Thursday, February 14, 2019

రాధమ్మ పెళ్లి జరిగిపోయింది - ఆంధ్రప్రభలోని నా కథానిక


రాధమ్మ పెళ్లి జరిగిపోయింది - ఆంధ్రప్రభ (29-07-1982  నాటి) వారపత్ర్రికలోని నా కథానికః
ఎన్ని కమ్మని ప్రేమ కబుర్లు పోటీ కొచ్చినా జీవతమనే  పరుగుపందెంలో ఆఖర్న బంగారు పతకం సాధించేది,, విచ్చు రూపాయే! ఆర్థిక సంబంధాల ప్రాబల్యం అప్పటికీ ఇప్పటికీ,, ఇంకెప్పటికీ ఎవరూ పడగొట్టలేని వస్తాదే బతుకుగోదాలో అని మరో సారి చెప్పిన చిన్న కథ.. రాధమ్మ పెళ్లి జరిగిపోయింది! 

కథానిక : 
రాధమ్మ పెళ్లి జరిగిపోయింది 
- కర్లపాలెం హనుమంతరావు
( 28 -07 - 1982 నాటి ఆంధ్రప్రభ వారపత్రిక - ప్రచురితం ) 

రాజు, రాధా ప్రేమించుకున్నారు.
ప్రేమం టే?!
ఏమో నాకూ అట్టే తెలీదు. "

' ప్రేమ .. అమావాస్య చందమామ. . అందుకొనే దెంతమంది? .. వంద తక్కువ నూరు  మంది!' అన్నాడో కవి! 

అయితేనేం  పాపం, రాజూ, రాధా ప్రేమించుకున్నారు. 

ప్రేమం టే వాళ్ళకూ తెలుసన్న మాట అనుమానమే. అయినా ప్రేమించుకున్నారు.  పోనీ, కనీసం అలా అనుకుంటున్నారు. వాళ్ళు మేధావులు కాదు కనక. 

సాధారణంగా అందరి లాంటి యువతీ యువకులే గనక 'ప్రేమంటే ఏమిటి?' అంటూ ఆరా తీస్తూ కూర్చోలేదు. 

ఏదో హాయిగా అలా కాలక్షేపం చేస్తున్నారు. కాలక్షేపమంటే అదే... ఏదో కొద్దిగా సరదాగా గడిపేయడం. 

సరే వాళ్లు మాత్రం  వూరికే అలా ఎంతకాలం చూసుకుంటూ కూర్చుంటారు ? 

బోర్ బోర్! 

కడుపు నిండేనా, కాలు నిండేనా? 

ఒక శుభ ముహూర్తంలో పెళ్ళికూడా అయిపోతే  'శుభమస్తు ' కార్డు పడిపోతుంది కదా వాళ్ల ప్రేమ కథకు కూడా! 

' చేసేసుకుందాం .. పెళ్లి ' అని ప్రమాణాలు ఎక్స్ ఛేంజి చేసుకున్నారు. 

వాళ్ళయితే అనుకున్నారు... కుర్ర కారు.  మరి ఇరుపక్షాల పెద్దలు? 

"పెద్దవాళ్లు ఒప్పుకుంటా రంటావా, రాజూ!" అని అడిగింది రాధ.. ఆ రోజు సాయంత్రం ఎప్పటిలాగానే ఏకాంతంలో కూర్చున్నప్పుడు పెళ్ళి ప్రస్తావన తవే ముందు తెచ్చి.

" ఒప్పుకుంటారనే అనుకుంటున్నాను" అన్నాడు రాజు.. అనుమానాన్ని కూడా ధ్వనింపజేస్తూ

" ఒకవేళ ఒప్పుకోకపోతే?”

“ఒప్పుకోకపోనూవచ్చు. ఇంత దూరం వచ్చిన తరువాత వెనక్కు తగ్గుతాననుకున్నానా, రాధా!".

"అబ్బే... అలా అని కాదు. వూరికే అడిగేనులే. మరి మీదేమో బ్రాహ్మణ కులం. మేమేమో నాయుళ్ళం. కులాంతరమంటే మీ వాళ్లు అంతా తొందరగా ఒప్పుకుంటారా అని "

" మరి మీ వాళ్ళు మాత్రం ఒప్పుకోవద్దూ కులాంతర వివాహావికి?"

" మా సంగతి వేరు, రాజూ! మా నాన్న గారు కులాంతర వివాహం చేసు కున్నారు. మా అమ్మ ఆ రోజుల్లో కొద్దో గొప్పో పేరున్న నటి. ప్రసక్తి వచ్చింది గనక చెబుతున్నా.  అమ్మది వడ్రంగి కులం. అయితేనేం, మా నాన్న గారు నాయుళ్ళయి ఉండీ ఆదర్శ వివాహం చేసుకోలేదూ! నేను గ్యారంటీ ఇస్తున్నాను, రాజూ. మన పెళ్ళికి మా వాళ్ళు ఎంతమాత్రం అభ్యంతరం చెప్పరు. మా బ్రదర్ పోయి నేడు ఫారిన్ నుండి తిరిగొస్తూ అమెరికన్ అమ్మాయిని  పెళ్ళాడి మరీ వచ్చాడు తెలుపా?" 

"మీ వాళ్ళది చాలా విశాల దృక్పథం, రాధా! ఐ యామ్ రియల్లీ హ్యపీ!  ... మా వాళ్ళే ఒట్టి చాందసులు. మా చెల్లెలు శాంత.. అదే బ్యాంకులో పనిచేస్తుందే .. తను తన కోలీగ్ ను చేసుకోవాలని చాలా పాకులాడుతోంది . శాఖాంతరమని మా వాళ్లే పడనీయడం లేదు " 

"మరి నువ్విప్పుడు ఏకంగా కులానికే ఎసరు పెట్టేస్తున్నావుగా: అడిగి చూడు! పెద్దల ముందుగా వద్దన్నా సరే, అంగీకారం కోరటం మన డ్యూటీ. నేనూ ఈ రోజే ఇంట్లో విషయం కదుపుతాను."

"ఏ విషయం. రేపు ఆదివారం సాయంత్రంలోగా ఇక్కడే తేలిపోవాలి.. విష్ యూ బెస్సాఫ్ లక్.." అని నవ్వుతూ లేచాడు రాజు. రాధ రాజు చెయ్యి పట్టుకుని పైకి లేస్తూ , "విష్ యూ  ది సేమ్ ...' అని నవ్వింది. 

రాజు కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఆఫీసరు. రాధ ఉమెన్స్ కాలేజీలో  డిగ్రీ మూడో ఏడు చదువుతూంది. కాలేజీకి దగ్గరే ఆఫీసు, ఇద్దరూ తరచూ ఒకే కేంటీన్ లో కలుసుకోవటంతో పరిచయం కలిగి .. అది ప్రణయంగా మారింది. అందుకు ఇద్దరూ అభిమానించే సినిమాలు, ననలలు బోలెడంత దోహదం చేశాయి. 

అనుభవంలేని వయసు పాంగొకటి తోడైంది.  ప్రణయం ముదిరి పాకాన పడింది.

రాజుకు శాంత అనే పెళ్ళి కాని చెల్లెలుతో పాటు, రాఘవ అనే ఉద్యోగం లేని  గాడ్యయేట్  తమ్ముడూ, పించను   ఇంకా సెటిల్ కాని రిటైర్డు టీచరు తండ్రి. చాదస్తం వదలలేని  పాతతరం తల్లి .. కూడా ఉన్నారు. ప్రస్తుతానికి ఆ ఇంటికి దిక్కు రాజు జీతమే . శాంత జీతం మాతం కట్నం కోసమని దాస్తున్నారు. 

ఆ రోజు ఆదివారం కావటంతో అందరూ ఇంట్లోనే ఉన్నారు. ఎప్పుడూ అరవ కాకి లాగా బయట పడి తిరిగే   రాఘవకూడా ఒంట్లో నలత కారణంగా ఇంటి పట్టునే ఉన్నాడా పూట. 

భోజనాల దగ్గర పెళ్ళి ప్రస్తావన ఎత్తాడు రాజు. 
నా అంత ఎత్తు ఎదిగిన  వాడివి నీకేమని బుద్ధి చెప్పను! ఇంటి పెద్ద కొడుకుగా నీకూ  కొన్ని బాధ్యత లున్నాయన్న విషయం మరిచి పోయావురా?” అన్నాడు తండ్రి నిష్ణురంగా .

 “నే నంత కాని పనేం చేశామ, వాన్షా! ఆ అమ్మాయి చాలా గుణవంతు రాలు. “

" గుణమొక్కటే చాలుతుందా ? కులం?"

రాజు మాట్లాడలేకపోయాడు. 

తండ్రే అందుకున్నాడు "నువ్వు చెప్పక పోయినా మాకు తెలుసు లేరా ! నాయుళ్ళ సంబంధం చేసుకుంటే శాంతకు మళ్ళీ ఈ జన్మలో పెళ్ళవుతుం దంటావా?"

