Showing posts with label Stories. Show all posts
Showing posts with label Stories. Show all posts

Saturday, December 18, 2021

పాత బంగారం : కథానిక కథ: భారతి - మాస పత్రిక - నవంబరు, 1986 నిరీక్షణ - ఎ.వి. వి. ఎస్. ఎస్. ప్రసాద్ సేకరణ : కర్లపాలెం హనుమంతరావు




 



పాత బంగారం : కథానిక 

కథ: భారతి - మాస పత్రిక - నవంబరు, 1986 

నిరీక్షణ 

- ఎ.వి. వి. ఎస్. ఎస్. ప్రసాద్ 

సేకరణ :  కర్లపాలెం హనుమంతరావు 


యంత్రంలా సాగిపోతున్న జీవన సరళిలో అతనిరాక ఒక గొప్ప అనుభూతి. 


జీవితంలో ఎదురైన చేదు అనుభవం అతని జీవితాన్నే మార్చేసింది. అనుభూతినే ఊపిరిగా పీలుస్తూ దూరమై పోయిన 'ఆనందాన్ని ఆస్వా దించడానికి, అందుకోడానికి ప్రయత్నిస్తున్నాడతను....


నిరీక్షణలో మాధుర్యాన్ని అనుభవిస్తున్నాడా? |


ఆదో విచిత్రమైన స్థితి.అతనిది:


అనందం లాంటి విచారం . విచారం లాంటి ఆనందం


అదో చిన్న రైల్వే స్టేషన్.

నేనక్కడ అసిస్టెంట్ స్టేషన్ మేష్టార్ని.


ఈ ప్రాంతానికి బదిలీ అయి దాదాపు రెండేళ్ళు అయ్యింది. ఇక్కడ కొచ్చిన కొత్తలో ఇక్కడి వాతావరణం అలవాటు అవ్వడం కాస్త కష్టమే అయ్యింది. 


పట్నంలో పుట్టి పెరగడంవల్ల పల్లెటూరి వాతావరణం కొత్తగా, కొంచెం ఇబ్బందిగా వుంది... వచ్చిన రెండో రోజునే, జలుబు.... జ్వరం.....


వైద్య సహకారాలు పెద్దగాలేవు. ఏదో అదృష్టం బాగుండి ఓ వారం తరువాత కోలుకున్నాను.  తరువాత క్రమేణా వాతావరణానికి అలవాటు వడ్డాను. వాతావరణంతో 'అవగాహన' ఏర్పడ్డాకా, అక్కడి జనం, వాళ్ళ వేషభాషలు కూడా అర్ధమయ్యాయి. 


అంతా అర్థమయ్యాకా, అంతా ఆనందమే! అక్కడి వాళ్ళతో నేను కలిశాను. నాతోవాళ్ళు కలిశారు. స్టేషన్లో పెద్దగా పనులు వుండవు. ఎక్స్ ప్రెస్ బళ్ళు వచ్చినప్పుడు సిగ్నల్స్ చూ పెట్టడం.... రెండే రెండు 'ఎక్స్ప్రెన్సులు' వస్తాయి రోజుకి . అవి ఉదయం  వేళలలో రావడంతో... దాదాపు మధ్యాహ్నమంతా ఖాళీయే: 


మళ్ళీ సాయంత్రం ఆరింటికి ఓ ప్యాసింజర్ వస్తుంది. దాంట్లోంచి ఒకరిద్దరు కన్నా దిగరు. వెళ్ళేవాళ్ళు ఒక్కొసారి అసలు వుండరు. అడపా దడపా నాలుగైదు గూడ్స్ బళ్ళు వస్తుంటాయి. అందుకే పెద్దగా పన్లు ఉండవు . వున్నా వున్నట్టు అనిపించదు.


ఏడాది కొకసారి ఈ ప్రాంతంలో తిరునాళ్ళు లాంటిది జరుగుతూ వుంటుంది. అప్పుడే కాస్త రద్దీగా వుంటుంది. అందుకే.....


ప్రొద్దున్నుండి సాయంత్రం వరకు గడవడం పొద్దు బోదు . కానీ వుద్యోగ ధర్మం తప్పదు.


రోజంతా భరించలేని వేడిమిని భరించడంవల్ల సాయంత్య్రం కోసం, సాయింత్య్రం వీచే చల్లని పిల్లగాలులకోసం ఎదురు చూడడం నా జీవితంలో నిత్యకృత్యమయి పోయింది. ఇక్కడి సాయంత్రం  నిజంగా చాలా అందంగా వుంటుంది.


ఆ అందానికి వన్నె తెస్తూ. ప్రకృతి సంధ్యారాగ సంకీర్తన! 

దూరంగా గూళ్ళవైపు సాగిపోతున్న పక్షుల గుంపులు. ఏవో నందేశాలు

హడావిడిగా మోసుకుపోతూ నీలిమేఘాలు. 

పిల్లగాలి కెరటాల సప్తస్వరాలు.

నిశ్శబ్ద సౌందర్యం.


అలాంటి సమయంలో

' అతను'  వస్తున్నాడు.


అతని పేరు తెలీదు. దాదాపు ఏడాది నుండి వస్తున్నాడు.


మా యిద్దరి మధ్య మాటల్లేవు. చూపులతోనే పలకరింత.


అందమైన నిశ్శబ్దం ఇద్దరిమధ్య.


ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టు ప్యాసింజర్ వచ్చే వరకు చూస్తాడు.


వచ్చేకా, అది వెళ్ళే వరకు అన్ని బోగీల్లోకి చూస్తూ, అటునుండి ఇటూ,

నుండి టూ తిరుగుతాడు.


రైలు కదిలేవరకు అక్కడే  వుండి, కదిలాకా, భారంగా ఓ నిట్టూర్పు విడిచి, మెల్లగా అడుగులో అడుగువేసుకుంటూ వెళ్ళిపోతాడు.. ఇక్కడికి దగ్గర్లోవున్న పల్లె.. దాదాపు మూడుమైళ్ళ దూరం. 


రోజూ అంత దూరంనుండి ఎందుకు వస్తున్నట్లు? పోనీ అతని కోసం ఎవరైనా వస్తారా? 

ప్స్! . . ఎవరూ రారు.


ఒకసారి పోర్టర్ వెంకటయ్య మాటల్లో తెలిసిందేమిటంటే- అతను దగ్గర్లో వున్న పల్లెటూరిలోని పాఠశాల మేష్టారు. దాదాపు ఏడాది అయ్యిందిట ఆవూరు వచ్చి మనిషి.  బక్కపలచగా వుంటాడు. పెద్ద ఎత్తుగా వుండడు, వదులైను ఫాంట్, లూజ్ షర్ట్ వేసుకుంటాడు. నిర్మలంగా వుండే మొహంలో కొద్దిగా జాలి, ఎక్కువగా కరుణ

కన్పిస్తాయి. కళ్లాల్లో  మాత్రం ఏదో లోతుచూపులు. ఏదో పోకొట్టుకున్న తున్నట్టు వుంటాయి,


" అమాయకుడిలా వుంటాడు" అని అంటాడు వెంకటయ్య. 

ఎండైనా -


వానైనా -


చలైనా -


వచ్చేవాడు. వస్తున్నాడు. ఇంత శ్రమపడి రావడ మెందుకు?


ప్రశ్నకి ఎంత ఆలోచించినా జవాబు దొరకడం లేదు.


మధ్యాహ్న నుండి వాతావరణం ఆదో మాదిరిగావుంది. మేఘాలు కమ్ము కున్నాయి. రివ్వున ఈదురు గాలులు వీస్తున్నాయి. చినుకు ఏ క్షణానైనా రావొచ్చు. చలికి ధరించలేక స్వెట్టర్ వేసుకున్నాను. యింకా అరగంట వేచివుండాలి ... ప్యాసింజర్ కోసం.

గాలి విపరీతంగ వీస్తోంది . దగ్గర్లోవున్న చెట్లు 'లయ' గా తలలు వూపుతున్నాయి.

గాలి గంభీరంగా అరుస్తోంది.


క్షణంలో... చూస్తుండగానే... గాలి కెరటాల పురవడిలోంచి చినుకులు పడడం ప్రారంభించాయి...బంగారు తీగెలా మెరిసే మెరుపు... ఆకాశాన్ని చీలుస్తూ 

కుండపోతగా........

ధారలు ధారలుగా వర్షం....


' ధన్...' దూరంగా ఎక్కడో పిడుగు పడింది..


ప్రకృతి భీభత్సంగా తయారయ్యింది..


హోరు మనిగాలి.. అంతకంతకు  చినుకులు.. పిడుగు శబ్దం.... చినుకులు...


తాండవం చేస్తున్నాయి....


గాలీ. . వానపోటీ పడ్తున్నాయి....


స్టేషన్లో కరెంటు పోయింది.... లాంతరు వెతికి, దీపం వెలిగించడం గగనమయ్యింది. పోర్టర్ కూడలేడు.  వూళ్ళో ఎవరో బంధువులు వచ్చేరని, చూడడానికి మధ్యాహ్నమే వెళ్ళాడు.

చీకటి తెరలు అలుముకుంటున్నాయి.

భయ కంపితుడ్ని చేస్తోంది ప్రకృతి! 


అరగంట గడిచింది తెలీకుండానే. 

ఫోన్ మోగింది. ప్యాసింజర్ గంట లేటుట. పక్క స్టేషన్నుండి వర్తమానం వచ్చింది.


మరో పావుగంట తరువాత.....


చినుకులవేగం తగ్గింది. లాంతరు వెలుతురులో దూరంనుండి ఎవరో వస్తూ కన్పించారు. వెంకటయ్య అనుకున్నాను వస్తున్నది


' అతను' హడావిడిగా వస్తున్నాడు. తలమీదో గుడ్డ కప్పుకున్నాడు. మనిషిదాదాపు తడిసిపోయాడు.


' మేష్టారూ! ...ట్రైన్ వచ్చిందా?" ఆత్రంగా అడిగాడు, మెల్లగా వణుకు 


తున్నాడు. 


" లేదండి.. గంటలేటు.... "అన్నాను.


“....ఇలా బయటికు  అడుగు వేశానో లేదో ... మొదలయ్యింది . 

 చిన్న వానే అనుకున్నా, బాగా తడిపేసింది....." అన్నాడు అలా దూరంగా చూస్తూ. 


అదృష్టం బాగుండి కరెంటు వచ్చింది. తువ్వాలు వెతికళ్ళల్లోకి కృతజ్ఞతగా చూశాడు. 


" ట్రైన్ వచ్చేవరకుఇక్కడే వుండండి! బాగా కురుస్తోందివాన...." అన్నాను. 


అక్కడే వున్న కుర్చీ అతని వైపు జరుపుతూ. 


దానిమీద కూర్చొని వాన లోకి చూస్తున్నాడు


 " ఏవండీ.... రోజూ వస్తున్నారు..... ఎవరేనా బంధువులు వస్తారా .... వస్తున్నారా?" 


ప్రశ్న ఎలావేయాలో తెలీలేదు. తెలుసుకోవాలనే కుతూహలం ఆ ప్రశ్న వేసింది.


అతను జవాబు చెప్పలేదు.


“.. ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకండి!  దాదాపు మిమల్ని ఏడాది నుండి గమనిస్తున్నాను. వస్తున్నారు.... వెళుతున్నారు...."అన్నాను.


క్షణం తరువాత.. 


"ఎవరూ రారండి.... వస్తారేమోనని ఆశ..." అని క్షణం ఆగి "నిరీక్షణలో బాధకన్నా ఆనందమే ఎక్కువగా వుంది...." అన్నాడు.


