Saturday, March 21, 2020

సరదాకేః ఆదివారం శీర్షిక కోసం ఉత్తర కాండ -కర్లపాలెం హనుమంతరావు




ఉత్తరాలు రాయడం  కళఅందులోనూ పత్రికలకు ఉత్తరాలు రాయాలంటే 
ప్రత్యేకమైన ఓర్పునేర్పు తప్పనిసరిలేఖల శైలి విభిన్నంగా ఉండాలిఅంశం
అరుదైనది అయితే సంపాదకుడి దృష్టిని ఇట్టే పట్టేస్తుందిఉత్తర రచయిత
ప్రథమ పాఠకుడు పత్రికాసంపాదకుడే కదా!

ఉత్త ఉత్తరాలతో ఉద్ధరించేదేముందిఅనుకోవద్దుప్రియురాలు
అంగీకరిస్తుందనేనా ప్రియుడు రక్తంలో ముంచి మరీ తన ప్రేమను లేఖల మూలకంగా
తెలియపరచడంలక్కుండడం ముఖ్యంఅది లేకుంటే ఎంత ' పాజిటివ్గ్రూపు తో
గోడు వెళ్లబోసుకున్నా  నెత్తురు చుక్కలు ఉత్తరంలోనే ఇంకిపోయేది.


పత్రికల ఉత్తరాల పంథా వేరువాస్తవ రచయితలు ఎవరో తెలియదువాస్తవంగా
ఎవరన్నా దృష్టి పెట్టి చదువుతున్నారాఅని అడిగినా సమాధానం తెలియదు.

వినవలసినవాళ్ళు  విన్నపాలు వింటున్నారో.. నలిపి దిబ్బవతల
పారవేస్తున్నారో పట్టించుకోకుండా తెల్లటి ఉత్తరాన్ని నలుపు చెయ్యాలంటే
రాసే రచయిత చందమామ మార్కు విక్రమార్కుని వంశానికి చెందినవాడయి ఉండాలి.

మామూలు మహజర్లకు మల్లే కాదు.. పత్రికకు రాసే ఉత్తరాలల్లో కొన్ని
ప్రత్యేకమైన సౌకర్యాలూ కద్దుఎంత పెద్ద ట్రంపుతోనయినా.. పేకముక్కల
ట్రంపాట’ ఆడుకోవచ్చుఎదురుపడే ఛాన్సే లేని కొరియా మొం
ది కింగ్ కిమ్ తో అయినా సరే  కుమ్ములాటకు దిగిపోవఛ్చుమోదీషాలతో

తలమోదుకునేలాంటి తమాషాలు సామాన్యుడికి ఉత్తరాలతో మాత్రమే సాధ్యమయ్యే
సాహసం.

కొహ్లీకి జై కొట్టటానికైనా,  ఉమ్రాన్ ఖాన్ ను 'ఛీఁకొట్టడానికైనా
ఉత్తరాలే గత్యంతరం ఎంత లావు అభిమానందురభిమానం పొంగిపొర్లిపోతున్నా!
తాడూ బొంగరం చేత లేకుండానే బాలచంద్రుణ్ని మించి  ఎంతటివారి మీద
చెలరేగిపోవాలన్నా పత్రికలకు రాసే ఉత్తరాల వల్లే అది సాధ్యంబిల్ గేట్స్
భుజం తట్టడానికికంప్యూటర్ సత్యాన్ని కసితీరా తిట్టడానికి కామన్ మ్యాన్
అనే సామాన్య ప్రాణికి ఉత్తరాలను మించిన మరో  శక్తివంతమైన ఆయుధం ఏదీ లేదు
ఎంత  ‘ఫైట్ ఫర్ జస్టిస్’ ఉద్యమం నడిచే ప్రజాస్వామ్యంలో అయినా?


పత్రికల్లో పడే ఉత్తరాలు ఎవరు చదువుతారన్న నిర్వేదం వద్దు.
ధృతరాష్ట్ట్రుడు వింటాడనేనా విదురుడు అంతలా ఆపకుండా సలహాలు
దంచికొట్టిందిస్వార్థం లేనిదే  పని తలపెట్టడమైనా వ్యర్థమనుకునే 

కలికాలంలో అయిదో పదో వదిలితేనేమికలంతో జాతి అంతరాత్మను నిద్రలేపి
తీరాలన్న పంతం పట్టడం అంత సామాన్యమైన విషయమేమీ కాదుఉత్తర రచయితలు
ఉత్తర కుమారులతో పోల్చడం పొరపాటు.


అచ్చు ముచ్చట నుంచి పుట్టుకొచ్చింది  ఉత్తర రచనా వ్యాసంగం.
ప్రజాస్వామ్యానికి పిల్లార్స్(మూలస్తంభాలు).. పత్రికలవాళ్లకి  ఉత్తరాలే
స్పేస్ ఫిల్లర్స్ఎక్కడో ఇరాన్  సులేమాన్ ని అమెరికన్  దళాలు
మట్టుపెట్టేస్తే ఇదంతా సామ్రాజ్యవాదుల కుట్రేనని.. అంతర్జాతీయ శాంతి
భద్రతల ఒప్పందాలకు విఘాతం కలిగించే దుస్సాహసానికి పూనుకుంటే చూస్తూ
ఊరుకోమని .. అనంతపురం జిల్లా మారుమూల పల్లె పాములపాడు నుంచి కూడా  రంకెలు
వేసెయ్యగలగడం సామాన్యపౌరుడికి ఒక్క పత్రికలకు రాసే ఉత్తరాల ద్వారా

మాత్రమే పాజిబుల్.

శ్రీదేవి విదేశాలల్లో చనిపోతే ఆమె అభిమానులందరూ దుబాయ్ దాకా పోయి
భోరుమనలేరు కదాపత్రికలవాళ్లే కాస్త పెద్ద మనసు చేసుకుని  రెండు మూడు
వాక్యాలకు మించకుండా  ప్రగాఢమైన శోకతప్త హృదయావేదనని వెళ్లబోసుకొనే
వెసులుబాటు తమ  ఉత్తరాల శీర్షిక ద్వారా కల్పిస్తారుఇంట్లో కూర్చుని ఈత

ముంజెలు తింటూ కూడా సంతాప సూచకంగా -మెయిళ్లు పంపుకునే వెసులుబాటు
పత్రికల ఉత్తరాల ప్రత్యేకత-కాలంలో కూడా  ఉత్తరాల కాలమ్  ప్రాధాన్యత
ఇంచ్ అయినా తగ్గకపోడానికి ఇదీ  కారణమే!


క్రికెట్టాటలో కొహ్లీ సెంచరీ కొట్టినాఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో
తెలుగుతేజం నామినేషన్ వేసినానాసా తయారీ వ్యోమనౌక శ్రీహరి కోట నుంచి
అంతరిక్షంలోకి దూసుకు వెళ్లినా.. కాలు బైటపెట్టకుండా కార్యక్రమ
నిర్వాహకులకు జైకొట్టవచ్చు.. అభినందనల మందారమాలలను అందించవచ్చు

భాగ్యం కేవలం ఉత్తరాల శీర్షిక వల్లనే సామాన్యుడికి సాధ్యం.

పాఠకుల నాడి పట్టుకునేందుకు  పత్రికలకూ  ఉత్తరాలే ప్రధాన సాధనం.
మచ్చుక్కి కొన్ని పత్రికల్లో అచ్చయిన ఉత్తరాలను లోతుగా పరిశీలిస్తే
కాలానుగుణంగా లోకుల ఆలోచనలలో కలిగే మార్పు ఎంత ఆసక్తికరంగా ఉంటుందో
అర్థమవుతుంది.

రోకళ్ల రామకృష్ణ అనే పాఠకుడు ఒక దినపత్రికకు రాయచూరు నుంచి రాస్తాడూ

'డివైడర్ల వంకతో నడిరోడ్డు మధ్యన కోటగోడలు కట్టేస్తున్నారు హైదరాబాదులో.
సికందరాబాదు నుంచి సంజీవయ్య పార్కు చేరాలంటే ట్యాంక్ బండ్ ఎక్కి
బుద్ధవిగ్రహం మీదుగా వెళ్లి మళ్లీ వెనక్కి తిరిగి రావాలికాలహరణంచమురు
వృథాబిజీ సమయాలల్లో .. కరువు కాలాలల్లో సామాన్యుడుకి భారం కదా!

పిల్లలువృద్ధులుమహిళలుదివ్యాంగులు రోడ్డు దాటేందుకుగాను ప్రత్యేక
సహాయకబృందాలు ఏర్పాటు చెయ్యడం అవసరమని ప్రభుత్వానికి మనవిసంబంధిత
అధికారులు సత్వరమే స్పందించాలి!'. అందరి మనసులలోని చింత దాదాపుగా అదే
ఉంటుందిలేఖల కాలమే కనుక లేకపోయివుంటే  ఉత్తిపుణ్యానికి గాలిలో
కలిసిపోయే చింతన కదా  ఉత్తరాల రచయితలు నస్వార్థంగా పూనుకోకపోతే!


పత్రికలలోని ఉత్తరాల శీర్షికకు పలు కోణాల నుంచి బాణాలు
దూసుకొచ్చిపడుతుంటాయ్యాభై పైసల చెల్లుబాటును గురించి కరీంనగర్ నుంచి
రమాకాంతరావు అనే పౌరుడు  విధంగా వాపోతుయాడో ప్రాంతీయ సాయంకాలంపత్రికలో.
'ఐదుపదిఇరవైపావలా బిళ్లలు కాలదోషం పట్టడానికి  కారకులైన అజ్ఞాత
శక్తులే మళ్లీ ఇప్పుడు యాభై పైసల బిళ్ల చిల్లుగవ్వ విలువైనా చెయ్యవని
దుష్ప్రచారం మొదలుపెట్టాయియాభై నోటునకిలీది అయినా కళ్లకద్దుకుని
పుచ్చుకునేవాళ్ళే అసలు సిసలు యాభై పైసల బిళ్ల స్వీకరించడానికిమాత్రం

ఠలాయిస్తున్నారుఅర్థరూపాయి బిళ్లల చెలామణిపై పెద్ద ఎత్తున ఉద్యమం
చేపట్టాల్సిన అవసరం ఉందిజాతికి చెందిన విలువైన వనరులతో ముద్రించే 
చిల్లర బిళ్లలు ఇప్పటికే ముష్టివాళ్ల దృష్టిలో కూడా ముష్టిబిళ్లలుగా
మారిపోయాయిమరింత నిర్లక్ష్యం  తరహాలోనే గానీ కొనసాగే పక్షంలో తమ అంతిమ
యాత్రలలో చల్లేందుకు పాడె మీది శవాలు ఒప్పుకోని ప్రమాదం ముంచుకురావచ్చు.

ఏడాదికి ఒక్కసారి వచ్చే పసిబిడ్డల భోగిపళ్ల కోసరమని ఎంతని చిల్లర
పోగేసుక్కూర్చోడంజేబు బరువు అన్న చిన్నచూపు తగదుహారతి పళ్లెంలో యాభై

పైసలు పడంగానే గుడ్లు ఉరిమి చూసే  గుడిపూజారుల మీద తక్షణమే ఆర్థికనేరాల
సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం..' ఎన్ని
రూపాయలు పోస్తే ఇంత పెద్ద లేఖ రాయడం అవుతుందోఅందునా పత్రికలకు!
ఇన్నిన్ని ప్రభుత్వాలు మారుతున్నా  ఒక్కటీ కరీంనగర్ వాసి
రమాకాంతరావుగారి మొర ఆలకించినట్లులేదుయాభైపైసల బిళ్లలిప్పుడు కనీసం
పిల్లలు ‘బొమ్మా.. బొరుసా?’ ఆటాడుకునేందుకైనా కనిపించడం లేదు!


మాతృభాష మీద ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణులను పక్షానికి ఒక పర్యాయం
నిరసిస్తూ మండిపడే టైపు ఉత్తరాలు ఎన్ని దశాబ్దాలు దాటినా రావడం ఆగడంలేదు
పత్రికలల్లో.  మండపేట నుండి  జ్వాలా శర్మతెలుగు భాషా పండితుడు;

హైయ్యర్ గ్రేడ్ అసిస్టెంట్నెలకు రెండు రౌండ్లు,  పత్రిక మార్చి
పత్రికలో ప్రభుత్వాల చిత్తశుద్ధిని శంకిస్తూ మండిపడ్డం రివాజు. ' ‘తెలుగు
నేర్చుకోండని చదువు రానివాళ్లను కూడా హడలుగొట్టే ప్రభుత్వాలు ముందు
'హుడా'ని  'హైనస' (హైదరాబాద్ నగరాభివృద్ధి సంస్థ)గా ఎందుకు మార్చుకోవు?’
అని అయ్యవారి కలంవాత.  శర్మగారి రాతలే తప్పించి తెలుగు భాష ‘తలరాతలో
వీసమంతైనా మార్పు కనిపించడంలేదుఅది వేరే కత.

