Showing posts with label Art. Show all posts
Showing posts with label Art. Show all posts

Sunday, December 12, 2021

మానవతావాది చార్లీ చాప్లిన్‌ -కర్లపాలెం హనుమంతరావు

                                           

వదులు పంట్లాం, ఇరుకు కోటు, పెద్ద సైజు బూట్లు, నెత్తిమీద చాలీ చాలని టోపి, ఫ్రెంచ్‌ కట్‌ మీసాలు,  వంకీ కర్ర, వంకరటింకర నడక, బిత్తరచూపులు- చూడంగానే  నవ్వొచ్చే ఆ ఆకారానికి వేరే పరిచయం అవసరమా?  అవును..ఈ విచిత్ర హావభావాల ఏకైక పేటెంట్ హక్కుదారుడు.. మీరూహించినట్లు  చార్లీ చాప్లినే. కనుమరుగై మూడున్నర దశాబ్దాలు గడుస్తున్నా మన మనసుల్లో అతగాడు చిరంజీవి. మురికివాడల్లో పుట్టుక. కఠోర  దారిద్య్రం మధ్య పెంపకం. అషకష్టాలు చాలా చిన్నవి అతను పడ్డ కష్టాల ముందు. కోట్లకు పడగలెత్తిన ఈ హాస్యనటుడికి తల్లి కుట్టు మిషను.  నాటకాలే బాల్యంలో ఆసరా.  తండ్రి ప్రేమ తెలియదు. ఒక నాటకంలో భాగంగా పాట పాడుతుండగా గొంతు జీరబోయిన తల్లిని అభాసు పాలవకూండా కాపాడిన పాటే చాప్లిన్ ఆరంగేట్రం మొదటి ఐటం సాంగ్. ఆనాడు  చిల్లరతో రాలిన నవ్వ్వులనే జీవితాంతం నమ్ముకున్న విశ్వ కళాకారుడు చార్లీ. విధంగా అనుకోని పరిస్థితులు ఐదేళ్ల చాప్లిన్‌ను స్టేజి ఎక్కించాయి. తల్లి ఆర్యోగం పూర్తిగా క్షీణించి మనోవ్యాధికి గురికావడంతో ఆమెను పిచ్చాసుపత్రిలో చేర్పించారు. తల్లితోడు కూడా లేక పోయేసరికి అనాధ శరణాలయంలో పిల్లలను చేర్పించడంతో వారు అక్కడ అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. రెండేళ్ళ తరువాత తల్లి మానసిక వ్యాధి నుండి కోలుకుని చాప్లిన్‌ను ఒక డ్యాన్స్‌ బృందంలో చేర్పించింది. స్వతహాగా కళాకారుల కుటుంబం నుండి వచ్చిన చాప్లిన్‌ నృత్యంతో పాటు అనేక కొత్త రూపాలను ప్రదర్శించేవాడు.

 

బాల్యంలోనే ఇన్ని కష్టాలను చవిచూసిన చాప్లిన్‌ ఎప్పటికయినా నటుడు కావాలన్న లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాడు. పొట్టకోసం అనేక రకాల పనులు చేస్తూ తన లక్ష్య సాధన కోసం కృషి చేస్తూనే ఉన్నాడు. క్రమంలో ఒక నాటక సమాజంలో వచ్చిన అవకాశాన్ని తన సహజమైన నటనా కౌశలం ఉపయోగించి ఆకట్టుకున్నాడు.ప్రపంచంలో అనేక నగరాలలో ప్రదర్శనలిచ్చాడు. 'కీస్టోన్‌ కాప్స్‌' అనే అమెరికా కంపెనీ ఆయన ఆద్భుత నటనకు మెచ్చి హాస్య చిత్రాలలో అవకాశం ఇచ్చింది. అవి మూగ చిత్రాలు, కళ అంటూ ఏమీ ఉండదు. దాన్ని దీన్ని గుద్దుకోవడం తన్నుకోవడం, క్రిందపడటం జనాన్ని నవ్వించడం ఇవి సినిమాల్లో ఉండేవి. ఎవరెక్కువగా నవ్విస్తే వారే హీరోలు, మొదటగా చిత్రాలలో చాప్లిన్‌ నటించారు.ఆయన నటించిన చిత్రాల్లో దేశ దిమ్మరి(1915) ఆయనకు శాశ్వత కీర్తినార్జించిపెట్టింది. చిత్రంలో ఆనాధ బాలుని పెంచటానికి పడ్డ పాట్లు ఎంతగా నవ్విస్తాయో, అంతగా సామాన్యుని బాధామయ జీవితాన్ని చూపిస్తాయి. చిత్రం ఆయనకు ప్రపంచ దేశాల్లో గొప్ప పేరును తీసుకువచ్చింది.

 

ప్రజా కళాకారుడిగా చాప్లిన్‌ నాటి భౌతిక పరిస్థితులకు స్పందిస్తూ తీసిన చిత్రం ''మోడరన్‌ టైమ్స్‌''. చిత్రంలో ఆధునిక కార్మికుడు యంత్రాల కోరల్లో చిక్కుకొని ఎలా నలిగిపోతున్నాడో, కార్మికుల సృజనాత్మకతను దెబ్బతీసి యంత్రంగా ఎలా మారుస్తున్నారో, కార్మికుల రక్తాన్ని ఎలా జలగల్లా పీలుస్తున్నారో వివరిస్తూ చివరకు కార్మికుడికి మిగిలేది. ఆకలి, దారిద్య్రం, మానసిక ఆందోళనలేనని వ్యంగ్యంగా వివరిస్తాడు. దీనితోపాటుగా అన్నం తినే సమయాన్ని కూడా తగ్గించటానికి తిండి తినిపించే ఆధునిక యంత్రాన్ని ప్రవేశపెట్టిన యజమానుల దురాశనూ, కార్మికుల శ్రమ దోపిడీకి వారు చూపే ఆత్రుతను వ్యంగ్యంగా విమర్శించాడు.అమెరికా పెత్తందారీతనం కార్మికులను, కమ్యూనిస్టులనే కాకుండా చార్లెస్‌ను కూడా వదలలేదు. చార్లెస్‌ మోడరన్‌ టైమ్స్‌ ద్వారా ప్రారంభమైన దాడి, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఒక సభలో రష్యన్‌లను సమర్ధిస్తూ, యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడతాడు. దీనితో చార్లెస్‌పై అమెరికా దాడి పెరిగింది. దాడి ఎంతగా సాగిందంటే చివరకు ఆయన ఆదేశాన్ని విడిచిపోవాలని నిర్ణయించుకున్నాడు. అమెరికా ప్రభుత్వం చార్లెస్‌కు కమ్యూనిస్టు ముద్రవేసి రీ-ఎంట్రీ అనుమతి కూడా ఇవ్వలేదు.

 

చార్లెస్‌ తీసిన ప్రతి సినిమాలోనూ మానవతాదృక్పథం, సమకాలీనత, సమస్యలపై స్పందన కనిపిస్తాయి. ఆయన తీసిన ప్రతి సినిమా ప్రజలను ఆలోచింపజేసేదిగా ఉంటుంది. ఒక సినిమాలో (దిగ్రేట్‌ డిక్టేటర్‌) ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ మన విజ్ఞానం మనల్ని అనుమానాల పుట్టలుగా మార్చిందని, మన తెలివితేటలు కఠిన హృదయాలుగా మార్చాయని, మనం ఎంత ఎక్కువగా ఆలోచిస్తున్నామో అంత తక్కువగా స్పందిస్తున్నాం అంటారు.