అర్ధం కానట్టు చూశాను. అతను చెప్పడం కొనసాగించాడు. “.... ఇన్నాళ్ళు మీరు నన్నడగలేదు.... కానీ.... మీకో విషయం తెలుసా?"


ఏమిటన్నట్టు చూశాను,


“... ఎప్పుడూ మీతో చెద్దామనే ప్రయత్నించాను. కానీ.... అవకాశం రాలేదు." నేను ఆశ్చర్య పోయాను. 


కష్టాన్నైనా, సుఖాన్నైనా మరొకరితో చెప్పుకుంటే, కాస్త ఓదార్పు కలుగుతుందంటారు" అని వానలోకి క్షణంచూసి. . " ఒక్కో మనిషి జీవితం ఒక్కోరకం.... విధాతనృష్టి విచిత్రం. మనిషికి మమతానురాగాల మధురిమని అందిస్తాడు ... రుచినంపూర్ణంగా ఆస్వాదించ

కుండానే దూరం చేస్తాడు. క్షణం వనంతం. క్షణం శిశిరం. జీవితం సుఖ దుఃఖాల సమ్మేళనం...." అని ఆగి "మీకు విసుగ్గావుందాః" అని తెచ్చి పెట్టుకున్న నవ్వు నవ్వాడు. 


కాగితం పూవులా వుందా నవ్వు.


" లేదు..లేదు..ఇదో విచిత్రమైన అనుభవం! చెప్పండి...." అన్నాను  ఆసక్తిగా  ముందుకు వంగుతూ....


నా ఆసక్తిని చూసి, మెల్లగా నిట్టూర్పు విడిచి కొనసాగించాడు. 

చినుకుల శబ్దం..అపరిచిత వ్యక్తి మాటలు ..విచిత్రానుభూతి..... చిత్రమైన కుతూహలం..


" నా జీవితం మొదటినుండి ఒక రకమైన ఆప్యాయతలకి అనురాగాల! 

చేరువుగా వుంది. మా తాతయ్య వాళ్లది ఉమ్మడి కుటుంబం. తాతయ్యకు  యిద్దరు కొడుకులు . ఒకరు వ్యవసాయం. మరొకరు వుద్యోగం. పాత బంగారం : కథానిక 

కథ: భారతి - మాస పత్రిక - నవంబరు, 1986 

నిరీక్షణ 

- ఎ.వి. వి. ఎస్. ఎస్. ప్రసాద్ 

సేకరణ :  కర్లపాలెం హనుమంతరావు  గారికే వుద్యోగం . వుద్యోగరీత్యా అయిన వాళ్ళందరికి  దూరంగా వుండవలసి వచ్చింది. తాతయ్య చాలాసార్లు నాన్నతో అన్నాడు. " నీకా వుద్యోగం.... ఎందుకురా?  హాయిగా యిక్కడే వుండకా?" అని. 

నాన్నగారికి వ్యవసాయ మంటీ  యిష్టంలేదు. ఎట్టి పరిస్థితిల్లోను కనీసం ఏడాదికోసారైనా, తాతయ్య గారింట్లోగడపాలనే షరతుమీద తాతయ్య నాన్నగారు పుద్యోగం చేయడాన్ని వప్పుకున్నాడు." అని ఆగి రెండు క్షణాలు దూరంగా చూస్తుండిపోయాడు . 


 గాలి హోరు తగ్గుతోంది క్రమేణా. చినుకులు మెల్లగా చిందులు చేస్తున్నాయి. 


" ఆ ఏడాది స్కూలుకి వేసవి సెలవులు యిచ్చారు. బాబయ్య ఏదో పనిమీద మా  ఊరు వస్తే ! నాన్నగారు వాళ్ళు బాబయ్యితో తాతయ్య గారింటికి పంపారు నన్ను. లీవ్ శాంక్షన్ అయ్యాక, అమ్మా, నాన్న, చెల్లి వస్తామని.. " 


మెరుపు మెరిసింది... ఒకసారి కాంతి వెల్లువ .  మళ్ళీ మాములే. సిగ్నల్ లైట్ డిమ్ గా వెలుగుతోంది.


"నాన్నగారు వాళ్ళు వస్తామన్న రోజు.... నేనూ బాబయ్య స్టేషన్లో ఎదురు చూస్తున్నాము .  అప్పటికి అమ్మా వాళ్ళని వదిలివారం రోజులయ్యింది..


నాకు బెంగగావుంది. అమ్మవస్తే ఆమె ఒడిలో ఒదిగి పోవాలని కోరిక. అదే మొదటిసారి వాళ్ళని విడిచి వుండడం. ఎదురు చూస్తున్నాము. ఎంత సేపటికి ట్రైన్ రాలేదు. కొంతసేపటికి తెలిసింది అమ్మావాళ్ళు ఇంకరారని. వేగంగా వస్తున్న రైలు పట్టాలు తప్పి... 

స్పష్టంగా కన్పిస్తున్నాయి కను కొలుకుల్లో కన్నీళ్లు.


గొంతులో స్పష్టంగా జీర.


"..ఆరోజు నుండి ఆదో అలవాటుగా మారిపోయింది. వస్తున్న ఏ రైలుని చూసినా నా వాళ్లు వస్తున్నారని... 'నా బంగారు కొండ' అనే అమ్మ, "వెధవా! ఏం చేస్తున్నావ్?" అనే నాన్న అన్నయ్య నన్ను భయపెడ్తారని 


అమ్మతో చెప్పి కొట్టించి....బూదచాడికి  యిప్పించేస్తా!  అనే చెల్లి వస్తారని ఏదో లాంటి విచారం ఎదురుచూపు...


దూరంగా రైలు వస్తున్న కూత విన్పించింది. అతను మెల్లగాలేచాడు. స్టేషన్లోకి వస్తున్న రైలుకేసి అడుగులు వేస్తున్నాడు.


చిన్న చిన్న చినుకులు పడ్తున్నాయి. చినుకుల మాటున మసక వెలుతురు దాటున మెల్లగా వెతుక్కుంటూ సాగి పోతున్నాడతను.

రైలుని చూసిన అతని మొహంలో స్పష్టమైన మార్పు. 

 ఆనందమాః విచారమా?


మరో పది నిముషాల తరువాత.


రైలు కదుల్తోంది....


అతను మెల్లగా సాగుతున్న రైలుతోపాటే నడుస్తున్నాడు.


బోగీలో ఎవరితోనో మాట్లాడుతున్నాడు....


మాటల్లో నవ్వుతున్నాడు.


నవ్వుతున్నా. 


 కనుకొలకుల్లో ఆ కన్నీళ్ళెందుకు?

***

పాత బంగారం : కథానిక 

కథ: భారతి - మాస పత్రిక - నవంబరు, 1986 

నిరీక్షణ 

- ఎ.వి. వి. ఎస్. ఎస్. ప్రసాద్ 

సేకరణ :  కర్లపాలెం హనుమంతరావు 


   

   

Sunday, December 12, 2021

సమీక్ష: కొకుగారి 'అమాయకురాలు కథ చదివిన తరువాత కలిగిన నా స్పందన -కర్లపాలెం హనుమంతరావు







    • ముందు ‘అమాయకురాలు’ కథ ఏమిటో భోజనం విస్తట్లో రుచికి ఓ మూల వడ్డించే పదార్థం లాగా: 