ఓపికతీరక ఉండాలి..  నెల రోజుల  పత్ర్రికలు నానా రకాలవి
ముందేసుక్కూర్చున్నా చాలు ప్రపంచాన్నిదేశాన్నిరాష్ట్రాన్ని,

ప్రాంతాలనుప్రజలను ఎన్ని సమస్యలు పట్టిపీడిస్తున్నాయో ఇట్టే
తెలిసిపోతుంది.  పాలిటిక్సు మీద వచ్చే రొటీన్ లేఖలు పక్కన పెట్టినా
ఉగ్రవాదం నుంచి పొంచి ఉన్న  ప్రమాదం మీద కనీసం  అయిదారు ఆందోళనకరమైన
ఉత్తరాలు కంపల్సరీగా దర్శనమిస్తాతయివాతావరణ కాలుష్యాల మీద  వారానికి

కనీసం ఒకటైనా హెచ్చరికలతో కూడిన లేఖ తప్పనిసరిప్రభుత్వ రంగ సంస్థల్లో
జరిగే అవినీతిబ్యాంకులవారు  విధుల పట్ల ప్రదర్శించే నిర్లక్ష్య వైఖరుల
మీద నిప్పులు కక్కే ఉత్తరాలు తప్పనిసరిగా నాలుగయిదుకు తగ్గకుండా ఉండకపోతే

ఒట్టుజాతి విలువలు పడిపోతున్నాయనిదేశభక్తి గణనీయంగా తగ్గిపోతోందని,
విద్య వ్యాపారమయమైపోయి సామాన్యుడికి అందని ద్రాక్షగా తయారవుతుందనే టైపు
ఏడుపుగొట్టు లేఖలు రోజు మార్చి రోజు ఏదో  పత్రికలో గ్యారంటీగా

కనిపిస్తుంటాయి.
మద్యాన్ని బహిష్కరించాలని గర్జించే లేఖల సంగరి ఇహ సరే సరి!


అచ్చువేయని పక్షంలో ప్రజాపక్షంగా తాము పనిచేస్తున్నట్లు మరో రుజువు
చూపించి నమ్మించడం కష్టమని పత్రికలు భావించే అన్ని రకాల అంశాల పైన
అంకుశాల వంటి లేఖాస్త్రాలు సంపాదకుకుల పేజీలలో సంధింపడే రోజులు ఇప్పడివి.
ఉత్తరాల రచయితలను ఉత్త రాలుగాయి సరుకుగా భావించరాదని భావించే

ప్రజాస్వామ్య పంథా కదా  ప్రస్తుతం నడుస్తున్నట్లు కనిపిస్తున్నది!
ఎక్కణ్ణుంచి  ఉత్తరం ముక్కయినా రాని పక్షంలో 'ఎన్నార్సీ చట్టం అందరి
కోసమా.. కొందరి కోసమా?’ అంటూ ఏదో  సందర్భం చూసుకుని పెద్దక్షరాలతో 
బుల్లి ఉత్తరం పత్రికలే బనాయిస్తాయని వాదు.  జనాభిప్రాయం తీర్చి

దిద్దడంలో  తమ వంతు పాత్ర  సక్రమంగా నిర్వహిస్తున్నట్లు అచ్చుపత్రికలు
రుజూ చూపించుకునేవీ  ఉత్తరాల శీర్షిక ద్వారానే కదా!  సర్క్యులేషన్లో
గొప్ప మార్పేమీ లేకపోవచ్చును.  కానీ ‘లేఖల కాలమ్’ అంటూ ఒకటి  మూలో  లేని
పక్షంలో సంపాదక పుట వన్ సైడెడ్ లవ్ లెటర్స్  కట్ట తరహాలో వండేసిన
వంటకాలన్న  అన్న నిజం భైట పడుతుందని పత్రికల బెంగ!


ఫ్లోరోసిస్ ఇస్యూల మీద ఇస్సులుతొక్కే ఉత్తరాలు ఇప్పట్లా కాకుండా గత
దశాబ్దిలో చాలా పెద్ద  ఎత్తునే పత్రికల్లో వస్తుండేవి దిశగా
లేఖాసాహిత్యం ఒక్కసారిగా సద్దుమణగడానికి ఉల్లేఖించలేని కారణాలు ఏవో
ఉండుంటాయికానీ పాలకులు తమ ఘనకార్యంగా చెప్పుకుంటున్నారు. ‘ఏలికల మొండి
వైఖరి కారణంగా జనంలో ఆవరించిన నిస్సత్తువని   సహజంగానే ప్రతిపక్షాలు
కసురుతుంటాయికసుర్లకయినావిసుర్లకయినా అడ్రస్ లేని మనిషికి మాత్రం
పత్రికల లెటర్స్ మాత్రమే గతిప్రజాస్వామ్యం ఉండిప్రజలకు గొంతున్నంత
కాలం పత్రికలలోని ఉత్తరాల శీర్షికకు మాత్రం ఛస్తే ఢోకా ఉండదుఇది నిజం.


ఎయిడ్స్ధూమపానంసెల్ దుర్వినియోగంపాఠశాలల్లో అరకొర సౌకర్యాలు,
పరీక్షల తేదీలుపండుగ ముహర్తాలుఅరకొర రవాణా సౌకర్యాలురైళ్ళ
రాకపోకడులువేళకు రాని ఎరువులుకల్తీ విత్తనాలుకృత్రిమ మార్గాలలలో
పదార్థాలు మాగబెట్టడంధర్మాసుపత్రుల్లో వైద్యుల కొరతరేషను దుకాణాల
సరుకు సరఫరాపరీక్షల తేదీలుమూల్యాంకనాల మీద శంకలుఫలితాల పైన
అయోమయాలుపభుత్వోద్యోగుల జీత భత్యాలురాని సర్కారు మార్కు కొలువులు,
అచ్చు కాని పాఠ్యపుస్తకాలుఅచ్చయినా వాటిలోఅడుగడుగునా కనిపించే దోషాలు..

ఒహటనేమిటి.. ఏరువాకల వేళలకు రుతుపవనాల రాక ఆలస్యం నుంచిఏరు గట్లు తెగి
నీరు ఊళ్ల మీదకొచ్చిపడే వరకు  పత్రిక ఉత్తరాల రచయితలు టచ్ చెయ్యని టాపిక్

అంటూ  దాదాపు భూమ్మీద ఏదీ ఉండదుకామారెడ్డిగూడెంలో కండోమ్స్ సమస్యను
గురించి స్వామి బ్రహ్మానందస్వామి పేరుతో  ప్రముఖ పత్ర్రికలో ఉత్తరం

అచ్చయిందంటే.. లేఖలకు పత్రికలలో ఉండే ప్రాథాన్యత ఎంతటిదో ప్రత్యేకంగా
చెప్పనక్కర్లేదిహ.

మరీ ఆకాశరామన్న  ఉత్తరాలకు అచ్చుపత్రికలలో అవకాశం దక్కకపోవచ్చుకానీ,
ఆకాశ పురాణాలు ఏవైనా విశదంగా వివరించి మరీ తిట్టిపోసే ఛాన్స్  పత్రికలలో
ఒక్క  ఉత్తరాల రచయితలకే సొంతంఎవరెన్ని  విమర్శలైనా చేసుకోనీయండి.. ఓషో
భక్తి ఉద్యమం నుంచి ఓజోన్ పొర చిరుగుడు వరకు పత్రికా లేఖకులకు పనికిరాని
అంశం అంటూ భూమండలం మీద ఏదీ ఉండదు.

ఉత్తరాల శీర్షికే కదా అని పుట తిప్పి పారేయద్దుఆస్వాదించగల మనసుండాలే
కానీ   లేఖా సాహిత్యంలో లేని రసం  ఉండదురాష్ట్ర సరిహద్దుల వద్ద అడ్డూ

ఆపూ లేకుండా సాగే అక్రమ  ఇసుక రవాణా వ్యాపారం వద్దని  గోదావరిఖని నుంచి
ముకుందరావనే మేధావి ఉత్తరం ద్వారా ఎంత ఆర్ద్రంగా ఆక్రోశిస్తున్నాడో!
'.. ఇసుక లారీల విచ్చలవిడితనాన్ని అరికట్టమని ఎన్ని ఏళ్ల బట్టో సంబంధిత
అధికారుల వద్ద మొరపెట్టుకుంటున్నాంచూద్దాం అన్న  పెద్దలే ఇప్పుడు

గుత్తేదారులతో కుమ్మక్కై జనం కళ్లల్లో దుమ్ము కొడుతున్నారుబంగారం లాంటి
చెరువు ఇసుకపరాయి రాష్ట్రాలకు తరలిపోతుంటే గుండె చెరువైపోతున్నది

కుతంత్రాలకు ఇక ముందైనా అడ్డుకట్ట వెయ్యకపోతే గోదావరిఖని వాసులకు  సెంటు
భూమి మిగలదునీరే తప్ప భూమిలేని జనానికి నిలువునా గోదావరిలో
మునకేయటమొక్కటే నిఖార్సుగా మిగిలిపోయిన పని ఇక..' ఒక్కయిదు వాక్యాల
ఉత్తరంలో ఎన్నేసి కవిసమయాలుప్రధానాంశం పక్కదారి పట్టినా ఉత్తరం తాలూకు
సాహితీ సౌరభాలను శిరసున ధరించక తప్పదు.. కదా!


పెట్టే శీర్షికలు కూడా  ఉత్తేకరంగా ఉండటం ఉత్తరాల పెట్టె మరో కొత్త
విశేషంఅంత పెద్ద పుటలో ఇంత బుల్లి బాక్సు చదువరుల దృష్టిని చటుక్కున
ఆకర్షించడమంటే వట్టి మాటలతో అయ్యే పని కాదుఅందుకోసమై శీర్షికల చేత
శీర్షాసనం వేయించయినా సరే ఏదో  కొత్త ఆకర్షణ రాబట్టడం అవసరంవందేమాతరం

జాతీయగీతం సార్వజనీనతను గూర్చిరచ్చ నడిచే రోజుల్లో అత్యధిక సర్క్యులేషన్
గల ప్రముఖ పత్రికలోని  ఉత్తరం వేసిన శీర్షాసనం  'వందేమాతరం ఆందోళనలకు
అంత మందా హాజరు?!  వంద  మాత్ర్రం?'  ఉత్తరం మకుటం పుట్టించిన మంటల

సంగతి ఇహ ప్రత్యేకంగా చెప్పాలా?

ఉత్తరాల రచయితలను  తక్కువ చేసే ఉద్దేశం బొత్తిగా లేదని మనవి.  అదుపు
లేకుండా పెరుగుతున్న అపరాల ధరల నుంచికుదుపులే తప్పించి నిలకడ మరచిన
స్టాక్ మార్కెట్ల షేర్ల వరకు  ఎక్కడా సామాన్య మానవుడికి ఊపిరి సలపనీయని

రోజులివిఉపశమనం కోసం హాస్య చిత్రాలు చూద్దామన్నా
ఏడుపులొచ్చేస్తున్నాయిమండే ఎండలుఇంగ్లీషు బళ్ళునిర్భయ కేసులురచ్చ
ఎన్నికలురౌడీ రాజకీయాలుకొత్తగా తత్తర పుట్టిచ్చేస్తున్న  మహమ్మారి 

కరోనా వైరస్ కోవిడ్-పంథొమ్మిదులు!  ఇన్ని దుఃఖాల మధ్యన ఎన్ని
పారాసిటమాల్ బిళ్లలు కడుపులో పడినా ఫలితమేముంటుందని?

కర్ఫ్యూలులాక్డౌన్లుస్కూళ్ల మూతలుకళ్లు మూతలేసుకొని ఎన్ని గంటలని
ఇట్లా కాళ్లాడిస్తూ కుళ్లు టీవీలోకి చూస్తూ జుత్తు పీక్కోడంముక్కూ
మూతీనోరు చెవులూ సర్వం ముసుక్కూర్చోక తప్పదని వైద్యనారాయణల అంత గట్టిగా
హెచ్చరించినాక .. చేసే ఘనకార్యం మాత్రం ఇంకేముంది గనక?

అందుకే.. దాచుకున్న పాత పత్రికలు కొన్ని అటక మీద అట్లాగే మిగులుంటే
భద్రంగా కిందకి దించిందిడేటొక్కటి మార్చుకుంటే చాలు సుమాదశాబ్దాల
కిందటి  పాత పత్రికల ఉత్తరాల  పురాణాలే చిన్ని చిన్ని మార్పులతో
ఇప్పటికీనూ!  దిక్కుమాలిన కరోనా వైరస్ బెంగ నుంచి దృష్టి మళ్లించుకొనే
ప్రయత్నంలో భాగంగా ఉల్లాసం కలిగించే  పత్రికల ఉత్తరాల సాహిత్యాన్ని

ఆశ్రయించడం ఉత్తమ మార్గం!