ప్రపంచాన్ని గడగడలాడించిన రెండవ ప్రపంచ యుద్ధానికి కారకుడైన నరరూప రాక్షసుడు అడాల్ఫ్‌ హిట్లర్‌ను ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టే ఉద్దేశంతో తీసిన సినిమా ''ది గ్రేట్‌ డిక్టేటర్‌''(1937). ఆవిధంగా సామ్రాజ్యవాద వ్యతిరేకిగా, ప్రపంచశాంతి కోసం తపించిన మానవతావాదిగా, దోపిడీకీ వ్యతిరేకంగా పోరాడిన పేదల పక్షపాతిగా, మహా కళాకారుడిగా చార్లెస్‌ నిలిచిపోతాడు.''భౌతిక పరిస్థితులు మారనంతకాలం జీవిత వాస్తవాలు మారవు'' అంటాడు. అందుకేనేమో అతని సినిమాలో ''కళా విలువలు-వాస్తవికత'' రెండూ కనిపిస్తాయి.

-కర్లపాలెం హనుమంతరావు

 

Friday, October 1, 2021

ఆంధ్ర శిల్ప కళ - కర్లపాలెం హనుమంతరావు

 


రాళ్ళలో చెక్కినవి, రంగులతో పూసినవి రూపకళ కిందకొస్తాయి,

ఆంధ్రుల రూపకళ ప్రపంచ వ్యాపితం; విశ్వరూపకళతో ప్రభావితమైన భారతీయ రూపకళ ద్వారా  ప్రకటితమవుతుంది కనుక.


మనషి రూపాలను కల్పన చేసే గుహకళకు సుమారు 30 వేల సంవత్సరాల చరిత్ర ఉంటుందంటారు! మధ్యప్రదేశ్ హోషంహాబాద్ గుహకళ ఈ ఊహకు కారణం. అక్కడి రూపకళ స్పెయిన్ దేశపు గుహచిత్రాల ప్రభావితం.


చూసే దానికి నకలు తయారుచేసే తపన మనిషికుండే  స్వాభావిక లక్షణం. ఆ లక్షణం నుంచి పుట్టుకొచ్చిందే రూపకళ. 


ఆదిమానవుడుకి జంతువుల కొవ్వు, రక్తం గోడరాతలకు ఊతంగా ఉపయోగించాయి. ఒక జంతువు రూపం కల్పించి దానిలో బల్లెం గుచ్చినట్లు చిత్రిస్తే అడవిలోని ఆ తరహా జంతువు సులభంగా చస్తుందనే సంకేతం ఇచ్చినట్లన్నమాట.


ఒక ప్రయోజనం కోసం ప్రారంభమైన చిత్రకళ క్రమంగా సౌందర్యకళగా మారిన క్రమం అర్థమయితే అబ్బురమనిపిస్తుంది. కాని, మొహంజొదారో నాగరికతకు ముందున్న ఈ చిత్రకళ క్రమపరిణామానికి చెందిన చారిత్రక ఆధారాలేవీ ఇప్పటి దాకా లభ్యమయ్యాయి కాదు. 


ఆర్యులకు సభ్యత మినహా మరేమీ తెలియని మొహంజొదారో నాగరికత ముందు కాలానికే ద్రవిడులలోని సభ్యత చాల ఉన్నత స్థితి అందుకున్నట్లు చరిత్ర చెబుతున్నది. కాకపోతే ఆంధ్రులు ఆర్యులా, ద్రవిడులా అన్నది ఒక ప్రశ్న. రెండు తెగల సమ్మిశ్రితం అన్న వాదనలోనే నిజం పాలు ఎక్కువ.


ఆంధ్రులుగా భావింపబడిన శాతవాహనులు క్రీ.పూ ఒకటి, రెండు శతాబ్దాల నుండి క్రీ.శ ఒకటి రెండు శతాబ్దాల దాకా భారతదేశాన్ని పరిపాలించారు. వారి పాలన కేవలం ఆంధ్రభూమి వరకే పరిమితం కాదు. మగధ వరకు విస్తరించి ఉంది.


అజంతా గుహలలోని మొట్టమొదటి గుహ ఆంధ్రుల సృష్టే. అట్లాగే సాంచీ స్తూప ప్రాకార నిర్మాణం కూడా. అక్కడి ఆ గుహకళ ఒక దృశ్య సంగీతం. తెలుగు శిల్పుల పోగారింపుపని ప్రతిభ విమర్శకుల వేనోళ్ల పొగడ్తలకు పాత్రమయింది.


శిల్పికి చిత్రకళ ప్రావీణ్యం అవసరం. చిత్రకళకు నాట్యకళ నేర్పరితనం, నాట్యకళకు సంగీత జ్ఞాన నిష్ణాణత, సంగీత జ్ఞానానికి సాహిత్య మర్మం అవసరం. వెరసి శిల్పి కాదల్చుకున్న వ్యక్తి బహుముఖ ప్రజ్ఞ అలవరుచుకోవలసి ఉంది.

 

ఇక్ష్వాకుల కాలంలో నాగార్జున కొండ వెలసింది. ఆ కొండ నిర్మాణంలో ఆంధ్ర శిల్పులదే సింహభాగం. కొందరు అనుకున్నట్లు నాగార్జునుడు ఆంధ్రుడు కాదు. ఇక్కడి విశ్వవిద్యాలయంలో ఆచార్యకత్వం నిర్వహించేందుకు విచ్చేసిన బీరారు ప్రాంతీయుడు.


ఇక్ష్వాకులకు అసలు చిత్రకళ ప్రవేశమే లేదు. వీరి తదనంతరం వచ్చిన పల్లవుల చలవే రూపకళ వికాస దర్శనం. ఆంధ్ర శిల్పుల కళ్లు ఒక్క ప్రాంతానికి పరిమితం కాదనడానికి పల్లవులు నిర్మించిన మహాబలిపురమే ఒక ఉత్కృష్ట ఉదాహరణ. తమ పరిసరాలను, పశుపక్ష్యాదులను శిలలపై చిత్రించిన ఆంధ్రుల శిల్పకళ అపూర్వం.


తదనంతరం వృద్ధిలోకి వచ్చిన ఆదర్శవాదం కాకుండా మహాబలిపుర శిల్పకళలో వాస్తవిక వాదం చోటుచేసుకోవడం విశేషం. ఆంధ్ర శిల్పుల వాస్తవిక వాద చిత్రకళ ఒక్క అజంతా కుడ్య చిత్రాల మీదనే కాకుండా పుదుక్కోట సంస్థాన పితన్న దేవాలయం గోడల మీది బొమ్మలు మీదా కనిపిస్తుంది. కాకపోతే ప్రపంచం దృష్టిని విశేషంగా ఆకర్షించింది మాత్రం అజంతా కుడ్య చిత్రకళ.


