత, ఆధ్యాత్మిక భావజాలం
వర్ధిల్లనీయడానికి కారణం ముస్లిముల మీద పడిన భారతీయ తాత్విక సహిష్ణుత
ప్రభావం,

ఆరు నెలల సావాసానికి వారు వీరు అవుతారంటారు. వెయ్యేళ్ల సహజీవనంలో భారతీయత
నుంచి ఇస్లాం స్వీకరించిన  సాంస్కృతిక సంపద స్వల్పమేమీ కాదు. భారతీయ
చింతనలో వచ్చిన మార్పూ కొట్టిపారేసిది కాదు. పార్శీ ప్రభావంతోనే ఎదిగినా
ఉర్దూ షాయిరీలో సంస్కృత సాహిత్య  ఛాయలు సుస్పష్టంగా కనిపిస్తాయ్! సూఫీ
సిధ్దాంతానికి భారతీయ తాత్వికతే తల్లి. ఉత్తర భారతంలో వేషభాషల మీదే కాక,
ఆహార అలవాట్ల మీదా ముస్లిం సంస్కృతి అధికంగా కనిపిస్తుంది. ఉపనిషత్తులు
నమ్మని ఏకబ్రహ్మ సూత్రాన్ని ముస్లిం ఆధ్యాత్మికత ప్రభావం వల్ల అద్వైత,
విశిష్టాద్వైత సిధ్దాంతాలకు అంకురార్పణ జరిగింది. ఉత్తరాది దేవాలయాల్లో
నేటికీ సాగే 'ఆరతి' సంప్రదాయం ముసల్మానుల 'సామూహిక ప్రార్థన'లకు అనుకరణే.
భారతీయత  మౌలిక నిర్మాణం తీరుతెన్నులవల్ల  అనుకూలించక   ఎప్పటికప్పుడు
బెడిసిగొడుతున్నవి కానీ  భారతీయ సమాజం మొత్తాన్నీ ఒకే ఛత్రం కిందకు
తెచ్చేందుకు ఇప్పుడు హిందూత్వం చేస్తున్న ప్రయత్నాలు ముస్లిముల అఖండ మత
సిద్ధాంతంతో ప్రభావితమైనవే!

కానీ భారతీయత ‘ధర్మం వేరు.. రాజకీయం వేరు.. గా’ ఉంటుంది. లౌకికధర్మం
రాజకీయాన్ని శాసిస్తుంది.  సమాజం ఆ తరహా ధర్మాన్ని రక్షిస్తుంటుంది.
రాజకీయం ధర్మాన్ని శాసించే తత్వం  పరాయి మతప్రధానదేశలోలాగా భారతీయ
సమాజంలో చెల్లదు.



హిందూ ముస్లిముల మధ్య వ్యక్తిపరమైన వైరుధ్యాలేమైనా ఉంటే ఉండవచ్చు  కానీ
మతపరమైన ఘర్షణలు  ఉండేవి కాదు. ఆంగ్లేయులు భారతదేశాన్ని ఆక్రమించుకొనే
వరకు ఈ సహోదరభావం వర్ధిల్లింది. కాబట్టే 1857 స్వాతంత్ర్య పోరాటంలో
బహదూర్ జఫర్ షా చక్రవర్తి కావాలని  హిందూప్రభువులు సైతం
ప్రాణాలర్పించడానికి సిధ్దపడి పోరాడారు. తెల్లవాళ్లను విదేశీయులుగా
భావించి తరిమికొట్టేందుకు హిందూ ముస్లిములిద్దరూ సంఘటితంగా తిరుగుబాటు
చేసారు. మత సిధ్దాంతాల మధ్య వైరుధ్యాలను పక్కన పెట్టి హిందూ ముస్లిములు
ఒక్కటిగా ఉన్నంత వరకు తమది పై చేయి కాదన్న తత్వం తలకెక్కింది కాబట్టే
విభజించి పాలించే విధానానికి తెరలేపింది తెల్లప్రభుత.

