Showing posts with label Old. Show all posts
Showing posts with label Old. Show all posts

Friday, December 24, 2021

పంచతంత్రము; దాని పుట్టుక శ్రీ శ్రీనివాసపురం నరసింహాచార్యులు ( ఆంధ్రసాహిత్య పరిషత్పత్తిక' 1957 - ఇస్యూ 6 )









 



పంచతంత్రము; దాని పుట్టుక

శ్రీ శ్రీనివాసపురం నరసింహాచార్యులు 


( ఆంధ్రసాహిత్య పరిషత్పత్తిక' 1957 - ఇస్యూ 6 ) 


శ్రీనివాసపురం నరసింహాచార్యులు, రమారమి ఏడెనిమి దేండ్లనాడు ఆంధ్రపత్రిక సచిత్ర వారపత్రి కలో శ్రీవిశ్వాత్ముల నరసింహమూర్తి గారి బొమ్మల పంచతంత్రము ప్రశటింపబడుచుండెను. కాని, అది పూర్తి కాశమునుపే మరదురదృష్ట వశమున నాక ధా చిత్రకారుడు కీర్తి శేషు డగుటచే పత్రికలో పడినంత వరకు పుస్తకరూపముగా వేసిన ఆంధ్రపత్రిక గ్రంథమాలా ప్రకాశ కులు తమమాటగా 'ఈపంచతంత్య్ర గ్రంథము పుట్టుక యెక్కడనో యెరుగ రా' దని వాసిరి. అది చదివినప్పుడు జగము మెచ్చిన శాస్త్ర మును జంతు సంతానముల ద్వారా జనులకు తెలియజేసెడి కృతిని జేసి సుశృతి యైన యీమహాకవి జీవితవి శేషములను ఏతద్గ్రంధము యొక్క జన్మస్థానమును; ఉత్పత్తి కారణములను వీనిని గురించిన విషయ ములు విద్వత్పరిశోధకు లెవ్వరేని తెలిసికొని ప్రకటము గావించుట కింతవరకు ప్రయత్నింపరైరిగదా ! యని విచారించి, యది మొద లావిషయమును తెలిసుకొనుటకై యన్వేషింపసాగగా నిన్నాళ్ళ కిప్పుడు ఆపంచతంత్ర గ్రంధి మెప్పుడు. ఎక్కడ, ఎందుకు ఎట్లు పుట్టినదో నాకు తెలియవచ్చినట్టి విశేషములను సారస్వతాభిమానుల సమక్ష మున నుంచుచుంటిని,


భారత దేశమునందలి సంస్కృతగ్రంధము లెన్నో అన్యభాష లలోని కనూడితము గావింపబడినవి. కాని, ఏదియు నీ పంచతంత్ర కావ్య మువలె పలు భాషలలోనికి పరివర్తనమై ప్రపంచవ్యాప్తి నంది నకల దేశములలోని సంస్కృతవిద్యార్థి విద్యాధికులకు గూడ పఠనీయమై యలరారుచున్న కృతి వెదకినను మరియొకటి కానరాదనుట జ్ఞా లంగీకరించిన నగ్న సత్యము,


ఈగ్రంధమున మిత్రభేదము, సుహృల్లాభము, సంథివిగ్రహము లబ్ధనాశము, అవిమృశ్యకారిత్వము అను ఐదుభాగము లున్నవి. క్రీ.శ. 581_579 సం॥ ప్ర్రాంతమున పర్షియా దేశము నేలు చుండిన ఔషరు


వాన్ అనబడెడి పారసీక రాజు కాలమున సీగ్రంధము వహ్లతీభాషలో వీ నికిని. క్రీ. 18వ శతాబ్దని అరబ్బీ భాషలోనికిని, సైమియాన్ సేథ్ (Symeon 'Seth) అను నాతనిచే స్త్రీ. 1015 ప్రాంతమున గ్రీకు భాష శ లోనికిని, పొస్సిసస్ (Possinus) అన్న యతనిచే ల్యాటిన్ భాషలో నికిని రబ్బీజోయెల్ (Rabbi Joel) అను పండితునిచే క్రీ. 1250 ప్ర్రాంతమున హెబ్రూ భాషలోనికిని ఆతర్వాత నొకటి రెండు సంవత్స రములలో స్పానిష్ భాషలోనికిని పిమ్మట కీ. 15వ శతాబ్దని జర్మను భాషలోనికిని, ఆపై యూరపియను భాషలన్నింటిలోనికి పిల్పే లేక విద్వాయ్ ఫేబుల్స్!(Fables of Pilpay or Vid pai i.e. Vidya pati) అను పేరను ఇట్లు రమారమి రెండువందలమంది విద్యావేత్తలచే అన్ని దేశములలోను మొత్తముమీద సుమారేబది భాషలలోని కీయు ద్గ్రంథ మనువాదము చేయబడియున్న దని హెర్టల్ అను పాశ్చాత్య పరిశోధకుడు తనహిందూ దేశ కథాకావ్యచరిత్రములో వ్రాసియున్నా డు, ఈ కావ్యము యొక్క ప్రశస్తి తెలియుట కీవిషయ మొక్కటి


ఇయ్యది మాతృకయై యుండ దీని ననుకరించియు, అనుసరిం చియు మన దేశమున నెన్ని యేని నీతి కావ్యము లుదయించినవి. దీనికి సంగ్రహరూపమున సంస్కృతమున పంచతంత్ర కావ్య - పంచతంత్ర కావ్యదర్పణ - పంచోపాఖ్యానాదులు పెక్కుకృతులు గలవు. అట్లే ఆంధ్ర భాషయందును దూబగుంట నారాయణకవి, బైచరాజు వేంక టనాధకవి ప్రభృతులు పద్య కావ్యములుగను, కందుకూరు వీరేశలింగ కవి. పరవస్తు చిన్నయసూరి మొదలైన పండితులు గద్యరూపము నను, విశ్వాత్ముల నరసింహమూర్తి, శీలా వీర్రాజు మున్నగు చిత్ర కారులు బొమ్మలకధలుగను ఇంతటిప్రశస్తికి పాత్ర మైన యీకృతిని విద్యాపతిబిరుదనాము డైన విష్ణుశర్మ పండితుడు రచియించెను.


కృత్యాదియందు —


“మన వేవాచస్పతయే శుక్రాయ పరాశరాయ సముతాయ చాణక్యాయ చ విదుపే నమో ఒస్తు నయశాస్త్ర కర్తృభ్యః॥ సశలార్ధశాస్త్రసారం జగతి సమాలోక్య విష్ణుశ ర్మేదమ్, తం తైపంచభి రేత చ్చకార సుమనోహరం శాస్త్రమ్ |


అని చెప్పుటనుబట్టి యితఁడు ప్రాచీనము లైనమను అత్రి;విష్ణు హంత్ర; యాజ్ఞవల్క్య; ఉశన; అంగీరన; యమ; ఆపస్తంబ; సంవర్త; కాత్యాయన; బృహస్పతి; పరాశర; వ్యాస; శంఖ; లిఖిత; దక్ష; గౌతమ; శాతాతప; వశిష్టాదివింశతిధర్మశాస్త్రములనేగాక చాణక్య విష్ణుగు ప కౌటిల్యుని అర్థశాస్త్రము మొదలైన రాజనీతిశాస్త్రముల నన్నింటిని సాకల్యముగ ఆపోశనముపట్టి యాకళింపునకు దెచ్చుకొని ఆకాలమున ‘విద్యాపతి 'బిరుదవిఖ్యాతుడై వినుతింపబడియుండె నని చెప్పనగును.


గ్రంధాన తారికలో :—


"దక్షిణ దేశమందలి మహిళారోప్యపురము నేలెడి అమరశక్తి యనురాజు దుర్వినీతు లైనతన కొడుకులకు నీతి నేర్పు మని కోరగా వారికై నే నీ నీతిశాస్త్రమును రచియించితి” ననుమాటలు వా వ్రాసియుం టను బట్టి యీశవి దక్షిణ దేశవాసి మైనయా జేసియాస్థానమున విద్వత్కవిగా నుండెనని భావింపవచ్చునుగాని, ఈవిషయమునే పరి శోధకులును గుర్తించియుండ లేదు. అందుచే నీమాట గ్రంథ ప్రశస్తికై యాతడు కల్పించివ్రాసినదో లేక నిజమో యూహింప నలవి గాకు న్నది." అని బ్రహ్మశ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రిగారు తను వా సంస్కృతకవిజీవితము పుట 180లలో వాసిరి.


క్రీస్తు మొదటశతాబ్దియందు హిందూ దేశమున క్రైస్తవ


మతము వొడసూపి రెండవ శతాబ్దిలో నది దక్షిణ భారతమున నేటి మదరాసుప్ర్రాంతమున సుస్థిరముగ పాదుకొనినట్టు చరిత్ర తెలియ జేయుచున్నది. అప్పుడు అనఁగా క్రీ.2వ శతాబ్ది యారంభ కాలమున బలాఢ్యు డై నఅమరశక్తి యను రాజు మహిళాతోవ్యపుర మనబడెడి ప్రాచీన హైందవనగరమును రాజధానిగా జేసికొని రాజ్యపాలనము చేయుచుండెను. అదేనేడు మైలాపూరు అని వ్యవహరింపబడుచు మద రాసుమహానగరమున సంతర్భాగ మైపోయినది. ఈమహిళారోప్యపుర మునే గ్రీకు దేశస్థు డైన టాలెమీ (Ptolemy 140-150 A. D.) యనుభూగోళశాస్త్రజ్ఞుడు 1. పశ్చిమ భారత దేశము, ఆఫ్ఘనిస్థానము, డు బెలూచిస్థానము (India Intra Gengem) 2. ఆగ్నేయాసియా, చీనా దేశము (India Extra Gengem) అను పేర్లతో వ్రాసిన భారత దేశభూగోళగ్రంథమున రెండవ భాగమందు దక్షిణ దేశభౌగో ళిక స్వరూపనిర్ణయము చేయుసందర్భమున 'మహిళార' (Mahi larpha) యని పేర్కొనియుండినట్లు శ్రీ అక్షయకుమార్ మజుందార్ గారు తమహిందూహిస్టరీ యనుగ్రంథమున 844వుటలో వాయు చున్నారు.


పై నిచెప్పిన అమరశక్తి రాజునకు బాహుశక్తి, ఉగ్రశక్తి, అనంతశక్తి యనెడినిరక్షరకుక్షలు మూఢులు నై నముగ్గురు కొడుకు రమూర్ఖన్యు లైనయాకుమారత్రయమునకు విద్యా లుండిరి. మూర బుద్ధులు గరపి గుణవంతులుగ చేయుటకై యారాజు చేసిన ప్రయ త్నము లన్నియు నిష్ప్రయోజనము లయ్యెను. తుట్టతుదకు దైవవశ మున అశీతివర్ష ప్ర్రాయుడును, విద్యావృద్ధుడును ఆకాలమున పేరు మోసినపండితుడును నై నవిష్ణుశర్మను ప్రార్థింపగా రాజుకోరిక సంగీక


రించి యాయువరాజతయము నాశ్మశిష్యులుగా గ్రహించి వారిమన సున కిష్టమైనవిధమున వశుపక్ష్యాదులసంభాషణము చేసినట్లు నీతిధర్మ ములు నిండై యుండ అద్భుతము లైనకథలు చెప్పుచు వారిని వశవర్తు లను గావించుకొని మనసునకు నొప్పి గలుగనీయక నీతినేగాక జీవిత రహస్యములును, రాజ్యతంత్రములును మొదలై నసర్వవిషయము లును బోధించి వారిని గుణకోవిదులను గావించి తండ్రి కప్పగించి యాతనిచే మన్ననలు పొందెను. ఈవిషయములు శ్రీ వి. కె. మజుం దార్ గారు తనుగ్రంథము 716 పుటలో వ్రాసియున్నారు. ఇట్లగుట చేతనే కథలు, కట్టుకథలు వినికూర్పు నేర్పున భారతీయులు సర్వ ప్రపంచమందలిమానవజాతికిని బోధకు లైరని గుణపక్షపాతి యైన ఎలిఫిన్ స్టన్ మహాశయుడు తసహిందూ దేశ చరిత్ర తొమ్మిదవ ముద్రణ 172వపుటలో నుల్లే ఖంచియున్నాడు.


