Showing posts with label Essay. Show all posts
Showing posts with label Essay. Show all posts

Thursday, December 30, 2021

వలపు -తాత కృష్ణమూర్తి ( ఆంధ్ర భూమి - మాసపత్రిక- 1933, అక్టోబర్ )

 వలపు 

-తాత కృష్ణమూర్తి


( ఆంధ్ర భూమి - మాసపత్రిక- 1933, అక్టోబర్ ) 



పుస్తకాలలో ఉన్న నాయికానాయకులకేగాక, మెదడు, శరీరావయవాలు సవ్యంగా ఉన్న ప్రతి మని షికీ యీడువచ్చిన పిమ్మట వలపంటే యేమిటో, కొంతవరకు అనుభవమవుతుంది. మహాకవులు నాయికిల వలె ప్రతీఆడదీ విరహవేదనలో మన్మధుణ్ణి, చంద్రు ణ్ణి, గాలిని, పిట్టల్ని నోరుతిరగని సమాసాలతో తిట్టి, చెలికత్తెలను కొట్టి, జుట్టు పీకుకొని, ఒళ్లు రక్కుకొని, మెడలోనిహారాలు తెంచేసుకొని, కాంభోజీరాగంలో వెక్కివెక్కి యేడవక పోవచ్చు ; ఉద్యానవనాలలో ఉండే లతలతో ఉరిపోసుకోకపోవచ్చు. ప్రతీమగ వాడూ కథలలోని రాజులవలె నిద్రాహారాలు మాని వేసి, కలలో కనిపించిన కన్యాలలామకోసం మహా రణ్యాలకుపోయి తపస్సులు చేయలేకపోవచ్చు; వలపు తీవ్రత కోర్వలేక కత్తితో కంఠంకోసుకొనో, విషం త్రాగో, చావడానికి సాహసించలేక పోవచ్చు. కాని ప్రతీమనిషికీ ప్రేమతత్వం ఏదోవిధంగా తెలియరాక మానదు.


అయితే లోకంలో చాలామందికి తమ అనుభవా లెట్లా ఉన్నా, వలపును గూర్చి అభిప్రాయాలు మాత్రం 3 మహావిపరీతంగా ఉండడానికి కారణం బహుళః కవుల తలతిక్క వ్రాతలే నేమో! దేనినైనా సరే, మసిపూసి మారడికాయ చేయగల సమర్ధులు కవులు, జంతువులు,


పిట్టలు, కీటకాలు సహితం అనుభవించి తెలుసుకోగల సెక్సు ప్రేమను మహా అపురూపమైన వస్తువుగా వర్ణించి దానికి తమ ఊహాశ క్తివలన లేనివెన్నో అర్థాలు కల్పించి, లోకంతో సంబంధంలేక ఏకొండగుహలోనో ముక్కు మూసుకొని మూడవ నేత్రంతో సర్వమూ తిలకించగల మహారుషులకును, కల్పితకథలద్వారా నిజాన్ని అబద్ధం గాను అబద్ధాన్ని నిజంగాను చెయ్యగల ఊహాజ్ఞాన సంపన్నులను కవిపుంగవులకును తప్ప, సామాన్యుల కది యెంతమాత్రమూ తెలియరాని రహస్యమని బోధిస్తా మంటారు !


సెక్సు ప్రభావంవలన స్త్రీ పురుషులకు ఒండొరుల యడల జనించే అనురాగమే వలపు. దీనినే పేరు, మోహం, మనసుల కలయిక, కామం, మన్మధవికారం, మమత యిత్యాది పేర్లతో వ్యవహరిస్తారు జనులు. వలపులో సుఖం దుఃఖం, అభిమానం యీర్ష్య, పశుత్వం దేవత్వం, స్వార్ధం స్వార్ధత్యాగం, మంచి చెడ్డ- అన్నీ లీనమైఉంటాయి. తెల్లని సూర్యకాంతిలో యింద్ర ధనస్సు రంగులన్నీ యిమిడియున్నట్లు వలపులో దయ, ద్వేషం, భక్తి, భయం మొదలైన గుణాలెన్నో విశద పడుతూ ఉంటాయి, పరిస్థితులను బట్టి.


ప్రేమ అనేమాటకు వాడుకలో అనేక అర్ధాలు ఉంటున్నాయి. మాతృప్రేమ, బంధుప్రేమ, దేశప్రేమ


దైవపేరు మొదలైనవి సెక్సుతో సంబంధం లేనివి. ఇక సెక్సుతో సంబంధం ఉన్న ప్రేమలో కూడా ము ఖ్యంగా రెండుకాలు ఉన్నాయి. శరీర సంపర్క వాంఛ ప్రధానంగాల ప్రేమ ఒకరకం. దీనినే కామ మనీ, పశుప్రేమమనీ అంటారు. శరీరభోగాలతో జోక్యంలేని ప్రేమ రెండోరకం. ఇది కేవలం మానసిక మనిన్నీ, మిక్కిలి పవిత్రమైనదనిన్నీ చెప్తారు. వల పులో నిజంగా యీ రెండురకాల ప్రేమలూ విడదీయ డానికి వీలు లేకుండా ఐక్యమైఉంటాయి.


ప్లేటో అనేది కథలలో సహజం గా నే కనిపించవచ్చును గాని మానవప్రకృతికి విరుద్ధ మే అనిపిస్తుంది. వలపుగలచోట శరీరసౌఖ్యా పేరు ఉండక తప్పదు. అయితే, ప్రేమించుకునే నాళ్ళకందరికీ అట్టి సౌఖ్యాలు లభించక పోవచ్చును; కోర్కెలు తీర్చుకుం దుకు తగిన అవకాశాలు లేకపోవచ్చును; కోర్కెలు, అవకాశాలు కూడా గలవారు యింద్రియనిగ్రహంవలన తమ శరీరవాంఛల నణచుకోవచ్చును. కాని, ఇంద్రియ సుఖవాంఛారహితమైన వలపుమాత్రం అసహజం!


అట్లే శరీవసంబంధం ఉన్నచోట నల్లా తప్పకుండా ప్రేమ ఉండితీరాలని తలచడం తప్పు. స్త్రీ పురుషులిద్దరు ఎట్టిప్రేమయు లేకనే శరీరసంపర్కం కలిగి ఉండ వచ్చును; బిడ్డలనుకూడ కనవచ్చును. ఇట్టినడత కడు నీచమైనదే అయినా, అస్వాభావికంమాత్రం కాదన డానికి మానవసంఘంలోగల వేశ్యావృత్తి ఒక గట్టి నిదర్శనం.


స్త్రీపురుషు లిద్దరికి శరీరసంబంధమాత్రమైన ఐక మత్యం యేర్పడినప్పు డది తుచ్ఛమగు కామమనిన్నీ, మన సుల కలయిక మాత్రం సంభవించినప్పు డది పవిత్రమగు స్నేహమనిన్నీ, మనోతనువులు రెండిటి బాంధవ్యమూ చేకూరినప్పు డది పేమమనిన్నీ చెప్పుకుంటారు, సాధా రణంగా. కాని తరుచుగా కామంలో స్నేహం, స్నే హంలో ప్రేమ, ప్రేమలో కామం కలసి పొడగడుతూ ఉంటాయేకాని, దేని కది విడిగా విళదకుడదు. కాబ బట్టే అర్ధం ప్రియులచేష్టలు యితరుల కప్పుడప్పుడు ఏమీ కాకుండా, విపరీతంగా కనబడతాయి.


స్త్రీపురుషులిరువురికి' అన్యొన్యాను రాగం కలగడా నికి నిజమైన కారణం నిర్ణయించడం పైవాళ్లకు సులభ సాధ్యమగుపనికాదు. ఒక్కొక్కప్పు డాప్రియుల కే తెలియదు, తామెందుకు ప్రేమించు కొంటున్నారో. సాధారణంగా మన ప్రబంధాలలో ఉదహరింపబడే ప్రేమ 'తొలిచూపువలపు' నాయికానాయకులలో నూటికి తొంభైమంది ఒండొరుల రూపలావణ్యాలం చూసుకొని మోూహించుకున్న వాళ్ళే! అతని తనూవిభవం చూసి ఆమె, ఆమె సొగసుందనం చూసి అతడు, వలచు కుంటారు. రూపా లెట్లా ఉన్నా, కొంత పరిచయంపైని ఒకరి గుణాలు చేష్టలు ఒకరు అర్ధం చేసుకొని ప్రేమిం చుకున్న వాళ్లు కూడా ఉన్నారు. ఒథెల్లో, డెన్డ్ మోనా వంటివాళ్లు. ఇక రూపం, గుణం, నడవడిక, ఏదీ చూసుకో నవసరంలేకుండా వలచుకో గలవాళు లేకపోలేదు--హిందూదంపతులవంటి అమాయకులు!


ఇతర కారణా లింకా ఎన్ని ఉన్నా, ముఖ్యంగా రూపం, యౌవనం వలపును పుట్టించడానికి బల లమైన హేతువులని చెప్పకతప్పదు. అందుకనే కవులు తాము చిత్రించే నాయికానాయకులలో ఎవరినీ అందహీనుల గాను, వయసుమీరిన వారిగాను చేయరు. శృంగార మనేది యౌవనంలో ఉన్న సుందరాంగులకే వర్తిస్తుంది. కాబోలన్నట్లుంటాయి, పుస్తకాలలో కథలు!


సె ఆకర్షణకు నిజంగా రూపం ఎంత సహ కారో, క్రొ త్తదనంకూడా అంతసహకారి, క్రొత్తవాళ్ళ ను చూసినప్పుడు మనసు చలించినట్లు చిన్నవాటి పరి చయులను చూసినప్పుడు చలించదు. ముఖ్యంగా రక్త సంబంధంగల దగ్గిర చుట్టాల పట్ల కామేచ్ఛ బొత్తిగా మచ్చిక జంతువులలోన కూడా యీచిత్రమే పొడగడుతుంది. చిన్నప్పటినుండీ ఒక్క గూట్లోనే పెరిగిన పావురాలు ఎన్నడూ కలి యవు. తేనెటీగ తనునివసించే పట్టులోని యీగల కొరకు దేవులాడక, వైచోట్లకు ఎగిరి సంబంధం కుదు ర్చుకుంటుంది. ఒకేపుట్టలో ఉన్న రెక్క చీమలు వాటి లో అవి వలచుకోక, దూరంగా నివసించే చీమలగుంపు తో పరిచయం చేసుకుందుకు ప్రయాణాలు చేస్తాయి.


(స్త్రీపురుషులిరువురికి' అన్యోన్యానురాగం కలగడా నికి నిజమైన కారణం నిర్ణయించడం పైవాళ్లకు సులభ సాధ్యమగుపనికాదు. ఒక్కొక్కప్పు డాప్రియులకే తెలియదు, తామెందుకు ప్రేమించు కొంటున్నారో. సాధారణంగా మన ప్రబంధాలలో ఉదహరింపబడే ప్రేమ 'తొలిచూపుదలవు'. నాయికా నాయకులలో నూటికి తొంభైమంది ఒండొరుల రహదశులావణ్యాలు చూసుకొని మోహించుకున్న వాళ్ళే! అతని తనూవిభవం చూసి ఆమె, ఆమె సొగసుందనంచూసి అతడు, వలచు కుంటారు. రూపా లెట్లా ఉన్నా, కొంత పరిచయంపైని ఒకరి గుణాలు చేష్టలు ఒకరు అర్ధం చేసుకొని ప్రేమిం చుకున్న వాళ్లు కూడా ఉన్నారు. ఒథెల్లో, డెస్టి మోనా వంటివాళ్లు. ఇక రూపం, గుణం, నడవడిక, ఏదీ చూసుకో నవసరంలేకుండా వలచుకో గల వాళ్లు లేకపోలేను-హిందూదంపతులవంటి అమాయకులు!


ఇతర కారణా లింకా ఎన్ని ఉన్నా, ముఖ్యంగా రూపం, యౌవనం వలపును పుట్టించడానికి బలమైన హేతువులని చెప్పక తప్పదు. అందుకనే కవులు తాము చిత్రించే నాయికానాయకులలో ఎవరినీ అందహీనుల గాను, నయసుమీరిన వారిగాను చేయరు. శృంగార మనేది యౌవనంలో ఉన్న సుందరాంగులకే వర్తిస్తుంది కాబోలన్నట్లుంటాయి, పుస్తకాలలో కథలు!


సెకు ఆకర్షణకు నిజంగా రూపం ఎంత సహ కారో, క్రొ త్తదనంకూడా అంతసహకారి. క్రొత్తవాళ్ళ ను చూసినప్పుడు మనసు చలించినట్లు చిన్నవాటి పరి చయులను చూసినప్పుడు చలించదు. ముఖ్యంగా రక్త సంబంధంగల దగ్గిర చుట్టాల పట్ల కామేచ్ఛ బొత్తిగా ఉండదు. పక్షులలోను, మచ్చిక జంతువులలోను కూడా యీచిత్రమే పొడగడుతుంది. చిన్నప్పటినుండీ ఒక్క గూట్లోనే పెరిగిన పావురాలు ఎన్నడూ కలి యవు. తేనెటీగ తనునివసించే పట్టులోని యీగల కొరకు దేవులాడక, పైచోట్లకు ఎగిరి సంబంధం కుదు ర్చుకుంటుంది. ఒకే పుట్టలో ఉన్న రెక్క చీమలు వాటి లో అవి వలచుకోక, దూరంగా నివసించే చీమలగుంపు తో పరిచయం చేసుకుందుకు ప్రయాణాలు చేస్తాయి.


అమెరికా, యూరప్ వంటి దేశాలలో ఒకేతరగతిలో కలసి చదువుకునే బాలురు, బాలికలు సాధారణంగా పెండ్లాడుకుందుకు యిష్టపడరట. సగోత్రీకులకు, వివా హబాంధవ్యాలు నిషేధించిన హిందూధర్మశాస్త్రవేత్త లకు యీరహస్యం తెలుసు!


