Wednesday, June 10, 2015

కవికి ఏం కావాలి? కర్లపాలెం హనుమంత రావు





కవిత్వానికి నిర్వచనం ఏమిటి?

కవులెంతమందో కవిత్వానికి నిర్వచనాలన్ని. అదనంగా సాహిత్య విమర్శకుల శాస్త్రీయ నిర్వచానాలు.
The best in the best order is “Emotions recollected in Tranquility” అంటారు  శ్రీశ్రీ.
అల్లసాని పెద్దన గారి లెక్క ప్రకారం కవిత్వం”రాతిరియుం బవల్ మరపురాని హోరు”
చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి గారు ఒకసారి కవిత్వాన్ని గురించి అరగంట మాట్లాడతానని చెప్పి మధ్యాహ్నం 3గంటల్నుంచీ రాత్రి 8గంటలదాకా ఏకబిగిన ఉపన్యాసం చేశారుట. కవిత్వ పరిధి అంత విస్తృతమైనది మరి.
ప్రపంచమంతా కవితావస్తువే కదా!’ మరిచి పోయేది చెత్త.. జ్ఞాపకంలో మిగిలుండేది కవిత్వం’ అన్నది కూడా ఆయనే. లోకుల రసనలే తాటాకులుగా వేమన పద్యాలు తెలుగులోకంలో నేటికీ  నిలిచి వుండటమే దీనికి మంచి ఉదాహరణ.
శ్రీపాదకృష్ణమూర్తి గారు భారతం మొత్తాన్ని ఒంటిచేత్తో పద్యాలుగా రాశారు. చదివినంతసేపూ బాగానే ఉన్నా తిరిగి చెప్పమంటే ఒక్కటీ చప్పున గుర్తుకు రాలేదంటారు  శ్రీశ్రీ!
విలియమ్ సారోయిన్ ప్రఖ్యాత short story రచయిత. The Latest Position In Modern American Poetry అని శీర్షిక పెట్టి తనకు తోచినదంతా ఒక క్రమంలో కథగా రాసేవాడుట.కథ పూర్తయిన తరువాత ఆ శీర్షికను తీసేసి కథకు తగిన Title పెట్టుకోవడం ఆయన అలవాటు. కథకు కూడా పొయిట్రీనే ప్రేరణ అని చెప్పటానికి ఈ పిట్ట కథ చెప్పింది.

ఇక తెలుగు కవిత్వానికి వస్తే…
నన్నయగారు ఆదికవి అని మనందరి అభిప్రాయం. అంటే ఆయనకు ముందు కవిత్వం అసలే లేదా! ఉంది. జానపదుల ప్రపంచం నిండా ఉండేది కవిత్వమే. కాకపోతే అది గ్రంధస్థం అవడానికి నోచుకోలేదు. ఆ గాసటబీసటలు చదివి ప్రేరణ పొంది సంస్కరించి వాగనుశాసనుడయ్యాడు నన్నయభట్టారకుడు.
ప్రపంచం అంతటా ఈ ధోరణే ఉంది. కవిత్వం అంటే అక్షరబద్ధమైనదేనా! Haves poetry(కలవారి కవ్విత్వం) ఉన్నట్లే లేని వారికీ కవిత్వం ఉంటుంది. అది శిష్టసాహిత్యం కన్నా పాతది కూడా. నన్నయ గారికన్నా ముందు నదుల్లో నావలు నడుపుకునే వాళ్ళూ, పొలంపనులు చేసుకునే కూలీనాలీ పాటకజనం  నోట నలిగిందీ కవిత్వమే. మల్లంపల్లి సోమశేఖరశర్మగారి మాటల్లోఅది 'అనాఘ్రాత వాజ్ఞ్మయం’.

ఇంక ఆధునికతకు వస్తే…


గురుజాడగారు ముత్యాలసరాలు రాసిందాకా తెలుగుకవిత్వం ధర్మంలాగా పద్యాల్లో నాలుగు పాదాల మీదే కచ్చితంగా నడిచింది. చంపకమాలైనా.. శార్దూలమైనా రథవేగం సాధించాలంటే  నాలుగు చక్రాలే ఆధారం. అప్పటికి రథవేగం గొప్పది. రైలింజను వచ్చిన తరువాత Horse Power  గొప్పయింది. విమానాలు ఎగరడం మొదలయిన తరువాత వాయువేగం మీదే అందరి దృష్టి. ఇప్పుడయితే రాకెట్ వేగాన్ని కూడా అధిగమించే ఉపగ్రహాల వేగం తెలిసిందే. పెరిగే వేగాన్ని అందుకోవడానికి కవులకూ కొత్తకొత్త ప్రక్రియల్లో ప్రయోగాలు చేయడం అవసరం అయింది. నత్తనడకను చీదరించుకునే కొత్త తరాన్ని అందుకోవడానికి కవులు కనిపెట్టిన అతినవీన అద్భుతం అత్యంత వేగంగా పరుగులెత్తే వచన పద్యం.