టర్కీ సుల్తాను నుంచి మతాధికారాలని ఊడలాక్కొన్న సందర్భంలో ముస్లిముల
ఆత్మగౌరవానికి అవమానంగా భావించి కాంగ్రెస్ ఆధ్వర్యంలో హిందూ
ముస్లిములిద్దరూ కలిసే ‘ఖిలాఫత్’ ఉద్యమం నడిపించారు. బెదిరిన బ్రిటిష్
దొరలు 'హిందూ రాజ్యంలో ముస్లిములకు రక్షణ ఉండదు' అన్న దుష్ప్రచారాన్ని
ముమ్మరం చేసినప్పటి నుంచి రెండు మతాల మధ్య కనిపించని పొరపచ్చలు
మొదలయ్యాయి. జిన్నా సారధ్యంలో ఏర్పడ్డ ముస్లిం లీగ్ ‘ప్రత్యేక ఇస్లాం
రాజ్యం’ కోసం చేసిన ఉద్యమంతో ఇరు మతాల  మనోభావాలు  తిరిగి మెరుగవనంతగా
చెడిన కథంతా మనకు తెలిసిందే!

ముస్లిములలో పెద్దలు కొందరు పెద్దలు మతద్వేషాన్ని వ్యతిరేకించే ప్రయత్నం
చేస్తే,, హిందువుల్లో కొందరు మహానుభావులు మతద్వేషాన్ని రెచ్చగొట్టే
కుత్సితానికి పాల్పడ్డారు. హిందువులు ఒక తాత్విక జాతిగా స్వభావరీత్యా
పరమతాలను ద్వేషించరు. కానీ ఆ కొద్దిమంది మహానుభావులకు మరికొంతమంది
బుద్ధిమంతులు తోడవుతూ అనునిత్యమూ ప్రజల మధ్య సామాజిక శాంతిభద్రతలకు
విఘాతం కలిగించే విధంగా ద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం కొనసాగిస్తూనే
ఉన్నారు.

భారతదేశం విభిన్న విశ్వాసలకు ఆలవాలం. బౌధ్ధం, జైనం, శాక్తేయం, చార్వాకం
వంటి పరస్పర విరుధ్ద విశ్వాసాలు సయోధ్యతో సహజీవనం సాగించాయి ఇక్కడ.
స్వాతంత్ర్యం సాధించుకున్న తరువాతా సుఖజీవనానికి అవసరం లేని మతద్వేషాలు
అవసరమా? ప్రత్యేక మతరాజ్యం సాధించుకొనేందుకు అప్పట్లో ఆయుధంగా వాడిన
మతవిద్వేషాలను ఇంకా ఏం సాధించాలని ఇక్కడ కొనసాగిస్తున్నట్లు?! 'సర్వే జనా
సుఖినో భవన్తు' అన్నది భారతీయత మౌలిక ధార్మికసూత్రం. ఆ స్ఫూర్తి
సంపూర్ణంగా ధ్వంసమయేదాకా మతవాదం అతిచొరవ చూపిస్తే సమాజమే శిక్షిస్తుంది.
చరిత్ర చాలా సార్లు రుజువులతో సహా నిరూపించిన ఈ హితవును పెడచెవిన
పెడతామంటే  .. సరే,, స్వయంకృతానికి ఇక ఎవరైనా  చేసేదేముంది?