వెలుతురు, వేడిమి, విద్యుచ్ఛక్తి మొదలైనవాటి వలె వలపొక బాహ్యశక్తికాదు. ఆకలి, తలనొప్పి వంటి శరీర బాధయుకాదు. ఇంద్రియానుభవాల వలన మొదట జనించి, పిదప మనసులో స్థిరపడి, క్రమం గా మెదడునుకూడ వశ పరచుకోగల దారుణమహిమ కలది, అది. పంచేంద్రియాలలోను చూపు మిక్కిలి చురుకైనది కనుక, ప్రేమ సంకురింపజేయుటలో దానికి గల సామర్ధ్యాలు మరిదేనికీ లేవు. కళ్ళకుగల యీ దా రుణశక్తికి వెరచి కాబోలు మానససంఘంలో కొందరు ఘోషాపద్ధతిని విధించుకున్నారు తమ స్త్రీలకు! హిం దూవిధవకు సంఘం విధించిన పాడుముస్తాబుకూడా పురు వదృష్టికి వెరచియే నేమో!


మొదట చతుప్రభావంవలన ఉద్భవించిన వలపును మిగతా. యింద్రియాలు కొంతవరకు బలపరచగలవు. కాబట్టే ప్రియాలు కంటికింపగు ముస్తాబు చేసికొనుట తో తృప్తిపడరు, పువ్వులు, పరిమశద్రవ్యములు విరి విగా వాడతారు. కమ్మని మిఠాయిలు భుజిస్తారు. జిలి బిలి పలుకులతో సంభాషించుకుంటారు. పాడుకుం టారు. నృత్యంచేస్తారు. ముద్దులాడుకుంటారు. కాగ లించుకుంటారు. కరుచుకుంటారు. పిచ్చిపిచ్చి పను లెన్నో చేస్తారు. పంచేంద్రియాలకూ పరవశత్వం వస్తే నేగాని వాళ్ళకు తనివి తీరదు.


• ఎలవును జనింపజేయుటలోను, జనించిన వలపును వృద్ధినొందించుటలోను, ఒక్కొక్కప్పు డొక్కొక్క యింద్రియం ప్రాముఖ్యత వహిస్తుంది. ప్రియురాలి అను గ్రహం సంపాదించడానికి ఆమెనిద్రించే గది కిటికీ వద్ద చేరి, ఫిడేలో వీణో వాయినూ పాడేవాడట, పూర్వ కాలపు ఐరోపాప్రియుడు! పిల్లనగ్రోవి ఊది గొల్లపడు చులను వశపరచుకు నేవాడట శ్రీకృష్ణుడు. గానం, వా యిద్యం, సంభాషణ, ఏడుపు, నవ్వు మొదలైనవి కణ్ణం


ద్రియాన్ని రంజింపజేసే సాధనాలు. ఇక ఘ్రాణేంద్రి యాన్ని మెప్పించి, ప్రేమను పెంపొంద జేయగలవి. పువ్వులు, మంచిగంధం, పన్నీరు, అత్తరు, కస్తూరి మొ దలైనవి. ప్రియుల నొక్కొక్కప్పుడు కొన్ని కొన్ని వాసనలు వెర్రెత్తించగలవు. యోజనగంధిని ఆమె ఘుమ ఘుమకు వలచినాడట శంతన మహారాజు! అట్లే తియ్యని మిఠాయిలు, కమ్మనిపిండివంటలు, పండ్లు, పాలు, తేనె, సారాయిలు జిహ్వేంద్రియం ద్వారా మోహోద్రే కాన్ని స్ఫురింపజేసి వృద్ధిచేయగలవు. వలపును సాధిం చడంలో ఒక్కొక్కప్పుడు స్పర్శేంద్రియం చదువు కంటె తీక్ష్యంగా పనిచేస్తుంది. అయితే తనప్రతాపం చూపెట్టుకుందుకు కంటికిగల అవకాశాలు స్పర్శకు లభించవు, కలసి నాట్యం చేసుకునే సందర్భంలో ఒం డొరుల యొడలితాకుడుకు మోహో ప్రేకులై దంపతు లైన పాశ్చాత్య యువతీయువకు లెందరో ఉన్నారట! తన మొగంతీరుకూ, పాటనేర్పుకూ, మాటతీపికీ, దేనికీ సాధ్యుడుకాక కొయ్యబొమ్మవలె నిల్చున్న ప్రవరుణ్ణి చూసి, తుదకు క్షణబాహు మూలరుచితో


"పాంచద్భూష


బాలిండ్లు పొంగారఁబై యంచుల్ మోపగఁ గౌఁగిలించి యధరంబాసింప -” సాహసించిందట సరూధిని. ఉగ్గుపాలతో కళాశాస్త్ర మార్మాలన్నీ నేర్చుకున్న ఆప్రౌఢకు, అతగాడిని లొంగదీయడానికి స్పర్శేంద్రియమే అంత్యసాధనమని తోచింది!


ఇంద్రియసుఖాలు వలపు కెంత అవసరములైనా, కేవలం వాటిపోషణ మీదనే ఆధారపడి ఉండ దది. అందుకనే ప్రేమకు చంచల స్వభావం ఆరోపించారు. పెద్దలు. శరీరం, మనసు, మెదడు ఏకీభవించి కాపా డితేనేగాని నిలవదు వలపు! స్త్రీపురుషు లిద్దరికి ఒకసారి నిజమైన వలపు కుదిరినప్పుడు, అట్టి ప్రేమ స్థిరంగా నిలుస్తుందనీ, ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా చలించదనీ, వాదిస్తారు కొందరు విడాకులు, ద్వితీ యవివాహాలు, ప్రియులకలహాలు మానవసంఘంలో అరుదైనట్లు పుట్టుక, పెరుగుట, చావుగల జీవ


ప్రేమకు స్థిరత్వం ఆరోపించడం వెర్రి. కాని, ఇంద్రియాల ప్రేరేపణకు లెక్క చేయక, హృదయాన్ని లొంగదీసు కొని, బుద్ధిబలంవలన స్థిరంగా ఒక్కరినే ప్రేమించ గలుగుట మానవునికి అసాధ్యంకాదు. పతీవ్రతలు, ఏక పత్నీ వ్రతులు అట్టి మనోబలంగల ఘనులు.


వలపు విషయంలో అవకతవకగా ప్రవర్తించే వాళ్ళం. దరూ మెదడుతకు వరాళ్ళే అని రూఢిపరచగ లరు నేటి శాస్త్రజ్ఞులు. మెదడుశక్తి అంటే పుస్తకాలు చదు పుకున్న జ్ఞానమని కాదు. బడిచదువు, పరిక్షలు, శా శాస్త్ర జ్ఞానం—వీటితో సంబంధంలేక, ప్రతీ మనిషికీ పుట్టుక 'నే భగవంతు డనుగ్రహించే శక్తి అది! సమాన మైన అవకాశాలతో,ఒకేగురువు వద్ద శిక్ష నభ్యసించిన విద్యా . ర్థులందరూ ఒకేమో స్టరు తెలివితేటలు గల వాళ్ళుగా ఉండకపోవడానికి యిదేకారణం. మనిషికీ మనిషికీ, జం తువుకూ మనిషికీగల తేడాలను యేర్పరిచేది యీజ్ఞాన శక్తే! వలపు నిలకడలేనిదే అయినా, దానిని బళవరచు కొని, స్థిరంగా ఒకరిమీదనే నిలచేటట్లు చేసుకోవడం మానవుని ప్రజ్ఞ. అది వానిమేధాశక్తిని నిరూపిస్తుంది. సంఘానికి కొంత మేలు చేస్తుంది. వాని జీవితానికి శాంతి


వలపుకు చంచల స్వభావం ఉండడమే కొంతవరకు మానవుడికి ఉపచరిస్తూ ఉంది. లేకపోతే, జోళ్ళుకుట్టు కుసేవాడు రాజు కూతుర్ని చూసి మోహించి, మనసు మరల్చుకోలేక గుండెపొడుచుకొని చావవలసినదే. వలచినవారిని పొందలేని మనిషికి మరి జీవితంలో ఆనం దమ నేది ఉండదన్న మాట. దొంపత్యను నేది అర్థంలేని బాంధవ్యమవుతుంది. కలిగినవలపును నిలుపుకుందుకు గాని, మరల్చుకుందుకు గాని మానవుడికి సాధ్యమవుతూ. ఉంది గనుక నే, సంఘానికి కొంత గౌరవం, ప్రత్యేక వ్యక్తులకు కొంతచిత్తశాంతి లభిస్తున్నాయి.


కొన్నికొన్ని పరిస్థితులందు కంటికి నచ్చిన వాళ్ళను చూసినప్పుడుగాని, పరిచయంగల వాళ్ళతో ముచ్చ టించేటప్పుడు గాని, ప్రతీమనిషికీ హృదయంలో అర్థం లేని వెర్రి వెర్రికోర్కెలు రగలడం సహజం. అయితే, కొంతఆలోచనాశక్తి, మెదడు అనేవి ఉంటాయి కనుక, కలిగిన ప్రతికోర్కెకూ దాసుడు కానక్కర


లేదు మనిషి. వలపును తన చెప్పుచేతలలో ఉంచుకో లేని మనిషిది దుర్బలమైన మెదడన్నమాట!


తెలివితక్కువవాళ్ళను ముప్పుతిప్పలు పెట్టి, మూడు చెరువుల నీళ్ళు త్రాగిస్తూ ఉంటుంది వలపు. అది మనదేవుళ్ళను, రుషులనుకూడా కొందరిని పరాభవించి సకల బాధలూ పెట్టింది. ఇంద్రుడు, శంక రుడు, శ్రీకృష్ణుడు, విశ్వామిత్రుడు, పరాశరుడు. వీళ్ళందరూ దానికి లొంగిపోయిన మహానుభావులే! ఇక ఆల్పప్రజ్ఞావంతులగు సామాన్యజనులు దాని ప్రభకు దాసోహమనడంలో ఆటే వింతలేదు. మళ్ళీ జీవరాసు లలో కల్లాజ్ఞా నవంతుడనని గర్విస్తాడు నరుడు; తుద కిట్లాంటివాటిలో వెర్రికు ట్టెవలె ప్రవర్తిస్తూ ఉంటాడు. వలపుమూలాన మానససంఘంలో నిత్యమూ ఎన్నో ఘోరాలు, అసందర్భాలు జరుగుతునే ఉంటాయి -' ఆత్మహత్యలు, కూనీలు, దెబ్బలాట్లు, మోసాలు, దొంగతనాలు, యుద్ధాలు, బలవంతం పెళ్లిళ్లు - యిత్యా, దులు. అందుకనే, వలపు గుడ్డిదనీ, వలపులో ఉన్న వాళ్ళు పిచ్చివాళ్ళకంటే అసందర్భంగా ప్రవర్తిస్తారనీ చెప్తారు పెద్దలు. ఒక్కొక్కప్పుడు దెయ్యం పట్టినట్లు మనిషి నా వేశించి,పీడించి, పశువును చేయగలదువలపు; మహామారివ్యాధివలె బాధించి, ప్రాణాలు తీయగలదు.


అట్లే నరున కిహలోకమందే స్వర్గమిచ్చి, సకల సౌఖ్యాలూకూర్చి, వానినిఘనకార్యాలు చెయ్యడానికి పురికొల్పి, బిచ్చగాని సహితం సింహాసనమెక్కించి, వానిజీవితాన్ని ఆనందమయంగా చెయ్యగలదు వలపు. అల్పుని ఘనునిగాను, లోభిని త్యాగిగాను, వృద్ధుని పడుచువానిగాను, పిరికివానిని ధైర్యవంతుని గాను, బలహీనుని శక్తివంతునిగాను మార్చగలదు. మానవ హృదయంలోగల ఔన్నత్యాన్ని పైకి తెచ్చి,. చెడునడ తగల వారిని బాగుపరచి, సంఘానికి ఐకమత్యం, గృహా నికి శాంతి నెలకొల్పగలదు. బంధుత్వాలు, స్నేహాలు, వివాహాలు, సంతానాలు వలపుమీదనే ఆధారపడి ఉంటున్నాయి. పేమకొరకు నరుడు తన ప్రాణాల నా ధారపోయగల త్యాగశీలుడౌతాడు. వలపు అతనిజీవితానికి వెలుగునిచ్చే దివ్యజ్యోతి ; ఆత్మకు శాంతినొసగే తారకమంత్రం !


వలపులో మంచి, చెడుగు, రెండూ ఉన్నాయన్న సంగతి గుర్తెరిగి, సాధ్యమైనంతవరకు ఆమంచే సామా న్యుడికి లభ్యమయేటట్లు చెయ్యడానికి యత్నించారు, మన శాస్త్రకారులు.. సంఘనియమాలు, వివాహాచా రాలు, నీతులు, మతబోధ, అన్నీ యిట్టి సదుద్దేశం గలవే. అనుభవం, పరిశోధనాశక్తి, ఊహాజ్ఞానం మెం డుగాగల మహానుభావులు అన్ని దేశాలలోను, అన్ని యుగాలలోను యిట్టి సిద్ధాంతాలు నిర్మిస్తు నేఉంటారు. ఆది అంతము లేని పరిశ్రమ వారిది! ఏమంటే, నేటి జనులకు నిన్నటి శాస్త్రాలు మనస్కరించవు; రేపటి జనులకు నేటి సిద్ధాంతాలు సరిపడవు..


