Showing posts with label Spiritual. Life. Show all posts
Showing posts with label Spiritual. Life. Show all posts

Tuesday, February 18, 2020

ఇస్లాం మతం -కర్లపాలెం హనుమంతరావు


వేరే మతాలలో ఉన్నంత మాత్రాన అన్యమతాలను గురించి ఆసక్తికరమైన సమాచారం తెలుసుకోరాదని ఏమీ లేదుగా! ఆ తరహా అభిరుచి కలవారి కోసమే ఈ చిన్నవ్యాసం! ఇస్లాం మతాన్ని గురించి టూకీగా  తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నవాళ్ళకు!


పుట్టింది కేవలం 1500 ఏళ్ల కిందట. కానీ ప్రపంచ జనాభాలో ఆరో శాతనికన్న కొంచెం ఎక్కువగా ఇప్పుడు విశ్వసిస్తున్నది ఇస్లాం మతం. ప్రపంచ జనాభా 652 కోట్లు అని లెక్కవేసిన 2004లో ముస్లిం మత విశ్వాసుల సంఖ్య 152 కోట్లు. ఇండొనేసియాలో మెజారిటీ మతం ఇస్లాం 21 కోట్ల 60 లక్షలు. సౌదీ అరేబియా, బహ్రేన్, వెస్ట్రన్ సహారాలలో వంద శాతం ముస్లిములే! టర్కీ, ఒమాన్, గాజా, యూ.ఎ.ఇ, సోమాలియా, ఇరాన్, అల్జీరియా, ట్యునీషియా, లిబియా, గాజాస్ట్రిప్, కతర్, సెనెగల్, సిరియా, గాంబియా, మాలి లాంటి దేశాలు ఇంకా చాలా చిన్నవి పొన్నవీ ఉన్నాయి.. వాటిలో నూటికి తొంభై మంది ముసల్మాన్ మతస్తులే! భారతదేశంలో 109 కోట్లుగా ఉన్నప్పుడు ముస్లిం జనాభా15 కోట్ల 30 లక్షలు. జనాభాలో  ఏడో వంతు. (పాకిస్తాన్ జనాభా మరో 70 లక్షలు మాత్రమే అధికం). ఇవన్నీ కొత్త శతాబ్దం తొలి దశకం అంచనాలు. తతిమ్మా అన్ని మతాల కన్నా ముస్లిం జనాభా అత్యంత వేగంగా పెరుగుతున్నట్లు అంతర్జాతీయ గణాంకాలు లెక్కలు వేసుకుని చెబుతున్నాయి.

ఇస్లాం అనే పదం అరబిక్ భాషలోని 'స్లం' అనే అక్షరం నుంచి పుట్టింది. మనసుని, బుద్ధిని భగవంతుని పరం చేసి సాధించే శాంతిని 'స్లం' అంటారు. ముస్లిం అంటే బుద్ధిని సర్వేశ్వరుని పరం చేసిన వ్యక్తి. 'ఖుర్ ఆన్' వీరి పవిత్ర గ్రంథం. ఇందులోని సూక్తులన్ని స్వయంగా భగవంతుడు ప్రవక్తకు అందించినవిగా విశ్వాసం. 
ఇస్లాం ప్రవక్త పుట్టించిన మతం కాదని.. సృష్టి ఆది నుంచి ఉన్న మతాన్నే ప్రవక్త ద్వారా ప్రపంచానికి తెలియచేసాడని మత పెద్దలు భావిస్తారు. తన ముందు వచ్చిన ప్రవక్తలకు మల్లే ఇస్లాం మత సూత్రాలని ఏ కొద్దిమందికో కాకుండా ప్రపంచమానవాళి మొత్తానికి అందించిన కారణంగానే మహమ్మద్ ప్రవక్తకు ఎక్కువ ప్రాచుర్యం లభించినట్లు ఓ అభిప్రాయం.  
