Showing posts with label History. Show all posts
Showing posts with label History. Show all posts

Wednesday, February 2, 2022

బాపూజీనే మళ్లీ బతికిరావాలా?- వ్యాసం సూర్య - 02 - 10-2019 - కర్లపాలెం హనుమంతరావు





బాపూజీనే మళ్లీ బతికిరావాలా?

-కర్లపాలెం హనుమంతరావు

తెలిసీ తిలియకుండా రాజకీయ అవసరాల కోసం ఇటీవల అమెరికన్ అధ్యక్షుడు భారతదేశ ప్రధాని మోదీజీని 'జాతిపితఅంటూ ప్రశంసించాడు. భరతీయుల నిజమైన జాతిపిత మోహన్ దాస్ కరం చంద్ గాంధీ. శతాబ్దాల బట్టీ  స్వతంత్ర జీవనం కోసం ఆరాట పడి ఎన్నో రాకాలుగా పోరాటాలు చేసిన  భారతీయుల ఆంకాక్షలను అఖరికి  వాస్తవం చేసిన మహాయోధుడు గాంధీజీ. మొదటి సారి నోబెల్ గ్రహీత  ఠాగోర్జీ నోటి నుంచి వినిపించిన వేళా విశేషం.. 'మహాత్మాఅన్న ఆ పిలుపు బాపూజీకి పర్యాయపదంగా స్థిరపడింది! ప్రపంచ నేతల చరిత్రల పరంగా చూస్తే ఇదో అపురూపమైన విచిత్రం.  1869 అక్టోబర్ నాడు గుజరాత్  పోరుబందర్‌లో జన్మించినప్పటి నుంచి  1948 జనవరి 30న హత్యకు గురైన క్షణం వరకు గాంధీజీ జీవితంలోని ప్రతీ ఘట్టంలోనూ ఒక హాలివుడ్ చిత్రం సూపర్ హిట్ ఫార్ములాకి సరితూగే స్థాయి నాటకీయత ఉంది. కాబట్టే అటెన్ బరో 'గాంధీపేరుతో శ్రమించి తీసిన మూవీ అన్నేసి ఆస్కార్ అవార్డుల పంట పండించుకుంది. 

 

'నా జీవితమే నా సందేశంఅన్న  కర్మయోగి మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ. ఆయన నీతి నిజాయితీలతో కూడిన  సత్య నిబద్ధ జీవితం నిజానికి దేశ ప్రజలతో మమేకమై జీవిస్తున్నట్లు  చెప్పుకునే  ప్రజానేతలందరికీ ఆదర్శం కావాలి. క్షేత్ర స్థాయి వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉండడం ఆందోళన కలిగించే అంశం.   

సత్యాగ్రహం అనగానే ముందుగా నేటి తరానికైనా కళ్ల ముందు కదలాడే మూర్తి  కరెన్సీ నోటు పైన బోసి నవ్వులు చిందిస్తూ దర్శనమిచ్చే బాపూజీ  ప్రొఫైల్.  సత్యాగ్రహాన్ని మించిన  పదునైన ఆయుధం మరొకటి లేదని  ఓ సందర్భంలో బాపూజీ అంటారు.    ఆయుధం బాపూజీ చేతికి  అందేనాటికే ఆంగ్లంలో 'సివిల్ డిజ్ ఒబీడియన్స్'  గా ప్రసిద్ధం. హిందూ వలస జాతులకు వత్తాసు వకీలుగా బాపూజీ వెళ్లే నాటికి దక్షిణాఫ్రికాలో   ఫస్ట్ క్లాస్ టికెట్ ఉన్నా.. తెల్లవాళ్లతో సమానంగా  విలాసవంతమైన బోగీలలో  ప్రయాణించడం నిషిద్ధం. రైలు బోగీ నుంచి కిందకు తోసివేసినప్పుడు సాటి వలస జీవులకు మల్లే   గాంధీజీ కూడా తలొంచుకుని వెళ్ళిపోయి ఉంటే ఇంత కథ ఉండేదే కాదు. తల్లి దండ్రుల ద్వారా అబ్బిన ఆత్మ సమ్మాన బుద్ధి  గాంధీజీని కుదురుగా ఉండనిచ్చింది కాదు. ఈ తరహా వివక్ష రాక్షసి అంతమయ్యే వరకూ పోరాడలన్న సంకల్పం   ఆ సందర్భంలో  గాంధీజీలో పురిగొల్పిన ప్రముఖుడు   రచయిత 'టాల్ స్టాయ్'. ఆ రచయిత వ్యాసంలోని 'సివిల్ డిజ్ ఒబీడియన్స్'   బాపూజీ చేతిలో సత్యాగ్రహ ఆయుధంగా మారి మరింత పదునెక్కింది తదనంతర కాలంలో. ఆనాటికి సూర్యుడు అస్తమించని  సామ్రాజ్యంగా ప్రసిద్ధి చెందిన బ్రిటిష్ సామ్రాజ్యంలో సైతం చీకట్లు కమ్మునేటంత దుమారం సృష్టించింది.  ఆ సత్యాగ్రహాయుధం  ధర్మ సూత్రం గురించి వివరించే సందర్భంలోనే తన పుస్తకంలో ఒక చోట బాపూజీ అంటారూ-         ప్రజాస్వామ్యం అనే అభిలాష  ఇంకెవరో వచ్చి  బలవంతాన రుద్దితే రగిలే స్ఫూర్తి కాదు.  స్వీయ వ్యక్తిత్వం  సంస్కరించుకునే అవసరం స్వయంగా గుర్తించి.. ఆ దిశగా ఆచరణాత్మకమైన కృషి కొనసాగించాలన్న సంకల్పం దృఢంగా అచరణలో పెట్టినప్పుడే కాలక్రమేణా దాని వికాస ఫలాలు అనుభవానికి వచ్చేవిఅని. ప్రస్తుతం కంటి ముందు నడిచే రాజకీయాలలో పదే పదే ప్రజాస్వామ్యం అనే పదం రామకోటికి మించి  మారుమోగుతున్నది. అయినా  ప్రత్యక్షంగా ప్రజల భాగస్వామ్యం నేతి బీరకాయలోని నేయి చందంలా మాత్రమే బులిపిస్తున్నది.  బాపూజీని జాతిపితగా చెప్పుకుంటో  నూట యాభై సంవత్సరాల  ఉత్సవాలు ఘనంగా జరిపించే ఉత్సాహంలో ఉన్న ప్రజా నేతలలో ఏ ఒక్కరికైనా  మరి సత్యాగ్రహ ఆయుధం ప్రయోగించాలనే  ఆలోచన రావడం లేదు! అదే విచారిచదగ్గ  విచిత్రం!

'చెడును నిర్మూలించే లక్ష్యంతో ఆయుధాలు చేపట్టడంలో తనకెప్పుడూ  వ్యతిరేకత లేదని బాపూజీనే స్వయంగా చెప్పుకొచ్చారు కదా చాలా సందర్భాలలో! అయితే ఆ చేపట్టిన ఆయుధం కారణంగా ఏ పక్షమూ రక్తం చిందించరాదు- అన్నదే జాతిపిత అభిమతం.  బొట్టు నెత్తురు నేల రాలకుండా శతాబ్దాల పాటు దేశాన్ని ఏలిన బ్రిటిష్ పాలకులను నిశ్శబ్దంగా సరిహద్దుల కావలకు నెట్టివేసి మరీ  అహింసా పోరాటం సాగించే పద్ధతులను ప్రపంచానికి ప్రదర్శించి చూపించిన ప్రయోగశీలి మహాత్మా గాంధీ. సుందరాంగుల ముక్కులుముఖాల మీద మోజుతో యుద్ధాలకు తెగబడి వేలాది అమాయకులను బలవంతంగా యుద్ధ రంగాల రొంపిలోకి దింపి అపారమైన ప్రాణఆస్తి నష్టాలు కలిగించడమే యుద్ధాలుగా  చదువుకున్నది ప్రపంచ చరిత్ర అప్పటి వరకు. చేతి కర్రకిర్రు చెప్పులుకొల్లాయి ధోతీబొడ్డు గడియారం,  బోసి నవ్వులనే ఆయుధాలతో కూడా  ఎంతో బలవంతుడైన విరోధిని ప్రేమతో నిరోధించవచ్చు. లాలించి లొంగదీయవచ్చని బాపూజీ ప్రదర్శించిన 'అహింసా పోరాటంచాటి చెప్పే పాఠం. ప్రపంచ చరిత్రలోని ఈ కొత్త సిలబస్  వంట బట్టించుకున్న తరువాతే  మార్టిన్ లూథర్ కింగ్ వంటి పోరాట యోధులు తమ జాతి హక్కులను అహింసాయుతంగా సాధించుకోగలిగింది. ప్రపంచం ముందు తెలెత్తుకుని బాపూజీ సగర్వంగా  నిలబెట్టిన ఆ భారతీయ అహింసా యోధ మూర్తిత్వానికి   ప్రస్తుతం కాశ్మీరం నుంచి కన్యాకుమారం వరకు సాగుతున్న హింస రచన   కళంకం తెచ్చెపెట్టే అంశం కాడం బాధాకరం. బతికివుండుంటే బాపూజీని సైతం ఎంతో    కలవరానికి గురిచేసే  అంశమయివుండేది ఖచ్చితంగాఇది.   సందర్భం వచ్చిన ప్రతీ సారీ ఐక్యరాజ్య సమితి వేదిక  నుంచి అనకాపల్లి సందు వరకు బాపూజీ భజన చేయడం మరిచిపోని మన ప్రజానేతలు మరి ఈ అహింస అనే ఆయుధాన్ని ఎందుకు అశ్వత్థామ వృక్షం ఎక్కించేసినట్లో?! ఆ అయుధం కిందికి దిగడానికి ఇంకా ఎన్ని గో గ్రహణాలు జాతి అనుభవించవలసివుందో?

ఆత్మాభిమానంగౌరవం వేరెవరో వచ్చి పరిరక్షించే శీల సంపదలు కావు కదా! 'చరిత్రలో చిరస్థాయిగా నిలబడాలన్న కాంక్ష ఉంటే  ముందుగా ఆత్మ సమ్మానాన్ని కాపాడుకోవాలిఆన్న బాపూజీ సూక్తి మీద ఆసక్తి గల ప్రజానేతలు ఎంత మంది మిగిలున్నారు ఇప్పుడు?   బి-ఫారం ఇచ్చి,  నిధులిచ్చి,  గెలించేందుకు అహర్నిశలు అంతులేని కృషి చేసిన సొంత పార్టీలకే నామాలు పెట్టేసి అధికారంవ్యాపారం వంటి వ్యక్తిగత లాభాపేక్షల నిమిత్తం గెలిచిన మరు క్షణమే పాలక పార్టీలలోకి దూకే ప్రజాప్రతినిధుల పట్లే  ఎక్కువగా ప్రజలూ ఆకర్షితులవుతున్నారిప్పుడు!అక్టోబరు రెండుకోజనవరి ముఫ్ఫైకో  బాపూజీ గుణగణాలను శ్లాఘిస్తూ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తే సరి.. ఓ పనయిపోతుందనే భావనే సర్వే సర్వత్రా. బిర్లా భవన్ ప్రాంగణంలో ప్రాణాలు గాలిలో కలిసే ముందు బాపూజీ 'హే! రామ్!అని ఆక్రోశించినట్లు ఆ సమయంలో  దగ్గరగా ఉన్నవారు చెబుతుంటారు. ఆ మహాత్ముడి ఆక్రోశానికి  కేవలం తనపై జరిగిన అఘాయిత్యం ఒక్కటే కారణం కాదేమో భావి భారత దేశ రాజకీయ దివాళాకోరుతునం ముందే ఊహించి 'హే రామ్!అని ఆక్రోశించలేదు కదా మహాత్ముడు?