వలపు విషయంలో ధర్మశాస్త్రవేత్తలు విధించిన యేనియమా:ూ తమకు తృప్తికరంగా లేకపోవుటవలన, నేటి రష్యాలో కొందరు "స్వేచ్ఛ' పేమ"ను అనుసరి స్తున్నారు. అంటే, ప్రకృతిలోగల మృగపక్ష్యాది స్వేచ్ఛజీవుల యిచ్ఛానుసారంగా జనులు వావి వరుసలనుకూడ గణించక వలపు సుఖముల ననుభవిం చుట! ఇది ప్రత్యేకవ్యక్తుల కొక్కొక్కప్పుడు కొంత సదుపాయంగా ఉన్నట్లు కనిపించినా, సంఘానికీ, సం తానానికీ లాభకరంగా ఉంటుందని తోచదు. ఉత్తమ జాతి పక్షులు, జంతువులు, సహితం కొన్ని నియమాలు ననుసరించి మళ్లీ ప్రవర్తిస్తాయి. చక్రవాకాలు, పావు రాలు మనిషికి బుద్ధి చెప్పేటంత నీతితో మెలగుతా యట, తమజోడుపిట్టలపట్ల, ఏకట్టుబాట్లూ లేని స్వే చ్ఛప్రేమ మానవునికి 'సౌఖ్యప్రదం కాకపోవడమేగాక, యీర్ష్యగుణం మెండుగాగల వాని ప్రకృతికి బొత్తిగా సరిపడదు. నేటి సాంఘికాచారములలో లోటుబాట్లు పెక్కులుండవచ్చును ; ఆచరణలో ఉన్న శాస్త్రనియ మాలు నవీన నాగరికతకు అనుగుణ్యములుగా లేక పోవ చ్చును; దేశకాలపరిస్థితుల ననుసరించి సంఘాన్ని సం స్కరించుకొని, మానవుడు తన జీవితాన్ని సవరించుకో వలసినదేకాని, కట్టుబాట్లు లెక్క చెయ్యక, సంఘాన్ని ధిక్కరించి, కళ్ళెంలేని గుర్రంవలె వెర్రిగా పరుగెత్త దలచుట తెలివితక్కువ.


-తాత కృష్ణమూర్తి.





Wednesday, December 29, 2021

వ్యాసం ప్రబంధాలలో పండుగ భోజనాలు - ఉత్పల సత్యనారాయణాచార్యులు ( ఆంధ్ర ప్రదేశ్ - మాప - జనవరి, 1961 ) సేకరణ - కర్లపాలెం హనుమంతరావు .

 వ్యాసం 


ప్రబంధాలలో పండుగ భోజనాలు 

- ఉత్పల సత్యనారాయణాచార్యులు 

( ఆంధ్ర ప్రదేశ్ - మాప - జనవరి, 1961 ) 

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు .

                29-12- 2021 



తెలుగు సాహిత్యమున ఏదో యొక విందునో భోజనమునో పురస్కరించుకొని తెలుగువారి వంటకాలను విస్తరించి వర్ణించిన కవులలో ప్రముఖులు   శ్రీనాథుడు, శ్రీకృష్ణ రాయలు, పింగళి సూరన్న, తంజావూరు నేలిన విజయ  నాయకుడు. 


ఆయా కవులు తమ కులాచారములకును, అభిరుచులకును దగిన భోజన సదా ర్థములను వర్ణించియుండిరి. రాయలుమాత్రము  బ్రాహ్మణ..  బ్రాహ్మణేతర భోజనముల రెంటిని లెస్సగా నెఱిగినవా డగుట శాకాహార మాంసాహార భోజనముల జక్కగా వర్ణించి సమకాలపు సాంఘిక జీవనమును మనకు సాక్షాత్కరింప జేసి యున్నాడు. 


విస్సనమంత్రి పంక్తిని గూర్చుండి శ్రీనాథుడు హేమ పాత్రాన్న మారగించెడివాడు. అతని భోజనము సాధారణ మైన దైయుండదు. ఒకప్పుడు పల్నాడులో నొకరింట జొన్న న్నము పెట్టి, చింతచిగురు, బచ్చలాకు కలిపిన యుడుకు కూర వడ్డించిరట. కప్పురభోగి వంటకమున కలవాబుపడిన కవిసార్వ భౌమున కది యెట్లు రుచించును?


ఫుల్లసరోజనేత్ర ! యల పూతన చన్నుల చేదు ద్రావి నా 

సల్ల దవాగ్ని మ్రింగితి న టంచును నిక్కెద వేమొ తింత్రిణీ

పల్లవయు క్తమౌ యుడుకు బచ్చలి శాకము జొన్నకూటీతో 

మెల్లగ నొక్క ముద్ద మ్రింగుము నీ పస కాననయ్యెడిన్


అని పరిహాసము చేసినాడు. సన్నన్నము సున్నయైన పల్నాటి సీమను హేళన చేసి 'రసికుడు పోపడు పల్నాడు' అచట 'కుసు మాస్త్రుండైన జొన్నకూడే కుడువవలసి వచ్చు' సని యెఱుక పఱిచినాడు. ఆ కాలమున పూటకూలి ఇండ్లలో ముఖ్యముగా  లక్ష్మణవజ్ఝల నొక్క రూకకు చక్కని భోజనము లవారింట లభించెడిదట.


కప్పురభోగి  వంటకము కమ్మని గోధుమ పిండివంటయున్ 

గుప్పెడు పంచదారయునుక్రొత్తగ గాచిన యాలనే పెస 

ర్పప్పును గొమ్మున ల్లనటి పండ్లను నాలుగు నైదు నంజులున్ లప్పలతోడ త్రొంబెరుగు లక్ష్మణవజ్ఝల యింట రూకకున్.


తెలుగువారికి ముఖ్యముగా గుంటూరు మండల వాసులకు గోంగూర తగనియిష్టమను వాడుక యున్నది. ఆ ప్రాంతము వాడేయయిన శ్రీనాథు డేలనో గోంగూరను గొనియాడిన వాడు కాడు. ఇది చింతింపదగిన విషయమే మఱి ! ఆ కాలమున భోజనపరాక్రమము గల ఏ రామయమంత్రియో 'గోంగూర వంటి కూరయు గాంగేయునివంటి ధన్వి, నభూతోన భవిష్యతి' యని ప్రస్తుతించియుండవచ్చును. 'మా రామయమంత్రి భోజన పరాక్రమ మే మని చెప్పవచ్చు ఆ స్వామి యెఱుంగు తత్కబళ చాతురి తాళఫల ప్రమాణమున్ ' శ్రీనాథుడు, గోంగూరను గొనియాడకపోయినప్పటికి అరవవారి విండ్లను నిరసించియుండుట చేత నాంధ్రత్వమును నిల్పినవాడై నాడు. 


తొలుతనే ఒడ్డింత్రు  దొడ్డ మిర్యపుజారు చెవులలో పొగవెళ్లి చిమ్మి రేగ

బ్రహ్మరంధ్రము దాకా  బాఱు నావ పచ్చళ్లు మున్నగు అరవ పచ్చళ్లత నికి నచ్చవు. ఈ కవి సార్వభౌముడు కన్నడదేశమున కరిగియచ్చట 'రుచులు దోసంబంచు పోనాడి' నిస్పృహచెందిన వాడు. కావ్యపా కాలలో శ్రీనాథుడు నేటికాలపు రమ్యతయు రుచియు తెలిసిన రసికుడు ఇడైనలకు తన కావ్యమున చో టిచ్చిన యీ కవి నేటి నవనాగరిక యుగమున నుండదగినవాడు.


రాయలు ఋతుపర్ణనలో నాయా కాలములకు దగిన పంటక ములను బేర్కొనియున్నాడు. బ్రాహ్మణభోజనమును గూర్చి చెప్పుచు రాయలు పొరివిళం గాయలను బేర్కొ నెను. వేపుడు బియ్యపు పిండి బెల్లపు పాకముతో జేసిన యుండ లవి. పెరుగువడియములు, పచ్చివరుగులు - వాన కాలమున గలమాన్నము ఒల్చిన పప్పు, నాలుగైదు పొగపిన కూరలు - వేసవి కాలమున నులివెచ్చని యన్నము, తియ్యని చారులు, మజ్జిగపులుసులు, పలుచని యంబలి, చెఱకుపాలు, ఎడనీళ్లు, వడపిందెలు, ఊర గాయలు, నీరుచల్ల – ఇక చలికాలమున మిరియపు పొళ్లతో గూడిన వెచ్చవెచ్చని కూరలు, అవపచ్చళ్లు, చేయి చురుక్కను నేయి, ఇవురగాచిన పాలు బ్రాహ్మణు లారగించెడివారట.


తారుణ్యాతిగ చూతనూత్న ఫల యుక్తాలాభిఘార స్వన 

ద్ధారాధూపిత శుష్యదంబు హృత మాత్స్యచ్ఛేద పాకోద్దతో ద్గారంపుంగనరార్చు భోగులకు సంధ్యావేళలం గోళికాం 

తారాభ్యంతర వాలుకాస్థిత హి మాంతర్నారికేళాంబువుల్


మాంసాహారులైన ధనికులు వేసవి కాలమున చేపల తునకలలో మామిడి కాయముక్కలు వేసి తాళింపు పెట్టి మధ్యాహ్న వేళలం దల్పాహారముగా బుచ్చుకొనెడివారట. ఆ పిమ్మట స్నాన శాల దాపున దడియిసుకలో బూడ్చి పెట్టిన కొబ్బరిబొండములు దీసి ఎడనీరు త్రాగి చేపల కనరును పోగొట్టుకొనెడివా రట. శాకాహారపు అల్పాహారముగూడ నిండకు దక్కువైనది కాదు. పనసతొనలు, దోసబద్దలు, తియ్యదానిమ్మలు, గసదాడి అరటి పండ్లు పానకములు బ్రాహ్మణులు సాపడుచుండెడివారట.


శ్రావణ మాసమున ఆకుకూర అధికము. ఆకాలమున సామాన్యులైన రెడ్లు చెంచలి, తుమ్మి, లేత తిగిరిసాకు తఱగి చింతచిగురు కలిపి నూనెలో వేయించి పొడికూర చేసికొనెడి వారు.


గురుగుం జెంచలి దుమ్మి లేదగిరి సాకుం దింత్రిణీ పల్లవో 

త్కరముం గూడ దొరంటి సూనియలతో గట్టావి కుట్టారు

గిరముల్ మెక్కి తమిన్ బసుల్ పొలము వో గ్రేపుల్ మెయుల్నాక మే 

కరువు గుంపటి మంచ మెక్కిరి ప్రభు త్వైకాప్తి రెడ్లజ్జడిన్.


పెద్ద నార్యుడు శ్రీనాథుని వంటి అనుభవ రసికు డయ్యును నారని కేలతో వంటకములపై బుద్ధిపోలేదు. ఆయనకు 'ఆత్మ కింపయిన భోజన' మున్న జాలు. కప్పురభోగి పంటకముకన్న పెద్దన్నకు కప్పురపు ఏడెమే ముఖ్యము. 


పారిజాతాపహరణప్రబంధమున నంది తిమ్మన్న 'శాక పాకంబుల చవులు వక్కా ణించుచు' శ్రీకృష్ణుడు భుజించినట్లు వర్ణించి యుండెనే కాని, ఆ శాక పాకములను మనదాక రానిచ్చిన వాడు కాదు.


కమ్మనై కారమై నేతను పండంబొల్చి, త దుమురై పాఱుటల్ లేక సద్యోజనితంబుల్ వోలెఁ జాలు జపులోదవునవి కండచక్కెర పాకమున దయారయినవియు సగు అప్పాలను తెనాలి రామకృష్ణుడు వర్ణించెను. ఇచ్చట కార మనగా ఘాటని అర్థము. పింగళి సూరనార్యుడు తన కథానాయకుడై న క ళాపూర్ణునకు బ్రాహ్మణ భోజనమే పెట్టించెను.


పట్లు మండిగలు బొబ్బట్లు వడలు కుడుములు సుకియలు గడియంపుటట్లు వె

కల వంటకములు బూరెలు తేనె తొలలు చా న్నప్పాలు వడియంబు లప్పడాలు బొంగరములు సొజ్జెబూరె కాగుల సేవె లుక్కెర లరిసెలు చక్కిలములు.


తంజాపు రాంధ్ర నాయక రాజైన రఘునాథ భూపాలుడు శ్రీనాథుని కప్పురభోగి పంటకములను చవిచూచినవా డగుటచే గాబోలు తన కాలపు దొరల భోజనములను గూర్చి రఘునాథ రామాయణమం దిట్లు వర్ణించెను.


కప్పురభోగి పంటకము కమ్మగనే పడియున్ భుజించి మేల్

దుప్పటులట్లు మూరగల తోరవు పచ్చడముల్..

కప్పుకొచెడి వారట! ఈ రఘునాథ భూపాలుని కుమారుడైన విజయ రాఘవ నాయకుని రఘునాథాభ్యుదయ ద్విపద కావ్యమం దానాటి వంటకములలోని విశేషము లెన్నేనియు గ్రహింప వచ్చును. ఈ కవిరాజు భోజన మిషతో నాటి మహారాజుల మహానసమున ఘుమఘుమలాడు వంటకములను బెక్కింటిని పేర్కొని యున్నాడు.


ఒక వేదండయాన కై దండ యుసగ దిగి బంగరు పీటమీద గూర్చుండిన పట్టపు రాజు పళ్లెరమున దొలుతగా “గిలుకు టం దెలు మ్రోయ గీరసల్లాప కులుకుచు పచ్చడులు గొని వచ్చినదట ! వడ్డన మొదలుకొని స్వీయ సంప్రదాయమునే వర్ణించి నాడు విజయ రాఘవుడు.