స్నాయుపుష్టి(శరీర ఆంతరంగిక నిర్మాణం), దేహయష్టి రెండూ పుష్కలంగా ఉండే గ్రీకో-గాంధార కళ కొట్టొచ్చినట్లు కనిపించే ఈ గుహకళ వాస్తవానికి ఆంధ్రులది కాదు. గ్రీక్ దేశం వెళ్లి మనవాళ్లే నేర్చుకున్నారో, మనవాళ్ల దగ్గరకొచ్చి గ్రీకులే నేర్పారో.. ఆధారాలు దొరకలేదు ఇప్పటి వరకు.

 

కళింగగాంగుల కాలంలో స్థూపకళ విస్తృతంగ వర్ధిల్లింది. వీరి జమానాలో నిర్మితమయిన కోణార్క దేవాలయంలో కూడా ఆంధ్ర శిల్పుల ఉలి చప్పుళ్లే ఎక్కువ. పల్నాడులో కనిపించే గోలిశిల్పం నాగార్జునకొండ, అమరావతి శిల్పాలకు తోబుట్టువు. ఈ విలువైన శిల్పాలన్ని ఇప్పుడు విదేశీయుల అధీనంలో ఉన్నాయి. స్వాతంత్ర్య సంపాదన కాలంలో బ్రిటిష్ దొరలతో   విస్తృతమైన ఒడంబడికలు జరిగాయి. కాని వేటిలోనూ విలువైన మన శిల్పాలు తిరిగి ఇచ్చే విషయం ప్రస్తావనకైనా రాలేదు.  విచారకరం.

 

భారతీయ చిత్రకళకు జహంగీర్, షాజహాన్ పాలనా కాలం స్వర్ణయుగం. షాజహాన్ ప్రత్యేకంగా శిల్పులను రావించి పరిసరాలలోని వస్తువులను  చిత్రించే వాస్తవిక వాదాన్ని ప్రోత్సహించాడు.


చిత్రించే క్రమంలో కన్ను వస్తువును చూపే క్రమాన్ని యథాతథంగా చిత్రించడమే వాస్తవిక వాదం. పెద్ద కొండ అయినా దూరం నుంచి చిన్నదిగాను, చిన్న పూలమొక్క అయినా దగ్గర నుంచి పెద్దదిగాను కనిపిస్తుంది. మన చిత్రకారులు ఈ దృష్టి క్రమాన్ని పట్టించుకోకుండా పెద్ద కొండను ఎప్పుడూ పెద్ద పరిణామంలోనూ, చిన్ని మొక్కనూ అట్లాగే చిన్ని పరిణామంలోనూ చిత్రించే కళకు ప్రాధాన్యమిస్తారు. కాబట్టి, భారతీయ చిత్రకారులకు దృష్టి క్రమం (పెర్ స్పెక్టివ్) తెలియదనే వాదు ఒకటి ఉంది. ఇది పడమటి దేశాలలో అనుసరించే యథార్థవాదానికి విభిన్నమైన ఆథ్యాత్మిక వాదం. పునరుజ్జీవ యుగానికి ముందు పశ్చిమ దేశాలలో కూడా తమ చిత్రాలలో మూడ తలాలు కాకుండా ఒకే తలం చూపించేవారు.


మన దేశంలో కొంతకాలం చిత్రకళ్ల పూర్తిగా స్థంభించిపోయింది. ఆంధ్రుల కళా అందుకు మినహాయింపు కాదు. స్వాతంత్ర్య ఉద్యమంతో పాటు చిత్రకళలో కూడా ఒక ఉద్యమం అలలాగా ఎగిసిపడటంతో తిరిగి ఆంధ్రుల కళకు జీవమొచ్చింది. 


ఆంధ్రదేశంలో మూడు ప్రధాన శాఖలున్నాయి; రెండు బెంగాలీ శాఖలు, ఒకటి బొంబాయి శాఖ. అడవి బాపిరాజు వంటివారిది ఒక శాఖ, శ్రీ దేవీ ప్రసాదరాయ్ వంటివారిది రెండో శాఖ. ప్రసిద్ధ చిత్రకారుడు దామెర్ల రామారావు వద్ద విద్య నభ్యసించిన శిష్యపరంపర ప్రవేశపెట్టిన  బొంబాయ్ శాఖ మూడవ రకానిది.


చిత్రకళకు ఏ కొద్దిగానో ప్రోత్సహమున్నది. కాని, మూర్తికళను పట్టించుకునే నాథుడు ఆంధ్రదేశంలో నాడూ లేడు, నేడూ లేడు. గుంటూరు జిల్లాలోని పురుషత్ గ్రామంలో ఈ మూర్తికళ మీద ఆధారపడి జీవించే ముస్లిం కుటుంబాలున్నా.. అదే ఆదరువుగా జీవితం గడిపే పరిస్థితులు  లేవు. కుడ్య చిత్రకళ  కనుమరుగవుతున్న  అమూల్య సంపదల జాబితాలోకి క్రమంగా జారిపోతోన్నది అనేదే ఆఖరి చేదు సత్యం.


(సంజీవ దేవ్ వ్యాసాలు- ఆంధ్ర శిల్పుల రూపకల్పన ఆధారంగ)

-కర్లపాలెం హనుమంతరావు

02 -10 -2021

బోథెల్;  యూ.ఎస్.ఎ

 

 

Tuesday, February 25, 2020

మీర జాలగలడా నా యానతి వ్రతవిధాన మహిమన్!





శ్రీస్వర్గానికి వెళ్ళి, వేయికన్నుల దేవరతో పోరు సలిపి మరీ సాధించుకున్న పారిజాతమూ, ప్రతిష్ఠ రెండూ సవతి ముందు వెలతెలపోతే సత్యభామలాంటి స్వాధీనపతిక ఊరకుంటుందా?  అన్నింటికంటే మిన్న, ఏడేడు లోకాల రేడు అయిన తన పతిని ఐశ్వర్యం ధారపోసైనా దక్కించుకుంటుంది. వ్రతవిధానమహిమ వలన తాను గీసిన గీటు దాటని కృష్ణుని ఊహించుకుని మురిసిపోతుంది.

"మీరజాలగలడా నాయానతి.." అని వ్రతఫలితాన్ని ముందే కళ్ళకు కట్టించుకుని ఆనందించే సత్యభామకు ఎన్నో తెలుసు. అన్నీ తెలుసు. నటన సూత్రధారి తన చేతికే కాదు, ఎవరికీ చిక్కడని ఆమెకు తెలుసు. అయినా సరే.. నోము పూని కట్టేసుకుందామని ఆశ! ఎంత ప్రియమైన పూనికో కదా ఆమెది? అన్నీ తెలిసీ దేనికీ అమాయకత్వం? అదే ఆమెకు కృష్ణునిపై గల గాఢానురాగానికి గీటురాయి.