తాము నమ్ముతూ వస్తున్న మత భావాలకు విరుద్ధంగా హేతుబద్ధమైన సూత్రాలతో ప్రపంచాన్ని వేగంగా ఆకర్షించే మహమ్మదు ప్రవక్త మీద ఆ మత పెద్దలకు సహజంగానే కినుక. కినుక ఎక్కువ అయితే హింసకు దారితీస్తుందని మనందరికీ తెలిసిన విషయమే. మహమ్మదు మీదా, అతని అనుచరల మీదా హింసాకాండ పెచ్చుమీరడంతో మక్కాను వదిలి 'రెడ్ సీ' (ఎర్ర సముద్రం) మీదుగా అబిసీనియా(ఇప్పుడది ఇథియోపియా) చేరుకున్నాడు  మహమ్మద్. ప్రవక్తను అనుసరించిన నూటొక్క మంది అనుచరులలో 83 మంది పురుషులు, 18 మంది స్త్రీలు. అయినా మక్కాలో మహమ్మద్ కుటుంబాన్ని సంఘబహిష్కరణ చేసి హింసించింది మక్కా  మతపెద్దల గుంపు. ప్రవక్తకు అండగా ఉంటూ వచ్చిన పినతండ్రి  అబూ తాలిబ్, భార్య ఖదీజా మరణించిన విషాద కాలాన్ని ముసల్మానులు అముల్ హుజ్న్ (విషాద సంవత్సరం)గా పరిగణిస్తారు. ఆ తరువాతా మహమ్మద్ మీద హింస తగ్గింది కాదు. ఆ ప్రతికూల వాతావరణంలోనే మక్కావాసుల  భక్తి విశ్వాసాలను క్రమంగా చూరగొన్నాడు. సమీపంలోని  ఎస్రిబ్ నగరానికి వెళ్ళి భగవంతుని వాణిని వినిపించేందుకు సిద్ధమయాడు మహమ్మద్.  అక్కడి విరోధి వర్గాల మధ్యన సయోధ్య కుదిర్చి శాంతి వాతావరణం కలిపించి  తిరిగి మక్కా వెళ్లే సమయంలో రాత్రి వేళ హంతకుల మూఠా ఆయనను మట్టుపెట్టే ప్రయత్నం చేసింది. తన స్థానంలో ఆలీ అనే అనుయాయి ఉండిపోవడంతో మహమ్మద్ కు ప్రాణగండం తప్పింది. ప్రాణమిత్రుడు అబూ బకర్  ఒక్కడినే వెంటపెట్టుకుని మదీనా చేరడంతో ఇస్లాం చరిత్రలో కొత్త శకం 'హిజ్రీ శకం'  ఆరంభమయింది. 
ప్రవక్త మక్కా నుంచి మదీనా వలసవెళ్లడం 'హిజ్రల్'గా చరిత్రలో ప్రసిద్ధం.  ప్రవక్త రాకతో ఎస్రిబ్ 'మదీన్నతుబీ' (ప్రవక్త నగరం)గా పేరు మారిపోయింది.  ఎస్రిబ్ నగరవాసులు ఎందరో ఇస్లాం మతంలోకి మారిపోయారు. 