తెలుగులొ 30వ దశకంలొ ఊపందుకున్న ఈ ప్రక్రియకు పాశ్చాత్య సాహిత్య ప్రపంచంలో అంతకుముందే వచ్చిన ప్రయోగాలు ప్రేరణ. 30వ దశకాన్ని Hungry Thirties అంటారు.ఇప్పటికన్నా ఎక్కువ ఆర్థికమాద్యం ముమ్మరించిన కాలం అది. స్పానిష్ సివిల్ వార్ జరిగింది  ఆ దశాబ్దంలోనే. ప్రపంచమేధావులు మొత్తం రెండువర్గాలుగా చీలిన  పరిస్థితి. స్పానిష్ యుద్ధాన్ని ఖండిచిన వాళ్ళు కాగితాలతో కలాలతో పోరాటం మొదలుపెట్టారు. రాల్స్ ఫాక్స్ , క్రిస్ట్ ఫర్, కాండ్ వెల్, స్టీఫెన్ స్పెండర్ లాంటి కవులైతే ఏకంగా ఇంటర్నేషనల్ ఆర్మీలోనే చేరిపోయారు. 'కవి అన్నవాడు కల్లోలప్రపంచానికి దూరంగా కళ్ళుమూసుకుని కూర్చోనుండరాదు’ అన్న భావానికి ఊతం పెరుగుతున్న రోజులు అవి. ఆ ప్రభావంతోనే శ్రీశ్రీ లాంటి ఉష్ణరక్తపు యువకులు అంతకు ముందుదాకా రాస్తున్న సాంప్రదాయక కవిత్వాన్ని కాదని కొత్త పల్లవి ఎత్తుకున్నారు. శ్రీశ్రీ మహాప్రస్థానంలోని చాలా గీతాలు 30వ దశకంలో రాసినవే. గమనించండి. భావకవిత్వ ప్రచారకుడు కృష్ణశాస్త్రి కూడా అభ్యుదయ రచయితల సంఘ వార్షికోత్సవ సభకు అధ్యక్షత వహించారు ఆ రోజుల్లో ఒకసారి.