"అప్పడాల్ నువు పొడి హవణించినట్టి 

కప్పురపుకోడి యొక్క లతాంగి తెచ్చె

 తురిమిన టెంకాయ తునియలు గూర్చి కరివేప పొడిచల్లి కమ్మని నేత

పొంకంబుగా దాల్చి పొదిగినయట్టి కుంకుమకోడి గై కొనివచ్చె నొకతి"


ఈ వంటకములలోని పదార్థములనుబట్టి ఇవి శాక సంబం ధములే యనియు, నేటి పకోడీలవంటివే కప్పురపుకోడి మున్నగు నవి యనియు, నాటి బ్రాహ్మణులుగూడ నిట్టివి చేయుచుండెడివా రనియును జెప్పవచ్చును. కాని బ్రాహ్మణులు దీనిని కప్పురపు కోడి, కుంకుమకోడి, కస్తూరికోడి, పాలకోడి, కట్టుకోడి అని పేర్కొనకపోవచ్చును. పదార్థ మొక్కటియయ్యును వ్యవహారమునందును, పేర్లలోను కొద్దిపాటి భేద ముండవచ్చును. కో ళ్లన్నియు బోయి పకోడీలు మాత్రము నిలిచినవి. 


నీరుమజ్జిగయనగ మనము సాధారణముగా మజ్జిగ తేట యని భ్రమపడుదుము. అది కాదు.


"సారమౌ జంబీర సారంపు రుచుల 

మీఱంగ లవణంబు మితముగా గూర్చి 

మేలైన సొంటితో మిళిత మైనట్టి 

ఏలకి పొడివైచి యింపు దీసింప 

దగు వట్టివేళ్లచే తావులు గట్టి 

మగువ యొక్క తె నీరుమజ్జిగ దెచ్చె"


ఇవి కాక మనము మఱచిపోయిన సారసత్తులు, పేణీలు మున్నగు ఈ కవి తన ప్రబంధమున నిబంధించి మనకు రుచి చూపించుచున్నాడు.



- ఉత్పల సత్యనారాయణాచార్యులు 

( ఆంధ్ర ప్రదేశ్ - మాప - జనవరి, 1961 ) 

సేకరణ : కర్లపాలెం హనుమంతరావు .

                29-12- 2021 

Friday, December 24, 2021

పంచతంత్రము; దాని పుట్టుక శ్రీ శ్రీనివాసపురం నరసింహాచార్యులు ( ఆంధ్రసాహిత్య పరిషత్పత్తిక' 1957 - ఇస్యూ 6 )









 



పంచతంత్రము; దాని పుట్టుక

శ్రీ శ్రీనివాసపురం నరసింహాచార్యులు 


( ఆంధ్రసాహిత్య పరిషత్పత్తిక' 1957 - ఇస్యూ 6 ) 


శ్రీనివాసపురం నరసింహాచార్యులు, రమారమి ఏడెనిమి దేండ్లనాడు ఆంధ్రపత్రిక సచిత్ర వారపత్రి కలో శ్రీవిశ్వాత్ముల నరసింహమూర్తి గారి బొమ్మల పంచతంత్రము ప్రశటింపబడుచుండెను. కాని, అది పూర్తి కాశమునుపే మరదురదృష్ట వశమున నాక ధా చిత్రకారుడు కీర్తి శేషు డగుటచే పత్రికలో పడినంత వరకు పుస్తకరూపముగా వేసిన ఆంధ్రపత్రిక గ్రంథమాలా ప్రకాశ కులు తమమాటగా 'ఈపంచతంత్య్ర గ్రంథము పుట్టుక యెక్కడనో యెరుగ రా' దని వాసిరి. అది చదివినప్పుడు జగము మెచ్చిన శాస్త్ర మును జంతు సంతానముల ద్వారా జనులకు తెలియజేసెడి కృతిని జేసి సుశృతి యైన యీమహాకవి జీవితవి శేషములను ఏతద్గ్రంధము యొక్క జన్మస్థానమును; ఉత్పత్తి కారణములను వీనిని గురించిన విషయ ములు విద్వత్పరిశోధకు లెవ్వరేని తెలిసికొని ప్రకటము గావించుట కింతవరకు ప్రయత్నింపరైరిగదా ! యని విచారించి, యది మొద లావిషయమును తెలిసుకొనుటకై యన్వేషింపసాగగా నిన్నాళ్ళ కిప్పుడు ఆపంచతంత్ర గ్రంధి మెప్పుడు. ఎక్కడ, ఎందుకు ఎట్లు పుట్టినదో నాకు తెలియవచ్చినట్టి విశేషములను సారస్వతాభిమానుల సమక్ష మున నుంచుచుంటిని,


భారత దేశమునందలి సంస్కృతగ్రంధము లెన్నో అన్యభాష లలోని కనూడితము గావింపబడినవి. కాని, ఏదియు నీ పంచతంత్ర కావ్య మువలె పలు భాషలలోనికి పరివర్తనమై ప్రపంచవ్యాప్తి నంది నకల దేశములలోని సంస్కృతవిద్యార్థి విద్యాధికులకు గూడ పఠనీయమై యలరారుచున్న కృతి వెదకినను మరియొకటి కానరాదనుట జ్ఞా లంగీకరించిన నగ్న సత్యము,


ఈగ్రంధమున మిత్రభేదము, సుహృల్లాభము, సంథివిగ్రహము లబ్ధనాశము, అవిమృశ్యకారిత్వము అను ఐదుభాగము లున్నవి. క్రీ.శ. 581_579 సం॥ ప్ర్రాంతమున పర్షియా దేశము నేలు చుండిన ఔషరు


వాన్ అనబడెడి పారసీక రాజు కాలమున సీగ్రంధము వహ్లతీభాషలో వీ నికిని. క్రీ. 18వ శతాబ్దని అరబ్బీ భాషలోనికిని, సైమియాన్ సేథ్ (Symeon 'Seth) అను నాతనిచే స్త్రీ. 1015 ప్రాంతమున గ్రీకు భాష శ లోనికిని, పొస్సిసస్ (Possinus) అన్న యతనిచే ల్యాటిన్ భాషలో నికిని రబ్బీజోయెల్ (Rabbi Joel) అను పండితునిచే క్రీ. 1250 ప్ర్రాంతమున హెబ్రూ భాషలోనికిని ఆతర్వాత నొకటి రెండు సంవత్స రములలో స్పానిష్ భాషలోనికిని పిమ్మట కీ. 15వ శతాబ్దని జర్మను భాషలోనికిని, ఆపై యూరపియను భాషలన్నింటిలోనికి పిల్పే లేక విద్వాయ్ ఫేబుల్స్!(Fables of Pilpay or Vid pai i.e. Vidya pati) అను పేరను ఇట్లు రమారమి రెండువందలమంది విద్యావేత్తలచే అన్ని దేశములలోను మొత్తముమీద సుమారేబది భాషలలోని కీయు ద్గ్రంథ మనువాదము చేయబడియున్న దని హెర్టల్ అను పాశ్చాత్య పరిశోధకుడు తనహిందూ దేశ కథాకావ్యచరిత్రములో వ్రాసియున్నా డు, ఈ కావ్యము యొక్క ప్రశస్తి తెలియుట కీవిషయ మొక్కటి


ఇయ్యది మాతృకయై యుండ దీని ననుకరించియు, అనుసరిం చియు మన దేశమున నెన్ని యేని నీతి కావ్యము లుదయించినవి. దీనికి సంగ్రహరూపమున సంస్కృతమున పంచతంత్ర కావ్య - పంచతంత్ర కావ్యదర్పణ - పంచోపాఖ్యానాదులు పెక్కుకృతులు గలవు. అట్లే ఆంధ్ర భాషయందును దూబగుంట నారాయణకవి, బైచరాజు వేంక టనాధకవి ప్రభృతులు పద్య కావ్యములుగను, కందుకూరు వీరేశలింగ కవి. పరవస్తు చిన్నయసూరి మొదలైన పండితులు గద్యరూపము నను, విశ్వాత్ముల నరసింహమూర్తి, శీలా వీర్రాజు మున్నగు చిత్ర కారులు బొమ్మలకధలుగను ఇంతటిప్రశస్తికి పాత్ర మైన యీకృతిని విద్యాపతిబిరుదనాము డైన విష్ణుశర్మ పండితుడు రచియించెను.


కృత్యాదియందు —


“మన వేవాచస్పతయే శుక్రాయ పరాశరాయ సముతాయ చాణక్యాయ చ విదుపే నమో ఒస్తు నయశాస్త్ర కర్తృభ్యః॥ సశలార్ధశాస్త్రసారం జగతి సమాలోక్య విష్ణుశ ర్మేదమ్, తం తైపంచభి రేత చ్చకార సుమనోహరం శాస్త్రమ్ |


అని చెప్పుటనుబట్టి యితఁడు ప్రాచీనము లైనమను అత్రి;విష్ణు హంత్ర; యాజ్ఞవల్క్య; ఉశన; అంగీరన; యమ; ఆపస్తంబ; సంవర్త; కాత్యాయన; బృహస్పతి; పరాశర; వ్యాస; శంఖ; లిఖిత; దక్ష; గౌతమ; శాతాతప; వశిష్టాదివింశతిధర్మశాస్త్రములనేగాక చాణక్య విష్ణుగు ప కౌటిల్యుని అర్థశాస్త్రము మొదలైన రాజనీతిశాస్త్రముల నన్నింటిని సాకల్యముగ ఆపోశనముపట్టి యాకళింపునకు దెచ్చుకొని ఆకాలమున ‘విద్యాపతి 'బిరుదవిఖ్యాతుడై వినుతింపబడియుండె నని చెప్పనగును.


గ్రంధాన తారికలో :—


"దక్షిణ దేశమందలి మహిళారోప్యపురము నేలెడి అమరశక్తి యనురాజు దుర్వినీతు లైనతన కొడుకులకు నీతి నేర్పు మని కోరగా వారికై నే నీ నీతిశాస్త్రమును రచియించితి” ననుమాటలు వా వ్రాసియుం టను బట్టి యీశవి దక్షిణ దేశవాసి మైనయా జేసియాస్థానమున విద్వత్కవిగా నుండెనని భావింపవచ్చునుగాని, ఈవిషయమునే పరి శోధకులును గుర్తించియుండ లేదు. అందుచే నీమాట గ్రంథ ప్రశస్తికై యాతడు కల్పించివ్రాసినదో లేక నిజమో యూహింప నలవి గాకు న్నది." అని బ్రహ్మశ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రిగారు తను వా సంస్కృతకవిజీవితము పుట 180లలో వాసిరి.


క్రీస్తు మొదటశతాబ్దియందు హిందూ దేశమున క్రైస్తవ


మతము వొడసూపి రెండవ శతాబ్దిలో నది దక్షిణ భారతమున నేటి మదరాసుప్ర్రాంతమున సుస్థిరముగ పాదుకొనినట్టు చరిత్ర తెలియ జేయుచున్నది. అప్పుడు అనఁగా క్రీ.2వ శతాబ్ది యారంభ కాలమున బలాఢ్యు డై నఅమరశక్తి యను రాజు మహిళాతోవ్యపుర మనబడెడి ప్రాచీన హైందవనగరమును రాజధానిగా జేసికొని రాజ్యపాలనము చేయుచుండెను. అదేనేడు మైలాపూరు అని వ్యవహరింపబడుచు మద రాసుమహానగరమున సంతర్భాగ మైపోయినది. ఈమహిళారోప్యపుర మునే గ్రీకు దేశస్థు డైన టాలెమీ (Ptolemy 140-150 A. D.) యనుభూగోళశాస్త్రజ్ఞుడు 1. పశ్చిమ భారత దేశము, ఆఫ్ఘనిస్థానము, డు బెలూచిస్థానము (India Intra Gengem) 2. ఆగ్నేయాసియా, చీనా దేశము (India Extra Gengem) అను పేర్లతో వ్రాసిన భారత దేశభూగోళగ్రంథమున రెండవ భాగమందు దక్షిణ దేశభౌగో ళిక స్వరూపనిర్ణయము చేయుసందర్భమున 'మహిళార' (Mahi larpha) యని పేర్కొనియుండినట్లు శ్రీ అక్షయకుమార్ మజుందార్ గారు తమహిందూహిస్టరీ యనుగ్రంథమున 844వుటలో వాయు చున్నారు.


పై నిచెప్పిన అమరశక్తి రాజునకు బాహుశక్తి, ఉగ్రశక్తి, అనంతశక్తి యనెడినిరక్షరకుక్షలు మూఢులు నై నముగ్గురు కొడుకు రమూర్ఖన్యు లైనయాకుమారత్రయమునకు విద్యా లుండిరి. మూర బుద్ధులు గరపి గుణవంతులుగ చేయుటకై యారాజు చేసిన ప్రయ త్నము లన్నియు నిష్ప్రయోజనము లయ్యెను. తుట్టతుదకు దైవవశ మున అశీతివర్ష ప్ర్రాయుడును, విద్యావృద్ధుడును ఆకాలమున పేరు మోసినపండితుడును నై నవిష్ణుశర్మను ప్రార్థింపగా రాజుకోరిక సంగీక


రించి యాయువరాజతయము నాశ్మశిష్యులుగా గ్రహించి వారిమన సున కిష్టమైనవిధమున వశుపక్ష్యాదులసంభాషణము చేసినట్లు నీతిధర్మ ములు నిండై యుండ అద్భుతము లైనకథలు చెప్పుచు వారిని వశవర్తు లను గావించుకొని మనసునకు నొప్పి గలుగనీయక నీతినేగాక జీవిత రహస్యములును, రాజ్యతంత్రములును మొదలై నసర్వవిషయము లును బోధించి వారిని గుణకోవిదులను గావించి తండ్రి కప్పగించి యాతనిచే మన్ననలు పొందెను. ఈవిషయములు శ్రీ వి. కె. మజుం దార్ గారు తనుగ్రంథము 716 పుటలో వ్రాసియున్నారు. ఇట్లగుట చేతనే కథలు, కట్టుకథలు వినికూర్పు నేర్పున భారతీయులు సర్వ ప్రపంచమందలిమానవజాతికిని బోధకు లైరని గుణపక్షపాతి యైన ఎలిఫిన్ స్టన్ మహాశయుడు తసహిందూ దేశ చరిత్ర తొమ్మిదవ ముద్రణ 172వపుటలో నుల్లే ఖంచియున్నాడు.