ఈయాధారములతో సంస్కృతశ విజీవిత కారునిసంశయము తీరి మన కొకమార్గము దొరికిన ట్లయినది.


ఇంతకును విద్వన్మణి యైనవిష్ణుశర్మజీవిత చరిత్రము పూర్తిగా లభింపదయ్యెను. ఈతడు తనకథలలో నవకాశముగల్గినప్పు డంతయు బౌద్ధబిక్షువులను, జైనసన్యాసులను, యాయావరీయ బ్రాహ్మణులను తఱచుగా నుపాలంభము చేసియుండెను. ఒకకథలోని సందర్భమును పురస్కరించుకొని యొకానొక నక్కనోట 'అహో! నేడు భట్టారక వారముగదా! మాంససంబంధమైన యీసరమును నాదంతములతో నెట్లు స్పృశింపగలను!' అని పలికించుటను పరిశీలనా దృష్టితో నాలో చింతు మేని ప్ర్రాచీన కాలమున భానువాసరమున మాంసాహారము నిషేధింపబడిన పెచ్చటను కానరాకున్నది. గనుక ఆకాలమున నీ మహిళారోప్యపురము (Mylapore)న నెలకొనియుండిన క్రై స్తవులు ఆదివారమున మాంసాహారము, మద్యసేవనము, దైనందిన చర్యయు


మాని విధిగా సుపవసించి యారాధనా మందిరములలో గుమిగూడి శ్రద్ధాళువులై తమ మతగ్రంథమైన బైబిలును పఠించుచుండెడి వారి -యాచారముల వాలకము నతిచమత్కారముగ నవహాస్యము చేసి సహేతుకమైన వ్యాజ వినయమును ప్రదర్శించి యుండే నని తోపక -మానదు.


మదరాసు ప్ర్రాంతమునందలి మైలాపూరున బుట్టి ప్రాముఖ్యత నంది కాలక్రమమున సకలజగత్సంస్తూయమాన మైన గ్రంధ మని తెలిసియే పరవస్తు చిన్నయసూరి ప్రత్యేకించి దీనియాం ధీకరణమునకు బూనుకొని యుండెనేమో యనిగూడ తలంప వీలు లేకపోలేదు. గ్రంధము సాంతముగ ముగిసియుండినచో దీని చరిత్రను గురించి ఆమహామనీషి గ్రంధప్రస్థావనములో వ్రాసియుండు నేమో శదా?


'విష్ణుశర్మ యొక్క యీకృతి గుణాఢ్యుని బృహత్క ధలోని కొన్ని కధలకు వచనరూపమైన సంక్షేపానువాదము. ఈగ్రంధమున నందందు గానవచ్చెడి శ్లోకములు కొన్ని యీతడు స్వయముగా రచి 3 యించినవే యనవచ్చును గాని, పెక్కు శ్లోకములు మనుస్మృత్యాది పూర్వగ్రంధములనుండి స్వీకరించినవే యనదగును. కాని, క్రీ. శ. 8వ శతాబ్దివాడైన దామోదరగుప్తుని శంభళీమతనామాంతర కుట్టనీ మతమునందలి "పరఙ్కః స్వాస్తరణః పతి రనుకూల” యన్నల్లోక సా చితని పంచతంత్య్ర మిత్రభేద ప్రశరణము నందును. కీ. 9వ శతాబ్ద ఉత్తరార్ధమువాడును ఔత్తరాహుడును నైన రుద్రభట్టుయొక్క శృంగారతిలశములోని “సార్థంమనోరధశతై” అనెడి శ్లోక మాం ఛమున లబ్ధనాశతంత్రము నందును గనిపించుచుండుట వలనను ఇంగ్లం డులోను జర్మనీ దేశమునందును ముద్రితమైన “పం చతంత్రము”నకును భారత దేశమున వ్యాప్తిలోనున్న గ్రంధమునకును కొన్ని చోట్ల భేదము


కానవచ్చుచున్న దాని సర్. సి, పి, బ్రౌను పండితుడు చెప్పుటచేతను, గ్రంధము దేశమున వ్యాపించినకొలది రోజులలోనే క్రమేపి అర్వా చీనులకృతులలోని శ్లోకము లీపంచతంత్రమున ప్రక్షిపము లైనట్లు. విమర్శనా చక్షువులకు విదితముగాక పోదనుట సత్యదూరము కాదు.


ఇంతవరకును గ్రంధప్రశస్తి దానిమార్పు జన్మస్థానము కృతి కర్త వెదుష్యము వీనింగూర్చిన విషయము లుటంకించితిని, ఇంత కాల నిర్ణయమును గూర్చి మల్లాది వారనిస మాటలంజెప్పి మతాంతరములు. జూపించి పర్యవసానముం జెప్పి యీనావ్యాసమును ముగింతును,


క్రీస్తు ఆరవశతాబ్దిని మొట్ట మొట్టమొదట నీపంచతంత్య్ర గ్రంథము. పర్షియను భాషలోని కనువదింపబడినది కనుక అంతకుమున్నె యీ గ్రంధముపుట్టినదని కొందరును, దౌర్మంత్యా న్నృపతిరిత్యాదిభర్తృ హరిసు భాషిత త్రిశతిలోని శ్లోక మిం దుండుటంబట్టి దానిత ర్వాత నిది జనించిన దని మరికొందరును ఏతచ్చోక మిదిపుట్టిన తర్వాత చేరియుండు ననెడి భావమున సుభాషిత త్రిశతిశన్నను వంచతంత్య్రమే ప్రాచీన మని పల్కుచున్నారు గనుక విష్ణుశర్మకాలము సునిశ్ఛితము కాకున్న దని సంస్కృతకవి జీవితము 18 పుటలో వ్రాసిరి.


ఏవిధముగ జూచినను భర్తృహరి క్రీస్తు కుపూర్వు డగునని పలు వురు పండితులభిప్రాయము నొసంగియున్నారు. కావున మన మీ సందే హమును వీడిమతాంతర మైన యభిప్రాయముల నరయుదము,


డాక్టర్ : యం. కృష్ణమాచారియార్ (మదాసు) గారు తమ హిస్టరీ ఆప్ క్లాసికల్ సాట్ లిటరేచర్ అన్న పేరున 1937 సం॥ ప్ర్రకటించిన గ్రంధమున నీవిష్ణుశర్మను క్రీ.పూ. 776 సం॥ నాటిదాడుగా గుణాఢ్యునిశన్నను ముందు కూర్చుండ పెట్టుట యెట్లొ పరిశోధకులు నిర్ణయింతురు గాక !


 

67


పంచతంత్రము; దాని పుట్టుకు


మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు 'మెట్లయిన నితడు శా. శ. 450 కి పూర్వడు గాని పరుడు మాత్రము కా'డని ముగ తముయభిప్రాయమును చెప్పిరి.


విషయ మంతటిని సముస్వయము జేసి చూచినచో విష్ణుశర్మ


తప్పక స్క్రీ. 2వ శతాబ్ది ప్రధమపాదము నాటివాడనియు నేటిమదరాసు మహానగరమున నొక భాగమైన నాటి మహిళారోప్య పురము నేటి మైలాపూరునంది పంచతంత్రము వుటైననియు ప్రపంచమునకు తెలియ వచ్చుట సాహిత్యారాధకులకు సంతోషదాయకము కదా !


ఈవ్యాసమును వ్రాయునెడల నేను పేర్కొన్న గ్రంధకర్తల కును, ప్రకాశకులకును కృతజ్ఞతలు చెప్పుచు విరమింతును.


- శ్రీ శ్రీనివాసపురం నరసింహాచార్యులు 

( మూలం - ఆంధ్రసాహిత్య పరిషత్పత్తిక' 1957 - ఇస్యూ 6 ) 


సేకరణ 

కర్లపాలెం హనుమంతరావు

బోథెల్ ; యూ. ఎస్.ఎ.

24 -12-2021 










కుమారి మొల్ల - కీ.శే. వారణాసి శ్రీనివాసరావు ( ఆంధ్రపత్రిక- 1948, జనవరి 14 - సంచిక నుంచి ) సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 24-12 - 2012



కుమారి మొల్ల 

- కీ.శే. వారణాసి శ్రీనివాసరావు 

( ఆంధ్రపత్రిక- 1948, జనవరి 14 - సంచిక నుంచి ) 

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

24-12 - 2012 


పూల మొక్కలు ఉన్న తోటలో నొక కాలుపగట్టున కూర్చున్న నన్ను సమీ

పిస్తూ కుమ్మరి మొల్ల—]

ఏం నాయనా , నన్నాహ్వానించారు? 

నేను: తమరు  నమస్కారం మానేసి, ఏకవచనాన్ని  ప్రయోగిస్తేగాని నేనేమీ మాట్లాడాను.


మొల్ల : అదేవిటి మీరు బ్రాహ్మణులు; మేము కుమ్మర్లం . 


అయితే నేమమ్మా? నాకంటే పెద్దలు అన్ని విధాలా


ఐతే మటుకు  కులమెక్కడికిపోతుంది?


మీరు దణ్ణాలు పెడితే అందుకోవడం, పేర్ల చివర రావు తగిలించుకోవడం, మీ చేత బహువచన ప్రయోగాలు  అందుకోవడం అవన్నీ మీ కాలపు వాళ్లకే తగిపోయింది. మేమేదా పాత కాలపువాండ్లం. మూర్ఖప్రపంచ సంబంధీకులం. మా వ్యక్తిత్వాన్నట్లా ఉండనీయండి .


తమ విషయం నాకు ముచ్చటగా వుంది. కాని ఐనా నా పట్ల, ప్రేమ కోరిన చనువును చూపించండి 


సరే, నీకంత పట్టుదలెందుకు? అల్లాగే కాని, నన్ను పిల్చిన కారణమేమి నాయనా ? .


మీ రాంధ్రంలో కవిత్వం చెప్పారు కదా! 