'ఆచరణ కష్టమని మూలసూత్రాలను విడిచిపెట్టరాదు. ఓర్పుతో అయినా  వాటిని పాటించాలి' అన్నది  నోటి మాటగానే కాదు.. తన జీవితం ద్వారా కూడా  ఆచరించి చూపించిన నిజాయితీ బాపూజీది. మేక పాల పానం నుంచిమద్యపాన నిషేధం  వరకూ ఏ పని పట్లా ఆయనకు నీచభావన లేదు.  నేటి నేతల నోటి మాటలకు భిన్నంగా బాపూజీ  పాయిఖానాల క్షాళన పట్లా హేళన ప్రదర్శించిందిలేదు. ఆయన అడుగు జాడలలోనే తమ నడక సాగుతున్నదని నమ్మబలికే నేతలు ఆచరణ సాధ్యం కావని తెలిసే ఎన్నికలలో ఓట్లు దండుకొనే దురుద్దేశంతో  అసాధ్యమైన హామీలు అనేకం  అమాయకులపై గుప్పిస్తున్నారు.    ప్రజాస్వామ్యం పేరిట సాగే రకరకాల రొటీన్ పేరంటాల పట్ల  ఆఖరికి ప్రజల హక్కుల కోసమని పనిచేస్తున్నామని చెప్పుకునే  స్వచ్ఛంద సంస్థలు సైతం  కిమ్మిన్నాస్తి!    మరో మారు నిజమైన సత్యాగ్రహ సమరంతో దేశం  మారుమోగాలంటే మళ్లీ మహాత్ముడు వస్తే మినహా  సాధ్యం కానంత మందగొడితనం దేశమంతటా దట్టంగా అలుముకుని ఉన్న నేపథ్యంలో బాపూజీ నూట యాభై సంవత్సరాల జన్మదిన సందర్భం తటస్థించింది.   తటపటాయింపులేవీ లేకుండా జాతిపిత  జీవితాన్నే పరమాదర్శంగా తీసుకోక తప్పని దుస్థితి ప్రస్తుతం సమాజం అంతటా నెలకొని ఉంది. ప్రజాక్షేత్రంలోని ప్రతీ వ్యక్తీ   ప్రతి అడుగులోనో మహాత్ముని ప్రవచనాలను  గుర్తుంచుకుని నడిస్తేనే తప్ప  ప్రస్తుతం  దేశం ఎదుర్కొనే గడ్డు సమస్యల నుండి గట్టెక్కే పరిస్థితిలేదు. 

'కంటికి కన్నుసిద్ధాంతంతో  ప్రపంచాన్ని మరంత అంధకారంలోకి నెట్టివేసేందుకు తప్ప సాధించే మరో ప్రయోజనం లేదు. సుదీర్ఘంగా సాగిన రెండు ప్రపంచ యుద్ధాల వల్ల విశ్వవ్యాప్తంగా  వాతావరణం ఏమైనా చల్లబడిందాఓటుసత్యాగ్రహం- ఈ రెండూ ప్రజాస్వామ్యంలో ప్రజల చేతిలో ఉండే  ఆయుధాలు-అంటారు బాపూజీ! వాటి వినియోగాన్ని బట్టే ప్రజల  ఆలనా పాలనా సమర్థంగా సాగేది అని  మొదటి నుంచి గాంధీజీ గట్టి నమ్మిక. ఓటును ఓ కొనుగోలు సరుకుగా మార్చి చేజిక్కించుకోడమే కాదు.. దేశానికి స్వాత్రంత్ర్యం సాధించిపెట్టిన  సత్యాగ్రహ ఆయుదాన్ని సైతం.. ప్రస్తుతం దుష్ట రాజకీయం  ఆడే నాటకంలో ఓ అంకం ప్రాపర్టీగా మార్చివేసిన మాయాజాలం నేటి రాజకీయానిది. పాలకులను అదిలించే ఆయుధాలు రెండూ వట్టి పోవడం దురదృష్టం. బాపూజీ తిరిగి వచ్చినా ఈ పరిస్థితి ఓ పట్టాన చక్కబడేనా  అన్నది అనుమానమే!

 

భారతావని  వేలాది సంవత్సరాల పాటు పరాయి పాలకులకు ఊడిగం చేయవలసి వచ్చింది. బిడ్డల అంతర్గత కుమ్ములాటలే భరతమ్మ పారతంత్ర్యానికి  మూల కారణంగా మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ మొదటి నుంచి నమ్ముతూ వచ్చారు. మళ్లీ కులాలుగా, మతాలుగా, పార్టీలుగా, వర్గాలుగా, ప్రాంతాలుగా మనలో మనం కలహించుకుంటూ   కలసి మెలసి సాధించుకున్న స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను తిరిగి పరాయి పంచలపాలుచేసే పరిస్థితికి తెచ్చుకుంటున్నాంఇటీవల అమెరికన్ అధ్యక్ష మహాశయుడు ట్రంప్ అమెరికాలో హౌడీ-మోడీ కార్యక్రమ సందర్భంగా స్వంత రాజకీయ లబ్ది కోసం చిలకరించిన కాస్తింత  లాలింపు పన్నీరు జల్లులకే మనం  పులకరించిపోవడం బతికి వుంటే బాపూజీని బాధించే అంశం అయివుండేదే!    

స్వాతంత్ర్యం సాధించుకొన్న నలభైల నాటి తరం ఇప్పుడేమంత ఉనికిలో లేదు. పుట్టుకతోనే  ఆయాచితంగా దక్కిన కారణంగా  స్వేచ్ఛాయుత జీవితం ఎంత అమూల్యమైనదో నేటి తరాలకు తెలిసే అవకాశం లేదు. అందుకే ఇప్పటి కుర్రకారు దృష్టిలో బాపూజీ అంటే కేవలం అటెన్ బరో తీసిన  చిత్రంలో కిన్ బెన్స్ లే వేసిన కథానాయిక పాత్ర. అదీ తెలియని మరీ కుర్ర తరానికి ఆ బోసినవ్వుల తాతయ్యంటే రూపాయి నోట్ల మీద కనిపించే ఓ గ్రాఫిక్ బొమ్మ.

 

   మార్పుకు సిద్ధంగా ఉన్నప్పుడే  కొత్త బంగారు లోకం గురించి స్వప్నించే అర్హత సిద్ధించేదని సిద్ధాంతరీకరించిన  నిత్య చైతన్యశీలి మహాత్మాగాంధీ. కుటీర పరిశ్రమలుగ్రామస్వరాజ్యంస్వదేశీ వస్తు ఉద్యమంనిరాడంబర జీవన శైలిదేశవాళీ వైద్య విధానంస్వచ్ఛంద బ్రహ్మచర్యంరామ్ రహీమ్ లిద్దరినీ సమాన దృష్టితో కొలిచే తీరుబలహీనుల పట్ల అనురాగంస్త్రీల పట్ల ప్రత్యేక గౌరవ ప్రపత్తులుసమాజంలోని అన్ని తరగతులూ సామరస్య భావనతోసహజీవనం కొనసాగించడంనిత్య జీవితానికి అక్కరకొచ్చే ఏ పని పట్లా ఉపేక్ష వహించకపోవడంవృత్తులతో నిమిత్తం లేకుండా అన్ని కులాలనుజాతులను  సోదరవర్గంలో చేర్చుకోవడంముఖ్యంగా దిగువ తరగతుల పట్ల సమాదరణ, స్త్రీల పట్ల సమ్మనభావన, సనాతన ధర్మం పట్ల నిరసన లేని విశాల దృక్పథంతో నవీన సంస్కృతలను మనసారా ఆహ్వానించడంఅన్ని భాషల పట్ల ఒకే తరహా ఆదరణప్రజల పలుకుతో ప్రత్యేక అనుభంధం ఏర్పరుచుకోవడం.. 'సత్యంతో నా ప్రయోగాలుపేరిట బాపూజీ రాసుకున్న 'ఆత్మకథనిండా ఈ తరహా  నిత్య స్వచ్ఛ జీవన శైలికి సంబంధించిన ఎన్నో అంశాలు చదువరులలో ఉత్కంఠ రేకెత్తించే తీరులో ప్రతి పుటలో  కనిపిస్తాయి. తన జీవితంలోని    ఎత్తు పల్లాలనువెలుగు నీడలను  ప్రపంచం ముందు తెరిచిన పుస్తకంలా బాపూజీ పరిచిన తీరు ప్రపంచంలోని మరే ఇతర ప్రముఖ వ్యక్తీ ఊహలో అయినా ప్రదర్శిచలేనంత సాహసపూరితమైనది. బాపూజీ వారసులుగా ప్రజల ముందుకు వచ్చి ప్రజానేతలుగా వ్యవహరించే నేటి నాయకులలో మచ్చుకకైనా ఒక్క మహాత్ముని మంచి లక్షణం కనిపించక పోవడం దేశప్రజలు చేసుకున్న దురదృష్టం. 

రాజకీయాలే కాదు.. సామాజిక జీవన సరళీ బాపూజీ బోధించిన బాట నుంచి క్ర్రమక్రమంగా  దూరంగా జరగడం కలవరం కలిగించే అంశం. 

పాముకాటు శరీరానికి చేసే హానికి కన్నా మద్యపానం ఆత్మకు కలిగించే నష్టం ఎక్కువ-అంటారు బాపూజీ. కనీసం ఆ జాతిపిత మాట మీద గౌరవం చూపించాలన్న సంస్కారం లోపించడం వల్లే గాంధీజీ జయంతివర్ధంతుల రోజులలో కూడా మత్తు పదార్థాల వినియోగాల రేటు తగ్గడం  లేదు! పుస్తక పఠనం కాదు..  మనిషిలోని ఉత్తమ వ్యక్తిత్వాన్ని వెలికితీయడమే అసలైన విద్య  లక్ష్యం- అన్నది బాపూజీకి విద్య మీద ఉన్న అభిప్రాయం.  ఆలోచనఆచరణా క్రమబద్ధంగా లేని పక్షంలో ఎన్ని విద్యలు నేర్చినా ఆ నైపుణ్యమంతా వృథానే కదా! 'మానవతను మించిన మంచి పుస్తకం మరొకటి లేదుఅన్న బాపూజీ సూక్తి చెవిన పెడుతున్నదెవరు విద్య వ్యాపారంగా మూడు పువ్వులు, ఆరు కాయలు పూయించే ఈ కాలంలో? 

 

 

'ప్రేమ  అన్నిటి కన్నా అత్యంత శక్తివంతమైనది.    శక్తి ముందు సాక్షాత్ భగవంతుడైనా  చేతులెత్తేయవలసిందే!అని ఉవాచించే బాపూజీ భావనలో ఆధ్యాత్మికత మీద కన్నా ఆత్మీయత వైపే తూగు ఎక్కువ కనిపిస్తుంది.   పెదాలపైన చిరునవ్వులు ధరించకుండా వంటికి ఎన్ని విలువైన దుస్తులు వేలాడదీసినా ఆ అలంకరణ రాణించేది కాదు-అన్నాడు అర్థ నగ్న యోగి బాపూజీ. బ్రిటిష్ మాజీ ప్రధాని విన్ స్టన్ చర్చిల్ 'హాఫ్ నేకెడ్ పకీర్గా హమేశా ఎద్దేవా చేసిన మహాత్మాగాంధీ ఆ కొల్లాయి ధోతీ బిగించి సబర్మతీ ఆశ్రమం నుంచి కాలు  బైట పెడితే  చాలు.. ఆసేతు హిమాచల పర్యంతం ఆనంద పరవశమై అభిమానంతో చిందులుఉ వేసే పరిస్థితి. ప్రపంచం నలుమూలలకు సుపరిచితుడైన ప్రఖ్యాత హాస్యనటుడు ఛార్లీ చాప్లిన్ సైతం ఒక సందర్భంలో 'తాను గాంధీజీ గ్లామర్ చూసి అసూయ చెందుతున్న'ట్లు ప్రకటించుకున్నాడు.   అన్ని కళల కన్నా జీవితం గొప్ప కళ. సౌజన్యంతో జీవించే వ్యక్తి కన్నా గొప్ప కళాకారుడు లేడని బాపూజీ విశ్వాసం. ఆ లెక్కన చూస్తే మహాత్మా గాంధీ తరువాతే ఎంతటి మెగా హాలివుడ్కథానాయకుడైనా!  