"ఈశ్వరావు నాకు బాగా తెలుసు. నేను కులాంతరం చేసుకున్నా తను శాంతను వదులుకునే పాటి మూర్ఖుడు కాదు. శాఖాంతరముని మీరే రాద్ధాంతం చేస్తున్నారు గానీ! " 

"ఏమో నాకీ సంకరజాతి వెళ్ళిళ్ళు ఇష్టం లేదురా! మేం మళ్ళీ అందరిలో  తలెత్తుకు తరగాలా. . వద్దా  ?” అని అందుకుంది తల్లి.

" రాధ వాళ్ళ కుటుంబం సంగతి మీకు తెలీక అలా అంటున్నారమ్మా! ఆయనతో వియ్యమందటానికి బిజినెస్ మేగ్నెట్లతో సహా ఎంతమంది క్యూలో  ఉన్నారో తెలుసా ? రాధ తండ్రి డబ్బున్న కాంట్రాక్టర్. ఎన్నికలలో ఈ దఫా కూడా పోటీ చేయబోతున్నాడు. గెలిస్తే, మంత్రి పదవి  ఖాయమంటున్నారు.  గెలవక పోయినా అధికార పార్టీలో ముఖ్యమైన పాత్ర పోషించే అంతస్తు . అలాంటి వాల్లాయి సంబంధం ఎన్నటికీ తలవంవులు కాబోదు. గొప్ప కింద లెక్క .  అందుకే మీ మహదేవన్నయ్య  ఇన్ని సిద్ధాంతావా వల్లించి చివరకు కొడుక్కోసం  రాధ తండ్రి చుట్టూతా  తిరుగుతున్నాడు. అంత పెద్ద రాజకీయ నాయకు డికి లేని సంకరతనం ' మనకెందుకమ్మా?" 

" ఏమో! బాబూ! కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికి .. ! "  

"అది కాదమ్మా! తమ్ముడు ఎంత కాలంగా  బియ్యస్సీ ఫస్టుక్లాసులో ప్యాసయ్యీ ఖాళీగా ఉంటున్నాడు? ఇంకింత కాలం ఉన్నా వాడికి ఉద్యోగం రావటం డౌటే. ఏ సిఫార్సో , మూటో లేకపోతే  ఉద్యోగాలు వచ్చే రాజులా ఇవి? వీడి సంగతి ఒక్కసారి ఆయన చెవినబడింబా చిటెకెల మీద  ఉద్యోగం రెక్కలు కట్టుకు వాలిపోతుంది.”

రానీయరా! అప్పుడే చూద్దాం” అంటూ విస్తరి ముందు నుంచి లేచాడు రాజు తండ్రి. 

ఆయన మెత్తబడినట్లు  తెలుస్తూనే ఉంది. రాఘనకు ఉత్తేజ మొచేసింది. ఉద్యోగ మొస్తుందన్న ఆశ తోటి. "అయినా ఈ రోజుల్లో కులం గిలం అట్టే ఎవరు పట్టించుకుంటున్నారే, అమ్మో! ఇందాక 
నువ్వు పెద్ద ఆచారాలను గురించి  చెబుతున్నావు కదా ! నువ్వు మొన్న , స్కూళ్ళ ఇన్ స్పెక్టరు గారు క్రిస్టియనైనా నట్టింట్లో నాన్నగారి పక్కన అకేసి అన్నం పెట్ట లేదూ? అప్పుడెక్కడికి పోయిందో కులం? ఆయన అధికారి. పింఛను  వ్యవహారం తొందరగా సెటిల్  చేస్తాడేమోనన్న ఆశ కొద్దీ మీరు తాత్కాలికంగా కులం సంగతి మరిచిపోయారు. అందరూ ఈ రోజుల్లో అలాంటివి ఆవసరమయితే తప్ప ఎవరూ పట్టించు కోవటమే లేదు.”

"ఏమోరా, బాబూ! అవ్యక్తపు మనిషిని. నన్నెందుకు చంపుతారు ! అయినా చూస్తూ చూస్తూ ఆ అంట రాని పిల్లని వంటింట్లోకి ఎట్లారా  రానీయడం? " 

శాంత అందుకుంది: “అంటరానితనం ఏ కులంలో లేదే ఈ రోజుల్లో! మొన్న నువ్వూ, నేనూ రామలక్ష్మి కూతురు పుట్టిన రోజు పండుగకు పిలిస్తే ..  మనవాళ్ళే గదా.. అని వెళ్ళామా! ఏమయిందీ? నిన్ను ఆ పసిపిల్లను ముట్టు కోనిచ్చారా ? మర్యాదగా పలకరించారా? ఎందు కొచ్చావిక్కడికి  అన్నట్లు మాట్లాడలేదూ! వాళ్ళు మరి మన కులం వాళ్ళేగా! ఎందుకు మరి నిన్ను అంటదానివాళ్ళుగా చూశారు? నాళ్ళకు లాగా సినిమా హాల్సు, రైసు మిల్లులు లేవనేగా ? బీద బడిపంతులు భార్యవనేగా!" 

"మీ అందరూ చదవేసిన వాళ్ళు, తల్లీ! తిమ్మిని బెమ్మిని, బెమ్మిని తిమ్మిని అయినా చెయ్యగలరు.  తల్లితండ్రులం, మేం కోరుకునేదేమిటి?  మీరు చల్లగా ఉండటం కావాలి మాకు.  మీ కిదే ఇష్టమనుకుంటే అట్లాగే కానీయండి. లోకం మారిందంటున్నారుగా!  రాఘవగాడికన్నా ఉద్యోగమొస్తే అదే పది వేలు - ఆదే
మాకు పెద్ద బెంగయిం దిప్పుడు” అనేసి కంచాలు తీసుకుని వెళ్ళి పోయింది రాజు తల్లి. 

" హిప్ హిప్ హుర్రే ” అని అరిచాడు రాఘవ సంతోషం పట్టలేక.
" పెద్ద వాళ్ళను  ఇబ్బంది పెట్టకుండా పెళ్లి జరిగి పోతుంది" అని తృప్తిగా నిట్టూర్చాడు రాజు.

ఈశ్వరావుతో జరగదనుకున్న  పెళ్ళి మళ్ళీ ఖాయమయ్యే పరిస్థితి వచ్చేసరికి  శాంత కళ్ళ లోకి మెరుపులు  వచ్చేశాయి. 

రాజు ఆ సాయంత్రమే రాధ కోసం పార్కు కెళ్ళాడు ఎంతో ఉత్సాహంతో. 

కానీ, రాధ పార్కుకు రానేలేదు. ఎంత నిరుత్సాహం కలిగిందో! 

మరునాడు కేంటీన్ లోను కనిపించ లేదు. కాలేజీలో వాకబు చేస్తే క్లాసుకే రాలేదన్నారు. 

అయోమయం అనిపిం చింది రాజుకు . . రాధ ఇంటికి వెళ్ళాడు.  తలుపుకు వేసి ఉన్న తాళం కప్ప వెక్కిరించింది. 

వారం రోజులయింది.  కానీ , రాధ జాడ  అంతు పట్ట లేదు. పిచ్చెపోయినట్లయింది రాజుకు. 

ఆ రోజు పోస్టులో రాజాకు  కవరొచ్చింది. ముత్యాలు పేర్చినట్లుండే దస్తూరిని చూడగానే ఆనందంగా అనిపించింది. రాధ దగ్గర నుంచే సందేశం, 

ఆత్రుతగా   కవరు ఓపెన్ చేశాడు.  రాజు. 

శుభలేఖ బయట పడింది. జలాగా చిన్న ఉత్తరమూ
ఉంది! 

రాజ గారికి! 
 అర్థమయిందనుకుంటాను. 
నా పెళ్ళి నిశ్చయమై పోయింది. 
పరుడు మా నాన్నగారికి పార్టీ టిక్కెట్టు ఇప్పించాల్సిన  రాజకీయ నాయకుడి ఏకైక పుత్రరత్నం. 
మన విషయం ఆ రోజు ఇంట్లో కదిలించిన రోజు మా వాళ్ళ నిజస్వరూ పాలు బయట పడ్డాయి. 
'నీ పెళ్ళి మీద నేను బోలెడన్ని ఆశలు పెట్టు కున్నాను, తల్లీ! అవి కల్లలయిపోవటానికి లేదు. వియ్యానికైనా, కయ్యానికైనా  సమ ఉజ్జీ ఉండాలి' అని నాన్న గారు కొట్టి పారేశారు. 

నా మొండితనం తెలిసి మా వాళ్ళు నిర్బంధంగా నన్ను  విశాఖపట్నం తీసుకొచ్చారు. వారుడుది ఈ  ఊరే. 
ఈ పెళ్ళితో మా నాన్నగారికి పార్టీ టిక్కెట్టు దొరుకుతుంది. అన్నయ్యకు పెద్ద కంపెనీలో జనరల్ మానేజరు పోస్టు దక్కుతుంది. అమ్మకు డాన్స్ స్కూలు పెట్టుకోవటానికి పర్మిషన్, ఫండ్సూ దొరుకుతాయి. 