నన్నూ నా కవిత్వాన్నే చెప్పు శాయనా ! ఆంధ్రంలో కవిత్వం చెప్పి నలుగురి మెప్పు పొందుదామని ఆశ పడ్డ  మొదటి స్త్రీ వ్యక్తిని నేనే అనుకుంటా.  అది నాకేం  పొండత్యం ఉండి కవిత్వం చెబుదామని కాదు .  చిన్నప్పుడు నాకు ఎంతసేపూ  చదువు కుందామని పుండేది. మా వృత్తిలో  త్రిప్పడం కోసం మా అమ్మ కుండలిస్తే  రెండు మూడు సార్లు నా చేతుల్లో పగిలిపోయాయ్. ఆది చూచి మా ఆమ్మ తిడుతూంటే , మా వూళ్లో కొక బ్రాహ్మణ పండితుడు కని పెట్టి నాకు చదువు చెప్తా రమ్మని, కొంత కాలంలో పంచకావ్యాలు వంటపట్టించారు. ఆయన గారికి ఆంధ్రం,భారత, భాగవతాలంటే ప్రాణం. వారు రోజూ చదువుతుంటే వినేదాన్ని. కొంతకాలానికి శ్రీ సరస్వతీ కటాక్షం వల్ల నాకు పద్యాలు రాయడం అలవడ్డది . అప్ప ట్నుంచీ యేకథ వ్రాద్దామా  అనుకుని, రామ కథమీదికి మనస్సు ప్రాకితే దాన్ని వ్రాయడ మారంభించి పూర్తి చేసా. అదే నాయనా  నేను వ్రాసిన గ్రంథం. ఆదేమీ గొప్పదేంకాదు . 


చిత్తం. తమరా గ్రంథం విషయంలో పడ్డ ఆశ నెరవేరలేదా ?


నెరవేరకేం? 


అంటే నాకర్దం గాలా! 


అర్థం కావడానికేముంది నాయనా! నేను ఆడదాన్ని, నా కవిత్వ మంతపటుత్వమైందికాదు .


అదేమిటండీ, ఆడవా  చెప్పిన కవిత్వ మని తప్పక మెచ్చుకోవాలే! 





ఆడది కుండ లోముధోకక విశ్వం చెప్పడ వేమిటి యీ మాత్రం పద్యాలు చెప్పక పోతే భాషకేం పరువుతుందాని మా కాలం లో నోగలవాండ్ల ఊహ. నీవన్న భావం మీ కాలంలో ప్రబలినంత మా కాలంలో ప్రజలలో 1: అదేం మ్యాటండీ? నాయకురాలి వీర త్వం పొగడ్త స్కెలా ?


మొ: నాయనా, ఇది కవిత్వంగా, నాయకు కాలీ ఛైన్యకయి - బ్లాగ నా కవిత్వం మగా కృమము లగూర్చోపెట్టేది కాదుగా, నే: పొరబాటన వాళుకురాలి సంగతి కడివా, స్త్రీ కవనాన్ని సున్నితమైన విషయ


ముగా వెంచకపోవడం పౌరుపలోపం. మొ : ఈ భావాల్నేటివి గాని, వాటివి కావు. 1 అంచేత తమకో స్క్ర్కీ డేర లేదన్నమాట!


వీడేరలా. పామరల్లో డొక్క శుద్ధియైన వాం చింతా అభిమానించి మల్లమ్మ కాగా చిక్కని కజనం కెళ్తారని పొగిడేవారి ఆపా X నాకు రుచిస్తుందా నాయనా : ఎవడైనా పండిత


1: ఓహో ! (కొంచెముండి) నా కిప్పుడర్ధ మౌతూంది. ఆదా రపకు నొప్పి కలిగించింది! కొన్ని శతాబ్దాలైనా యింకా మరపు పుట్టిం చంది ! చిత్తం, నాన్ని మరిచి యింత సేపు తరచినందుకు నన్ను క్షమించండి.


మొః అయితే శేం చివర కాశ్య మాడ్చా రచుకోండి. నేటికి లోపించినపుడలా యెందరున్నా "ముల్లా: చే ఇంత తొందరి బడి నిన్నిట్లాగంటిని !" అని నొచ్చు కుంటారను కోండి ఏం లాభం! అవాళలుగుల్లో తిలకంపు ___లైంది కదా!


సే పోనీందమ్మా! ఎవరో ఒక రఇక పోతే మునిగిపోయింకా, ఆంధ్రలోకమంతా ఏకగ్రీవం గా, మొల్ల రామాయణం కారు టుందంటూంటే!


మొ: ఔననుకోండి! ఆ పధలో వసభ్య వాక్యం బుట్టిందా, లేదా? నే: అనకూడదనుకోండి.


మర్నాడు... మొ : ఆC, ప్రొద్దున్న వచ్ళారు: కూర్చ న్నారు: చదువిస్తున్నారు. అన్నిపొవాదులు మరచి సాయంత్రం దాకా కూర్చుని విన్నారు. ఏమైనా ఆడదాన్నని అంత నిరసన చేసారు.


కాలంలో మావాళ్ళు మగాళ్లకు మల్లే పర్వివిష యాల్లో శక్తి మంతుల మని నిరూపించారు. అంక పని మేము చేయలేకపోలా కాలానికి మా కమః సంఘసారానికి కట్టుబడ్డాంకాని, అప్ప కీమాందరు శ్రీ రాక్రమా దేవి ఝాన్సీ och మ్మభాయంటివారు కొంత సాహసించారు...


నే తనురేదో రెండు పేర్లుమాత్రమే చెప్పారు. ప్రపంచచరిత్ర పరిశీలిస్తే పేరో గిన కాంతామణులు కొన్ని వేలమందుటారేమో?! అంతవరకెందుకు? తెల్లాళ్ళ సిద్ధాంతా ల్నిజ ‘మైతే మానససంఘంలో నో ప్రథమం లో సర్వాధి కారు డవాండ్ల దేమో ! తిమరుస్వర్గంలో • ముంటారుకదా! వారిలో పర్వహ • రంటారు. • వాల్లోనే పెద్ద పై నా అడిక్కనం క్కోకపొయ్యారా?


మొ: మీ కీవాం ధుండడం సహజమే కాని ఆ దీడిగడానికొక్క అభ్యంరముఁది, వారంతా పర్వజ్ఞరేగాని వార్లో చెవర్నైనా పలకరించే వీలుందా ? అట్లాటిరేకై నా వార్లో నెవరినై నా కదిలించడంతో లే చిరు నవ్వు నవ్వి మరొక విషయ మెత్తుతారు. నా రెంట సేపటి కీ మానవులు - తమకు భగవంతుడు కటాక్షించిన శక్తిసామర్థ్యా లతో సకలము తెలుసుకొన బ్రయత్నించాలని వుంటుందనుకుంటా. అట్లా లేకుం ప్రేమన కున్న యే కొద్దిపాటు ప్రేమలో పూర్తైం తర్వాత మనకు కాలక్షేపమెటాగా అని ఊహిస్తా దనుకుంటా. ఆటాటివిషయాలు మా కెవరి కైజా తెలిపితే మే మీరోకారికి రాకపోక


మనము అంటూంటాం. (ఆకాశంనుండి) మొల్లా, శచీదేవి గారి


: ఆరురంతో రేచి) వాయశా (నిష్క్రమణ) సే ఆరే! మిగతా వారంతా కొంత తనివి తీక మాట్లాడిజిల్లా రీమెగా రుహశాత్తు గా వెళ్లారు. పోనీ, ఐనా మన మనిగాల్సిన విక చే మున్నాయీ మెను ? పాప మేవో కవిత్వం చెప్పాగుకాని తా మెన్నడు నే విషయంలోనూ ఘనుల మనుకోలా. సరే, యింకా కవులలో నెదరు మిగి లున్నారు. మిగులకేం! చాలామం దున్నారు కాని, పైవారి పంధల పడిచిన వారేగాని వారిలో స్వతంత్రం లెక్టరూ కాన్పిం చరు, మన కాలంలో వారిని కదిలిద్దా మెంటే లాభం లేదు; పైనబడి కరుస్తారు; కొడ్తారు. కూడాను — లేకపోతే పాకిపాడొ వారి లక్ష ణాన్ని గ్రహించి పొడిర్భంపినా చంపుతారు. వీరు మనల్ను ఏదిబడితే అదడి మాత్రంవాడా అని. అకొక నేనెట్టెను కదిలించినట్లవుతుందినేని దొరకదన్న మాట. సరే ఇక చక్రవర్తుల వాప్వోసిద్దాం. ఇంఠతో ఆగుదాం. ఇంకోసారి ఎప్పుడైనా?


( ఆంధ్రపత్రిక- 1948, జనవరి 14 - సంచిక నుంచి ) 

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

24-12 - 2012

బోథెల్‌; యూ. ఎస్.ఎ

Wednesday, December 22, 2021

సేకరణ పాత బంగారం - కథ ఇల్లాలు రచన - వై.ఎస్. ప్రకాశరావు ( ఆంధ్రపత్రిక - వారపత్రిక - సెప్టెంబర్ 29 - 1964 సంచిక )

 పాత బంగారం - కథ 

ఇల్లాలు 

రచన - వై.ఎస్. ప్రకాశరావు 

( ఆంధ్రపత్రిక - వారపత్రిక - సెప్టెంబర్ 29 - 1964 సంచిక ) 


ಆ ఆదివారం . క్రితం రోజు నే జీతాలు ముటాయి. 


అకస్మాత్తుగా పుట్టింది కోరిక . . ఎక్కడికైనా ప్రయాణం చేసిరావాలని. వెంటనే బయలు దేరాను. 


 మెయిల్ లో కాకినాడ వెళ్ళి తిరిగి సాయం కాలానికి వచ్చేదామని. 


నీటుగా కటకప్ చేసుకొని కళ్లకు గాగుల్స్ పెట్టి రిక్షాలో రాజమండ్రి టవున్ స్టేషన్ చేరాను. తీరా వెళ్లేటప్పటికి మెయిల్ గంటలేటు అని తెలుసుకొని ప్రయాణంమీద నిరాశపడ్డాను. 


తిరిగి వెళ్ళిపోదామా అనిపించింది . . పనిలేక ప్రయాణం చేసే నాలాటి ప్రయాణీకుడు పనిపైన ప్రయాణం చేసే ఇతర ప్రయాణీకులను అవస్థ పెట్టటాని కిష్టం లేక. 


కాని ప్రయాణం చెయ్యాలని కోరుతున్న మనస్సును నిరాశ పెట్టడాని కిష్టం లేక వెనుదిరిగి వెళ్ల లేకపోయాను. 


ప్లాట్ ఫారమ్మీద కొంత సేపు తిరిగాను. కాలం గడవటం బహుకష్ట మెంది. ఇంతిలో రోడ్ మీ ద కాఫీ 'కేంటీన్' వైపు దృష్టి మరలింది. 


కేంటీన్ లోకిపోయి కాఫీ తీసుకున్నట్లయితే కొంత కాలం గడుస్తుందికదా అని బయలు దేరి వెళ్ళి 'స్పెషల్ సెక్షన్'లో పంకా క్రింద కూర్చు న్నాను. సర్వర్ కు  కాఫీకి ఆర్డర్ ఇచ్చి గాగుల్సతీసి ముఖంమీది చమటను చేతి రుమాలుతో తుడుచుకుంటుండగా ఆ బల్లకు ఎదురుగా  కూర్చున్న ఓ పెదమనిషి 'ఎక్క డకు వెళ్ళాలి, నాయనా?' అని ప్రశ్నిం చాడు. 


'కాకినాడ వెళ్ళాలి' అని సమాధాన మిచ్చాను.