మనోహరుని చేరుకునేందుకు మమతల వారాశిని ఈదేందుకు తనతో మరెవరూ పోటీ లేరని నొక్కి చెప్తోంది. సత్యభామకు తన ప్యత్యర్థి పేరు పలకడం సైతం ఇచ్చగించ లేదు. "వైదర్భికి.." "అదిగో.. వాళ్ళమ్మాయి ఉందే..!" అని ఈసుగా మాట్లాడినట్టే! సవతిపై ఆ మాత్రం అయిష్టం ఉండాలి మరి! ఉంటేనేగా ఉమ్మడి సొత్తు మీద తనకున్న పట్టుదల, తన ఆభిజాత్యమూ బయటపడేది. ఆఖరికి సత్యాపతి కూడా తనతో వాదులాడి ఆమెను వెనకేసుకురాడని ధీమాగా చెప్తోంది. "సత్యాపతి" అంటూ ఎంత గోటు ఒలకబోస్తోందో!
గీర్వాణమే కానీ ఈ భామ మనసులో ఇంకేం లేదని పొరబడేరు! వ్యయప్రయాసలకోర్చి ఈ నోము దేనికి..? మధుర మధుర మధురాధిపతిని కైవసం చేసుకునేందుకు. కృష్ణుని ప్రణయ సామ్రాజ్యానికి ఆధిపత్యాన్ని కోరుకుని కదూ! ఆ ఊహకే ఆమె మనసు ఎంత మైమరచిపోతోందో.. ఒక్క మధురమైన వాక్యంతో కనులముందు నిలిచే రాసక్రీడ "మధుర మధుర మురళీగాన రసాస్వాదనమున అధరసుధారసమది నే గ్రోలగ.." వేణువల్లే కన్నయ్య పెదవిని చేరి చెంగలించాలనే కాంక్ష!  "నేనంటూ వ్రతమూనాక, నేనంటూ ముద్దుముద్దరలేసాక.. నన్ను వదిలి పోగలడా?" అని అణువణువునా స్థైర్యమే! ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు రూపం సత్యభామ.
"స్థానం నరసింహారావు" రచన, సుమసౌకుమార్యమే కాక కాసంత పొగరూ, వగరూ.. అంతకు మించి ప్రియునిపై పట్టలేని ప్రేమా ఉన్న ప్రియురాలి మనసుకు అద్దం! చలనచిత్రం కోసం వ్రాసిన గీతం కాకపోయినప్పటికీ సినీవినీలాకాశంలో అందాల జాబిల్లి.
మీర జాలగలడా నాయానతి
వ్రతవిధానమహిమన్ సత్యాపతి
నటన సూత్రధారీ మురారీ
ఎటుల దాటగలడో నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
సుధాప్రణయ జలధిన్ వైదర్భికి ఈద తావుగలదే నాతోనిక
వాదులాడగలడా సత్యాపతి
మధురమధుర మురళీగాన రసాస్వాదనమున
అధర సుధారసమది నే గ్రోలగ
మీరజాలగలడా నాయానతి
వ్రతవిధానమహిమన్ సత్యాపతి
(సోర్స్ః కొత్తావకాయ బ్లాగ్)
అయితే ఈ 'మీర జాలగలడా నాయానతి/వ్రతవిధానమహిమన్ సత్యాపతి' పాట పుట్టుకను గురించి ఇదిగో స్థానం నరసింహారావుగారే స్వయంగా తన 'నటస్థానం' లోచెప్పిన ఈ ముక్కలు చదవండి.. ఆసక్తికరంగా ఉంటాయ్!
(సోర్స్ః ఆదివారం ఆంధ్రజ్యోతి- అనుబంధం మొదటి పేజీ- బహుళం -17 ఏప్రిల్ 2011 సంచిక నుంచి)
సేకరణః కర్లపాలెం హనుమంతరావు
25 -02 -2020

Friday, January 24, 2020

కళ కళ కోసమే కాదు - కళాభిమానం కళ కోసమే కర్లపాలెం హనుమంతరావు




సౌందర్యాన్ని  విజ్ఞాన శాస్త్రంలోలాగా నిర్వచనంలో బంధించలేం. ఒక్కొక్కరికి ఒక్కో  చిత్రం, ప్రకృతి దృశ్యం, జీవితం, సాహిత్యంలోని ఓ విభాగం ఒక్కో కారణం వల్ల ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఒకరి ఆకర్షణకు కారణం వాళ్లే చెప్పగలరే తప్పించి, వేరే వారు ఆ ప్రయత్నం చేసినా నూరు శాతం న్యాయం చేయలేరు. వాల్టరు అన్న ఈ మాటనే. కాళిదాసూ దుష్యంతుడి పాత్ర  ద్వారా వెలిబుచ్చడం ఆశ్చర్యం కలిగించదు. మేధావులు వేరే వేరే ప్రదేశాలలో ఉన్నప్పటికి ఒకే తీరులో ఆలోచనలు కొనసాగిస్తారన్న నానుడి ఉండనే ఉంది కదా! రమ్యమైన వస్తువులను వీక్షించడం,, మధురమైన శబ్దాన్ని ఆలకించడం పర్యుత్సకతకు దారి తీస్తుంది. జననాంతర సౌహృదాలు జ్ఞప్తికి వస్తాయని కాళిదాసు భావన.  ఓంకారనాథ ఠాకూరు నీలాంబరి’, సైగల్ 'దాబుల్ మోరా'  ఇదే తరహా భావాలను సమర్థిస్తాయి.

కాళిదాసు దృష్టిలో 'రమ్యాణి' అంటే సౌందర్యమే. ప్రతీయ మానం పునరన్య దేవ/ వస్త్వస్తి వాణీషు మహాకవీనా/యత్తత్ ప్రసిద్ధావ యవాతి రిక్తం విభాతి లావణ్య మివాంగనాసు- అంటాడు కదా ఆనందవర్థనుడు! లావణ్యాన్ని కావ్యగత సౌందర్యంగా  ప్రతిపాదించే మాట ఇది.

 అసలు లావణ్యం అనే శబ్ద స్వరూపమే విచిత్రంగా ఉంటుంది. లవణం- లావణ్యం దగ్గర దగ్గర సంబంధం కలవిగా అనిపిస్తాయి కదా! నిజానికి కూడా ఆ రెండింటి మధ్యనా సంబంధం లేకపోలేదు.  స్ఫటికం ఆకారంలో ఉంటుంది లవణం. ఆ ఆకృతిలోనే అంతర్లీనంగా కాంతులీనే లక్షణం కద్దు.  కాంతులీనే ముత్యం స్ఫటికాకారంలో కనిపిస్తుంది. కాబట్టే దానికి ఆ మెరుపులీనే విశిష్ట లక్షణం. అయితే ఆ ఆకర్షణ ఎక్కడి నుంచీ? అంటే సమాధానం కష్టమే! . పాలరాయికి ఉండే షీన్ కూడా  ఇలాంటిదే.

అంతు చిక్కని అంశాన్ని ఓవెన్ దార్ 'ఫీల్డ్' కవితలో 'ప్రికేరియస్  ఎలిమెంట్ ఇన్ పొయిట్రీ' గా సరిపెట్టుకున్నాడు. గ్రీకు భావాల బట్టి చూస్తే కళోస్ లక్షణాలు ఐక్యత, అవయవాల అబురూప్యత(రూప నిష్పత్తి) లో ఉంటుంది. లావొకూన్ రూపం, బీతోవెన్ నవమస్వర సమ్మేళనం, యూక్లిడ్ రేఖా గణితం, గ్రీకు త్రాసదరూపకాలూ సౌందర్యవంతంగా కనిపించడానికి ఈ రూప నిష్పత్తులే సమన్వయమే మూలమని గ్రీకుల భావిస్తారు.