మరి నాకో...? ఏం దొరుకుతుంది? జ్ఞానం. మనం అభిమానించే సినిమాలల్లో, నవలల్లో ఉండే ఊక దంపుడు  ఉపన్యాసాల తాలూకు కులాలు, మతాలు వాటి మధ్య అసమానతలు, దోపిడి, ఘర్షణ అంతా ఆచరణలో పట్టవలసిన సందర్భం వస్తే  ఫార్స్  అనీ, మనిషికీ మనిషికీ మధ్య పెరుగుతున్న అసమానతలు  అన్నిటికి కారణం ఏకైక పదార్థం ఒక్కటే. . అదే 'ఆర్థికం' అనే జ్ఞానం మాత్రం మిగులుతుంది రాజూ! వీలైతే నిన్ను క్షమించు; 

ఇట్లు, 

... 

రాజుకు సవ్వొచ్చింది. 'క్షమించటానికి తనెవరు? రాధ తల్లి తండ్రులను తప్పు పట్టటానికి తన కెక్కడ నైతికంగా హక్కుంది? తమ్ముడికి ఉద్యోగం వస్తుం దనీ, తండ్రి సమస్య తీరుతుందనీ, సంఘంలో మరో మెట్టు పైకి ఎక్క గలమనీ నచ్చచెపితే గదా . . తన తలి దండ్రులు కులం అడ్డును కూడా  కాదని ఒప్పుకుంది! 

అదే మార్గంలో  రాధ తల్లిదండ్రులూ వెళ్లారు. 

రాధ నాన్నగారు కులాంతర వివాహం చేసుకుందీ, రాధ అన్న అమెరికన్ అమ్మాయిని చేసుకుందీ, పెళ్ళిని ఈశ్వరావుతో తన తల్లిదండ్రులు నిరాకరించిందీ, తన పెళ్ళిని రాధతో అంగీకరించనిదీ.  అన్నీ  ఒకే  ఆలోచనతోనే కద! అన్నిటికి ఆర్థిక కొలమానమే ప్రమాణమయింది గదా .. పెళ్ళిళ్ళకూ... ఆఖరికి ఆదర్శ వివాహాలకు కూడా! 

శాంత కిందివాడు పైమెట్టుకు ఎగబాకాలని చూస్తే, ప్లైవాడు ఇంకా ప్లైమెట్టుకు పాకులాడుతూ ఈ 'గాప్' ను సదా రక్షించు కోవటానికే చూస్తున్నాడు. అడుగున ఉన్న మనిషి పైన ఉన్న వాడి కాళ్ళు పట్టుకుని ఎగబాకాలని చూస్తుంటే, ఆ పైన ఉన్నవాడు క్రింది వాడి నెత్తి మీద కాలు పెట్టి ఇంకా  పైకి ఎగబాకాలని చూస్తున్నాడు! 

మనసులకు సంబంధించిన 'పెళ్ళి' వ్యవహారంలో కూడా ఇంతే.. ఇంతే! 

ఏమయితేనేం.. రాధమ్మ పెళ్ళి జరిగిపోయింది— రాజుతో మాత్రం కాదు.

***
- కర్లపాలెం హనుమంతరావు
( ఆంధ్ర ప్రభ వారపత్రిక - 28-07-1982- ప్రచురితం)  






రాధమ్మ పెళ్ళి జరిగిపోయింది - కథానిక


ఆకాశరామన్న- కథానిక - ఆంధ్రభూమి- వార పత్రిక

ఆకాశరామన్న ఆంధ్రభూమి (19, ఫివ్రవరి, 2019)  నాటి వారపత్రికలోని నా కథానిక


















ఈ లింక్ నొక్కి  పిడిఎఫ్ చదువుకోవచ్చు!







Tuesday, February 12, 2019

అనిల్ కుమార్ 'ఆంకురం' కథానికపై. అభిప్రాయం


http://www.prasthanam.com/node/10
అనిల్‌ప్రసాద్ ' అంకురం ' అధునాతనమైన అంశం చుట్టూతా పాఠకుడిని తిప్పుకొచ్చిన చక్కని కధానిక 


ఎంత ముచ్చటగా ఉందో అచ్చంగా చందమామ కథలాగా! చదువుకున్న  ఆడపిల్ల నిష్కళ. పెళ్లి చేసి అత్తారింటికి పంపాలనే తల్లిదండ్రులు దిగులు పడుతుంటారు. ఊర్లోని రామారావుకి మల్లె కూతురుతో పాటు కొడుకూ ఉండి ఉంటే ఆడపిల్లని అత్తారింటికి పంపించినా ఊళ్లో పేరు నిలిపేటందుకు కొడుకు పనికొచ్చే వాడు - అని వెత చెందుతుంటారు కన్నవారందరిలాగే! నిష్కళ తనకున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో చదివి ఉద్యోగాలు దొరక్క  ఆటోలు బాడుగకు తిప్పుకునే ఇంజనీరు పట్టభద్రులందరికీ అందివచ్చే యాప్ ను అభివృద్ధి చేయిస్తుంది. స్థానిక యువకుడి చేత . నగరాలలో మాదీరి జిపిఆర్ సిస్టమ్ మండలం మొత్తానికి ఉపయోగపడే వ్యవస్థకు జీవం పోయిస్తుంది. ఊరిలోని పంచాయితీ ప్రాంగణంలోని గ్రంథాలయం స్థలాన్ని కంప్యూటర్ల సాయంతో డిజిటలైజ్ చేయిస్తుంది. బోలేడంత డబ్బు పోసే రిస్కుతో నగరాలకు పోయి చదువుకొనే బాదరబందీ నుంచీ విద్యార్థులకు తిప్పలు తష్పించే ప్రణాళిక ఆచరణలోకి తీసుకువస్తుంది . ఆడపిల్లలు ఎందరికో అందుబాటులోకి వచ్చే ఈ సుఖమైన , సులువైన పథకాన్ని సుసాధ్యం చేసేటందుకు  ప్రేరణ తన కన్నవారికి మగబిడ్డ లేని లోటు మనసును తొలిచేయకుండానట! గ్రామ సీమాలను తన సాంకేతిక పరిజ్ఞానంతో సాయం అందించే యువకుడు తటస్థపడితే అతని చెయ్యి అందుకుని . . అమెరికా , ఆస్ట్రేలియాలంటూ విదేశాల బాట పట్టనన్న  తన సంకల్పం కూడా ప్రకటిస్తుంది. సహజ శైలిలో , అతి శయోక్తులకు పోకుండా, ఆదర్శాల వల్లెవేత లేకుండా నేడు సమాజంలో కనుపడుతున్న ఆకలి ఆరాటాన్ని, అభివృద్ధి పురోగతిని చక్కగా సమన్వ యిస్తూ నాటకీయతకు దూరంగా చక్కని కథను అల్లిన రచయిత అనిల్‌ ప్రసాద్  కచ్చితంగా అభినందనీయుడు! మంచి వికాస లక్షణ సమన్వితమైన కథను అందించినందుక్కూడా ధన్యవాదాలు!

Monday, February 11, 2019

కొమఱ్రాజుగారి ‘వియోగ గీతి’ కత!- సాహిత్య ముర్మురాలు-



వడ్డాది సుబ్బారాయుడిగారు సతీ స్నృతి తెలుగులో వచ్చిన ఒక ప్రముఖ సంతాప కావ్యం (ఎలజీ). సుబ్బారాయుడిగారి వై వాహిక జీవితం చాలా పరితాపకరమైనది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ముగ్గురు కాదు.. నలుగురు కాదు.. ఏకంగా ఐదుగురు సాథ్వీమణులు ఆయన చేత మెడలో తాళి కట్టించుకున్నా ఒక్కరికైనా కలకాలం కలసి జీవనయానం సాగించే యోగం లేకపోయింది. మొదటి కళత్రం పోయిన 1881 ప్రాంతంలో సుబ్బారాయుదుగారు ఇందాక చెప్పుకున్న కళత్ర వియోగానికి సంబంధిచిన కవితా సంపుటి రాసారు. కవిగారు రాసారు కానీ.. ప్రచురించేందుకు ఏ పత్రికా ముందుకు రాని దుర్గతి. కొక్కొండ వెంకత రత్నం పంతులుగారే తన ఆంధ్రభాషా సంజీవని పత్రికలో మొదటి సారి దాన్ని అచ్చువేసారు. దరిమిలా అది ఒక సంపుటిగా వెలువరించడం.. అశేషమైన ప్రచారం సంపాదించుకోవడం.. అదో విశేషం. అక్కడితో అయిపోతే ఇక్కడ ఈ కథ చెప్పుకునే అవసరమే ఉండేది కాదు.
సుబ్బారాయుడిగారి సతీ స్మృతి చదివి విశేషంగా ఉత్తేజం పొందిన వారు అసంఖ్యాకులు, అందులో కొమఱ్రాజు లక్ష్మణరావుగారూ ఒకరు. ఆ కావ్యం చదివిన ప్రభావంతో ఆయనా వియోగ గీతి ఒకటి మరాఠీలో వెలువరింప చేసారు. యథాప్రకారం దానికీ అశేషమైన పాఠకులు స్పందించారు. కవిగారికి ఇంత చిన్నవయసులోనే కలిగిన కళత్రవియోగానికి చింతించని సహృదయుడు లేడు. ఉత్తరాల ద్వారా ఊరడించే వాళ్ళు కొందరైతే.. వీలు కల్పించుకొని మరీ కొంతమంది శోకతప్తులు ఏకంగా పూలదండలు పుచ్చుకొని మరీ పరామర్శలకొచ్చేవారు కొందరు! కొసమెరుపేమిటంటే.. కొమఱ్రాజు వారికి అప్పుడు నూనూగు మీసాల వయసే. భార్య సంగతి పక్కనుంచి.. అప్పటి మన సంప్రదాయాల ప్రకారం ఇంకా మగపిల్లవాడి ముందు పెళ్లి ప్రస్తావనలు సైతం తీసుకురాకూడని తరుణం!
ఈ అనుభవంతో జడిసిన కొమఱ్రాజువారు కవిత్వం రాయడం బంద్. ఆ తరువాత ఆయన రాసినవన్నీ  కవిత్వానికి ఆమడ దూరంలో ఉండటం గమనార్హం!
(సోర్స్ః ఆరుద్రగారి సమగ్రాంధ్ర సాహిత్యం 4వ సంపుటి- పుట 235)