    • వెంకటేశ్వర్లు, భ్రమర చిన్నప్పటినుంచి స్నేహితులు. వెంకటేశ్వర్లుకి పదహేడో ఏట భ్రమర మీద వికారం మొదలవుతుంది. ఆ వికారం పేరు ప్రేమ అనుకోవడానికి లేదు. కాంక్ష పుట్టనిదే ప్రేమ కలగదన్న జ్ఞానం ఇంకా వంటబట్టని వయసు వెంకటేశ్వర్లుది. భ్రమర మీద  అలాంటి ఊహ ఏదీ లేకపోవడం మూలాన అతగాడిలోనే ఒక రకమైన అయోమయం. భ్రమర పని మరీ అన్యాయం. ఇంకా రజస్వల కూడా కాని పసిది. ఈ విషయాలన్నీ ఎలా తడతాయి?
    • భ్రమరకు పెళ్లి ఖాయమైందని తెలిసి వెంకటేశ్వర్లులో అదేమిటో అర్థం కాని చిరాకు మొదలవుతుంది. 'తాను భ్రమరని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడా?' అని అతనికే ఏదో ఒక మూలన అనుమానం. అలాగైతే అలాగని వెళ్ళి తండ్రిని అడిగేయచ్చు కానీ.. ఆ తండ్రిగారి మనస్తత్వం పూర్తిగా మరీ చాలా పాత కాలంనాటి ముక్కిపోయిన సరుకు. పిల్లలకేది కావాలో నిర్ణయించాల్సింది పెద్దలేనని అతని అభిప్రాయం. పిల్లలకు సంబంధించిన విషయాలేవీ పిల్లలతో చర్చించనక్కర్లేదని, ఒక వేళ వాళ్ళ ఇష్టాలేమన్నా చెవిలో పడితే దానికి పూర్తి విరుద్ధంగా చేయడంలోనే పిల్లల క్షేమం దాగి ఉందని దృఢంగా నమ్మేవాడు. కనక వెంకటేశ్వర్లు తెగించి తండ్రితో ఏదీ చెప్పదలుచుకోలేదు. కానీ అతి కష్టంమీద.. చనువున్న అమ్మ దగ్గర మనసులోని మాట బైట పెట్టేడు. వెంకటేశ్వర్లుది, భ్రమరది ఒకే కులం. బ్రాహ్మలే ఐనా శాఖలూ ఒకటే అవడంతో చిక్కు వచ్చిపడింది. 'నోరు మూసుకోమని తల్లి మందలించేసరికి ఇక పెళ్లి ఆలోచన ముందుకు సాగదని తెలిసి మనసుతో ముసుగు యుద్ధం మొదలు పెట్టేడు. భ్రమర పెళ్ళికి వుండకుండా వెళ్ళిపోయాడు. ఎవరు అడిగినా ఉండలేదు.. ఆఖరికి భ్రమరే వచ్చి అడిగినా మెట్టు దిగిరాలేదు.
    • భ్రమర పెళ్ళికి ఉండమని అడగడంలో ప్రత్యేకమైన ఆసక్తి ఏదీ లేదనుకుంది కానీ.. ఏదో ఉందని కొద్దిగా మనసు మూలలో ఉందేమో..ఏమో.. మరీ పసిది.. ఎలా ఆలోచిస్తున్నదే అప్పటికి రచయిత బైటపెట్టలేదు మరి.
    • కాలక్రమంలో భ్రమర పెద్దమనిషి కావడమూ..కాపురానికి పుట్టింటికి వెళ్ళిపోవడమూ.. అందరు సంసార స్త్రీలకు మల్లేనే మెట్ట వేదాంతం వంటబట్టించుకోవడమూ అయింది. పుట్టింటికని వచ్చినప్పుడు వెంకటేశ్వర్లుతో ఒకసారి ఈ వేదాంత పైత్యం వెళ్లబెడుతుంది కూడా.'ఊహల్లోనే ఏ సుఖమైనా.. వాస్తవంలో అవేమీ ఉండనే ఉండవు' అని వెంకటేశ్వర్లు మనసులో మళ్లీ వికారం మొదలవడానికి కారకురాలవుతుంది.
    • భ్రమర కాపురం మూణ్ణాళ్ళ ముచ్చటవుతుంది. భర్త క్షయ వ్యాధితో రెండేళ్ళన్నా గడవకుండానే బాల్చీ తన్నేయడంతో భ్రమర పుట్టింటికొచ్చేస్తుంది. ఇంట్లో వాళ్ళ బలవంతమేమీ లేకుండానే గుండూ చేయించుకుంటుంది. ఆమె వద్దంటే బలవంత పెట్టేవాళ్లెవరూ లేకపోయినా అలా ఎందుకు వికారంగా తయారవాలోనని వెంకటేశ్వర్లు చాలా చిరాకు పడిపోతాడు. ఎదురింట్లో ఉన్నా ఒక్కసారన్నా ఆమెను చూడటానికి వెళ్ళే ప్రయత్నం చేయడు. భ్రమరకు అది కష్టంగా అనిపిస్తుంది. సిగ్గు విడిచి వెంకటేశ్వర్లు తల్లి దగ్గర తన బాధ బైటపెట్టుకుంటుంది కూడా. వెంకటేశ్వర్లు తల్లి పాతకాలం మనిషి. నవీన భావాల లోతుపాతులు పట్టించుకునేపాటి తెలివితేటలు తక్కువనే అనుకోవాలి. అందుకే వెంకటేశ్వర్లు ముందు భ్రమర గోడు బైట పెడుతుంది. వెంకటేశ్వర్లు భ్రమర శిరోముండనం చేయించుకుని తనకు అన్యాయం చేసినట్లు కోపం పెంచుకోనున్న మనిషాయ. భ్రమరను కలవడానికి వెళ్లనే వెళ్ళడు. పైపెచ్చు తన మనసులోని కచ్చను కూడా తల్లి దగ్గర వెళ్లగక్కుతాడు. ఆ తల్లి యథాప్రకారం ఈ మాటలు భ్రమరకు అమాయకంగా చేరవేస్తుంది.
    • భ్రమరలో ఆలోచనలు మొదలవుతాయి. తన తప్పు కొద్ది కొద్దిగా తెలిసివస్తున్నట్లనిపిస్తుంది. వెంకటేశ్వర్లు  తన పెళ్ళికి ముందు పడ్డ చిరాకంతా నెమరు వేసుకుంటే తన దోషం తెలిసివస్తుంది.
    • ఏదైతేనేమి  భ్రమర మళ్లీ జుత్తు పెంచుకోవడం మొదలు పెడుతుంది. చీరలు జాకెట్లు  కూడా వాడుతుందని తెలుస్తుంది వెంకటేశ్వర్లుకి. 
    • అప్రెంటిస్ పూర్తయి ఒక లాయరు గారి దగ్గర అసిస్టెంటుగా కుదురుకున్న తరువాత వెంకటేశ్వర్లుకి సంబంధాలు రావడం మొదలవుతాయి. రెండు లంకలున్న మంచి జమీందారీ సంబంధం ఖాయమూ అవుతుంది.
    • పిన్నిగారి వూరికని వెళ్ళిన భ్రమరకు ఈ విషయం తెలిసి ముళ్ళమీదున్నట్లయి పోతుందక్కడ. నెల్లాళ్ళుందామని వచ్చిన పిల్ల తట్టా బుట్టా సర్దుకుని లేచిపోతుంటే ఆ పిన్నిగారు అవాక్కయిపోతుంది.
    • బండిని నేరుగా వెంకటేశ్వర్లు ఇంటిముందే ఆపించి సామానుతో సహా లోపలికి పోతుంది భ్రమర. వెంకటేశ్వర్లు, భ్రమర చాలాకాలం తరువాత ఒకరికొకరు ఎదురవుతారు. భ్రమరను చూసి వెంకటేశ్వర్లుకు మతి పోయినంత పనవుతుంది. ఆ క్షణంలో తను అప్పటిదాకా అనుకుంటూ వచ్చిన 'ఉచ్చిష్టం' ఊహ గుర్తుకే రాదు. పెదాలుకూడా సన్నగా వణుకుతాయి కాని మనసులోని మాటను ధైర్యంగా బైటపెట్టలేని పిరికితనం ఎప్పటిలా అలాగే  ఉంటుంది చెక్కుచెదరకుండా. అక్కడికీ భ్రమరే కాస్త సాహసం చేసి నర్మగర్భంగా మాట విడుస్తుంది కూడా.'వెంకటేశ్వర్లూ! నీ పెళ్ళి అని తెలిసి ఉండలేక వచ్చేశా' అంటూ. వెంకటేశ్వర్లులోని పిరికి మనిషి స్పందించడు. భ్రమర తెచ్చుకున్న పెట్టే బేడాతో తిరిగి సొంత ఇంటికే వెళ్ళి పోతుంది. వెంకటేశ్వర్లు తండ్రి దగ్గర ఏదో చెప్పాలనుకుంటాడు కానీ.. తీరా అతను చూసే అసహ్యపు చూపులు గుర్తుకొచ్చి నోరు పెగలదు. ఏదో సందర్భంలో భ్రమరను కలవాలని వచ్చిన వెంకటేశ్వర్లుకి ఆమె గదిలో ఏడుస్తూ కూర్చుని ఉండటం.. గదంతా అసహ్యంగా ఆమె కత్తిరించుకున్న జుత్తు వెంట్రుకలతో నిండి వుండటమూ చూసి వెనక్కి వచ్చేస్తాడు. 
    • వెంకటేశ్వర్లు పెళ్ళి అవుతుంది. భ్రమరను తలుచుకుందామని అనుకున్నప్పుడల్లా జుత్తులేని ఒక  ఒంటరి ఆడదాని ఏడుపు వికారపు మొహం గుర్తుకొచ్చి తలుచుకోవడమే మానేస్తాడు.
    •  
    • నా సమీక్ష :

    • ఇది నిజానికి ఒక ప్రేమ కథ. వెంకటేశ్వర్లు, భ్రమర ఒకరినొకరు ఇష్టపడ్డ మాట నిజం. మొదట్లో అది ఇష్టమని తెలీక కొంత.. తెలిసినాక ఏ రకమైన ఇష్టమో తేల్చుకోలేక అయోమయంలో పడి కొంత తంటాలు పడ్డారు ఇద్దరూ. భ్రమరకన్నా ఆ ఇబ్బంది ఎక్కువగా వెంకటేశ్వర్లే పడ్డాడు. ఏ దశలోనూ కాస్తంతన్నా సాహసం చూపించలేని పిరికివాడికి ప్రేమ దక్కేది ఎలా? భ్రమర తనను కాకుండా వేరే ఎవరినో ఎంచుకున్నదని ముందులో కొంత.. శాఖాంతరం కాకపోవడం మీద కొంత.. ఎలా ఎవరిమీదో.. వేటిమీదో కంటికి కనబడని వాళ్ళమీదా.. కారణాలమీదా పెట్టి మానసిక తృప్తి పొందాడే కాని.. మనసులో నిజంగా ఉన్నదేమిటో.. దాన్ని సాధించడానికి చేయాల్సినదేమిటో ఎప్పుడూ యోచన చేయని నిష్క్రియాపరుడైన ప్రేమికుడు వెంకటేశ్వర్లు. భ్రమర అతనికన్నా ఎన్నో రెట్లు మెరుగు. పసిదనం వదిలి ఊహ వచ్చిన దశలో భర్తతో కాపురానికి మెట్టవేదాంతంతో సర్దుకునే పరిపక్వత చూపించింది. వెంకటేశ్వర్లు మనసు అర్థమయి.. తన మనసు తనకు అర్థమవడం మొదలయిన తరువాత వీలైనంత సాహసం చేయడానికి కూడా వెనకాడ లేదు. పాపం.. ఆడదై పుట్టడం.. వెంకటేశ్వర్లు వంటి పిరికివాడు తటస్థపడడం వల్ల విఫల ప్రేమికురాలైంది భ్రమర.
    • ప్రేమించుకున్న జంటను విడదీయడానికి సంఘం తరుఫు నుంచి ఎప్పుడూ ఏవేవో అభ్యంతరాలు.. కుట్రలూ ఉంటూనే ఉంటాయి. వాటిని తోసిరాజని ప్రేమను పండించుకునే సాహసికులు కొందరైతే.. చాలామంది తమ మానసిక దౌర్బల్యంతో యుద్ధం చేయడం మాని సంఘాన్ని తప్పుపట్టేసి సెల్ఫ్ సింపతీతో సంతృప్తి పడే సర్దుబాటు చూపిస్తారు అని చెప్పదలుచుకున్నట్లుంది ఈ 'అమాయకురాలు' కథలో కొడవటిగంటి వారు.  నిత్యహరితమైన సమస్య!ఎంతో చెయ్యి తిరిగుంటే తప్ప ఇలాంటి కథను ఎన్నుకుని కడదేర్చడం కుదరదు.
    • ఎప్పటిలాగానే కుటుంబరావు గారు సంఘదురాచారాలని.. మానసిక డొల్లుతనాన్ని తనదైన నిశ్శబ్ద శైలిలో చాలా బలంగా ధ్వనించిన తీరుతో గొప్ప కథై కూర్చుంది అమాయకురాలు కథ. కథనం ఆయన మిగతా అన్ని కథల ధోరణిలోనే చాప కింద నీరులాగా ఆలోచనాపరుల మనసులను ముంచెత్తుతుంది.
    • ఎప్పుడో పంథొమ్మిది వందల ముప్పైతొమ్మిదో ఏట రాసిన కథ. వైధవ్యం..శిరోముండనం వంటి దురాచారాలు లేని ఈ కాలంలో కూడా  మానసిక కోణంనుంచి కొకుగారు కథను ఆవిష్కరించిన తీరు కథను ఎప్పటికీ పచ్చిగా.. తడిగానే ఉంచుతుంది.
    • కొకుగారు కథనంలో వాడే పలుకుబళ్ళు,  వాక్యాలలోని ముళ్ళు.. ఎప్పటిలాగానే ఆయన అభిమానులను కథ అంతటా అలరిస్తుంటాయి.
    • -కర్లపాలెం హనుమంతరావు
    • బోథెల్, యూఎస్ఎ

కథానిక ( సరిదిద్దాలి) పుష్పాభిషేకం రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఆంధ్రభూమి వారపత్రిక – 11- 05- 2000 - ప్రచురితం )

 





కథానిక: ( సరిదిద్దాలి) 

పుష్పాభిషేకం




రచన: కర్లపాలెం హనుమంతరావు 

ఆంధ్రభూమి వారపత్రిక - 11/05/2000 -  ప్రచురితం ) 


రాత్రి పన్నెండు గంటలు దాటుతోంది. 


డిసెంబర్ నెల బయట చాలా చలిగా వుంది.


పుస్తకం ముందు కూర్చున్న శరత్ మనసు మనసులో లేదు.


పక్క గదిలో నుండి వుండి వుండి శబ్దాలు వినిపిస్తున్నాయి . 


వరండా నిండా పిండారబోసినట్లు వెన్నెల. నై ట్ క్వీన్ పూలవాసనతో

వాతావ రణం మరింత మత్తుగా ఉంది. 


ఉండబట్టలేకపో మూసేసి లైటార్పేశాడు శరత్ . 


పిల్లిలా వెళ్లి పక్క గది తలుపు దగ్గర నిల్చున్నాడు. 

సన్నటి కంతలో నుండి లోపల జరిగేదంతా అస్పష్టంగా కనిపిస్తోంది. 

 బెడ్లైట్ వెలుతురులో . 


