Friday, December 10, 2021

సాహిత్య వ్యాసం నివేదనం - కాటూరి వేంకటేశ్వరరావు సేకరణ - కర్లపాలెం హనుమంతరావు

 


సాహిత్య వ్యాసం 

నివేదనం


- కాటూరి వేంకటేశ్వరరావు

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు




భావము కుదిరి, ఉపక్రమోపసంహారాలతో, రమణీయార్ధములతో, సంవాద చతురతతో నడచిన ఈ కావ్యానికి ప్రబంధ మనే నూతన' సంకేతం ఏర్పడింది. వలసినంత భావనాసమృద్ధితో, అలంకారశిల్పముతో, రసభావనిరంతరంగా, గద్యపద్యాత్మకంగా రచితమైన ప్రబంధ మనే ఈ కావ్య పరిషియ ఆంధ్ర సాహితికి సొంతమని చెప్పదగును. ఆవేలమైన భావనకు రాయల ఆముక్తమాల్యదా, అద్భుతకథాకల్పనకు సూరన కళాపూర్ణోదయం నిదానములు. కావ్యానికి కావలసిన సకలలక్షణాలు సంపాదించుకొను టేకాక, శ్రవ్యరూపాన ఉన్న ప్రథమాంధ్రదృశ్య కావ్యమని పేరుగన్నది ప్రభావతీ ప్రద్యుమ్నం. కవిరాజ శిఖామణి నన్నెచోడుడు, ఎఱన, శ్రీనాథుడు, పినవీరభద్రుడు మున్నగువా రీ స్వతంత్ర కావ్యావిర్భూతికి బీజావాపం చేసినా, దీనికి ప్రత్యేక నామరూపాలు కల్పించిన మాన్యుడు అల్లసాని పెద్దన.


భారతాదులయందువలె కథాకథనము, ధర్మోపదేశము ఈ కావ్యములందు ప్రధానము కాదు. విభావాను భావాదులచే పరిపుష్టమగు రసనిష్పత్తియే ఇందు ప్రాధాన్యము వహించును. ఈ కాలపుగ వీశ్వరులు తమయెదుట కన్పట్టు మహా రాజ్యవిభవాన్నీ, అప్పటి రాగభోగాలను, నడతనాగరీశాలను మనసులందు నిల్పికొని వానికి రూపాంతరాలు కల్పించి, రసమయమైన గంధర్వలోకాన్ని సృష్టించారు. భువనవిజయం సుధర్మగాను, తుంగభద్ర మం దాకీని గాను, విద్యానగరళ్ళం గారవతులే కథానాయికలుగాను, ఆనాటి సాహసరనికులే నాయకులు గాను వీరి కావ్యాలలో అందందు రూపాంతరం పొందిరేమో ! ఆనాటి కవులకు, ప్రజలకు హస్తప్రాప్యములైన రసభోగాలనుండి వంచితులమైన మనకు నే డా కావ్యసృష్టి వింతగా, విపరీతంగా కన్పించినా సర్వర్తుధర్మసంశోభిత మై, అద్భుతర సస్యందియైన ఆరామంవంటిది ఆనాటి సాహిత్యం.


ఈ ప్రబంధకవులలో సహజశ్లేషలకు శయ్యాసౌభాగ్యానికి రామరాజ భూషణుడు, భక్తిపారమ్యానికి ధూర్జటి, ముద్దులొలుకు పలుకుబళ్ళకు తిమ్మన, అర్థభరితమైన పదబంధానికి రామకృష్ణుడూ — ఇలా ఒకరొకరే పేరుగాంచిరి. ఆంధ్రమున మొదటి ద్వ్యర్థి కావ్యమూ, యక్ష గానమూ ఈ కాలంలో నే పుట్టినవి. ఆత్మపరము, భక్తిభరితము అయిన శతకరచనం వెనుకటికాలంలోనే ఆరంభ మైనా ధూర్జటి కాళహస్తీశ్వరశతకం అట్టిరచనలకు మకుటాయమానమయింది. మెట్ట వేదాంతులను, దాంభికులను, మూఢమానవులను ఆధిక్షేపించి, పరిహసిస్తూ వేమయోగి అలవోకగా చెప్పిన ఆటవెలదులకు లోకుల నాలుకలే ఆకులైనవి.