బహుదేవతారాధకులకు/అవిశ్వాసులకు.. ఇస్లాం మతానుయాయులకు క్రీ.శ 624 నుంచి 627 దాకా మూడు యుద్ధాలు జరిగాయి. మక్కా మదీనాలకు మధ్యన నైరుతీ దిశలో సుమారు 136 కి.మీ దూరంలో ఉన్న 'బద్ర్' అనే స్థలంలో క్రీ.శ 624లో జరిగిన యుద్ధం ఇస్లాం చరిత్ర గతిని మార్చేసిన ఘట్టం.  అది హిజ్రీ శకం ఆరంభం అయిన రెండో ఏడాది.   ముస్లిములు ఈ యుద్ధంలో ఓడిపోతే ప్రపంచంలో ఇప్పుడు ఇస్లాం అన్న ఒక మతమే ఉండేది కాదు. ఈ మాట స్వయంగా మహమ్మద్ ప్రవక్త యుద్దసమయంలో అల్లాకు చేసుకున్న విన్నపం ద్వారా తెలుస్తుంది. సంఖ్యాపరంగా తక్కువ పరిణామంలో   ఉన్నా ఇస్లాం పక్షం విజయం సాధించడానికి ఆనాడు అల్లా ఆశీర్వాదమే కారణమని  నేటికీ ముస్లిములు భావిస్తారు. తరువాతి  రెండు ఏడాళ్లూ రెండు యుద్ధాలు వెంట వెంటనే జరిగాయి.. ఉహుద్ కొండప్రాంతంలో ఒకటి, మదీనా పరిసరాల ప్రాంతంలో రెండోది. ఈ రెండు యుద్ధాలలో లభించిన   విజయాల కారణంగా  మక్కా కూడా ఇస్లాం మతం స్వీకరించడంతో విగ్రహాలు అక్కరలేని 'కాబా' పూజా విధానం ప్రపంచమంతటా ఆల్లుకునేందుకు పునాది పడినట్లయింది. ప్రపంచ ముస్లిములకంతా ఇప్పుడు 'హజ్' ను పవిత్ర స్థలంగా భావిస్తున్నారు.  జీవితంలో ఒక్కసారైనా దర్శించుకుని తీరవలసిన పుణ్యస్థలిగా విశ్వాసం బలపడుతూ వస్తోంది. ఈ హజ్ యాతకే మన తెలుగు సర్కారులు ముస్లిములకు ఉచిత పథకాలుఉ ప్రకటించడం! 
క్రీ.శ 632, జూన్ 8 న (హిజ్రీ శకం 11 వ సంవత్సరం, రబీవుల్ అవ్వల్ నెల 11వ తేదీ) మహమ్మద్ తన 23 ఏళ్ల ప్రవక్త జీవితాన్ని చాలించుకుని బౌతికంగా కనుమరుగయినప్పటికీ.. ఆయన  ప్రసాదించిన జ్ఞాన సంపదలు ఖుర్ ఆన్, సున్నత్ ప్రపంచగతిని ప్రతీ దేశంలోనూ అనుకూలంగాగానో, ప్రతికూలంగానో ఏదో విధంగా తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయ్!
ఖుర్ ఆన్ ముస్లిముల పవిత్ర గ్రంథంగా మనందరికీ తెలుసును. 'సున్నత్'- ప్రవక్త నెలకొల్పిన సంప్రదాయాల సంకలనం. ఆఖరి రోజుల వరకు ఆయన  చేసిన బోధనలు 'హదీసు' పేరుతో సుప్రసిద్ధం. సమాధులను, గోరీలను పూజాలయాలు చేయవద్దన్నది మహమ్మది ప్రధాన ఆదేశం.
అల్లా ధర్మమని భావించిన దానినే తాను 'హలాల్' గాను, అధర్మని భావించిన దానిని 'హరామ్' గాను బోధించినట్లు చెబుతూనే దేనినీ తనకు వ్యక్తిగతంగా ఆపాదించే ప్రయత్నం చేయవద్దని మహమ్మద్ ప్రవక్త  సూచిస్తారు. 

కానీ దురదృష్టం కొద్దీ ఇప్పుడు ఇస్లాం మతం పేరున చెలరేగుతున్న  అనుకూల, ప్రతికూల  సంఘటనలన్నీ మహమ్మద్ ప్రవక్త రూపంలో బోధించిన తీరుకు విరుద్ధంగానే సాగుతున్నవి. అదీ విచారకరం!
(అంతర్జాలంలో సేకరించిన సమాచారం ఆధారంగా ప్రముఖ పాత్రికేయులు శ్రీ పొత్తూరు వేంకటేశ్వరరావుగారు ప్రచురించిన 'పారమార్థిక పదకోశం.. ప్రేరణతో)
   రాసిన వ్యాసం. రచయితకు ఏ తరహా ఉద్దేశాలు ఆపాదించవద్దని ప్రార్థన.)