1970దాకా ఒక వెలుగు వెలిగింది అభ్యుదయ కవిత్వం. నూనె ఐపోయిందో.. వత్తి సారం  తగ్గిందో.. మెల్లిగా కొడిగట్టడం మొదలుపెట్టింది.
శ్రీకాకుళోద్యమం ప్రేరణతో విప్లవ కవిత్వం ప్రభ మొదలయింది.
1910 లో తోకచుక్క రాలినప్పుడు గురుజాడవారు మొదలు పెట్టిన ముత్యాలసరాలు లగాయితు కవిత్వం ఇప్పటిదాకా పోయిన.. పోతున్న వన్నె చిన్నెలన్నీ చర్చించడం ఇక్కడ అప్రస్తుతం. ఇప్పుడు నడుస్తున్న కవిత్వానికి  మాత్రం  అస్తిత్వవాద, వైయక్తివాదాదులే ప్రధాన భూమికలుగా ఉన్నాయన్న ఒక్క మాటతో స్వస్తి చెప్పుకుంటే సరిపోతుంది.
వరదపోటులాగా వచ్చిపడుతోంది కవిత్వం ఇప్పుడన్ని దిక్కుల్నించీ. చందోబంధనాలు, వ్యాకరణాల సంకెళ్ళు వంటి ప్రతిబంధకాలు లేకపోవడం.. భాషాసారళ్యం వల్ల ఎంత సున్నితమైన భావాన్నయినా కవిత్వరీకరించవచ్చన్న స్పృహ పెరగడం, ప్రపంచీకరణ, అధునాతన సాంకేతిక విజ్ఞానప్రగతి,  సంక్షుభిత సామాజిక పరిస్థితులు, గణనీయంగా పెరుగుతున్న చదువరుల సంఖ్యాపరిమాణాలు, ఆత్మగౌరవ ఆకాంక్షలు, అపరిమితమైన భావవ్యక్తీకరణ స్వేచ్చ నేటి కవిత్వవికాసానికి కొన్ని ప్రధాన ప్రేరణలు, కారణాలు.
కవిత్వం పెరగడం సంతోషించదగ్గ పరిణామమే. మరి ప్రమాణాల సంగతి? వరదంటూ వచ్చిన తరువాత మంచినీటితో పాటు మురుగునీరూ కలిసి ప్రవహించడం సహజమేగా! కొంతకాలానికి తేటనీరు పైకి తేరుకొని.. రొచ్చు అడుగున మిగిలిపోతుందనుకోండి. కాకపోతే మడ్డినీరే ఎక్కువగా కలిస్తే మంచినీరూ ఉపయోగించకుండా వృథా ఐపోతుంది. అదీ బాధ.
ఇంత ఉపోద్ఘాతమూ ఎందుకంటే..  అక్షరం అందుబాటులో ఉన్న ఉచిత వనరు కనక కనిపించిన ప్రతిసన్నివేశమూ, అనిపించిన ప్రతి భావావేశమూ ఔత్సాహిక కవులు కవితాలంకరణకు అర్హమైనదే అనుకునే ప్రమాదమూ పెరిగిపోయింది. విస్తృతమైన అధ్యయనం, సమాజాన్ని సరైన కోణంలో పరిశీలిస్తున్నామా లేదా అన్న విచక్షణ, వ్యక్తిగతమైన భావోద్వేగాల పరిమితుల స్పృహ కొరబడుతుండటం వల్ల అకవిత్వమూ కవిత్వం పంక్తిలోకి జొరబడుతున్నది. వచనకవిత అంటే వచనాన్నే కవితగా అనుకుని రాయడం కాదు. అలంకారరహితం అంటే.. నిరలంకారంగా రాసుకుపోవడం కాదు. వట్టి స్లోగన్సు కవిత్వం ఎన్నటికీ కాదు.. వాటి వెనుక ఒక తాత్వికనేపథ్యం లేకపోతే. ‘Workers Of The World..Unite!' శ్రామిక వర్గం మొత్తాన్ని ఏకం చేసిన విప్లవ నాదం. కవిత్వానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ప్రభావం చూపించింది. స్పెయినీష్ బార్శిలూనా సమరంలో’లాషాపనారా' (ముందుకడుగు వేయనీయం)అన్న స్పెయినీష్ సోల్జర్ల నినాదం ఆనాటి సమాజంమీద  చూపించిన  ప్రభావం అంతా ఇంతా కాదు.  పదమా?..నినాదమా? అన్నది ప్రధానం కాదు. అది కవిహృదయంలోని రసానుభూతిలో  మగ్గి బాహ్యప్రపంచాన్ని కదిలించేదై  ఉండాలి. ‘కదిలేదీ కదిలించేదీ/ పెనునిద్దుర వదిలించేదీ’ అని అతిసరళంగా శ్రీశ్రీ నిర్వచించింది  ఈ భావాన్నే!