కుటుంబానికి పిల్లలు ఒక్కరు చాలా.. ఇద్దరు కావాలాఅన్న అంశం పైన

పార్లమెంటులో తీవ్రంగా చర్చ నలిగే రోజులవి. ‘పాలకపక్షం నుంచి గౌరవనీయులు
శ్రీ వాజ్పాయిజీప్రతిపక్షం నుంచి గౌరవనీయురాలు శ్రీమతి   సోనియా
గాంధీజీ ఏకాభిప్రాయానికి వస్తే కుటుంబ నియంత్ర్రణ ఏమంత సాధ్యం కాని
కార్యం కాదు గదా?' అని చీపురుపల్లి నుంచి పీపాల పాపారావానే సామాజిక
చించనాపరుడు చేసిన లోతైన సూచన  ప్రముఖ దినపత్రిక లేఖల కాలమ్ లో
కనిపించిందిఉల్లాసంగా ఉండదా మరి తరహా ఇంచక్కని హాస్యరసం చిప్పిల్లే
ఉత్తరాలే అలసిన మనసులకు ఉపశమనం కలిగించేది!
 ప్రజా సమస్యలకు ఫలితాలు రాబట్టడంతో నిమిత్తం పెట్టుకోకుండా  కష్టకాలంలో

కూడా కష్టపడి ఉన్న విలువైన సమయాన్నిధన్నాని వెచ్చించి మరీ
వార్తాపత్రికల ద్వారా జాతిని జాగృతం చేసే ప్రయాస నిరంతరాయంగా
చేస్తోన్నందుకు వార్తాపత్ర్రికల లేఖారచయిత గణాలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు

తెలుపుకునే సంకల్పమే  సరదా వ్యాసం వెనుక ఉన్న ఉద్దేశంఉత్తపుణ్యానికి
ఉత్తర కుమారులు నొచ్చుకోవద్దని ప్రార్థనేం!
'
=కర్లపాలెం హనుమంతరావు 
బోథెల్; యా










Monday, March 16, 2020

నటి శ్రీదేవి దుర్మరణం నేపథ్యం - హద్దులు తెలియని ప్రసార మాధ్యమాల పద్ధతులు - కర్లపాలెం హనుమంతరావు-మనం దినపత్రిక


కాలాలకు, తరాలకు అతీతమైనది ఆ అభినేత్రి ఆకర్షణ. భాషలు, ప్రాంతాలకు అతీతంగా దేశం ఇంటా బైటా ఒకే తీరైన అశేషమైన అభిమాన సంపద ఆ నటీమణి సొంతం. ఐదు దశాబ్దాల పాటు అటు  కుటుంబ జీవితాన్ని, ఇటు అభినయ వృత్తిని సమన్వయించుకొంటూ మూడొందల పై చిలుకు చిత్రాలలో  ప్రధాన పాత్రలు పోషించడం..  ప్రముఖ కథానాయకులకు దీటుగా ఎప్పుడూ ప్రథమ స్థానంలోనే స్థిరంగా నిలబడి ఉండడం.. ఒక మహిళగా ఈ పురుషాధిక్య ప్రపంచంలో(మరీ ముఖ్యంగా మగవారి కనుసన్నలలో మాత్రమే నడిచే చిత్రపరిశ్రమలో) నిజంగా ఒక అద్భుతమే! అందం.. అభినయం ఉన్నంత మాత్రాన అందరికీ  సువర్ణావకాశాలు కలసి రావు. అడుగుపెట్టిన ప్రతిచోటా అందలం ఎక్కిందంటే  నిర్వచించేందుకు శక్యం కాని అదృష్టమేదో ఆమె  వరంగా పొంది ఉండాలి.  ఊహించని ఎత్తులకు ఎగబాకించిన ఆ అదృష్టం వరంగా పొందిన అత్యంత అరుదైన భారతీయ తారామణులలో శ్రీదేవిది నిస్సందేహంగా ముందు వరస. కాబట్టే అంతుబట్టని శ్రీదేవి హఠాన్మరణం ఖండాతరాలలో సైతం నాలుగు రోజులు  పెను సంచలనం సృష్టించింది.

జీవితమంటే శ్రీదేవికి సినిమానే. జీవితమూ అంతే విచిత్రంగా సినీమాటిక్^గా ముగిసి పోవడం ఎంతటి కఠినాత్ముడి చేతనైనా కంట తడి పెట్టించే దుర్ఘటన. కోట్లాది ఆమె అభిమానుల మనోభావాలకు సంబధించిన సున్నితమైన ఈ  అంశాన్ని స్వదేశంలోని ప్రసార మాధ్యమాలు.. మరీ ముఖ్యంగా తెలుగు ప్రసార మాధ్యమాలు నిర్వహించిన తీరుకు ఇప్పుడు సర్వత్రా నిరసనలు మొదలయ్యాయి.

ఎన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నా ఎదగాలన్న పంతం ఎలా వీడకూడదో శ్రీదేవి జీవితకావ్యం నుంచి కార్యశీలులంతా  నేర్చుకోవచ్చు. సందర్భం వచ్చింది కనుక ప్రసార మాధ్యమాలూ సోదాహరణంగా ఆమె జీవితంలోని వికాసకోణాలను హుందాగా ప్రదర్శించవచ్చు. సమాజం పట్ల ప్రసార మాధ్యమాలకూ ఉండవలసిన బాధ్యతను గుర్తెరిగి ఉండి ఉంటే.. రెండుగా చీలిన టి.వి తెర మీద ఒక వైపు శ్రీదేవి నీటితొట్టి వరకు నిదానంగా నడుచుకుంటూ వెళ్లి హఠాత్తుగా పడిపోయే దిగ్భ్రాంతికర ఊహా దృశ్యం.. మరో వైపు ఆ   అందాల నటి వానలో తడుస్తూ వయసుకు మించిన కథానాయకుడితో చేసే శృంగార నృత్యం  చూసే దురదృష్టం వీక్షకులకు  పట్టి ఉండేదే కాదు.  వివాదాలకు అతీతంగా మెలిగిన ఒక మంచినటి జీవిత చరమాంకం   చివరకు  వివాదాస్పద అంశాల  ముగింపుగా మిగిలిపోవడం వెనుక భారతీయ ప్రసార మాధ్యమాల.. మరీ ముఖ్యంగా తెలుగు ప్రసార మాధ్యమాల బాధ్యతారాహిత్యం ప్రధాన పాత్రే వహించిందన్నది నిష్ఠుర సత్యం.

రాజీపడని పెంకెతనం ఒక్కోసారి  తెచ్చిపెట్టే అభద్రతాభావన , అశాశ్వతమైన బాహ్యాలంకరణల మీద శృతి మించిన   మోజు ఎంతటి ఘనచరిత్ర కలవారి మీదనయినా ఎటువంటి దుష్ప్రభావం చూపిస్తుందో శ్రీదేవి జీవితాన్నుంచే ఓ పాఠంగా గ్రహించవచ్చు. ఆ మేరకైనా సమాచార మాధ్యమాలు తమ వంతు బాధ్యతను కొంతయినా నిర్వర్తించి ఉంటే.. ఇంత చర్చకు ఆస్కారం ఉండేదే కాదు.
వయసును ఎవరం ఎలాగూ  జయించలేం. కనుక కనీసం మనసునైనా కొంత మేరకు  నియంత్రించుకునే ప్రయత్నం చేసుకో గలిగితే అర్థాంతరంగా వచ్చి పడే అవాంతరాలను కట్టడి చేసుకోగల ఆత్మవిశ్వాసం అలవడుతుంది. నిత్యం మిరిమిట్లు గొలిపే వెలుగుల్లోనే తప్ప కనీసం మసక  చీకటి మలుపుల్లోకైనా వెళ్లనిచ్చగించని నేటి తళుకుబెళుకుల తరానికి శ్రీదేవి వంటి 'అతిలోక సుందరి' సినీజీవితమే ఆదర్శంగా ఉంటున్నద ఇప్పుడు. ఆచరణలోని దాని సాధ్యాసాధ్యాలను  గురించి అమాయకమైన యువతరానికి ఉదాహరణగా తెలియ చెప్పే అవకాశం శ్రీదేవి హఠాన్మరణం కలిగించింది. అయినా టి. ఆర్. పి రేటింగుల మీది అధిక ధ్యాస.. ప్రేక్షకులు పక్క ఛానెళ్లకి  మళ్ళకూడదన్న వ్యాపార లాభాపేక్షతో ప్రసార మాధ్యమాలు సామాజిక బాధ్యతను పూర్తిగా  ఉపేక్షించాయన్న విమర్శలు ప్రారంభమయ్యాయి.

గెలుపు కోసం తపించిపోవడం ఎప్పుడూ వ్యక్తిత్వ వికాసానికి అవసరమయే ముఖ్య ప్రేరణే. కానీ విజయపుష్పాల పొదల మాటున కాటువేసేందుకు విషసర్పాలు ఎలా పొంచి ఉంటాయో విప్పిచెప్పి యువతను   అప్రమత్తం చేసే మరో మంచి అవకాశం శ్రీదేవి విషాద మరణం ద్వారా  అంది వచ్చినా.. అలవాటుగా ప్రదర్శించే నిర్లక్ష్యపు ధోరణితో ప్రసార మాధ్యమాలు మరోసారి తమ సామాజిక బాధ్యతను విస్మరించాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సర్వే సర్వత్రా.

అందని ఎండమావుల కోసం ఎగబడే ఆరాటం.. అవి అందినప్పటికీ ఎంత కాలం అందుబాటులో ఉంటాయో ఇతమిత్థంగా తేలని అభద్రతాభావన జీవితంలో ఎన్ని ఉపద్రవాలను తెచ్చి పెడుతుందో   'శ్రీదేవి విషాదాంతం '  ఉదాహరణగా చూపించి మరీ నేటి యువతరాన్ని హెచ్చరించవచ్చు . కానీ.. వీక్షకులంటే టి. ఆర్. పి రేటింగు  మినహా  రక్త మాంసాలున్న మామూలు మనుషులన్న స్పృహ   మరిచినట్లే ఉన్నాయి మన ప్రసార మాధ్యమాలు.  బుడ బుడ పొంగే స్నానాల తొట్టి నీటి అడుగులనుంచి  ఊపిరాడక గిలగిలా కొట్టుకొనే ‘రూప్ కీ రాణీ’ రూపాన్ని గ్రాఫిక్సుల ఆర్భాటంతో ప్రదర్శించడం ఎంత వరకు  టి.వి. చానెళ్లకు సమంజసం?

 శ్రీదేవి చాందినీ జీవితాన్ని   అర్థాంతరంగా ఇలా  ఓ గ్రహణం ఎందుకు మింగేసిందో?! వాస్తవాలన్నీ శాస్త్రీయ కోణంలో నిర్థారణ అయితే గానీ  ఇతమిత్థంగా ఎవరం తేల్చిచెప్పలేం. కానీ  వార్తలకు, నీలి వార్తలకు మధ్య ఆట్టే భేదం  పాటించే అలవాటు తప్పిన మన ప్రసార మాధ్యమాలు మాత్రం చెవిన పడ్డ ఏ పుక్కిట పురాణాన్నైనా చటుక్కున  ఓ వ్యాపార సరుకుగా మార్చేసుకొనే కళలో  ఆరితేరాయి. వ్యాపార ప్రాయోజితాల మీదే తప్ప  సామాజిక ప్రయోజనాల మీద దృష్టి దండగన్న దురదృష్ట ధోరణి ఇప్పటి ప్రసార మధ్యమాలలో పెరిగిపోతోందా? అమ్మ కన్నీటినయినా  అమ్మకం సరుకు చేసుకొని బతికేసే లౌల్యం క్రమంగా  పెరిగిపోతోందా? సామాజిక మాధ్యమాలకి ఎప్పుడో అంటుకొన్న   ఈ   మహమ్మారి ఇప్పుడు ప్రసార మాధ్యమాలనూ ఆక్రమించేస్తుందనిపిస్తోంది. శ్రీదేవి హఠాన్మరణం అనే ఓ అత్యంత విషాదకర సామాజిక దుర్ఘటనను  ఓ పెద్ద 'సేలబుల్' న్యూస్’ ఐటంగా మార్చి విచ్చలవిడిగా ప్రసారం చేసేటందుకు పురిగొల్పింది ఈ మహమ్మారే అనిపిస్తోంది.