బెడ్ మీద పావని. . అన్నారావు . కాళ్లు వణుకుతుంటే గభాలున వెనక్కు తగ్గి వచ్చి బెడ్ మీద పడిపోయాడు . 

పక్క గదిలో మంచాలు కదులుతున్న చప్పుళ్ళు, .. మధ్యమధ్యలో గాజుల గలగలలు .. ఉండి ఉండి. . మెత్తగా మూలుగులు. మత్తుగా గుసగుసలు, పిచ్చెక్కిపోతోంది శరత్.


తాను చేస్తున్నది. తప్పని హెచ్చరిస్తూనే వుంది అంతరాత్మ. అయినా మనసు వివే మూడో లేదు.  అదుపు చేసుకొనే  కొద్దీ ఆలోచనలు గాడి తప్పి పోతున్నాయి. 


ఎన్ని రోజుల నుండో ఇలా యాతన అమభవించడం! 


మొదట్లో ఎబ్బెట్టుగా అనిపించేది .  ఇప్పుడలాంటి ఆలోచనలు చేయకుండా  ఉండలేని బలహీనత ఆవరించింది. 


నెల రోజులుగా ఇదే వరస . 


కలలో కూడా అవే దృశ్యాలు . పావని.. అన్నారాపు స్థానంలో .. తనూ . . 


ఛీ! ఎంత వద్దనుకున్నా ఆ ఆలోచ సలు వదలడంలేదు. వారం రోజులుగా  మరీ ఎక్కువయ్యాయి తీపులు. 

దీని దెబ్బతో చదువు మీద ఏకాగ్రత కూడా చెదిలిపోతొంది. ఈసారైనా విజయం సాధించాe అని వాళ్లమ్మ కోరిక. 


చనిపోయిన తండ్రి కోరిక కూడా . అదే శరత్ ఆశయం కూడా అదే . ఇక్కడికొచ్చేదాకా. 


ఇప్పుడే తారుమారయింది ఇలాగా. 


అన్నారావు తనకు వరసకు అన్నయ్య .  పెద్దమ్మ కొడుకు . సిటీలో ఆర్ టీసీలో కండక్టర్.కొత్తగా  ఇల్లు కట్టుకున్నాడుబ్యాంకు లోనుతో . ఈఎమ్మైలు బరువవుతున్నాయని బాధపడుతుంటే పెద్దమ్మే తను  ఇక్కడ ఉండేటట్లు  ఏర్పాటు చేసింది.  తను సెంట్రల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కోచింగుకని ఎట్లాగూ సిటీకి వచ్చి ఆరునెలలు  ఉండాలి. ' ఆ ఉండేది ఎక్కడో ఎందుకు .. మా అన్నారావు పక్క వాటాలో ఉండి చదువుకో ! రెండు పూటలా భోజనానికి, అద్దెకు కలిపి మూడు వేలు ఇవ్వు! ' అంటూ పెద్దమ్మ చేసిన ఏర్పాటే ఇది . 


అన్నారావుకు రెండువారాలకు ఒకసారి బెంగుళూరు సర్వీస్ డ్యూటీ పడుతుంది . ఆ రెండు రోజులు ఇంట్లో మగదిక్కుగా ఉంటాడన్న ఆలోచనతో పావని కూడా ' సరే ' అన్న తరువాతనే తానిక్కడికి వచ్చి పడింది  . 


వచ్చాడే  కానీ కాన్సె౦ట్రేషన్  కుదరడం లేదు. కొన్ని రోజుల బట్టి మరీ . కాన్షస్నెస్ ఒప్పుకోక పోయినా కళ్ళముందు  పావని బెడ్ రూం దృశ్యమే  పగలూ .. రాత్రీ కూడా ! 


తనను ఏదైనా చేయాలి. అప్పటి దాకా తనకీ పిచ్చి వదలదు. . అని డిసైడయ్యాడు శరత్ చివరికి 


అన్నారావు ఊళ్లో లేనప్పుడు మనసు మరీ గాడి తప్పుతోంది.


పావని  కూడా తనలో చాలా చాలా సరదాగా ఉంటుంది. సినిమాలన్నా, టీవీ అన్నా ఆమెకి చాలా ఇష్టం. భర్త ఊళ్లో లేనప్పుడు బోరుకొడితే శరత్ చేత వీడియోలో అడిగి మరీ తెప్పెంచుకునేంతా చనువు చూపిస్తుంది కూడా .  భోజనం పెట్టేటప్పుడు, పాపను అందించేటప్పుడు ఎన్నిసార్లు ఆమె చేయి తనకు తగిలేది . ఆడవాళ్లు పరాయి మొగాడితో ఉరికే అంత క్లోజ్ గా ఉండరు కదా! 


మొదట్లో మొదట్లో ఏమీ అనిపించేది కాదులు . ఇప్పుడీమధ్యే ఈ వికారం మొదలయింది తనకు! 


ఆమె బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు, బెడ్రూమ్లో బట్టలు మార్చుకుంటు న్నప్పుడు రహస్యంగా తొంగి చూడడం, పనున్నా లేకపోయినా అవిడ వెంటే తిర గడం, అవకాశం దొరికినప్పుడల్లా అవిడని తాకడానికి ప్రయత్నిం చడం... అన్నయ్య లేనప్పుడు మరీ చొరవగా ప్రవర్తించడం... రాత్రయ్యేసరికి పిచ్చి పట్టినట్లుంటుంది. ' ఒక్కసారి ఎలాగైనా పావనిని కల


వాలి అన్నయ్యలాగా, అదే ఆలోచన మెదడును తొలుస్తుంటే పుస్తకంమీద మనసెలా నిలుస్తుంది?


' సంకేషం సగం బలం' అన్నమాట వ్యక్తులకే కాదు దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. దేశానికి వర్తిస్తుంది. ప్రపంచంలో సంతోషంగా ఉన్న వ్యక్తుల క్కోవటంలోనే నిజమైన ఆనందం జాబితాలో అమెరికా ముందుంది. ఆ తర్వాత స్థానం ఇండి మంది అభిప్రాయపడ్డారట. స్నే యాకు లభించింది. 22 దేశాల్లో సర్వే నిర్వహించిన అనంతరం, బంధాలు కూడా బాగా ప్రభావం ఇటీవల ఫలితాలను ప్రకటించారు. జీవితంలో వేర్వేరు అంశాల్లో తేల్చి చెప్పారు. 'మతం ప్రభావం ఏ మేరకు సంతోషం లభిస్తోంది?... అసలు సంతోషం కలిగించే ఉంటుందని. రేటింగ్లో మార్పు


చదువుగాడి తప్పుతుంది. వీక్లీ టెస్టుల్లో మార్కులు బాగా తగ్గుతున్నాయి. ప్రోగ్రెస్ బాగా లేదని లెక్చరర్లు పెదవి విరుస్తున్నారు. 'ఇంకా పరీక్షలు ఐదు నెలలు కూడా చదవడం. మూడీగా వుంటున్నావు. లవ్లో పడ్డావా?" అనడి లేవు. ఇలాగేనా


ఏమని సమాధానం చెప్పాలి?


పావని ముందు తన కోరిక బైటపెడితే ఊరుకుంటుందా?


పెదవి విప్పి చెప్పనిదే ఎలా తెస్తుందామెకు తన మనసు? ముందు తను ధైర్యం చేయాలి. తరువాత అదృష్టం ఎలా వుంటే అలా, కానీ


ఇలాంటి విషయాల్లో సలహాలెవరిస్తారు? అలాగని పూరికే వుండిపోయే మన స్తత్వం కాదు శరత్.


ముగ్గురాడపిల్లల మధ్య మగ నలుసు. అమిత గారాబంగా పెరిగాడింట్లో అన కున్నది అయ్యేదాకా సంతం వదలని మొండితనం అతనిది. ఆలోచించి అలోచించి రాత్రంతా మేల్కొని పాతిక పేజీలు చించి రెండు పేజీల ఉత్తరం రాసాడతను.


"పాపనీ! నీ అందం నన్ను పిచ్చివాడిని చేస్తోంది. అది పొందని బ్రతుకు వృధా. ప్లీజ్ ఒక్కసారి నా కోరిక తీర్పు. లేకపోతే మరణంతప్ప నాకు వేరే దారి లేదు. ”


ఇట్లు

శరత్ 


స్థూలంగా ఉత్తరం సారాంశం అది.


ఉత్తరాన్ని ఆమె కంట పడేట్లు బెడ్రూమ్లో దిండు మీద పెట్టి బైటికెళ్లిపోయాడు శరత్.


అన్నయ్య ఊళ్లోలేడు. వారందాకా రాడు. ఈలో పునే ఏదో తేలిపోవాలి. సినిమాకెళ్లి వచ్చేసరికి పదిగం టలు దాటింది.


తలుపు దగ్గరికి వేసి వుంది.


బట్టలు మార్చుకుని పక్క సర్దుకుంటుంటే పావని వచ్చి ఎదురుగా నిలబడింది.


ఇద్దరి మధ్యా కొన్ని క్షణాలు నిశ్శబ్దం. పావనే అడి


గింది " అన్నం తిన్నావా?''


"ఆకలిగా లేదు" అన్నాడు శరత్ ముక్తసరిగా. "నిన్నొక మాట అడుగుతాను చెప్తావా?? పావని గొంతు వణకుతోంది దుఃఖంతో..


ఉత్తరం చదివి బాగా ఏడ్చినట్లుంది. కళ్ళు ఉబ్బి ఉన్నాయి.


“నామీదసలు నీకలాంటి అభిప్రాయం ఎలా


గింది? నా ప్రవర్తనలో ఏమైనా లోపముందా?''


శరత్ మాట్లాడలేదు.


"నాకన్నా మూడేళ్లు చిన్నవాడివి. నిన్నెప్పుడూ ఆ భావంతో చూడలేదు. అన్ని పేజీల ఉత్తరం రాసావు. అది చదివిన తరువాత నిన్నెప్పటిలా చూడగలనా? ఎందుకలా చేసావు? మీ అన్నయ్యకి తెలిస్తే ఏమవు తుందో ఆలోచించావా?”


"అన్నిటికీ తెగించే రాశాను" అన్నాడు శరత్ నెమ్మదిగా. రోషంతో పావని


గొంతు గజగజ వణికింది.


"నిన్నీ క్షణంలోనే ఇంట్లో నుండి వెళ్లగొట్టాలని వుంది. అలా చేస్తే అల్లరిపాలయ్యేది ముందు నువ్వు, తరువాత నేను. ఆ తరువాత నా సంసారం. మీ అమ్మ నీమీద ఎన్ని ఆశలు పెట్టుకుంది? మీ నాన్న పోయేట


ప్పుడు కోరిన కోరిక తీర్చడానికి ఆ తల్లి ఎన్ని కష్టాలు పడి నిన్ను చదివిస్తోందో అర్ధం కావడంలేదా? శరత్! నా మాట విని ఈ పిచ్చి పిచ్చి ఊహలు మానేయ్. చక్కగా చదువుకో."


“ఎంత ప్రయత్నించినా నావల్ల కావడంలేదు పావనీ! ఇంక చావొక్కటే నాకు మిగిలిన ఏకైక మార్గం" అని రెండు చేతులతో మొహాన్ని కప్పుకుని కుమిలిపోతున్న శరత్ వంక చూసి నీళ్ళుకారిపోయింది పావని. “అలా అనొద్దు. ప్లీజ్ నేను తట్టుకోలేను.”


శరత్ వినిపించుకునే మూడ్లో లేడు. ఒక్క నిముషమాగి పావనే అంది "ఆల్ రైట్. నీకు కావాల్సింది నా శరీరమేగా. నేను రెడీ."