కవికి తన మాట మీద అధికారం ఉండాలి. చిత్రకారుడికి గీతలాగా, సంగీతవేత్తకు స్వరంలాగా,శిల్పికి శిలలాగా కవికి పలుకు పరికరం. పికాసో అంతటి చిత్రకారుడు ’Probably I am not an Artist.. I am not a Painter.. I am a Draftsman’ అని చెప్పుకున్నాడు. కళాకారుడికి ముందు తనను గూర్చి తనకు ఒక కచ్చితమైన అంచనా అవసరం. కవీ కళాకారుడే కదా!
పోతన.. శ్రీనాథులే ఇందుకు మనముందున్న  మంచి ఉదాహరణలు. ’మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు వోవునే మదనములకు?’ అన్న పోతన మంచిపద్యం వినడానికీ వీనులవిందుగానే ఉంటుంది. కానీ.. కవిత్వకోణం దృష్ట్యా చూస్తే మాత్రం ముందు వచ్చే సందేహం.. ’కవి మాటలను నడిపిస్తున్నాడా?.. మాటలు కవిని నడిపిస్తున్నాయా?’ అని. శ్రీనాథుడి శివరాత్రిమాహాత్మ్యం పద్యం చూడండిః ‘నిష్ఠాసంపదనర్ఘ్యపాణులగుచున్ విపుల్ బ్రశంసింప, మంజిష్ఠారాగము మండలంబున నధిష్ఠింపన్ నిలింపాది భూకాష్ఠా మధ్యంబున తోచెన్/శతాంగాభ్రష్ఠ సర్పద్విష జ్యేష్టుండప్పుడు నిష్టుర ప్రసర బంహిష్ఠద్యుతిశ్రేష్ఠతన్' (తూర్పుదిక్కున అనూరుడు వెలిగాడు-అని అర్థం) అర్థం గురించి కాదు ఇక్కడ చెబుతున్నది. ఛందోనియమం ప్రకారం ప్రాసస్థానంలో నాలుగు చోట్ల 'ష్ఠ' వస్తే చాలు. కానీ శ్రీనాథుడు ష కింద ‘ఠ’ వత్తు పెట్టి ఎన్నెన్ని మెలికలు తిప్పాడో చూడండి! భాషమీద అధికారం గలవాడు మాత్రమే చేయగల గడసాము అది. అంతటి అధికారం ఉన్నప్పుడు అక్షరం చేత ఎంతటి ఊడిగం ఐనా చేయించుకోవచ్చు. విస్తృతమైన పఠనం, గాఢమైన అనురక్తి, సునిశితమైన పరిశీలనాశక్తి.. ఎంచుకున్న ప్రక్రియమీద సరైన అవగాహన అభివృద్ధి పరుచుకున్న వారెవరైనా పదికాలాల పాటు జనం గుండెల్లొ పదిలంగా నిలిచిపోయే విలక్షణమైన కవిత్వం సలక్షణంగా రాయవచ్చు.
శ్రీశ్రీ గారు చెప్పిన ఒక జోకే చెప్పి ముగిస్తాను. మద్రాసు మీనంబాకం ఏరోడ్రోములో ఇద్దరు పల్లెటూరి బైతులు మొదటిసారి బోయింగ్ విమానాన్ని చూసి గుండెలు బాదేసుకున్నారుట. అందులో పెద్దవాడికి ముందుగా వచ్చిన సందేహం ‘ఇంత భారీ బండికి పెయింట్ వేయాలంటే ఎంత తెల్లరంగు కావాలీ! రంగున్నా వెయ్యడం ఎట్లాఎంత శ్రమా? ఎంత టైము వృథా?’ అని. రెండోవాడు దానికిచ్చిన సమాధానం మరీ విడ్డూరంగా ఉంది. ’అందుకేనేమో మామా! విమానం ఆకాశంలో ఉన్నప్పుడు అక్కడికెళ్ళి వేస్తారనుకుంటా! అప్పుడయితే బుల్లిపిట్టంతే కదా ఉండేదీ!’
ఈ జోకు వినంగానే ముందు మనకు నవ్వొస్తుంది. నిజమే కానీ.. నిజానికి.. కవిత్వతత్త్వసారం మొత్తం ఆ బైతు ఒక్క ముక్కలో తేల్చేశాడు. విశాలవిశ్వాన్ని కళ  (మన దృష్టిలో ఇక్కడ కవిత్వం)  తన పనితనంతో కళకళ లాడించాలంటే కళాకారుడు బాహ్యప్రపంచాన్ని   తన అంతరంగాకాశంలో  ఎగరేయాలి.
అంతరంగాకాశంలో విహారవిన్యాసం మరో పేరే కవిత్వం. ఎంత ఎత్తు ఎగరగలిగితే అంత గొప్ప కవిత్వం దర్సనమిస్తుంది. రెక్కలు విప్పుకోవడమే కాదు.. వడుపుగా వాటిని కదపడమూ పట్టు బడాలి. పట్టు చిక్కే దాకా సాధన చేయాలి. అలాంటి సాధన విజయవంతంగా చేసినందుకే ఇవాళ మనం ఒకశ్రీశ్రీని, ఒకవిశ్వనాథని ఉదాహరణగా  చెప్పుకుంటున్నాం.
***