ఈ వ్యాసం ఆరంభించే సమయానికి (27, ఫిబ్రవరి, 2018 ఉదయం 11 గంటలా 11 నిమిషాలు) గూగుల్ అన్వేషణ బాక్సులో 'శ్రీదేవి మరణం' అని తెలుగులో టైప్ చేస్తే కేవలం 0.52 సెకన్లలోనే 83, 200 లంకెలు సూచించబడ్డాయి.   శ్రీదేవి  మరణించడానికి కారణం .. 'గుండె పోటు'(Heart attack) గా నమోదయి కనిపించింది. కానీ ఇదే సమయానికి   తెలుగు టీవీ 24 గంటల ఛానెళ్లన్నింటిలో శ్రీదేవి దుర్మరణానికి కారణం ఆమె కుటుంబంలో ఆస్తిని  గురించి వచ్చిన పేచీలుగా ఓ వార్తా వ్యాఖ్యానం చిలవలు పలవులుగా   విస్తరించి వినిపిస్తోంది! 24వ తేదీ  నాటి మొదటి గుండె పోటు కారణానికి.. 27 వ తేదీ నాటి  కుటుంబ ఆస్తుల ఘర్షణల కారణానికి   మధ్య అంతులేనన్ని సినిమాటిక్  మలుపులతో  వార్తా కథనాలు యధేచ్చగా  ఏ ఛానెలుకు తగ్గట్లు ఆ ఛానెలు తనదైన శైలిలో వండి వారుస్తూ ప్రేక్షకుల మనోభావాలతో చెడుగుడు ఆడేసుకొన్న మాట వాస్తవం. ఒక క్రైమ్ మిస్టరీకి మించిన ఉత్కంఠను రేకెత్తించి సగటు టి.వి ప్రేక్షకుడి దృష్టి పక్క ఛానెలు వైపుకి మళ్లకుండా వార్తాఛానెళ్లు పోయిన పెడసరి పోకడలే ఇప్పుడు భావస్వేచ్చావాదులను  సైతం పునరాలోచనలో పడవేస్తున్నాయి.

వార్తా చానెళ్లు  నిరంతరాయంగా నిమిషానికో సారి  భయంకరమైన నేపథ్య సంగీతంతో,  గ్రాఫిక్స్ ఇంద్రజాలంతో ప్రదర్శించే  'బ్రేకింగ్ న్యూస్' దగ్గర  నుంచి  రెగ్యులర్ న్యూస్ బులెటన్ల చివరి స్లాట్ వరకూ ఊదర గొట్టేస్తున్న  వార్తలు అన్నింటికీ ఈ మూడున్నర రోజులూ ప్రధాన కేంద్ర బిందువు 'శ్రీదేవి' మరణ వార్త  ఒక్కటి మాత్రమే! ఏ విధంగా టి.వి. ల ఈ తెంపరితనాన్ని సమర్థించాలో  అంతుబట్టక తలలు పట్టుకుంటున్నారు  భావస్వేచ్చ కోసం నిత్యం పోరు సలిపే సమరయోధులు ఇప్పుడు.

భారత కాలమానం ప్రకారం శ్రీదేవి మరణించినట్లు వార్త బైటికి పొక్కిన 24, ఫిబ్రవరి,2018 11. 30 కి .. ఈ వ్యాసం ప్రారంభించిన సమయానికి (27, ఫిబ్రవరి,2018, ఉదయం 11 గంటలు)మధ్య దాదాపు మూడు రోజులు మించి వ్యవధానం ఉంది. 24గంటల వార్తా ఛానెళ్లు చేసే నిరంతర వార్తా ప్రసారాల ప్రకారం ఈ సుమారు 72గంటల వ్యవధిలో  స్థానికంగా కానీ, జాతీయంగా కానీ, అంతర్జాతీయంగా కానీ మరే ఇతరేతర  వార్తా ప్రాథాన్యత గల విశేషాలు అసలు సంభవించలేదనే అనుకోవాలి కాబోలు!

అన్ని ప్రధాన సంఘటనలను స్థలాభావం వల్ల ఏకరువు పెట్టడం కుదరక పోవచ్చు.  కానీ.. మచ్చుక్కి  ఓ మూడు నాలుగు రోజులు ప్రపంచాన్ని   ప్రభావితం చేసే ప్రధాన వార్తా విశేషాలు ఉటంకిస్తే వార్తాఛానళ్ల నిర్వాకం తేటతెల్లమవుతుంది. చైనా అధ్యక్ష పదవిని జిన్ పింగ్ కు శాశ్వతంగా కట్టబెట్టేటందుకు రాజ్యాంగ నిబంధనకు సవరణలు చేసేందుకు తీర్మానం జరిగింది ఈ మూడు రోజుల్లోనే. జాతీయ స్థాయిలో.. మహారాష్ట్ర చరిత్రలో మొదటిసారి  మరాఠీ చట్టసభ సభ్యులకు అనువాద పాఠం అందచేయకుండా  గవర్నర్  మరాఠీ భాషా దినోత్సవానికి ఒక రోజు ముందు బడ్జెట్ ప్రసంగం చదవడం పెద్ద రాధ్ధాంతానికి దారి తీసింది. నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయి.. భారీ పోలింగుతో ముగిసాయి. ఈ వ్యాసం రాసే రోజునే రాజకీయాలలో నాలుగు దశాబ్దాల పాటు చక్రం తిప్పిన నారా చంద్రబాబు నాయుడి రాజకీయ ప్రవేశ దినోత్సవం.  'తగిన మద్దతు ఇవ్వని పక్షంలో రైతాంగం యావత్తునీ కలుపుకొని కేంద్ర రాజధానిలో ఆందోళన చేసేందుకైనా సిద్ధమ'ని తెలంగాణా ముఖ్యమంత్రి  కెసిఆర్ కుండబద్దలు కొట్టిన రాజకీయ పరిణామం జరిగిందీ ఈ వ్యవధానంలోనే. ఇవేవీ మన తెలుగు వార్తా ఛానళ్లలో చాలా వాటికి అంతగా ప్రాథాన్యమివ్వదగ్గ   వార్తాంశాలుగా తోచలేదు!   శ్రీదేవి మరణ కథనాలు వండి వార్చేందుకే 24 గంటలు సమయం చాలక తన్నుకు లాడుతున్న నేపథ్యంలో విశాఖలో జరిగిన ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక పెట్టుబడుల సదస్సు మీద పెద్దగా శ్రద్ధ పెట్టడం ఎట్లా సాధ్యమవుతుంది .. అనిపించినట్లుంది తెలుగు వార్తా ఛానెళ్లలోని అధిక శాతానికి.

సమయం కేటాయింపులోనే కాదు  ప్రసారం చేసే విధానాలలోనూ వార్తా ఛానెళ్లు ప్రదర్శిస్తున్న పోకళ్లకు నోళ్లు వెళ్లబెట్టేస్తున్నారు ఆలోచనాపరులందరూ. శ్రీదేవి హఠాన్మరణ వార్త ఎంతటి కసాయి గుండెనైనా  కంట తడి పెట్టించే తీరులో ఉంది. సందేహం లేదు.  కానీ అంతటి దిగ్భ్రాంతికర దురదృష్ట సంఘటన వార్తగా ప్రసారమయే సందర్భంలోనూ ఆ అభినేత్రి వృత్తిపరంగా తాను  ప్రారంభ దశలో  వానలో తడిదుస్తుల్లో  వేసిన చిందులు పదే పదే టి వి తెర నిండుగా  ప్రదర్మించి    అభిమానుల మనోభావాలను కించపరచడం ఎంత అమానవీయమో ఛానెళ్ల నిర్వాహకులు ఆలోచించినట్లు లేదు.

వార్తలను వార్తలుగా చదివే విధానానికి టి వి ఛానెళ్లు స్వస్తి  పలికి చానాళ్లే అయింది . కర్ణాకర్ణిగా వినవచ్చే ఊసుపోని కబుర్లే ఇప్పుడు టి.వి. ప్రేక్షకులను అలరించే మసాలా దినుసులు. ఒకప్పటి    పేరు మోసిన దర్శకుడు  పదుగురి నోళ్లలో నలగడమే పనిగా పెట్టుకొని   పద్దాకా చేసే అసందర్భ ప్రేలాపనలను  ప్రముఖంగా ప్రసారం చేయడం  సున్నిత మనస్కులను ఎంతగా చీదర గొల్పుతున్నాయో టి.వి ఛానెళ్ల బాధ్యులకు  అర్థమవుతుందా?

నగ్న చిత్రాల నిర్మాణాన్ని బహిరంగంగా పట్టపగలే చర్చకు పెట్టి సమర్థించే వారికి టి.వి ప్రసారాలలో చోటివ్వడాన్ని మహిళా మండళ్లు ఇప్పుడు బహిరంగానే తప్పు పడుతున్నాయి.  పోలీసు స్టేషన్ల వరకు కేసులు ఈడ్చుకు వెళుతున్నాయి. తమకూ సమాజం పట్ల ఒక  బాధ్యత  తప్పక ఉంటుదన్న స్పృహ ప్రసార మాధ్యమాలకే ఉండి ఉంటే పరిస్థితులు ఇప్పుడింతగా దిగజారుండేవా?! అన్నింటికీ పరాకాష్ట    ఈ మూడు నాలుగు రోజుల బట్టి  మంచినటి శ్రీదేవి దురదృష్టకరమైన అర్థాంతర అనుమానాస్పదమైన మరణం మీద నిరంతరాయంగా కొనసాగుతున్న టి.వి ప్రసార మాధ్యమాల తీరు!  ఏ ఆధారాలూ దొరక్క పోయినా..  కేవలం ఊహపోహల ఆధారంగా  ఊసుపోని పోచికోలు  కథనాలను ఆపకుండా ప్రసారం చేస్తూ ప్రేక్షకుల విలువైన 'వాచింగ్ టైమ్ 'ను వృథా చేస్తున్నందుకు  టి.వి. వార్తా ఛానెళ్లను గట్టిగా నిలదీయవలసిన అవసరం ఇప్పుడు మునుపటి కన్న   మరింతగా పెరిగింది. అనారోగ్యకరంగా ప్రసార మాధ్యమాల  నడుస్తున్న స్పర్థను తిలకిస్తున్న వారంతా చిత్రాలకు మల్లే టి వి ప్రసారాలకూ ఖచ్చితంగా ఒక నియంత్రణా వ్యవస్థ తక్షణమే అవసరమన్న అభిప్రాయానికి వచ్చేసారు.

వినోద విజ్ఞానాలు జన సామాన్యానికి అందించే పుస్తకాల స్థానే ప్రస్తుతం  అంతర్జాలం.. దానికన్నా ముందు టి వి మాధ్యమం  ఆక్రమించాయి. సమాజాన్ని చైతన్య పరచే బాధ్యత గతానికి మించి  ఇప్పుడు మరింత అధికంగా ఉన్న నేపథ్యంలో టి వి  నిర్వాహకుల హద్దులు దాటుతున్న ప్రసార పద్ధతులు ప్రజాహిత వాదులందరినీ కలవరానికి గురి చేయడంలో అసహజమేమున్నది!

నిర్ధారణ కాని అంశాల చుట్టూ ఆసక్తికరమైన కథనాలు అల్లే ఆత్రుతలో టి వి ఛానెళ్లు చేస్తున్న  పొరపాట్లు చాలా సందర్భాలలో ప్రేక్షకులను అయోమయానికి గురిచేస్తున్నాయి. మరెన్నో సమయాల్లో మనస్తాపానికీ దారి తీయిస్తున్నాయి. శ్రీదేవి హఠాన్మరణ విషాద వార్త ప్రసారం చేస్తూనే ఆ సంఘటనకు రెండు రోజుల ముందు నాటి పెళ్లి వేడుకల్లోని ఆమె ఆటపాటలను కలిపి చూపించడం ఆ మహానటి అభిమానుల మనోభావాలను ఎంతలా కుంగదీస్తుందో ఏ ఒక్క ఛానెలూ పట్టించుకున్నట్లు లేదు!

వీక్షకుల  మనోభావాలతో యధేచ్చగా ఆడుకోవడమే తమ భావ ప్రకటనా స్వేచ్చగా టి.వి ప్రసార మాధ్యమాలు భావిస్తున్నాయా?  సమాజాన్ని, వ్యవస్థలని అత్యంత బలంగా ప్రభావితం చేసే ప్రధాన శక్తులలో చిత్రాలకు మించి  ముందుండేది ఇడియట్ బాక్స్.. టి.వి!