-కర్లపాలెం హనుమంతరావు
18 -02 -2020





Sunday, February 9, 2020

హేతువాదం -కర్లపాలెం హనుమంతరావు



మనిషి ఆరంభంలో హేతువాదే! తెలిసిన విషయాలతో తెలీని విషయాలను తర్కించుకుంటూ సంతృప్తికరమైన సమాధానాలు దొరికే వరకు అన్వేషణ కొనసాగించడం అతని నైజంగా ఉండేది. చేతనయింది తాను  సృష్టించుకుంటున్నట్లుగానే తనకు చేతగాని వాటిని ఎవరో తన కోసం సృష్టించి పెడుతున్నారని భావించడమూ తర్కం విభాగం కిందకే కదా వచ్చేది? ఆ అదృశ్య శక్తిని అతడు దేవుడుగా భావించాడు. ఆ దేవుడి చుట్టూతా మతం అల్లుకోవడం, అదే ఒక వ్యవస్థగా వేళ్లూనుకోవడం, క్రమంగా దానిలో మౌఢ్యం ప్రవేశించడం, దానిని ఎదుర్కొనేందుకు చైతన్యంతో ప్రతిస్పందించడం.. ఈ మొత్తాన్ని ఒక ముద్దగా చూస్తే అదే మనిషి పురోగతి అనిపిస్తుంది. మౌఢ్యాన్ని ప్రశ్నించడానికి మనిషి ఎన్నుకున్న ప్రక్రియా అనాదిలో ఆరంభంలో అనుసరించిన ప్రశ్న పధ్ధతే అని మనం మర్చిపోరాదు. 'ప్రతి వస్తువును ఎవరో ఒకరు సృష్టించాలన్న సిధ్ధాంతం ప్రకారం తనకోసం సృష్టించిన వాడినీ ఎవరో ఒకరు సృష్టించి ఉండాలి కదా?' అన్నది తర్కం కిందకే వస్తుంది కదా! ఆ ప్రశ్నకు జవాబు దొరకని మతం అలా పదే పదే ఎదురు తిరిగి ప్రశ్నించేవాళ్ల మీద 'మౌఢ్యం' ముద్ర వేయకపోతే మరింత మంది బుద్ధిమంతులు ఆ ప్రశ్ననే కొనసాగించి సమాజాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెడతారని 'మతం' బెదురు. మొదటి తర్కంలో నుంచి పుట్టిన మతాన్ని అక్కున చేర్చుకున్నవారే రెండో తర్కానికి మూఢత్వం అనే లేబుల్ అంటగట్టడం.. విచిత్రం! 'ఆస్తికత్వం' అనే పదాన్ని దేవుడు పరంగా 'ఉన్నాడు'అన్న అర్థంలో తప్ప మరో విధంగా భావించడం రాని భావదాస్యత 'ఆ ఉన్నాడు అంటున్నవాడు ఎక్కడున్నాడో.. ఎలా ఉంటాడో.. చెప్పండి.. అలా చెప్పలేక పోయినా.. పోనీ ఫలానా విధంగా ఉన్నాడన్న రుజువులైనా కొద్దిగా చూపించండ'ని ఆడుగుతుంటే సంతృప్తికరమైన జవాబు ఇచ్చే పరిస్థితుల్లో లేక  'నాస్తికత్వం' అన్న పేరు తగిలించి సంఘబహిష్కరణ చేసే విఫల ప్రయత్నాలు విశ్వవ్యాప్తంగా అన్ని కాలాల్లోనూ జరుగుతున్న అకృత్యమే!
సత్యాన్వేషణకు కట్టుబడ్డ ఎంతోమంది శాస్త్రవేత్తలు.. సామాజిక తత్వవేత్తలు తమ నిబద్ధత కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు చరిత్ర నిండా బోలెడన్ని.
జిజ్ఞాస, తర్కం సృష్టిలో మనిషి విశిష్టతలు. ఆ రెండింటినీ అణగదొక్కడమంటే మానవజాతిని జంతుప్రాయంగా జీవించమని నిర్బధించడమే!