Tuesday, June 9, 2015

కత్తెర- సరదా కథ



కామేశ్వర్రావు గొప్ప రచయిత. అది కామేశ్వర్రావు అభిప్రాయం.
నవల, నాటకం, కథ, గల్పిక, కవిత, వ్యాసం.. ఒక అంశమనేమిటి?  ప్రాచీన సాహిత్యంనుండి.. ఆధునికాంతర అస్తిత్వవాదం వరకు.. అతగాడు చేయని  నాదం లేదు. అదృష్టమేమంటే అతడు రాసిన ఒక్క ముక్కా ఇంతవరకు వెలుతురు ముఖం  చూడకపోవడం. దురదృష్టం ఏమంటే అతగాడు గొడ్డు  కార్యశూరుడు కావడం. 
ఎలాగైనా సరే అచ్చులో తన పేరు చూసుకొనే తీరాలని  శపథం పట్టి ఉన్నాడు మహానుభావుడు!
అప్పటికీ అతగాడి అచ్చుముచ్చట ముచ్చటగా మూడుసార్లు తీర్చనే తీర్చాడు పైనున్న భగవంతుడు. ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేయించడం మొదటిసారి తీర్చిన ముచ్చట. పెళ్లి శుభలేఖలో వరుడిగా పేరచ్చేయించడం రెండోసారి తీర్చిన ముచ్చట.  ఆ మధ్య ఆంధ్రాబ్యాంకు వాళ్ళు బంగారంమీద లోనుతీసి పంగనామం పెట్టిన మొండిబకాయిదారుల జాబితా ఓటి నోటీసులాగా పత్రికల్లో ప్రకటించారు. అందులో  కామేశ్వర్రావుపేరూ అచ్చయేటట్లు చూసి ముచ్చటగా మూడోసారి అతగాడి అచ్చుముచ్చట తీర్చాడు భగవంతుడు. అయినా కామేశ్వర్రావు  అచ్చుదాహార్తి అంతటితో తీరింది కాదు. అతగాడికి  కావాల్సింది రచయితగా.. ప్రముఖ పత్రికలో..  ధారావాహికంగా పేరు అచ్చులో కావడం! 
ఆ ధ్యేయంకోసం కామేశ్వర్రావు దాడిచేయని పత్రిక  లేదు ఆంధ్రదేశంలో. చందమామనుంచి చతురవరకు ఓ పట్టు పట్టాడు. పడుతూనే ఉన్నాడు. అతగాడి పోటుకు తట్టుకోలేక కొన్ని పత్రికలు కొట్టు కట్టేసాయి కూడా.అయినా  దిన, వార, పక్ష, మాస, ద్వైమాసిక, త్రైమాసిక, అర్థవార్షిక, వార్షిక సంచికలు వేటినీ అతను వదిలి పెట్టింది లేదు. అదేం చిత్రమో! అన్ని పత్రికలదీ అతని రచనలమీద  ఒకటే అభిప్రాయం. కూడబలుక్కొన్నట్లు అందరూ తిరుగుటపాలో అతని రచనలు తిప్పి పంపేస్తుంటారు! ఆ వీధి పోస్టుమేన్ అతని తిరిగి వచ్చే రచనలు మోయలేకే టపా కట్టేసాడని వినికిడి.
కొత్త పత్రిక ఒకటి వస్తున్నదన్న ప్రకటన ఒకటి వెలువడిందీ సారి. వెంటనే కామేశ్వర్రావు ఒక టన్ను బరువున్న నవల గీకిపారేసి ఆ పత్రిక్కి పంపించేసాడు. దానితో పాటు ఒక ఉత్తరంకూడ జత చేసాడు. 'ఆంధ్రసాహిత్యాన్ని కాచివడబోసి చేసిన బృహత్ప్రయత్నం ఈ నవలారాజం. దీన్ని  ప్రచురించుకొనే మొదటి అవకాశం మీ పత్రికకే ప్రసాదిస్తున్నాను. స్థలాభావమే కారణమైతే సంకోచించనవసరం లేదు.  కత్తిరించుకొనే స్వేచ్చ  మీకు ధరాదత్తం చేస్తున్నాను..' ఆవటా అని.
వారం రోజులతరువాత పోస్టుమాన్ ఓ బండిల్తో వచ్చి   కామేశ్వర్రావు ఇంటరుగుమీద కూలిపోయాడు. బండిలు విప్పి చూసాడు కామేశ్వర్రావు. అందులో ఒక ఉత్తరం! పత్రిక సంపాదకులనుంచే!
'అయ్యా! మీ నవలను పరిశీలించడం జరిగింది.. కత్తిరించే స్వేచ్చను ధారాదత్తం చేసినందుకు బహుథా  కృతజ్ఞతలు. సమయాభావంచేత మేమా సత్కార్యం చేయలేకపోతున్నందుకు చింతిస్తున్నాం. మీరే స్వయంగా  ఆ ఘనకార్యం చేసుకోగలరని విన్నపం. వీలుగా మా పత్రిక తరుఫునుంచి మీకు  ఒక కత్తెర బహుమానంగా పంపుతున్నాం!
ఇట్లు 
సంపాదకుడు.
***
-కర్లపాలెం హనుమంతరావు

చతుర కథలు- చతుర- సెప్టేంబరు 2000

పరామర్శ- కథానిక

 

 

కథ

పరామర్శ

రచన - కర్లపాలెం హనుమంతరావు

 

నాంపల్లి కేర్ హాస్పటల్ ముందు ఆటో ఆగేసరికి సమయం సాయంకాలం ఐదుగంటలువిజిటర్సుతో ఆసుపత్రంతా కోలాహలంగా ఉందిరిసెప్షన్ కౌంటర్ దగ్గరికెళ్ళి నేనొచ్చిన పనిచెప్పానువెంటతెచ్చుకొన్న కాగితాలూ చూపించాను.

'కంప్యూటర్లో సరిచూసుకొని ' రూమ్ నెంబర్ టూ  నాట్ ఫైవ్ మ్యాడమ్!  ఫ్లోరు కార్నర్లోఉంటుందితొందరగా వెళ్ళండిఇంకో గంటలో విజిటింగ్ అవర్స్  అయిపోతాయిఅందిరిసెప్షనిష్టు.

 

లిఫ్ట్ ఎక్కి  ఫ్లోర్ చేరేసరికి ఇంకో పావుగంట ఫ్లోర్ ఇన్ చార్జ్ అనుకొంటా మళ్లీవివరాలు అడిగి 'ఒక టెన్ మినిట్ స్ వెయిట్ చేయండి!లోపల డాక్టరుగారున్నారుఅంటూ కార్నర్ సీటు చూపించించింది కూర్చోమన్నట్లు.