ఆయన వాలకంచూస్తేనే గవర్నమెంటు ఆఫీసర్ లా కనుపిస్తు న్నాడు. తెల్లని సగం చేతుల చొక్కా, రంగువెలిసిన కాకీ ఫుల్ పేంటులో 'టకప్’ చేసి కళ్ళకు చత్వారంజోడు పెట్టాడు. ఆయన్ను చూడగానే కొంతసేపు ఆయనతో సంభాషణ చేయాలని మనస్సు పుట్టింది. '


' చదువుకుంటున్నావా?' అని మరల ప్రశ్నించాడాయన. '


' లేదు, ఉద్యోగం చేస్తున్నా' నని సమా ధానమిచ్చాను. 


సంతోషమన్నట్లుగా ఆయన ముఖసూచన చేసి మళ్ళీ ప్రశ్నించాడు. 


' ఏడిపార్టుమెంటులో పనిచేస్తున్నావు? ' 


ఆయన వేసే ప్రశ్నలధోరణిచూచి, ఇంకా వివరాలన్నీ కనుక్కుంటాడని ముందుగానే గ్రహించి, ఆయన అడగబోయే వివరాలన్నీ చెప్పేసేను. 


నామాటలు వింటూనే ఆయన ఏదో ఆలోచనలో పడ్డాడు.


'ఏమండీ అలా ఆలోచిస్తున్నారు? నేనేమైనా మీకు తెలుసా?' అని అడిగాను. 


ఆ, ఏమీలేదు, నీవు చెప్పింది వింటూంటే నాకేదో చిన్న నాటి సంఘటన జ్ఞాపకమొస్తున్నది' అన్నా డు గొంతుక సవరించుకుంటూ. 


రైలు కింకా చాల టైమున్నది కదా - ఆయనదగ్గరనుండి తెలుసుకోవాలను కునే లోపు సర్వర్ కాఫీ తీసుకొచ్చి ఇంతలో నాముందు పెట్టాడు. 


ఆ కాఫీ ఆయన కందిస్తూ, మరో కప్పు తీసుకురమ్మని సర్వర్ తో చెప్పాను. 


' నేనిప్పుడే తీసుకున్నా, ఫరవాలే, నీవు తీసుకో! '  అన్నాడాయన. 


కాఫీ ముగించి ఇరువురం బయటకు వచ్చాం. నేను రెండు కిళ్ళీలుకొని ఒకటి ఆయనకిచ్చి రెండవది నేను వేసుకున్నా. నేరుగా స్టేషన్ కు పోయి ప్లాట్ ఫారం చివర్న  ఒక పెద్ద చెట్టు క్రింద ట్రాలీమీద కూర్చున్నాం.


'రిటైరైనారండీ? ' అని ప్రశ్నించాను, విషయ మేమిటో తెలుసుకుందామని.


"

'రేడిపార్టుమెంటులో పనిచేసి రిటైరయ్యానని  ఆయన చెప్పాడు. 


ప్రభుత్వోద్యోగంలో రిటైర్ అయ్యాడు.


' నా విషయం వింటే మీ చిన్న నాటి సంఘటన జ్ఞాపకమొచ్చిం దన్నారు?' అన్నాను.


' అవును. చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది. నేను చేసిన పాపం చెప్పుకుంటే నాకూ కొంత మనస్థిమితం కలుగుతుంది. నీకూ ఒక ఉదాహరణగా ఉంటుంది, విను నాయనా! ' అన్నా డాయన. 


ఇంచుమించు ముప్పై సంవత్సరా లుండవచ్చు. ఒకరోజున ఆఫీసు పనిపైన ఒక పల్లెటూరు వెళ్ళా. అప్పటికి సాయంత్రం అయిదుగంటలు కావస్తోంది. గ్రామమునసబు గారింటికి వెళ్ళి నా హోదా చెప్పుకుని నాకు భోజన -పానాదులు సమకూర్చుకున్నా. 


గృహస్థు నలభైయేళ్లు పైబడిన మనిషి. ఇంట్లో ఆయన భార్య, మూడునాలుగేళ్ల ఆడపిల్ల తప్ప మరెవ్వరూ లేరు. 


ఆయన భార్య పెద్ద అందగత్తె కాకపోయినా కురూపి మాత్రం కాదు. ఇరవై సంవత్సరాలు పైబడిఉండవు. ద్వితీయవివాహమనుకోవచ్చు. 


నా స్నాన మైన తరువాత  గృహస్థుతో కలిసి భోజనం ముగించాను. ఆరుబయట వసారాలో నాకు మునసబు గారికి వేర్వేరు మంచాలు వేసి ఆయన భార్య వసారా సనుసరించి మంచం మీద పిల్లను  వేసుకొని పడుకొంది. 


నాకు కావలసిన సౌకర్యా లన్నీ కూడ మునసబుగారు భార్య చేతనే ఏర్పాటు చేయించారు. ఆమెకూడా అరమరిక లేక చాల చనువుగా మసిలింది. 


ఆమె నడవడికనుచూచి నే నామెను తప్పు అర్థం చేసుకున్నాను. 


రాత్రి సరిగా పన్నెండు గంటలు దాటి  ఉంటుందేమో. నాకు మాత్రం నిద్రపట్టలేదు. ప్రక్కను గృహస్థు గాఢనిద్రలో ఉన్నాడు. 


నాకు కలిగిన భావములు నన్ను ఆమెగురించి కలవరపరిచాయి. 


నే నెటువంటి ఉద్రేకానికి గురి అవుతున్నానో నా కప్పటి పరిస్థితులలో తెలియలేదు. నెమ్మదిగా లేచి చూచాను. గృహస్థు గాఢనిద్రలో వున్నా డని నిశ్చయపర్చుకొని, నెమ్మదిగా తడబడు తున్న అడుగులతో గదిలోకి వెళ్ళాను. ఆమె పిల్లపక్కన పడుకుని గాఢం గా నిద్రపోతోంది. నేను వెళ్ళి ఒణకుతున్నా..  ఆమెను తట్టాను . 


ఆమె ఆ నిద్రలో కళ్లు తెరచిరూచి కలవరపడింది. నే నామె చేయి పట్టుకో ప్ర యత్ని చేశాను. ఆమె వొణికిపోతూ "వస్తానుంఉండ ”ని చెప్పి పిల్లతో సహా బయటకు వెళ్ళి తలుపు గొళ్ళెం పెట్టింది .


ఆ రాత్రి నేను పడ్డ అవస్థ భగవంతునికే తెలుసు. మనస్సులో ఏదోభీతి దృఢంగా నాటుకుంది. నేను చేసిన తుచ్ఛమైన పని కి నన్ను నేనే నిందించుకున్నా. 


స్త్రీ మనస్తత్వ మెరక్కుండా ప్రవర్తించి నందుకు నన్ను నేనే తిట్టిపోసుకున్నా. ఆగదిలో నే తెల్లవారేలోగా ప్రాణం విడిచేద్దామా అనిపించింది. 


కాని మళ్ళీతట్టింది. నేను చేసినపని తిన్న ఇంటి వాసాలు లెఖ్క పెట్టటం. వారింట ప్రాణం తీసుకోటం మర్యాదస్తుడైన గృహస్థుకు ప్రాణాపాయం తెచ్చి పెట్టడమే కాక, వారి వంశమర్యాదను భంగపర్చటమని  భావించి వెనుదీశాను. 


గ్రామస్థుల ఎదుట నన్ను నిలదీయగలరని దృఢంగానమ్మాను.  దానితో శరీరం కంపించింది. 


తెల్లవారేలోగా ఇంచు మించు ఇరవై ముప్ఫై సార్లు తలుపులాగి చూచాను, కాని రాలేదు. దానితో మరింత భయపడ్డాను. 


తెల్లవారింది.  వారింట్లో కోడి ఎలుగెత్తి ‘కొక్కురోకో' అని చూసింది. 


అదిరిపడి మళ్ళీ వెళ్ళి తలుపులాగి చూచాను. తలుపు గొళ్లెం  తీసివుంది. 


మునసబు గారు మంచంమీది ఇంకా నిద్రపోతున్నారు. 


ఇలాలు దొడ్లో ఏ దో ఇంటిపని చేసు కుంటోంది. 


నేను గాభరాపడుతూ  సామాన్లు సర్దుకొని  అక్కడ ఉండడానికి ఇష్టం లేక వెంటనే బయలు దేరాను. 


అది గమనించి ఇల్లాలు వెంటనే భర్తను లేపింది. ఆయన లేవటంతో నాకు మరింత గాభరా ఎక్కు వైంది. 


ఆయన మరో గదిలోనికి వెళ్ళి బట్టల సవరించువచ్చి 'ఏమండీ అంత కంగారు పఉతారెందుకు? తాపీగా స్నానంచేసి కాఫీ వెళ్ళండి. అది గృహస్థధర్మం. అన్నాడు . కాని ప్రేమపూర్వకంగా  ఆయన అన్న ఆమాటలతో నాకు  శరీరం దహించుకు పోతున్నట్లయింది. 


ఎట్లాగో ముళ్ళమీద నుంచున్నట్లు వారికోరికను మన్నించి తరువాత వెళ్తూ ' వెళ్ళొస్తాను చెల్లెమ్మా' అన్నాను. 


' వెళ్లి రాండి అన్నయ్య గారూ! ' అందిఇల్లాలు. నాకామాట బల్లెంతో పొడిచినట్లయింది.


వెళ్ళి వెంటనే ఆత్మహత్య చేసుకోవడం మంచిదనిపించింది. 


స్త్రీ మనస్తత్వం నీకు తెలియంది కాదు, నాయనా. సంవత్సరాలనుండి ఈ విషయం జ్ఞాపకమొచ్చినప్పుడల్లా నేను చేసినతప్పు   ఎవరికి  చెప్పి పశ్చాత్తాపం పొంది దాని ద్వారా కొంత మనఃస్తిమితం కలుగ చేసుకుంటున్నాను'  అని ఆయన కథ ముగించాడు. 


అప్పట్లో ఆయన ముఖం చూస్తే నాకే జాలి వేసింది. 


ఓ విధంగా ఓదార్చకపోతే బాగుండదని మొదలు పెట్టా.

' తప్పు మానవుడు చెయ్యకపోతే పశువు  చేస్తుందిటండీ? చేసిందానికి మీరు పశ్చా త్తాపం చెప్పుకోనే చెప్పుకుంటున్నారు. చేసిన తప్పు ఈ రోజుల్లో ఎవరు చెప్పు కుంటారండీ? మీరు చేసినపాపం చెప్పు కున్నందువల్ల అప్పుడే పోయింది. ' అని సముదాయించేప్పటికి ఆయనముఖంలో కొంత వికాసం కన్పించింది. . ' 


' నాయనా!  యువకుడవు. నాకథ జ్ఞాపకముంచుకోవడం  నీకు మంచిది  నాయనా.; . అని తలవంచుకుని మౌనంగా కూర్చున్నాడు. 


నేను ఆలోచనలో పడ్డాను, ఆయన చెప్పిన సంఘటనలో ఆయన పడ్డ అవస్థకన్న ఆ ఇల్లాలి తెలివి తేటలు, సహనం ఆలోచనలు ప్రథమ స్థానం  పొందాయి. ఎంతో  నేర్పరితనంగా తన మానం  రక్షించుకొని అతిథిని అగౌరవపర్చ కుండా పంపింది! 


ఆడవాళ్ళందరూ అంత తెలివిగా ఉంటే ప్రపంచ మే బాగుపడి పోను- అనిపించింది.