భావస్వేచ్చంటే  యధేచ్చగా  వ్యవహరించడమని టి.వి ప్రసారాల నిర్వాకులు అపోహపడుతున్నారు. దానినీ సరిదిద్ద వలసిన బాధ్యత   బావ ప్రకటనా స్వేచ్చ  ప్రగాఢంగా కాంక్షించే  ప్రజాస్వేచ్చావాదులే  తమ భుజస్కంధాల మీదకు  తిరిగి   తీసుకోవలసిన తరుణం ఆసన్నమయింది.
- కర్లపాలెం హనుమంతరావు
బోథెల్ ; యూఎస్
karlapalwm2010@gmail.com
WhatsApp +918142283676
***(మనం - దినపత్రిక ప్రచురితం )

Saturday, March 14, 2020

సరదాకేఃr ఇదో.. ఓ.. ఆదాయ మార్గం! -కర్లపాలెం హనుమంత రావు -సూర్య దిన పత్రిక



రకరకాల  ఎన్నికలు ముంచుకొస్తున్నాయి కదా! ఓ మూలట్లా  మన్మోహన్ సింగులా
మూలుగుతూ కూర్చుంటే ఎట్లా? ఎంచక్కా  పోయి ఓ సారరి ఆ ముసలయ్యగారిని కలిసి

రారాదా!’ అని మా ఆవిడ  నస. వెళ్ళి కలిసాను ముసలయ్యగారిని. మనసులోని మాట
పెదాల మీదకు రానే లేదు,  పెద్దాయన చప్పట్లు కొట్టి పి.య్యేని పిలిచి
నన్నప్పగించేశాడు. ‘అయ్యగారికి ఇవాళ మౌన దీక్ష. స్పీకరు పని చెయ్యదు. మరీ
ముఖ్యమైతే తప్ప  రిసీవరూ బైటికి తియ్యరు. ఏమిటీ విషయం?’ అనడిగాడా
పి.య్యే.
‘మా వార్దు నెంబరు పదమూడుకి నిలబడదామనీ! ముసలయ్యగారి పార్టీ సహకారం

కావాలి’ అన్నా టూకీగా. ‘మరైతే వట్టి చేతులతో వచ్చారేంటండీ బాబూ! మీ జాతక
చక్రం.. సూర్యమానం ప్రకారం వేసిందొకటి, చంద్రమానంతో కలిపిందొకటి తీసుకు
రావాలి. గ్రహాలు, రాశులు.. వాటిని బట్టే అయ్యగారి అనుగ్రహం!’ అన్నాడా
పి.య్యే.
‘తమిళనాడు దివంగత జయలలితమ్మాళ్ గారికీ ఇట్లాగే జ్యోతిష్కం,
సంఖ్యాశాస్త్రాలంటే తగని పిచ్చ. జాతక యోగం ఉచ్ఛస్థితిలో
ఉందనుకున్నవాళ్ళకు మాత్రమే టిక్కెట్లిచ్చారు ఒకసారి ఎన్నికల్లో.
ముఫ్ఫైతొమ్మిది స్థానాలగ్గాను ముష్టి తొమ్మిదంటే తొమ్మిది మంది మాత్రమే
గెలిచారంతా కలిపి. గెలుపుకీ గ్రహాల వలపుకీ లింకేంటండీ బాబూ?

ప్రజాస్వామ్యంలో ఘనవిజయానికి కావాల్సింది ప్రజల అభిమానం కాదుటండీ!’
అన్నాను కసిబట్టలేక.
‘టయానికి గుర్తు చేసారు!  ఆ జయమ్మగారి కన్నా మా ముసలయ్యగారు మరో
రెండాకులు ఎక్కువ.  ఇట్లాంటి పరాశాస్త్రాల పైన విపరీతమైన నమ్మకం. మీ

ఇంటికో సారి మా వాస్తుశాస్త్రులు వస్తారు. అన్నీ సవ్యంగా ఉంటేనే మీ మొర
మా పెద్దాయన ఆలకించడం! మొన్నీ మధ్యన ఇట్లాగే ఒక బొజ్జాయన ఇంటికి
ఈశాన్యంలో పూజామందిరం పెట్టుకుని  అవకాశం చేజేతులా జారవిడుచుకున్నాడు.’
 ‘ఇంటికి ఈశాన్యంలో మందిరముంటే దోషమా!’’

‘మందిరముంటే కాదు మహాప్రభో! అందులో వినాయకుడు, ఆంజనేయుడు లాంటి
బాహుబలులుంటేనే మోసం. ఈశాన్యంలో బరువులుంటేనే కదటండీ ఊహించని

ఉత్పాతాలొచ్చిపడేదీ! ఆ మాత్రం వాస్తుజ్ఞానం కూడా లేకుండానే వార్డు
మెంబర్లై పోదామనే!’ పి.య్యే మాటల్లో వెటకారం.
ఇండియాని ఈ కరోనా తరహా మాయదారి రోగాలు  ఎందుకిలా నలిపేస్తున్నాయో ఇప్పుడు
బుర్రకెక్కింది స్వామీ! ఈశాన్యం దాకా పాకిన అంత  లావు హిమాలయాలు.. వాటి
వెనకమాల్న చైనా కొరియా గట్రా దేశాలాయ! వాటి మాయ! అవి పట్టించుకోకుండా

కుంభకోణాలనీ, ద్రవ్యోల్బణాలనీ, ఇరుగు పొరుగు దేశాలతో ఇబ్బందికర
సంబంధాలనీ.. పాపం మనం మోదీ, షా మామయ్యలను హమేషా ఆడిపోసుకుంటున్నాం

నిష్కారణంగా'

నా ఆలోచనల్లో నేనుండగానే భుజం గోకి మరీ అడిగాడా  పి.య్యే ‘కొంపదీసి మీ
ఇంటిగ్గానీ సింహద్వారం దక్షిణం వారగా  ఉందా ఏంటీ? ముందే చెప్పండి బాబూ..
ఆనక నన్నెన్ని దెప్పీ నో యూజ్’

‘అమెరికా శ్వేత సౌధం తలవాకిలే దక్షిణానికి అభిముఖంగా ఉంటుంది తమ్ముడూ!
మరా దేశం ఇన్నేళ్ళబట్టి అగ్రరాజ్యంగా  ఎట్లా నిప్పులు చెరుగుతుందో?’

‘వాదనలొద్దిక్కడ. ఆ ముచ్చట్లన్నీ టీవీ పెట్టెల్లో! ముసలయ్యగారు
పరాశాస్త్రాలన్నీ నమ్ముతారు. ఆయన ముక్కు చూసారా? దూలం భారీ. తిన్నగా కూడా
ఉండదు. అయ్యగారి ముక్కువాస్తు ముందే తెలుసుకుని వచ్చుండాల్సుందయ్యా
తమరు!’

బిక్క మొహమేయడం నా వంతయింది. పోయిన ఏడాదే మా అడ్డగాడిదకు ఎక్కడా ముడిపడే
యోగం కుదర్డంలేదని ఇట్లాగే ఏదో దిక్కుమాలిన శాస్త్రం  ఘోషిస్తోందంటూ నా

ఘోష లెక్కచెయ్యకుండా వీధి ముఖ ద్వారాలు రెండూ సగం మూయించేసింది మా
మహాతల్లి. ఇప్పుడీ ముసలయ్యగారి వాస్తు ఇంకేం మూయిస్తుందో.. ద్యావుడా!’

 ‘ముందొక  సారిట్లా వచ్చి ఈ నీళ్ళ తొట్లో మీ కిష్టమైన రంగు ముక్క ఏదన్నా
తగలేయండి బాబూ! మీ అసలు రంగేంటో బైట పడేందుగ్గాను ఇదో చిన్న స్లిప్
టెస్ట్ అన్నమాట!’ అంటో గారపళ్ళు చూపించాడా  పియ్యేగారు.
రంగులు మారుతున్న  నామొహం వంక చూసి ‘మీ సందేహం అర్థమైందిలేండి! ఈ తొట్లో
ఉన్నది  సీదా సాదా జలగ కాదండీ బాబూ! ఆఫ్రికా ఖండం యవుండే దేశం నుండి

తెప్పించిందండీ! ప్రపంచ ఫుట్ బాల్ పోటీలల్లో ఫలితాలు ముందే చెప్పిన
ఆక్టోపస్ 'పాల్' లేదూ.. దానితో క్రాస్ చేయించి పుట్టించిందండీ ఈ
బుజ్జిముండను! తండ్రి తాలూకు జోస్యం చెప్పే లక్షణాలు ఎక్కడకండీ పొయ్యేదీ?
ఒక్క పాలిటిక్సులోనే కాదు వంశపారంపర్యాలూ గట్రా! మోదీ వద్దని దులపరిస్తే
మాత్రం  మాయమై పోడానికి ఇదేమన్నా గుడిసెకు పట్టిన ఆర్డినరీ బూజా? వాస్తు
బూజు బాబూ.. వాస్తు మోజు’
 ‘ఆటల  మీద రంధి పెంచి బెట్టింగ్ సొమ్ము  రెట్టింపు గుంజేందుకు మాస్
మీడియాతో మాఫియా ఆడించిన నాటకాల్రా బాబూ ఆ ఆక్టోపస్సుల యాక్టింగులు!
యుద్ధ రంగంలోకి దిగే ముందే శత్రువర్గం మానసికంగా కుంగేటందుకు వాడుకునే
గూఢచర్యానికి నకలు.'
నా ఊహల్లో నేనుండగానే పెడబొబ్బలు పెట్టేసాడా పి.య్యేసామి. నా చేతులు
పట్టుకు తెగ ఊపేస్తూ ‘కంగ్రాట్సండీ కామాయ్ సారో! మీరీ పరీక్షలో కూడా
నెగ్గేశారోచ్! ఇహా కోయంబట్టూరు నాడీ జోస్యం కూడా తెప్పించేసుకుని రడీగా
ఉంచుకుంటే సరి.. మీ పని ఫినిషయిపోయినట్లే! ఆఁ.. అన్నట్లు.. ఈ లోపల్నే
నామనక్షత్రం ప్రకారం తమ పేరును ఎట్లా మారిస్తే దిగ్విజయం సిద్ధిస్తుందో
డాక్టర్ దైవజ్ఞానం  కూడా ఓ  నివేదిక తయారుచేసిస్తారు. ఓ.కే నా?’
‘పేరు మార్చుకుంటే అపజయలక్ష్మి ఆనవాలు పట్టకుండా వదిలేస్తుందనా?
దేవుళ్లను కూడా తప్పుదారి పట్టించే కొత్త  రకం గుంటనక్క ట్రిక్కా!’
‘మీరున్నారు చూసారూ.. భలే చిలిపి సార్! మనసులో ఏదున్నా అస్సలు దాచుకోరు!
ఐ ఎప్రిషియేట్! ఇది వరకో చిన్నారావును.. ఇట్లాగే 'చీ..అన్నా..రావు'గా
సాగదీసిం తరువాతనేనండీ అతగాడి జాతకం మొత్తం తిరగడ్డం మొదలెట్టిందీ!

దివ్యజ్ఞానం గారి విజ్ఞానాన్ని సందేహించకండి! అరవై ఏళ్ళ అనుభవసారం.
వాజిపేయి, సోనియాజీ, కరుణానిధీ, నెల్సన్ మండేలా, జార్జ్ బుష్, ఒబామా,

సద్దాం హుస్సేన్ లాంటి పెద్ద పెద్ద జాతీయ, అంతర్జాతీయ శాల్తీల నాడులే
పట్టి మరీ జోస్యం రాబట్టిన ఘనాపాటి ఇతగాడు! మీ డౌట్లన్నీ తీరిపోతాయ్..
ముందీ బౌండు బుక్కు  చదవండి’ కవిలకట్టొకటి నా మొహాన ఠకీమని  కొట్టి
లోపలికి తారుకున్నాడా పియ్యే.

బౌండా అది? వందలాది ఏళ్ళ కిందటి తాళపత్ర గ్రంథాల ఆధారంగా చెప్పే నాడీ
జోస్యంట ఆ దిండు! నోస్ట్రస్ డేమ్ జోస్యం కన్నా డేమ్ ష్యూర్ గా డాక్టర్
దివ్యజ్ఞానం జోస్యముంటుందని డబ్బాలు! ఇరాక్ యుద్ధం, ఇందిరమ్మ మరణం, రజనీ
బాషా హిట్టూ..బాబా ఫట్టూ, బందిపోటు వీరప్పన్ చావు, వెస్ట్ బెంగాల్
లెఫ్టిస్టుల ఫేటు, దక్షిణాది సునామీలు, ఆమ్ ఆద్మీ కేజ్రీవాలు  రైజు,
పెద్దనోట్ల రద్దు, ముంబై దాడులు.. ఆఖరికి  ఆర్జీవీ మూడ్స్ తో సహా హిస్టరీ

దృష్టిలో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అనింపార్టెంట్ స్టోరీస్ ఆల్మోస్ట్
అన్నీ నేటివ్ టు ఇంటర్నేషనల్ లెవెల్లోవి సర్వం .. అవి   జరక్కముందే..
విఘడియల వివరాల్తో సహా పర్ఫెక్టుగా లెక్కగట్టి మరీ తేల్చినట్టి

రిజల్ట్సని కోతలు! ఆ దస్త్రాలన్నీ చదవడం సంగతట్లా పక్కనుంచి..
మొయ్యడానికే ముందు కోడి రామ్మూర్తిగారి  కండబలం కావాలి!
కరుణానిధిగారు శుద్ధ చార్వాకవాది. హస్తసాముద్రికాలు.. నాడీ జోస్యాల వంటి
అపరశాస్త్రాలు ఆయన వంటికి పడవు. అంత పెద్దల వ్యక్తిగత జీవితాల లోతుల్లో
కెట్లా చొచ్చుకెళ్ళగలిగాడబ్బా ఈ డాక్టర్ దైవజ్ఞానం! ఈ లెక్కన చూసుకుంటే..
కొరియా- ట్రంపుల ఒప్పందం, ఇరాన్ సులేమానీ మరణం లాంటి వాటిని గురించి
చెప్పుకునేవీ  డబ్బాలేగా!