(అంతర్జాతీయ వితంతు దినోత్సవం  23, జూన్  సందర్భంగా రాసింది)
-కర్లపాలెం హనుమంతరావు

అమ్మోరు .. రావాలి వన్స్ మోర్!-గ్రామసీమల సంస్కృతి



గ్రామాల రూపం మారినా గ్రామాచారాలు కొనసాగుతున్నాయ్ ! ఊరికో గ్రామ దేవత.. ఊరంతా ఆమె ఇల్లు. పాడిపంటలు, నీటి వనరులు, నీతి అవినీతి ఆమె బాధ్యతలు. దారి తప్పితే  శిక్షతప్పదు.పెద్దా చిన్నా లేదు  ప్రేమాభిమానాలకు. పిల్లలు, స్త్రీలు, ముదుసలులు, వైకల్యం ఉన్న వాళ్ల మీద పిసరంత పక్షపాతం ఎక్కువ. కోపం వచ్చినా, ప్రేమ కలిగినా ప్రకృతి ద్వారానే ప్రకటిస్తుంది. ఆ సూచనలు మాతంగి మాటగా  ముందే  హెచ్చరిస్తుంది. భారతీయ .. ద్రవిడ.. గ్రామీణ సంసృతి ఇది. శతాబ్దాలబట్టి కొనసాగే ఈ విశ్వాసాలను ఏకమొత్తంగా నేలమట్టం చేయడం ఎంత బలమైన ఉద్యమం వచ్చినా  సాధ్యం కాని పని. లౌకిక భావజాలం మీద విశ్వాసం కలిగి ఉన్న రాజకీయ పక్షాలు ఈ భారతీయ ద్రవిడ సంస్కృతి విశిష్టతను అవగాహన చేసుకోక తప్పదు.  గ్రామదేవతల అనుగ్రహాలకని జానపదులు ఏటేటా కొలుపులు చెయ్యడం తప్పనిసరిగా భావిస్తారు. రక్తపానం, ఆసన సేవనం ఆమ్మతల్లులకు  ఇష్టం. అమ్మ కొలుపులకు బ్రాహ్మలు పనికిరారు. కుమ్మరి విగ్రహం చేస్తే, చాకలి బలిపీఠం దగ్గరకు చేరుస్తాడు. ఈడిగ మనిషి పసుపు కుంకుమలతో అలంకరిస్తే, మాల మాదిగలు ఊరేగిస్తూ వేటపోతును బలిస్థలికి చేరుస్తారు. బానల నిండుగా కల్లు అందించే పని ఈడిగలదే. బోనాలు వండి పంపే బాధ్యత ఊరిపెద్దలది. ఆసాదులు అమ్మవారి మీద పాటలు పాడటం, మాతంగి నృత్యాలు చేయడం కాలానుగుణమైన మార్పులతో ఆ సందళ్లన్నీ పూర్వం కన్నా ఇప్పుడు పటాటోపంగా జరుగుతున్నాయ్. ఓటు బ్యంకు రాజకీయాల్లో ఊరి దేవతలు సైతం మిగతా అన్నింటి మల్లేనే పావులుగా మారిపోయారు. పోతు వేటతో మొదలయ్యే బలి తతంగం ఊరివాళ్లు తెచ్చిన సన్నజీవాల హతంతో కొనసాగుతుంది చాకళ్ల ఆధ్వర్యంలో. చంపిన పోతు నోట్లోనే దాని కాలు కుక్కి, నెత్తురు బోనాలతో సహా కమ్మరిచేసిన చెక్కబండి మీద ఊరేగింపు జరుగుతుంది. కల్లు తాగి చిందులేస్తూ కొమ్ము బూరాలు, తప్పెట్లు చేసే కోలాహలం  అంతా ఇంతా కాదు. ఎంత సందళ్లు సాగుతున్నా నెత్తురు కలిపిన బోనాన్ని 'పొలి.. పొలి ' అంటూ పొలికేకలు పెడుతూ ఊళ్లో వెదజల్లేటప్పుడు అంతా నిశ్శబ్దం! అమ్మోరి మీద ఉండే భక్తి అలాంటిది మరి! బలి పశువుల పేగులు నోట కరుచుకుని పొలి ఊరంటా జల్లేవారు మాల మాదిగలు. కొన్ని చోట్ల కొన్ని పద్ధతుల్లో కాలాన్ని బట్టి మార్పులు జరుగుతున్నా.. ఈ రకమైన కొలుపులు, జాతర్లలో ఇప్పుడు ముఖ్యమంత్రులు, ముఖ్యమైన మంత్రిపుంగవులు  సైతం నెత్తి మీద  బోనాలు మోస్తూ కనిపిస్తున్నారు. ప్రజాస్వామ్యం.. ప్రజల మనసుల్ని గెలుచుకోవాలంటే ఈ రకం టక్కు టమారా విద్యలు తప్పనిసరి అన్నట్లు సాగుతున్నాయ్  సెక్యులర్ స్టేట్ గా మనం గొప్పలు పోతున్న ఈ దేశంలో! గ్రామదేవతల  మీద భయభక్తులతో అన్ని కులాలవారు అంత ఒద్దికగా గ్రామదేవతలకు పూజాపునస్కారాలు చేసుకునే ఈ నిజమైన సెక్యులర్ సమాజంలో పెద్ద  కులాలవారు(కమ్మ, రెడ్డి .. ఇప్పుడు కొత్తగా కాపులాంటి) తమ తమ కులాల పాలన ఆధిపత్యాల  కోసం నీతి. అవినీతి, సామాజిక న్యాయం.. అన్యాయం, వరసావావి వంటి కట్టుబాట్లలో కూడా చిచ్చు పెడుతున్నారు. దైవదూతలమని భేషజాలకు పోయే బ్రాహ్మల వంటి కులాలు మధ్యదళారులుగా మారి మరింత భ్రష్టు పట్టిస్తున్నారు. తమకు జరిగే అన్యాయాన్ని ప్రతిఘటించాల్సింది పోయి అసలే అనైక్యంగా ఉన్న ఉత్పాదక వృత్తులవాళ్లు తమలో తాము మరింత పేచీలు పెట్టుకుంటో రొట్టె ముక్కను మళ్ళీ పెద్ద కులాలవాళ్ల నోటికి నేరుగా అందిస్తున్నారు. కులాల కుమ్ములాటలకు తోడు ఇప్పుడు అదనంగా మత దుర్రాజకీయాలూ తోడై సామాజిక ప్రజాస్వామ్య పాంచాలికి   బహిరంగ వస్త్రాపహరణ జరుగుతోంది. ప్రజాస్వామ్య పితామహుల మౌనం మరింత చేటు తెస్తోంది. ప్రకృతి ఉత్పాతాలనుంచి రక్షిస్తుందని విశ్వసించే అమ్మోర్లయినా ఇహ కన్నెర్ర చేయాలి కదా! సునామీలు, క్షామాలు , అంటురోగాలకన్నా ఎక్కువ చేటు ప్రజాస్వామ్యానికి వ్యక్తుల వరకే పరిమితం కావాల్సిన ఈ మతం, కులం విశ్వాసాలు! 
-కర్లపాలెం హనుమంతరావు