చివుక్కుమని తలెత్తి చూసాడు శరత్. పావని సీరియస్ గానే అంటోంది. "ఎన్నోసార్లు నన్ను చాటుగా చూశానంటున్నావు. గుట్టంతా రట్టయిన తరు వాత గుప్పెట మూసి వుంచడమెందుకు? నీ కోరిక తీర్చడానికి నేను సిద్ధం.”


శరత్ ఎలర్టయ్యాడు.


"అయితే నాదీ ఒక షరతుంది!”


“చెప్పు. నువ్వు కోరితే ఏదయినా చేస్తాను" అన్నాడు ఆవేశంగా శరత్. "ముందు మీ అమ్మ కోరిక తీర్చు. ఎసెట్లో మంచి రేంకు సంపాదించు. ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వచ్చిన రోజున ఇదే బెడ్మీద నీకు షేర్ ఇస్తాను. మిస్" అని విసవిసా వెళ్లిపోయింది పావని.


పరీక్షలింకా ఐదునెలలు కూడా లేవు. పావని మీది ధ్యాసతో విలువైన చాలా సమయమే వృధా అయింది. కాంపెన్సేట్ చేసేలా చదవటమంటే మాటలు కాదు. పంతానికి మారుపేరు శరత్. ఫ్రెండ్స్, షికార్లు బంద్. సినిమాలు, హోటళ్ళు అన్నీ పక్కన పెట్టేసాడు.


అన్నం తినేటప్పుడు, నిద్రపోయేటప్పుడు తప్ప పుస్తకాన్ని వదలడంలేదు. ఇంటికి


వెళ్లి కూడా చాలా రోజులయింది. తపస్సులాగా చదువుతున్న శరత్ గడ్డం పెరిగి


రుషిలాగా తయారయ్యాడు.


మంచి రేంక్ రావాలి. వీరుడిలాగా తను పావనిని గెల్చుకోవాలి. దేబిరించి


పొందే ఆనందంలో సుఖమేముంటుంది?


శరత్ లోని పట్టుదలను చూసి చలించిపోయింది పావని. ఇదంతా తనమీది కోరి కతోనేనా? అనే ఊహ ఆమెను ఒక చోట నిలబడనీయలేదు. భర్తతో కలిసున్నప్పుడు కూడా శరత్ ఆలోచనలే వస్తున్నాయామెకు. పరీక్ష రాసి ఊరికెళ్లిపోయాడు శరత్.


ఫలితాలకోసం అమ్మ కళ్ళల్లోని ఆత్రుతను చూసి ఆలోచనలో పడ్డాడతను. తనకు మంచి రేంకు రావాలని, ఇంజనీరింగ్ సీటు వస్తే కొండకొస్తానని మొక్కు కుందామె.


తనెంత పెద్ద పొరపాటు చేయబోయాడు. పావని మీది వ్యామోహంతో పరీక్ష


ము వుంటే తల్లి గతి ఏమయ్యేది?


తలచుకుంటేనే భయమేస్తుందిప్పుడు. ఎంత కాదనుకున్నా రిజల్బు వచ్చేరో జున నెర్వస్ గా ఫీలయ్యాడు శరత్. నలభై మూడో రేంకు వచ్చిందని తెలియగానే తల్లి మొహంలోని సంబరాన్ని


చూడాలి. తండ్రి ఫోటో ముందు నిలబెట్టి నమస్కారం చేయించింది. *ఇదిగోనయ్యా! నువ్వడిగినట్లు నీ కొడుకును ఇంజనీరును చేస్తున్నాను.


అంటున్నప్పుడు ఆవిడ కంటి నిండా నీళ్ళు! ఊరంతా బ్రహ్మరథం పట్టారు మంచి రేంకు వచ్చినందుకు. తల్లి తనకు ఎన్ని సార్లు దిష్టి తీసిందో ఆ రోజు.


పావని తండ్రి వచ్చి పలకరించాడు. శరత్చేత ఆయన కాళ్లకు నమస్కారం చేయించింది తల్లి. " ఇదంతా మీ కూతురి చలవేనండీ. ఆ చల్లని తల్లి ఇంట్లో ఉండబట్టే మావాడికీ


చదువు అబ్బింది" అంటూ పావనిని తలచుకుని సంబరపడింది.


"కష్టపడి చదువుకున్నది మీవాడు. శ్రమపడి చదివించింది మీరు. మధ్యలో మా అమ్మాయి ఏం చేసింది? దాని మొహం" అన్నాడాయన మురిపెంగా. సర్టిఫికెట్స్ కోసమని సిటీకి పోతున్నప్పుడు మంచి చీర ఒకటి కొనివ్వమని డబ్బిచ్చింది శరత్ తల్లి.


అన్నయ్య ఊళ్లో లేడు. శరతిని చూడగానే సంతోషంగా పలకరించింది పావని. కానీ ఆమె కళ్లల్లోని నీలినీడల్ని శరత్ గమనించకపోలేదు. అమ్మ చెప్పిందని బజా రుకి బయల్దేరదీసాడు. పావనికి చీర కొన్నాడు. భోజనం బైటే చేద్దామన్నాడు. మాట్లాడలేదు పావని. దార్లో మల్లెపూలు కొన్నాడు. చూస్తూ వూరుకుంది. ఉయ్యాలలో నిద్రపోతున్న పాపకు దుప్పటి కప్పి వచ్చి శరత్ కెదురుగా


కూర్చుంది పావని. కొత్త చీరలో చాలా అందంగా వుందామె. “మొత్తానికి పంతం నెరవేర్చుకున్నావులే. నీ ముందు నేనోడిపోయాను. మల్లె పూలు తెచ్చావుగా. ఇక నీ ఇష్టం" అంటూ పావని బెడ్లైట్ వేసి బెడ్మీద వాలిపో యింది. కంట నీరు అతడికి కనిపించకుండా తల పక్కకి వాల్చింది.


మసక చీకటిలో ఇదే సమయంలో ఇదే బెడ్మీద ఆమెని ఎన్నిసార్లు ఎన్ని భంగి మల్లో చాటుగా చూశాడో తను. ఈ సమయం కోసం, ఈ అవకాశం కోసం వెర్రి వాడిలా మారిపోయి తిరిగిన రోజులు గుర్తుకొచ్చాయి. నిశ్శబ్దంగా వచ్చి పావని పక్కన నిలబడ్డాడు. నిదానంగా మల్లెచెండు అందుకుని దారాన్ని తెంపి పూలను ధారగా ఆమె పాదాలమీది పోసి కళ్లకద్దుకున్నాడు.


పావని గబుక్కున లేచి కూర్చుంది. “ఇదేం పని?” అంటూ గాబరాగా అతన్ని పొదవి పట్టుకుని పైకి లేపబో


"జన్మనిచ్చేదే తల్లికాదు. జ్ఞానాన్నిచ్చేది కూడా తల్లే. ఇంగితం నేర్పిన తల్లివి. పూలతో నేను చేయాల్సిన పని ఇదే...” అంటున్న శరత్ కంటి నిండా నీళ్ళు!


అంతబాగా కనిపించడం



కథానిక - కర్పూరం రచన - కర్లపాలెం హనుమంతరావు

 







కథానిక : 

కర్పూరం 

రచనః కర్లపాలెం హనుమంతరావు


(ఆంధ్రభూమి- వారపత్రిక- 17 సెప్టెంబరు 2015 నాటి సంచికలో ప్రచురితం)



అయినవాళ్ళందరికి కబుర్లు వెళ్ళాయి. కొడుకులూ కోడళ్ళూ, కూతుళ్ళూ అల్లుళ్ళూ, సంతానంతోసహా అంతా వచ్చేసారు. ఇంట్లో ఒహటే హడావుడి.


సుందరమూర్తే బెడ్ మీద పడున్నాడు అచేతనంగా. కానీ అతని మనసుమాత్రం  పనిచేస్తోంది..  ఎప్పటికన్నా చురుకుగా!


పక్కగదిలో అందరూ ఏదో 'పారాయణం'లో ఉన్నట్లున్నారు. 


నవ్వులు, చలోక్తులు జోరుగా వినపడుతున్నాయి. 


' అయితే ఓడిన పార్టీ గెలిచిన పార్టీని సినిమాకు తీసుకెళ్ళాలిరా.. అదీ పందెం’ అంటున్నాడు పెద్దకొడుకు.


'వట్టి సినిమానేనా? డిన్నరుకూడా ఉండాలి.. అప్పుడే మజా'  పెద్దల్లుడి వంత.


'బావగారి చూపెప్పుడూ మీల్సుప్లేటుమీదే!' చిన్నకూతురు కౌంటరు. అందరూ విరగబడి నవ్వుకోవడాలు.


ఇవతల గదిలో సుందరమూర్తి మాత్రం మూతిమీద వాలిన ఈగను తోలుకోలేక తంటాలు పడుతున్నాడు. ఒహటే దురద! 


తోలుకొనేందుకు చేతులు లేవు. అవి నెల  కిందట జరిగిన బండిప్రమాదంలో నజ్జునజ్జయిపోయాయి. 


' అసలు ప్రాణానికే ప్రమాదం’ అన్నారు ముందు పెద్దాసుపత్రి వైద్యులు. ఆనక 'చేతుల వరకు  తీసేస్తే ప్రాణానికి కొంతవరకు భరోసా ఇవ్వచ్చు' అని తేల్చారు. 


' యాంప్యుటేషన్’ అంటే మాటలా? మూటలతో పనికానీ!

సుందరమూర్తి చేసేదేమీ సర్కారుద్యోగం కాదు. ఏదో ప్రైవేట్ పుగాకు కంపెనీలో అకౌంటెంటు. 


' యాక్సిడెంటయింది ఆదివారం డ్యూటీ-ఆఫ్ లో ఉన్నప్పుడు కాబట్టి  రూల్సు ప్రకారం  ముట్టేదేమీ లేదు పొమ్మ’న్నారు కంపెనీవాళ్ళు. 


నెలనెలా  జీతంలోనుంచి దాచుకొంటున్న పి. ఎఫ్ కూడా ఆడపిల్లల పెళ్ళిళ్ళకని చేసిన అప్పులకే చెల్లిపోతోంది. 


పెళ్లాం మెళ్ళో వేళ్ళాడే పుస్తెలు మినహా మరేమీ మిగల్లేదు ఇంట్లో.. ఇన్నాళ్ల పిల్లల చదువులు, పెళ్ళిళ్ల తంతులన్నీ ముగిసాక.


అప్పట్లో సుందరమూర్తి అన్ని పాట్లు అట్లా పడబట్టే.. ఇవాళ పెద్దాడు ఇన్ కమ్ టాక్సు ఆఫీసురుగా  కుదురుకొన్నది. చిన్నాడు బ్యాంకాఫీసరు కాగలిగింది. ఉండటానికి సొంత నీడంటూ ప్రస్తుతానికి మిగలక పోతేనేమి.. ఇద్దరు కూతుళ్ళకూ కుదురైన అత్తారిళ్ళు కుదిరిపోయాయి. 


‘ఆఖరివాడి విషయంలోనే కాస్త అన్యాయం జరిగింది. టొబోకో బోర్డులో వేయించగలిగాడుగానీ.. అది అన్నలకు మల్లే అధికార హోదాకలది కాదు.  నాలుగు డబ్బులు చేతుల్లో ఆడుతుంటే చివరాడికి మాత్రం  చిన్నగుమాస్తాగిరీతో సరిపెట్టేవాడినా!' అని మధన పడుతుంటాడెప్పుడూ సుందరమూర్తి ఒంటరిగా ఉన్నప్పుడు. 