ఈయాధారములతో సంస్కృతశ విజీవిత కారునిసంశయము తీరి మన కొకమార్గము దొరికిన ట్లయినది.


ఇంతకును విద్వన్మణి యైనవిష్ణుశర్మజీవిత చరిత్రము పూర్తిగా లభింపదయ్యెను. ఈతడు తనకథలలో నవకాశముగల్గినప్పు డంతయు బౌద్ధబిక్షువులను, జైనసన్యాసులను, యాయావరీయ బ్రాహ్మణులను తఱచుగా నుపాలంభము చేసియుండెను. ఒకకథలోని సందర్భమును పురస్కరించుకొని యొకానొక నక్కనోట 'అహో! నేడు భట్టారక వారముగదా! మాంససంబంధమైన యీసరమును నాదంతములతో నెట్లు స్పృశింపగలను!' అని పలికించుటను పరిశీలనా దృష్టితో నాలో చింతు మేని ప్ర్రాచీన కాలమున భానువాసరమున మాంసాహారము నిషేధింపబడిన పెచ్చటను కానరాకున్నది. గనుక ఆకాలమున నీ మహిళారోప్యపురము (Mylapore)న నెలకొనియుండిన క్రై స్తవులు ఆదివారమున మాంసాహారము, మద్యసేవనము, దైనందిన చర్యయు


మాని విధిగా సుపవసించి యారాధనా మందిరములలో గుమిగూడి శ్రద్ధాళువులై తమ మతగ్రంథమైన బైబిలును పఠించుచుండెడి వారి -యాచారముల వాలకము నతిచమత్కారముగ నవహాస్యము చేసి సహేతుకమైన వ్యాజ వినయమును ప్రదర్శించి యుండే నని తోపక -మానదు.


మదరాసు ప్ర్రాంతమునందలి మైలాపూరున బుట్టి ప్రాముఖ్యత నంది కాలక్రమమున సకలజగత్సంస్తూయమాన మైన గ్రంధ మని తెలిసియే పరవస్తు చిన్నయసూరి ప్రత్యేకించి దీనియాం ధీకరణమునకు బూనుకొని యుండెనేమో యనిగూడ తలంప వీలు లేకపోలేదు. గ్రంధము సాంతముగ ముగిసియుండినచో దీని చరిత్రను గురించి ఆమహామనీషి గ్రంధప్రస్థావనములో వ్రాసియుండు నేమో శదా?


'విష్ణుశర్మ యొక్క యీకృతి గుణాఢ్యుని బృహత్క ధలోని కొన్ని కధలకు వచనరూపమైన సంక్షేపానువాదము. ఈగ్రంధమున నందందు గానవచ్చెడి శ్లోకములు కొన్ని యీతడు స్వయముగా రచి 3 యించినవే యనవచ్చును గాని, పెక్కు శ్లోకములు మనుస్మృత్యాది పూర్వగ్రంధములనుండి స్వీకరించినవే యనదగును. కాని, క్రీ. శ. 8వ శతాబ్దివాడైన దామోదరగుప్తుని శంభళీమతనామాంతర కుట్టనీ మతమునందలి "పరఙ్కః స్వాస్తరణః పతి రనుకూల” యన్నల్లోక సా చితని పంచతంత్య్ర మిత్రభేద ప్రశరణము నందును. కీ. 9వ శతాబ్ద ఉత్తరార్ధమువాడును ఔత్తరాహుడును నైన రుద్రభట్టుయొక్క శృంగారతిలశములోని “సార్థంమనోరధశతై” అనెడి శ్లోక మాం ఛమున లబ్ధనాశతంత్రము నందును గనిపించుచుండుట వలనను ఇంగ్లం డులోను జర్మనీ దేశమునందును ముద్రితమైన “పం చతంత్రము”నకును భారత దేశమున వ్యాప్తిలోనున్న గ్రంధమునకును కొన్ని చోట్ల భేదము


కానవచ్చుచున్న దాని సర్. సి, పి, బ్రౌను పండితుడు చెప్పుటచేతను, గ్రంధము దేశమున వ్యాపించినకొలది రోజులలోనే క్రమేపి అర్వా చీనులకృతులలోని శ్లోకము లీపంచతంత్రమున ప్రక్షిపము లైనట్లు. విమర్శనా చక్షువులకు విదితముగాక పోదనుట సత్యదూరము కాదు.


ఇంతవరకును గ్రంధప్రశస్తి దానిమార్పు జన్మస్థానము కృతి కర్త వెదుష్యము వీనింగూర్చిన విషయము లుటంకించితిని, ఇంత కాల నిర్ణయమును గూర్చి మల్లాది వారనిస మాటలంజెప్పి మతాంతరములు. జూపించి పర్యవసానముం జెప్పి యీనావ్యాసమును ముగింతును,


క్రీస్తు ఆరవశతాబ్దిని మొట్ట మొట్టమొదట నీపంచతంత్య్ర గ్రంథము. పర్షియను భాషలోని కనువదింపబడినది కనుక అంతకుమున్నె యీ గ్రంధముపుట్టినదని కొందరును, దౌర్మంత్యా న్నృపతిరిత్యాదిభర్తృ హరిసు భాషిత త్రిశతిలోని శ్లోక మిం దుండుటంబట్టి దానిత ర్వాత నిది జనించిన దని మరికొందరును ఏతచ్చోక మిదిపుట్టిన తర్వాత చేరియుండు ననెడి భావమున సుభాషిత త్రిశతిశన్నను వంచతంత్య్రమే ప్రాచీన మని పల్కుచున్నారు గనుక విష్ణుశర్మకాలము సునిశ్ఛితము కాకున్న దని సంస్కృతకవి జీవితము 18 పుటలో వ్రాసిరి.


ఏవిధముగ జూచినను భర్తృహరి క్రీస్తు కుపూర్వు డగునని పలు వురు పండితులభిప్రాయము నొసంగియున్నారు. కావున మన మీ సందే హమును వీడిమతాంతర మైన యభిప్రాయముల నరయుదము,


డాక్టర్ : యం. కృష్ణమాచారియార్ (మదాసు) గారు తమ హిస్టరీ ఆప్ క్లాసికల్ సాట్ లిటరేచర్ అన్న పేరున 1937 సం॥ ప్ర్రకటించిన గ్రంధమున నీవిష్ణుశర్మను క్రీ.పూ. 776 సం॥ నాటిదాడుగా గుణాఢ్యునిశన్నను ముందు కూర్చుండ పెట్టుట యెట్లొ పరిశోధకులు నిర్ణయింతురు గాక !


 

67


పంచతంత్రము; దాని పుట్టుకు


మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు 'మెట్లయిన నితడు శా. శ. 450 కి పూర్వడు గాని పరుడు మాత్రము కా'డని ముగ తముయభిప్రాయమును చెప్పిరి.


విషయ మంతటిని సముస్వయము జేసి చూచినచో విష్ణుశర్మ


తప్పక స్క్రీ. 2వ శతాబ్ది ప్రధమపాదము నాటివాడనియు నేటిమదరాసు మహానగరమున నొక భాగమైన నాటి మహిళారోప్య పురము నేటి మైలాపూరునంది పంచతంత్రము వుటైననియు ప్రపంచమునకు తెలియ వచ్చుట సాహిత్యారాధకులకు సంతోషదాయకము కదా !


ఈవ్యాసమును వ్రాయునెడల నేను పేర్కొన్న గ్రంధకర్తల కును, ప్రకాశకులకును కృతజ్ఞతలు చెప్పుచు విరమింతును.


- శ్రీ శ్రీనివాసపురం నరసింహాచార్యులు 

( మూలం - ఆంధ్రసాహిత్య పరిషత్పత్తిక' 1957 - ఇస్యూ 6 ) 


సేకరణ 

కర్లపాలెం హనుమంతరావు

బోథెల్ ; యూ. ఎస్.ఎ.

24 -12-2021 










Sunday, December 19, 2021

నేటి కాలపు కవిత్వం - పై సంపాదకీయం- చేకూరి రామారావు


















 

నేటి కాలపు కవిత్వం - పై 


సంపాదకీయం


"దేశంలో భారతీయ సంస్కార ప్రవాహాలు ఇంకిపోయినవి. విద్యాపీఠాలు అస్తమించినవి. గురుకులాలు రూపు మాసినవి. భారతీయ సంస్కారం లేని కేవల పాశ్చాత్య సంస్కారం బలప్రదం కాక ఆత్మ విముఖత్వాన్ని, పర సంస్కార దాస్యాన్ని మనకు ఆపాదించినవి"


ఈ పుస్తకం చివర రాసిన పైమాటల్లో అక్కిరాజు ఉమాకాంతం (1889-1942)గారి సర్వసాహిత్య కృషి నేపథ్య సారాంశం తెలుస్తుంది. ఆయన జీవించింది 53 సంవత్సరాలే అయినా అమోఘమైన పాండిత్యంతో, అసమాన వాదపటిమతో, అవిచ్ఛిన్న సారస్వత వ్యాసంగంతో తెలుగు సాహిత్య లోకంలో చిరకాలంగా పాతుకు పోయిన విశ్వాసాలను కుదిపి వేసిన సాంస్కృతిక విప్లవకారుడు అక్కిరాజు ఉమాకాంతం గారు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోటానికి ఆయన జీవిత చరిత్ర ఎవరూ రాయలేదు. వావిళ్ళ వేంకటేశ్వర శాస్త్రులు గారి శత జయంతి సంపుటం (1986) లో "త్రిలిఙ్గ తొలినాళ్ళ సంపాదకులు ఉమాకాంత విద్యా శేఖరులు" అనే పేరుతో అక్కిరాజు రమాపతి రావుగారి అయిదు పేజీలు చిరు వ్యాసమూ తెలుగు విజ్ఞాన సర్వస్వమ మూడవ సంపుటంగా వచ్చిన 'తెలుగు సంస్కృతి' అనే వాల్యూమ (1959) లో అబ్బూరి రామకృష్ణారావుగారి ఒక పేజీకి మించని చిన్న నోటూ మాత్రమే ప్రధాన ప్రయత్నాలుగా కనిపిస్తున్నాయి.


అక్కిరాజు ఉమాకాంతంగారు గుంటూరు జిల్లా పల్నాడు తాలుకా గుత్తికొండ అనే చిన్న గ్రామంలో లక్ష్మమ్మ, లక్ష్మీనారాయణ దంపతులకు జన్మించారు. గుత్తికొండకు సుమారు ఏడెనిమిది మైళ్ళ



X


దూరంలో ఉన్న జానపాడు అనే ఊళ్ళో సంస్కృత భాషాభ్యాసం చేశారు. శిష్ట్లా సీతాకాంతశాస్త్రి గారు వీరి గురువుగారు. ప్రస్తుత గ్రంథంలో మొదటి శ్లోకంలో వారి ప్రస్తావన ఉంది. పదిహేను పదహారేళ్ళ వయసులో గుంటూరు లూథరన్ మిషన్ వారి హైస్కూలులో ఇంగ్లీషు చదువులు చదివారు. మెట్రిక్యులేషన్ చదివే రోజుల్లో ఈయన శతావధానం చేశారు. బెజవాడలో కన్యకా పరమేశ్వరి హిందూ పాఠశాలలో కొన్నాళ్ళు తెలుగు పండితులుగా ఉద్యోగం చేశారు. 1912 లో తెరచిన ఆంధ్ర సాహిత్య పరిషత్తు మద్రాసు కార్యాలయంలో జయంతి రామయ్యగారి ఆహ్వానంపై కొన్నాళ్ళు మేనేజరుగా పనిచేశారు. వేషధారణపై వచ్చిన పేచీ వల్ల ఉమాకాంతంగారు ఉద్యోగం మానేసినట్లు రమాపతి రావుగారు పైన పేర్కొన్న వ్యాసంలో రాశారు. ఈయన బెంగాల్లో నవద్వీప సంప్రదాయాన్ననుసరించి భాష్యాంతముగా సంస్కృత వ్యాకరణమూ, తర్కశాస్త్రమూ, అభ్యసించి 'విద్యాశేఖరు' లైనా రని అబ్బూరి రామకృష్ణారావుగారు రాశారు. "తమ తర్క వ్యాకరణ విద్యా వ్యాసంగాన్ని వంగ దేశంలో జరుపుతూ వచ్చారు; వంగ సాహిత్య వేత్తలతో సాహచర్యం వల్లా, లోకజ్ఞానం వల్లా, స్వానుభవం వల్లా, వంగ సాహిత్యాభ్యుదయానికి గల కారణాలను వివేకంతో సూక్ష్మంగా పరిశీలించడం వల్లా తమకు కలిగిన జ్ఞానాన్ని ఆధారంగా తీసికొని తమ మాతృభాష అయిన తెనుగును పరామర్శించడం ఆరంభించారు" అని అన్నారాయన. ఆయన వావిలి కొలను సుబ్బారావుగారి తరవాత (1929లో) మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు. 1913-1914 మధ్య కాలంలో త్రిలిఙ్గ పత్రిక సంపాదకులుగా పనిచేశారు. 'త్రిలిఙ్గ' అనే పేరు ఆయన పెట్టిందేనని త్రిలిఙ్గ రజతోత్సవ సంచిక (1941) కు పంపిన సందేశంలో పేర్కొన్నారు. ఆ సందేశంలో ఇంగ్లీషులో కామెంటు (comment) అనే మాటకు పర్యాయంగా వ్యాఖ్యా శబ్దాన్ని పరీక్ష పత్రాల్లో తానే మొదట వాడినట్టు పేర్కొన్నారు.