Sunday, February 10, 2019

దేవునిబిడ్లు (కత) సడ్లపల్లె చిదంబరరెడ్డి



- ** ** ** మీరు దీన్ని నిజమన్నా అనుకొండి! అబద్దమన్నా అనుకొండి!!అది మీ ఇష్టం!! నేను పెద్ద బుక్కులు సదవ లేదు.నోరు తిరగని పరాయి మాట్లు నేర్సలేదు. అన్నీ సదివి గడ్డాలు,మీసాలు నెర్సినోళ్లు ఏమి రాతలు రాసిండారో !ఏమి కూతలు కూసిండారో నాకి అసలుకే తెలీదు. ఈ జనాల్నంతా సూస్తావుంటే,ఇంతకు ముందు జరిగిన సంగతంతా ఒగసారి మీకు సెప్పుదామనిపిస్తావుంది. యనకటికి దేవునికి--ఆయప్ప లోకంలోని దేవాను దేవతల నంతా సూసి,వాళ్ల యవ్వారాలన్నీ ఇని శానా బేజారయి  పాయనంట!'తూత్.. ఏమిరా ఈళ్ల పాడు బుద్దులు, గలీజు పన్లు. అంతా సెడి సెన్నూరు తిప్పలు పట్టిండారు. ఈళ్లని సక్క జేసేకి నా శాతగాదు. ఇంగొగ కొత్త లోకం ఏర్పాటు సేస్తే బాగుంటాదీ అని మనసులోనే అనుకొన్నంట. అనుకోనుందే తడువు సంగటి ముద్ద మాదిరి ఒగ గోళాన్ని తయారు సేసి, పైన్నుండి ఆకాశంలోకి పారేశనంట. అది గిర్ర్ న బంగరం మాదిరీ తిరగ బట్నంట. 'తోకెనక నారాయణా' అని దేవుని సుట్టూ తిరుగుతా వున్నంట. అపుడు దేవుడు కొన్ని బొమ్మలు తయారు సేసి రూపాలు ఇంగడిచ్చి దోసిట్లోకి తీసులోని, వాటి నోట్లోకి సుక్కుడు సుక్కుడు ప్రాణం పోసినంట. అపుడు ఆ బొమ్మలు గుడ్లలోనుండి బయటికొచ్చిన కోడి పిల్లల మాదిరీ దేవుని సేతుల్లో బిలబిల తిరగబట్నంట. దేవుడు రవ్వంత సేపు ఆ జీవుల్ని అట్లే సూసి మాటలు నేర్పిచ్చి "మనుషులు" అని పేరు పెట్నంట. "ఈ దినం నుండి మీరు బొమ్మలు కాదు. జంతువులూ కాదు. బంగారట్లా ఆలోశన సేసే మనసున్న మనుషులు. మీరంతా ఆ గోళం మీదికి దుమికి హాయిగా బతుక్కో పోండి" అని సెప్పెనంట. ఏడిదీ ఆదారం లేకుండా గిర్ గిర్ న యంత్రం మాదిరీ తిరుగుతా వుండే దాన్ని జూసి వాళ్లు బయంపడిరంట. ఏమి సేయల్లో తెలీక, నిలువు గుడ్లేస్కోని, బిర్ర బిగుసుకోని నిలబడి పాయరంట. దేవుడు వాళ్లకి శానా సెప్పు సూసినంట."ఒరే! అది బూమిలోకము. మీకోసరం కన్నగసట్లూపడి తయారు సేసిండాను. ఆ తావకి సేరుకోని మానాలుండే మానవ లోకం తయారు సేసుకొండి" అని గడ్డాలు పట్టుకోని అడుక్కోని సిలక్కు సెప్పినట్ల సెప్పినంట. అయినా వాళ్లెవురూ ఇనలేదంట. అపుడు దేవునికి కోపము నసాళానికి ఎక్కినంట. "ఇదిగో నేను కండ్లు మూసుకోని, మూడంకెలు లెక్కబెట్టే లోపల ఈట్నుంచి ఎల్లిపోవల్ల. పోకుంటే మిమ్మల్ని ఏమి సేస్తానో నాకే తెలీదు." అని కండ్లకొద్దీ కోపం సేసుకోని కండ్లు మూసుకొన్నంట. 'ఆత్రగాడికి బుద్ది మట్టు ' అన్నట్ల యనకా ముందూ సూడకుండా ఒగడు బిర్న బూమిలోకం మీదికి 'ధఢుం' న దుమికి పారేశనంట. వాడు ఎర్రోని మాదిరీ బూమ్మీదికి 'ధభాల్ 'న పడింది సూసి మిగిల్నోళ్లు ఎర్సుకోని, గడగడ్న అదురుకోని దేవుని నోట్లోకి,ముక్కులోకి,సెవుల్లోకి...ఇట్ల యాడ సందుంటే ఆడ దూరి దాచి పెట్టుకొన్న్రంట!! మూడంకెలు లెక్కబెట్టేది అయినంక, దేవుడు కండ్లు తెర్సి సూస్తే దోసిట్లో ఎవరూ లేరంట! బూమ్మీదికి తొంగి సూసెనంట. ఒగడు మాత్రం సీమిడిలో తగులుకొన్న ఈగ మాదిరీ బూమ్మీద పడి తనుకులాడ్తా వుండాడంట. మిగిల్న జనాలు ఏమై పాయిరప్పా!! అని దేవుడు బూమండలమంతా అంజనం ఏసినట్ల ఎదికినంట. యాడా కనిపిచ్చలేదంట. "నేను పుట్టిచ్చిన జనాలు నాకే టోపీ ఏసి, నా కండ్లకే కనిపిచ్చకుండా యాటికి మాయమై పాయిరప్పా??" అని సందేహం పడినంట. ఇంగొగసారి దుబిణీ ఏసి ఎదికినట్ల బూమండలం ఒగపక్కనుంచి అంగుళమంగుళమూ గాలిచ్చినంట. అయినా కనిపించలేదంట. సివరాకరికి-- "ఈళ్లు కంటి పాపలకి తెలీకుండా కన్ను రెప్పల్ని కత్తిరించే రకం మాదిరీవుండారు" అని అనుకోని, బయటి సూపులు సాల్జేసి, అంతరంగం లోనికి తొంగి సూసుకొన్నంట. యపుడయితే దేవుని సూపులు,దేవుని లోపలికి ఎలుగులు మాదిరీ జొరబడ్నో.. అవుడు వాళ్లకి బయ్యమయి పాయనంట. కన్నాల్లో దూరుకోనుండే యలకలకి, ప్యాడపిడకల్తో ఊదర బెడితే యట్ల అవి బయటికి ఉరికెత్తుకొస్తాయో అట్ల భగమంతుని శరీరములోని సందుల్లో నుంచి సర్ న బయటికొచ్చిరంట. అపుడు దేవుడు వాళ్లని సేతుల్లోకి తీసుకోని "ఒరే! తప్పుడు నా కొడుకులూ!!నేను మీకు సెప్పిందేమి? మీరు సేస్తావుండేదేమి??"