తెలుగు సమాజంలోని అనేకమైన లోటుపాట్లను బట్టలు విప్పదీసి మరీ ప్రదర్శించిన ప్రశ్నవేత్త యోగి వేమన. కులభేదాలతో కుళ్లిన సమాజాన్ని సంస్కరించే సదుద్దేశంతో సామూహిక భోజన కార్యక్రమాన్ని సాహసంతో తలపెట్టిన గొప్ప సంస్కర్త బ్రహ్మనాయుడు. వీరిద్దరు చూపించిన వైజ్ఞానికి, సామాజిక తర్కవాదం దారిలోనే తదనంతర దశల్లో మరిన్ని అడుగులు జాతిని ముందుకు నడిపించిన హేతువాదులు.. కొమర్రాజు లక్ష్మణరావు, కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావులు.. వారి అనుయాయులూ త్రిపురనేని రామస్వామి చౌదరి, గుర్రం జాషువా(భగవంతుడు ఉన్నాడన్న భావన ఉన్నా నిర్భయంగా నిలదీసిన ప్రశ్నవాది). రాజారామ్మోహన్ రాయ్  బ్రహ్మసమాజం, దయానంద సరస్వతి ఆర్యసమాజం, అనీబిసెంట్ దివ్యజ్ఞాన సమాజం, రాజకీయ, ఆర్థిక రంగాల పరంగా కమ్యూనిజం.. వంటి భావజాలాల మూలకంగా భారతదేశంలో హేతువాదానికి ఎప్పటికప్పుడు కొత్త జవసత్వాలు పుట్టుకొస్తూనే ఉన్నాయ్! ఎం.ఎన్.రాయ్ రాడికల్ హ్యూమనిజం దారిలోనే గోరా హేతువాద ఉద్యమం ముందుకు సాగింది. హేతువాదానికి మరో ఉద్యమ రూపంగా సమాజంలో తనదైన ప్రత్యేక ముద్ర వేయించుకొన్న గోరాని గురించి ఎంత చెప్పినా ఇంకొంత మిగిలే ఉంటుంది.
కాకినాడ పిఠాపురం రాజావారి కళాశాలలో  చేసే చేసే ఉద్యోగాన్నుంచి ఉద్వాసన పలకాల్సొచ్చింది గోరాగారికి 1933లో హేతువాదాన్ని విద్యార్థుల్లో ప్రచారం చేస్తున్నారన్న నెపంతో. బందరు హిందూ కళాశాలలో  ఏ ప్రతిబంధకాలు లేని కారణంగా విశాఖపట్నం హిందూ పఠన మందిరంలో ఏకంగా నాస్తికత్వం మీద బహిరంగ నిర్వహించారు. ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ ప్రకటించుకొని, కృష్ణా జిల్లాల్లో నాస్తిక కేంద్రం స్థాపించారు గోరా. 'నాస్తికత్వం లేక దేవుడు లేడు' అనే పుస్తకం ద్వారా ఆలోచనాపరులను కదిలించారు. హేతువాద దృష్టికి ఒక వ్యవస్థీకృత స్థాయి ఆంధ్రదేశంలో ఏర్పడేందుకు ఆ కాలంలోనే ఊపందుకొన్న ఎం.ఎన్.రాయ్ హ్యూమనిజం భావజాలం కూడా ఒక ముఖ్యమైన కారణమే!
స్వాతంత్రోద్యమం, తెలంగాణా విమోచనోద్యమాలలో నాస్తికుల పేరునే మేధావులు కొందరు పాలుపంచుకొన్నారు. స్వతంత్రం వచ్చిన తరువాత గోరాగారు విజయవాడలో నాస్తిక కేంద్రం ఏర్పాటు చేసుకొన్నారు. అక్కణ్నుంచే 'సంఘం' పేరుతో వారపత్రిక ప్రచురణ జరిగేది. అదే పంథాలో తెనాలి నుంచి రాడికల్ హ్యూమనిజం భావప్రచారానికి 'సమీక్ష' పేరుతో  మరో వారపత్రిక వెలువడుతుండేది.