***
(సూర్య దినపత్రిక - ఆదివారం - 18 -07 -2020 ప్రచురితం) 



Monday, January 6, 2020

రాజధాని ఎట్లా ఉండాలి?- కర్లపాలెం హనుమంతరావు




"ధన్వదుర్గం మహీదుర్గ మబ్దుర్గం వార్క్షమేవ వా।
నృదుర్గం గిరిదుర్గం వా సమాశ్రిత్య వసేత్సురమ్॥"
ఐదు యోజనాల వరకు నీరు లేని మరుదుర్గం, రాళ్లతోగాని ఇటుకలతో గాని పన్నెండు బారల ఎత్తుండి యుద్ధం తటస్తిస్తే కూడా పైన తిరగేందుకు వీలైనంత వైశాల్యంతో ప్ర్రాకారం కట్టుకోడానికి పనికొచ్చే భూదుర్గం, చుట్టూతా లోతైన నీరున్న జలదుర్గంచుట్టూతా మరో యోజన దూరం దట్టమైన చెట్టూ చేమా ఉన్న వృక్షదుర్గం, చతురంగ బలాలతో పరిరక్షితమైన మనుష్యదుర్గం, నాలుగు దిక్కులా కొండలతో చుట్టి ఉండి, లోతైన నదులు, సన్నటి ఇరుకైన మార్గం ఉండే గిరిదుర్గం.. ఇవన్నీ రాజధానికి ఉండే అర్హతలేట. అన్నీ కాకపోయినా వీటిలో కనీసం ఏ కొన్నైనా ఉండే ప్రాంతంలో ముఖ్యపట్టణం కట్టుకోవడం రాజుకు క్షేమం అని మనుస్మృతిలో మనువు నిర్దేశించిన రాజధాని ప్రధానలక్ష్యణాలు. అన్నింటిలోకి గిరిదుర్గం అత్యుత్తమైనది అని కూడా ఆయన అదనపు సలహా!
మరుదుర్గాన్ని మృగాలు, మహీ దుర్గాన్ని ఎలుకలు సంతతి జీవులు, జలదుర్గాన్ని మొసళ్ళు, వృక్షదుర్గాన్ని కోతులు, నృదుర్గాన్ని మనుష్యులు, గిరిదుర్గాన్ని దేవతలు.. ఆశ్రయించి ఉంటారు. కాబట్టి రాజు జోలికి రావాలంటే ముందు ఈ జాతులు అన్నింటితో పెట్టుకోవాలి శత్రువులు అని మనువు ఆలోచన.
గిరిదుర్గాన్ని ఆశ్రయించిన రాజును శత్రువులు హింసించడం చాలా కష్టం. అక్కడ ఒక నేర్పుగల విలుకాడిని నిలబెడితే కింద ఉన్న వందమంది శత్రువులకు సమాధానం ఇచ్చేపాటి శక్తి అమరుతుంది. ఆ లెక్కన వందమంది విలుకాళ్లను పెడితే పదివేల మంది శత్రు యోధులకు పెడసరి కొయ్యలుగా మారే అవకాశం కద్దు.
ఏదేమైనా దుర్గం  రాజులకు అత్యవసరం. ఆ దుర్గం కూడా వట్టి యుద్ధ సాధనాలతో నింపి కూర్చుంటే ప్రయోజనం సున్నా. ధనం, ధాన్యం, వాహనాలు, బ్రాహ్మణులు(ముహూర్తాలు గట్రా పెట్టడానికి కాబోలు), నిర్మాణ శిల్పులు, యంత్రాలు, నీళ్లు,.. ముఖ్యంగా మట్టి (కసవు అన్నాడు  మనువు)నిండి ఉండకపోతే పేరుకే అది రాజధాని.  మనుధర్మశాస్త్రం -పుట  116).
రాజులూ యుద్ధాలూ .. నాటి కాలం కాదు కదా ఇది! ప్రజాస్వామ్యం! ప్రజలు ముచ్చటపడి ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామని ఆలోచించినా చాలు.. రాజుకు మించిన అధికారం చేతికి అందివచ్చే కాలం. 21వ శతాబ్ది మార్క్ రాజులకు మనువు చెప్పిన కోటలు గట్రాలతో రాజధానులు కట్టకపోయినా మునిగిపోయేదేమీ లేదు కానీ.. ఎన్నికల్లో ఎడపెడా పోసిన లక్షల కోట్లు రాబట్టుకోవాలంటే ఆర్థికదుర్గాలు   వంటివి మాత్రం తప్పనిసరి. సందర్భం వచ్చింది కాబట్టి మనువు తన స్మృతిలో ఈ రాజధానుల పితలాటకాన్ని గూర్చి ఏమన్నాడో .. జస్ట్.. ఆసక్తి ఉన్నవాళ్ళు తెలుసుకుంటారనే ఈ రాత!
-కర్లపాలెం హనుమంతరావు
06 -01 -2020