అని నొటికొచ్చినట్ల తిట్టి పారేసినంట. దానికి వాళ్లు "స్వామీ! మాన్నబావా!! మమ్మల్ని ఈడ పుట్టిచ్చి ఆడ పారెస్టే, యట్ల బతకల్ల? బతికే తత్వం తెలిసేదంకా నీ అంగాల్లో సేరుకోనుండి, పరాన్న జీవులమాదిరీ బతుకుతాము" అని మొర పెట్టుకొనిరంట. అపుడు దేవుడు తలతలే కొట్టుకోని "ఈ దేవలోకం సూస్తే అంతా మోసగాళ్లు. జనాలందర్లోనా లేని పోని బయాలు పుట్టిచ్చి--యాగాలూ, నోములూ, పూజలూ, శాంతులూ, వాస్తులూ, దానాలూ … ఇట్లా అర్తంపర్తం లేని పనుల్ని సేపిచ్చి కూకోని తినేదానికి రుసిమరిగిండారు. బతుకనేది మర్సి నాటకాలే జీవితమన్నట్లు తయారయ్యిండారు. యన్ని ఉపదేశాలు సేసినా ఈ సెవిలో యిని ఆ సెవిలో ఇడిసి పెడతావుండారు. దాని కోసరమే--- దేవలోకమోళ్లు సూసి సిగ్గుపడే రకంగా బూమిలోకం తయారు సేస్తాము అనుకొంటి. మీరు సూస్తే ముంతడు నీళ్లకే ముక్కు మూసుకొనే ముదనష్టం నా కొడుకుల మాడిరీ వుండారు!" అని మనసులోని బాధనంతా యళ్లగక్కినంట. భూమి లోకంలోనికి వాళ్లనట్ల తొంగి సూడమనినంట. *** **** *** *** ***** **** యాడసూసినా పచ్చపచ్చగా వుండే అడవులు. తళతళామెర్సే కొండలు, గుట్టలు. గలగలా పార్తావుండే ఏర్లు. వంకల్లో పిళపిళా ఈదులాడ్తావుండే సేపలు. బక్కల్లో బెకబెకా అరుస్తావుండే కప్పలు.సెట్లమీద కిలికిలా అరుస్తావుండే గువ్వలు. కసువు మేసుకొంటా బుడుగుబుడుగున ఎగురులాడతావుండే జింక పిల్లలు.పట్పట్న రెక్కలు కొట్టుకోని ఎగుర్తావుండే పక్షులు.సర్ న జారి పోతావుండే పాములు. కొమ్మల మింద ఎగిరి దుముకుతావుండే కోతులు. కండ్లకి ఆనందం తినిపిచ్చి శబ్దమే లేకుండా గాళ్లో తేలి పోతావుండే ముత్యాలమ్మ పులుగులు (సీతాకోక చిలుకలు) ఇట్ల ఒగిటిగాదు రెండుగాదు, బూమండలమంతా అందాలు ఒలకబోసి అలికి ఇంపుగా ముగ్గులు పెట్టినట్ల వుంది.దాన్ని సూసి వాళ్లు శానా ఆనంద పడిపాయిరి. అఫుడు దేవుని దిక్క తిరిగి "స్వామీ! ఘడియ ముందు సూసు నపుడు భూమండలం ఎండుకు పోయిన సంగటి ముద్ద మాదిరీ, తిరుమల పూజార్లకి సిక్కిన బక్తాదుల తలకాయ మాదిరీ నున్నగా ఉండింది కదా?? ఇంత బిరీన మా కండ్లు పట్టనంత అందం యాట్నుంచి వొచ్చె??" అని అడిగిరంట. అపుడు స్వామి "దేవలోకంలో ఒగ నిమిషమైతే ఆడ భూలోకంలో ఒగ యుగము. ఈడ కత్తిరించుకోనే గిలీటు గాళ్లు. ఆడ కష్టం సేసి బతికే కల్మషంలేని జీవులు" అన్నెంట. "అంటే వాళ్లెవురు స్వామీ??" అని అడిగిరంట. అపుడు స్వామి 'ఈళ్లు నాన్న సేతికి నామాలు పెట్టి నాన్నా నాగుబాము అనే రకం జాతోళ్లమాదిరీ వుండారు ' అని అనుకోని "కండ్లు ఇగ్గబీకి సూడండ్రా" అని అర్సినంట. అపుడు సూస్తే తలకాయకి బట్ట సుట్టుకోని, నడుంకానా పంచెగ్గట్టుకోని, ఆడా మగా పిల్లా జల్లా ముసలీ ముతకా అనకుండా ఎద్దుల్తోను, ఎనుముల్తోను, ఆవుల్తోను భూమిని దున్నతా వుండారంట. యండ, వాన, పగలు, రాత్రి అనేదే మర్సి పంటలు సాగుజేసి అందరి బతుకులకీ అన్నం పండి పెడ్తావుండారంట. వాళ్లకి భూమే ఒగ యగ్న గుండమంట . పంటలు పండిచ్చేదే ఒగ యాగమంట. మనిషంటే పనంట. పనంటే మనిషంట. కాయకష్టం సేయకుండా బతికే బదులు సచ్చేదే మేలు అనుకోనే రకమంట. అట్లా జనాన్ని సూసిన దేవునిబిడ్లు, దేవునిగ్గూడా సెప్పకుండా భూమ్మీదకి సేర్రంట. ఈళ్లూ,రైతులూ కల్సిన భూలోకం శానా బాగుంటుదని మీరనుకోవచ్చు. అట్లనుకొంటే మీరు సదువు నేర్సి సెడినోళ్లకిందే లెక్క!! యాలంటే "ఒరే !!మేము దేవుని బిడ్లు. నేను దేవుని నోట్లో నుంచి వొచ్చిండాను, నాకాకలయినవుడు నా నోటికి అన్నం అందించేది నీపని" అని ఒగడు. "నేను సెవుల్లో నుంచి వొచ్చిండాను, నేను సెప్పినట్ల ఇంటే నీకి పుణ్యమొస్తుంది" అని ఒగడు. "నేను కాళ్లలోనుంచి పుట్టిండాను, నా కాళ్లకిమొక్కి పూజలు సేస్టే స్వర్గలోకం అందుతుంది" అని ఒగడు."నేను దేవుని కండ్లలో నుండి వొచ్చిండాను నేను సెప్పిన టయానికి ఇల్లుగట్టి,పెండ్లి సేసుకో,నువ్వు నూరేండ్లు బతుకుతావు"అని ఒగడు... ఇట్ల కష్టజీవులమింద దాదాగిరీ సేసుకొంటా,కండ్లకి గంతలుగట్టి గానుగ తిప్పే ఎద్దుల మాదిరీ సేసి కాడిచ్చుకోని తింటావుండారు!! ఇంతకు ముందయితే దేవుడు భూలోకానికి అపుడపుడు వొచ్చి సూసి పోతావుండే!! దేవుని లోకం మాదిరీ భూలోకంగూడా యఫుడు సెడి పాయనో!!అపుడు ఆయప్ప వొచ్చేదే ఇడిసి పెట్టిండాడు.అందుకే ఈ లోకంలో దేవునిబిడ్లు ఆడింది ఆట! పాడింది పాట!! అయి జరిగి పోతావుంది
-సడ్లపల్లె చిదంబరరెడ్డి

