Saturday, December 18, 2021

పాత బంగారం : కథానిక కథ: భారతి - మాస పత్రిక - నవంబరు, 1986 నిరీక్షణ - ఎ.వి. వి. ఎస్. ఎస్. ప్రసాద్ సేకరణ : కర్లపాలెం హనుమంతరావు




 



పాత బంగారం : కథానిక 

కథ: భారతి - మాస పత్రిక - నవంబరు, 1986 

నిరీక్షణ 

- ఎ.వి. వి. ఎస్. ఎస్. ప్రసాద్ 

సేకరణ :  కర్లపాలెం హనుమంతరావు 


యంత్రంలా సాగిపోతున్న జీవన సరళిలో అతనిరాక ఒక గొప్ప అనుభూతి. 


జీవితంలో ఎదురైన చేదు అనుభవం అతని జీవితాన్నే మార్చేసింది. అనుభూతినే ఊపిరిగా పీలుస్తూ దూరమై పోయిన 'ఆనందాన్ని ఆస్వా దించడానికి, అందుకోడానికి ప్రయత్నిస్తున్నాడతను....


నిరీక్షణలో మాధుర్యాన్ని అనుభవిస్తున్నాడా? |


ఆదో విచిత్రమైన స్థితి.అతనిది:


అనందం లాంటి విచారం . విచారం లాంటి ఆనందం


అదో చిన్న రైల్వే స్టేషన్.

నేనక్కడ అసిస్టెంట్ స్టేషన్ మేష్టార్ని.


ఈ ప్రాంతానికి బదిలీ అయి దాదాపు రెండేళ్ళు అయ్యింది. ఇక్కడ కొచ్చిన కొత్తలో ఇక్కడి వాతావరణం అలవాటు అవ్వడం కాస్త కష్టమే అయ్యింది. 


పట్నంలో పుట్టి పెరగడంవల్ల పల్లెటూరి వాతావరణం కొత్తగా, కొంచెం ఇబ్బందిగా వుంది... వచ్చిన రెండో రోజునే, జలుబు.... జ్వరం.....


వైద్య సహకారాలు పెద్దగాలేవు. ఏదో అదృష్టం బాగుండి ఓ వారం తరువాత కోలుకున్నాను.  తరువాత క్రమేణా వాతావరణానికి అలవాటు వడ్డాను. వాతావరణంతో 'అవగాహన' ఏర్పడ్డాకా, అక్కడి జనం, వాళ్ళ వేషభాషలు కూడా అర్ధమయ్యాయి. 


అంతా అర్థమయ్యాకా, అంతా ఆనందమే! అక్కడి వాళ్ళతో నేను కలిశాను. నాతోవాళ్ళు కలిశారు. స్టేషన్లో పెద్దగా పనులు వుండవు. ఎక్స్ ప్రెస్ బళ్ళు వచ్చినప్పుడు సిగ్నల్స్ చూ పెట్టడం.... రెండే రెండు 'ఎక్స్ప్రెన్సులు' వస్తాయి రోజుకి . అవి ఉదయం  వేళలలో రావడంతో... దాదాపు మధ్యాహ్నమంతా ఖాళీయే: 


మళ్ళీ సాయంత్రం ఆరింటికి ఓ ప్యాసింజర్ వస్తుంది. దాంట్లోంచి ఒకరిద్దరు కన్నా దిగరు. వెళ్ళేవాళ్ళు ఒక్కొసారి అసలు వుండరు. అడపా దడపా నాలుగైదు గూడ్స్ బళ్ళు వస్తుంటాయి. అందుకే పెద్దగా పన్లు ఉండవు . వున్నా వున్నట్టు అనిపించదు.


ఏడాది కొకసారి ఈ ప్రాంతంలో తిరునాళ్ళు లాంటిది జరుగుతూ వుంటుంది. అప్పుడే కాస్త రద్దీగా వుంటుంది. అందుకే.....


ప్రొద్దున్నుండి సాయంత్రం వరకు గడవడం పొద్దు బోదు . కానీ వుద్యోగ ధర్మం తప్పదు.


రోజంతా భరించలేని వేడిమిని భరించడంవల్ల సాయంత్య్రం కోసం, సాయింత్య్రం వీచే చల్లని పిల్లగాలులకోసం ఎదురు చూడడం నా జీవితంలో నిత్యకృత్యమయి పోయింది. ఇక్కడి సాయంత్రం  నిజంగా చాలా అందంగా వుంటుంది.


ఆ అందానికి వన్నె తెస్తూ. ప్రకృతి సంధ్యారాగ సంకీర్తన! 

దూరంగా గూళ్ళవైపు సాగిపోతున్న పక్షుల గుంపులు. ఏవో నందేశాలు

హడావిడిగా మోసుకుపోతూ నీలిమేఘాలు. 