ఆ కారణంగా వాడికి తనమేదెంత కోపమో తలుచుకుని తలుచుకొని అపరాధభావనతో  కుంగిపోవడం సుందరమూర్తి బలహీనత.


తండ్రీ బిడ్డలకు ఈ  విషయం మూలకంగా అంతగా మాటలు  లేవు.


' తనకిలా యాక్సిడెంటయిందని అందరితో పాటూ కబురెళ్ళినా..  చివరోడు తీరిగ్గా ఆఖర్లో మాత్రమే  ఎందుకొచ్చాడో తనకు తెలుసు. వచ్చి ఒక్కరోజైనా కాకుండానే 'సెలవుల్లేవు.. అర్జంటు పన్లున్నాయ'ని పెట్టేబేడా ఎందుకు సర్దుకుంటున్నాడో కూడా తనకు తెలుసు’ . 


దీర్ఘంగా నిటూర్చాడు సుందరమూర్తి.


గంటక్రితం అదే గదిలో కుటంబసభ్యులమధ్య జరిగిన సంభాషణలు గుర్తుకొచ్చాయి సుందరమూర్తికి.


' నాన్నగారి ఆపరేషనుకి తలా కొంత ఇచ్చుకోవాలిరా!' అని అడిగింది సుందరమూర్తి భార్య సుగుణమ్మ.. అందరికీ కాఫీలు అందిస్తూ.


' అరె! ఆ సంగతి ముందే చెప్పాలి కదమ్మా! పోయిన్నెల్లోనే పెద్దాడి కాలేజీ సీటుకోసమని ఐదు లక్షలు అప్పు తీసుకొచ్చాను బ్యాంకునుంచి. మళ్లీ అంత సొమ్మంటే మా ఆఫీసురూల్సు ఒప్పుకోవు' అనేసాడు పెద్దాడు వెంటనే. ముందే తయారు చేసిపెట్టుకున్నట్లుంది అతగాడా  స్పందించిన తీరు చూస్తుంటే!


సుందరమూర్తికి నవ్వొచ్చింది అంత బాధలోనూ. 'నాన్నా!పోయిన్నెలకు ముందే నువ్వెందుకు చేతులు పోగొట్టుకోలేదు?' అని ఆడిగినట్లనిపించింది. 


అయినా పెద్దాడి తత్వం తనకేమన్నా కొత్తా! వాడిప్పుడు అచ్చంగా వాళ్ల మామగారి అడుగుజాడల్లోనే కదా నడుస్తున్నదీ! మామగారి దయవల్లే తనకు ప్రమోషనొచ్చింద'ని ఎన్ని వందల సార్లు తనముందు అనివుంటాడో!


అయినా సుగుణకు వాడిమీదే ప్రేమ జాస్తి. 'మీకులాగా కాదు. నా పెద్దకొడుకు బతకనేర్చినవాడు' అని గర్వంగా చెప్పుకుంటుంటుందెప్పుడూ. '


తగిన శాస్తి చేసాడు తనకిప్పుడు' అనుకున్నాడు సుందరమూర్తి మనసులో చిన్నగా నవ్వుకొంటూ.


సుగుణమ్మ వెర్రిమొహమేసుకొని రెండోవాడివంక చూసినప్పుడు వాడూ అంతకుమించిన  మహానాటకానికే తెరతీసాడు. 


మొహం వేలాడేసుకొని 'ఇంతర్థాంతరంగా లక్షలంటే నా వల్లవుతుందా? నా వంతుగా ఓ పదో.. పాతికో అంటే ఎలాగో తంటాలు పడతాగానీ! దానికీ టైము కావాలమ్మా! లోనుకి అప్లై చేసిన వెంటనే సాంక్షనంటే అయే రోజులా ఇవి?' అని ముక్తాయించేసాడు. అదీ పెళ్లాం వంక బితుకు బితుకుమని చూస్తూ. 


పదికీ పాతిక్కీ కమిటయినందుకు అర్థాంగిగారు ఆనక గదిలో ఏం క్లాసు పీకుతుందోనన్న భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే వుంది వాడి కళ్ళల్లో.


పెద్దల్లుడే నయం. 'కొడుకులు మీరట్లా అనడం ఏం బాగోలేదోయ్! మరీ అంత ఇబ్బందయితే చెప్పండి. సర్దడానికి నేను రెడీ! ఆనక మీదగ్గరున్నప్పుడే ఇద్దురుగానీ' అన్నాడు. 


కానీ వెంటనే పెద్దకూతురు అందుకోనే అందుకంది'అవ్వ! బావమరదులకు అప్పిస్తానంటారా! లోకం వింటే నవ్విపోతుంది. అయినా మీదగ్గర అంత సొమ్ము మూలుగుతున్నట్లు నాకూ తెలీదే! కాలేజీకెళ్లే పిల్ల మెడ బోసిగా ఉంది.. కనీసం ఒక చిన్నగొలుసైనా చేయిద్దామని ఎంతకాలంబట్టీ మొత్తుకుంటున్నాను! ఆప్పుడు లేదన్న డబ్బు ఇప్పుడు కొత్తగా ఎక్కణ్ణుంచి పుట్టుకొచ్చిందో?!  పెళ్ళికి చెల్లాయికి అమ్మ మంచి గొలుసు చేయించి ఇచ్చిందిగదా! ఏమే!  అది బ్యాంకులో పెట్టినా నాన్న అవసరాలు తీరిపోతాయిగదా .. ఇలా అమ్మావాళ్ళు అందరి కాళ్ళు..  గడ్డాలు పట్టుకొని బతిమాలేబదులు!' అంటూ సన్నాయినొక్కులు మొదలుపెట్టింది.


అనుకోకుండా గాలి తనవేపుకి తిరగడంతో వెంటనే ఎలా స్పందించాలో తోచక బిక్కమొగమేసుకుంది చిన్నకూతురు. 


సుగుణమ్మే కలగజేసుకొని అనాల్సొచ్చింది 'కొత్తగా పెళ్లయిన పిల్ల, వంటిమీదకని ఇచ్చిన సొమ్మును ఎంతవసరమొస్తేమాత్రం తిరిగి తీసుకుంటామా? వదిలేయండింకా ఈ టాపిక్కుని ఇక్కడితో!' అనడంతో అమ్మగన్న సంతానమంతా గమ్మునయిపోయారు. 


'అమ్మయ్య! ఈ పూటకీ గండం ఎలాగో గడిచిపోయింద’న్నసంబరమే అందరి కళ్ళల్లో కనిపిస్తున్నది' అనుకున్నాడు సుందరమూర్తి. 


వాతావరణాన్ని తేలిక పరచడానికని తనే కలగజేసుకొన్నాడు చివరికి 'మీ ఆమ్మ పిచ్చిది.  పాతకాలం మనిషి. ఆమె మాటల్నేమీ పట్టించుకోకండర్రా! ఇక్కడున్న నాలుగురోజులు సంతోషంగా గడిపిపోండంతా. మళ్ళా ఎప్పుడు కలుస్తారో  ఏమో ఇట్లా అందరూ! పిల్లాపాపలతో మీరంతా చల్లంగా ఉండటమే మాకు కావాల్సింది' అన్నాడు.


తరువాత తనగదిలోకి వచ్చినప్పుడు సుగుణమ్మ కన్నబిడ్డల మాటల్ని తలుచుకొని తలుచుకొని గుడ్లనీరు కుక్కుకుంటుంటే సుందరమూర్తే సర్దిచెప్పాల్సి వచ్చింది. 


' వూరికే అనవసరంగా  వాళ్లని బాధ పెట్టడమెందుకు? నువ్వూ బాధ పడ్డమెందుకు? ఇప్పుడంత అర్జంటుగా నేనీచేతులు బాగుచేయించుకొని వరగబెట్టేది మాత్రం ఏముంది చెప్పు! ఎలాగూ  రిటైరవబోతుంటిని. ఆర్నెల్లకు  ముందే పదవీవిరమణ చేసానని సర్దిచెప్పుకొంటే సరిపోదా సుగుణా!' అంటూ.


ఎప్పుడు వచ్చాడో లక్ష్మీనారాయణ.. అంతా అప్పుడే  విన్నాడో.. సుగుణమ్మ అంతకుముందే చెప్పుకుందో.. లోపలికొచ్చి కూర్చున్నాడు. 'చూసావుగా సుందరం! నేనాడే హెచ్చరించాను. ఈ కాలం కుర్రసజ్జే అంత. పిలల్ని మనం 'బంగారు కొండల'నుకుంటాం. ఆ కొండలే విరిగి నెత్తిమీద పడితే?  అయ్యో.. మన త్యాగమంతా వృథా అయిపోయిందిగదా అనుకుంటూ అల్లాడిపోతుంటాం.. ఇలాగా!' అంటూ వేదాంతం మొదలుపెట్టాడు.


'పోనీలేరా! కన్నందుకు పిల్లల్ని వృద్ధిలోకి తేవడంకూడా ఓ గొప్పత్యాగమేనా! పుట్టీపుట్టంగానే డొక్కల్లో తంతూ నడక నేర్పించడానికి మనమేమీ ఒంటెలం కాదు. జిరాఫీలం అంతకన్నా కాదు. రెక్కలిరిగినప్పుడు ఆదుకుంటాయనేనా పిట్టలు గువ్వలకి నోళ్ళు పగలదీసి మరీ బువ్వ పెట్టేది! మన రక్తసంబధాలు విచిత్రంగా ఉంటాయిరా! కనకనే మనం మనుషులం. ఎవరి అదృష్టాలనిబట్టి వాళ్లకవి లభ్యమవుతాయి. నా అదృష్టం ఇదీ! దానికింకెవర్నోనిందిస్తూ కూర్చుంటే మనశ్శాంతి తిరిగొస్తుందా!. వస్తుందంటే చెప్పు.. నీ మాటే వింటాను’


'సరేలే! నీ వెర్రివేదాంతం నాకింతప్పట్నుంచీ తెలిసిందేగా! నువ్వెలాగూ వృద్ధాప్యంలో కష్టమొచ్చినప్పుడు ఇలాంటి గోతిలోనే పడతావని  ముందే తెలుసు. ఏడేళ్లకిందట ఇల్లు కట్టేటప్పుడు నీ దగ్గర అప్పు తీసుకున్నాను. గుర్తుందా? ఆ మూడు లక్షలు ఎప్పుడు తిరిగిస్తానన్నా'ఫ్రెండు దగ్గర బాకీ వసూలు చేసుకునే ద్రోహినా?' అంటూ సినిమా డైలాగులు కొట్టేవాడివి. 'కనీసం వడ్డీలేకుండానైనా తీసుకోరా దేవుడా!' అని ఎంత బ్రతిమిలాడాను! నీ  డబ్బుమొత్తం  ఆ రోజుల్లోనే  బ్యాంకులో వేసేసానబ్బాయ్ రికరింగ్ డిపాజిట్టుగా. నిన్ననే మెచూరయింది.. అదిచ్చిపోదామనే వచ్చింది' అని డబ్బున్న సంచీ అక్కడేవున్న సుగుణమ్మ చేతిలో పెట్టేసి  'లెక్క పెట్టించు తల్లీ! మొత్తంఆరున్నర లక్ష ఉండాలి' అన్నాడు లక్ష్మీనారాయణ. 


'లక్ష్మీ! నీకెందుకురా నామీద అంత ప్రేమ?'