బాపూజీ దృష్టిలో ప్రార్థన   పరమార్థం హృదయ శోధన. అనుభూతికి తప్ప లొంగని ఏ అదృశ్య శక్తి ఆశీస్సులు లేకుండా ఎంత గొప్ప కార్యమైనా సంపూర్ణంగా విజయవంతం కాలేదన్నది గాంధీజీ భావన. ఆ కనిపించని శక్తి మహిమే వెనక ఉండి తనను ఎల్లవేళలా సన్మార్గం నుంచి తూలకుండా కాపాడుతూ వచ్చిందని బాపూజీ తన సందర్శనార్థం వచ్చిన వారితో సందర్భం తటస్థించిన ప్రతీ సారీ చెప్పుకొస్తుండేవారు. 

 

ఆయా సందర్భాలలో  స్పందించిన తీరును ఒక క్రమ పద్ధతిలో గమనించ గలిగితే బాపూజీ సంపూర్ణ వ్యక్తిత్వంలోని కొంత భాగాన్ని మనం పట్టుకోవచ్చు. కైరా సత్యాగ్రహం పాక్షికంగా మాత్రమే విజయవంతమైన సమయంలో ప్రజల సంతోష సంబరాలను చూసి గాంధీజీ   'సంపూర్ణ విజయ లక్షణాలు లోపించడం  నాకు బాధ కలిగిస్తున్నది' అని బాహాటంగానే తన అసంతృప్తిని  బైటపెడతారు. రిలే నిరాహార దీక్షల వంకతో నాలుగేసి గంటల పాటు  నిరసనల నాటకం  నడిపించేసి లక్ష్యం నేరవేరినట్లు ఆనక  విజయయాత్రలు భారీ ఎత్తున నిర్వహించే  నేటి తరం నాయకులను చూసి మరి బాపూజీ బతికుంటే ఏ విధంగా స్పందిస్తారో!

రౌలత్ చట్టం ఆచరణలోకి వచ్చిన తరువాత ఢిల్లీలో అశాంతి నెలకొన్నది.   బాపూజీ బోధనలు ఆలకించైనా  జనం కాస్త చల్లబడతారేమో అన్న ఆశతో అక్కడి ప్రాంతీయ నేతలు గాంధీజీని ఢిల్లీ పిలిపించుకుంటారు. జాతినేతగా అప్పటికే బాపూజీకి జనంలో  గొప్ప గుర్తింపే ఉంది. సెక్యూరిటీకి విఘాతంవంకతో  రైలు దిగీ దిగగానే గాంధీజీని అరెస్టు చేసేందుకు సిద్ధంగా ఉన్న పోలీసు సిబ్బందితో  'నేనిక్కడకు వచ్చింది శాంతి భద్రతలు తిరిగి సాధించుకోవడం కోసం.  అశాంతి జ్వాలలను మరింత ఎగదోయడం  కోసం కాదుఅంటారు. అకారణంగా కక్షలు రేకెత్తించి ఆ కార్పణ్యాల మధ్య తమ పబ్బం గడుపుకునేందుకు చూసే కుళ్లు రాజకీయాలకే ప్రస్తుతం చెల్లుబాటు. 

 బాపూజీ బోసి నోటితో చేసిన వ్యాఖ్య  జనం మధ్య తిరిగే  ప్రజానేత  బాధ్యత ఎంత సున్నితమైనదో చెప్పకనే చెబుతుంది. సీనియారిటీని ఓ అనర్హతగా ప్రకటించి  పక్కన పెట్టే నేటి రాజకీయాలలో  బోసి నవ్వుల తాతయ్య బోధనలు ఆకాశవాణి సంస్కృతం  వార్తలకు మించి విలువిస్తుందా నేతాగణం? ఎవరిని తమకు ప్రతినిధులుగా ఎన్నుకొనాలోనన్న విషయంలో ఏడు దశాబ్దాలు దాటినా జనావళిలో ఓ స్పష్టత రాకపోవడం రామరాజ్యం గురించి కలలు కన్న బాపూజీకి బాధ కలిగించే అంశం కాదా? 

నాగపూర్ జాతీయ కాంగ్రెస్ మహాసభల వేదిక మీద నుంచి నియంత పోకడల వల్ల పజాస్వామ్యానికి  ఏర్పదే పెను ప్రమాదం గుర్తించమని గాంధీజీ హెచ్చరించారు. 'స్వీయాభిప్రాయాలను ఇతరులపై బలవంతంగా రుద్దడం వల్ల   నిజమైన స్వాతంత్ర్యం సాధించుకొనే అర్హత కోల్పోతామన్న ఆ హెచ్చరికకు పూర్తి విరుద్ధంగా ప్రతిపక్షం పొడే గిట్టనంత అసహనం అధికార పక్షాలలో విశ్వరూపం దాలుస్తున్నది రోజు రోజుకీమహాత్ముడే మళ్లీ ఏ వామనావతారమూర్తిగానో దిగి వచ్చి నియంత బలి మాడును పాతాళానికి అణగదొక్కితే తప్ప సాగే ప్రజాస్వామ్య క్రతువు సలక్షణంగా సంపూర్ణమయే పరిస్థితి కనిపించడంలేదిప్పుడు.  

ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‍స్టీన్ అచ్చెరువొందినట్లు 'ఇటువంటి ఒక వ్యక్తి భూమ్మీద నిజంగానే పుట్టి మన మధ్య సంచరించాడా?' అనే అనుమానం మరింత పెరగక తప్పదు మహాత్ముని జీవితం తరచి చూసే కొద్దీ! బాపూజీ భావనలలోని మన్నికమిగతా నేతలంతా యధాతధంగా వాటిని అనుసరించక తప్పని ఆవశ్యకతను గురించి వక్కాణించే సందర్భంలో మరో హక్కుల నేత మార్టిన లూధర్ కింగ్ చెప్పిన ఒకే ఒక్క ముక్కలో మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ మూర్తిత్వం మొత్తం కళ్ల ముందు కనబడుతుంది. 'కోరుకొన్నదాని కోసం అహింస దారిలో పయత్నించడంఅన్యాయం అని తోచినప్పుడు సాయమందించేందుకునిరాకరించడం యేసు సూచించిన బాట. ఆ బాటలో ఎలా సాగి లక్ష్యం సాధించాలో మొదటి సారి  స్వయంగా నడిచి ప్రపంచానికి చూపించిన ఘనత మహాత్మా గాంధీది.' అన్న నీలిజాతుల హక్కుల నేత మాటలు నూటికి నూరు పాళ్లు నిజం. 

'కొల్లాయి గట్టితేనేమి.. మా గాంధి కోమటై పుట్టితేనేమిఅని   బసవరాజు అప్పారావు అప్పారావు పాట కట్టిన తీరును తప్పు పట్టవచ్చునేమో కాని..  ఆ పాటలో బాపూ నడిచి చూపించిన బాటను ఎవరం ఈ నాటికీతప్పు పట్టలేం. ప్రపంచమంతా గౌరవించి నెత్తిన పెట్టుకుంటున్న బాపూజీ భావజాలాన్ని.. పుట్టిన దేశంలోని పాలనాసామాజిక వ్యవస్థలు పూర్తిగా పక్కన పెట్టేయడమే బాధాకరం. పెరటి చెట్టు మందుకు పనికి రాదన్న సామెతను నిజం చేస్తే ముందు నష్టపోయేది మనమే సుమా! గాంధీజీ జన్మించి ఈ 2019, అక్టోబర్ నాటికి  నూటయాభై ఏళ్లునిండుతున్నాయి.  ఆ మహాత్ముడి జీవన విధానంఆలోచనా ధారఆచరణ మార్గాల పరంగా పునర్విమర్శ చేసుకోవలసిన అవసరం మునుపటి కన్నా మరింత పెరిగిందనే సత్యం మనం జీర్ణించుకోక తప్పదు.   బాపూజీ భావజాలం నేటి సాంకేతిక యుగానికి అనువుగా ఎలా మలుచుకోవాలో ఒక చర్చగా అయినా తక్షణమే ఆరంభమవడం భరతజాతికి అన్నివిధాలా  మేలు. లేని పక్షంలో  హక్కుల సాధన పట్ల తప్ప బాధ్యతల నిర్వహణ పైన బొత్తిగా శ్రద్ధ చూపని నేటి సమాజం పోకడలను చక్కదిద్దడానికైనా  బాపూజీ పుడమి పైకి తిరిగి రావడమొక్కటే చివరికి మిగిలే దారి- అనిపించక మానదు!

- కర్లపాలెం హనుమంతరావు 

( సూర్య- దినపత్రిక - 02 -10 - 2019 - ప్రచురితం ) 

***

 

***

 

 

 

Thursday, December 30, 2021

మహమ్మదీయ మహాయుగంలో గ్రంధాలయాలు




 


మహమ్మదీయ మహాయుగంలో గ్రంధాలయాలు 


5. భోజరాజు గ్రంథాలయము. క్రీస్తుశకము పండెండవళతాబ్దికి చెందిన కవిపోషకు డగు భోజరాజు గ్రంథ భాండారమే రాజనిర్మిత భాండా గారములలో మనకు తెలిసినవానిలో మొదటిది. కవి పోషకుడగుటయేగాక ఈ మహారాజు స్వయము కవి; పండితుడు. ఎంజనీరింగు, ఆర్కిటెక్చరు మున్నగు కళలను గూర్చినదగు 'సమరంగన' మనుపుస్తకము అతని రచనము. గైక్వాడువారి ఓరియంటల్ సీరీసులో కొలది వత్సరములకు పూర్వము ప్రచురించు భాగ్యము నాకు గలిగేను. సిద్ధరాజను పేరుగల చాళుక్యరాజు ఈభోజ రాజు రాజ్యమును జయించి ఈతని గ్రంథాలయమునుతన రాజధానీనగరమగు అహిల్ వాడునకు గొనిపోయి తన గ్రంథ భాండాగారమున కలుపుకొనేను. ఈ ఆన్ హిల్ వాడు నేడు పేటన్ అను నామమున శ్రీ గైక్వాడ్ మహారాజానారి సంస్థానమున ఒక నగరమైయున్నది.


5. ముహమ్మదీయుల దండయాత్రలు. గజనీముహమ్మదు దండయాత్రలతో హిందూ దేశ చరిత్రమున హిందూమహాయుగమునకు ఆశ్వాసాంత మైన జనవచ్చును. గజనీముహమ్మదు దేవాలయము లను నాశనముచేసెను, అర్చకులను తన క్రూరఖడ్గము నకు బలియిచ్చెను. అట్టిస్థితిలో అర్చకులు, పండితులు తమకు సాధ్యమైనన్ని గ్రంథములను గైకొని టి బెట్టు, నేపాళము మొదలగు దూరదేశములకును, ఎడారినడుమ నుండి దుర్గమమైన కౌసల్ మియరు మొదలగు తావుల


గము : గ్రంధాలయములు


కును, తదితర ప్రదేశములకు పారిపోయిరి. ఇక ముహమ్మదీయయుగమునందలి భారత దేశ గ్రం థాలయముల చరిత్రను గూర్చి తెలిసికొనవలసియున్నది.


9. ముహమ్మదీయులు:


హిందూసాహిత్య విజ్ఞానము. సాహిత్య


దండెత్తి వచ్చిన ముహమ్మదీయులు క్రమముగ దేశ పాలకులు నిచ్చట నిలిచిపోయిరి. పాలకులు పాదు కొనినపిదప వారికి సాహిత్యవిజ్ఞానాభివృద్ధివి వయమున శ్రద్ధవహించు:ుకు సావకాశము సమకూడెన. అపుడు వారు మసీదులను కట్టించిరి; ముహమ్మదీయ మతవ్యాప కమునకై పాఠశాలలు పెట్టించిరి; ముహమ్మదీయ విజ్ఞాన ప్రచారపరిశోధనలకై కళాశాలల నిర్మించిరి. కాలక్రమ మున వారిదృష్టి హిందువులు మతగ్రంథముల పైగూడ ప్రసరింప నారంభించెను. హిందువుల ధర్మగ్రంథములు వారియాజమాన్యమున పారశీక భాషలోనికి అనువదింప బడుటకు శుభారంభము జరిగెను. 3. ఢిల్లీ నగరము.