మూఢనమ్మకాలను ప్రశ్నించడం, దైవాంశసంభూతులని డబ్బాలు కొట్టుకునేవాళ్ల మహిమలను బహిరంగా సవాలు  చెయ్యడం, బాబాల  అద్భుతాలుగా కొనియాడే గమ్మత్తులను నాస్తికకవాదులుగా తామే బహిరంగంగా ప్రదర్శించి చూపించడం.. ఆనక ఆ మహిమల వెనుక ఉన్న మర్మాలను  వివరించడం వంటి  చర్యల ద్వారా అభూత కల్పనలకు అడ్డుకునే ప్రయత్నాలు నిరంతరాయంగా కొనసాగుతుండేవిచర్చల సందర్భంలో మొహం చాటు చెసే సాధారణ పౌరులలో తార్కికమైన ఆలోచనలను రేకెత్తించడమే ఇలాంటి చర్యల ప్రధాన ప్రయోజనం. గోరాగారు ఒక వ్యక్తిగా కాకుండా సకుటుంబంగా ఈ హేతువాద ఉద్యమంలో పాలుపంచుకోవడం మరన్ని హేతువాద కుటుంబాలు ఏర్పడేందుకు దోహదపడింది.
నార్ల వేంకటేశ్వర్రావు, ఆవుల గోపాలకృష్ణమూర్తి, డాక్టర్ త్రిపురనేని వెంకటేశ్వర్రావు, గౌరిబోయిన పోలయ్య, రావిపూడి వెంకటాద్రి, మల్లాది సుబ్బమ్మ వంటి మేధావుల కార్యకలాపాల కారణంగా హేతువాద ఉద్యమం  బహుళ వ్యాప్తిలో ఉండేది. ఉంటోంది.
గోరాగారు మహాత్మాగాంధీతో చేసిన చర్చలు 'An Athiest with Gandhi' పేరుతో పుస్తక రూపంలో వెలువడి.. తదనంతర కాలంలో ఆంగ్ల తర్జుమా కూడా సంఘం పత్రికలో  వెలువడింది. నాస్తికవాద ప్రచారానికి ప్రపంచ పర్యటనకు పూనుకున్న గోరా 1970లో ప్రపంచ నాస్తిక మహాసభలు సైతం విజయవాడలో నిర్వహించారు. అదే దశకంలో ఆంధ్రదేశంలో హేతువాద సంఘం, విశాఖ వేదికగా  మార్క్సిస్టు భావజాలంతో భారత నాస్తిక సమాజం ఎర్పడ్డాయి. శిక్షణా తరగతులు, అధ్యయన తరగతులు జిల్లాల వారీగా నిర్వహించేవారు. తెలుగునాట ఉధృతమవుతున్న హేతువాద ఉద్యమానికి ఆకర్షితులయే శ్రీ లంక ప్రొఫెసర్ డాక్టర్ కోవూర్ అబ్రహాం మూడు సార్లు ఇక్కడ పర్యటించారు. దైవాంశ సంభూతల మహిమలకు వ్యతిరేకంగా ఉద్యమించే డాక్టర్ పి. ప్రేమానంద్ ఇక్కడ అనేక శిక్షణా తరగతులు నిర్వహించారు.