పిల్లగాలి కెరటాల సప్తస్వరాలు.

నిశ్శబ్ద సౌందర్యం.


అలాంటి సమయంలో

' అతను'  వస్తున్నాడు.


అతని పేరు తెలీదు. దాదాపు ఏడాది నుండి వస్తున్నాడు.


మా యిద్దరి మధ్య మాటల్లేవు. చూపులతోనే పలకరింత.


అందమైన నిశ్శబ్దం ఇద్దరిమధ్య.


ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టు ప్యాసింజర్ వచ్చే వరకు చూస్తాడు.


వచ్చేకా, అది వెళ్ళే వరకు అన్ని బోగీల్లోకి చూస్తూ, అటునుండి ఇటూ,

నుండి టూ తిరుగుతాడు.


రైలు కదిలేవరకు అక్కడే  వుండి, కదిలాకా, భారంగా ఓ నిట్టూర్పు విడిచి, మెల్లగా అడుగులో అడుగువేసుకుంటూ వెళ్ళిపోతాడు.. ఇక్కడికి దగ్గర్లోవున్న పల్లె.. దాదాపు మూడుమైళ్ళ దూరం. 


రోజూ అంత దూరంనుండి ఎందుకు వస్తున్నట్లు? పోనీ అతని కోసం ఎవరైనా వస్తారా? 

ప్స్! . . ఎవరూ రారు.


ఒకసారి పోర్టర్ వెంకటయ్య మాటల్లో తెలిసిందేమిటంటే- అతను దగ్గర్లో వున్న పల్లెటూరిలోని పాఠశాల మేష్టారు. దాదాపు ఏడాది అయ్యిందిట ఆవూరు వచ్చి మనిషి.  బక్కపలచగా వుంటాడు. పెద్ద ఎత్తుగా వుండడు, వదులైను ఫాంట్, లూజ్ షర్ట్ వేసుకుంటాడు. నిర్మలంగా వుండే మొహంలో కొద్దిగా జాలి, ఎక్కువగా కరుణ

కన్పిస్తాయి. కళ్లాల్లో  మాత్రం ఏదో లోతుచూపులు. ఏదో పోకొట్టుకున్న తున్నట్టు వుంటాయి,


" అమాయకుడిలా వుంటాడు" అని అంటాడు వెంకటయ్య. 

ఎండైనా -


వానైనా -


చలైనా -


వచ్చేవాడు. వస్తున్నాడు. ఇంత శ్రమపడి రావడ మెందుకు?


ప్రశ్నకి ఎంత ఆలోచించినా జవాబు దొరకడం లేదు.


మధ్యాహ్న నుండి వాతావరణం ఆదో మాదిరిగావుంది. మేఘాలు కమ్ము కున్నాయి. రివ్వున ఈదురు గాలులు వీస్తున్నాయి. చినుకు ఏ క్షణానైనా రావొచ్చు. చలికి ధరించలేక స్వెట్టర్ వేసుకున్నాను. యింకా అరగంట వేచివుండాలి ... ప్యాసింజర్ కోసం.

గాలి విపరీతంగ వీస్తోంది . దగ్గర్లోవున్న చెట్లు 'లయ' గా తలలు వూపుతున్నాయి.

గాలి గంభీరంగా అరుస్తోంది.


క్షణంలో... చూస్తుండగానే... గాలి కెరటాల పురవడిలోంచి చినుకులు పడడం ప్రారంభించాయి...బంగారు తీగెలా మెరిసే మెరుపు... ఆకాశాన్ని చీలుస్తూ 

కుండపోతగా........

ధారలు ధారలుగా వర్షం....


' ధన్...' దూరంగా ఎక్కడో పిడుగు పడింది..


ప్రకృతి భీభత్సంగా తయారయ్యింది..


హోరు మనిగాలి.. అంతకంతకు  చినుకులు.. పిడుగు శబ్దం.... చినుకులు...


తాండవం చేస్తున్నాయి....


గాలీ. . వానపోటీ పడ్తున్నాయి....


స్టేషన్లో కరెంటు పోయింది.... లాంతరు వెతికి, దీపం వెలిగించడం గగనమయ్యింది. పోర్టర్ కూడలేడు.  వూళ్ళో ఎవరో బంధువులు వచ్చేరని, చూడడానికి మధ్యాహ్నమే వెళ్ళాడు.

చీకటి తెరలు అలుముకుంటున్నాయి.

భయ కంపితుడ్ని చేస్తోంది ప్రకృతి! 


అరగంట గడిచింది తెలీకుండానే. 