ఇంకాస్సేపు గానీ ఇక్కడే పడుంటే.. ఈ ముసలయ్యగారి నస పి.య్యే బల్లిశాస్త్ర
పరీక్ష కూడా బలవంతంగా  చేయిస్తాడు. గ్రహణం బాలేదు. వచ్చింది గ్రహణం పూట
కాబట్టి  నైటు దాకా వెయిటింగులో పెట్టి తలవాకిట్లో పళ్ళె పెట్టి రోకలిబండ

నిలబెట్టమనే టెస్టూ తలపెట్టచ్చు.

ఎన్నికలల్లో ఎదుటి పక్షం అభ్యర్థి  నామినేషనెయ్యడానికే కురుక్షేత్ర
యుద్ధంలో తలబడ్డంత  ఘోరంగా ఉందే ఇప్పటి పరిస్థితి! గెలుపు మాట ఆనక, ముందు

మన వేలైనా ఓటు మిషను  మీట మీద పడనిస్తుందో లేదో.. పాడు రాజకీయం!
ప్రచారాలు మాత్రం?  ఓటెయ్యమని అడిగేందుకు పంచ ముందు కెళ్లడం ఆలస్యం.

పింఛన్లు పెంచు, కోకలు పంచు, పంచెలు ఇప్పించంటూ ఒహటే దంచుళ్లు! ఓటర్లతో
ఓ మంచీ చెడూ చెప్పుకోడాలిప్పుడు మరీ ఓల్డ్ ఫ్యాషన్సయిపొయ్యాయ్! ఓట్ మేటర్

అంటే ఓన్లీ మనీ మేటర్!

అసలే కరోనా రోజులు కూడా! కనబడ్డ కుంకెవరైనా కరచాలనం వంకన కక్ష కొద్దీ ఏ
మాయదారి రోగమో  వంటికి అంటించిపోతే! నిలబడ్డం మాట అటుంచి ఓటేయడానికైనా
వచ్చే ఎన్నికల దాకా శాల్తీ మిగిలే ఛాన్సుంటుందో ఉండదో.. డౌటే! ఎన్నికల్లో

నిలబట్టానికి ఎన్ని తిప్పలురా ద్యావుడా?

ముందు ముందు జరగబోయేది ముందుగానే తెలిస్తే ‘యెస్’ బ్యాంకు తుస్సు
మంటుందని ముందే ఎందుకయ్యా ఏ జ్యోతిష్కుడూ  నోరు పెగిలింది కాదూ? సి.యం
పదవి హుళక్కేనని ముందే ఏ న్యూమరాలజిస్టయినా సింధియా చెవిన చేరేసుంటే
అంత లావున ఎం.పీ లో కాంగీల గుంపు  గెలుపుకని కిందా మీదా పడుండునా? నిజంగా
జరిగేది నిఖార్సుగా చెప్పేదుంటే నిర్భయ నిందితులందరికి ఉరిశిక్షలు

ఎప్పుడో  నిర్భయంగా ఇప్పుడైనా చెప్పమనండి.. చూతాం! గీత దాటిన శాసనసభ్యుల
పైన వేటు పడే సుముహూర్తం ఎప్పుడో ఎవరికీ అంతుబట్టడంలేదు. ఆ గుట్టేదో
విప్పమనండి.. విందాం!


పండించిన పంటకు మంచి రేటు పలికేది ఎన్నడో ముందే తెలిస్తే కష్టపడైనా
సరుకును దాచుకుని నష్టపోడుగా పాపం రైతన్న! నైరుతీ రుతు పవనాల రాక ఇదీ అని

నిక్కచ్చిగా తేలితే ముందుగానే దుక్కి దున్ని విత్తులు జల్లి నెత్తికి
చేతులు తెచ్చుకునే దుస్థితి తప్పునుగా అన్నదాతకు! వాయుగుండాలు తీరం దాటే

తీరు అంతుబట్టక తలలు పట్టుకుంటున్నారు పెద్ద పెద్ద వాతావరణ
శాస్త్రవేత్తలు. సదరు నిపుణులందరికీ జ్యోతిషంలో గానీ  గట్టిగా
తర్ఫీదిప్పిస్తే  దేశాన్నీ, జనాన్నీ వరదల బెడద నుంచీ
తప్పించిన్నట్లవుతుంది కదా!  ఏ సర్కారీ చాకిరీ ముఖాన ఎప్పుడు రాసుందో
ముందే ముఖం మీది రాతలు చదివే పండిత ప్రకాండులెవరైనా  చదివి చెప్పగలిగితే

ఇన్నేసి సెట్లతో విద్యార్థులకు కుస్తీపట్లు తప్పును కదా! సూపర్ సక్సెస్
ఫార్ములా ముందే ఫిక్సైపోయుంటే చిన్న నిర్మాతలిలా తలలు తాకట్టు పెట్టుకుని
మరీ చెత్త చిత్రాలు పోగేసే రొష్టు తప్పును కదా? పసిడి ధర ఇదిగిదిగో

పడిపోయింది, గ్యాసు ధర అదిగదిగో అంతర్జాతీయంగా ఎక్కడికో ఎగిరిపోతోందంటో
పచ్చడి మెతుకుల కూటిక్కూడా తడుముకునే బడుగుజీవిని కంగారు
పెట్టేస్తున్నాయ్ బంగారం కొట్లు, బండి చవురు బంకులు! బంగారంలాంటి

జీవితాలు వాటి చుట్టూతా గిరిటీలు కొట్టకుండా కాపాడవచ్చు కదా కాలజ్ఞానం
పైన అంత అపారమైన అవగాహనవుండే నవీన బ్రహ్మంగారులు నోరు తెరిచి బోధించి! ఏ

అపరాల ధర ఎప్పుడు ఎంత వరకు పెరుగుతుందో.. స్టాకు బజార్లలో ఏ షేరు ధర ఏ
క్షణంలో ఎంత లోతుల్లోకెళ్లి పడిపోతుందో .. ముందే కనిపెట్టేసి ఓ ఉగాది

పంచాంగం లాంటిది రిలీజు చేసేస్తే.. కన్రెప్ప కొట్టే లోపలిట్లా లక్షలూ
కోట్లూ ఆవిరయిపోడాలు.. ఏడుపులు ఉండవు కదా! దాంతాడు తెగా.. ఒక్క నోస్టర్

డ్యామూ నోరూ అడ్వాన్సుగా పెగలదు! సరి కదా.. తీరా తాడు తెగి బక్కెట బావిలో
పడిం తరువాతనా.. ఇదిగిదిగో.. ఇలా జరుగుతుందనేగా మేం ముందే కనిపెట్టి

ఘోషెట్టింది!’ అంటూ టీవీల ముందు చిందులు!
లావు లావు ‘లా’ పుస్తకాలు.. అవీ ఇవీ.. చదివి ఐయ్యేయస్సులు ఐపీయెస్సులూ
ఐపొయ్యే సార్లు, దొరసాన్లు ఇంకాస్త మనసు పెట్టి ఆ కూస్త బల్లిశాస్త్రమో,

పాదసాముద్రికమో కూడా ఔపోసన పట్టేయరా నిఖార్సైన  ప్రభావమంటూ నిజంగా
పరాశాస్త్రలకే   ఉండుంటే!

వాస్తవేమిటంటే..
వాస్తు వసతి కోసమని ఎన్నడో ఏర్పాటైన ఓ  చిన్న నిర్మాణశాస్త్రం. గుహల
నుంచి కాంక్రీటు గృహాల దాకా ఎదిగిన మనం  ఇంకా ఆ ఆకు కుటీరం నాటి అవసరాలను
తీర్చిన పాత నియమ నిబంధల చూరులు పట్టుకు వేళ్లాడుతు ఉంటే మానవ వికాస
నిర్మాణం ముందు ముందు మరంత విస్తరించడం ఎప్పుడు?

వరాహ మిహిరుడి వాస్తు ప్రకారం  మహానగరాలల్లో కాని  నిర్మాణాలు సాగిస్తే
ఇరుగింటి మురుగు పారేది పొరుగు పడక గది కిందనే!  మయామాతా, మానసారా.. ఎవరి
వాస్తు ఘోష వాళ్లది. వాటిలో వాటికే ఏకీభావం లేని పరాశాస్త్రాలతో  నేటి
నాగరిక మానవుడు ఏకీభవించడం పరాచికం కాదా?

వీరేశలింగంపంతులుగారు అమావాస్యనాడు ఉద్యోగంలో చేరి మహోపాధ్యాయుడిగా
కీర్తి గడించారు. సురవరం సుధాకరరెడ్డిసారు  రెండువేల నాలుగు  నాటి
ఎన్నికల్లో రాహుకాలంలో నామినేషన్ వేసి  మరీ ఎం.పీగా గెలుపు సాధించారు!


నాడీ జ్యోతిషం వేదవిజ్ఞానం కాదు. నాలుగో శతాబ్దం దాకా వేదాలలో వాస్తు
ప్రస్తావనే లేదు. ఎన్ని వేద సంహితలలో భూతద్దం పెట్టి వెతికినా
సంఖ్యాశాస్త్రం కనిపించదు. మనిషి వస్త్రలాభం, వాహన యోగం గోడ మీద పాకే

బల్లా నిగ్గుతేల్చేది? సిల్లీ! కుళ్లు బుద్ధులతో మనం అనుక్షణం కొట్టుకు
చస్తూ ఆ కలహాలకి కారణాన్ని పురుగులేరుకు తినే  బల్లి మీదకా తోసెయ్యడమా..

దారుణం!

ఈ సారి ఇంకేదో మూడు కాళ్ళ కప్ప బొమ్మ పట్టుకుని నవ్వుతో బైటికొచ్చాడు
పి.య్యేసారు. చైనా వాస్తు ఫెంగ్-షూయి ప్రకారం మూడు కాళ్ల కప్ప గుమ్మం
ముందు కూర్చున్నట్లుంటేనే ఇంటి యజమానికి మనోసిద్ధి ప్రాప్తిరస్తట!
ఇట్లాగే ఇంకా ఏవేవో చాలా శాస్త్ర మర్మాలు విప్పచెప్పే ఉత్సాహంలో ఉన్నాడు
ముసలయ్యగారి పర్శనల్ సహాయకుడు! కానీ నా మానసికస్థితి అప్పటికే ఒక గట్టి

స్థితప్రజ్ఞతను సాధించింది.  మూడు కాళ్ల కప్పతో సహా గిరుక్కున వెనక్కి
తిరిగి వచ్చేసా.

‘అష్టమి, మంగళవారం, ఆ పైన గ్రహణం. బయల్దేరిందేమో రాహుకాలం. అదీ వర్జ్యం
వదలక ముందు! ఎదురుగా వచ్చిందేమో నల్ల పిల్లి! కాస్తంత సేపు ‘కూర్చుని
నెత్తి మీదిన్ని నీళ్ళు జల్లుకుని పోవయ్యా మగడా!’ అన్నా! వింటేనా?