విడి విడిగా అందంగా ఉండే వస్తువులన్నింటినీ ఒక చోట కుప్ప పోస్తే అందంగా ఉంటుందా? అంటే.. ఏమో ఉంటుందని.. ఉండదని ఏదీ చెప్పలేం.  

తలిసెట్టి వారి ప్రబంధనాయిక కార్టూనులాగా కనిపిస్తుంది. కారణం ఎవరు చెప్పగలం?  అళినీ లలాక, కమలాక్షి, చంద్రానన, పల్లవపాణి, బిసబాహు, చక్రస్తని, సింహమధ్య, పులిన జఘన, రంభోరు- లంటూ ప్రబంధకవులు పదబంధాలతో కుస్తీలు పట్టడానికి ముందే తిక్కన వస్తువులను కాకుండా వస్తువుల సౌందర్య సారాన్ని  మాత్రమే విడదీసి  నెత్తమ్మి రేకుల మెత్తదనం(పాదం), చక్రవాకాల  చందం(స్తనాలు), చందురు నునుకాంతి(ముఖం), అళికులంబుల కుప్ప(జడ)లతో  ద్రౌపదీదేవి సౌందర్యాన్ని వర్ణిస్తాడు. అందుకే అనేది.. సౌందర్యానికి సార్వత్రిక సూత్రం సాధ్యం కాని పని.. అని. ఏ కళా ఖండానికి ఉండే విశిష్టత ఆ కళాఖండ సౌందర్య పటిమను బట్టి  ఉంటుందనేది సారాంశం.

సౌందర్యం వస్తువును బట్టి ఉంటుందా? వస్తువులోని అనిర్వచనీయమైన లక్షణాన్ని బట్టి ఉంటుందా? అని ఎవరైనా ఓ సందేహం లేవదీస్తే?

 పర్షియా రాజు  'లైలా ఏమంత అందంగా ఉంటుందని ఈ పిచ్చి పోకడలు?' అని ఎద్దేవా  చేస్తే 'రాజా! నా కళ్ళతో చూస్తేగాని నా బాధ నీకు అర్థం కాదు' అని మజ్నూ బదుకిస్తాదు. 'తా వలచింది రంభలాంటి సామెతలు సౌందర్య ఆత్మాశ్రయ తత్వాన్ని తెలియ చేస్తూ పుట్టుకొచ్చినవే!  

చూసే కళ్లను బట్టి సౌందర్యం మారుతుంటుంది. సమయ సందర్భాలను అనుసరించి కూడా! ముళ్లమధ్యలో ఉన్నా రోజాపూవు  అందంగానే ఉంటుంది. ఎడారిలో కాసినా వెన్నెల వెన్నెలేసౌందర్యం చర్మదఘ్నం అన్నారు.చప్పట్లు కొట్టేందుకు రెండు చేతులూ చాలవు. ఆకర్షణ ఐనా వికర్షణ ఐనా రెండు ధృవాల మధ్య కలిగే స్పందన. ఒక వస్తువు , ఒక వ్యక్తి సౌందర్య భావనకు ఆ విధంగానే తప్పని సరి.

 

సౌందర్యం వస్తువులో ప్రతిష్టించిన పదార్థమా? మనిషి దానికి ఇచ్చే విలువ పైనా ఆధారితమా? అని మళ్లీ మరో  సందేహం రావచ్చు. అరటి పండులోని తీపిదనం వస్తు నిష్ఠం. 'మధురాధిపతే రఖిలం మధురం'   విలువను ప్రతిపాదించే సూక్తివజ్రం,, బొగ్గు- ఒకే తరగతివి అయినా వజ్రానికి బ్రిటిషు రాణి తలపై స్థానం లభించింది. ఇక్కడ బొగ్గు కన్నా వజ్రానికి మనిషి ఎక్కువ విలువ ఇవ్వబట్టే కదాఏ కారణం చేత అట్లాంటి విలువ ఇవ్వడం.. అన్న ప్రశ్న వచ్చినప్పుడు అరుదైన లభ్యత వల్ల అని కొంత మంది జవాబు చెబుతారు. సబబే అనిపించినా .. అన్ని సందర్బాలకూ  అదీ వర్తించదు. మహాత్మా గాంధీ వాడి వదిలేసి పోయిన బొడ్డు గడియారాన్ని, విరిగిన చేతికర్రను వేలానికి పెడితే విరగబడి ఎక్కువ ధరకు కొనుక్కున్న సందర్భాలు మనం చూస్తున్నాం. బాలాపూర్ వినాయకుడి లడ్డూ ప్రతీ ఏటా లక్షల ఖరీదు పెట్టి కొనుక్కునే హిందూ విశ్వాసులు కద్దు. అదే లడ్డును ముస్లిములు ఇరవై రూపాయలకు తీసుకోమన్నా తీసుకోరు కదా? 'మహాత్మ' అనే చిత్రంలో ఒక సేఠు తులసీ రామాయణాన్నిరద్దీవాలాకు రెండు కాసులకిస్తే.. ఆ  పేపరువాలా దాన్ని మిఠాయి కొట్టుకు వేయకుండా కళ్ళకద్దుకుని దేవుడి మందసంలో ఉంచుతాడు. ఒకడు పక్కా వ్యాపారి ఐతే..ఇంకొకడు భావుకత్వం ఉన్న వ్యాపారి. వస్తువుల సౌందర్యం - విలువలు కూడా సాపేక్ష లక్షణాలు కలవని చెప్పడమే ఇక్కడ ఉద్దేశం.

అయితే సౌందర్యాన్ని అందరూ సొంతం చేసుకోవాలని , అనుభవించాలని, హక్కుదారులుగా ఉండాలని ఎందుకు కోరుకోవడం? సౌందర్యం అభిలషణీయమైన వస్తువుగా గుర్తింపబడటానికి మనిషి ప్రోద్బలించే లక్షణాలు ఏవి? అన్నది కూడా ఆసక్తి కలిగించే చర్చనీయాంశమే!

తిలక్ 'నా కవిత్వంలో' తన అక్షరాలను 'కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు, ప్రజా శక్తుల ప్రవహించే విజయ ఐరావతాలు, వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు'తో ఎందుకు పోల్చుకున్నాడో కనిపెడితే సమాధానం దొరుకుతుంది.  'చీకటిలో అలమటించే వికారపు పిల్లలను ఎవరు తలుచుకుంటారు?' అని శిబితో గద్ద మొర పెట్టుకుంటుంది. అందం, ఆనందం మాత్రమే ఎందుకు కావాలి మనుషులకు? అన్నమయ కోశంతో ఆరంభమైన  ఉపనిషత్తులూ ఆనందమయ కోశం దగ్గరికొచ్చిన తరువాత ఆగిపోతున్నాయి.ఆ తరువాత ఏముంది? అని అడిగితే

'ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్' అని సమాధానాలు  దాటేస్తున్నాయి. కీట్సు 'అందమైన వస్తువు సదా ఆనందదాయకం' అన లేదూ?