 

వెంట తెచ్చుకొన్న పళ్ళబుట్ట పక్కన పెట్టుకొని కూర్చున్నాను

 

ఆసుపత్రి వాతావరణం నాకంతగా పడదుమందులూరోగులూపరామర్శలూ.. ఏమంతఉల్లాసకరమని కోరుకోవడానికిమరీ దగ్గరవాళ్ళను పరామర్శించాల్సి వస్తే సాధారణంగాఇళ్ళకే వెళతాను సారే ఇలా!

 

ఇన్ చార్జ్ నర్సుకి బాతాఖానీ కొట్టేవాళ్ళెవరూ దొరకలేదులాగుంది నా పక్కకు వచ్చి కూర్చొందిఇద్దరు ఆడవాళ్ళు ఒకచోట చేరితే  కబుర్లకు కొదవేముంది!

 

'రామారావుగారిని చూస్తే నిజంగా చాలా జాలనిపిస్తుంది మ్యాడమ్ వయసులోరాకూడని కష్టంనిజంగా దురదృష్టమేఎప్పుడు బాగా లేకపోయినా ఇక్కడికే వస్తుంటారు సారే మరీ బాగా చెడిపోయిందిసగం రోగం అసలు కుటుంబం దూరమైందనేపోనీలేండిఇంతకాలానికి మీరైనా వచ్చారుచూసి ఎంత సంతోషిస్తారోమీ అబ్బాయికూడావచ్చుంటే బాగుండేది!'

 

నాకేం సమాధానం చెప్పాలో తోచలేదునా సమాధానంకోసం ఆమె ఎదురుచూడలేదు కనకసరిపోయింది!

 

రూమ్ నుంచి డాక్టరుగారు బైటికిరావడంతో నర్సు వాక్ప్రవాహానికి అడ్డుకట్ట పడిందిఇంకోనర్సు వచ్చి నన్ను   రూమ్ లోకి తీసుకువెళ్ళింది.

 

గదంతా చల్లగా ఉందిమందుల వాసనబెడ్ మీద కళ్ళుమూసుకొని ధ్యానంలో ఉన్నట్లుపడుకోనున్నాడాయనరోగం మూలకంగా వయసు మరీ మీద పడినట్లుంది.

నర్సు ఆయన్ని చేత్తో రెండుమూడు సార్లు తట్టింతరువాత గాని ఆయన కళ్ళు తెరిపిడిపడలేదు.

 

'సార్ఎవరొచ్చారో చూడండి.. మీకోసంఅంది ఆమె అభిమానంగా.

 

కళ్ళు అటూ ఇటూ తిప్పిచూసాడుచూపు ఒక చోట నిలబడటంలేదుదేనికోసమోవెతుకుతున్నట్లున్నాయా చూపులు.

 

'గుర్తు పట్టినట్లు లేరుమైండ్ సరిగ్గా ఉండటంలేదు.' అని నాతో చిన్నగా అని, 'ఇటు..ఇటువైపు చూడండి రామారావుగారూమీ మిసెస్.. కలవరిస్తున్నారుగా మేడమ్ కోసంతనివితీరా కబుర్లు చెప్పుకోండింకఅని నా వంక నవ్వుతో చూసి మళ్ళా లోవాయిస్ లో 'సైట్కూడా ఎఫెక్టు అయినట్లుందిసాధ్యమైనంత వరకూ క్లోజ్ గా కూర్చొని టచ్ చేస్తూమాట్లాడండి డిసీజ్ కి పేషెంటుకి కావాల్సింది  హ్యూమన్ టచ్భయపడకండిఎయిడ్సు అంటువ్యాధి కాదుమీరు మాట్లాడుకోండినా అవసరం అనిపిస్తే పిలవండి.. వస్తానుఇంకో అరగంటదాకా విజిటింగు టైముందిఅని హచ్చరించి డోర్ లాగివెళ్ళిపోయింది నర్సు.

 

గదిలో నేనూ.. ఆయనానర్శు మాటలు గుర్తుకొచ్చాయి

 

వెంటతెచ్చుకొన్న పండ్లు సైడ్ డెస్కుమీద పెట్టి వెళ్ళి ఆయన మంచానికి దగ్గరగాకుర్చీలాక్కొని కూర్చొన్నాను.

 

బలహీనమైన గొంతుతో ఆయన అన్నారు 'నన్ను క్షమిస్తావా జానకీనీకు తీరని ద్రోహంచేసానుఅందుకు ఇప్పుడు అనుభవిస్తున్నాను.' ధారాపాతంగా ఆయన కళ్ళవెంట నీరుచాలా జాలిగా అనిపించింది.

 

ఓదార్పుగా ఆయన చేతిని నా చేతిలోకి తీసుకొని అన్నాను 'ఇప్పుడవన్నీ ఎందుకు చెప్పండినేను వచ్చేసాగాఇంక హాయిగా విశ్రాంతి తీసుకోండి!' నా గొంతు నాకే వింతగాఅనిపించింది.