పరగడుపున బల్లి భుజం  మీద పడ్డప్పుడే అనుకున్నాలే, ఇవాళేదో ముదనష్టం
ముహాన రాసిపెట్టుందని..’ ఇట్లా  సాగుతుంది ఇంట్లో మా ఆవిడ పురాణం. రక
రకాల శాస్త్రపరీక్షలకూ,  ఎన్నో రకాల నివేదికలకూ, ఇదిగో ఈ మూడుకాళ్ళ కప్ప

బాపతు  దిష్టిబొమ్మలు గట్రాలు మరికొన్నింటికి.. అంతా కలసి ముసలయ్యగారి
పి.య్యేమనిషి  నా మూతి పళ్లు రాలగొట్టి   రాల్చుకున్నవి   అక్షరాలా అర్థ

పదివేల నూటపదహార్లు! వాటి  గురించే ఆవిడ షష్ఠాష్టకాలు!
 ‘సొమ్ము పోతే పోయిందిలేవయ్యా! ఆ వార్డు మెంబరూ వద్దు.. పాడూ వద్దు! ఎవరం
ఏ పని చేసేది అయినా ఆదాయం కోసమేగా! ఇంచక్కా నువ్వూ ఆ చైనావాళ్ల వాస్తు
బొమ్మలు అమ్మే కొట్టు వెంటనే మొదలెట్టు’ అనేసింది ఆవిడే మర్నాడు

వాతావరణం చల్లబడి మెదడు మళ్లీ చురుకుగా పనిచేయడం మొదలు పెట్టిన తరువాత!
నిజమేగా! ఎవరం ఏ పని చేసేది అయినా ఆదాయం కోసమేగా! ఇదీ ఓ ఆదాయ మార్గమేగా!
***

Saturday, March 7, 2020

సరదాకేః మగువంటే మగవాడి మర-యంత్రమా? -కర్లపాలెం హనుమంతరావు





చెయ్యగా చెయ్యగా పనుల్లో సులువు తెలుస్తుందన్నది  లోక నుడి. మనుషులకే కాదు.. దేవుళ్లకూ ఈ సూbత్రం వర్తిస్తుంది. 'విధినా తావభ్యస్తం యావద్స్పుష్టా మృగేక్షణా' అని  ‘సుభాషిత రత్నమాల’ ముక్తాయించడానికి sఅదే కారణం. లావణ్యంతో ఓలలాడే లలనామణి సృష్టి కోసం లీలామానుషుడు ఎన్నో మగబొమ్మలను తయారుచేసాడన్నది  ఈ శ్లోకం తాత్పర్యం. ఆడవాళ్లను అందుకే ఫెయిర్ సెక్స్ అనడం! 

ఫెయిర్ నెస్ ఎతుంటే ఏం లాభం? చపల చిత్తం మగవాడి బుద్ధి ముందు స్థిత ప్రజ్ఞత పుష్కలంగా ఉన్నా స్త్రీ సునిశిత గ్రహణ శక్తి మొక్కవోతూనే ఉంది. సృష్టి ఆది నుంచి ఇదే బాధ. మగవాడు ఆవులించక ముందే మగువలు వాడి పేగులు లెక్కెట్టేస్తారు!  ‘అందుకే ఆడదంటే మగవాడికంత బెదురు’ అన్నారు హిల్లరీ క్లింటన్ ఓ  సందర్భంలో! అబలగా అన్నింటా మగవాడు చిన్నబుచ్చే  ఆడది నిజానికి జగద్గురు శ్రీ శంకరాచార్యుని భాష్యం ప్రకారం అపర పరాశక్తి.. అతిలోక సుందరి శ్రీ లలితాదేవి.. కూడా! 
పరమేశ్వరి అనే పదానికి పరమార్థమేదో బుర్రకు  తట్టక ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ అంటూ తనకు తానే సర్దిచెప్పుకునే ‘బుద్ధి’తక్కువ శాల్తీ మగవాడు.  అయ్యగారి దృష్టిలో ముద్దరాలు అంటే ముద్దుపళని రాధికాసాంత్వనం మార్కు రాధాదేవి. ‘కంటికి నిద్ర రాదు, విను, కాంతుని బాసిన నాటినుండియున్/వంటక మింపు గాదు..’ టైపు విరహబాధలు తెగ పడిపోయే అష్ట శృంగార నాయికల్లో సందర్భాన్ని బట్టి ఎవరో ఒకర్తె. అందుకే  ఆమెను అందాల భరిణ అంటూ ఉన్నవీ లేనివీ ఊరికే ఊహించుకుని మరీ ‘కురులకు వందనములు తెలి గోము మొగంబునకున్ జోహారు, నీ/ యరుదగు కంబు గంఠమున కంజలి, నీ కుచ కుంభాళికిన్/ కరముల్ మోడ్చెదన్, బెళుకు క్రౌనుకు మ్రొక్కెద, బంచబాణ మం/దిరములకున్ సతీమణి! పదింబదిగా పదివేల దండముల్' అంటూ  దండకాలు రాసుకునేది. నడివయసు దాటినా మిడిమేళపు కవిత్వంతో సడీ సప్పుడు లేకుండా తన మానాన తాను తన పని తాను చూసుకునిపోయే చానను కూడా సామాజిక మాధ్యమ వేదికల మీద కీడ్చి కీచకుడికి మించి రచ్చ చేసేది మగవాడే.  కేస్టింగ్ కౌచ్ లు ఉన్నంత వరకు విరుగుడు తంత్రంగా  ‘మీ.. టూ’ లు పుట్టుకురాక తప్పదు. 
నిజానికి మహిళ ఏనాడూ ‘వాల్మీకి రామాయణం’ పట్టించుకోకుండా వదిలెట్టేసిన ఊర్మిళమ్మలా ఊరికే పడి నిద్రపోయిందిలేదు. అర్జనుడి రాక ముందు నుంచే రాజ్యం దర్జాగా నడిపించిన   ప్రమీల  ప్రజ్ఞే  ప్రమదలది ఎప్పుడూ. నేటి లోకవ్యవహారం కూడా ఆ తీరులోనే  తరుణుల ఆధ్వర్యంలో సాగుతుంటే ఇప్పుడీ మహిళా దినోత్సవాలు గట్రా అంటూ ఆర్భాటాల అక్కరే ఉండేది కాదు.  

15వ శతాబ్దంలో ఇండియా  పర్యటనకని వచ్చిన నికోలో కోంటీ అప్పటి హిందూ రాజ్యాలలో భర్త చనిపోయిన భర్తతో బతికున్న భార్యనూ చితి పైకి ఎక్కించడం చూసి విస్తుపోయాడు.  ఆ కాల్చడాలు అవీ ప్రత్యక్షంగా ఇప్పుడు కనిపించవు. కానీ.. కడుపులో పడ్డ మరుక్షణం నుంచి కాటిచితిలో పడే ఘడియ వరకు ఏదో ఓ దుర్మార్గపు రూపంలో ఆడాళ్లను కాల్చుకు తినడాలు మాత్రం తప్పడంలేదు ఇప్పుడు కూడానూ! 
వేదాల కాలంలో  స్త్రీ పురుషులిద్దరిలో గొప్ప ఎవరన్న  వాదమే వినిపించింది కాదు. జనకుడి  విద్వత్మహాసభలో గొప్ప తర్కతో తనను తలకిందులు చేసినప్పుడు మహాజ్ఞాని యాజ్ఞవల్కుడు మొహమాటం లేకుండా  మైత్రేయి ముందు మోకరిల్లినట్లు  మనకు కథలున్నాయి.  ఎప్పుడు రాజుకుందో గాని ‘అహం’ అనే ఈ నిప్పు రవ్వ.. ఇప్పటి  మగవాడి మనస్సులో  ‘అహం బ్రహ్మోస్మి’ అన్న అగ్నిని తెగ ఎగదోసేస్తోంది. మగవాడి ఆధిపత్య జ్వాలలకు సుకుమారమైన బతుకులు ఎన్నెన్ని  కాలి బూడిదయిపోతున్నాయో ప్రతీ రోజూ! మరి ఉద్యమం వద్దంటే ముద్దరాలు మొద్దులా ఓ మూల పడివుంటుందా?    

సృష్టిధర్మ రీత్యా పురుషుడి దేహం స్త్రీ శరీరం కన్న దృఢం అయితే కావచ్చును. అంత మాత్రం చేతనే అన్నింటా అతగాడు అధికుడు ఐపోతాడా? నాగరికత ఆరంభ యుగాలలో ఆడదే కుటుంబానికంతటికీ తిరుగులేని పెద్ద. పితృస్వామ్యవాదం బలిసి పెత్తనం రుచి మరిగిన తరువాతే మగవాడో మహారాజు.. ఆడది అతగాడి ఇష్టారాజ్యానికి ఆడి పాడే మరబొమ్మగా మారిపోవడం. 

బాల్యం నుంచే బాలికల ఊహలు మహా సునిశితంగా సాగుతుంటాయంటారు.  తన మొద్దు బుర్రకు అందని ఊహల  ఆడదాని చేతిలో ఓటమి  అంటే ఊహూఁ మగవాడికి మరి మండదా! సాటి మగవాళ్లల్లోఎంత నామర్దా? అందుకే అడ్డదారుల్లో అయినా ఆడదానిని మగాడు లొంగదీసుకునేది. కానీ ఆడదాని మనసు ఊరుకుంటుందా? ‘జీవితమనే మాయాజూదంలో మగవాడిదేనా ఎప్పుడూ గెలుపు?/ అంటే ఖాయంగా అది కనిపించని శకుని విసిరే పాచికల ఆటే’ అనుకుంటుంది ప్రముఖ  తమిళ స్త్రీవాద రచయిత్రి ఉమా నారాయణ్ ‘కల్చరల్ డిస్లొకేషన్స్: ఐడెంటిటీసి, ట్రెడిషన్స్ అండ్ థర్డ్ వరల్డ్ ఫెమినిజమ్ ‘ చదివిన తరువాత.

వాస్తవానికి మానవ జీవనకావ్యంలో స్త్రీ పురుషులిద్దరూ  రఘువంశ కర్త కాళిదాసు బాషలో చెప్పాలంటే వాగర్థాలు! ఆదిదంపతులకు మల్లే వాళ్లిద్దరూ చెరో సగంగా సమన్వయంతో నిభాయిస్తే తప్ప జగత్ అనే ఈ మహా రథం సక్రమంగా ముందుకు సాగదు!  'న శివేన వినా దేవీ, న దేవ్యాచ వినా శివః' ! అమ్మ లేకపోతే అయ్య లేడు. అయ్య లేని పక్షంలో ‘అమ్మ’ ఉండదు. వేటూరివారి పాటలో ఇంకా వివరంగా చెప్పాలంటే మానవ జీవితం ‘నర నారీ సంగమ మృదంగం/ గంగమ జంగమ సంగీతం’.  ‘ఆమె’ ధరకు జారిన శివగంగ తరంగం.  ఆడది అంటే ఇహ చిన్నచూపు ఎందుకో మగవాడికి?

తరతరాల వెలుగు తాలుపులైనా, తరుగెరుగని ఇలవేలుపులైనా నేల మీదకు కాలు మోపే ముందు ఓ అమ్మ కడుపులోనే  ముందు నునుపు తేలేది! లోకాదర్శ జీవనుడు శ్రీరామచంద్రుడు భూమ్మీదకు  అవతరించింది కౌసల్యామాత గర్భంలో నవ మాసాలు రూపుదిద్దుకున్న తరువాతనే! స్త్రీ జన్మ మహిమ రహస్యం ఆ త్రిశంకు  స్వర్గ ద్రష్ట  విశ్వామిత్రుల దృష్టి దాటక పోబట్టే బాలరామయ్యను మేలుకొలుపుతూ సుప్రజా రాముడి కన్న   ముందు ‘కౌసల్య’ మాతను తలుచుకున్నది. అమ్మ కడుపు చల్లంగా ఉన్నంత కాలమే ఏ అయ్యల కలలైనా నిండుగా పండేది. మగాడు ఈ సింపుల్ లాజిక్ మరుగున పడుతున్నందు వల్లనే  స్త్రీలోకమంతా ఇంతలా అల్లకల్లోలంగా తయారవుతున్నది.

కోవెల వంటిదీ లోకం అన్నది కోమలి కోమల భావన.  కానీ ‘మగవాడి దృష్టిలో ఆమె తనువుకు మాత్రమే ఓ వెల! తాను కని పెంచిన మగవాదే తన పాలిట సైతానుగా మారుతున్నందుకు ఆ మాత  వెత. ఆ కలత వల్లనే నెలతలంతా  'ఏ జన్మకీ స్త్రీ జన్మ నీ కొద్దు నా చిట్టి తల్లీ!' అంటూ అంతలా తల్లడిల్లిపోతున్నది అప్పుడూ.. ఇప్పుడు కూడా! 