చెత్త చెత్త చట్టాలు!- సూర్య దినపత్రిక వ్యంగల్పిక- -జి.ఎస్.దేవి





ఇజ్రాయిల్లో పుచ్చకాయలు బహిష్కరించారు ఒకానొకప్పట్లో. అయినా ఏ నిందలపాలూ కాలేదు అక్కడి ప్రభుత్వాలు అప్పట్లో. అదే మన ఇండియాలో అయితేనో? పాలుపోసే
సాంబయ్య చెంబులో  నాలుగు చుక్కల నీళ్లెక్కువ కలిపినా  పాలకులదే ఆ
పాపభారమంతా! ఇండిగో విమానం ఫర్ సేల్ కని వచ్చినప్పుడు చూసాం గదా ఆ కనీ
వినీ ఎరుగని గోల!
నార్త్ కొరియాలో నో మెక్డొనాల్డ్ అన్నారింకోసారి.  నారికేళాలతో
సరిపుచ్చుకున్నారే తప్ప నోరెత్తి..   ఒక్క బక్కజీవైనా గద్దించలేదెవర్నీ!
అదే ఇక్కడయితేనా? ఖాళీ మందు గళాసులతో నడిరోడ్ల మీద కొచ్చిపడి చేసే గలాటా
అంతా  ఇంతానా! పాక్షిక మద్యపానమైనా సరే.. సంపూర్ణంగా నిషేధించిందాకా
బీహార్ నితీష్ బాబును  నిద్రపోనిచ్చిందా  దేవదాసుల బృందం!
మరీ అంత చుక్క మీద నాలుక పీకితే ఇంచక్కా  ఐర్లాండు పోతే సరిట! అక్కడ ఏ
పరీక్ష రాసే నెపంతోనో  హాల్లో చేరగిలబడి బల్ల మీదో కత్తి గుచ్చేస్తే
ఫినిఫ్! ఫ్రీగా పీకల్దాకా ఎన్ని పింటులైనా తాగేసేయచ్చు! విధ్యార్థులైనా
సరే.. టెస్టులు రాసేటప్పుడు నోట్లో గొట్టాలు గట్రా పెట్టే టైపు ఆల్కహాల్
టెస్టులు చట్టవిరుద్ధంట అక్కడ!
అంత కన్నా చెత్త చట్టముంది ఓరేగావ్ అని ఓ మరో చిన్న ఊర్లో! ఎంత వరకు
నిజమో తెలీదు కానీ.. అచ్చోట బళ్లల్లో ఆడపిల్లలు  ముచ్చటకైనా అచ్చోసిన
లేగదూడల్లా జుట్టూ జుట్టూ పట్టుకు కొట్టేసుకోడం నేరం. ఆ తరహా చట్టం మన
దగ్గర సర్దాకోసమైనా పెట్టి చూడండి! టీవీ చర్చల్లో ఒక్క పురుగైనా
కనిపించదు. చట్టసభల్లో   పోటీకి  ఒక్క శాల్తీ  అయినా సిద్ధపడుదు.
గ్యారంటీ!
మిన్నెసోటా అనే మరో చోట మగాళ్లు గడ్డాలు గీక్కోడం నేరం.  నెబ్రాస్కా అనే
ఇంకో వింత ప్రాంతంలో  పబ్లిక్ షేవింగులకు చట్టం అడ్డం. మన దగ్గర బాహాటంగా
తలలు తెగతరుక్కుంటున్నా రక్షకదళం ఆ తరహా సిల్లీ గలాటాల జోలికి ఛస్తే
పోదు.. నరికే శాల్తీ ఏ పెద్దమనిషి తాలూకూ సరుకు కాదని తేలే వరకు!
థాయ్ లాండులో అండర్ వేర్ లేకుండా అపార్టుమెంటు గ్రౌండులో కూడా
కనిపించకూడదు.  ఇండియాలో ఆ మాదిరి బండచట్టాలేం పనిచేస్తాయ్? బంజారా,
బూబ్లీ, ఫిల్మ్ నగర్ పరిధులయినా సరే.. నో ప్రాబ్లం! ఎంత జాలీగా
బజార్లల్లో పడి బడితెప్రొటెస్టులు చేసుకుంటే అంత హ్యాపీగా పాప్యులారిటీ
ప్లస్సయిపోతుంది! పది హిట్ మూవీలల్లో తన్నుకులాడి చచ్చినా  పట్టించుకోని
జనాలు ఒక్క పావుగంట వైరల్ వీడియోతోనే  నీరాజనాలు పట్టేస్తారు
వెర్రెత్తిపోయి!
ఇండియన్ పీపుల్ ఎంతో  లక్కీ! ఊటా లోలా  ఆలి కారూ గట్రాలు బైటికి తీసి
షికారుకని బైలుదేరితే ఎర్ర పీలికోటి చేతపట్టి మొగుడనేవాడు ముందు
నడవనక్కర్లేదు.
మిన్నెసోటాలో మరీ సోద్దెం! వంటి మీదొక్క నూలు పోగైనా లేకుండా కంటి మీదకు
కునుకు రాకూడదు. కాదంటే తెల్లారిసరికల్లా పళ్లు తోముకొనేది జైలు
ఊచలకవతాలే సుమా!
అన్నట్లు రోజులో రెండోసారి పళ్లుతోమేందుకు ప్రయత్నిస్తే పోలిసోళ్ళొచ్చి
పట్టుకుపోతారుట  రష్యాలో! ఇదాహో అని మరో వింత ప్రాంతం! ఇదీ  ఎంత వరకు
నిజమో తెలీదు కానీ.. ఇక్కడ తలకు తుండు  చుట్టుకుని బైటెక్కడైనా కనిపిస్తే
తక్షణమే శ్రీకృష్ణ జన్మస్థానం ప్రాప్తిరస్తు! మరదే  మన దేశంలో? తుండు
తుపాకీ గుండు కన్నా  పవర్ ఫుల్! మన నేతాశ్రీలేసే పగటి వేషాలెన్ని
చూస్తున్నాం! గుండు మీద తుండు, మెళ్లో ఓ  ఎర్రటి  తువ్వాలూ ఉంటే సరి..
తుక్కుజనాల కష్టసుఖాలల్లో పాలుపంచుకున్నట్లే! తిక్క లెక్క!
ఇటలీది ఇంకో ఇరగబాటుతనం! జుట్టుకు రంగేసుకోడం.. విరగబోసుకు తిరిగేయడం
అక్కడ మహా విశృంఖలత్వం కింద లెక్క! మరిక్కడో? నోట్లో పళ్లన్నీ రాలిన
పండుకోతి తాతయినా ఓకే! తలకో బెత్తెడు మందాన నల్లరంగు బెత్తి తా తై.. థక్
దిమ్.. తా తై థక్ ధిమ్ అంటూ రిథమిక్కా  ఓ రెండు స్టెప్పులేసేస్తే సరి!
అభిమాన సందోహాల ఆనంద పారవశ్యాలతో వెండితెరలన్నీ చిరిగిపోవాలి! నెత్తి మీద
ఏ రంగూ పడనందుకే   కదండీ.. పాపం అంత లావు  సీనియర్సయి ఉండీ అద్వానీజీ
అండ్ కో  రాజకీయాల్లో మాజీ గుంపులోకెళ్లి పడిందీ!
అంగోలాలో మరో రకం గోల! ఆడజీవిగా పుట్టడం శాపం అక్కడ. అడపా దడపా అయినా సరే
జీన్స్ డ్రస్సులేసుకోడం నేరం! మన దగ్గరో? నయీం లాంటి బడాచోర్లూ,
వంచకులక్కూడా చోళీ.. లంగాలే తప్పించుకొనే షార్ట్ కట్ రూట్లు. ఆడవేషంలో
అతగాడేసిన వేషాలు పక్క పాకిస్తానులో గానీ అయితేనా.. మడిచి పొయ్యిలో
పెట్టేస్తారు!
ఫ్లోరిడాలో కోడిపిల్లలు రక్షణ జాతికి చెందిన జీవాలు. తినే బొచ్చెలో వాటి
బొచ్చింత కనిపించినా చచ్చినట్లు..  మిగతా భోజనమంతా బొక్కలోకెళ్లే
బొక్కేది!
కొలొరాడో పిల్లుల  ఖర్మ! చీకట్లో మ్యావ్ మన్నా  పర్మినెంటుగా వాటి తోకలు
కట్ చేసెయ్యాలన్నది అక్కడి  చట్టం! అదే ఇండియన్ పిల్లులయితేనో? గోడల మీద
చేరడం తరువాయి.. దిగేటంత వరకూ  అలకపాన్పు మీది  అల్లుడికి మించి
మనుగుడుపులు!
ఇండోనీషియాలో, ఐస్ బెర్గ్ ల్లో కుక్కల్ని వేటాడ్డం, పెంచడం శిక్షార్హమైన
నేరంట. మన దగ్గర  అందుకు పూర్తిగా విరుద్ధం.  ఆవేశకావేశాల్లో ఏదో  కుక్కల
 మీదట్లా  కాస్తింత ఆక్రోశం వెళ్లనోసినా .. ఎన్నికల వేళొచ్చే వేళకి
ప్రధానంతటి పై  స్థాయి పెద్దమనిషి కూడా  దేశానిక్కావలి కాసే  పెద్ద కుక్క
అవతామెత్తేస్తాడు!
నార్త్ కరోలినాలో రక్తసంబంధీకలు అయినా సరే విత్ ఇన్ లా లో ఉంటే 
సనో-ఇన్-లా నో,,, డాటర్-ఇన్‌-లా నో అయుపోవచ్చు.  సొసైటీకి సైతం నో
అబ్జెక్షన్! 'ఛీఁ పాడూఁ' అంటూ అలా  ఫేసులు పెట్టద్దు! గెలిపించిన
పార్టీకే ఛీఁ కొట్టేసి మళ్లీ  మరో పార్టీ జెండా పట్టుకొనొచ్చే గో.పీ
లకు ఛీఁర్స్ కొట్టి మరీ  మనం ఓటేసి గట్టెక్కించేయడంలా ఇక్కడ!
కంప్యూటర్లో సిరిని ససవాలక్ష ప్రశ్నలడుక్కోండి! ఏ మాత్రం ఉడుక్కోదు
ఫ్లోరిడాలో! ఫ్యాక్టో కాదో! ఏదో ఫ్లోలో ఎవరైనా అన్నారో ఏమో.. తెలీదు
కానీ.. హాస్యానికైనా ఫలానా శవం ఏ గదిలో దాగుందని  దగుల్భాజీ ప్రశ్నలు
వేశారనుకోండి! వల్గర్గా మాట్లాడినందుకు ఆనక  విచారించాల్సింది   కటకటాల
వెనకాల తీరిగ్గా చేరి!   మన దగ్గర  నట్టింటి ఆడబిడ్డను  ఏ పరువు వంకనో
చిత్రహింసలు పెట్టి చంపినా ఏళ్లకేళ్లు విచారించడాలే తప్ప.. ఫట్ మని