 

'కాదు జానకీనన్ను చెప్పనీయినాకు తెలుసునాకింక ఆట్టే టైములేదనినిన్ను క్షమాపణఅడగాలి ముందుఎంత హింసించాను నిన్నుఅయినా ఎన్నడూ ఒక్కమాటఎదురుచెప్పేదానివి కాదుచెడతిరిగిన మాట నిజమేకానీ  ఎయిడ్సు అట్లా వచ్చిందికాదునువ్వు అపార్థం చేసుకొన్నావునన్ను విడిచి పెళ్ళిపోయావునాకీ రోగం వచ్చిందన్నబాధకన్నా నన్ను నీవు తప్పుగా అర్థం చేసుకొని వెళ్ళిపోయావన్న బాధే ఎక్కువగా ఉండేది.' 

 

నాకు బదులు ఏమి చెప్పాలో తోచలేదు.

 

'ఈయన్ని మాట్లాడనిస్తే చాలుమనసులో ఇన్నాళ్లూ గడ్డకట్టుకుపోయిన  దుఃఖం ఇట్లానైనాకరిగి బైటికి వచ్చేస్తే మందు  అపరాధ భావన తొలగిపోతుంది.'

మౌనంగా వింటూ కూర్చున్నాను అందుకే!

 

'షిర్డి వెళ్ళాను గుర్తుందా నీకు.. ప్రమోషన్  వచ్చిందనితిరిగొచ్చేటప్పుడు ఏక్సిడెంటయిందిచాలామంది పోయారుప్రాణాలతో బైటపడ్డవాళ్లలో నేనూ ఒకణ్ణిచాలా రక్తం పోయిందనిదగ్గర్లో ఉన్న అదేదో ఆసుపత్రిలో రక్తం ఎక్కించారుఎక్కడ జరిగిందో పొరపాటు ఇదితగులుకొందిబాగా ముదిరిందాకా తెలీలేదుతెలుసుకొని ఇప్పుడు ప్రయోజనమూ లేదువిషయం చెప్పుకొనే అవకాశంకూడా ఇవ్వకుండా నువ్వెళ్ళిపోయావుమిగతావాళ్ళ సంగతివదిలేయ్నువ్వూ నన్ను అపార్థం చేసుకొన్నావన్నదే నా బాధనీ బాధ నేను అర్థంచేసుకోగలనుఎయిడ్స్ వచ్చిన మొగుడితో  భార్యయినా ఎట్లా కాపురం చేస్తుంది?  నువ్వువెళ్ళిపోవడాన్ని తప్పుపట్టడంలేదునా తప్పు ఏమీ లేదని చెప్పుకొనే అవకాశం కూడా ఏమీఇవ్వకుండా వెళ్ళావు.. ' ఆయాసంతో ఆయన రొప్పుతున్నారు

 

ఏదో విధంగా  ధోరణిని ఆపకపోతే ఇంకా రొష్టు పడతారు.

'ఇప్పుడు తిరిగి వచ్చేసాగాఇంకెందుకండీ  పాత విషయాలన్నీనేను మిమ్మల్నితప్పుపట్టివుంటే తిరిగి వచ్చేదాన్నామీరు చెప్పాలనుకొన్నది  చెప్పారుగుండెబరువుదించుకొన్నారుఇకనైనా ప్రశాంతంగా నిద్రపోండి.. కాస్సేపుబాగా అలసిపోయారుఅనిలేవబోయాను. 'ఇంకా ఉంటే ఇంకా ఎక్కువ రొష్టు పెట్టినట్లవుతుందిఅనిపించింది.

 

గభాలున నా చేతిని గట్టిగా పటుకొన్నారు.. సంతలో తప్పిపోకుండా పిల్లాడు తల్లిచెయ్యిపటుకొన్నట్లు!

'లేదు జానకీనువ్వు వెళ్ళొద్దునువ్వు దగ్గరుంటే నాకు ధైర్యంగా ఉంటుందినువ్వుపక్కనుంటే యమధర్మరాజుతోనైనా  యుద్ధం చేస్తా!' అంటూ వలవలా ఏడ్చేస్తుంటే.. ఎలాఓదార్చాలో అర్థంకాలేదు.

 

'ఇట్లా బాధపడతారని తెలిస్తే అసలు వచ్చేదాన్నే కాదుఇంకా బాధపడుతుంటే ఇప్పుడేవెళ్ళిపోతాను!' అన్నాను బెదిరింపు ధోరణితో.

 

నిజంగానె వెళ్ళిపోతాననుకొన్నట్లున్నారు.. కాస్త సర్దుకొన్నారు!