రచన - వై.ఎస్. ప్రకాశరావు 

( ఆంధ్రపత్రిక - వారపత్రిక - సెప్టెంబర్ 29 - 1964 సంచిక ) 


Saturday, December 18, 2021

పాత బంగారం : కథానిక కథ: భారతి - మాస పత్రిక - నవంబరు, 1986 నిరీక్షణ - ఎ.వి. వి. ఎస్. ఎస్. ప్రసాద్ సేకరణ : కర్లపాలెం హనుమంతరావు




 



పాత బంగారం : కథానిక 

కథ: భారతి - మాస పత్రిక - నవంబరు, 1986 

నిరీక్షణ 

- ఎ.వి. వి. ఎస్. ఎస్. ప్రసాద్ 

సేకరణ :  కర్లపాలెం హనుమంతరావు 


యంత్రంలా సాగిపోతున్న జీవన సరళిలో అతనిరాక ఒక గొప్ప అనుభూతి. 


జీవితంలో ఎదురైన చేదు అనుభవం అతని జీవితాన్నే మార్చేసింది. అనుభూతినే ఊపిరిగా పీలుస్తూ దూరమై పోయిన 'ఆనందాన్ని ఆస్వా దించడానికి, అందుకోడానికి ప్రయత్నిస్తున్నాడతను....


నిరీక్షణలో మాధుర్యాన్ని అనుభవిస్తున్నాడా? |


ఆదో విచిత్రమైన స్థితి.అతనిది:


అనందం లాంటి విచారం . విచారం లాంటి ఆనందం


అదో చిన్న రైల్వే స్టేషన్.

నేనక్కడ అసిస్టెంట్ స్టేషన్ మేష్టార్ని.


ఈ ప్రాంతానికి బదిలీ అయి దాదాపు రెండేళ్ళు అయ్యింది. ఇక్కడ కొచ్చిన కొత్తలో ఇక్కడి వాతావరణం అలవాటు అవ్వడం కాస్త కష్టమే అయ్యింది. 


పట్నంలో పుట్టి పెరగడంవల్ల పల్లెటూరి వాతావరణం కొత్తగా, కొంచెం ఇబ్బందిగా వుంది... వచ్చిన రెండో రోజునే, జలుబు.... జ్వరం.....


వైద్య సహకారాలు పెద్దగాలేవు. ఏదో అదృష్టం బాగుండి ఓ వారం తరువాత కోలుకున్నాను.  తరువాత క్రమేణా వాతావరణానికి అలవాటు వడ్డాను. వాతావరణంతో 'అవగాహన' ఏర్పడ్డాకా, అక్కడి జనం, వాళ్ళ వేషభాషలు కూడా అర్ధమయ్యాయి. 


అంతా అర్థమయ్యాకా, అంతా ఆనందమే! అక్కడి వాళ్ళతో నేను కలిశాను. నాతోవాళ్ళు కలిశారు. స్టేషన్లో పెద్దగా పనులు వుండవు. ఎక్స్ ప్రెస్ బళ్ళు వచ్చినప్పుడు సిగ్నల్స్ చూ పెట్టడం.... రెండే రెండు 'ఎక్స్ప్రెన్సులు' వస్తాయి రోజుకి . అవి ఉదయం  వేళలలో రావడంతో... దాదాపు మధ్యాహ్నమంతా ఖాళీయే: 


మళ్ళీ సాయంత్రం ఆరింటికి ఓ ప్యాసింజర్ వస్తుంది. దాంట్లోంచి ఒకరిద్దరు కన్నా దిగరు. వెళ్ళేవాళ్ళు ఒక్కొసారి అసలు వుండరు. అడపా దడపా నాలుగైదు గూడ్స్ బళ్ళు వస్తుంటాయి. అందుకే పెద్దగా పన్లు ఉండవు . వున్నా వున్నట్టు అనిపించదు.


ఏడాది కొకసారి ఈ ప్రాంతంలో తిరునాళ్ళు లాంటిది జరుగుతూ వుంటుంది. అప్పుడే కాస్త రద్దీగా వుంటుంది. అందుకే.....


ప్రొద్దున్నుండి సాయంత్రం వరకు గడవడం పొద్దు బోదు . కానీ వుద్యోగ ధర్మం తప్పదు.


రోజంతా భరించలేని వేడిమిని భరించడంవల్ల సాయంత్య్రం కోసం, సాయింత్య్రం వీచే చల్లని పిల్లగాలులకోసం ఎదురు చూడడం నా జీవితంలో నిత్యకృత్యమయి పోయింది. ఇక్కడి సాయంత్రం  నిజంగా చాలా అందంగా వుంటుంది.


ఆ అందానికి వన్నె తెస్తూ. ప్రకృతి సంధ్యారాగ సంకీర్తన! 

దూరంగా గూళ్ళవైపు సాగిపోతున్న పక్షుల గుంపులు. ఏవో నందేశాలు

హడావిడిగా మోసుకుపోతూ నీలిమేఘాలు. 

పిల్లగాలి కెరటాల సప్తస్వరాలు.

నిశ్శబ్ద సౌందర్యం.


అలాంటి సమయంలో

' అతను'  వస్తున్నాడు.


అతని పేరు తెలీదు. దాదాపు ఏడాది నుండి వస్తున్నాడు.


మా యిద్దరి మధ్య మాటల్లేవు. చూపులతోనే పలకరింత.


అందమైన నిశ్శబ్దం ఇద్దరిమధ్య.


ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టు ప్యాసింజర్ వచ్చే వరకు చూస్తాడు.


వచ్చేకా, అది వెళ్ళే వరకు అన్ని బోగీల్లోకి చూస్తూ, అటునుండి ఇటూ,

నుండి టూ తిరుగుతాడు.


రైలు కదిలేవరకు అక్కడే  వుండి, కదిలాకా, భారంగా ఓ నిట్టూర్పు విడిచి, మెల్లగా అడుగులో అడుగువేసుకుంటూ వెళ్ళిపోతాడు.. ఇక్కడికి దగ్గర్లోవున్న పల్లె.. దాదాపు మూడుమైళ్ళ దూరం. 


రోజూ అంత దూరంనుండి ఎందుకు వస్తున్నట్లు? పోనీ అతని కోసం ఎవరైనా వస్తారా? 

ప్స్! . . ఎవరూ రారు.


ఒకసారి పోర్టర్ వెంకటయ్య మాటల్లో తెలిసిందేమిటంటే- అతను దగ్గర్లో వున్న పల్లెటూరిలోని పాఠశాల మేష్టారు. దాదాపు ఏడాది అయ్యిందిట ఆవూరు వచ్చి మనిషి.  బక్కపలచగా వుంటాడు. పెద్ద ఎత్తుగా వుండడు, వదులైను ఫాంట్, లూజ్ షర్ట్ వేసుకుంటాడు. నిర్మలంగా వుండే మొహంలో కొద్దిగా జాలి, ఎక్కువగా కరుణ

కన్పిస్తాయి. కళ్లాల్లో  మాత్రం ఏదో లోతుచూపులు. ఏదో పోకొట్టుకున్న తున్నట్టు వుంటాయి,


" అమాయకుడిలా వుంటాడు" అని అంటాడు వెంకటయ్య. 

ఎండైనా -


వానైనా -


చలైనా -


వచ్చేవాడు. వస్తున్నాడు. ఇంత శ్రమపడి రావడ మెందుకు?


ప్రశ్నకి ఎంత ఆలోచించినా జవాబు దొరకడం లేదు.


మధ్యాహ్న నుండి వాతావరణం ఆదో మాదిరిగావుంది. మేఘాలు కమ్ము కున్నాయి. రివ్వున ఈదురు గాలులు వీస్తున్నాయి. చినుకు ఏ క్షణానైనా రావొచ్చు. చలికి ధరించలేక స్వెట్టర్ వేసుకున్నాను. యింకా అరగంట వేచివుండాలి ... ప్యాసింజర్ కోసం.

గాలి విపరీతంగ వీస్తోంది . దగ్గర్లోవున్న చెట్లు 'లయ' గా తలలు వూపుతున్నాయి.

గాలి గంభీరంగా అరుస్తోంది.


క్షణంలో... చూస్తుండగానే... గాలి కెరటాల పురవడిలోంచి చినుకులు పడడం ప్రారంభించాయి...బంగారు తీగెలా మెరిసే మెరుపు... ఆకాశాన్ని చీలుస్తూ 

కుండపోతగా........

ధారలు ధారలుగా వర్షం....


' ధన్...' దూరంగా ఎక్కడో పిడుగు పడింది..


ప్రకృతి భీభత్సంగా తయారయ్యింది..


హోరు మనిగాలి.. అంతకంతకు  చినుకులు.. పిడుగు శబ్దం.... చినుకులు...


తాండవం చేస్తున్నాయి....


గాలీ. . వానపోటీ పడ్తున్నాయి....


స్టేషన్లో కరెంటు పోయింది.... లాంతరు వెతికి, దీపం వెలిగించడం గగనమయ్యింది. పోర్టర్ కూడలేడు.  వూళ్ళో ఎవరో బంధువులు వచ్చేరని, చూడడానికి మధ్యాహ్నమే వెళ్ళాడు.

చీకటి తెరలు అలుముకుంటున్నాయి.

భయ కంపితుడ్ని చేస్తోంది ప్రకృతి! 


అరగంట గడిచింది తెలీకుండానే. 

ఫోన్ మోగింది. ప్యాసింజర్ గంట లేటుట. పక్క స్టేషన్నుండి వర్తమానం వచ్చింది.


మరో పావుగంట తరువాత.....


చినుకులవేగం తగ్గింది. లాంతరు వెలుతురులో దూరంనుండి ఎవరో వస్తూ కన్పించారు. వెంకటయ్య అనుకున్నాను వస్తున్నది


' అతను' హడావిడిగా వస్తున్నాడు. తలమీదో గుడ్డ కప్పుకున్నాడు. మనిషిదాదాపు తడిసిపోయాడు.


' మేష్టారూ! ...ట్రైన్ వచ్చిందా?" ఆత్రంగా అడిగాడు, మెల్లగా వణుకు 


తున్నాడు. 


" లేదండి.. గంటలేటు.... "అన్నాను.


“....ఇలా బయటికు  అడుగు వేశానో లేదో ... మొదలయ్యింది . 

 చిన్న వానే అనుకున్నా, బాగా తడిపేసింది....." అన్నాడు అలా దూరంగా చూస్తూ. 


అదృష్టం బాగుండి కరెంటు వచ్చింది. తువ్వాలు వెతికళ్ళల్లోకి కృతజ్ఞతగా చూశాడు. 


" ట్రైన్ వచ్చేవరకుఇక్కడే వుండండి! బాగా కురుస్తోందివాన...." అన్నాను. 


అక్కడే వున్న కుర్చీ అతని వైపు జరుపుతూ. 


దానిమీద కూర్చొని వాన లోకి చూస్తున్నాడు


 " ఏవండీ.... రోజూ వస్తున్నారు..... ఎవరేనా బంధువులు వస్తారా .... వస్తున్నారా?" 


ప్రశ్న ఎలావేయాలో తెలీలేదు. తెలుసుకోవాలనే కుతూహలం ఆ ప్రశ్న వేసింది.


అతను జవాబు చెప్పలేదు.