'నేను నీ బాల్యస్నేహితుణ్ణి కనక. మరీ ముఖ్యంగా నువ్వు నా కన్నతండ్రివి కాదు కనక' అని నవ్వాడు లక్ష్మీనారాయణ. 


భోరున ఏడ్చేసాడు సుందరమూర్తి. అప్పటిదాకా అదిమిపెట్టుకొనున్న ఉద్వేగమంతా ఒక్కసారిగా కట్టలు తెంచుకొన్నట్లయింది. 


కాఫీ తాగి లేచివెళ్ళే సమయంలో  లక్ష్మీనారాయణని దగ్గరికి పిలిచి చెప్పాడు సందరమూర్తి 'సుగుణదగ్గరున్న ఆ క్యాష్  మా మూడోవాడు రాజుకాతాలో వేసెయ్యరా! వాడు చాలా రోజులబట్టీ డబ్బుకావాలని ఒహటే గోలపెడుతున్నాడు. ఏదో బండికొంటాట్ట! అదికొనిస్తేగాని వాళ్లబాసు ప్రసన్నం కాడనీ.. పైపోస్టుకి తన పేరు క్లియర్ కాదనీ మొత్తుకుంటున్నాడు చాలా రోజులబట్టీ.. పాపం! తప్పేముందిలే! వాడికి మాత్రం వాడి అన్నలకు  మల్లే పెద్ద హోదాలో ఉండాలని ఎందుకుండ కూడదు? ఈ మొండిచేతులు పెట్టుకొని ఇహ ముందు మాత్రం  వాడికి నేను చేసేది ఏముంటుంది? ప్రైవేట్ కంపెనీలో ఓ బోడి గుమస్తాపోస్టు ఇప్పించానని కదా ఇంతకాలం  వాడికి నామీద ఆ  గుర్రు!' అన్నాడు భార్యవైపు తిరిగి.


'మరి మీ సంగతేమిటండీ?' అని లబలబలాడింది అప్పుడే హారతిపళ్లెంతో లోపలికొచ్చిన సుగుణమ్మ.


'సుగుణా! ఈ లక్ష్మీగాడు  నీకు చెప్పడానికి జంకుతున్నాడు. నిన్న వాడే డాక్టరుదగ్గరికి వెళ్ళొచ్చాడు 'సమయం చాలా మించిపోయిందని.. ఇప్పుడు యాంప్యుటేషనంటే అసలు ప్రాణానికే ముప్పు' అని డాక్టర్లు చెబుతున్నార్ట. ఏరా!?' అని గద్దించి అడిగాడు మిత్రుణ్ణి సుందరమూర్తి.


' అవున'నాలో.. 'కాద'నాలో' తేల్చుకోలేక నీళ్ళునిండిన కళ్ళతో అలాగే నిలబడిపోయున్నాడు లక్ష్మీనారాయణ.


సుగుణమ్మ చేతిలో వెలుగుతున్న  హారతికర్పూరం  వాసన గుప్పున అతగాడి   ముక్కుపుటాలకు సోకింది.


- రచనః కర్లపాలెం హనుమంతరావు

***

(ఆంధ్రభూమి- వారపత్రిక- 17 సెప్టెంబరు 2015 నాటి సంచికలో ప్రచురితం)














గుండు జాడీ - సరదా కథానిక -కర్లపాలెం హనుమంతరావు

 

గుండు జాడీ- కథానిక

T


'ఆవగాయ అయిపోయింది. మీ అల్లుడిగారికి ముద్ద దిగడం లేదు. అర్జంటుగా ఓ చిన్నగుండు జాడీడైనా పమ్మిం'చమని మా తోడల్లుడుగారి మూడో కూతురు ఉత్తరం రాసింది.

ఆ పిల్ల మొగుడు వినాయకరావుకు అదేదో బ్యాంకులో ఉద్యోగం. ఈ మజ్జెనే బెజవాడ బదిలీ అయింది.

కృష్ణలో మునగాలనీ, కనక దుర్గమ్మను చూడాలనే వాంఛితం వల్ల నేనే బండెక్కా జాడీ పట్టుకుని.

తెనాలి దగ్గర ఓ ఎర్ర టోపీ పెట్టెలో కొచ్చింది. 'పేలుడు సామాను బండిలో ఉండకూడద'ని పేచీ పెట్టుక్కూర్చుంది సీటు కిందున్న జాడీ చూసి. అది పేలే పదార్థం కాదని నచ్చచెప్పడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది.

లంఖణాల బండి ముక్కుతూ మూలుగుతు బెజవాడ చేరేసరికి చిరుచీకట్లు ముసురుకుంటున్నాయి.

అదెక్కడి ఫ్లాట్ ఫారం! పెళ్లిపందిరిలా వెలిగిపోతో ఉంది. ఏవిఁ జనాలూ! ఎంత హడావుడీ! మా వూరి సంతే అనుకుంటే అంతకు వంద రెట్లు ఎక్కువగా ఉందీ వింత! ఈ సందోహంలో మా వాణ్ణి ఎట్లా పసిగట్టడం? అసలా శాల్తీనే గుర్తుపట్టడం కష్టం. పదేళ్ల కిందట పెళ్ళి వెల్తుర్లో చూడ్డవేఁ. ఇంకా అట్లాగే ఈకలు పీకిన కోడిలా ఉంటాడా?

అయోమయంగా జాడీ పట్టుకుని నడి ప్లాట్ ఫామ్మీద తచ్చాట్టం మొదలుపెట్టాను. ఈ కాఖీవాలా, రైల్వేపోలీసనుకుంటా.. కర్రకొట్టుకుంటూ వచ్చాడు.

'అగ్గిపెట్టుందా?'

ఇచ్చాను.

'సిగిరెట్టూ?'

నాకు చుట్టలు పీల్చడం అలవాటు. 'లేద'న్నాను.

'సిగిరెట్టు లేకుండా వట్టి అగ్గిపెట్టెందుకుందీ? ఎక్కడ అగ్గిపెట్టబోతున్నావ్? నీ వాలకం అనుమానంగా ఉంది. నీ చేతిలో అదేంటీ? టైం బాంబా?'

'బాంబు కాదండీ! ఆవగాయ జాడీ!'

'ఆవగాయా? వో క్యా హైఁ! ఖోల్దో!' ఏందో గోల!

జాడీ క్కట్టిన వాసెన విప్పి చూపించక తప్పింది కాదు.

లోపలికి తొంగి చూసి ఉలిక్కిపడ్డాడు. 'అమ్మో! రక్తం.. రక్తం!'

'తెలుగు వాడై ఉండడు. ఆవగాయంటే అర్థమవడంలేదు.

'రక్తం కాదండీ! నూనె!' నమ్మించడానికి జాడీలో వేలు ముంచి ఆ పోలీసోడి నాలిక మీదింత రాశాను.

అంతేఁ! ఎగిరి గంతేశాడు.

'పెలింది. గూబ్బేలింది' అంటు చెవులు రెండూ పట్టుక్కూర్చున్నాడు. నష్టపరిహారం కిందో వంద రూపాయలు వదులుకుంటే గాని వాడు నన్ను వదల్లేదు.

వినాయకరావిక రాడు. కార్డంది ఉండదు. ఇట్లాంటి ఉపద్రవాలన్నీ ముందే పసిగట్టే అతగాడింటి వివరాలన్ని రాయించి రొంటిన పెట్టుకునుంది. స్టేషన్ బైట సగం మెట్ల మీదుండగానే ఓ కుర్రాడొచ్చి నా జాడీ మీద పడ్డాడు. ఇంకా చాలామంది ఆ అవకాశం కోసం చుట్టూ మూగిపోయారు. అంతా కలసి నా చంకలోని జాడీని గుంజేసుకుంటున్నారు. బూతులు!.. గోల!

'ముందు నేనూ పట్టుకుంది. ఇది నాదీ!'

'ముందు నేన్చూశానెహె! జాడీ నాదీ..'

'కాదు నేం జూశాన్రా లం.. కొడకా!'

'ఇలాగిచ్చీసెయ్యండి సార్ .. జాడీని'

నా జాడీని పట్టుకుని నాది.. నాదని వాదులాడుకునే వాళ్లను చూసి ముందు నేను బెంబేలెత్తిపోయాను. బెజవాడ మనుషులు ఎంతకైనా తగుదురని మా బామ్మర్ది మాటలు గుర్తుకొచ్చి బలం కొద్దీ పరుగెత్తాను జాడీతో సహా!

వెనక నుండి ఈలలు.. గోల! బూతు మాటలు కూడా!

 నవ్వుల్తో కలిసి! వాళ్లంతా రిక్షావాళ్లట! తర్వాత తెలిసింది!

ఆదుర్దాలో ఎంత దూరం పరుగెత్తుకొచ్చానో నాకే తెలీదు. కుదుపులకు జాడీ మీద మూత కదిలినట్లుంది. వాసెనక్కట్టిన గుడ్డ ఆవనూనెకు  ఎరుపు రంగుకు తిరిగింది. మాడు కూడా కొద్దిగా మంటెత్తుతోంది.

ఇహ నడక నా వల్ల కాదు. ఎంత దూరవఁని నడుస్తా మీ దిక్కూ మొక్కూ లేని ఊళ్ళో! అందునా మా వినాయకరావుండే 'ఆంజనేయ వాగు' ఆనవాలు బొత్తిగా లేదు!

దార్న పోయే రిక్షాను పిలిచాను. వాడు దగ్గర దాకా వచ్చి జాడీని చూసి ఝడుసుకున్నట్లున్నాడు.. అదే పోత.. ఓ మాటా పలుకూ లేకుండా!

అతి కష్టం మీద మరో బండి పట్టుకున్నా! వాడి క్కొంచెం గుండె ధైర్యం ఎక్కువే సుమండీ! 'ఎక్కడికీ?' అనడిగాడు.

'వాగు లోకి' అని ఇది కూడా ఉందని జాడీని చూపిస్తూ. వాడూ ఝడుసుకున్నాడు. 'ఏంటదీ? ఎర్రంగా కార్తా ఉంది? మడిసి తలకాయ కాదు గందా?' అని ఆడిగాడు నా వంక అదోలా చూస్తూ!

ఈ గుండు జాడీ నా కొంప ముంచేట్లుందివాళ!

'ఏడు రూపాయలివ్వండి!  మూడో కన్నుకు కానకుండా వాగులోకి దింపించేత్తాను. రగతం రిసుకు మరి!' అన్నాడు దగ్గరి కొచ్చి గొంతు తగ్గించి.

ఆవకాయరా బాబూ! అని అక్కడికీ చిలక్కి చెప్పినట్లు చెప్పి చూశా. నా మాట నమ్మడంలే! అట్లాగని వదలటవూఁ లేదు. ఇట్లాంటి సాహసాలు ఇంతకు ముందు ఎన్ని చేశాడో! ఇప్పుడు నాకు వణుకు మొదలయింది.

'బెజవాడలో రిక్షా రేట్లు దారుణంగా ఉంటాయి. రిక్షా తొక్కె వాళ్లు అంత కన్నా దారుణంగా ఉంటారు. సాధ్యవైనంత వరకు పబ్లీకు మధ్యన బస్సుల్లో తిరగడవేఁ మేలు' అని హెచ్చరించివున్నాడొకప్పుడు మా తోడల్లుడు. ఆ ముక్కలు ఇప్పుడు గుర్తుకొచ్చాయి. రిక్షావాణ్నక్కడే వదిలేసి అప్పుడే వచ్చిన బస్సు దిక్కు పరుగెత్తాను.