కావ్యం నుంచి వచ్చే ఆనందాన్నే మమ్మటుడు 'సద్యః పర నిర్ వృతయః' అన్నాడు. 'కావ్యం హ్లాదైక మయీం'. కళల్లోని ఈ ఆనందవాదం విశ్వతోభిముఖంగా వ్యాపించి ఉంది. మనిషి పుట్టుక ముందు నుంచే ప్రకృతి తన చలనానికి ఈ సౌందర్యాన్ని, ఆకర్షణ వికర్షణల్ను ఉపకరణాలుగా వాడుకుంటూనే ఉంది. పరభృతాల ఆకర్షణకై పూవులకు ప్రకృతి ఆకర్షణీయమైన రంగులు ఎందుకు అద్దుతుందో అర్థం చేసుకొంటే సృష్టి చాలనంలో సౌందర్యం పాత్ర ఎంతో బోధపడుతుంది.

రసపాక సిద్ధాంతాలు వంట యింటి నుంచి పుట్టుకొచ్చాయి. భోగలాలసత నుండి రామణీయకత,  శయ్యా వాదాలు వెలికి వచ్చాయి. అలంకారవాదం దేహాభిమానం వల్ల వచ్చింది. వక్రోక్తి, ధ్వని వాదాలకుమూలం పగటి వేషగాళ్ల ప్రలాపాలు. ఒక్క ఔచిత్య విచారం మాత్రం ఆనందాన్ని ప్రతిపాదించటం లేదు. పైపెచ్చు సంతోషాన్ని సంహరించే  గుణం దానికి ఉంది. జనం తమాషా కథలు చెప్పుకుని నవ్వుకుంటుంటే 'నాకు నచ్చలేదు' అని గుడ్లురిమి నోరుమూయించే విక్టోరియా మహారాణి పెడసరి వైఖరి ఇలాంటిదే.

'పిబరే రామ రసం' అంటే ఏమిటి? సౌందర్య రస పిపాసువులు అంటే ఏమిటి? అందాన్ని అనుభవిస్తే ఆనందం ఎందుకు కలుగుతుంది? ధర్మరాజుకి కర్ణుడు అన్న అని తెలిసిన తరువాత మాత్రమే ఆ ఏడుపులు ఎందుకు? పాట్రొకస్ మరణ వార్త విన్న అక్లీజు ఆవేదన సంగతో? తానాజీ శవాన్ని చూసి శివాజీ అంగలార్పడం ఎ బంధాన్ని సూచిస్తుంది? అ దుఃఖాలు  ఆనంద దాయకాలు ఎలా అయ్యాయి?! భవభూతి ఉత్తర రామ చరితంలో మాత్రం? సీతాపహరణం, జటాయు వధ వంటి దృశ్యాలను చూసి సీత అలా మూర్చ పోవడం ఆనందదాయకాలు ఎలా అవుతాయి? దానికీ ఒక త్రాపద సిద్ధాంతం లేవదీసాడు అరిస్టాటిల్. భయానక, కరుణ  దృశ్యాలు బాగా భయపెట్టి, ఏడిపించి కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి కాబట్టి వత్తిడి నరాలకు ఉపశమనం కలిగి మనసులు కడిగి ఆరబోసినట్లు తేలిక పడి ఆ నిర్మలత్వం ఆనందాన్ని కలిగిస్తుందని ఆయన సిద్దాంతం. తమాషాగా ఉంది కదూ!

పాశ్చాత్యుల్లో జార్జి సంతాయనా, వాల్టరుపాటర్ ఆనందవాదులుగా ప్రసిద్ధులు. ఆనందమనేది స్వార్థ రహితంగా, బహుజన సేవ్యంగా ఉండాలని వీళ్ల వాదం. కళాభిమానం కళ కోసమే అయి ఉండాలన్నఆ వాదనను తప్పు దారి పట్టించి 'కళ కళ కోసమే' అని ఆయన అన్నాడన్నట్లు  వక్ర భాష్యాలు వ్యాపించడమే సౌందర్యాత్మక కళారంగానికి కలిగిస్తున్న పెద్ద నష్టం. 