“.. ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకండి!  దాదాపు మిమల్ని ఏడాది నుండి గమనిస్తున్నాను. వస్తున్నారు.... వెళుతున్నారు...."అన్నాను.


క్షణం తరువాత.. 


"ఎవరూ రారండి.... వస్తారేమోనని ఆశ..." అని క్షణం ఆగి "నిరీక్షణలో బాధకన్నా ఆనందమే ఎక్కువగా వుంది...." అన్నాడు.


అర్ధం కానట్టు చూశాను. అతను చెప్పడం కొనసాగించాడు. “.... ఇన్నాళ్ళు మీరు నన్నడగలేదు.... కానీ.... మీకో విషయం తెలుసా?"


ఏమిటన్నట్టు చూశాను,


“... ఎప్పుడూ మీతో చెద్దామనే ప్రయత్నించాను. కానీ.... అవకాశం రాలేదు." నేను ఆశ్చర్య పోయాను. 


కష్టాన్నైనా, సుఖాన్నైనా మరొకరితో చెప్పుకుంటే, కాస్త ఓదార్పు కలుగుతుందంటారు" అని వానలోకి క్షణంచూసి. . " ఒక్కో మనిషి జీవితం ఒక్కోరకం.... విధాతనృష్టి విచిత్రం. మనిషికి మమతానురాగాల మధురిమని అందిస్తాడు ... రుచినంపూర్ణంగా ఆస్వాదించ

కుండానే దూరం చేస్తాడు. క్షణం వనంతం. క్షణం శిశిరం. జీవితం సుఖ దుఃఖాల సమ్మేళనం...." అని ఆగి "మీకు విసుగ్గావుందాః" అని తెచ్చి పెట్టుకున్న నవ్వు నవ్వాడు. 


కాగితం పూవులా వుందా నవ్వు.


" లేదు..లేదు..ఇదో విచిత్రమైన అనుభవం! చెప్పండి...." అన్నాను  ఆసక్తిగా  ముందుకు వంగుతూ....


నా ఆసక్తిని చూసి, మెల్లగా నిట్టూర్పు విడిచి కొనసాగించాడు. 

చినుకుల శబ్దం..అపరిచిత వ్యక్తి మాటలు ..విచిత్రానుభూతి..... చిత్రమైన కుతూహలం..


" నా జీవితం మొదటినుండి ఒక రకమైన ఆప్యాయతలకి అనురాగాల! 

చేరువుగా వుంది. మా తాతయ్య వాళ్లది ఉమ్మడి కుటుంబం. తాతయ్యకు  యిద్దరు కొడుకులు . ఒకరు వ్యవసాయం. మరొకరు వుద్యోగం. పాత బంగారం : కథానిక 

కథ: భారతి - మాస పత్రిక - నవంబరు, 1986 

నిరీక్షణ 

- ఎ.వి. వి. ఎస్. ఎస్. ప్రసాద్ 

సేకరణ :  కర్లపాలెం హనుమంతరావు  గారికే వుద్యోగం . వుద్యోగరీత్యా అయిన వాళ్ళందరికి  దూరంగా వుండవలసి వచ్చింది. తాతయ్య చాలాసార్లు నాన్నతో అన్నాడు. " నీకా వుద్యోగం.... ఎందుకురా?  హాయిగా యిక్కడే వుండకా?" అని. 

నాన్నగారికి వ్యవసాయ మంటీ  యిష్టంలేదు. ఎట్టి పరిస్థితిల్లోను కనీసం ఏడాదికోసారైనా, తాతయ్య గారింట్లోగడపాలనే షరతుమీద తాతయ్య నాన్నగారు పుద్యోగం చేయడాన్ని వప్పుకున్నాడు." అని ఆగి రెండు క్షణాలు దూరంగా చూస్తుండిపోయాడు . 


 గాలి హోరు తగ్గుతోంది క్రమేణా. చినుకులు మెల్లగా చిందులు చేస్తున్నాయి. 


" ఆ ఏడాది స్కూలుకి వేసవి సెలవులు యిచ్చారు. బాబయ్య ఏదో పనిమీద మా  ఊరు వస్తే ! నాన్నగారు వాళ్ళు బాబయ్యితో తాతయ్య గారింటికి పంపారు నన్ను. లీవ్ శాంక్షన్ అయ్యాక, అమ్మా, నాన్న, చెల్లి వస్తామని.. " 


మెరుపు మెరిసింది... ఒకసారి కాంతి వెల్లువ .  మళ్ళీ మాములే. సిగ్నల్ లైట్ డిమ్ గా వెలుగుతోంది.


"నాన్నగారు వాళ్ళు వస్తామన్న రోజు.... నేనూ బాబయ్య స్టేషన్లో ఎదురు చూస్తున్నాము .  అప్పటికి అమ్మా వాళ్ళని వదిలివారం రోజులయ్యింది..


నాకు బెంగగావుంది. అమ్మవస్తే ఆమె ఒడిలో ఒదిగి పోవాలని కోరిక. అదే మొదటిసారి వాళ్ళని విడిచి వుండడం. ఎదురు చూస్తున్నాము. ఎంత సేపటికి ట్రైన్ రాలేదు. కొంతసేపటికి తెలిసింది అమ్మావాళ్ళు ఇంకరారని. వేగంగా వస్తున్న రైలు పట్టాలు తప్పి... 

స్పష్టంగా కన్పిస్తున్నాయి కను కొలుకుల్లో కన్నీళ్లు.


గొంతులో స్పష్టంగా జీర.


"..ఆరోజు నుండి ఆదో అలవాటుగా మారిపోయింది. వస్తున్న ఏ రైలుని చూసినా నా వాళ్లు వస్తున్నారని... 'నా బంగారు కొండ' అనే అమ్మ, "వెధవా! ఏం చేస్తున్నావ్?" అనే నాన్న అన్నయ్య నన్ను భయపెడ్తారని 


అమ్మతో చెప్పి కొట్టించి....బూదచాడికి  యిప్పించేస్తా!  అనే చెల్లి వస్తారని ఏదో లాంటి విచారం ఎదురుచూపు...


దూరంగా రైలు వస్తున్న కూత విన్పించింది. అతను మెల్లగాలేచాడు. స్టేషన్లోకి వస్తున్న రైలుకేసి అడుగులు వేస్తున్నాడు.


చిన్న చిన్న చినుకులు పడ్తున్నాయి. చినుకుల మాటున మసక వెలుతురు దాటున మెల్లగా వెతుక్కుంటూ సాగి పోతున్నాడతను.

రైలుని చూసిన అతని మొహంలో స్పష్టమైన మార్పు. 

 ఆనందమాః విచారమా?


మరో పది నిముషాల తరువాత.


రైలు కదుల్తోంది....


అతను మెల్లగా సాగుతున్న రైలుతోపాటే నడుస్తున్నాడు.


బోగీలో ఎవరితోనో మాట్లాడుతున్నాడు....


మాటల్లో నవ్వుతున్నాడు.


నవ్వుతున్నా. 


 కనుకొలకుల్లో ఆ కన్నీళ్ళెందుకు?

***

పాత బంగారం : కథానిక 

కథ: భారతి - మాస పత్రిక - నవంబరు, 1986 

నిరీక్షణ 

- ఎ.వి. వి. ఎస్. ఎస్. ప్రసాద్ 

సేకరణ :  కర్లపాలెం హనుమంతరావు 


   

   

కథానిక వేలంపాట ( రచయిత పేరు నమోదు కాలేదు ) ( 26 -11 -1952 - నాటి ఆంధ్ర పత్రిక ఇలస్ట్రేటెడ్ వీక్లీ ) సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 18 -11-2021



పాత బంగారం 


కథానిక 

వేలంపాట 

 

( రచయిత పేరు నమోదు కాలేదు )  

( 26 -11 -1952 - నాటి ఆంధ్ర పత్రిక ఇలస్ట్రేటెడ్ వీక్లీ ) 

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

                 18 -11-2021 

                 


కన్నప్పని చూస్తే ఎవరికైనా సరే నవ్వు రాకుండా ఉండదు. 


చదువుకుంటున్న చిన్న పిల్లల దగ్గర్నుంచి ముసలివాళ్ళదాకా అతన్ని ఏవిధంగానైనాసరే ఏడిపించంది వదలరు. కాదు. 


కన్నప్ప వము ఫ్ఫై సంవత్సరాల క్రిందట మూడో క్లాసు మూడేళ్లు వరసగా ఫేలయి, ఆఫీసులో గుమాస్తాగా చేరాడు. ఎకౌంట్సు డిపార్టుమెంట్ లో !. 


అతన్ని అందరూ ఏడిపిస్తారంటే కారణం లేకపోలేదు. తెలిసిన వారందరి కంటే తను ఎంతో తెలివయినవాడినని అనుకుంటాడు. కాని అన్ని విషయాల లోనూ పప్పులో కాలు వేస్తాడు. ముప్ఫై సంవత్సరాల క్రిందట కొన్న చేతివాచి అహర్నిశలు చేతికి తగిలించుకునే ఉండేవాడు కన్నప్ప. ఒక వేళ అది చెడిపోయినా, ఆగిపోయినా దాన్ని తన చేతినుంచి విడదీసేవాడు కాదు. 


నాలుగు రోజులై వరసగా గడియారం నడవడం లేదు. అందుకు కన్నప్పకి చాలా కోపం వచ్చింది. దానికితోడు హనుమంతరావు ఆలోచన మందులా పని చేసింది. 


హను మంతరావు కన్నప్ప తోటి గుమస్తా. అందరి కన్నా కన్నప్పకి హనుమంతరావుమీద ఎక్కువ అభిమానం. గడియారాన్ని వేలం యించాలని హనుమంతరావు చెప్పిన ఆలోచన కన్నప్పకి బ్రహ్మాండంగా తోచింది. వేలం వేయించడానికి సంసిద్ధుడయాడు. 


వేలం పాడేందుకు వేరే ఒక గుమాస్తాని నియమించాలని, ఆ గుమాస్తాకి వేలం పాటలో అయిదు రూపాయలు ఇచ్చి వేయాలని నిర్ణయించాడు హనుమంత రావు. దానికి కన్నప్ప వప్పుకున్నాడు. 


గడియారం వేలం వేయబడే వార్త ఆఫీసులో  అందరికీ అందజేశాడు హనుమంత రావు. ఆఫీసు గుమస్తా లందరికీ సాయం కాలం అయిదు గంటలకు ఆఫీసుకు ఎదు రుగా నున్న మైదానంలో చేరుకోవాలని నోటీసు పంపించడమయింది. 


ఆనాడు జీతాల రోజు బట్టి వేలంపాట పోటీ బాగుంటుందని కన్నప్ప గట్టిగా నమ్మాడు. హనుమంతరావు ఒక్కడే తన శ్రేయోభి లాషి అని ఆనాడు పూర్తిగా దృఢపరుచుకో గలిగాడు.


సాయం కాలం అయిదు గంటలకి గుమస్తాలందరూ మైదానంలో హాజరయారు. 


గడియారం చేత్తో పట్టుకుని వేలంపాట పాడ్డానికి ఒక గుమస్తాని ఎన్నుకున్నారు. 


"కన్నప్ప గారి రిష్టువాచి వేలంపాట ఖరీదు ఒక్క అయిదురూ పాయిలే” అని వేలంపాట మొదలు పెట్టాడు గుమస్తా. ఆమాంతంగా గుండె ఆగిపోయినట్లయింది కన్నప్పకి. కాని వేలం అని జ్ఞాపకా నికి రాగానే మనసు కుదుటపడ్డది. 