ఫోన్ మోగింది. ప్యాసింజర్ గంట లేటుట. పక్క స్టేషన్నుండి వర్తమానం వచ్చింది.


మరో పావుగంట తరువాత.....


చినుకులవేగం తగ్గింది. లాంతరు వెలుతురులో దూరంనుండి ఎవరో వస్తూ కన్పించారు. వెంకటయ్య అనుకున్నాను వస్తున్నది


' అతను' హడావిడిగా వస్తున్నాడు. తలమీదో గుడ్డ కప్పుకున్నాడు. మనిషిదాదాపు తడిసిపోయాడు.


' మేష్టారూ! ...ట్రైన్ వచ్చిందా?" ఆత్రంగా అడిగాడు, మెల్లగా వణుకు 


తున్నాడు. 


" లేదండి.. గంటలేటు.... "అన్నాను.


“....ఇలా బయటికు  అడుగు వేశానో లేదో ... మొదలయ్యింది . 

 చిన్న వానే అనుకున్నా, బాగా తడిపేసింది....." అన్నాడు అలా దూరంగా చూస్తూ. 


అదృష్టం బాగుండి కరెంటు వచ్చింది. తువ్వాలు వెతికళ్ళల్లోకి కృతజ్ఞతగా చూశాడు. 


" ట్రైన్ వచ్చేవరకుఇక్కడే వుండండి! బాగా కురుస్తోందివాన...." అన్నాను. 


అక్కడే వున్న కుర్చీ అతని వైపు జరుపుతూ. 


దానిమీద కూర్చొని వాన లోకి చూస్తున్నాడు


 " ఏవండీ.... రోజూ వస్తున్నారు..... ఎవరేనా బంధువులు వస్తారా .... వస్తున్నారా?" 


ప్రశ్న ఎలావేయాలో తెలీలేదు. తెలుసుకోవాలనే కుతూహలం ఆ ప్రశ్న వేసింది.


అతను జవాబు చెప్పలేదు.


“.. ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకండి!  దాదాపు మిమల్ని ఏడాది నుండి గమనిస్తున్నాను. వస్తున్నారు.... వెళుతున్నారు...."అన్నాను.


క్షణం తరువాత.. 


"ఎవరూ రారండి.... వస్తారేమోనని ఆశ..." అని క్షణం ఆగి "నిరీక్షణలో బాధకన్నా ఆనందమే ఎక్కువగా వుంది...." అన్నాడు.


అర్ధం కానట్టు చూశాను. అతను చెప్పడం కొనసాగించాడు. “.... ఇన్నాళ్ళు మీరు నన్నడగలేదు.... కానీ.... మీకో విషయం తెలుసా?"


ఏమిటన్నట్టు చూశాను,


“... ఎప్పుడూ మీతో చెద్దామనే ప్రయత్నించాను. కానీ.... అవకాశం రాలేదు." నేను ఆశ్చర్య పోయాను. 


కష్టాన్నైనా, సుఖాన్నైనా మరొకరితో చెప్పుకుంటే, కాస్త ఓదార్పు కలుగుతుందంటారు" అని వానలోకి క్షణంచూసి. . " ఒక్కో మనిషి జీవితం ఒక్కోరకం.... విధాతనృష్టి విచిత్రం. మనిషికి మమతానురాగాల మధురిమని అందిస్తాడు ... రుచినంపూర్ణంగా ఆస్వాదించ

కుండానే దూరం చేస్తాడు. క్షణం వనంతం. క్షణం శిశిరం. జీవితం సుఖ దుఃఖాల సమ్మేళనం...." అని ఆగి "మీకు విసుగ్గావుందాః" అని తెచ్చి పెట్టుకున్న నవ్వు నవ్వాడు. 


కాగితం పూవులా వుందా నవ్వు.


" లేదు..లేదు..ఇదో విచిత్రమైన అనుభవం! చెప్పండి...." అన్నాను  ఆసక్తిగా  ముందుకు వంగుతూ....


నా ఆసక్తిని చూసి, మెల్లగా నిట్టూర్పు విడిచి కొనసాగించాడు. 

చినుకుల శబ్దం..అపరిచిత వ్యక్తి మాటలు ..విచిత్రానుభూతి..... చిత్రమైన కుతూహలం..


" నా జీవితం మొదటినుండి ఒక రకమైన ఆప్యాయతలకి అనురాగాల! 