చర్యలు చేపట్టే చట్టాలేవీ.. చిత్రం కాకపోతే!
---        ---        ---
 అబ్బబ్బ! ఆపవయ్యా సామీ! అసలే అవతల పెద్దెన్నికలు.. ఆ రవంధాళీతో  ఇక్కడ
థణుకులదిరిపోతుంటేనూ.. మధ్యనేంటి నీ సోది! వేళాకోళాలక్కూడా
వేళాపాళాలుంటాయి నాయినా! మరీ అంతలా గిలకాలని చెయ్యి సలపరంగా ఉందా?  మన
దగ్గరే  చచ్చుబండ చట్టాలు సవాలక్ష పడి ఏడుస్తున్నాయ్.. ఏళ్ల తరబడి
బక్కజీవులనదే పనిగా ఏడిపించుకుంటూ! కలేజా ఉంటే వాటి మీదనయ్యా ముందు నీ
కలం ఝళిపించాల్సిందీ! ఎక్కడో న్యూ జెర్శీ కహానీలు ఇక్కడ మనకవసరమా..
చెప్పు? చెప్పులు నేరుగా ముఖాన పడితేనే  దులపరించుకుపోయే దున్నపోతులు మన
నేతలు! అన్యాపదేశంగానే అయినా సరే.. ఇలా ఉపదేశాలకు తెగబడితే  ముందు
అన్యాయమైపోయ్యేది నువ్వే సామీ! నెట్టింట్లో టైం పాసు వరకేరా పిచ్చోడా
నువ్ చెప్పుకొచ్చే ఈ చెత్త ఊసులన్నీ! ఆ పక్కనెక్కడో ఓ మూల పడున్నదా
బుల్లి దేశం జపాన్! అక్కడ ఈడొచ్చిన ఆడబిడ్డలు నైన్ టైమ్స్ కి మించి  నై
డేటింగులకు నై అంటే డేంజర్! మొగుడు రాలగొట్టిన పళ్లైనా సరే .. మళ్లీ
కట్టించుకోవాలంటే ఆ  మొగ్గాడిద  పర్మిషనే తప్పనిసరి  పెర్మెంటోలో!
ఆర్కాన్సానా అని మరో దిక్కుమాలిన దేశం. అక్కడా తాళికట్టిన వెధవ పెళ్లాలను
చిత్తమొచ్చినంత సేపు  చితక్కొట్టుకోవచ్చంట! కానీ ఆ  కోటింగుల కోటా గాని
నెలకోటి దాటిందంటే.. ముందా   మొగుడుగాడికే పోలీసోడి బూటుతో సత్కారం! ఒక్క
సెకనుకు మించి ముద్దులాట్టం మైనే దేశం చట్టానికి గిట్టదంట!  పెళ్లాం
పుట్టిన్రోజు గాని మర్చిపోతే పోలిసోడొచ్చి లాఠీతో గుర్తుచేస్తాట్ట  నమోనా
 అనే మరో నరకంలో! ఇద్గిదిగో.. ఇట్లాంటి చెత్తా చెదారాన్నంతా ఏ నెట్లో
నుంచో కొట్టేసుకొనొచ్చేసి మన  చట్టాలను అట్లా పడేసి
వెక్కిరించేస్తున్నావ్ పెద్ద మహా!  దేశభక్తి దండు సంగరి మర్చిపోతున్నావ్
మహాశయా! నువ్వే  అదేదో కొత్తగా ఘనకార్యాలన్నీ ఆవిష్కరిస్తున్నట్లు
ఏంటబ్బాయ్ ఆ బడాయ్?   మన దగ్గర మాత్రం అంతకన్నా మహా గొప్ప చట్టాలేమన్నా
అమల్లోఉన్నాయనా నీ ఉద్దేశం? ఈడూ పాడూ చుసుకోకుండా గుళ్లూ గోపురాల
వైపుక్కూడా రావద్దని పెద్దతలలే ఎంతలా  రాద్ధాంతాల్ చేస్తున్నాయో..
చుస్తున్నావు గదా! చిన్ని చిన్ని పాపలను పాడుచేసినా ఆ త్రాష్టులు  గానీ
ఈడేరకపోయుంటే ఏ శిక్షకు పాత్రులు కాదంటున్నాయ్ నాయనా  మన దగ్గరి అమానుష
చట్టాలు! ఒకటా రెండా?  ప్రజాస్వామ్యం పేరు చెప్పి సన్నజీవాలనలా దశాబ్దాల
బట్టి సలుపుతున్న ఈ మాదిరి సన్నాసి చట్టాలిక్కడ సవాలక్ష! చెప్పుకుంటూ
పోతే రొప్పురావడమే తప్ప లాభమేంటో చెప్పు!   రాజకీయ పార్టీలకొచ్చిపడే
చందాల సొమ్ము మీద ఎవళ్ల నిఘాలు ఉండకూడదంట! అక్రమాలు విచారణలకూ,
న్యాయమెటుందో తేల్చుకునే వెసులుబాట్లకే గదా రాజ్యాంగపరంగా మనం  అన్నేసి
సంస్థలు గొప్పగా ఏర్పాటుచేసుకుందీ! ఏ ఒక్కటైనా పొరపాటునైనా పెద్దమనుషులను
టచ్ చేసే చట్టాలు  లా బుక్కులు దాటి ఎప్పుడైనా బైటకొస్తున్నాయా?   సాగు
పేరు చెప్పుకుంటే చాలంట..   దొంగాదాయం ఏ దొడ్డిదారి నుంచి వచ్చి పడ్డా
పన్నుశాఖలకా లెక్కల బొక్కలు  చెప్పుకొనే పని లేదంట!  ఓనామాలైనా ఆనమాలు
పట్టేపాటి తెలివితేటలేమీ అక్కర్లేదు! ఎన్నికల్లో  ఏ ఈవియమ్ముల్నో
నమ్ముకొనేపాటి గడుసుదనం వంటబడితే చాలు!  ఇదేంటని  తప్పట్టే
చట్టాలేమన్నా మరి మన మహాప్రజాస్వామ్య్ంలో చాలామణీలో ఉన్నాయా నాయనా?
జల్లికట్టు,  కోడి పందెం బాపతు  మూగజీవులనైనా  బలవన్మరణాల నుంచి
కాపాడుకోలేని చట్టాల పర్యవేక్షణలో స్వామీ మనం బతుకులీడుస్తున్నదీ! తలాక్
లూ, అయోధ్య గుళ్ల చుట్టూతా ప్రదక్షిణాలు చెయ్యడానికే మన చట్టాలకు ఎక్కడి
టైమూ చాలి చావడంలేదు. పైసా చేత లేని పాపర్ గాడు ఒక్కడైనా నూటపాతిక
కోట్లమంది ఇండియన్సులో నుండి  ప్రాపర్ గా చట్టసభలకెళ్లే
ప్రజాస్వామ్యంలోనే మన మివాళ ఊపిరి పీలుస్తున్నదీ? అవేవో పేర్లు కూడా
నోటికి సరిగ్గా   తిరగని చిట్టి పొట్టి ప్రాంతాలు! సత్యాలో.. అర
సత్యాలో.. ఏవీ నిర్ధారణ కాకుండానే నెట్లో జనాలు పుట్టించే
పుక్కిటిపురాణాలు! వాటితోనా  నాయనా నీ కాలక్షేపాలు? జనసంక్షేమం కోరే
చట్టాలను గూర్చి చర్చించుకునే టైమే ఇవ్వకుండా  విలువైన ప్రజల ఆలోచనా
సమయాన్నిట్లా చెత్త చట్టాల చుట్టూతా తిప్పడమే నన్నడిగితే అసలు  పెద్ద
నేరం! బక్కోళ్ల దృష్తి వాళ్ల కష్టాలు, కడగళ్ల మీంచి   మళ్లించడానికి చేసే
 ఎత్తుగలు కదా ఇవన్నీ! నాగ్గానీ ఈ సారి ఎన్నికల్లో ఏకపక్షంగా చట్టాలు
చేసేపాటి ల్యాండ్ స్లైడ్ మెజార్టీ వస్తేనా! ముందు.. బెయిలు కూడా దొరకని
వందేళ్ల కఠిన కారాగారశిక్ష వేసే చట్టం తీసుకొచ్చేస్తా ఖాయం! అంతకన్నా
ముందసలు నీ బోటి బఠానీరాయుళ్లందరి పుఠమార్చేటంద్కు ఈ
పుక్కిటపురాణాలన్నింటినీ ఎలక్షన్ కమీషన్  తరహాలో  ఏక్ దమ్ నిషేధించవతల
పారేస్తా!
హ్హా.. హ్హా.. హ్హా!  చైనాలో చదూకునే పిల్లకాయలకు గూగుల్ నిషిద్ధం!
టర్కీ పౌరలందరికీ ట్విట్టరు నిషిద్ధం!  ఒమాన్ లో ఆడంగులకు ఫేసుబుక్కూ,
ట్వట్టర్లూ రెండూ నిషిద్ధం. కతార్ లో అమ్మళ్ళకు మేకప్పు సరుకు నిషిద్ధం.
మోంటానాలో ఆడపిల్లలకు యోగా డ్రస్సులు నిషిద్ధం. రష్యాలో రోజుకు ఏడు గంటలు
మించి  నిద్ర నిషేద్ధం. కెనడాలో  పాతికేళ్ళు లోబడ్డ బడుద్ధాయిలకు బీరు
గట్రా నిషిద్ధం. ఏ నిషేధ చట్టం ఎక్కడ ఏ మేరకు సవ్యంగా అమలవుతుందో  నా
దగ్గరైతే ఇప్పటికిప్పుడు అంతగాఠ్ఠి సమాచారం లేదుకాని బాబాయ్..  మన దగ్గర
మాత్రం చట్టాలు ఎంత ఓటిగా ఉన్నాయో.. ఉన్నవి ఎంత మొక్కుబడిగా చలామణీ
అవుతున్నాయో.. ఉదాహరణలతో సహా సవివరణాత్మకంగా తెలియచేసే  బిలియన్ టిబి
డాటా ప్రస్తుతానికి సిద్ధంగా ఉంది.  బీ రెడీ! నెట్ ఓపెన్ చేసేస్తున్నా!
ఓరి దేవడో.. మా కంఠశోషే తప్ప మీ సోషల్ నెట్ వర్క్ గాసిప్పు
గాళ్లెప్పటికీ ఛస్తే మారర్రో దేవుడోయ్!
మైన్ మేటరు ఇంకా నీ ముసలి మైండుకే బోధపడ్డంలేదు పిచ్చి బాబాయో! ముందటి
సర్కార్లు చేసినవన్నీ ఎట్లాంటి చెత్త చట్టాలో సోషల్ నెట్ వర్కులెంటబడి
చాటుకోబట్టే   ఇప్పటి సర్కార్లకూ ఐదేళ్లపాటు చెత్త చెత్త చట్టాలు
చేసుకొనే ఛాన్సు దక్కింది ముసలి బాబాయో!
***

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...