'లేదులే.. కుర్చో.. ఇట్లా.. నా పక్కన.. నాకు హాయిగా ఉంటుందినిద్రపోతే నువువెళ్ళిపోతావని  భయంగా కూడా ఉంది.'అన్నారు నా రెండుచేతుల్ని తన గుప్పిటమధ్యగట్టిగా బంధించి గుండెలకి అదిమిపెట్టుకొంటూ.

 

'ఎక్కడికీ పోనునిశ్చింతగా నిద్రపోండి!' అన్నానునర్శు ఇచ్చిన ఇంజెక్షన్ ఇప్పుడుపనిచేయడం మొదలుపెటినట్లుందిమెల్లిగా మగతలోకి జారుకొన్నారాయన ఐదునిమిషాల్లో.

 

నిద్రపోయే ఆయన మొహంలో పసిపిల్లవాడే కనిపిస్తున్నాడుఎంతసేపు అలాకూర్చుండిపోయానో తెలీదు!

 

తలుపు చిన్నగా కొట్టి లోపలికొచ్చింది నర్సు.

గభాలున మంచం దిగిపోయానుగుప్పిటలోనుంచి నా చేతులు విడిపించుకోబోతేవీలుకాలేదు గుప్పిట గట్టిగా ఉందిచల్లగా ఉందిఆయనచేతినరాలుబిరుసెక్కుతుండటం గమనించానునా అనుమానం నిజమే అయితే..

 

నర్సుసాయంతో ఆయన గుప్పిటపట్టు నుంచి  నా చేతిని విడిపించుకొన్నానుచివరిసాగిగాఆయన్నొక్కసారి చూసి బైటికివచ్చేసాను.

 

'చాలాకాలం తరువాత ఇవాళ ఆయన మొహంలో ఆనందం చూసాను మేడమ్ఇంజెక్షన్లుమందులద్వారా మేమివ్వలేని ప్రశాంతత మీరు అందించారుమెనీ మెనీ థేంక్స్!' అందిఆయన్ను ట్రీట్ చేస్తున్న డాక్టర్ హాస్పటల్నుంచీ నేను బైటకు  వచ్చేటప్పుడు.

 

'యువర్ కాంప్లిమెంట్స్ గో టు మై హజ్ బండ్ అండ్ టు మేక్  విష్ ఫౌండేషన్!'అన్నాను

 

ఇక్క డికి బైలుదేరేముందు నా విజిట్ వర్కవుట్ అవుతుందాకాదా?' అని నాకేసందేహంగా ఉండేది రామారావుగారు  ఉస్మానియా యూనివర్శిటీలో ప్రొఫెసర్భార్యాబిడ్డలతో కలసి షిర్డీ వెళ్ళివస్తుంటే బస్సు ఏక్సిడెంటయింది ప్రమాదంలో భార్య,  బిడ్డ అక్కడికక్కడే చనిపోయారుఈయన తలకు బలమయిన గాయమయిమతిమరుపువ్యాధి మొదలయిందికాలంతోపాటు ముదురుతూ వచ్చింది.  ప్రమాదసమయంలో జరిగిన చికిత్స లోపంవల్ల ఎయిడ్స్ ఉన్నరక్తం ఒంట్లో చేరిందిఇన్సూరెన్సుఉన్నందువల్ల డబ్బుకి ఇబ్బందిలేదుగానీ.. లేని భార్యాబిడ్డలని తీసుకురావడం ఎట్లాచివర చివర్లో ఆయన భార్యనుగురించే కలవరిస్తుంటే.. ఆసుపత్రివాళ్ళ ద్వారా  వార్త 'మేక్ ఫౌండేషన్వాళ్లకి చేరిందిమావారు ఆసంస్థలో యాక్టివ్ మెంబరుప్రాణాంతకమయినవ్యాధులబారినబడ్డ బాలల చివరి తీరని కోరికలను వీలయినంతవరకు తీర్చే  ప్రయత్నంచేసేస్వచ్ఛంద సేవాసంస్థ 'మేక్  ఫౌండేషన్'. సమస్యల్లా వారి సేవలు నియమ నిబంధనలప్రకారం బాలలకే పరిమితం.

 

చివరి రోజుల్లో ఉన్న రామారావుగారి చివరికోరికను తీర్చాలన్న సదుద్దేశం మావారికి కలిగింది'మేక్  విష్ ఫౌండేషన్వారి స్ఫూర్తితోనే.

 

నన్ను రామారావుగారి భార్య జానకిగా వెళ్ళి పరామర్శించి రమ్మని ప్రోత్సహించింది మావారే!

 

బైలుదేరే ముందు కాస్త గిల్టీగా అనిపించినా.. ఇప్పుడు ఒక మంచిపని చేసానన్న సంతృప్తిమిగిలింది.

 

రామారావుగారి మతిమరుపువల్లే నా పరామర్శ విజయవంతమయింది.

***

 

('చిత్రమాసపత్రికలో  ప్రచురితం)

 

 

 

 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...