చేరువుగా వుంది. మా తాతయ్య వాళ్లది ఉమ్మడి కుటుంబం. తాతయ్యకు  యిద్దరు కొడుకులు . ఒకరు వ్యవసాయం. మరొకరు వుద్యోగం. పాత బంగారం : కథానిక 

కథ: భారతి - మాస పత్రిక - నవంబరు, 1986 

నిరీక్షణ 

- ఎ.వి. వి. ఎస్. ఎస్. ప్రసాద్ 

సేకరణ :  కర్లపాలెం హనుమంతరావు  గారికే వుద్యోగం . వుద్యోగరీత్యా అయిన వాళ్ళందరికి  దూరంగా వుండవలసి వచ్చింది. తాతయ్య చాలాసార్లు నాన్నతో అన్నాడు. " నీకా వుద్యోగం.... ఎందుకురా?  హాయిగా యిక్కడే వుండకా?" అని. 

నాన్నగారికి వ్యవసాయ మంటీ  యిష్టంలేదు. ఎట్టి పరిస్థితిల్లోను కనీసం ఏడాదికోసారైనా, తాతయ్య గారింట్లోగడపాలనే షరతుమీద తాతయ్య నాన్నగారు పుద్యోగం చేయడాన్ని వప్పుకున్నాడు." అని ఆగి రెండు క్షణాలు దూరంగా చూస్తుండిపోయాడు . 


 గాలి హోరు తగ్గుతోంది క్రమేణా. చినుకులు మెల్లగా చిందులు చేస్తున్నాయి. 


" ఆ ఏడాది స్కూలుకి వేసవి సెలవులు యిచ్చారు. బాబయ్య ఏదో పనిమీద మా  ఊరు వస్తే ! నాన్నగారు వాళ్ళు బాబయ్యితో తాతయ్య గారింటికి పంపారు నన్ను. లీవ్ శాంక్షన్ అయ్యాక, అమ్మా, నాన్న, చెల్లి వస్తామని.. " 


మెరుపు మెరిసింది... ఒకసారి కాంతి వెల్లువ .  మళ్ళీ మాములే. సిగ్నల్ లైట్ డిమ్ గా వెలుగుతోంది.


"నాన్నగారు వాళ్ళు వస్తామన్న రోజు.... నేనూ బాబయ్య స్టేషన్లో ఎదురు చూస్తున్నాము .  అప్పటికి అమ్మా వాళ్ళని వదిలివారం రోజులయ్యింది..


నాకు బెంగగావుంది. అమ్మవస్తే ఆమె ఒడిలో ఒదిగి పోవాలని కోరిక. అదే మొదటిసారి వాళ్ళని విడిచి వుండడం. ఎదురు చూస్తున్నాము. ఎంత సేపటికి ట్రైన్ రాలేదు. కొంతసేపటికి తెలిసింది అమ్మావాళ్ళు ఇంకరారని. వేగంగా వస్తున్న రైలు పట్టాలు తప్పి... 

స్పష్టంగా కన్పిస్తున్నాయి కను కొలుకుల్లో కన్నీళ్లు.


గొంతులో స్పష్టంగా జీర.


"..ఆరోజు నుండి ఆదో అలవాటుగా మారిపోయింది. వస్తున్న ఏ రైలుని చూసినా నా వాళ్లు వస్తున్నారని... 'నా బంగారు కొండ' అనే అమ్మ, "వెధవా! ఏం చేస్తున్నావ్?" అనే నాన్న అన్నయ్య నన్ను భయపెడ్తారని 


అమ్మతో చెప్పి కొట్టించి....బూదచాడికి  యిప్పించేస్తా!  అనే చెల్లి వస్తారని ఏదో లాంటి విచారం ఎదురుచూపు...


దూరంగా రైలు వస్తున్న కూత విన్పించింది. అతను మెల్లగాలేచాడు. స్టేషన్లోకి వస్తున్న రైలుకేసి అడుగులు వేస్తున్నాడు.


చిన్న చిన్న చినుకులు పడ్తున్నాయి. చినుకుల మాటున మసక వెలుతురు దాటున మెల్లగా వెతుక్కుంటూ సాగి పోతున్నాడతను.

రైలుని చూసిన అతని మొహంలో స్పష్టమైన మార్పు. 

 ఆనందమాః విచారమా?


మరో పది నిముషాల తరువాత.


రైలు కదుల్తోంది....


అతను మెల్లగా సాగుతున్న రైలుతోపాటే నడుస్తున్నాడు.


బోగీలో ఎవరితోనో మాట్లాడుతున్నాడు....


మాటల్లో నవ్వుతున్నాడు.


నవ్వుతున్నా. 


 కనుకొలకుల్లో ఆ కన్నీళ్ళెందుకు?

***

పాత బంగారం : కథానిక 

కథ: భారతి - మాస పత్రిక - నవంబరు, 1986 

నిరీక్షణ 

- ఎ.వి. వి. ఎస్. ఎస్. ప్రసాద్ 

సేకరణ :  కర్లపాలెం హనుమంతరావు 


   

   

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...