                                                

Saturday, December 14, 2019

వనం, మనం; మధ్యన దైవం కర్లపాలెం హనుమంతరావు




వనం హిందువులకు దైవం. చెట్టులో పుట్టలో దేవుళ్లను దర్శించుకునే తత్వం భారతదేశం అంతటా కనిపిస్తుంది.  వనం మనకు వట్టి వనదేవతేనా.. వరాలు ప్రసాదించే వనలక్ష్మి కూడా. లక్ష్మి సంపదలకు పర్యాయపదం. కాబట్టి ప్రకృతి ప్రసాదాలే అయినా చెట్టూ చేమా మనుషులకు ఆస్తి పాస్తుల కిందనే జమ.
ఆలయం నిర్మాణం తరువాత దేవతా విగ్రహాలు ప్రతిష్టాపనకు ముందు   పరిసరాలలో చెట్టూ చేమా వృద్ధిచెందే అవకాశాలను పరిశీలించే పద్ధతి పురాణేతిహాసాల కాలం బట్టి అనూచానంగా వస్తున్న ఆచారవ్యవహారలలో అంతర్భాగం!  
పంచభూతాలలో ఒకటిగా పరిగణించే పృథ్వి విఘ్నాధిదేవత వినాయకునికి ప్రతిరూపంగా భారతీయుల ఆధ్యాత్మిక భావన . ఆయనకు శమీ, దూర్వ పూజలు ఇష్టం. ఉదకానికి భవానీమాతగా పరిగణన. ఆమెకు అశోక, విష్ణుక్రాంత దళాలతో పూజంటే ప్రీతి. వాయువు విష్ణువు కింద జమ. అశ్వత్థ, తులసీ దళాలతో అభిషేకం అంటే ఆయనకు మోజు. ఆకాశం ఈశ్వరాంశంగా భావించడం హైందవ ఆచారం. బిల్వ, ద్రోణ సంబంధ పూజాదికాలంటే అంబర దేవునికి మహా సంబరం. అగ్ని సూర్యభగవానుడు. ఆయనను అర్క, కరవీర పుష్ప పత్రాలతో పూజిస్తే శాంతిస్తాడని నమ్మకం.
భగవంతునికి ప్రతీకలుగా చెట్లను భావించే అనాది మనస్తత్వం నుంచే నేటి మన ఆలోచనాధారా వికసిస్తో వస్తున్నది.
వేరు నుంచి చిగురు వరకు చెట్టులోని ప్రతీ కణమూ ఏదో ఒక దేవునికి ప్రీతిపాత్రమైనదిగా భారతీయులు భావిస్తుంటారు. ఫల, దళ, పుష్ప సముదాయాల వంటి సరంజామా లేని  పూజావిధానం మనం ఊహించనైనాలేము కదా! శుభకార్యాలలో సైతం చెట్టు చేమల పాత్ర అనివార్యం. దేవీదేవతల చిత్రాలలో మనకు ఏ మూలనో ఓ మూల పిసరంతైనా కాయో, కొమ్మో, పండో, చిగురో కనిపించడం తప్పనిసరి. వృక్ష ప్రమేయం లేని దైవత్వాన్ని ఊహించడం భారతీయులకు మనస్కరించదు.