బానిసరాజుల కాలమున ఢిల్లీ నగరము విద్యాశాలలకు విఖ్యాతినందెను. పలువురు విద్యాసంతు లానగరమునకు చేరిరి. బానిసరాజులు విద్యాగోష్ఠియందు బహుప్రీతిని చూపిరి. కవులు, పండితులు తాము రచియించిన నూతన కావ్యములను, గ్రంథములను చదువుచుండ వినుటను ఆరాజులును, ప్రధానులును ఘన కార్యముగా భావించిరి. ఖిల్జీ రాజ్యసంస్థాపనాచార్యుడగు జలాలుద్దీన్ పండిత  


రత్నమును, కవిరాజును అగు అమీర్ ఖుస్రు అనువాని రాజభాండారపాలకుని నియమించి అతనికి కొరాన్ పరిరక్షకుడు అను బిరుదమిచ్చి అతని యుద్యోగ ము నాకు మంచివేతనమును ఏర్పఱచెను. గ్రంథ భాండాగ పాలకులలో ఈ అమీర్ ఖుసుకు జరిగినంత గౌరవము మఱి యెవరికిని జరిగి ముండ లేదనుట అతిశయోక్తి గాదు.


1. చక్రవర్తి ఫిరోజ్ టూగ్లక్. మొగలాయి చక్రవర్తులకు పూర్వులైన ముహమ్మ


దీయ చక్రవర్తులలో ఫిరోజ్ టూగ్లక్ నామము భారత దేశ గ్రంథాలయోద్యమ చరిత్ర కారునకు పూజనీయ మైనది. ఫిరోజ్ స్వయము పండితుడు; విశేషించి పండితపోషకుడు. విదేశములనుండి పండితులను రప్పించి వారితో సద్దో సలుపుటకు ఆతడు ముచ్చటపడు వాడు. అల్లు వచ్చిన పండితులు ఆవాసమునకు గాను అతను రాజభవనము నొకదానిని ప్రత్యేకించెను. విద్యావంతు డగు ఈ ప్రభువు హైందవపండితులను రాజసేవలో నియమించెను. హిందువుల సారస్వతముతో పరిచయ ముసంపాదింప తన మతస్థులను హెచ్చరించెను. నాగ ర్కాట్ నందలి దేవాలయమున ఒక చక్కని సంస్కృత గ్రంథ భాండాగారముండుటను తెలిసికొని పారశీక భాష నేర్చిన హిందూపండితుల నట కార్యను లుగ నియమించి ఆచ్చటి అపూర్వ గ్రంథములను కొన్ని ని రశీక భాషలోనికి అనువదింపజేసెను. Que మరణానంతరము భారత దేశ గ్రం థాలయోద్యమము కొంత కాలముకుంటువడినదని చెప్పవచ్చును. ఈ కాల మున తైమూరు హిందూదేశముపై ఎత్తిచ్చి ఢిల్లీనగర మును కొల్లగొట్టెను.


5. మఱికొన్ని చిన్న రాజ్యములు. మొగలుల కాలమునాటి భారత దేశ గ్రంథాలయో ద్యమచరిత్రను వివరించుటకు పూర్వము ఈ కాలము నాటి మఱికొన్ని చిన్న రాజ్యములు గ్రంథాలయోద్యమ విషయమున ఎట్లు కృషి చేసినవో తెలిసికొనవలసియు 8. అహమ నగరమున బహమనీ రాజులు ఒక న్నది. చక్కని గ్రంథ భాండారమును నిర్మించి క్రమముగ నిర్వ హించిరని తెలిసికొనుట కావందముగ నున్నది. ఆ రాజులు దీనికి ఒసగిన పోషణము అనంతమును,


అత్యంతశ్లాఘాపాత్రమును ఆయినదే అయినను పదు నేనవశతాబ్దిలో వారికడ మంత్రిగనుండిన ముహమ్మదు గవాను చేసినదానము ముందు అది డిందుపాటు నొందు చున్నది. డక్కనునందలి భాండాగారములందు అక్కడ క్కడ అతని పద్యమాలికలు నేటికిగూడ మనకు దొరు కుచున్నవి. అతడు కోటికి పడగ ఎత్తినధనవంతు డేయ య్యు చేతికి ఎముక లేని నెఱ దాతగుటచే మరణకా లమునాటికి ఆతని బొక్కసమున లెక్క కాసులుమాత్ర ముండెను. ఉన్నతభావములుగల పోడిమీ జీవితమున ఆతడు ఋషివలె దినములు గడపెరు. అతని ధనమం తయు మసీదులు కట్టుటకు, పండితులను పోషించుటకు, గ్రంథ భాండాగారములను నిర్మించుటకు న్యాయపఱుప బడెను. బీజపురమున ఆదిల్ షాహి వంశపురాజులుగూడ నొకచక్కని భాండాగారమును నిర్వహించిరి. ఆ గ్రంథాలయమునందలి పలుగ్రంథములను ఔరంగజేబు ఢిల్లీ నగరమునకు గొనిపోయినను పందొమ్మిదవ తాబ్దిని అగ్రంథాలయమును సందర్శించిన డాక్టరు ఫెర్గుసన్ దాని మంచిదినములలో ఆ గ్రంథాలయము బ్రహ్మాండ మైనదైయుండవలెనని అభిప్రాయపడినాడు. వంగ దేశ మును రిపాలించిన తొలిజట్టు ముహమ్మదీయ ప్రభువు లలో క్రీస్తుశకము 1282 మొదలు 1825 వఱకు పరిపా లనము సాగించిన నాదిర్షా భారత దేశ గ్రంథాలయో ద్యమచరిత్రకారుల ఎల్లరచే స్మరింపదగినవాడు. ఇంగ భాషలోనికి మహాభారతము ప్రథమమున భాషాంతరీక రింపబడుటకు ఆతనిఆజ్ఞయే కారణము .


5. మొగలాయి చక్రవర్తుల కాలము. మొగలాయి చక్రవర్తుల కాలమున భారత దేశ గ్రం థాలయోద్యమము హుటాహుటినడలతో సాగినదని చెప్పవచ్చును. మొగలాయి చక్రవర్తులు, రాణులు, రాజకుమారులు కళాసాహిత్యములందు మంచి అభిరుచిని, అభినివేశమును చూపిరి. మొగలాయీల మూలపురుషుడగు తైమూరు రచియించిన స్వీయ చరిత్ర నేడును ఉపలబ్ధమగుచున్నది. ఈ తైమూరువలె నీతిని వంశీయులును స్వయము గ్రంథకర్తలై విలపిల్లిరి. వెంగ లాయి రాజవంశసంస్థాపకుడుగు బేబరు గొప్ప విద్వాం సుడు. 'బేబర్ నామా' అను పేరుగల ఆతని స్వీయ


చరిత్ర ఆతరగతివాఙ్మయములో ఎన్నదగినదై నేటి కిని ప్రకాశించుచున్నది. పుస్తకములలో చిత్రములను రచియించు ఆచారమునకు బేబరు ఆద్యపురుషుడన వచ్చును. పుస్తకములు సచిత్రముగ ప్రచురించు పద్ధతి కనుగొనినది మొగలులకు కీర్తిదెచ్చిన విషయము గా నేటికిని మనము చెప్పుకొనుచున్నాము. బేబరు తన గ్రంథములయం దన్నిటియందును చిత్రములను చేర్చు వాడు. బేబరు అనంతరము మొగలాయిసామ్రాజ్యము నగు నియంతయైన ఆతని తనయుడు హుమాయూను తాను జైత్రయాత్రలకు పోవు నవసరమునగూడ కూడ నొకపుస్తకభాండాగారమును తరలించుకొని పోవు వాడు. చరిత్రకు అందిన ప్రథమసంచార గ్రంథాలయ మిదియేయని నిస్సంశ తముగ చెప్పుకొనవచ్చును. ఈ సందర్భమున నెపోలియనును గూర్చిన ఒక సంగతి సాదృ శ్వనిబంధనమున జ్ఞప్తికి వచ్చుచున్నది. నెపోలియను పుస్తకములనిన చెవికోసికొనువాడు. మంచి పుస్తకములు నెంచి ఆతడు అందు ఒక్కొక్క గ్రంథమును జేబునం దిముడు చిన్న సైజున ముద్రింపించి సుందరముగ బైండు చేయించియుంచుకొని ఈ గ్రంథసంచయమును తాను ఎచ్చటికిపోయిన అచ్చటకు గొనిపోవువాడు. హుమా యూను గ్రంథాలయాభిమానము మిక్కిలి మెచ్చదగి నది. ఆతడు తన విలాసమందిరమును ఒక గ్రంథాల యముగ మార్చిపై చెను. గ్రంథాలయ ప్రియుడగు ఈ రాజొక సారి గ్రంథాలయముననుండగా కాలుజారి మేడ మెట్లపైనుండిపడి అప్పుడు తగిలిన దెబ్బలు కారణము గా మరణించెను. హుమాయూన్ తనయుడు అక్బరు పాదుషా ఒక గొప్పగ్రంథ భాండాగారమును కూర్చెను. తాను జయించిన ఒక గుజరాతు దేశపురాజుయొక్క మునుగూడ నీతడు తన స్వాధీనము లోనికి తెచ్చికొ నేను. తనకడ మంత్రిత్వమువహించి యున్న ఫెయిజి అను వాని గ్రంథ సముదాయమును సయితము అక్బరు తన సొంత గ్రంథ సముచ్చయమున చేర్చికొ నేను. ఈ పుస్తకములన్నియు మూడుభాగ ములుగ విభజింపబడెను. పద్యము, వైద్యము, జ్యోతి షము, సంగీతము అను విషయములకు చెందిన గ్రంథము లన్నియు మొదటి విభాగమున చేర్చబడెను. భాషా


తత్త్వము, వేదాంతము, మతము, ఖగోళశాస్త్రము, రేఖాగణితము అను విషయములకు చెందిన గ్రంథము అన్నియు రెండవ విభాగమున చేర్పబడెను. వాఖ్యాన ములు, వంశ చరిత్రలు, న్యాయశాస్త్రము అను విషయము లకు చెందిన పుస్తకములన్నియు మూడవవిభాగమున చేర్పబడెను. పుస్తకములలో చిత్రములను చేర్చు ఆచా రము ఈతనికాలమున బాగుగ పెంపొందెను. పుస్తక ములను సంకరతరముగ బైండింగు చేయు విషయమున ఈచక్రవర్తి హయాను. లో అతిశ్రద్ధ చూపబడెను. మొగలాయిచక్రవర్తులు స్వయముగా గ్రంథములను ప్రోవుచేయుటయందు అత్యుత్సాహమును చూపు పోయే గాక తమపూర్వులు ఏర్పఱచిన గ్రంథ భాండారములను కంటవతీడుకొని పరిరక్షించుట యందును విశేషాభి మానము చూపిరి. ఇంతటిదీక్షతో, ఇంతటిశ్రద్ధతో మొగలాయిచక్రవర్తులు సంతరించిన గ్రంధ సముదాయ మంతయు క్రీస్తుశకము 1739 వ సంవత్సరమున ఢిల్లీ నగ రముపై ఎత్తివచ్చి దానిని కొల్లగొట్టిన పారశీకుడు నాదిర్షా చేతులలో బడెను. 5. ఇతరరాజుల గ్రంథభాండాగారములు.


దక్షిణ భారత దేశపు సుప్రసిద్ధులగు రాజ నొడగు టిప్పుసూల్తాను బహుళ గ్రంథములను సేక రించెను. 1799-వ సంవత్సరమున శ్రీరంగ పట్టణము పట్టు కొనబడినపుడు ఈగ్రంథ సముచ్చయమంతయు నాశ నము చేయబడెను, లక్నో స్నే పట్టణము పట్టుకొనబడినపుడు 1884వ సంవత్సరమున అయోధ్యనబాబు గ్రంథా లయముకూడ నిప్లేయయ్యెను. కాని పలువురు రాజుల భాండాగారములు కాలపురుషుని నాశనఖడ్గమునకు ఎదురొడ్డి నిలచినవి. నేపాళము, కాశ్మీరము, మైనూ రు, జయపురము, జోధపురము, భోపాల్, ఆళ్వారు రాజ్యములందు పురాతన గ్రంథ భాండాగారములు నేటి కిని సుస్థితీయందున్నవి. ఆయాభాండాగారము లందలి గ్రంథములకు నేడు మంచిమంచి కెటలాగులు తయారు చేయబడియున్నవి. తంజావూరు ప్రభువుల గ్రంథభాం డారము మదరాసు ప్రభుత్వము వారి పరిరక్షణము నంది ప్రజోపయోగకరమైన సంస్థయై ప్రకాశించుచున్నది.