విజయనగర సామ్రాజ్యం తల్లికోట యుద్ధంతో స్తమించిన పిమ్మట చోళ పాండ్య దేశాలలో రాజ్య స్థాపనం చేసికొన్న నాయక రాజులు ఆంధ్ర సాహిత్యానికి వూరు, మధుర, పుదుక్కోటలందు విస్తరిల్లిన ఈనాటి వాఙ్మయ మంతా కేవలళ్ళంగారపరమైనది. స్వయము కవియై, సర్వవిధాల కృష్ణరాయలకు దీటైన రఘునాథరాయల అనంతరమందు నాయక రాజులలోను,. వారిపిమ్మట రాజ్యమేలి మహారాష్ట్ర ప్రభువులలోను భోగపరాయణత


 విసరిలినది. ఆంధ్రజాతి జవసత్యాలు ఉడిగి, పౌరుష ప్రతాపము ల సంగతములు కాగా, మిగిలిన కామపరతనుండి ప్రభవించిన ఆనాటి కావ్యాలు సంయమం కోలుపోయి పరకీయాశృంగారానికి పట్టముగట్ట నారంభించినవి. ఈ 150 ఏండ్లలో పొడమిన సాహిత్యంలో విజయవిలాసంవంటి ఒకటి రెండు కావ్యాలు పూర్వకావ్య గౌరవాన్ని కొంత అందుకొన్నవి. యక్షగానము జై కటి ఈ కాలమందే వరి లినది. నాయక రాజులలో పెక్కురు, మహారాష్ట్రప్రతాపసింహాదులు, నాయక రాజుల సామంతులు, దండ నాధులు గూడ కావ్యములు రచించుటొకటి, పెక్కురు విదుషీమణులు కవయిత్రు లగుట యొకటియు ఈశాలమందలి విశేషాలు, గేయకవితకు ద్వితీయాచార్యు డగు క్షేత్రయ్యయు, దాక్షిణాత్యకృంగార కావ్యభూషణమైన రాధికాసాంత్వనం రచించిన ముద్దుపళనియు, ఆనాటివారే.


కోకొల్లలుగా బయలు దేరిన యక్షగానాలు, శృంగారపదాలు అభిన యిస్తూ రాజసభలలో నాట్యం చేసే వేశ్యల పదమంజీరధ్వనులే అప్పటి కావ్యా లలో ధ్వనించుచుండును. రాజాస్థానాలలో తెరపిలేకుండా సాగే కామ దేవతారాధనమే నాగరులకు అనుకార్యమై, త్యాగ భోగ రాయుళ్ళయిన నాయక రాజులే శృంగార కావ్య నాయకు లైనారా అనిపిస్తుంది. సకలేంద్రియసంతర్పణం చేసే కామపురుషార్థమహాఫలంకోసం రనికనరనారీలోకం నూటయేబదియేండు 3 ఇలా సాహిత్య సముద్రమథనం చేయగా చేయగా తుదకు రామనామామృత భాండం చేబూని వాగ్గేయకార సార్వభౌముడైన త్యాగరాజస్వామి అవతరిం చెను.


3. క్రీ. శ. 1850—1955


19వ శతాబ్ది పూర్వార్ధంలో రెండుమూడర్థాల కావ్యాలు, శ్లేష చిత్ర బంధ కవిత్వాలూ బయలు దేరినవి. హాస్యనీతిశతకాలవంటివితప్ప స్వతంత్ర కావ్యములు పొడమలేదు. దేశం క్రమంగా ఆంగ్లేయాక్రాంతమై, క్రిస్టియనుమత ప్రచారము, ఆంగ్లవిద్యాభ్యాసం ప్రబలినవి. వీనికి దోడు భౌతికదర్శనముల ప్రభావం వల్ల విద్యావంతులు ప్రత్యక్ష ప్రమాణబుద్ధులు కావొడగిరి. భారతీయధర్మము, సంప్రదాయాలు, ఆచారాలు పునర్విచారణకు పాత్రములై, స్వస్థాన వేష భాషాభి మానం సడలుటతో, సంఘసంస్కారోద్యమాలు సాగినవి. సముష్టి చిర కాలంగా తనచుట్టు నిర్మించుకొన్న ప్రాకారాలు శిథిలము లగుటయు, వానినుండి విడివడజూచే వ్యష్టి తనకే మం తాను విచారించుకోజొచ్చింది. భారతీయ ధర్మాన్ని నవీన కాలానుగుణంగా సంస్కరించుట కి ట్లొకవంక యత్నం జరుగు చుండగా, మరొకనంక ఆంగ్లప్రభుత్వ బంధనంనుండి విడివడాల చేకోర్కె బలీయ మయ్యెను. అంతట భారతీయపూర్వేతిహాసాన్ని, ధర్మ ప్రపంచాన్ని మథించి, స్వస్వరూపసాక్షాత్కారం పొందవలెననే కాండా, అభిజనాభిమానము ప్రబలమయ్యెను. ఆంగ్లభాషాకళాశాలల్లో ఆంగ్లేయసాహిత్యాన్ని అవ గాహిస్తున్న పడుచువాండ్రు ఈ రెండు ఉద్యమాల చే ప్రేరితులై అందరమైన