రామాయణ, భారత, భాగవతాది మహా కావ్య, పురాణాదులు వర్ణించిన వనాల వివరణ వింటుంటే చెవులకు బహు పసందుగా ఉంటుంది. రామాయణంలోని చిత్రకూటం, పంచవటి, అశోకవనం, ఋష్యమూకం, కిష్కింధ, మధువనం వంటి  మనకు తెలిసినవే కాకుండా అనేకానేక ఇతర వన్యదేవాలయాలూ ఉన్నాయి. మహాభారతంలో ఖాండవవనం, , కణ్వాశ్రమం, దైతవనం  దండకారణ్యాలు.. మహాభాగవతంలోని నైమిశారణ్యం, బృందావనం, వంటి వనాలూ ఈ కోవకే చెందే అందాల హరితాలయాలే.
కృష్ణుడు బృందావన సంచారి. వనమాలి, కుంజవిహారి. ఆ హరితప్రేమి  వేణువు ధరించి వేణుమాధవుడయినాడు. కొండను గోటికి ఎక్కించి గిరిధారి, ఆలమందలను వనాల వెంట తిప్పి  గోపాలస్వామి అయిన ఆ నీలమేఘస్వామిని చూసైనా మనిషికి, ప్రకృతి సంబంధమైన చెట్టూ చేమకూ మధ్య ఉన్న అవినాభావ అనుబంధం అర్థమవాలి.  
కృష్ణుని మాదిరే రాముడూ నిత్య సత్యమాలాధరుడు. అవతారమూర్తుల మూల మూర్తి విష్ణువు చేతిలో పద్మం, నాభిన తామర! అతని సహచరి లక్ష్మిదేవిది పద్మాసనస్థితి. రెండు చేతులా రెండు కమల పుష్పాలు ధరించిన ఆ మందస్మిత  దర్శనం కళ్లకు పండువుగా ఉండటం సహజం. 
ఇక ఈశ్వరునిది బిల్వలోకం. ప్రత్యక్ష భగవానుడు సూర్యనారాయణ మూర్తి దర్శన భాగ్యం లభించిన పిదపనే పద్మపత్రాలు వికసించినట్లు.. ప్రకృతి పచ్చగా పలకరించినంత కాలమే మనిషిలోని చైతన్యం ప్రవర్థిల్లేది!
సృష్టి ఆరంభానికి ముందు భగవానుడు బాల దిశమొల స్థితిలో వటపత్రం పైన శయనించినట్లు   భారతీయులు భావించడం మనకు తెలుసు.  బాలశాయి శయనతల్పం రావిపత్రం  అశ్వత్ఠామ వృక్ష ప్రసాదితం. బాలకుడి బొడ్డు నుంచి లేచి నిలిచిన తామర తూడు కొసలు విస్తరించిన భాగమే సృష్టిని ప్రారంభించిన శక్తికి ఆధారభూతమయింది' అన్న ఆ కల్పనల్లో లోతైన ప్రతీకలే ఉన్నట్లు ఆధునిక  తత్వచింతనాపరులూ భావించడం విశేషం. ఆకులలమల బంధంలోనే స్త్రీ-పురుష బంధాల మూలాలు ఉన్నట్లు భావించడంలో  తర్కం ఎంత వరకుందో ఎవరికి వారుగా  విచక్షణాశీలులు తర్కించుకోవలసిన అంశం.