1913-1014 సంతురాల లో ఆయన శిబి




అయ్యాయి. ఉమాకాంతం గారు తమ కథల పీఠికలో 'ఇట్టి కథల వాఙ్మయము తెలుగునకు కొత్తది' అని గుర్తించారు. అప్పటి కాయన రచనాశైలి ప్రాచీన భాషకు సన్నిహితం. సంధి నియమాలను సడలించి ఆధునిక రచనాభాషను ఏర్పరచటానికి ఉమాకాంతం గారు కూడా కృషి చేసినట్టు ఈ సంపుటం ద్వారా తెలుసుకోవచ్చు. ఈయన కథల్లో కూడా తొలినాటి ఇతరుల కథల్లో లాగే లక్ష్యం సాఘిక సంస్కరణే. మూఢ విశ్వాసాల నిర్మూలనే బ్రాహ్మణ సమాజంలో పాదుకొన్న మూఢ విశ్వాసాల వల్ల స్త్రీల బతుకుల్లో ఉన్న బాధల్ని వివిధ రీతుల్లో ఈ కథల్లో వర్ణిస్తారు.


ఈ కథల్లో 'ఎదుగని బిడ్డ' ఆంధ్ర సాహిత్యాన్ని కన్న తెలుగుతల్లి ఉత్తమ పురుషలో చెప్పిన కథ. చివరివరకు ఎలిగొరీ అనే కథా శిల్పాన్ని పాటించిన ఈ కథలో 'ఆంధ్ర సాహిత్యం ఎప్పుడూ ఎదగని బిడ్డయే' అని తమ నిశ్చితాభిప్రాయాన్ని వెల్లడించారు. సుమారు పాతికేళ్ళ ప్రాయంనుంచి ఆయనకు తెలుగు సాహిత్యంపై సదభిప్రాయం లేనట్టు ఈ కథను బట్టి మనం తెలుసుకోవచ్చు. అదల్లా ఉంచి ఎలిగొరీ పద్ధతిలో ఉత్తమ పురుష కథనంలో రాసిన మొదటి తెలుగు కథ ఇదే కావచ్చు.


తెలుగు సాహిత్యంలో అభివృద్ధి కాని నూతన ప్రక్రియలను అభివృద్ధి చెయ్యాలనే ఆకాంక్ష ఆయనకు గాఢంగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఆ కోరికే ఆయన చేత చిన్న కథలను రాయించింది. ఫిలిప్ మెడోస్ టైలరు (Philip Meadoues Tailor, 1808-1876) అనే ఆంగ్ల నవలా కారుడు రచించిన టిప్పు సుల్తాన్ నవలను ఆంధ్రీకరించి 1912 నవంబరులో ప్రకటించారు. ఈ నవల పీఠికలో కూడా ఆంధ్ర సాహిత్య స్థితిని గూర్చిన చర్చ ఉంది. టైలరు హైందవ సంప్రదాయాభిమాని కావటం వల్ల అతని రచనను తెలిగించానని ఉమాకాంతం గారు పీఠికలో చెప్పుకున్నారు.




'ఉమాకాంతం గారు 1921 లో తెలుగు దేశ వాఙ్మయ పత్రికను స్థాపించి సంస్కృత వ్యాకరణ ప్రదీపం, పాణినీయ ఆంధ్ర వివరణం. రసమీమాంస, నైషధ తత్వ జిజ్ఞాస వంటి ప్రశస్త రచనలు వెలువరించారు' అని అక్కిరాజు రమాపతి రావుగారు రాశారు.


'లౌకిక దృష్టితో చెప్పుకోదగిన సంఘటన లేవీ ఆయన జీవితంలో లేవు. పాండిత్యానికి తగిన శరీర దార్థ్యం ఆయన కెన్నడూ లేకపోయింది.' అని అబ్బూరి రామకృష్ణారావు తెలుగు విజ్ఞాన సర్వస్వంలో అన్నారు.


ఉమాకాంతంగారి రచనలపై సమగ్ర సమీక్ష జరగలేదు. సంపూర్ణమైన అంచనా రాలేదు. ఆయన రచనలు దొరికినంత వరకూ (అన్నీ దొరకవు) పరిశీలిస్తే ఆయనకు తెలుగు సాహిత్యంపై నిర్దిష్టమైన అభిప్రాయాలు, విలక్షణమైన ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తున్నది. ఆయన రచనలన్నింటా తెలుగు సాహిత్య స్థితిని గూర్చి ఆవేదన కనిపిస్తుంది. ప్రచురణ వివరాలు దొరకలేదు గాని రమాపతి రావుగారి సౌజన్యం వల్ల ఆయన చిన్న చిన్న వ్యాసాలు కొన్ని దొరికాయి.


సాంఘికంగా ఆయనకు అభివృద్ధికర భావాలే ఉన్నట్టు. సాంఘిక సంస్కరణలకు ఆయన అనుకూలుడే అయినట్టూ ఆయన కథలను బట్టేకాక ఆయన విడివిడి వ్యాసాలనుబట్టి కూడా చెప్పవచ్చు. 'తెలుగు దేశము నందలి చండాలురు' అనే వ్యాసంలో "చండాలురని చెప్పుటకు ఏ ప్రమాణమూ లేని మాదుగులను, ఆంధ్రదేశము నందలి మొదటి తెగలగు చెంచులు బలిజెలు మొదలైన వారివంటి మాదుగులను అస్పృశ్యులుగా బాధించుచున్నాము. ఊళ్ళనుండి బయటికి వెళ్ళగొట్టినాము. బావుల వద్దకు రానీయము. దేవాలయములలో ప్రవేశించనీయము. ఇంతకంటే తెలుగు దేశము ఆచరించుచున్న అధర్మము మఱియొకటి లేదు. ఈ దురాచారము అప్రామాణికమైనది అనర్ధహేతువైనది అని చెప్పుచున్నాను' అని నిర్ద్వంద్వంగా ప్రకటించారు.



విదేశయానం చేసినందుకు నడింపల్లి నరసింహారావు గారిపై తెచ్చిన అభియోగానికి ఉమాకాంతం గారు కోర్టులో సాక్ష్యం ఇచ్చారు. దాన్ని ఒక విమర్శన వ్యాసంగా రాస్తూ సముద్రయానం చెయ్యటం వల్ల పతితుడవుతాడనటానికి శాస్త్ర ప్రమాణం లేదని నిరూపించారు.


ఉమాకాంతం గారు సాహిత్యాంశాలపై తమ అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడించారు. ఎంతటి గొప్పవారి అభిప్రాయాలను ఖండించటానికైనా వెనుదీసే వారు కాదు. మద్రాసు విశ్వవిద్యాలయంలో 1923 సంవత్సరానికి పెట్టిన పురాణపండ మల్లయ్య శాస్త్రిగారి శుక్రనీతిని విమర్శిస్తూ.'బ్రదిమి ఏనిక, దిగ్గియ ఒండె. ఉలుపా, ఎకిమీడు' వంటి పాతపడ్డ మాటలను వాడటాన్ని నిరసించారు. ఆ పుస్తకానికి యోగ్యతా పత్ర మిచ్చిన జయంతి రామయ్య గారి స్వవచో వ్యాఘాతాలను ప్రదర్శించారు.


ఇంగ్లీషు పాఠ్య నిర్ణాయక సంఘంలో ప్రెసిడెన్సీ కాలేజీలో ఇంగ్లీషు బోధించే వారిని వేసి, తెలుగు పాఠ్య నిర్ణాయక సంఘంలో తెలుగు బోధకులను వేయక పోవటాన్ని నిరసించారు.


విష్ణు చిత్తీయ వ్యాఖ్యాన సభలో వేదం వెంకటరాయశాస్త్రిగారు. కట్టమంచి రామలింగా రెడ్డిగారు వెలిబుచ్చిన అభిప్రాయాలతో తీవ్రంగా విభేదిస్తూ వాఙ్మయపత్రికలో వ్యాసాలు రాశారు. ఆముక్త మాల్యదలో చాలా గొట్టుమాటలున్నాయి కాబట్టి అది గొప్ప కావ్యం అయినట్టు వేదం వెంకటరాయశాస్త్రి గారన్నారని చెపుతూ ఆ మాటలందు నాకు ప్రమాణ బుద్ధి కలగలేదు అన్నారు. మను చరిత్రలో రసాభాస ఉన్నది కాబట్టి దాన్ని మంచి కావ్యం కాదన గూడదన్నారు (అంతమాత్రం చేత మను చరిత్ర ఉత్తమ కావ్యమనికాదు. ఇతర కారణాలు చూపించాలని ఆయన అభిప్రాయం.) రసాభాస నిషిద్ధం కాదని అది అంగంగా ఉండవచ్చునని సిద్ధాంతం చేశారు. ఇంతకీ మనుచరిత్రలో ఉన్నది రసాభాసకాదని, వరూధిని కది వాస్తవమేనని వాదించారు. సందర్భంలోనే మనుచరిత్రను పెద్దన రచించ లేదనీ, కృష్ణరాయలు



విమర్శిస్తూ "కృష్ణరాయలు రచించిన కృష్ణశ్రేష్ఠి రచించినా. కృష్ణామాత్యుడు రచించినా, కృష్ణ భట్టు రచించిన పుస్తకములోని మంచి చెడ్డలు మారవు గనుక ఆ విచారణ నేనిక్కడ పెట్టుకోలేదు" అని వస్తుగత విమర్శ ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పారు.


కట్టమంచి రామలింగా రెడ్డిగారు మద్రాసు గోక్లేహాల్లో ఇచ్చిన ఉపన్యాసాన్ని పత్రికల్లో చదివి వాఙ్మయ పత్రికలో విమర్శించారు. రామాయణం కంటే భారతం ప్రాచీనం అని రెడ్డిగారా ఉపన్యాసంలో చెప్పారు. భారతం కావ్యంకాదు. సంహిత అని రెడ్డిగారన్నారు. భారతం కావ్యమేనని, భారతం కంటే రామాయణం పూర్వమనే ఉపపత్తులను ప్రదర్శిస్తూ ఉమాకాంతం గారు వాదించారు. ఆ సందర్భంగా "వాస్తవముగా సంఘమును సంస్కరింపవచ్చును. సర్వసమత్వము ప్రతిష్ఠించ యత్నించవచ్చును. వీటికన్నిటికి రామలింగా రెడ్డిగారు మరికొన్ని మార్గములు అవలంబించ వలసియున్నది గాని భారత వర్షేతిహాసములను గురించి భారతీయుల ప్రాచీన వాఙ్మయము గురించి తెలిసీ తెలియని మాటలు మాట్లాడుట మాత్రము అనుచితమైన కార్యము" అని స్పష్టంగా నిర్భయంగా ప్రకటించారు.


'నైషధ తత్త్వ జిజ్ఞాస' అనేది సంస్కృత నైషధ కావ్యంపై విమర్శ. శ్రీహర్షుని మేధాశక్తిని, పాండిత్యాన్ని ప్రశంసిస్తూనే నైషధము ఉత్తమ కావ్యము కాదని తేల్చారు. శ్రీహర్షుని కాలానికి భారతదేశంలో శాస్త్ర పరిశ్రమ హెచ్చినదని, కావ్య గుణం తగ్గిందని వివరించారు. "అది గొప్ప విమర్శనము బయలుదేరిన సమయము, గొప్ప కవిత్వము కుంటువడిన సమయము" అని అభిప్రాయ పడ్డారు. అందుకు కారణాలను అన్వేషిస్తూ "ఏనాడు అర్ధము హస్తగతమైనదో ఆనాడే భారతీయుడు పరాధీనతను ప్రాపించెను... ఆర్య సంప్రదాయములు క్రమక్రమముగా విచ్ఛిన్నము లాయెను. మహమ్మదీయుల విషయ లోలత్వము దేశమున వ్యాపింప జొచ్చెను." అని దేశపరిస్థితులను వివరించారు. భారతదేశ సాంస్కృతిక పతనానికి మహమ్మదీయులు కారణంగా భావించే ఒక ఆలోచనా ధోరణి మన దేశంలో చాలా కాలంగా ఉన్నది.



అక్కిరాజు ఉమాకాంతం గారి సంస్కృత భాషా పాండిత్యం, ప్రాచీన భారత సంస్కృతిపై ఆయనకున్న అభిమానం ఎరిగిన వారికి ఆయన ఈ ఆలోచనారీతి ఆశ్చర్యకరం కాదు. హిందువులలో సంస్కరణ లాయన కిష్టమే. మహమ్మదీయుల విషయములో ఆయనపై ఆర్య సమాజపు ఆలోచనా ధోరణి ప్రభావం ఉండి ఉండవచ్చును.


గుంటూరు జిల్లా కారెంపూడిలో 1928 జూన్ 9 న జరిగిన సభలో చేసిన ఉపన్యాసం 'ఆంధ్ర భాషోపన్యాసం' గా అచ్చయింది. అందులో "నాకు దేశ భాషోద్యమంలో విశ్వాసంగలదు. విజ్ఞాన వ్యాప్తి దేశ భాషయందు వలె అన్య భాషయందు జరుగ నేరదు" అన్నారు. తదనుగుణంగా సంస్కృత గ్రంథాలను తెలిగించారు. సంస్కృత చంద్రా లోకాన్ని తెలుగు వచనంలో అనువదించారు. పాణినీయాన్ని తెలుగు చేసినట్టు తెలుస్తున్నది. 'పాణినీయము సాంధ్ర వివరణము' పేరుతో 9 సంచికల సంపుటంలో గట్టి బైండుతో వచ్చినట్టు ప్రకటన ఉంది. సంస్కృత వ్యాకరణ ప్రదీపము కారకం వరకు రచించినట్టు కూడా అదే ప్రకటనలో ఉంది. ఉమాకాంతంగారికి ఎక్కువ పేరు తెచ్చి పెట్టినవి ఆయన పరిష్కరించి ముద్రించిన పల్నాటి వీరచరిత్ర (1911, 1938) నేటి కాలపు కవిత్వం (1928).