( బరోడా సంస్థానంలోని గ్రంథాలయ శాఖాద్యక్షులు కీ.శే న్యూటన్ మోహన్ దత్తా గారి ఆంగ్ల వ్యాసం ఆధారంగా ) 

( ఆంధ్రభూమి - వార- అక్టోబర్ 1938 సంచిక నుండి సేకరణ ) 


Thursday, December 23, 2021

పాతబంగారం – కథ అనువాదం నేను ఎవరినైతేనేం! 'వేంకటేశ్ ' ( ఆంధ్రపత్రిక - 1947, డిసెంబర్, 24వ తారీఖు సంచిక ) సేకరణ - కర్లపాలెం హనుమంతరావు

 


పాతబంగారం 

అనువాదం 

నేను ఎవరినైతేనేం! 


'వేంకటేశ్ ' 

( ఆంధ్రపత్రిక - 1947, డిసెంబర్, 24వ తారీఖు సంచిక ) 


సేకరణ - 

కర్లపాలెం హనుమంతరావు 

 23-12-2021 

బోథెల్ ; యూ. ఎస్.ఎ



'నే నెందుకు నవ్వుతున్నానో మీ కందరకూ తెలుసుకోవాలని ఉందన్న మాట? చచ్చిపోయేముందు ఎవడన్నా ఎందుకు నవ్వుతా డనేకదూ మీరనుకొనేది. అవునా? నాగురించి మీరేమీ ఆదుర్దా పడబోకండి


డాక్టరుగారు! అనవసరంగా శ్రమపడక మీ పనేదో మీరు చేసుకోండి! మీరు ఏవిధంగానూ నన్ను  బతికించలేరు. అసలు ఎవ్వరూ కూడ నా చావు తప్పించలేరు. ఈ పరిస్థితిలో ఎవరూ బతికించలేరు. 


ఎందుకంటే, నాకు ఒకటి కాదు రెండు బలమైన కత్తిపోట్లు తగిలాయి. ఒకటి వీపుమీద రెండోది డొక్కలోను. కండలు, నరాలు బయటకు రావటం మీకు కనిపిస్తునాదనే అమకుంటున్నాను. 


'మీరంతా నే నెందుకు నవ్వు తున్నానో వినాలని కుతూహలపడుతున్నా రన్నమాట. చచ్చిపోయే వ్యక్తికి నవ్వు తెప్పించే విషయం ఏమిటా అని ఆశ్చర్య పడిపో తున్నారుకదూ. నేను చెబుతాను. మీరేమీ ఆదుర్దా పడనవసరం లేదు. ఇప్పుడిప్పుడే కొంచెం జ్ఞాపక స్తోంది. అసలు నే నెవరినో...


 'మీ రేమిటో గుసగుసలాడుతున్నారే. ఏమిటది? ఎందుకో నవ్వుతున్నారే? నేను చెప్పే దంతా  పూర్తిగా విని అప్పుడు గ్రహించండి..  చచ్చిపోయేముందు కూడ నాకు నవ్వు తెప్పించిన కారణ మేమిటో...


'ఇప్పటికి రెండు నెలలనుండి ప్రయత్నిస్తున్నా నేనెవరినో తెలుసుకొంటానికి.  ముసల్మానునా, హిందువునా లేక సిక్కు నా, బ్రాహ్మడినా లేక అస్పృశ్యుడినా, భాగ్యవంతుడినా లేక పేదవాడినా, నాది తూర్పుపంజాబా లేక పశ్చిమపంజాబా, నా నివాసస్థలం లాహోరా లేక అమృతసరా, రావల్పిండా లేక జలంధరా? 


నే నెవరినో నిర్ధారణ చెయ్యటానికి నేనే కాకుండా యింకా అనేకమంది శాయశక్తులా ప్రయత్నించారు. . నా కుల వేమిటో, నా మత మేమిటో అసలు నా పేరేమిటో తెలుసుకొందామని.  కాని ఫలితం మాత్రం కనుపించలా. ఇప్పుడు కొద్దికొద్దిగా నా పూర్వవిషయాలు గుర్తుకొస్తున్నాయి... యిప్పుడు... చచ్చిపోయే ముందు!...


అనేక ప్రయత్నాలు చేశారు. ఒక్కరికీ సాధ్యం కాలా. అసలు నే నెవరో నిశ్చయించు కొందామని.  నేను కూడ చాల శ్రమపడ్డాను. 


డాక్టరుగారు! మీరు నా వంక చూడకండి. మీరు ఆ విధంగా చూస్తుంటే నాకు మరీ నవ్వు వస్తోంది. ఉహుఁ మీరేకాదు, ఈ పరిస్థితిలో నన్ను ఏ డాక్టరూ బతికించలేడు... మీరు ఎందుకు అంత దీక్షగా ఆశ్చర్యంగా నా వంక చూస్తున్నారో నాకు తెలుసు. నా గాయాలను ఎట్లా మాన్పుదామని అలోచిస్తున్నారు కదూ! 


ఈ రెండు గాయాల్లో ఏ గాయానికి ముందు కట్టు కడతారు. ఒక గాయానికి కట్టు కట్టటానికి ప్రయత్నిస్తుంటే ఒంట్లో ఉన్న నెత్తురు, కండలు, - రెండో గాయం గుండా బయటకు పోతాయి. ముందు రెండో గాయాన్ని కట్టటానికి ప్రయఅనిస్తే మొదటి గాయం గుండా పోతాయి. కాబట్టి మీ ప్రయత్నాన్ని విరమించి కథను, కాదు, నా పూర్వచరిత్రను కొంచెం నిదానంగా  వినండి....


శ్రద్ధగా రెండు మాసాలపాటు ఢిల్లీ ఆస్పత్రిలో ఉన్న తర్వాత నాకు తెలివొచ్చింది! 'నీ పేరు?” అన డాక్టరు.


“నేను చాల ప్రయత్నం చేశాను. కాని గుర్తు లేదు అని చెప్పవలసి వచ్చింది. 


' హిందువుడివా లేక ముసల్మానువా?' వెంటనే డాక్టరు అడిగారు . 


యీ రెండో తికమక ప్రశ్న కు కూడా  'గుర్తులేదు' అని చెప్పవలసి  వచ్చింది.


' నా పూర్వచరిత్ర ఏమిటో గుర్తులేకుండా పోయింది. నా కులం, నా మతం, నా యిల్లు, సంసారం అన్నీ పూర్తిగా మర్చిపోయా. అసలు నాకు పెళ్లయిందో లేదో, బ్రహ్మచారినో మరి ఎవరినో నాకే అర్థం కాకుండా పోయింది. చివరికి పేరన్నా

' తెలుసుకొందామని శాయశక్తులా ప్రయత్నించా. 


పేరు లేకపోతే ప్రపంచంలో నేను ఫలానా వ్యక్తి నని నిరూపించేందుకు ఆధార మెక్క డుంటుందో మీరే చెప్పండి. 


విచారించగా విచారించగా కొంత కాలానికి తెలిసింది నే నెట్లా యీ ఆస్పత్రిలోకి వచ్చానో. పంజాబునుండి వస్తున్న కాందిశీకులతోబాటు నన్ను కూడ ఆ స్పత్రికి రు ట. అట్లా వచ్చినవారిలో చాలమంది ఆస్పత్రిలోనే మరణించారు. ఆ చచ్చిపోయిన వాళ్ళు ఏమతస్థులని నేను అడగ్గా హిందువులు, ముస్లింలు, సిక్కులూ — అన్ని మతాలవాళ్ళూ ఉన్నారని ఆస్పత్రి వాళ్లు చెప్పారు. 


అసలు జరిగిం దేమిటంటే లాహోరు అమృతసర్ల మధ్య మోసుకు పోతున్న రెండు రైలుబళ్ళు పట్టాలు తప్పి తలకిందులయ్యాయి. ఒక రైలుబండి పశ్చిమ పంజాబునుండి అమృతసరుకు హిందూ కాందిశీకులను మోసుకొస్తోంది. రెండో బండి తూర్పు పంజాబునుండి లాహోరుకు ముస్లిం కాందిశీకులను మోసుకుపోతోంది. 


దాదాపు రాత్రి 11 గం. సమయాన రైలు ఒకవంతెనమీద ఉండగా పట్టాలకింద ఒక బాంబు పేలింది. వెంటనే రైలుబండి అంతా పేలింది. 


చాలమంది అప్పుడే మరణించారు. చాలమందికి గాయాలు తగిలాయి. గాయాలు తగలకుండా తప్పించుకొన్న వారిని చుట్టుపక్క ల పొంచిఉన్న గూండాలు కాల్చి చంపారు. గాయాలు తగిలిన వాళ్ళు గుడ్డితనంగా తలొక దారి వెంటా పరిగెత్తుకు పోయారు. 


ఎదురుగుండా వస్తున్న బండికికూడ గంట తర్వాత యిటువంటి ప్రమాదమే సంభవించింది. ఆ రైలుబండిలో గాయాలు తగిలిన వాళ్ళుకూడ తలదాచుకొంటానికి దొరికిన దారి వెంబడి పారిపోయారు.


'మరురోజు ఉదయం భారతప్రభుత్వ సేనలు, పాకిస్థాన్ ప్రభుత్వ సేనలు సరిహద్దు  గస్తీ తిరగటానికివచ్చి అనేక శవాలను, గాయపడి కదలలేకుండా పడిఉన్న వాళ్ళనూ చూశారు. వాళ్లల్లో ఎవరు హిందువో, ఎవరు ముస్లిమో నిర్ణ యించటం బహుకష్టమైపోయింది. 


నేనుకూడా ఆ విధంగా గాయపడిన వాళ్ళల్లో ఒకణ్ణి. నన్ను స్ట్రెచర్ మీద అంబులెన్సువద్దకు మోసుకొని పోయినవాడు చెప్పాడు .. నే నెక్కడ ఎట్లా పడిఉన్నానో వివరాలన్నీ! 


 గుడ్డలన్నీ నెత్తురుతో తడిసిపోయాయి. నా చుట్టూ ఒక రక్తపు మడుగు తయారైంది. కొత్త సరిహద్దు ప్రకారం 'నా కాళ్ళు పాకి స్టాక్ భాగంలోను, తల  భారత దేశంలోను పడిఉన్నాయి. ఈ కొత్త సరిహద్దు వెంట అనేకమతాల, జాతులవారి రక్తం ప్రవ హించింది.


'చూడు! మౌలానా! దయ్యాన్ని  పట్టించే వాడిమాదిరిగా నా వంక అట్లా చూస్తావేం? నీ మనస్సులో ఏముందో నాకు తెలుసు. నేను యిప్పుడో యింకాసేపటికో చచ్చిపోతాను. చచ్చిపోయేముందు ప్రతిక్యక్తికీ అన్ని విషయాలు - తెలుస్తాయి. నేను ముసల్మాను నని చెప్పినట్లయితే యిస్లాం మతమును అనుసరించి నా అంత్య క్రియలు జరుపుదా మని ఆలోచిస్తున్నావుకదూ! 


ఏమండీ! మహషాయ్ ! నాకు తెలుసు. నేను హిందువునని చెప్పి నట్లయితే మీ ధర్మసేవక్  సంఘాన్నను సరించి నా అంత్యక్రియలు జరుపుదామని ఆలోచిస్తున్నారు కదూ! 


బొంబాయిలో పార్శీవాళ్లు - శవాల్ని బయట పారేస్తారని విన్నాను. వాటిని బ్రతికుండగానే  పీక్కు తింటానికి పక్షులు తయారవుతారన్న విషయం నా కింతవరకు తెలియదు... 


'ఇక నా చరిత్ర కొనసాగిస్తా. ఎందుకంటే, నేను మీతో మాట్లాడేకాలం చాలకొద్ది మాత్రమే ! 