-కర్లపాలెం హనుమంతరావు

Wednesday, October 15, 2014

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 





Sunday, February 14, 2016

సృజన


సృష్టి-పునఃసృష్టి జీవనం కొనసాగింపు  సహజచర్య. మానవేతర జంతుజాలం తమలాంటి జీవులను మాత్రమే సృష్టించ గలిగితే… ఇతర  రూపాలనూ, శబ్దాలనూ సృష్టించే ప్రతిభ మనిషిది. సంతాన సృష్టికి ప్రతిభతో పని లేదు.అవి జంతుజాలాలూ చేసే సృష్టికార్యమే. ఇతరేతర శబ్ద, రూపాల పునఃసృష్టికి ప్రతిభ తప్పనిసరి. ఆ  ప్రతిభనే మనం సృజనగా గుర్తిస్తున్నాం.  ఆ శక్తి గలవారిని  సృజనశీలురు, స్రష్టలు అంటున్నాం.
కళాకారులందరూ స్రష్టలే. కాని అంతకన్నా ముందు మానవులు. అలాగని మానవులందరూ కళాకారులు కాదు. కాలేరు. కొద్దో గొప్పో ప్రతి మనిషిలోనూ పిసరంతైనా కళంటూ ఏదో ఒకటి దాగుండక పోదు కానీ..ఆ కళేదో బహిర్గతమైనప్పుడే అతనికి    కళాకారుడిగా గుర్తింపొచ్చేది.
సుప్రసిద్ధ పాశ్చాత్య దార్శనికుడు డిస్కార్టిస్టు ‘ఆలోచనను బట్టే ఉనికి’ (Cogito ergo sum)సిద్ధాంతం ప్రకారం మనిషి సృజనశీలి కన్నాముందు బుద్ధిజీవి.   ప్రస్తుతం ప్రచారంలో ఉన్న అస్తిత్వసిద్ధాంతం దీనికి బద్ధ వ్యతిరేకి.  ‘I exist.. therefore I think’ అంటుంది అస్తిత్వ వాదం. ఈ వాదం ప్రకారం మనిషి బుద్దిజీవికన్నా ముందుగా సృజనశీలి.  జెన్ తత్త్వం, మన  భారతీయుల భక్తి యోగాలకూ రసవాదంతోనే చుట్టరికం. హేతువు
కన్నాముందు  అనుభూతికే మనిషి ప్రాధాన్యత ఎందుకిస్తాడు?- ఇది అంతుబట్టని రహస్యం.  కానీ సృజన అంటే మాత్రం స్థూలంగా ఒక అభిప్రాయానికి రావచ్చు. శ్రీశ్రీ ‘దివ్యానుభూతి’ ఖండికలో మాదిరి కవితాత్మకంగా చెప్పాలంటే  అదొక
సంకుల పయోధర  చ్చటా పంకిల నిబి
డాంధకార నిర్జన వీధికాంతరముల
నా చరించెడు వేళ ప్రోన్మత్త రీతి,
అవశ మొనరించు దివ్యతేజోనుభూతి’.
లేని దాన్ని సృష్టించడం, ఉన్నదాన్ని మరో రూపంలో సృష్టించడం, చూసిన వాటిని చూడని వాటిల్లోకీ, చూడని చూడలేని వాటిని చూసిన వాటిల్లోకి తర్జుమా చేసి  తన్మయత్వం చెందటం, తోటివారినీ తన్మయపరచడానికి  ప్రయాస పడటం.. సృజనశీలత  కొన్ని  ప్రధాన  లక్షణాలు.
సరసియై చల్లనై నన్ను జలకమార్చె,
నందన నవ నీలతాంత కాంతస్రజమ్ము
గా నొక క్షణమ్ము నామెడ కౌగలించె’
అని మహాకవొచ్చి మొత్తుకున్నా సరే ‘ఎవరా ‘సరసి’ మహానుభావా?’ అని మాత్రమే వివరాలడుగబోతాడు శుద్ధ లౌకికుడు. లౌకికులకు ఒక పట్టాన అంతు పట్టని వింత చేష్టలింకా ఇలా చాలానే ఈ అలౌకిక ప్రాణుల్లో ఉంటుంటాయి మరి. నిశ్శబ్దం విసుగెత్తినప్పుడు  శబ్దాన్ని సృష్టించటం, శబ్దం ఎక్కువైనప్పుడు నిశ్శబ్దాన్ని ఆశ్రయించడం ఈ అలౌకిక లక్షణాలే. ఈ అలౌకిక మహాశయుడు శబ్దాలకేవో అర్థాలు కల్పించి కవిత్వమంటాడు. ఎక్కడా లేని ఓ ప్రత్యేక నాదాన్ని సొంతంగా సృష్టించుకుని  రాగాలాపనలోకి జారుకుంటాడు.  కొత్త లయలూ, భంగిమలూ, కదలికలూ కనిపెట్టి నృత్యం పేరుతో సొంత లోకంలో విహరిస్తుంటాడు. అనుకరణే కావచ్చు కానీ అనుసృజన అనిపించే చిత్రాలు, శిల్పాలు సృష్టించుకుని మురుస్తాడు. కవిదీ అదే వరస.’భావ మనియెడు నెత్తావి బలిసియున్న-మేలు రేకుల విప్పారు పూలు మేము’ అంటూ వాస్తవ జగత్తును అనుసరిస్తూనే   కొత్త కొత్త పదాలతో, వ్యక్తీకరణలతో  నూత్నప్రపంచమొకటి  సృష్టించుకుని అందులో  ఆనందాలను వెదుక్కుంటాడు. అనుకరణ కన్నా అనుసృజన మానుషకళలోని  చెప్పుకోదగ్గ గొప్ప ప్రజ్ఞావిశేషం.
అస్తిత్వ సిద్దాంతాన్ని పైపైన చూస్తే మాత్రం-  ప్రజ్ఞ, విజ్ఞానం అభాసాలంకారాల్లాగా ఎడపెడగా అనిపిస్తాయి కానీ అది నిజం కాదు.  మహా మేధావి ఆల్ బర్ట్ ఐన్ స్టీన్ వయోలిన్ బ్రహ్మాండంగా వాయిస్తాడు. ప్రఖ్యాత అణుశాస్త్రవేత్త భాభా చిత్రకళ ప్రావీణ్యం అత్యద్భుతం. అమెరికా మాజీ అధ్యక్షుడు ఐసెన్ హోవర్బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి చర్చిల్ చక్కటి ప్రకృతి చిత్రకారులు. కళాభినివేశమంటూ మెలుకువతో ఉండాలే గానీ బుద్ధి ఏ రంగంలో పనిచేస్తున్నా  సృజనతృష్ణ( creative urge) మరో రూపంలో  బైటపడి తీరుతుంది. ‘సృజనశీలత ఆయాచిత వరంగా దక్కిన అదృష్టవంతులు..లౌకిక వృత్తిలో రాణిస్తూనే..ప్రవృత్తి పరంగా అలౌకిక  లోకాల్లో ఆత్మానందాన్ని వెదుక్కుంటో విహరిస్తుంటార’నేది మనోవైజ్ఞానిక శాస్త్రమే నిర్థారించిన సత్యం.
కవి ఒక కమనీయ కావ్యం, చిత్రకారుడు ఒక   అద్భుత చిత్రం, నర్తకీమణి ఒక  రమణీయ రూపకం, సంగీతవేత్త ఒక మహత్తరమైన రాగం, శిల్పి ఒక అనల్పమైన విగ్రహం..కల్పించటానికి అహోరాత్రాలు నిద్రాహారాలు కూడా మాని ఎందుకంతగా శ్రమిస్తాడంటారు?! ఎన్ని కష్టనష్టాలొచ్చి పడ్డా ఆ శ్రమ నుంచీ విముక్తి కోరుకోడెందుచేత?! ‘చల్లని వేళ సత్కవి విశాలమనంబునయందు బుట్టి సం/ ఫుల్లత నొందు హల్లకము పోల్కి నొకళ్ళ మొకళ్ళ మోలిమై/ నల్లన మేము విచ్చుచునుందుము’ అంటో  లోపల్నుంచీ ఉడుకులెత్తే సృజనశక్తి హోరెత్తిస్తుంటే ఆ వత్తిడినుంచీ ముక్తి పొందటానికిలా   ఏదో కళారూపంలో  భౌతికసృష్టి జరగాల్సిందే- కనక.
కొందరు ఎందుకంత సులభంగా  సృజనశీలులై పోగలరు? ఇంకొందరెందు కెంత తన్నుకులాడినా ఒక్క మంచి  కల్పనా చేసి వప్పించలేరు?! అనేదింకో  సందేహం. ప్రశ్నంత   సులభం కాదు సమాధానం. అనువంశికతో, మానసికతో, బాహ్య పరిసరాల అనుకూలతో, కార్యరూపం దాలిస్తే మరేమన్నాఇతరేతర ప్రేరేపక శక్తుల శబలతో..  ఇతమిత్థంగా ఇదీ అని నిర్థారించడం కుదరని ఇంకేవైనా  కారణాలో కావచ్చు – అనేది ప్రముఖ రసతత్త్వవేత్త  సంజీవ్ దేవ్ జీ మతం.  జన్మతః సృజనశీలత ఉండీ..పరిసరాల ప్రభావం వల్లా, ప్రతికూల పరిస్థితులవల్లా సంపూర్ణంగా వికసించని ప్రచ్చన్న కళాకారులు కొందరైతే..పుట్టుకతో పట్టుబడక పోయినా పట్టుదలవల్లా, అనుకూల పరిస్తితుల చలవ వల్లా శిక్షణ ద్వారా రాణించిన, రాణిస్తున్న కళాకారులు ఇంకొందరు మన సమాజంలో మన మధ్యనే  ఎప్పుడూ సంచరిస్తుంటారు’అనీ ఆయన వాదం. కాదనలేము కదా!
ఐతే సృజనకార్యంలో తలమునకలైన వాళ్ళంతా కళాకారులే ఐనా ..సహజప్రతిభకి.. బుకాయింపు కళకి మధ్య చాలా అంతరం ఉంటుంది. అసలు కళను ఆ ‘కళే’ పట్టిస్తుంది. సహజ స్రష్ట మదిలో సదా త్యాగయ్యలో మాదిరి  ఓ ఆనందజ్వాల ప్రజ్జ్వలిస్తుంటుంది.  వీరబ్రహ్మంగారి జీవితం లోలాగా బౌతిక పీడలు వాళ్ళ అంతఃచేతననెంత  మాత్రం  ప్రభావితం చేయ లేవు.  సందుఛూసుకుని మరీ  అన్నమాచార్యులవారి  అంతరంగ తపన లాగా ఇంకేదో  ఉత్కృష్ట రూపంలో విస్మయంగా  బైటికి తన్నుకొచ్చే తీరుతుంది..చెరసాల  పీడ  గోపన్నలోని రాగజ్వాలను మరింత ప్రజ్జ్వలింప చేసినట్లు.