అది ఇరవై నాలుగో నెంబరు బస్సు.

అమ్మాయి ఉత్తరంలో రాసిన నెంబర్లు గభాలున గుర్తుకొచ్చి చావడం లేదు. ఎవర్నైనా అడుక్కోక తప్పదు. అక్కడే నిలబడి తాపీగా చుట్ట పీక పీల్చుకునే పెద్దమనిషొకతను కనిపించాడు.

'ఈ బస్సెక్కడికి పోతుంది?' ఆడిగా.

'నువ్వేడకి పోవాలా?' ఎదురు కొచ్చెను.

'వాగులోకి'

'ఇది కాటికి పోయేదయ్యా! అల్లదిగో! ఆడాగి వుందే నాలుగో నెంబరు బస్సు.. అదెక్కెల్లిపో! తిన్నగా వాగులో దింపేత్తది.. బేగి పో' ఉత్తరాంధ్ర సరుకులాగా ఉంది. బెజవాడ కదా! అని బాషల వాళ్లూ గుమిగూడ్తార్లా ఉంది.

 నాలుగో నెంబర్ బస్సు నిద్రలో గురక పెడుతూ తూలిపడేవాడిలా వూరికే వూగిపోతావుంది వెనక్కీ.. ముందుకీ!

బస్సంతా కోళ్ల గంపలా కిక్కిరిసిపోయుంది. అయిస్కాంతం అంచుల దగ్గర ఇనప తుక్కు పేరుకున్నట్లు రెండు డోర్ల దగ్గరా జనాలు పొర్లిపోతున్నారు. అయినా మనిషికి మనిషికీ మధ్యన ఇంకా సందుండిపోయిందని మధన పడిపోతున్నాడు బస్సు కుర్రాడు.

'రావాలండీ .. రావాల! మార్కెట్ పంజా కాలేజ్ జండా వాగు చిట్నగర్ లంబాడీ.. రావాలండీ.. రావాలా..'

చెవి తెగ్గోసిన మేకకి మల్లే ఒహటే అరుస్తున్నా ఆ కుర్రాడి దగ్గరికెళ్లి అడిగా 'వాగులో కెళతందా?'

అంతే! మాటా పలుకూ లేకుండా నా పెడ రెక్కలు పట్టేసుకుని బస్సులోకి ఈడ్చేసుకున్నాడ కుర్రాడు నా భుజం మీది జాడి పక్క మనిషి నెత్తి మీదకెక్కింది కుర్రాడి గత్తర్లో!

రామాయణంలోని పుష్పకవిమానం దారి తప్పొచ్చి బెజవాడ వీధుల్లో వాలినట్లుంది. ఎంత మందిని కుక్కినా బస్సోళ్లకు తృప్తి కలగడం లేదు.

'.. ఎదరకు జరగండి బావూఁ.. ముందుకు జరగండి.. ముందుకు పదండి.. ఊఁ ఊఁ.. పదండి ముందుకు .. పదండి ముందుకు..'

మనస్ఫూర్తిగా మనల్నింకా ముందుకు పదమనే వాళ్లింకా దేశంలో మిగిలున్నందుకు మహా ముచ్చటేసింది కానీ.. అదా స్థలం? సందర్భం?

చినుక్కీ చినుక్కీ మధ్య నుంచి గుర్ర్రం తోల్తూ బాణాలేసే పురాణపురుషుడి చాకచక్యం మించి పేసింజర్స్  భుజాల మీద పాక్కొస్తూ, బూతులు కూస్తో, 

టిక్కెట్లు కోస్తో వస్తోన్న కండక్టర్ని నిజంగా అభినందించాలి!

నిద్రలో నడిచేవాళ్లా బైల్దేరిన బస్సుకు ఏం మూడిందో, మూడు నిమిషాల్లో ముక్కుతాడు తెంచుకున్న గుర్రంలా పిచ్చ పరుగందుకొంది. మజ్జె మజ్జెలో సకిలింపులు.. బస్సు కుర్రాళ్ల రంకెలు!

వెనకమాల్నుంచి మరో మదమెక్కిన బస్సుగుర్రం తరుముకొస్తోందట!

అప్పుడు చూశా డ్రైవర్ సీటుకు సరిగ్గా నెత్తి మీద పెద్దక్షరాలతో రాసున్న హెచ్చరిక 'దేవుని స్మరింపుము'

ప్రస్తుతం నేను చేస్తోన్న పని కూడా అదే!  నేనూ, జాడీ క్షేమంగా వాగులోకి దిగితే అదే పదివేలు!

గవర్నమెంటాసుపత్రి ముందు అయిష్టంగా బస్సాగింది.

కండక్టరు అరుస్తోన్నాడు 'ఆసుపత్రి కెవరెళతారండీ!;

ఈ బస్సిట్లా ఇంకో పది నిముషాలు గెంతితే అందరం అక్కడికి పోవాల్సిన వాళ్లమే!

ప్రస్తుతానికి ఓ భారీ కాయం మాత్రం ఆపసోపాలు పదుతూ సీట్లోంచి లేచింది.

ఆ కాయాన్ని ఆస్పత్రి పాల్జేయడానికి అయిన ఆలస్యాన్ని కాంపెన్సేట్ చేయడానికి డ్రైవర్ పూర్తిగా స్టీరింగ్ మీంచి చేతులు ఎత్తేశాడు. బహుశా పెడలు మీది పాదం కూడా అదే పని చేసుండచ్చు. మొత్తంగా బస్సు మెత్తంగా గాలిలో తేలిపోతోందీ సారి. బోడెమ్మ సెంటర్ దగ్గర బ్రేక్ పడక తప్పలేదు.

'బోడెమ్మ ఎవరండీ? బోడెమ్మ ఎవరండీ?' కండక్టరు రంధి.

'నేనేనండీ!' అంటూ లేచిందో పునిస్త్రీ.

'నువ్వం కాళ్లమ్మంటివి కదమ్మా? 'అంకాళమ్మ గుడి స్టాప్' అని కండక్టర్ ధ్వని!

'నేను కాదయ్యా అంకాళమ్మ! నా ఈపరాలు. ఇదిగో ఈడనే కూకోనుండాది. బోడెమ్మ నేనే!'

ఆ శాల్తీని బస్సులో నుంచి దాదాపు తోసేసి బెల్లుకొట్టాడు కండక్టర్.

పీరు చెట్టు దగ్గర పీరెవరో లేచి రమ్మంటే ఓ శాస్త్రులు గారు దిగడానికి తయారయ్యారు. 'గాంధీ బొమ్మ' దగ్గర అట్లాగే కండక్టర్ 'గాంధీ..గాంధీ ఎవరు బాబూ.. గాంధీ' అని మొత్తుకుంటుంటే ఓ తాగుబోతు 'ఓయ్' అంటూ ఇద్దరు పేసింజర్ల చేతి సాయంతో తూలుకుంటూ దిగిపోయాడు.

 

హఠాత్తుగా     బస్సొక్కక్షణం ఆగి.. మరుక్షణమే వెనక్కి నడవడం మొదలెట్టింది!

'అందరూ దిగాలి. దిగాలి. బస్సింక ముందుకు పోదు' అని అరుపులు లంకించుకున్నాడు కండక్టర్!

వనక బస్సుతో పోటీ తట్టుకోడానికి హఠాత్తుగా ఇట్లా దారి మళ్లించడం బెజవాడ బస్సుల కలవాటైన ముచ్చటేనట. 

అదేమని అడిగితే 'మెడ మీద చెయ్యేసి తోసేస్తారు, బెజవాడ బసులోళ్లు యములోడికైనా జడవరు' అంది అప్పటి దాకా నా గుండు జాడీ మోసిన గుండు శాల్తీ.

అందర్తో సహా హడావుడిగా బస్సు నుండి నేనూ  బైటకుదూకేశా.

ఎత్తు మీంచి దూకడంతోజాడీ బీటలిచ్చినట్లుంది.. జుత్తంతా ఆవ జిడ్డుతో ముద్ద ముద్ద! నుదుటి మీంచి నుదురు మీదికి జారిన ఆవ నూనె మరకలు ఎండి ఎప్పుడో చారికలు కట్టున్నాయి. కళ్లూ.. వళ్లూ అంతా మంట మంట!

చీకట్లో ఎవరూ చూదకుండా మావాడిల్లు కనుక్కోడానికి అష్టకష్టాలు పడాల్సొచ్చింది.

అప్పటికే అర్థరాత్రి దాటింది.

బాడీ, జాడీ వెరసి శరీరమంతా బట్టలతో రక్త సిక్తంగా మారిపోయింది.   చంకలోని గుండు జాడీ ఖండిత శిరస్సును తలపిస్తోంది.

    ఎవరైనా చూస్తే హంతకుణ్నని వెంటబట్టం ఖాయం.

చలి వల్ల వణుకు..

ఆకలి వల్ల నీరసం..

ఆవగాయ వల్ల  మంట..

ప్రయాణం వల్ల అలసట..

నిద్ర వల్ల మత్తూ..

వళ్లు తూలిపోతూంటే, కాళ్లు వణికిపోతోంటే, ఆ నడి రాత్రి చీకట్లో ఎట్లాగైతే ఏం వినాయకరావిల్లు పట్టుకుని తలుపులు దబదబా బాదేస్తున్నా.

ఐదు నిముషాలగ్గానూ మెల్లిగా తలుపు తెరుచుకుంది కాదు.

'ఎవరూ?' ఏదో ఆడగొంతు మెల్లిగా.

'నేనమ్మా! పెదనాన్నను.  ఇదిగో! ఆడిగావుగా! తెచ్చా నీ కోసం!' అంటూ గుండు జాడీని గడప మీదకు దించానంతే!

 'కెవ్వుఁ!' కేక! ఒకసారి కాదు.. వరసగా ఏ పది సార్లో!

ఆ పిల్ల అమాంతం అల్లాగే విరుచుకుపడిపోయింది.

భగవంతుడా! ఇప్పుడేం చేయడం!

పారిపోడమా! ఉండిపోయి దెబ్బలు తిండమా!

మీమాంస నడుస్తూండగానే గదిలోంచి  బైటికొచ్చిన వినాయకరావు ఒక్క క్షణం అవాక్కయిపోయి మరుక్షణంలో 'మర్డర్! మర్డర్!' అంటో వీధిలోకి పరుగేట్టి వీరంగాలు  మొదలెట్టాడు.

అరవడానికి పోగైన వీధి కుక్కలు చీకట్లో ఆవగాయ బద్దల్నే మాంసం ముక్కలనుకున్నాయో.. ఏంటో.. ఆవురావురమని మెక్కెస్తున్నాయి.

అమ్మాయికని తోడల్లుడు శ్రద్ధగా చేయించిన ఆవగాయ మొత్తం వీధి కుక్కలపాలు!

అవునూ!.. కుక్కలు ఆవగాయ ముక్కల కాశపడతాయా.. మరీ విడ్డూరం కాపోతే? అని సొడ్డు నా మీద మాత్రం వేయకండి!

అప్పుడూ ఇప్పుడూ .. బెజవాడలో జరిగే విచిత్రాలు బ్రహ్మంగారికే అందలే! ఇహ మీకూ.. నాకూనా?!

-కర్లపాలెం హనుమంతరావు

***

(ఆంధ్రప్రభ వారపత్రిక సెప్టెంబర్, 1982 ప్రచురితం -రికార్డులో 16  -09 -1982 అని ఉంది)

 

 

 

 

 

 

 

 

 

 

 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...