నాకు తగిలిన గాయాలు ఏమంత పెద్దవి  కావు. బలమైన గాయాలు రెండువారాలు కట్టు కడితే నయ మౌతాయి. కాని నా బుర్రకు గట్టి దెబ్బ తగిలి, మనస్సు చెడిపోయిందని డాక్టర్లు చెప్పారు. దాని మూలంగా జ్ఞాపకశక్తి పోయింది. దాంతో నేను ఒక అనామకుడిగా తయా రయాను . 


నా పేరు నేను మర్చిపోయా. నాలాంటి అభాగ్య కాందిశీకులు చాలమంది ఆస్పత్రి కొచ్చారు. ఆస్పత్రి వాళ్లు నన్ను బయటకు వెళ్లమన్నారు. తలదాచు కొనేందుకు చోటైనా దొరక్క పోతుందా అని అన్వేషణ ప్రారంభించా.


'జుమ్మా  మసీదుదగ్గర ఒక శరణాలయం ఉంటే అక్కడకు వెళ్లి కాస్త చోటు యివ్వవలసిందని శరణాలయాధికారిని ఆశ్రయించా. 


' నువ్వు హిందువుడివా, ముసల్మానువా? అని అడిగాడు ఆ అధికారి. '

' నాకు గుర్తులేదు' అని చెప్పా. నాకు గుర్తు లేని మాట వాస్తవమే . నేను అబద్ధం ఎందుకు చెప్పాలి?


'ఈ శరణాలయం ముసల్మానులకోసం' అని ఆ అధికారి నన్ను బయటకు గెంటాడు. అక్కడి ఆశ నిరాశ చేసుకొని ఎట్లాగొకట్లా ఢిల్లీకి చేరుకున్నా. 


ఇక్కడ యిదివరకటి శరణాలయం కంటే పెద్దదాన్ని చూశా. తలదాచు కొనేందుకు కాస్త చోటు యివ్వమని వాలం టీర్లను ప్రార్ధించా.


'హిందువుడివా, ముసల్మానువా' అంటూ అదే ప్రశ్న వేశారు. యిక్కడా  'నాకు గుర్తులేదు' అని నేను మళ్లీ ఆమాటే చెప్పా. '


' నీ పేరు?అని అడిగారు. 


‘అదికూడ నాకు గుర్తులేదు. అసలు నా కేదీ గుర్తులేదు.' 


'ఇం కెక్కడి కన్నా వెళ్లు. ఈ శరణాలయం హిందువుల కోసం . 


ఈ విధంగా ఒక చోటునుంచి యింకో చోటికి తిరిగా, హిందువులకోసం శరణాలయా లున్నాయి. మహమ్మదీయులకోసం శరణాలయాలున్నాయి. కాని  మానవులకోసం మాత్రం లేవు. 


'ఆ రాత్రి శరీరం బాగా  అలిసి ఉండటం చేత  నడవ టానికి ఓపిక లేక ఒక సిక్కు సర్దారు బంగళా ముందు స్పృహతప్పి పడిపోయా. అతడు సెక్ర టేరియట్ లో ఒక చిన్న ఆఫీసరు. అతడు నన్ను లోపలకు తీసుకుపోయి రొట్టె, పాలు యిచ్చాడు. నాకు కొంచెం స్పృహ వచ్చిన తర్వాతగూడ నేను హిందువునో, ముసల్మానునో సిక్కునా  నన్ను అడగలా. 


' కులాసాగా ఉందా బాబూ? ' అని మాత్రం అడిగాడు.


‘అతని బంగళాలో నేను చాల రోజులు గడిపా. 


నేను నా కథను ఉన్నది ఉన్నట్లు చెప్పినా నాకు తెలిసినంత వరకు . అప్పటికిగూడ అతని కుటుంబం  నన్ను చాల ఆప్యాయంగా చూసింది. కొన్ని రోజులతర్వాత వారి చుట్టాలు కొంతమంది రావల్పిండినుండిపారిపో యెచ్చారు. ముస్లిం గూండాలచేతిలో వాళ్ళు చాల కష్టా లనుభవించారు. వాళ్ల కళ్ల ఎదటే  వాళ్ళ బంధు వులను నానాహింసలు పెట్టి అవమానాలపాలు చేశారు. వాళ్ల హృదయాలు ముస్లిములంటే అసహ్యంతో నిండిపోయాయి. ఈ కథంతా - విన్న తర్వాత నాకు తెలియకుండా నేనుకూడ ముస్లిములను అసహ్యించుకోవటం మొదలం పెట్టా..


'సర్దార్ గారు నా కథంతా చెప్పి  , నా కే విధంగా మతి పోయిందీ, ఏ విధంగా నేను కష్టాలుపడ్డదీ వివరాలన్నీ వచ్చిన బంధువులకు చెప్పారు. పెద్దవాళ్ళు నన్ను అనునయించి నా పూర్వ స్మృతిని తెప్పించటానికి చాల ప్రయత్నం చేశారు. కాని పిల్లలుమాత్రం నన్ను అనుమానం గానే చూశారు. 


అందులో ఒకడు యింకొక డితో యీ విధంగా చెప్పటం విన్నా: 'వాడు చెప్పిందంతా అబద్ద మనుకో. మతి తప్పిపోయిం దని బొంకుతున్నాడనుకో, వాడు నిజంగా ముస్లిం అయివుంటాడు ' 


నాకు భయం పుట్టింది.


'ఆ ఆలోచనే నన్ను కూడ వేధించుకు తింది. నేను నిజంగా ముస్లిమునేమో. ఏమో ఎవరికి తెలుసు. నేనుకూడ యిప్పుడు ముస్లిములు చేస్తున్న మాదిరిగా ఘోరాలు చేసిన తర్వాత నాకు మతి తప్పిందేమో. నా ఘోర కార్యాలకి భగవంతుడు న న్నీ విధంగా శిక్షించా డేమో.' 

ఆ రోజు రాత్రే సర్దార్ యింటి నుండి పారి పోయా. తిరిగి వీధులవెంట తిరుగుతున్నా. మళ్లా ఉపవాసాలు, 


' ఈ శరణాలయం ముస్లిములకోసం నీ వెవరు ?' 

నీ పే రేమిటి ? నీ మత మేమిటి?నువ్వు ఎక్కడనుండి వస్తున్నావ్?.. ప్రశ్నలు ! ప్రశ్నలు ! ! ప్రశ్నలు!!! -అన్నీ ప్రశ్నలు, .


ఎక్కడచూచినా ప్రశ్నలు. నేను అందులో ఒక్క దానికీ సమాధానం చెప్పలేను. ఎందుకంటే నే నెవరినో నాకే గుర్తు లేదు. ఇక నడవలేక ఆకలి మండుకుపోతుంటే తిరిగి జుమ్మా మసీదు  దగ్గరకు పోయి అక్కడే కూచున్నా. ఆకలితో చచ్చిపోవటం, నిశ్చయ మనుకొన్నా. స్పృహతప్పి పడిపోయా. 


అట్లా ఎంతసేపు పడిఉన్నానో! ఎప్పుడో ఒక్క సారి మాత్రం కళ్ళు తెరిచేసరికి నా ఎదురుగా ఎనిమిదేళ్ల పిల్లాడు నుంచొని ‘లే! లే!!” అని అంటున్నాడు. 


'ఇదిగో! యివ్వి తిను. మా అమ్మ నీకోసం పంపింది'. తిండి అన్న మాట వినంగానే లేవాలని బుద్ధి పుట్టిం దను కొంటా, కాని లేవటానికి శక్తి ఎక్కడనుండి వస్తుంది .  లేవలేకపొయాన.  ఆ పిల్లాడి సహాయంతోనే అతిప్రయాసతో లేచి కూచొని చపాతీలు తింటం ప్రారంభించా. 


ఎంత రుచిగా ఉన్నాయి ఆ చపాతీలు! భగవంతుడే నాకోసం అమృతాన్ని యీ రూపంలో పంపించినట్లుగా ఉంది. కల కాలం జీవించునాయనా! ' అని దీవించా. 


కాస్తముక్క కూడ విదలకుండా అన్నీ తినివేశా. కృతజ్ఞత తెలియజేద్దామని అతని చెయ్యి తాకగానే 'నీకు బాగా జ్వరంగా ఉందే ! మా యింటికి పోదాం. మా నాన్న యునాని వైద్యుడు. మందు వేస్తాడు. తగ్గిపోతుంది.' అని ఆ పిల్లాడు నన్ను వాళ్లయింటికి లాక్కుపోయాడు. 


ఆ యునానీ వైద్యు డొక ముసల్మాన్. రోజుకు ఐదుసార్లు నమాజు చేస్తాడు. బీద, బిక్కికి ఉచితంగా మందులిస్తాడు. అతనికి హిందువులు, ముస్లింలు, సిక్కులు అన్న వివక్షత లేదు. జబ్బులు తో వస్తే వారందరికీ మందులిస్తాడు. 


హకీంసాహెబు మందుల వల్ల నా జ్వరము తగ్గింది . కాని అంత పెద్ద వైద్యుడివద్దకూడ పూర్వ స్మృతిని తెప్పించే మందు లేకపోయింది. 


నా కథంతా ఆయనతో చెప్పి 'ఒక వేళ నేను హిందువునేమో. నేను మీ యిల్లు వదలి ఇంకో చోటికి పోవాలి' అని అన్నా. కాని హకీం సాహెబు నన్ను అక్కడే ఉండమని బలవంతం చేశాడు. 'నీవు హిందువయితే మాత్రం  ఏ మొచ్చింది? హిందువులు మాత్రం మనుష్యులు కారూ?`


నే నక్కడే కొంత కాలమున్నా. ఒక రోజున హకీం సాహెబు కొడుకు నా మాదిరి దురదృష్ట వంతులకు రొట్టెలు యివ్వ టానికి వెళ్లి తిరిగి యింటికిరాలా. నేను, హకీం సాహెబు అతనికోసం ఆ రోజల్లా వెతికాం. కాని అతని జాడ తెలియలా! 


జుమ్మా  మసీదు దగ్గర హిందువులు చంపారని రాత్రి తెలిసింది. ఈ వార్త వినంగానే హకీం సాహెబు కుటుంబ మంతా దుఃఖ సముద్రంలో మునిగిపోయింది. ఆ పిల్లాడి భూతం నన్ను రాత్రి, పగలూ వెంటా డుతూ తన మృదుమధుర వచనాలతో 'నువ్వు చచ్చిపోతున్నప్పుడు నీవు తిండి పెట్టా. కాని నువ్వు నన్ను చంపేశావు. గుర్తుంచుకో ! అంటోంది. నేను చంపలేదని నాకు తెలుసు. కాని నేను హిందువునేమో. మతి దప్పక పూర్వం నేను కూడ అనేకమంది ముస్లిం పిల్లలను చంపానేమో, ఈ ఆలోచన నన్ను అక్కడ నిలవనియ్యలా! 


ఆ రోజు తెల్లవారు ఝామున ఇంట్లో ఎవరు  లేవకముందే బయటకుపారిపోయా. 


అవి, ఢిల్లీలో మృత్యుదేవత తన సహస్ర బాహువుల్నీ జాపుతూ కరాళనృత్యం చేస్తున్న రోజులు. పట్టపగలే సామాన్య ప్రజానీకం మృత్యువువాత పడుతోంది. అగ్ని హోత్రుడిపాలవుతున్నది . 


ఏదో ఒక విధంగా గూండాలను తప్పించుకొని రైలుస్టేషనుకి చేరు కొన్నా. ఇక్కడికన్న బొంబాయిలో కొంచెం ప్రశాంతంగా ఉంటుందని బయలుదేరా . నా మాట విని అక్కడ పక్కన పంజాబునుండి వస్తున్న ఒక కాందిశీకుడు చిన్నబోయిన వదనంతో కూచున్నాడు. 


రైలు కదిలినప్పటికి  'ఎవరు నీవు?' అని అడిగాడు. 'నాకు తెలి యదు. హిందువునైనా కావచ్చు. ముస్లిమునైనా కావచ్చు.'