కళాకృతులను అమితంగా ప్రేమించి ఆరాధించే కళాభిమానులు వాటి సృష్టికర్తలను  సైతం అంతే సమున్నతంగా ఊహించుకోడం సహజం. కానీ  నిజ జీవితాలను సొంత కళాసృష్టంత సమోన్నతంగా నిర్వహించుకోడం ఏ కళాకారుడికైనా ఏమంత తేలిక వ్యవహారం కాదు. తెనాలి రామలింగడు ఎద్దేవా చేసిన ‘కూరగాయల’ కళాకారులు అప్పుడూ ఉన్నారు.ఇప్పుడూ ఉన్నారు. ఎప్పుడూ ఉంటారు. నిజ,కళాజీవితాల  ప్రస్థానాలు సరాసరి వ్యతిరేక దిశల్లో ప్రయాణించిన నీరోలు, జౌరంగజేబులు మనకు చరిత్రలో ఉండనే ఉన్నారు. సృజనవేళే వీళ్ళు అపరబ్రహ్మలు. మిగతా వేళల  వట్టి పిండి బొమ్మలు. బ్రహ్మ రాక్షసులు. మామూలు వ్యక్తుల మాదిరే వ్యావహారిక జీవితంలో చిరుకోరికలకూ, చిట్టి పొట్టి తాపాలకూ, చిరాకులకూ, చిన్నాపెద్దా బలహీనతలకూ దాసులు.  రూకల  బొబ్బట్లు, సన్మానం దుప్పట్లు, అహం చలి కాచుకునేందుకు  వెచ్చవెచ్చని చప్పట్ల  కుంపట్లు.. వాటికోసం సిగ్గు విడిచి సిగపట్లు..! ఏటి వాలులోనే వీరి నావ వీర విన్యాసాలు. నిలువీత రాకపోతే ఎంత గజీతగాడి పోజు పెట్టినా…ఆటుపోటు లెదురైనాక   బోటు గల్లంతు..
ఆదరము తగ్గె దంభమాహాత్మ్యములకు
పక్షపాతపు రచనల పస నశించె
రసికులకు మీ చరిత్ర విసువు దోచె
పరువుగా నింతట బ్రబంధపురుషులార!
కదలిపొం డెటకైనను..మీకు
నేటి కావ్యప్రపంచాన చోటు లేదు’ అంటూ   కాలప్రవాహం దయాదాక్షిణ్యాలకే  అలాంటి మిడతంభొట్లగుంపు నొదిలేయడానికి మించిన మహత్తర కార్యం మరోటి లేదు.
అలాగని లోకమంతా  ఆషాఢభూతుల బంధువులతో నిండి ఉందన్న నిస్పృహా శుభం కాదు.    ఇంత వైవిధ్యవిలాసాలతో విలసిల్లుతున్న సృష్టి ఎన్ని లక్షల స్వచ్చమైన కళాకారుల సృజనపునాదుల మీద నిర్మాణమవుతుందో అర్థం చెసుకోవాలి. కామించిన సుందరి ‘చీ.. పొమ్మన్న్దం’దుకు గోపాలుడి నడ్డమేసుకుని జావళీలు సృష్టించిన క్షేత్రయ్యలు  ఈ కళాక్షేత్రంలో కొల్లలు. అన్నహారాలు మాని అన్నమిచ్చిన వాని పుణ్యాన్ని రోజుకోతీరులో  సంకీర్తించిన  పదపితామహులు
అన్నమయ్య సాహిత్యలక్ష్మిపాదాలకి అలంకరించిన మువ్వల  మాటేమిటి!  దుండగుల కెదురుగా  నోరు తెరవాలంటే కొండతో పొట్టేలు ఢీకొన్నట్లున్న గడ్డుకాలంలో సైతం సామాజిక దురాచారాలను ఆటవెలదుల నోటితో కడిగి పారేసిన ప్రజావేదాంతి వేమన పద్యాల సంగతో! చెప్పాలంటే చేటభారతమంత. ఆ మాటకొస్తే  భారతంలో మాదిరి కళాభారతంలో కూడా ఉత్తరకుమారులున్నట్లే..ఉదాత్త కర్ణులూ..ఏకలవ్యులూ ఉన్నారు.ఉంటారు. ఎవరి దారి ఆదర్శనీయమో అనుసరణీయమో నిర్ణయించుకొనే విజ్ఞత మాత్రం ఎవరిది వారిదే.
సహృదయంతో చూడాలే కాని..నిజ జీవితాలని  సొంత  కళాకృతులను మించిన నిబద్ధతతో నిర్వహించుకున్న స్రష్టలు.. మనకు కళాసాహిత్య రంగాలనిండా శతసహస్రాలు. అందరిలో అసామాన్యంగా వెలిగే సుగుణదీపం-  హేతువాదం వికాసం.  సృజనశక్తికి సాయంగా  సమీక్ష, సహనం, నిజాయితీ, నిబద్ధత సమాంతరంగా వెలిగే ఆ కళాజ్యోతుల జీవితాల్లో ఆలోచనల అనుభూతుల కలబోత  కొట్టొచ్చినట్లు కనిపించే మరో కిరణపుంజం.  ఉత్తమ కళాకారుడు ఉత్తమ మానవుడుగా కూడా సమాజానికి సదా ఆదర్శప్రాయుడై ఉండి తీరాలని చిత్తశుద్ధితో నమ్మి ఆచరించి చూపించిన కళావైతాళికుల అడుగుజాడల్లో నడవడానికి కవులుగా మనకెవరు అడ్డొస్తున్నట్లు!

నడవడకయ నడచివచ్చితి
నడచిన నే నడచిరాను నడచెడునటులన్
నడిపింప నడవనేరను
నడవడికలు చూచి నన్ను నడిపింపరయా!’
అని కదా సృజన  బులపరింపు!
పరిసర ప్రభావాలెంత ప్రతికూలంగా ఉన్నాస్వయంప్రతిభతో ఆ పిలుపునందుకుని ఎత్తుల కెదిగే ప్రయత్నం సొంతంగా  చేయడం,   సాటి సహోదరులకూ చేతనైనంత  చేయూతనిచ్చి పైకి చేదుకోవడమూట -మనలోని సృజనశీలత ఇంకా సజీవంగానే ఉన్నదని నిరూపించుకునే రుజువులు. కాదంటారా?

-కర్లపాలెం హనుమంతరావు

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...