నివేదనం


ix


అద్భుతర సదర్శనానికి, మద్రమై, బంధనాగారపదృశమై కనిపించే బాహ్య లోకానికి పొత్తుకుదరక, తమవేదనలను చెప్పికొనుటకై మాటలను, మార్గములను


ఇంతలో తిరుపతి వేంకటకవులు ఈ కాలపువారి కష్టసుఖాలను చెప్పికొనుట కనువైన సులభసుందర శైలిచే కావ్యరచనం చేయనారంభించిరి. గురుజాడ అప్పారావు మానవధర్మాన్ని, దేశభక్తిని ముత్యాలసరమనే ఛందముచే గానము ఇట్లు దేశకాలానుగుణమైన కావ్య శైలియు, ఛందము దొరకి సంతట 20వ శతాబ్ది ప్రథమపాదమున తరుణవయస్కులు, గొంతులు విడివడినప్లై, ఆత్మనాయకములగు మధురకవితలను చెప్ప మొదలిడిరి.


పాశ్చాత్య సాహిత్య ప్రపంచమును, రవీంద్రనాథగీతావళిని ఆరగ్రోలిన సంస్కారపుష్టిచే ఆరంభమైన ఈ మధురకవితలందు అలనాటి రాయల సాహిత్యంలో లభించే అద్భుతమైనరసదర్శనం మల్లా లభించింది. అయితే ఆనాటి దర్శనం భోగభాగ్యములచే తులదూగే జీవనపొష్కల్యమునుండి లభింపగా, ఈనాటిది ప్రతికూల పవనహతినుండి ఆత్మజ్యోతిని కాపాడుకొనుటకై వాయు మండలో పరిపథాన కెగిరి, ఆచట నిర్మించుకొన్న ఏకాంతజీవనంనుంచి పుట్టింది. ఆచట కవి నిజానుభవాలకు రూపాంతరం కల్పింపగా, ఇచట కవి మనోరథాలకు రూపకల్పన జరిగింది. కాగా, అందు సంయోగ సుఖము, ఇచట తరచు విరహ పరిదేవనమాధురియు లభించినవి. మేఘదూతలోని యక్షులవంటి ఈ కవుల కా అలకానగరసుందరి దవుదువ్వులనే ఉండిపోయింది. పార్థివగంధస్పర్శ లేని ఆసుందరి ఆరాధ్య దేవతయై, పూజాపీఠ మలంకరించింది. ఆదేవిని ప్రసన్న నొనర్చుకొనుటకై వీరు పాడిన మధురకవితలలో అద్భుతమైన భావస్ఫూర్తీ, రమణీయారాలు కోకొల్లలుగా మనకు లభిస్తవి.


ఆక్మనాయకములైన మధురకవిత లోకవంక ఇట్లు చెల్లుచుండ రెండవ వంక పూర్వేతిహాసములను రసమయంగా ప్రత్యక్షం చేసే వీరకథాకావ్యాలు, పర దాస్యబంధనాన్ని సహించని దేశభక్తి గేయాలు వెలువడజొచ్చెను. స్వస్థాన స్వధర్మాభిమానములనుండి ఆవిర్భవించిన ఈజాతికావ్యములు గూడ గుణ గౌరవ ముచే పొగడ్త కెక్కినవి.


ఇవి యిటులుండ ఇంకొక తెగ కవీశ్వరులు పామరజనజీవనమాధుర్యాన్ని పదకవితలందు అందీయసాగిరి. లోకానికి అన్న పత్రం పెట్టే కర్షకభాగ్యశాలిని, సంఘానికి సుఖభోగ పరికరాలను సమకూర్చియిచ్చే మంటిపుట్టువుల వితరణాన్ని కీ ర్తించుతూ వీరు ఈశ్వరాంశను మానవత్వమందు ప్రతిష్ఠ గావింపజొచ్చిరి.