'' కన్నప్ప గారి బంగారు ముద్దలాంటి చేతి గడియారం పదిరూపాయిలు. ఇరవై రూపాయిలు ! ఇరవై అయిదు రూపా యిలు” 


కన్నప్ప హృదయం ఆనందంతో ఊగిసలాడింది. దమ్మిడీకి పనికిరాని వాచిఅయిదు నిమషాలలో పాతిక రూపాయిల విలువగలది అయింది. హనుమంతరావు అతని కళ్ళల్లో దేముడయాడు.  


" ముఫ్ఫై రూపాయిలు. "


హనుమంతరావు కన్నప్ప చెవిలో అన్నాడు. "కన్నప్ప గారూ మీ వాచీ ఖరీదయిందిలా ఉంది. లేకపోతే పోటీ ఇంత జోరుగా ఉంటుందా? ఇంతమంచిది. వేలం వేయడం నాకేమీ నచ్చలేదు  సుమండీ . " 


కన్నప్ప మెదడులో ఆలోచనలు పరుగులెత్తాయి  " అవునోయ్ నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అసలు ఇటు వంటి వాచీలు ఈ రోజుల్లో లేవంటేనమ్ము . కాని . . ఏం చేస్తాం ?ఇంతదాకా వచ్చిన తరువాత  ఇప్పుడు వేలం లేదంటే నోట్లో గడ్డిపెడ్తారు " అని కన్నప్ప తన విచా రాన్ని తెలియబర్చాడు. 


" ముఫై అయిదు రూపాయిలు” 

" నల భైరూపాయలు" 

"నలభై అయిదురూపాయిలు" .. వేలంపాట పోటీ జోరుగావుంది


" మీకు మళ్లీ మీ వాచీ కావాలంటే ఒక్కటే ఒక్క ఉపాయం ఉంది. అలా చేస్తే మీ వాచీ మీకు దక్కుతుంది '' అన్నా డు హనుమంతరావు. ఈ మాటలు కన్నప్పలో ఉత్సాహాన్ని రేకెత్తించాయి .


"ఆ ఉపాయం ఏమిటో వెంట నే చెప్పవోయ్,” అని ఆ రాటంతో అన్నాడు . 


“స్వయంగా మీరే ఏ  యాభైరూపాలో పాడి వాచీ తీసుకోండి." అని ఊదాడు హను మంతరావు.


"నా వాచీకి నేనే..." 


"నే నున్నానుగా పాడండీ" అని అన్నా డు హనుమంతరావు. 


" ఏభై రూపాయిలు” అ చేశాడు కన్నప్ప. 


 గుమస్తాలు ఒక్కరొక్కరేజారుకున్నారు.


"ఏ భైరూపాయిలు ఒకటి, ఏభైరూపా యిలు రెండు ; ఏ భైరూపాయిలు మూడు." అన్నాడు గుమాస్తా. 


కన్నప్ప దగ్గర ఏభై రూపాయిలు తీసుకుని గడియారాన్ని అతనికి ఇచ్చేశాడు — వేలం చేసి న గుమస్తా.


కన్నప్పకి గుండె ఆగిపోయినట్లయిపోయింది. 


“మరి నా డబ్బో" అని ఏడుపుముఖంతో హనుమంతరావుని అడిగాడు. 

" మీ డబ్బు మీదే. వేలం వేసిన అతనికి అయిదు రూపాయలు ఇస్తానని వప్పుకున్నారు కదూ మీరూ ? ఇదుగో ఏభై రూపాయలకి మీ వాచి వేలంలో మీరు పాడుకున్నారు. దీంట్లో అయిదు రూపాయలు పోగా నలభై అయిదు రూపాయలు ఇవిగో తీసుకోండి" అని హనుమంత రావు 45 రూపాయల కన్నప్పకి ఇచ్చి వేశాడు. అయిదు రూపా యలు పోతే పోయాయికొని తన గడి యారం పోలేదని సంతోషించాడు కన్నప్ప . 


మర్నాడు హనుమంతరావు సెక్షన్లో అందరికీ పకోడీ, టీ ఇప్పించాడు - కన్నప్పకి కూడా.


ఎందుకో అర్థం అయింది కాదు కన్నప్పకి. 


 కాని తరువాత తెలిసింది అతనికి - తనదగ్గర అయిదు రూపాయలు కొట్టేయడానికే హనుమంతరావు వేలం పాట ఏర్పాటు చేశాడని. కాని అతన్ని ఏమీ అనలేకపోయాడు కన్నప్ప, కారణం తన తెలివితక్కువ తనమే అని అతనికి  తెలుసు . 

( రచయిత పేరు నమోదు కాలేదు > 

( 26 -11 -1952 - నాటి ఆంధ్ర పత్రిక ఇలస్ట్రేటెడ్ వీక్లీ ) 

సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

                 18 -11-2021 

Monday, December 13, 2021

రామకృష్ణుని గడుసుతనం సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 13 -11-2021 ( కీ.శే. దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి చాటు పద్య రత్నావళి నుంచి )

 



రామకృష్ణుని గడుసుతనం 

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

13 -11-2021 

( కీ.శే. దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి చాటు పద్య రత్నావళి నుంచి ) 


వాకిటి కావ౨  తిమ్మనికి రాయలువారెప్పుడో ఒక  మంచి శాలువ  ఇచ్చారుట . దాని నతఁడు కప్పుకొని క్రుమ్మరుటఁ జూచి, మన వికటకవి దానిపైఁ గన్ను వేసి, మెట్లనను దానిని కాఁజేయవలయునని యూహఁజేసి, యుపాయము గుదుర్చు కొని యొకనాడుఁ తిమ్మనిఁ బిలిచి మెల్లఁగా నిట్లు బోధించెను. "ఓయీ! కృష్ణ దేవరాయలవంటి మహారాజుగారి ద్వారపాలకుఁ డవై, యొక పద్యమునైనను గృతినందకుండుట నాకిష్టము లేదు.” అనఁగా "అయ్యా! తగినంత బహుమానము నియ్యనిదే కవులు పద్యములు చెప్పుదురా” యనెను. రామకృష్ణుడు “తిమ్మా, నే నుపాయముఁ జెప్పెద వినుము; ఒక్కొక్క కవి నొక్కొక్క చరణమువంతున నడిగితివేని సులభముగాఁ బదిపద్యములఁ గృతి నందఁగలవు. ఇంతకు వేఱక యుపాయము లేదని చెప్పఁగా నతఁడు సంతోషించి, మఱునాఁ డుదయమున వాకిట నిలచి మొదట వచ్చిన పెద్దన్న గారికిఁ దనకోర్కి ని దెల్పఁగా నక్కవి నవ్వి, యిట్లొక చరణమును జెప్పి లోపలికిఁ బోయెను.


క. “వాకిటి కావలి తిమ్మా


తర్వాత వచ్చిన భట్టుకవి నాశ్రయింపఁగా సాతఁడు..... 


"ప్రాకటమగు సుకవివరుల పాలిటిసొమ్మా


అనుచరణమును వ్రాసియిచ్చిపోయెను. పిమ్మట వచ్చిన తిమ్మకవి కీసంగతిని విన్న నింపఁగా నతఁడు


“నీ కిదె పద్యము కొమ్మా”


అని చెప్పి పోయెను. వీరి రాకను గనిపెట్టియుండి నాలు గవ వాఁడుగా వచ్చిన మన రామకృష్ణుఁడు -


“నా కీపచ్చడమె చాలు నయముగ నిమ్మా.”


అనిపూర్తిచేయఁగా తిమ్మఁడు మాఱుపలుక నేరక సెలువ నిచ్చివేసెను.” 


ఈకథవిని రాయలునవ్వి తిమ్మనికి వేఱక సేలువ నొసంగెనంట.


సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

13 -11-2021 

( కీ.శే. దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి చాటు పద్య రత్నావళి నుంచి ) 

Sunday, December 12, 2021

సమీక్ష: కొకుగారి 'అమాయకురాలు కథ చదివిన తరువాత కలిగిన నా స్పందన -కర్లపాలెం హనుమంతరావు







    • ముందు ‘అమాయకురాలు’ కథ ఏమిటో భోజనం విస్తట్లో రుచికి ఓ మూల వడ్డించే పదార్థం లాగా: 