ఆకుల ఆకృతిని బట్టి రావికి పురుషత్వం, వేపకు స్త్రీ తత్వం ఆపాదించిన మేథస్సు మనిషిది.  కళ్యాణం జరిపించిన  ఆ  రావి- వేపల జంట నీడ కింద నాగ'బంధం' ప్రతిష్ఠించి దాని చుట్టూతా   ప్రదక్షిణాలు చేయిస్తే జంటకు నూరేళ్ల పంటగా సంతానం ప్రాప్తిస్తుందని పూర్వీకుల నుంచి ఓ విశ్వాసం.
దశావతారాలలోకి మనం లాగేసుకున్న బుద్ధుడి అవతారమూర్తి గాథల్లో ఈ రావిచెట్టుకు అద్వీతయమైన 'బోధివృక్షం' స్థాయి కల్పించడం హైందవుల గడసరితనానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి. 
విష్ణువుకు తులసీ దళం ప్రీతి. నిత్య తులసీ దళ మాల గళధారి  ఆ లక్ష్మీనాథుడు .  మన్మథుడు తులసీ పత్రాలతో అల్లిన శరాలనే తన లక్ష్యాల పైన ప్రయోగించేది. మదనుడి అమ్ముల పొది వివిధ రకాలైన పుష్పబాణాదులతో నిండి ఉన్నట్లు ప్రబంధ కావ్యాల నిండా వర్ణనలే వర్ణనలు!  
ఆరోగ్య క్షేత్రంలో వృక్షజాతికి అగ్ర తాంబూలం అందించింది ఆయుర్వేదం.  ఆ చికిత్సా విధానం  అంటేనే వృక్ష సంతతికి చెందిన వనరుల ప్రయోజనాల ఏకరువు.  క్షీర సాగర మధన కథనంలో సముద్ర గర్భం నుంచి వెలికివచ్చిన కల్పవృక్షం కథ అందరికీ సుపరిచితమే కదా!
ప్రాచీన సాహిత్యం మీదనే కాదు సుమా.. ఆధునిక నాగరికత పైన కూడా చెట్టూ చేమకు గల  పట్టు సామాన్యమైనది కాదు. ఉదకమండలం మొదలు, కలకత్తా చండీగఢ్ తాలూకు వృక్ష  సంబంధమైన తోటలు, బెంగుళూర్ లాల్ బాగ్, మైసూర్ బృందావనం, కశ్మీర్ శ్రీనగర్ మొగలాయీ ఉద్యానవనాలు, దిల్లీ రాష్ట్రపతి భవనం ఆవరణలోని అలంకార వనాలు.. ఇట్లా  చెప్పుకుంటూ పోతే అంతూ పొంతూ లేనంత పెద్ద జాబితా భారతదేశంలోని పచ్చదనాల కథా కమామిషూ. 
 ఆంధ్రదేశంలోని తిరుమలవాసుని సేవకై పెరిగే వినియోగపు పూల తోటల కథ మరీ ప్రత్యేకమైనది. దేవతా విగ్రహాల స్థానే దేవతావృక్షాలను స్థాపించే సంప్రదాయానికి దేవాలయ వాస్తు, శాస్త్ర సూత్రాలు ప్రస్తుతం దారి చూపించడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఆచారంలో ఉన్న కొన్ని తోటలు నాటే విధానాన్ని స్థాలీపులాక న్యాయంగా పరిశీలించే ప్రయాస మరో సందర్భంలో చేసుకోడం సముచితం. 
-కర్లపాలెం హనుమంతరావు
13 -12 -2019, బోథెల్, యూ.ఎస్