భారతీయుల దృష్టిలో ఆడవాళ్లకు ఉండే పూజ్యభావన ఎంత  గొప్పగా ఉంటుందో చెప్పడానికని   ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః’ అంటూ ఎప్పుడూ ఒకే శ్లోకాన్ని వల్లెవేస్తాడు బడుద్ధాయి మగవాడు. వేదాలల్లో స్త్రీని దేవతలుగా చూపించడమూ, విద్య, ధన, ధైర్యాలకు స్త్రీలనే దేవతామూర్తులుగా చిత్రీకరించుకోవడమూ మహా బడాయిగా ఎత్తిచూపిస్తాడు కూడాను. రామాయణంలో రావణాసురుడి కన్న ముందు రాముడిని కష్టాల పాల్చేసింది ఆడాళ్లే.. కైకేయి, మంధర, శూర్పణఖ.. అంటూ తన బుద్ధికి తోచిన కుతర్కం ప్రదర్శిస్తాడు కూడాను!మరి కాస్త కావ్య శాస్త్రజ్ఞానం వంటబట్టి ఉంటే ప్రబంధాల నుంచి కూడా ఎంచుకున్న పద్యాలతో లెచ్చర్లు దంచికొడతాడు. ‘సుబ్బరంగా చదువుకోవడానికని వచ్చిన పిల్లోడు చంద్రుడిని చెడగొట్టింది  తార అనే  స్త్రీనే కదా! కృష్టుణ్ని అష్టకష్టాల పాల్చేసిన దుష్టజాతిలో పూతన వంటి స్త్రీ జాతి పాత్రా ఎంతో కొంత ఉంది కదా!  ఆడజాతి అంతా పులుకడిగిన ముత్యాలల్లే బిల్డప్పులు ఇస్తే ఎట్లా?  ఏదో ప్రకృతిని చూసి పరవశించిపోదామని వచ్చిన పిచ్చి బ్రాహ్మడు ప్రవరాఖ్యుడిని వరూధిని వశం చేసుకోడానికి ఎంతలా వేపుకుతినలా? అంటూ అంటూ- సొంటూ లేని శుంథ ప్రశ్నలు లేవదీస్తాడు. జరిగాయో జరగలేదో, జరిగితే ఎంత వరకు నిజంగా నిజాలే  ప్రచారంలోకి వచ్చాయో.. ఇతమిత్థంగా నిర్థారణ కాని కట్టు కథలను పట్టుకుని కొట్టుకు చావడం తప్పించి.. వర్తమానం కట్టెదుట ఆడదానికి అన్ని మతాలలో వాస్తవంగా జరుగుతున్న అన్యాయం గురించి నోరు విప్పడు! 
కామసూత్రాలను శాస్త్రీకరించి బహిరంగంగా  ప్రబోధించినందుకు మహానుభావుడని  మనం  నెత్తికెత్తుకుంటున్నామే వాత్సాయనుడు..  ఆయన అదే కామకళల్లో భర్తల పెత్తనాన్ని ఎట్లా భార్యలు చచ్చినట్లు ఒప్పుకుతీరాలో ఉదాహరణలతో సహా నొక్కి చెప్పిన నిజం ఎవరికీ చెప్పరు ఈ మగవాళ్లు. భర్త తినకుండా భార్య తింటే దోషమన్న దుర్మార్గపు సిద్ధాంతం మొదట లేవదీసిన రుషి ఆ మహాశయుడే! దాన ధర్మాల నుంచి ఏ ఇంటి పని (వంట పని తప్పించి) వరకైనా స్వతంత్రించి చేసుకునే హక్కు ఆమెకు చరిత్రలో ఏ దశలోనూ దఖలు పడిందికాదు. ఒక్క  భర్తనే కాదు భర్త బంధువులను, మిత్రులను, ముఖపరిచయస్తులనయినా సరే ఇంటికి వచ్చినప్పుడు నెత్తిన పెట్టుకు సకల సపర్యలతో ఒప్పించని పక్షంలో ఆమె ఉత్తమమైన ఇల్లాలు కానేరదు కదా.. కొండొకచో శపాలకు గురయిన కథలూ పురాణాలలో బొచ్చెడున్నాయ్. వాటి ప్రస్తావన ఏ మగవాడూ చెయ్యడు. భర్త మోజుపడి మరో వివాహం చేసుకున్నా .. వివాహం కుదరని పక్షంలో ఇంటికే తెచ్చేసుకుంటే ఆ సవతితో సఖ్యంగా ఉండాలి తప్పించి కయ్యానికి కాలుదువ్వే సాహసం ధర్మపత్ని అయినా చేస్తే పుణ్యస్త్రీ బిరుదులు వెనక్కి పీక్కోబడతాయని బెదిరింపులు  ఈ తరహా మొగాళ్ల  నుంచే!
ప్రపంచంలోని అతి పెద్ద మతం క్రైస్తవానికి సైతం స్త్రీ పట్ల బొత్తిగా సదుద్దేశం లేదు. 'స్త్రీ పుట్టుకతోనే పాపి. పాపహేతువు. కేవలం పురుషుడి సుఖ సంతోషాలే ఆ నీచ ప్రాణి  సృష్టి పరమార్థం. స్త్రీని బానిసగా దేవుని వాక్యం భావించిన దానికి ఏ మాత్రం తిసిపోని విధంగా పురుషుడి అన్ని కష్టాలకు మూలకారణం  క్రైస్తవంలో లాగా ఇస్లాం మతమూ గాఢంగా విశ్వసించింది. 

స్త్రీకి బురఖా ఇస్లాం ప్రసాదమే! ప్రార్థనాలయాల ప్రవేశం ఆమెకు నిషిద్ధం. భర్త కోరితే సంగమానికి సిద్ధం కాకపోవడం పాపహేతువు. ఎంత వయసు వచ్చినా భార్యను  శిక్షించే హక్కు భర్తకు ధారాదత్తం చేసేసింది ఇస్లాం మతం. భర్త తలాడించకుండా తనకు పుట్టిన బిడ్డకు అయినా సరే పాలిచ్చే అధికారం భార్యకు కల్పించింది కాదీ మతం. విడిపోయినా సరే భర్త అనుమతి తప్పనిసరి అనడం కన్నా ఘోరం ప్రపంచంలో మరొకటి ఉంటుందా? 

ప్రపంచంలోని దాదాపు అన్ని మతాలలో స్త్రీలు వ్యామోహ కారకులు. కాబట్టి వారి మీద సదా  ఓ కన్నేసి ఉంచడం పురుషుల  తప్పనిసరి బాధ్యతల్లో ఒకటి. ఆడవాళ్లు దున్నబడే భూములతో సమానం. భూముల మీదుండే హక్కు భుక్కుల నియమాలన్నీ స్త్రీలకీ వర్తిస్తాయి కొన్ని మతాలల్లో. లేబుల్ ఏదైనా, కాలం ఎప్పటిదైనా, ప్రాంతం ఎక్కడిదైనా, వైవిధ్యాలు, వైరుధ్యాలు, అంతర్వైరుధ్యాలు ఎన్నున్నా స్త్రీలకు అన్నాయం చేసే అంశంలో అన్ని మతాలు అన్నదమ్ముల వలెనే సహకరించుకున్నాయ్.. సహకరించుకుంటున్నాయి కూడా!

హోలీ బైబిల్  రెండో ఛాప్టర్ ప్రకారం నిద్ర పోయే మగాడి డొక్కలో నుంచి ఓ పక్కటెముక పీకి  ది గ్రేట్ లార్డ్ గాడ్ సృష్టించిందేనట ఆడజీవి. ఆ తరహా  భావజాలమే మన ముత్తాతలది కూడా. మనువులాంటి మగ మహానుభావులంతా చేరి  'న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి' అంటూ  సిద్ధాంతాలు చేయబట్టే కదా  మగాడికి ఆ చొప్పదంటు సూత్రాలను పట్టుకుని  తోడు నీడుగా ఉందామని వచ్చే సాటి జీవి ఆడదానిని అన్ని ఆటలు ఆడిస్తున్నది! శేషం వేంకటకవి ‘శశాంక విజయం’లో కోరిక తీర్చమని తన దరి చేరిన గురుపత్ని తారతో ‘వికల చరిత్రు డైన, ముది వెంగలి యైన, గురూపి యైననున్, త్రికరణ శుద్ధిగా మగడె దేవు డటం చని నిశ్చయించి, యొండొక డెటువంటివా డయిన నొప్పదు కోరగ నింతి, కి’ అంటూ చంద్రుడు ద్వారా చెప్పిన నీతి సూక్తులన్న్నీ నిజానికి మగాడి మనసులో యుగాల బట్టి జెండా పాతుకొనున్నవే! ఆడదంటే ఒక్క తనువే అన్నట్లు మనువు  లాంటి దుష్ట మేధావులు ఈ తరహా  ధర్మపన్నాలు పదేపదే వల్లించడ వల్లనే ఆడవాళ్లకు  ఏ దశ లోనూ స్వేచ్ఛ అనేదే బొత్తిగా లేకుండా పోయిందన్నది  స్త్రీవాదుల మండిపాటు. 
మరను, యంత్రాన్ని  కనిపెట్టక ముందే ‘మర-మనిషి’ని కనిపెట్టింది ప్రపంచం. మగప్రపంచం కనిపెట్టిన ఆ మర-మనిషి పేరు ఆడది. ఆడదిగా పుట్టినందుకు, చీరె కట్టడం నేర్చిందాకా పుట్టింటికి గొడ్డులా చాకిరీ చేయడం, ఓ మగాడొచ్చి మెడలో పలుపు కట్టేయంగానే తలొంచుకొని వెళ్లి అతగాడి వంశం మొత్తానికి  జీతం బత్తెం లేకుండా శాశ్వతంగా ఊడిగం చేసుకోడం!' మల్లాది సుబ్బమ్మగారి వంటి  స్త్రీ జనాభ్యుదయవాదులు పద్దాకా తిట్టిపోసేదీ మగవాడిని తమకు పగవాడిగా మారుస్తున్న ఈ తరహా పెడవాదనలు ఇప్పటికీ గుడ్డిగా నమ్మి కఠినంగా అమలుచేస్తూ, ముమ్మరంగా ప్రచారం చేసే మగజాతిని మాత్రమే!

'ఎంత రుచి ఆ నిషిద్ధ ఫలానికి/ ఎంత వడి ఆ విముక్త హృదయానికి' అంటారు సినారె  విశ్వంభర ఖండకావ్యంలో నారీ నార సంగమ సుందర దృశ్యాన్ని అభివర్ణిస్తూ! ఇద్దరూ కలసి ఒకే తీరులో  ఆనుభవించే  ఆ సంగమ కార్యపు  తీయని రుచి మగవాడికి  ఒకానొక అనుభూతితో సరి. ఆడదానికి మాత్రం  మంచి.. చెడు.. అన్ని అనుభవాలూ అక్కడి నుంచే  మొదలు! గర్భం ధరించింది మొదలు ప్రసవం అయే వరకు కాబోయే అమ్మ పడే యాతనలేమిటో వాయుపురాణం తిరగేస్తే విశదంగా బోధపడుతుంది. ‘గర్భస్య ధారణే విషమే భూమి వర్త్ముని/ తస్య  నిష్క్రమణార్థాయ , మాతృపిండం దదమ్యాహం' (గర్భం ధరించడమే కష్టం. ఎగుడు దిగుడు నేలల మీద నడవడం అందుకు అదనపు కష్టం. ఆ కష్టం కలిగించినందుకు నీ మాతృపిండాన్ని నేను నీకు నమస్కరిస్తున్నాను) అంటూ ఎదిగొచ్చిన తరువాత  సంతానం తమ తల్లుల ముందు తోచిన  విధంగా  మోకరిల్లవచ్చు.  తన బిడ్డ పుట్టుక కోసం యమద్వారం ముందుండే మహాఘోరమైన వైతరణీ నదినైనా తరించేందుకు  సాహసించిన స్త్రీ అప్పట్లో నష్టపోయిన జీవితానుభవాలకు పరిహారం చెల్లిందెవరూ? 

భావుకతను రేకెత్తించే కవిత్వాలకేం గానీ.. వాస్తవంగా చూస్తే దేశంలోని స్త్రీ పురుష జనాభా నిష్పత్తి లెక్కలే ఆడవారి పట్ల మగజాతి ప్రదర్శించే ద్వంద్వవిలువల  వ్యాపార దృక్పథాలకు వికృత ఉదాహరణలు. పుట్టాలంటేనే 'చావు గండం' నుండీ గట్టెక్కాల్సిన గడ్డు దుస్థితి ఒక్క ఆడ గుడ్డుకే ఈ గడ్డన ఇప్పటికీ! తప్పీ దారీ భూమ్మీద పడ్డా.. తప్పుదారిలో నడిచే మగప్రపంచాన్నుంచి ఎప్పటికప్పుడు తెలివిగా తప్పించుకునే దారులు దేవులాడుకోవడమే తప్పించి నేటికీ ఇంటా బైటా వయసుతో నిమిత్తం లేకుండా ఆడది ఎదుర్కోక తప్పని దైన్యస్థితి.

తన జీవితాన్ని తనకై  తానుగా అచ్చు  మగవాడి హక్కులతో సమానంగా బతికే మంచి రోజులు ఆడదానికి ఎప్పుడు లభిస్తే అప్పుడే ఏటేటా జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు అంతిమ లక్ష్యం 
- కర్లపాలెం హనుమంతరావు 
(సూర్య  దినపత్రికలో ప్రచురితం ..మార్చి 8, మహిళా దినోత్సవ సందర్భంగా )  

***


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...