' ఈ మార్గంగుండా ముస్లింలు ప్రయాణం చేస్తే ఘోర ప్రమాదాలకు గురి అవుతారని విన్నా. నీకు గడ్డం ఉంది. అందుకని అడిగా!' 


నేను నా కథ అంతా అతనికి వినిపించా. అతడు నా గడ్డాన్ని దీక్షగా పరిశీలిస్తూ నావంక అనుమానంగా చూస్తున్నాడు.


'వారం రోజులనుండి గడ్డానికి  కత్తి తగలక పోవటంచేత గడ్డం కొంచెం పెరిగింది. ఏదో పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ భరత పురం వచ్చాం. అక్కడ రైలు ఆపివేయబడింది. 


ముసల్మానులు అని అనుమానం వేసినవారి నందర్నీ రైలులోనుండి బయటకు లాగి కాల్చి చంపే స్తున్నారు.


‘ఆ విషయాన్ని తలుచుకొంటుంటే నాకిప్పు టికీ నవ్వు వస్తోంది. ఎందుకు నవ్వు వస్తోందో మీకు తెలుసుకోవాలని ఉందా ? ఆ విధంగా ముసల్మానులను బయటకు లాగి కాల్చి చంపే వాళ్ళంతా 'మహాత్మా గాంధికి జైయ్' అని అర స్తున్నారు. అది చాలు చచ్చిపోయేముందు ఎవడైనా నవ్వటానికి.


వాళ్లు  మా బోగీదగ్గరకు రాగానే నాకూ  చావు తప్ప దనుకొన్నా. నేను ముస్లిము అవునో కాదో నాకు మాత్రం తెలియదు. కానీ నాకు గడ్డం ఉంది. అది చాలు నన్ను చంపటానికి. 


యిందాకటినుండి కూచున్న పంజాబీ నామీద దుప్పటి వేసి నన్ను పూర్తిగా కప్పేశాడు. వాళ్లు అడగంగానే 'ఆయన మా అన్నండి. లాహో రులో బాగా గాయాలు తగిలాయి. ఇప్పుడు మాటాడే పరిస్థితిలో లేడు' అని స్నేహితుడు చెప్పాడు. నా పంజాబీ 'ఏదో ఒకవిధంగా చివరకు బొంబాయి చేరు కొన్నా. ఇక్కడకూడ అదే ప్రశ్న ఎదుర్కొంది.


నువ్వు హిందువుడివా, ముస్లిమువా ?


'ఎవరు హిందువు ? ఎవరు ముస్లిము? అన్న ఆలోచన నాకు యిప్పుడు తట్టింది. నేను ముస్లిముగా కనుపించినప్పటికీ పంజాబీ నన్ను కాపాడా డు. హకీం సా అతను హిందువా? సాహెబు కొడుకును చంపిన కిరాతకులు హిందువులా? ఎవరు ము స్లిములు? 


హకీం సాహెబు కుటుంబం ముస్లిము కుటుంబమా, లేక రావల్పిండిలో సిక్కులను నానా బాధలు పెట్టిన రాక్షసులు ముస్లిములా ? ఎవరు సిక్కులు? సర్దార్ సాహెబు కుటుంబమా  లేక ఢిల్లీలో వీరవిహారం చేస్తున్న నీచులా ? ఎవరు  ముస్లిం? ఎవరు హిందువు? ఎవరు సిక్కు ? ఈ పవిత్రస్థలములో కూడ నువ్వు హిందువువా, ముస్లిమా, 'సిక్కా అన్న ప్రశ్నే !


' నే నెవర్ని? హిందువునా? ముస్లిమునా? రాత్రింబగళ్లు ప్రశ్న నన్ను బాధిం చింది. నిద్రపోతున్నప్పుడుకూడ యీ ప్రశ్నలు భూతాల రూపందాల్చి బల్లాలు పుచ్చుకొని జవాబు పొందటానికి ప్రయత్నించాయి. నేను కలవరింతగా యీ మాట అన్నానేమో. 'నన్ను వదలి వెయ్యండి. నేను ముసల్మానును కాదు. హిందువునూ కాదు. సిక్కు నూకాదు. ఒక మాన వుణ్ణి మాత్రమే!' 


బొంబాయిలో కాందిశీకులకు శిబిరాలున్నాయి . సి క్కులకు ఖాత్యా కళాశాల దగ్గర ఒక శిబిరం ఉంది. హిందువులు రామకృష్ణ ఆశ్రమంలో తలదాచుకోవచ్చును. ముస్లింలు అంజుమన్ ఇస్లాం హైస్కూలుకు పోవచ్చును. కాని నేను ఎక్కడకు వెళ్లను? నాకు తలదాచుకొనేందుకు ఎక్కడా చోటులేదు. 


ముష్టి  నా కెవళ్లూ వేసేవాళ్లు కాదు. ముష్టి వేసేందుకు గూడ ఏ మతంవాడినో అడిగేవాళ్లు. నేనేం చెప్పేది? నేను ఏ మతానికీ సంబంధించిన వాడిని కాదు. అయితే నేను చచ్చిపోవాలన్న మాట. 


ఉహుఁ. ఆవిధంగా చావ లేను. నేనెవరినో తెలుసుకోవాలి. లేకపోతే నేను బతకటానికి అవకాశం లేదు.


డాక్టరు 'సమాని' నా స్మృతిని తెప్పిస్తాడని విని అక్కడకు వెళ్లా. అతడు మందులు, మాకులు వేసి రోగం తగ్గించడు. ఊరికే మాట్లాడి కుదు రుస్తాడు. నీ మనస్సును కష్ట బెట్టుకోకు. నీబుర్ర లో ఏమనిపిస్తే అది అంతా చెప్పు. సంబంధమున్నా సరే లేకపోయినా సరే అని చెప్పి తను ఒక కలంపుచ్చుకొని నా ముందు కూచున్నాడు. 


నేను కళ్ళు మూసుకొని నానోటి కొచ్చిందల్లా మాట్లాడా. 'నీలపు ఆకాశం, పచ్చని చేలు'


‘బాగుంది, ఆపబోకు' '


' నీలపు ఆకాశం, పచ్చని చేలు, ఒక నదీ ప్రవాహం. నదిలో పడవలున్నాయి. ఒక కాలవ, కాలవలో పిల్లలు యీదుతున్నారు. ఒకళ్ల మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుంటున్నారు.' 


' ఎవరీ పిల్లలు ? హిందువులా, ముస్లిములా, - సిక్కులా'


'ఏమో, ఎవరో, కానివాళ్ళుమాత్రం పిల్లలు' '


' సరే, కానీ .. పంటపొలం, పండగ. ! డోలక్ వాయిద్యం విను.. ఆహాఁ. ఎంత బావుందో ! ఆహాఁ! ఏంపాట !!! ఎవరు పాడుతున్నారా పాట??


' స్త్రీలు ' 


'సరే. ఎవరా స్త్రీలు. హిందువులా, ముస్లిములా, సిక్కులా.' '


' పంజాబు స్త్రీలు. హిందువులు, ముస్లిములు - సిక్కులు' 


' ఇక ఏమీ చెప్పలేను. ఏమీ కనిపించడం లేదు. ' 


'ఊ' అని నిట్టూరాడు డాక్టరు . . యికలాభం లేదన్నట్లు.


' ఏం? ఎందుకని? ఏ మొచ్చింది ?'


“ నాతల తిరిగిపోతోంది. చీకటిగా ఉంది. ప్రపంచమంతా భయంకరమైన కేకలు వినిపిస్తున్నాయి. ' 

 

'గట్టిగా ప్రయత్నించు  . ఇప్పుడేం కనిపిస్తున్నాయి? ' 


' ఆకాశాన్నం టే మంటలు. ఇళ్లన్నీ తగలబడి పోతున్నాయి. ఏడుపు స్వరాలు వినిపిస్తున్నాయి.' 


 'సరే, గూండాలు వచ్చారన్న మాట. వీళ్ళే బంధువుల్ని చంపేశారు. వీళ్ళే నీ ఆస్తి అంతా దోచేశారు. వీళ్ళే నీ పెళ్లాం పిల్లల్ని చంపేశారు. నీ మతి పోగొట్టారు...వా ళ్ళేం చెబుతున్నారు? 


; నా కేమీ వినిపించటంలా, అంతా గోలగా ఉంది. ఒక్క మాటమాత్రం చెవులో గుద్దినట్లు వినిపిస్తోంది. ' చంపుచంపు చంపు. ' 


'వీళ్ళే నిన్ను సర్వనాశనం  చేశారు. వీళ్ల మీద నువ్వు పగతీర్చుకోవాలి. ' 


' నేను హిందువునో, ముసల్మానునో డాక్టరు తెలుసుకో బోతున్నాడు! నేను ముస్లిముని! సర్దార్ సాహెబు బంధువుల్ని చంపా. అనేకమంది హిందువుల సిక్కుల ప్రాణాలు తీసి వేశా. నేను హిందువుని!  హకీం సాహెబు కొడ కుని చంపా. ఇంకా అనేకమంది ముస్లిములను చంపా. ' 


' వద్దు. అక్కర్లేదు. నేనెవరినో నేను తెలు సుకోనక్కర్లా. నేను హిందువుగాని, ముస్లిం గాని, సిక్కు గాని అవదల్చుకోలా• మానవుడిగా మాత్రమే ఉంటా. అంతే! అంతే!!' అని అరుస్తూ డాక్టరు దగ్గరనుండి పారిపోయా! 


నేను హిందువుని. నేను ముస్లిముని

నేను ముస్లిముని'  హిందువుని' ‘


' నే నెవర్నయితే మాత్రం నాకేం పనీ? ' 


' నే నెవర్ని కాదు. నాకేం పని లేదు' “

' నేను హిందువుని . నేను ముస్లిముని'


ప్లేగు నుండి  పారిపోయినట్టు డాక్టరు దగ్గర నుండి పారిపోయా. 


కాని యీ మాటలు మాత్రం నన్ను వదలి పెట్టలా ! 

నేను ఏ వీధికుండా పరు గెత్తుతున్నా నో నాకు తెలియదు. భయంకరమైన  వ్యక్తి ఒకడు నన్ను పట్టుకు ఆపాడు. ' ఆరే సాలా ! ఎవర్రా నువ్వు? ఎక్కడికి పోతున్నావ్ ?' 


అతడొక ముస్లిం అవాలి . అతని చేతిలో కత్తి ఉంది. 

 ' నేను హిందువుని. నేను ముస్లి ..' '


' ముస్లిము' అన్నమాట పూర్తి చేయక ముందే నా వీపులో బాకు దిగిపోయింది. అదే ఈ వీపులో ఉన్న బాకు పోటు!


'కాఫిర్ కా బచ్చా' అని అంటున్నాడు. నేను పూర్తిగా పడిపోకుండా పారిపోతున్న ప్పుడు. నా వెనుక రక్తం కారుతోంది. మీరు నమ్మరు. అయితే నమ్మబోకండి. 


చచ్చిపోయే ముందు నేను నిజం మాట్లాడుతున్నా నని నాకు మీరేమీ సర్టిఫికేట్ యివ్వనక్కర్ల.......


 “నేను ముస్లిముని. నేను హిందువుని' అని అనుకుంటూ నేను పోతున్నా. 


ఈసారి 'హిందువు' అంటానికి పూర్వం నా డొక్కలో ఒక బాకు

దిగింది.


'ఇప్పుడు మీరు గ్రహించా రనుకొంటా, నాకీ రెండు గాయాలు ఎట్లా తగిలాయో! 


నన్ను హిందువులు, ముస్లిములు యిద్దరూ బాకుతో  పొడిచారు. అందుకనే మీరు నన్ను బతికించ లేదని చెప్పింది డాక్టరుగారు! 


ఇక్కడ యింత ఆదుర్దాగా చూస్తున్న మీలో ఒక్కడు కూడ  నన్ను బతికించలేడు . పగతీర్చుకొంటానికి మాత్రం నా చావును ఆధారంగా తీసుకొంటారు. ఇప్పుడు గనక నేను హిందువునని చెప్పినట్లయితే వెంటనే హిందువులు నాలుగు అమాయకముస్లిం పిల్లల ప్రాణాల్ని ఆహుతి గొంటారు. ముస్లిము నని చెబితే ముస్లిములంతా హిందూ మతాన్ని రూపుమాపేస్తారు. 