    • వెంకటేశ్వర్లు, భ్రమర చిన్నప్పటినుంచి స్నేహితులు. వెంకటేశ్వర్లుకి పదహేడో ఏట భ్రమర మీద వికారం మొదలవుతుంది. ఆ వికారం పేరు ప్రేమ అనుకోవడానికి లేదు. కాంక్ష పుట్టనిదే ప్రేమ కలగదన్న జ్ఞానం ఇంకా వంటబట్టని వయసు వెంకటేశ్వర్లుది. భ్రమర మీద  అలాంటి ఊహ ఏదీ లేకపోవడం మూలాన అతగాడిలోనే ఒక రకమైన అయోమయం. భ్రమర పని మరీ అన్యాయం. ఇంకా రజస్వల కూడా కాని పసిది. ఈ విషయాలన్నీ ఎలా తడతాయి?
    • భ్రమరకు పెళ్లి ఖాయమైందని తెలిసి వెంకటేశ్వర్లులో అదేమిటో అర్థం కాని చిరాకు మొదలవుతుంది. 'తాను భ్రమరని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడా?' అని అతనికే ఏదో ఒక మూలన అనుమానం. అలాగైతే అలాగని వెళ్ళి తండ్రిని అడిగేయచ్చు కానీ.. ఆ తండ్రిగారి మనస్తత్వం పూర్తిగా మరీ చాలా పాత కాలంనాటి ముక్కిపోయిన సరుకు. పిల్లలకేది కావాలో నిర్ణయించాల్సింది పెద్దలేనని అతని అభిప్రాయం. పిల్లలకు సంబంధించిన విషయాలేవీ పిల్లలతో చర్చించనక్కర్లేదని, ఒక వేళ వాళ్ళ ఇష్టాలేమన్నా చెవిలో పడితే దానికి పూర్తి విరుద్ధంగా చేయడంలోనే పిల్లల క్షేమం దాగి ఉందని దృఢంగా నమ్మేవాడు. కనక వెంకటేశ్వర్లు తెగించి తండ్రితో ఏదీ చెప్పదలుచుకోలేదు. కానీ అతి కష్టంమీద.. చనువున్న అమ్మ దగ్గర మనసులోని మాట బైట పెట్టేడు. వెంకటేశ్వర్లుది, భ్రమరది ఒకే కులం. బ్రాహ్మలే ఐనా శాఖలూ ఒకటే అవడంతో చిక్కు వచ్చిపడింది. 'నోరు మూసుకోమని తల్లి మందలించేసరికి ఇక పెళ్లి ఆలోచన ముందుకు సాగదని తెలిసి మనసుతో ముసుగు యుద్ధం మొదలు పెట్టేడు. భ్రమర పెళ్ళికి వుండకుండా వెళ్ళిపోయాడు. ఎవరు అడిగినా ఉండలేదు.. ఆఖరికి భ్రమరే వచ్చి అడిగినా మెట్టు దిగిరాలేదు.
    • భ్రమర పెళ్ళికి ఉండమని అడగడంలో ప్రత్యేకమైన ఆసక్తి ఏదీ లేదనుకుంది కానీ.. ఏదో ఉందని కొద్దిగా మనసు మూలలో ఉందేమో..ఏమో.. మరీ పసిది.. ఎలా ఆలోచిస్తున్నదే అప్పటికి రచయిత బైటపెట్టలేదు మరి.
    • కాలక్రమంలో భ్రమర పెద్దమనిషి కావడమూ..కాపురానికి పుట్టింటికి వెళ్ళిపోవడమూ.. అందరు సంసార స్త్రీలకు మల్లేనే మెట్ట వేదాంతం వంటబట్టించుకోవడమూ అయింది. పుట్టింటికని వచ్చినప్పుడు వెంకటేశ్వర్లుతో ఒకసారి ఈ వేదాంత పైత్యం వెళ్లబెడుతుంది కూడా.'ఊహల్లోనే ఏ సుఖమైనా.. వాస్తవంలో అవేమీ ఉండనే ఉండవు' అని వెంకటేశ్వర్లు మనసులో మళ్లీ వికారం మొదలవడానికి కారకురాలవుతుంది.
    • భ్రమర కాపురం మూణ్ణాళ్ళ ముచ్చటవుతుంది. భర్త క్షయ వ్యాధితో రెండేళ్ళన్నా గడవకుండానే బాల్చీ తన్నేయడంతో భ్రమర పుట్టింటికొచ్చేస్తుంది. ఇంట్లో వాళ్ళ బలవంతమేమీ లేకుండానే గుండూ చేయించుకుంటుంది. ఆమె వద్దంటే బలవంత పెట్టేవాళ్లెవరూ లేకపోయినా అలా ఎందుకు వికారంగా తయారవాలోనని వెంకటేశ్వర్లు చాలా చిరాకు పడిపోతాడు. ఎదురింట్లో ఉన్నా ఒక్కసారన్నా ఆమెను చూడటానికి వెళ్ళే ప్రయత్నం చేయడు. భ్రమరకు అది కష్టంగా అనిపిస్తుంది. సిగ్గు విడిచి వెంకటేశ్వర్లు తల్లి దగ్గర తన బాధ బైటపెట్టుకుంటుంది కూడా. వెంకటేశ్వర్లు తల్లి పాతకాలం మనిషి. నవీన భావాల లోతుపాతులు పట్టించుకునేపాటి తెలివితేటలు తక్కువనే అనుకోవాలి. అందుకే వెంకటేశ్వర్లు ముందు భ్రమర గోడు బైట పెడుతుంది. వెంకటేశ్వర్లు భ్రమర శిరోముండనం చేయించుకుని తనకు అన్యాయం చేసినట్లు కోపం పెంచుకోనున్న మనిషాయ. భ్రమరను కలవడానికి వెళ్లనే వెళ్ళడు. పైపెచ్చు తన మనసులోని కచ్చను కూడా తల్లి దగ్గర వెళ్లగక్కుతాడు. ఆ తల్లి యథాప్రకారం ఈ మాటలు భ్రమరకు అమాయకంగా చేరవేస్తుంది.
    • భ్రమరలో ఆలోచనలు మొదలవుతాయి. తన తప్పు కొద్ది కొద్దిగా తెలిసివస్తున్నట్లనిపిస్తుంది. వెంకటేశ్వర్లు  తన పెళ్ళికి ముందు పడ్డ చిరాకంతా నెమరు వేసుకుంటే తన దోషం తెలిసివస్తుంది.
    • ఏదైతేనేమి  భ్రమర మళ్లీ జుత్తు పెంచుకోవడం మొదలు పెడుతుంది. చీరలు జాకెట్లు  కూడా వాడుతుందని తెలుస్తుంది వెంకటేశ్వర్లుకి. 
    • అప్రెంటిస్ పూర్తయి ఒక లాయరు గారి దగ్గర అసిస్టెంటుగా కుదురుకున్న తరువాత వెంకటేశ్వర్లుకి సంబంధాలు రావడం మొదలవుతాయి. రెండు లంకలున్న మంచి జమీందారీ సంబంధం ఖాయమూ అవుతుంది.
    • పిన్నిగారి వూరికని వెళ్ళిన భ్రమరకు ఈ విషయం తెలిసి ముళ్ళమీదున్నట్లయి పోతుందక్కడ. నెల్లాళ్ళుందామని వచ్చిన పిల్ల తట్టా బుట్టా సర్దుకుని లేచిపోతుంటే ఆ పిన్నిగారు అవాక్కయిపోతుంది.
    • బండిని నేరుగా వెంకటేశ్వర్లు ఇంటిముందే ఆపించి సామానుతో సహా లోపలికి పోతుంది భ్రమర. వెంకటేశ్వర్లు, భ్రమర చాలాకాలం తరువాత ఒకరికొకరు ఎదురవుతారు. భ్రమరను చూసి వెంకటేశ్వర్లుకు మతి పోయినంత పనవుతుంది. ఆ క్షణంలో తను అప్పటిదాకా అనుకుంటూ వచ్చిన 'ఉచ్చిష్టం' ఊహ గుర్తుకే రాదు. పెదాలుకూడా సన్నగా వణుకుతాయి కాని మనసులోని మాటను ధైర్యంగా బైటపెట్టలేని పిరికితనం ఎప్పటిలా అలాగే  ఉంటుంది చెక్కుచెదరకుండా. అక్కడికీ భ్రమరే కాస్త సాహసం చేసి నర్మగర్భంగా మాట విడుస్తుంది కూడా.'వెంకటేశ్వర్లూ! నీ పెళ్ళి అని తెలిసి ఉండలేక వచ్చేశా' అంటూ. వెంకటేశ్వర్లులోని పిరికి మనిషి స్పందించడు. భ్రమర తెచ్చుకున్న పెట్టే బేడాతో తిరిగి సొంత ఇంటికే వెళ్ళి పోతుంది. వెంకటేశ్వర్లు తండ్రి దగ్గర ఏదో చెప్పాలనుకుంటాడు కానీ.. తీరా అతను చూసే అసహ్యపు చూపులు గుర్తుకొచ్చి నోరు పెగలదు. ఏదో సందర్భంలో భ్రమరను కలవాలని వచ్చిన వెంకటేశ్వర్లుకి ఆమె గదిలో ఏడుస్తూ కూర్చుని ఉండటం.. గదంతా అసహ్యంగా ఆమె కత్తిరించుకున్న జుత్తు వెంట్రుకలతో నిండి వుండటమూ చూసి వెనక్కి వచ్చేస్తాడు. 
    • వెంకటేశ్వర్లు పెళ్ళి అవుతుంది. భ్రమరను తలుచుకుందామని అనుకున్నప్పుడల్లా జుత్తులేని ఒక  ఒంటరి ఆడదాని ఏడుపు వికారపు మొహం గుర్తుకొచ్చి తలుచుకోవడమే మానేస్తాడు.
    •  
    • నా సమీక్ష :

    • ఇది నిజానికి ఒక ప్రేమ కథ. వెంకటేశ్వర్లు, భ్రమర ఒకరినొకరు ఇష్టపడ్డ మాట నిజం. మొదట్లో అది ఇష్టమని తెలీక కొంత.. తెలిసినాక ఏ రకమైన ఇష్టమో తేల్చుకోలేక అయోమయంలో పడి కొంత తంటాలు పడ్డారు ఇద్దరూ. భ్రమరకన్నా ఆ ఇబ్బంది ఎక్కువగా వెంకటేశ్వర్లే పడ్డాడు. ఏ దశలోనూ కాస్తంతన్నా సాహసం చూపించలేని పిరికివాడికి ప్రేమ దక్కేది ఎలా? భ్రమర తనను కాకుండా వేరే ఎవరినో ఎంచుకున్నదని ముందులో కొంత.. శాఖాంతరం కాకపోవడం మీద కొంత.. ఎలా ఎవరిమీదో.. వేటిమీదో కంటికి కనబడని వాళ్ళమీదా.. కారణాలమీదా పెట్టి మానసిక తృప్తి పొందాడే కాని.. మనసులో నిజంగా ఉన్నదేమిటో.. దాన్ని సాధించడానికి చేయాల్సినదేమిటో ఎప్పుడూ యోచన చేయని నిష్క్రియాపరుడైన ప్రేమికుడు వెంకటేశ్వర్లు. భ్రమర అతనికన్నా ఎన్నో రెట్లు మెరుగు. పసిదనం వదిలి ఊహ వచ్చిన దశలో భర్తతో కాపురానికి మెట్టవేదాంతంతో సర్దుకునే పరిపక్వత చూపించింది. వెంకటేశ్వర్లు మనసు అర్థమయి.. తన మనసు తనకు అర్థమవడం మొదలయిన తరువాత వీలైనంత సాహసం చేయడానికి కూడా వెనకాడ లేదు. పాపం.. ఆడదై పుట్టడం.. వెంకటేశ్వర్లు వంటి పిరికివాడు తటస్థపడడం వల్ల విఫల ప్రేమికురాలైంది భ్రమర.
    • ప్రేమించుకున్న జంటను విడదీయడానికి సంఘం తరుఫు నుంచి ఎప్పుడూ ఏవేవో అభ్యంతరాలు.. కుట్రలూ ఉంటూనే ఉంటాయి. వాటిని తోసిరాజని ప్రేమను పండించుకునే సాహసికులు కొందరైతే.. చాలామంది తమ మానసిక దౌర్బల్యంతో యుద్ధం చేయడం మాని సంఘాన్ని తప్పుపట్టేసి సెల్ఫ్ సింపతీతో సంతృప్తి పడే సర్దుబాటు చూపిస్తారు అని చెప్పదలుచుకున్నట్లుంది ఈ 'అమాయకురాలు' కథలో కొడవటిగంటి వారు.  నిత్యహరితమైన సమస్య!ఎంతో చెయ్యి తిరిగుంటే తప్ప ఇలాంటి కథను ఎన్నుకుని కడదేర్చడం కుదరదు.
    • ఎప్పటిలాగానే కుటుంబరావు గారు సంఘదురాచారాలని.. మానసిక డొల్లుతనాన్ని తనదైన నిశ్శబ్ద శైలిలో చాలా బలంగా ధ్వనించిన తీరుతో గొప్ప కథై కూర్చుంది అమాయకురాలు కథ. కథనం ఆయన మిగతా అన్ని కథల ధోరణిలోనే చాప కింద నీరులాగా ఆలోచనాపరుల మనసులను ముంచెత్తుతుంది.
    • ఎప్పుడో పంథొమ్మిది వందల ముప్పైతొమ్మిదో ఏట రాసిన కథ. వైధవ్యం..శిరోముండనం వంటి దురాచారాలు లేని ఈ కాలంలో కూడా  మానసిక కోణంనుంచి కొకుగారు కథను ఆవిష్కరించిన తీరు కథను ఎప్పటికీ పచ్చిగా.. తడిగానే ఉంచుతుంది.
    • కొకుగారు కథనంలో వాడే పలుకుబళ్ళు,  వాక్యాలలోని ముళ్ళు.. ఎప్పటిలాగానే ఆయన అభిమానులను కథ అంతటా అలరిస్తుంటాయి.
    • -కర్లపాలెం హనుమంతరావు
    • బోథెల్, యూఎస్ఎ

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...