ఈ వివిధ కావ్యసృష్టి యిలా జరుగుచుండగానే గాంధీజీ భారతరాజకీయ రంగాన ప్రధానభూమిక వహించడం, స్వాతంత్య్రచ్ఛ జనసామాన్యానికి గూడా ప్రాకడం, భాషారాష్ట్రములకొరకు ఆందోళన చెందడం, స్వతంత్రభారతంలో సంఘస్వరూప మెలాఉండాలి అనే వాదోపవాదాలు చెలరేగడం, ద్వీపాంత 


రాలనుండి ఆ సేకనూతనోద్యమమారుతాలు దేశంలో వీచడం వీని యన్నిటి భావుకులు చి తవీధులందు క్రొ ఆలోచనలు పొడమినవి. దీనితో కాల్పనిక మైద రసభావసృష్టి వెనుకబడి, దేశకాలాల యథాస్వరూపాన్ని చిత్రిస్తూ, నవసంఘ స్వరూపానికి రూపరేఖలు దిదేరచనలు బయలుదేరినవి. పరపీడనాన్ని, పరోప జీవనాన్ని శపించడం, కష్టజీవులందు అభిమానాన్ని ఉద్దీపింపజేసి ఆశాజ్యోతి వెలిగించడం __ఈ కాలపు కావ్యములకు సామాన్యలక్షణా లని చెప్పవచ్చు.


భావస్రవంతి పలుపోకల పోతున్న ఈ నవీనకాలంలో తొల్లి ఎన్నతు లేనంత వైవిధ్యము, గుణబాహుళ్యం కావ్యసృష్టియందు కనిపిస్తున్నవి. భావాను గుణములైన నూతవచ్ఛందాలను కవులు వాడుతున్నారు. కొందరు వృత్తగంధి వచనరచన చేస్తున్నారు. సంస్కృతపురాణేతిహాసాలకు మళ్ళా కొందరు కేవలానువాదాలు చేస్తుంటే, కొందరు వానిని స్వోపజ్ఞంగా క్రొత్త వెలయిను న్నారు. జానపద గేయాలు, వీరకథాగేయాలు ఎక్కువగా ప్రజాదరం పొందు తున్నవి. దేశకాలాలను వ్యాఖ్యానించుటకు కొందరు శతకపద్ధతి నవలంబిస్తు న్నారు.


ఏకాలమందైనా క్రొత్తదారి త్రొక్కేవా రొకరిద్దరే ఉంటారు. తక్తిన వారొక అడుగు అటూ యిటూగా ఆధారినే పోతూ, కొంత విలక్షణతను గూడ చూపెట్టుతారు. కొందరిరచనలు ఉపజ్ఞామహితములు కాకున్నా, తత్కాల పరిస్థితులకు, ఉద్యమాలకు ప్రతిబింబాలుగా ఉంటవి. ఇలా వేయేండ్లనుంచి ఎప్పటికప్పుడు నవనవంగా వర్ధిల్లుతున్న ఆంధ్రసాహిత్యమందలి కావ్యభేదాలను, రీతులను ఇందు ప్రదర్శించుటకు యత్నించితిని. ఆంధ్రసాహిత్యంలో కేవలం మేలేర్చి కూర్చేయత్నం కాకపోవడంవల్ల, ఆంధ్రరసజ్ఞలోకానికి పరమాదర పాత్రములైన కొన్నికొన్ని రచనల నిందు చేర్చలేకపోతిని. రుచిభేదంవల్ల, పరిశీలనాలోపంవల్ల, స్థలసంకోచంవల్లకూడా ఈ కూర్పు కొంత అసమగ్రతకు పాల్పడిఉంటుంది.


నా యీలోపములను సహృదయులు మన్నింపవేడెదను. ఇతర భాషా ప్రాంతములందలి సోదరభారతీయులకు ఆంధ్ర సాహిత్య సంపద నంతటిని, శృంగ గ్రాహికగా కాకున్నా, స్థూలారుంధతీన్యాయంగానైనా ఈ గ్రథవం చూపెట్ట గలదేని కృతార్థుడ నగుదును.


- కాటూరి వేంకటేశ్వరరావు

( తెలుగు కావ్యమాల - నుంచి ) 

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...