పల్నాటి వీర చరిత్ర మొదటి ముద్రణకు రచించిన పీఠికలో అమూల్యమైన చారిత్రకాంశాలను పొందుపరిచారు. ఇతిహాసాలను గురించి, పల్నాడు గురించి, శ్రీనాథుని గురించి ఎనభైరెండు పేజీల విపుల చారిత్రక భూమిక ఇది. దాని సారాంశాన్ని ఇంగ్లీషులో ఐదు పేజీల్లో చెప్పారు. డెబ్భైమూడు పేజీల ద్వితీయ భూమిక (1938) లో 3 తెలుగు సాహిత్యంపై తమకున్న అభిప్రాయాల్ని వివరించారు. రెండో పీఠికకు ముందే నేటి కాలపు కవిత్వం వచ్చింది. ఈ రెంటిలోనూ పూర్తిగా తర్కపద్ధతి అవలంబించారు. ఏ విషయాన్నెత్తుకున్నా సమగ్రంగా చర్చించటం ఆయనకు అలవాటు. అందువల్ల ఆయన పీఠికల్లోనూ వ్యాసాల్లోనూ విషయాన్ని విస్మరించి ఏవేవో మాట్లాడుతున్నట్టనిపించినా అవన్నీ విజ్ఞాన వికాస హేతువు 9 of 22 టం విశేషం. ఈ రెండో పీఠికలో



"పల్నాటి వీర చరిత్రను విచారించడానికి పూర్వం తెలుగు వాఙ్మయాన్ని గురించి క్లుప్తంగా తెలుపుతాను" అని ప్రారంభించి తెలుగు సాహిత్యాన్ని గురించి తమ విలక్షణాభిప్రాయాలను వ్యక్త పరచారు.


"మూలం యొక్క స్వరూపం అవికలంగా భాషాంతరంలో తెలపడమే అనువాదానికి పరమ ప్రయోజనం. నన్నయాదులవి అనుచితానువాదాలు" అని ఆంధ్ర భారతాది గ్రంథాలను విమర్శించారు. తెలుగు ఎప్పుడూ ఉత్తమ విద్యాద్వారంగా ఉండలేదు కాబట్టి తెలుగు అభివృద్ధి కాలేదన్నారు. తెలుగు కావ్యాలు అధమాధికారులకే అని ఉమాకాంతంగారి అభిప్రాయం. ఆ స్థితి మద్రాసు విశ్వవిద్యాలయం వచ్చిన తరువాత కూడ మారలేదని ఆనాటి తెలుగు పాఠ్యాదీతర గ్రంథాలనుంచి అధికంగా ఉదాహరించారు. శబ్దరత్నాకరంలో 'సఖుడు' అకారాంత పుంలింగం అనటాన్ని విమర్శిస్తూ అది ఇకారాంత పుంలింగం అనే విషయంగూడా ఈ పీఠికలో ప్రస్తావించారు. సంస్కృతం సరిగ్గా రాని రచయితలను ఆక్షేపిస్తూ వారిని దూడ పేడ సంస్కృతం వారని ఆక్షేపించారు. పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి, చిలుకూరి నారాయణ రావు వంటి పండితుల రచనల్లోని దోషాలను కూడా చూపించారు.


ఉత్తమ సంస్కృత కావ్యాలను తెలుగులో తీసుకురావాలన్న ప్రయత్నంలో ఆయన రఘువంశానువాదం తల పెట్టినట్టు కనిపిస్తుంది. ఆయన రఘువంశ పీఠికలో --


అక్షరమ్ముల ఆట కవితగ


పెంటకుప్పల జేసి కృతులను చిందు దొక్కెడి వారి గంతులు


చిన్న పిల్లల వేడుక.


అన్నారు. ఉమాకాంతంగారి అభిప్రాయాలను ఆయన సహచరులు "దశోపదేశిగా" సంగ్రహించారు. వాటిని ఇక్కడ తిరగరాస్తున్నాను.


1. గద్యంలో లేని విశేషం పద్యానికి ఛందస్సు సమకూర్చగలిగినది గతి మనోజ్ఞత.


2. అది గణాల ఆరోహణావరోహణల వల్లనే సిద్ధిస్తున్నది.


అక్షర వినోదం (వళిప్రాసలు) శబ్దాలంకారాల్లో చేరినది. శబ్దాలంకారాలు అలంకారశాస్త్రంలోనివి. 4.


3.


5. శబ్దాలంకారాలు స్వయంగా ఆపతితమైతేనే తప్ప ఆవశ్యకంగా స్వీకార్యం కావని, వీటిని ప్రధానంగా స్వీకరిస్తే కావ్యం అధమ మవుతుందని సాహిత్య వేత్తల మతం.


6. ఇద్దరన్, మానుగ. అనఘ, అమల, ఓలి. ఒగి, పరుగు, చెన్నుగ యిట్లాటి దండగ చెత్తకు లేదా యతి భంగానికి హేతువై అనర్ధ ప్రదం కావటం వల్ల అక్షరాల ఆట (వళి ప్రాసలు) ఆవశ్యకంగా ఉపాదేయంకాదు.


7. యతి అంటే విచ్చేదం వారింద్రియ విశ్రాంతిని, శ్రావ్యతను, పద్యం యొక్క సుపఠత్వ, రమ్యత్వాలను సిద్ధింప చేస్తుంది గనుక దీర్ఘ పాదాల్లో మధ్య యతీ సర్వత్ర పాదాంత యతీ నియతం.


8. పద్యం గానీ, పద్యాలు గానీ, శీఘ్రంగా గాని, విలంబంగా గాని అల్లిన మాత్రాన పద్యకర్త అవుతాడు. కవి కానేరడు. విజ్ఞానశాలి కానేరడు. విద్వదోషుల్లో శాస్త్రాభ్యాసజన్యం విజ్ఞానం.


9. జన్మాంతర సంస్కార రూపమైన ప్రతిభ విద్వదోష్ఠుల్లో ఉత్తమ విజ్ఞాన లబ్ధి, చరాచరలోకప్రభావ పరిశీలనం. కావ్యజ్ఞ శిక్ష కావ్యత్వహేతువని మమ్మటుడు.


10. పద్యరూపానగాని గద్య రూపాన గాని అనువాదం చేస్తే అనువాది కాగలడుగాని కవి కాజాలడు. రసభావ నిష్పాదక మైన సృష్టికి సంబంధించినది కవిత. కొంత తీసివేసి కొంతచేర్చి అనువాదం చేస్తే అప్రశస్తాను వాది. అనూదిత కావ్యంలో సృష్టి విశేషాదులు అనువాదివి కాజాలవని స్పష్టం.


వీటి ఆధారంగా ఆయన అనుయాయులు కొందరు అనువాదాలు సాగించి ఆయన సిద్ధాంతాలు ప్రచారం చేసినట్టు కొమరవోలు చంద్రశేఖర మంత్రిగారు ప్రకటించిన లక్ష్యఖండం (1937) వల్ల తెలుస్తుంది. ఉమాకాంతం గారి లక్షణాలకు వీరు రచించినవి లక్ష్యాలని వీరుద్దేశించి



నట్టు 'లక్ష్యఖండం' అనే పేరు పెట్టడం లోనే తెలుస్తున్నది. ఉమాకాంతం గారు రఘువంశ పీఠికలో --


మూలమున లేనట్టిదానిని వ్రాయననపేక్షితము చెప్పను అన్న నాథుని మాట దలచగ అర్హుడనొ కానో!


అన్నారు. 'మూలంలో లేనిది చెప్పను. మూలంలో ఉద్దేశించనిది కూడా చెప్పను'. అన్న మల్లినాథసూరి మాట తల్చుకున్నారు. ఆయన్ననుసరించి ఆలంపూరు కృష్ణస్వామిగారు


'వదలి మూలస్థమ్ము లేనిది కుక్కి అనువాదమ్ము చేసెడి అజ్ఞ మార్గము తొలగిపోవుత నాకు గురువుల కరుణచే' అన్నారు


ఇక్కడ 'గురువులు' అనే మాటలో ఉమాకాంతం గారిని ఉద్దేశించినట్టు భావించవచ్చు.


ఈ మార్గం లోనే కన్నెకంటి ప్రభులింగాచార్యులు గారు కాళిదాసు కుమార సంభవాన్ని అనువదిస్తూ


ఆర్ష భూయస్త్వోత్తమములగు కాళిదాస కవిత్వనిధులను మా కొసంగిన మల్లినాథా! నిన్ను వినుతింతు


అని మల్లి నాథుని ప్రశంసించి -- విడువగా రాదున్నదానిని లేనిదానిని కుక్కగూడదు ఇదియె అనువాదాలు తెరువను ప్రవచనమ్ము తలంచెదన్.



ఉమాకాంతం


అని అనువాద పునరుద్ఘాటించారు. విధానంలో గారి మార్గాన్ని


ఉమాకాంతం గారు, వారి అనుయాయులు ఈ అభిప్రాయాలను ప్రచారం చేశారు. సంస్కృత వృత్తాలతో పాటు తెలుగు పద్యాలను కూడా వర్ణమైత్రి లేకుండా ప్రయోగించారు. గీతాది లఘు పద్యాలకు పాదాంత విరతిని మాత్రమే నియమంగా పాటించారు. పెద్ద పద్యాలలో పాదమధ్య విరతిని కూడా పాటించారు.


వీరంతా ముత్యాల సరాన్ని ఆదరించడం చారిత్రకంగా గుర్తించ దగిన ఒక విశేషం. అయితే వీరి రచనల్లో ఎక్కడా గురజాడ అప్పారావుగారిని విరివిగా స్మరించినట్టు గాని (ఈ పుస్తకంలో ఒక్క చోట తప్ప) ముత్యాలసరం పేరును ప్రస్తావించినట్టు గాని కనపడదు. అయినా ముత్యాల సరాలను ధారాళంగా వాడారు. అదీ గురజాడ పద్ధతిలోనే. యతి ప్రాసలు నియమాలుగా కాక అలంకారాలుగా మాత్రమే పరిగణించిన అప్పారావు గారి మార్గం, ఉమాకాంతం గారికి నచ్చినట్టు భావించవచ్చు. భావకవులకూ, ఉమాకాంతంగారికీ ముత్యాల సరం విషయంలో మాత్రం ఏకీభావం కనిపిస్తుంది. భావకవుల్లో రాయప్రోలు సుబ్బారావుగారు తల్లావజ్ఝల శివశంకర శాస్త్రిగారి వంటివారు వర్ణమైత్రీయుత వళినిగాని ప్రాసనుగాని ముత్యాల సరాల్లో కూడా పాటించారు. కృష్ణశాస్త్రి గారి ముత్యాల సరాల్లో వర్ణమైత్రి లేనివి కనిపిస్తాయి.


ఉమాకాంతం గారు ఆంధ్ర వాఙ్మయాన్ని అంతటినీ సూత్ర పద్ధతిలో చెప్పదల్చుకున్నారు. ఆ సూత్రాలకు మళ్ళీతానే భాష్యం చెప్పదల్చుకున్నారు. అయితే చెయ్యదల్చుకున్నవన్నీ చెయ్యటానికి జీవితం చాలింది కాదు. వాఙ్మయదర్శనము పేరుతో 'ప్రాచీన ఖండా'న్ని తొమ్మిది భాగాలు (ఆలోకములు) గా సూత్ర పద్ధతిలో రచించారు. ఈ సూత్రాలు గ్రాంథిక భాష (కావ్య భాష) లో ఉన్నాయి. ఈ సూత్రాలు చూస్తే చాలా విస్తృత ప్రణాళికనే వేసుకున్నట్టు తెలుస్తుంది. భాష్యం



లేకపోయినా, ఉమాకాంతంగారి వాఙ్మయ దృష్టిని అర్థం చేసుకోటానికి ఈ వాఙ్మయ దర్శన సూత్రాలు ఉపయోగపడతాయి. ద్వితీయాలోకంలో


1. అభారతీయము గనుక 2. సంప్రదాయ విచ్ఛేదము గనుక 3. త్యాజ్యము క్రీస్తు శకము 4. ఆత్మీయము గనుక 5. అఖండ కాలదర్శన సాధనము గనుక 6.శ్రుతి, స్మృతి పురాణేతిహాస దేశీయ కథాదులనుండి అవిచ్ఛిన్నత్వము ప్రతిపాదించును గనుక 7. సంప్రదాయ సిద్ధము గనుక 8. గ్రాహ్యము కలిశకము 9. అవిశేషము వల్ల కలిశకము కృష్ణ శకమని 10. అంతర్భూతము గనుక శాలివాహనము పాక్షికముపధ


ఉమాకాంతంగారు క్రీస్తు శకాన్ని కూడా గుర్తించని సంప్రదాయ ప్రియుడు. ఆయన తన పీఠికల కిందా ముద్రించిన రచనల పైనా శాలివాహన శకాన్నే వేసేవారు.


ఉమాకాంతంగారు వాఙ్మయ దర్శనంలో భారతీయ సంస్కారాదుల గురించి ఎక్కువగా ప్రస్తావించారు. ఇది కాక వేరే ఇంకా ప్రాచీనాంధ్ర వాఙ్మయ సూత్రాల గురించి ఏమైనా రాశారేమో తెలీదు. 'నేటి కాలపు కవిత్వం' అని నామాంతరం ఉన్న ఈ వాఙ్మయ సూత్ర పరిశిష్ట భాష్యంలో మూడు అధ్యాయాలలో ఆధునికాంధ్ర వాఙ్మయాన్ని సూత్రీకరించారు. అందులో మొదటి అధ్యాయం నేటి కాలపు కవిత్వం. దాన్ని మాత్రమే విపులీకరించారు. నేటికాలపు కృతి రచన, నేటికాలపు విద్య అనే అధ్యాయాలు సూత్ర రూపంలోనే ఉన్నాయి. భాష్యం రాయలేదు. ఈ పరిశీష్టాన్ని ఆలోకనాలు అనకుండా అధ్యాయాలుగా విభజించటం వల్ల వాఙ్మయ దర్శనం కన్నా భిన్నమైన వాఙ్మయ సూత్రాలు అనే గ్రంథాన్ని రాసినట్టుగానో, కనీసం రాయ తలపెట్టినట్టు గానో ఊహించాలి. అయితే మనకు పూర్తిగా భాష్య రూపంలో దొరుకుతున్నది ఈ పరిశిష్ట సూత్ర భాష్య రూపమే(అదీ మొదటి అధ్యాయమే). మొదటి సారి వావిళ్ళ ప్రచురణగా 1928 లో వెలువడింది.