Friday, December 13, 2019

అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష! నిజమే! కనీసం కథానికల వరకు!


'అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష!' అనే డైలాగ్ కన్యాశుల్కం కర్త గురజాడవారి పుణ్యమా అని బహుళ ప్రచారంలోకి వచ్చిన పలుకుబడి. నిజమే; కానీ ఆ రావడం వెనక ఉన్న ఉద్దేశంలో కొంత వెక్కిరింతా ఉంది. 

నిజానికి వేదాలలో అన్నీ ఉన్నాయో లేదో ఎవరికైనా తెలిసే అవకాశం తక్కువే. అలా తెలియలంటే ముందుగా ఆ వేదాలలో అసలు ఏముందో కొంతైనా అవగాహన కలగించుకోవడం సబబు. ఆ సంగతి అట్లా ఉంచి కథానికలుగా మన ఆధునికులు చెప్పుకునే రూపాలు వేదకాలం నుంచే ఉన్నాయన్న    వాదనా  ఒకటి పండితలోకంలో  ప్రచులితంగా ఉంది. ఆ ప్రతిపాదనకు అనుకూలత ప్రకటిస్తో  డాక్టర్ కె.కోదండరామాచార్యులు '50 వసంతాల వావిళ్ల వాజ్ఞ్మ వైజయంతి' సావనీర్ లో 'వేదవాజ్ఞ్మయంలో కథానికలు ఉన్నవి' అంటూ ఒక చిరువ్యాసంలో ప్రతిపాదించారు.(పు.117 -125). అధ్యయానికి అంతంటూ లేదు- అనే భావానికి ఊతం ఇచ్చే ఒకానొక చిన్నకథను సైతం ఈ సందర్భంగా ఆయన  చెప్పుకొచ్చారు. 'భరద్వాజో హ త్రిభిరాయుర్భిర్బ్రహ్మచర్యము వాస.. ఏషా ఏవ త్రయీ విద్యా' అనే తైత్తరీయ బ్రాహ్మణకం తాలూకు మూడో అష్టకంలో కనిపించే పదో ప్రపాఠకం పదకొండో అనువాకాన్ని ఉదాహరణగా ఆచార్యులు తీసుకున్నారు.  నేడు కథానిక లక్షణాలుగా విమర్శక లోకం గుర్తించిన సంక్షిప్తత, సమగ్రత, సంభాషణల సొగసు, ఉపదేశం, పరిమితమైన పాత్రలు.. ఈ చిన్నకథలోనూ ఉండడం గమనార్హం. 
భరద్వాజుడు మూడు ఆయుర్దాయ భాగాలను వరంగా పొందిన ఒకానొక రుషి.  జీవితకాలమంతా బ్రహ్మచర్య దీక్షతో వేదాధ్యయనానికే మీదు కట్టి చివరి దశలో వార్థక్యం చేత శక్తి సన్నగిల్లి శయనావస్థలో ఉన్న దశలో ఇంద్రుని దర్శనభాగ్యం రుషికి లభిస్తుంది. 'నాలుగో ఆయుర్దాయ భాగం సైతం వరంగా ప్రసాదించేందుకు నేను సిద్ధం. కాని  ఆ  వరంతో నువ్వు ఏమి చెయ్యదల్చుకొన్నావో ముందు చెప్పు' అంటూ ఇంద్రుడు ప్రశ్నిస్తాడు. 'మునుపటి మాదిరే వేదాధ్యయనాన్ని కొనసాగిస్తాన'ని భరద్వాజుని బదులు. రుగ్, యజు, సామ వేదాల వంక చూపుడు వేలు చూపించి 'మహా పర్వతాలుగా కనిపించే  అవేమిటో తెలుసునా? వేదాలు మహానుభావా!  నీకింత వరకు దక్కిన జీవితకాలంలో వాటి నుంచి నీవు గ్రహించింది కేవలం ఇంత మాత్రమే సుమా!'అంటూ మూడు సార్లు పిడికెళ్లను తెరిచి  చూపిస్తాడు ఇంద్రుడు. 'నిజంగా నీకు ఇంకా వేదాధ్యయన ఫలం మీద బలమైన కోరిక మిగిలుంటే సావిత్రాగ్నిని ద్యానించు! ఆపైన ఆదిత్యుని సాయుజ్యం పొందు!' అనీ సూచిస్తాడు. అందు మీదట ఇంద్ర ప్రసాదితమైన  నాలుగో జీవిత భాగం కేవలం వేద విద్యాధ్యయనానికి  మాత్రమే వినియోగించక,  సాధించిన  జ్ఞాన కాంతి పుంజం సాయంతో పరిసరాలను సైతం తేజోవంతం చేసి విద్య అంతిమ పరమార్థాన్ని రుషి ప్రపంచానికి చాటినట్లు కథ.  
ఈ కథ పరిణామంలో, ప్రక్రియాపరంగా. లక్ష్య నిర్దేశనపరంగా  తాజా కథానికలకు ఏ మాత్రం తీసిపోనిదని డాక్టర్ కె. కోదండరామాచార్యులవారి వాదం. కాదనగలమా?
-కర్లపాలెం హనుమంతరావు
10, డిసెంబర్, 2019

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...