' నేను నవ్వుతున్న దెందుకంటే, యిప్పుడే తెలిసింది నే నెవరినో ? ఇంత కాలాని యిప్పుడు తెలిసింది పూర్వచరిత్రంతా! 


నా బిడ్డల  చిలిపి చేష్టలు గుర్తుకొస్తున్నాయి . ఇద్దరు కూడ నా కళ్ల ఎదటే చంపబడ్డారు. ఆ విధంగా నా మతి చెప్పింది. ఆఁ! అవును! అంతా నా కిప్పుడు గుర్తు కొస్తోంది. మా పొలాలు, మా గ్రామం, నా స్నేహితులు, నా యిరుగు పొరుగువాళ్ళు - అంతా యిప్పుడు జ్ఞాపక మొస్తున్నారు. చచ్చి పోయేముందు..  నిజం .. అన్ని విషయాలు గుర్తుకొస్తున్నాయి .


'మీరు నేనేమి చెబుతానో అనియింకా నిరీ క్షిస్తున్నారు. కాని లాభం లేదు. నేను చెప్పను.  నేను హిందువునో, ముసల్మానునో చెప్పను.  చెప్ప దలచుకోలేదు. 


నాకు యీ రెండు -గాయాలు తగిలించిన హిందువుగాని, ముస్లింగాని నేను తన జాతివాడినని తెలుసుకోకూడదు. ఆరే పొరబాటున పొడిచానే అని పశ్చాత్తాపం పొందకూడదు. ఇదే నా పగ. వీ ళ్లిద్దరిమీదే కాదు. నాలాంటి అమాయక ప్రాణాలను బలి గొంటున్న వేలకొలది హిందువులమీద, ముస్లి ములమీద, సిక్కులమీద . 


మతోన్మాదులు పుట్టటం మూలంగా, బతకటం మూలంగా ఆత్మీయమైన నా పంజాబుకు తీరని కళంకం వచ్చింది.


' నేను హిందువునా, ముస్లిమునా ?' 


' నేను ముస్లిమునా హిందువునా?' 


ఈ ప్రశ్నే వాళ్లకు కావాల్సింది. ఈ ప్రశ్న వాళ్లను రాత్రింబగళ్లు వేధించుకు తినేది. పట్టణంలోను, పల్లెలోను, రైళ్లలోను , బస్సులోను, ట్రాములోను -ఫ్యాక్టరీలోను, ఎక్కడబడితే అక్కడ యిదే ప్రశ్న. 'వాడు హిందువా, ముస్లినూ?' 


వాళ్లకుగాని వాళ్ల పిల్లలు ఉంటే ఆ  పిల్లలకుగాని, వాళ్ల పిల్లల పిల్లలకు గాని శాంతి ఏమిటో తెలియదు. 


అంత భయంకరం, ఘోర భయంకరం నా పగ. 


ఇంకా మీకు తెలుసుకోవా లని ఉందా, నే నెందుకు నవ్వుతున్నానో?'

- రచన - వెంకటేశ్ 


(మూలం - అబ్బాస్ కథ) 

( ఆంధ్రపత్రిక - 1947, డిసెంబర్, 24వ తారీఖు సంచిక ) 


- సేకరణ - 

కర్లపాలెం హనుమంతరావు 

 23-12-2021 

బోథెల్ ; యూ. ఎస్.ఎ





Tuesday, December 14, 2021

ఆంధ్ర మహా భారత అవతరణ - సేకరణ - కర్లపాలెం హనుమంతరావు ( మూలం - ఆంధ్రుల సంక్తిప్త చరిత్ర - ఆంధ్ర మహా భారత అవతరణ - శ్రీ ఏటుకూరి బలరామమూర్తి )



ఆంధ్ర మహా భారత అవతరణ 

- సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

( మూలం - ఆంధ్రుల సంక్తిప్త చరిత్ర - ఆంధ్ర మహా భారత అవతరణ - శ్రీ ఏటుకూరి బలరామమూర్తి ) 


చాళక్యుల కాలంలో మత, కుల విభేదాలు రాజ్య భద్రతకే విచ్ఛిన్నకరంగా తయారయాయి. సుస్థిర రాజ్యపాలన అసంభవమౌతుండేది. ఇతర రాష్ట్రాల నుండి దండెత్తి వచ్చే రాజులను ఆహ్వానించే మతస్థులు, కులస్థులు ఎప్పుడూ ఎవరో ఒకరు ఉండేవారు. కుట్రలను, అరాచకాన్ని ప్రోత్సహించేవారికి మతం ఒక ముసుగుగా ఉపయోగపడేది. ఆ సందర్భంలో అవతరించినది ఆంధ్ర మహా భారతం . 


ఆంధ్ర మహాభారత అవతరణ


విచ్ఛిన్నకర ధోరణులను కొంతవరకైనా అరికట్టి ఐక్యజాతి పరిణామాని కవసరమైన సంస్కృతిని నిర్మించిన ఘనత తెలుగు సాహిత్యానిది.  అందుకు మహాభారతం నాంది.


మత ప్రవక్త దృక్పథం సంకుచితం. తన దేవునిపై భక్తి కంటె పొరుగు దేవుడిపై ద్వేషం జాస్తి. దేవతల ద్వేషం ప్రజలలో వ్యాపించి అంతఃకలహాలకు కారణమైంది.


కవుల దృక్పథం వేరు. జీవితంలోని కుల, మత భేదాలకు అతీత మైన, సామాన్య మానవ భావాన్ని ప్రస్ఫుటంగా వ్యక్తీకరించటమే కవి కర్తవ్యము. ఈ గురుతర బాధ్యతను నిర్వహించిన కావ్యాలు భారత, భాగవతాలు. అయితే ఈ కర్తవ్యం -  నాటి ప్యూడల్ సమాజ పరిధికి లోబడి జరిగింది. సామాన్య ప్రజల జీవితం ఈ సాహిత్యంలోకి ఎక్కలేదు.


మహాభారతం సర్వజన వంద్యంగా వుండవలెనని తాను రచించి

నట్లు నన్నయభట్టు ఇలా వివరించాడు.


'ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని 

అధ్యాత్మ విదులు వేదాంత మనియు 

నీతి విచక్షణుల్ నీతి శాస్త్రం బని 

కవి వృష  మహా కావ్య మనియు

లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని 

ఐతిహాసికులితిహాసమనియు 

పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చ

 యంబని మహ గొనియాడుచుండ


గీ. వివిధ వేద తత్వవేది వేదవ్యాసు 

డాదిముని పరాశరాత్మజుండు 

విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై 

పరగుచుండ జేసె భారతంబు.


తామెంతటి మహత్కార్యానికి పూనుకున్నారో మహాభారత కవులు

గుర్తించారు.


“నానా రుచిరార్థ సూక్తినిధి 

నన్నయభట్టు తెనుంగునన్, మహాభారత 

సంహితా రచన బంధురుడయ్యె 

జగద్ధితంబుగాన్”


"గాసట బీసటే చదివి గాథలు త్రవ్వు తెలుంగు వారికిన్ వ్యాస ముని ప్రణీత"మైన మహాభారత గాథను వివరిస్తున్నానని నన్నయభట్టు మరొక చోట చెప్పాడు.


ఇదే విషయాన్ని భారతంలో అత్యధిక భాగాన్ని రచించిన కవి బ్రహ్మ తిక్కన యింకా స్పష్టంగా చెప్పాడు.


ఉ॥ కావున భారతామృతము కర్ణపుటంబుల నారగ్రోలి, 

ఆంధ్రావళి మోదముం బొరయునట్లుగ సాత్యవతేయ 

సంస్కృతి శ్రీవిభవాస్పదంబయిన చిత్తముతోడ మహాకవిత్వ దీక్షావిధినొందిపద్యములగద్యములన్ రచియించెదన్కృతుల్ ——


అంతేకాదు.


తెలుగు భాషలో ప్రజాసామాన్యానికందరికీ అర్థమయ్యేటట్లు వ్రాయటంలో పురుషార్థ సాధన ఇమిడి వున్నదని కూడా తిక్కన భావించాడు.


తే॥ తెనుగుబాస వినిర్మింప దివురుటరయ

భవ్యపురుషార్థ తరు పక్వ  ఫలము గాదె ॥


ఆంధ్ర మహాభారతం నన్నయ ప్రారంభించిన తర్వాత 200 సంవత్సరాలకు గాని పూర్తికాలేదు. ఏ ఆశయంతో నన్నయభట్టు భారత రచన కుపక్రమించాడో, అదే ఆశయంతో క్రీ.శ. 1260 ప్రాంతంలో తిక్కన ఆ కావ్యాన్ని పూర్తిచేశాడు.


ఆంధ్రదేశంలోని అన్ని జిల్లాలలోని అన్ని కులాలలోను మహా భారతం అంతటి విస్తార ప్రచారంగల గ్రంథం మరొకటి లేదు. పాండవ కౌరవ గాథలు, నాటినుండి నేటివరకు సామాన్య ప్రజలకు విజ్ఞానాన్ని లోకానుభవాన్ని అందజేస్తూనే ఉన్నాయి.


నాడు ప్రజలలో జైన, హిందూ మతాలు వ్యాప్తిలో ఉన్నాయి. పూర్వ మీమాంసాకారుడైన కుమారిలభట్టు ఆంధ్రుడైనందు వలన, ఆంధ్రలో ఆ సిద్ధాంతానికి ఆలంబనం హెచ్చుగా ఉండేది.


నిర్జీవమైన కర్మకాండకు జైన, పూర్వ మీమాంసా ధోరణులు రెండూ విశేష ప్రాధాన్యత నిచ్చినవి. అర్థంతో నిమిత్తం లేకుండానే మంత్రోచ్చారణ ద్వారానే ఫలితాలు వస్తాయన్న మూఢ నమ్మకాలు విరివిగా ఉండేవి.


క్రీ. శ. 787 లో మలబారులో  పుట్టి అద్వైత వాదాన్ని ప్రచారం చేసిన శంకరాచార్యుని బోధనలు దేశమంతా వ్యాపించినప్పటికీ, పాత ధోరణులింకా బలంగానే వున్నాయి. శంకరుని ఆద్వైతం జ్ఞానప్రధానం; కర్మకాండను నిరసించింది.


నన్నయ్యభట్టు మహాభారత రచన అద్వైత ధోరణికి ఎనలేని సహాయం చేసింది. శైవ, వైష్ణవ ద్వేషాలను ఖండించింది. నిర్జీవ కర్మ కాండపైనుండి ప్రజల దృష్టిని వాస్తవ జీవితంవైపు మళ్ళించింది. 


రాజ్యలోభం, ద్వేషం, కక్ష మొదలైన ఆవేశాలకు లోనైనప్పుడు మహా సామ్రాజ్యాలు పతనమైపోతాయన్న నీతిని ప్రచారం చేసింది. కర్మలు అప్రధానమని, జ్ఞానం, సమవృష్టి, అద్వైతభావం ముఖ్యమని కథా రూపంలో ' ప్రజలకు బోధ చేసింది.


ఈ ఉపకృతితోపాటు, మరొక అపకారం కూడా జరిగింది. నన్నయ భట్టుకు పూర్వమే చాలా కాలం నుండి తెలుగులో రచనలు సాగుతూ వచ్చాయని ప్రాచీన శాసనాలే తెలియజేస్తున్నాయి. కాని నాటి గ్రంథాలేవి లభించటం లేదు. అట్టి ప్రజా వాఙ్మయాన్ని, “గాసట బీసట" అని నన్నయభట్టు హేళన చేసి ప్రజావాఙ్మయం పట్ల నిరసన కలిగించాడు. 


ఈ నిరసన వైఖరిపై తిరుగుబాటుగానే, రెండు శతాబ్దాల అనంతరం వీరశైవ మతం, వీరశైవ వాఙ్మయం తలయెత్తాయి.

- సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

14 -11-2021 


( మూలం - ఆంధ్రుల సంక్తిప్త చరిత్ర - ఆంధ్ర మహా భారత అవతరణ - శ్రీ ఏటుకూరి బలరామమూర్తి ) 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...