ఉమాకాంతం గారు ఈ పుస్తకంలో ప్రధానంగా భావకవిత్వం


పేరుతో ప్రచారమైన కవిత్వాన్ని తీవ్ర పదజాలంతో విమర్శించారు.



తెలుగు సాహిత్యంలో తీవ్ర సంచలనాన్ని రేపిన గ్రంథం ఇది. "కాని వారు చేసిన ముఖ్యమైన ఆక్షేపణలకు తగిన సమాధానం ఇంతవరకూ రానేలేదనే అనుకోవలసి వస్తోంది" అని అబ్బూరి రామకృష్ణారావు గారన్నారు. "మహాపండితులైన ఉమాకాంతం విమర్శలకు ఆనాడెవరూ జవాబు చెప్పలేక పోయారు" అని శ్రీశ్రీగారు 1960 లో విశాలాంధ్ర వారి ఆంధ్ర దర్శినిలో రాశారు. భావకవిత్వాన్ని సమర్ధిస్తూ ప్రశంసిస్తూ, విశ్లేషిస్తూ వ్యాసాలూ, పుస్తకాలూ చాలా వచ్చాయి. కాని, ప్రత్యేకంగా ఉమాకాంతం గారి ఆక్షేపణలకు సమాధానంగా ఇంతవరకూ పుస్తకరూపంలో ఏమిరాలేదన్న మాట నిజమే. అట్లాగే ఉమాకాంతంగారు తిట్టినా అదో గొప్పగా ఆనాటి కవులు చెప్పుకునే వారని అ.రా.కృ గారు అంటుండేవారు. అంతటి మహాపండితుడి దృష్టిలో పడటమే గొప్పగా ఆనాటి కవులు భావించేవారన్న మాట. ఆనాటి భావకవుల్లో బహుశా ఎవరినీ ఆయన క్షమించలేదు. విస్తర దోషాన్ని గురించి విస్తరణాధి కరణంలో చెబుతూ చెప్పవలసినదానికంటే ఎక్కువగా చెప్పటం విస్తర దోషమని నిర్వచించి, ఈ కాలపు కృతుల్లో ఇది విస్తారంగా ఉందని ప్రస్తావించి "యెంకి పాటల వంటి వాటిలో కొన్నిటిలో తప్ప తక్కిన యీ కాలపు కృతుల్లో అనేకాల్లో యీ దోషం కనబడుతున్నది" అని యెంకి పాటలకు మినహాయింపు ఇచ్చారు. ఆ మాత్రం మినహాయింపు ఇయ్యటం కూడా విశేషమే ననుకుంటాను.


ఆధునిక కవిత్వం ప్రాచీన ధోరణుల నుంచి విడివడి కొత్త దారులు వెతుక్కుంటున్న సమయంలో అక్కిరాజు ఉమాకాంతం గారు సాహిత్య విమర్శలో ప్రవేశించారు. సంప్రదాయ పండితులు చాలామంది భావకవిత్వాన్ని ఎదుర్కొన్నారు. అయితే ఉమాకాంతం గారి మార్గం భిన్నమైనది. ఆయనకు తెలుగులోనే కవిత్వం కనపడలేదు. ఆయన ప్రమాణాలు ప్రాచీన సంస్కృతాలంకారికులవి. వాద పద్ధతి సంస్కృతంలో తర్కపద్ధతి. ఈ పద్ధతిలో సిద్ధాంతం పూర్వపక్షం, ఆక్షేపణ సమాధానం అనే విభజనలుండటం వల్ల దీనికి ప్రామాణికతే గాక హేతుబద్ధత కూడా వచ్చింది. ఈయనకు పాశ్చాత్య తర్కపద్ధతితో




ఈ కూడా పరిచయమున్నట్టు ఈ గ్రంథం లోనే అనౌచిత్యాధికరణంలో Fallacy of undue Assumption అనే పద్ధతి ప్రస్తావన వల్ల తెలుసుకోవచ్చు.


ఉమాకాంతం గారి తర్కపద్ధతికి, ఆధునిక శాస్త్ర ప్రతిపాదనల పద్ధతికి కొన్ని పోలికలున్నాయి. ఆధునిక శాస్త్ర పద్ధతిలో ఒక ప్రతిపాదన చేసినపుడు ఆ ప్రతిపాదనకు ప్రతికూలమైన అంశాలను కూడా ప్రస్తావించి వాటిని తన ప్రతిపాదన ఎట్లా పరిష్కరిస్తుందో చెప్పాలి. అప్పుడే ఆ ప్రతిపాదన సిద్ధాంత మవుతుంది. ఉమాకాంతంగారి వాద పద్ధతి ఎంత ప్రాచీనమో అంత ఆధునికం కూడా. ఒక విషయాన్ని అన్ని వైపుల నుంచి పరిశీలించటానికి ఉమాకాంతం గారి తర్క పద్ధతి పనికొచ్చింది.


ఇదికాక ఉమాకాంతంగారి శైలి సూటిదనం, సారళ్యం అనే రెండు లక్షణాల వల్ల ఆకర్షణీయంగా ఉంటుంది. 'ఆపతితం, ద్రష్టవ్యం, వక్ష్యమాణం' వంటి మాటలు ఆయన పాండిత్యం వల్ల అరుదుగా దొర్లినా సాంకేతికత లేని సాధారణ పదాలు వాడటం ఆయన అలవాటు. ఊగుడు మాటలు, పులుముడు, వికారాలు, దూడపేడ సంస్కృతం, దండగ్గణం వంటి అతి సామాన్య పద జాలంతో తన భావాలను చెప్పగలిగారు. సిద్ధాంత పూర్వ పక్షాలు, అక్షేప సమాధానాలు అనే - పద్ధతి వాద ప్రతివాదాల సంభాషణ (dialogue) పద్ధతి. ఈ నిర్మాణం (structure) వల్ల శైలి సంభాషణశైలికి సన్నిహితమై మరింత ఆకర్షకమైంది. భాష విషయంలో ఆయన మారిన దృష్టి కూడా ఇందుకు తోడ్పడింది. దానికి తోడు ఉమాకాంతం గారికి విషయ వివరణకుప యోగించే దృష్టాంతాలను, పిట్ట కథలను ఎన్నుకొని విషయ వివరణ చెయ్యటంలో అద్భుతమైన నేర్పుంది. సంస్కృతాంగ్లాలలో విశేషమైన పాండిత్యం ఉన్న ఆయన తన రచనలలో ఉదాహరించిన సంస్కృతాంగ్ల వాక్యాలకు తరచుగా ఆంధ్రాను వాదాలను కూడా ఇస్తుంటారు. ఆయన చెప్పిన విషయాల్లో భేదించినా ఆయన వాద పద్ధతి నుంచి ఈ నాటి విమర్శకులు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఉపపత్తులు చూపకుండా



11:37 AM Sun Dec 19


79%


00


అస్పష్టంగానూ చెప్పలేదు. ఇన్ని సుగుణాలున్న ఈ పుస్తకం సాహిత్యాభి మానులందరికీ అవశ్య పఠనీయం.


ఈ పుస్తకానికి చారిత్రక ప్రాముఖ్యం కూడా ఉంది. ఒక విద్యావేత్త పరాధీనమైన తన జాతి పతనమై పోతున్నదని, విలువలు క్షీణిస్తున్నాయని, ప్రమాణాలు పడిపోతున్నాయని ఎంత ఆవేదన చెందాడో తెలుసుకోటానికి కూడా ఈ పుస్తకం చదవటం అవసరం. దాదాపు .అర్ధాయుష్కుడైన ఒక సాహిత్య కృషీవలుడు ఉన్న కొద్ది జీవితకాలం లోనే ఎన్ని విద్యలు నేర్వవచ్చునో, తాను లోక కళ్యాణమని ఎంచిన దాన్ని ఆచరించటానికి ఎంత కృషి చేశాడో తెలుసుకోటానికి ఆయన జీవితాన్ని గురించి కూడా తెలుసుకోవాలి.


అయితే ఉమాకాంతంగారు భావకవిత్వం గురించి చేసిన నిర్ణయాలు కాలంలో నిలవలేదు. మారుతున్న అభిరుచులు కనుగుణంగా భావ కవిత్వం చరిత్రలో నిలిచింది. స్థిరదోషాలుగా ఉమాకాంతంగారు గుర్తించినవి 'అస్థిర మైనవిగా మారినాయి. వాటిని దోషాలుగా పాఠకులు గుర్తించ లేదు. అయోమయత్వం. పులుముడు, నిదర్శన పరంపరలు, భాషా వ్యతిక్రమం అని పేర్లు పెట్టి ఆయన నిరసించిన వాటిని తరవాత పాఠకులు గుణాలుగా మెచ్చుకొని ఆస్వాదిస్తున్నారు. ప్రాచీన సంస్కృత సాహిత్య శాస్త్ర మర్యాదలు సర్వకాల సర్వదేశ సాహిత్యాలకీ సంపూర్ణ ప్రమాణాలుగా నిలుస్తాయని ఉమాకాంతం గారు నిజాయితీగానే నమ్మారు. ఆయన ఆనాటి కవులను కఠినంగా విమర్శించారు. చరిత్ర ఇంకా కఠినమైనది. ఉమాకాంతంగారి ఆక్షేపణలను తోసిపుచ్చింది. కాలం మరీ క్రూరమైనది. ఉమాకాంతం గారినే మరుగున పడేట్టు చేసింది. నిర్భీకత కాలానికి ఎదురీదే లక్షణం, పాండిత్యం, కృషి. చెప్పేవిషయంలో నిజాయితీ, స్పష్టత, సూటిదనం, సహేతుక వాదపటిమ ఆయన నిర్ణయాలను మించి విలువైనవి. అవే ఆయన తన తరువాత తరానికి అందించిన విలువలు.



11:38 AM Sun Dec 19


79%


00


సారాంశం చెపితే అక్కిరాజు ఉమాకాంతంగారి నిర్ణయాలు ముఖ్యంకాదు. ఆయన ఆవేదన నిజమైనది. ఆంతర్యం గొప్పది. సాహిత్య దీక్షా, సహేతుక వాద పద్ధతి ఈ జాతికి శాశ్వతంగా ఇచ్చిన ఆయన ఆదర్శాలు.


ఈ ముద్రణలో సంపాదకుడుగా నేను చేసిన మార్పులకూ, చెయ్యని మార్పులకు కొంత సంజాయిషీ ఇచ్చుకోటం భావ్యం అనుకుంటాను.


ఈ గ్రంథం తొలి ముద్రణలోనే కొన్ని పొరపాట్లు దొర్లినాయి. వాటిని అన్ని చోట్లా సవరించటం సాధ్యం కాలేదు. సంస్కృతంలో అచ్చు తప్పులను ఆచార్య రవ్వా శ్రీహరిగారు సవరించారు. తెలుగు పద్యాల్లో స్పష్టంగా దోషాలుగా కనిపించే వాటిని సవరించాను కాని కొన్నిటిని వదిలేశాను. ఉదాహరణకు 'ఏకాంత సేవ అనే పుస్తకాన్ని 'యేకాంత సేవ' అని రాయటమే కాక పుటల సూచిక (ఇండెక్స్) లో కూడా అట్లాగే ఇచ్చారు. అట్లాగే ఆ కావ్యంనుంచి ఉదాహరించిన పద్య భాగంలో "మధుర మోహన కళామహితమై వుండ (పే.జీ 71, 88, 94) అనే పాదంలో ఉండ అనే క్రియా పదాన్ని 'వుండ' అని రాశారు. యకార, వకారాగమాలు కవ్యుదిషాలు కావనుకుంటాను. అయినా ఉమాకాంతం గారు కావాలనే అట్లా రాశారని అభిప్రాయ పడి వాటిని మార్చలేదు. అట్లాగే ఉమాకాంతంగారు ఉదాహరించిన పద్యపాదాలు ఇప్పుడు దొరికే ప్రతుల్లో వేరుగా కనిపిస్తున్నా, ఆయన చూసిన ప్రతుల్లో అట్లా ఉండి ఉండవచ్చునని మార్చలేదు. స్పష్టంగా ఛందో దోషాలున్నచోట మాత్రం ముద్రిత ప్రతుల ననుసరించి సవరించాను. అట్లాంటి మార్పులు తెలుగు భారతం నుంచి, ఆ ముక్తమాల్యద నుంచి ఉదాహరించిన చోట్ల అవసరమయ్యాయి. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా నుంచి ఉదాహరించిన భాగం (పే.జి. 136) లో ఇంగ్లీషులో Jonffroy అనీ తెలుగులో 'జాన్ ఫ్రాయి' అని స్పష్టంగా ఇచ్చారు. ఈ పేరులో ఏదో 3


 

11:38 AM Sun Dec 19


79% (


...


వల్ల అట్లాగే ఉంచాను. ఉదాహృత పద్య పాదాలను సాధ్యమైనంతవరకు ఈ కూర్పులో పాద విభజన చేసి చూపించాను. కొన్ని సంస్కృత శబ్దాల వర్ణక్రమాన్ని ఉమాకాంతం గారు నియతంగా పాటించినట్టు కనిపించదు. వాటిని అట్లానే ఉంచాను.


ఈ పీఠికారచనకు ప్రేరేపించిన మిత్రులు ఆచార్య పేర్వారం జగన్నాథం గారికి సమాచార సామగ్రిని సాదరంగా అందించిన అక్కిరాజు రమాపతిరావుగారికీ, చలసాని (విరసం) ప్రసాదుకూ కృతజ్ఞతలు. -


హైదరాబాదు. 1994 జనవరి 26.


చేకూరి రామారావు.

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...