గోరా మరణం తరువాత వారి కుమారుడు డాక్టర్ లవణం అంతర్జాతీయ హ్యూమనిష్టు ఉద్యమంలో అంతర్భాగమయారు.  ఎన్నో పర్యాయాలు ప్రపంచం చుట్టి రావడమే కాకుండా.. రెండవ నాస్తిక మహాసభలూ నాస్తిక కేంద్ర స్వర్ణోత్సవాల సందర్భంలో  ఘనంగా నిర్వహించారు. సర్ హార్మన్ బోండి, జాన్ ఎడ్వర్డ్స్, జిం హెర్రిక్. హేరి స్టోప్సరో, లెవీ ఫ్రాగెల్, ఫ్రాంక్ షూట్, ఎరిక్ హార్టికైనన్, డాక్టర్ నిహాల్ కరీం, రాయ్ బ్రౌన్, అజం కమ్గుయాన్.. లాంటి ఎందరో నాస్తిక ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అనేక నాస్తిక మహాసభల్లో, హేతువాద ఉద్యమాలలో పాలుపంచుకున్నారంటే.. ఆ ఘనత గోరా కుటుంబం మొత్తం  ఓ క్రతువుగా సాగించిన  హేతువాద, నాస్తికవాద  ఉద్యమాల ప్రభావం వల్లనే! ఆంధ్రదేశం నుంచి ఇతర దేశాలలో జరిగిన హేతువాద, నాస్తిక సభలు సమావేశాలకు హాజరయిన ప్రముఖులలో ఎన్. ఇన్నయ్య, రావిపూడి వెంకటాద్రి,  బాబు గోగినేని వంటి వారు ఇప్పటి తరానికీ సుపరిచితులే!
ఆంధ్రుల నాస్తిక, హేతువాద ఉద్యమాలు ప్రపంచంలోని మరే ఇతర దేశాల ఉద్యమాల ముందూ తీసిపోనంత ఉధృతంగా సాగుతున్నవే! మనిషిని ఆలోచించమని కోరడమంటే తన అనుభవాల నుంచి, అవగాహనలో నుంచి ఆలోచించమని కోరడమే! అందరి ఆలోచనలు ఒకేలా ఉండనప్పటికీ వ్యక్తి స్వేచ్ఛ, పరస్పర గౌరవం వంటి మౌలికమైన మానవ విలువులలో మార్పు ఉండదు. హేతువాదులేమీ మూసపోత ఆలోచనా విధానాన్ని ప్రోత్సహించరు. వైరుధ్యం తలెత్తని విభిన్నత్వాన్ని, వైవిధ్యాన్నే ఆలోచనాపరులైన నాస్తికులైనా, హేతువాదులైనా ప్రోత్సహించేది.
వంద సంవత్సరాల కిందటి వరకు నాస్తికత్వం, హేతువాదం ఒక పెడవాదంగా హేళనకు గురయిందన్న వాస్తవం మనం మర్చిపోరాదు. చాలా నాగరిక దేశాలలో క అలా చెప్పుకునేవారికి ఇబ్బందులు  ఎదురయేవి. అంతటి ప్రతికూల పరిస్థితుల నుంచి నాస్తిక, హేతు భావజాలాలు ఇవాళ ఒక గౌరవనీయమైన మానవవాదాల జాబితాలో చేరి మేధావుల మన్ననలు అందుకుంటోన్నది. ఈ కృషిలో మన తెలుగువారు నిర్వహించిన పాత్రా అనల్పమైనదని మరో మారు గుర్తు చేసేటందుకే ఈ చిన్న ప్రయత్నం.
రాబోయే తరాల ప్రగతి బాట నిర్మాణంలో ఎవరు వద్దన్నా, కాదన్నా నాస్తిక, హేతు భావజాలాల పాత్రా తప్పక ప్రాముఖ్యం వహిస్తుందని జ్ఞప్తికి చేసేందుక్కూడా ఈ చిరువ్యాసం.
***
(ఆంధ్రప్రదేశ్ అవతరణ స్వర్ణోత్సవాల నేపథ్యంలో శ్రీ మండలి బుద్ధ ప్రసాద్, శ్రి గుత్తికొండ సుబ్బారావు, డా॥జి.వి. పూర్ణచంద్ గార్ల సంపాదకత్వంలో  విక్టరీ పబ్లికేషన్స్ వారు ప్రచురించిన 'తెలుగు పసిడి'- ఆంధ్రప్రదేశ్ లో 50 సంవాత్సరాల నాస్తిక, హెతువాద ఉద్యమం - శ్రీ లవణం- పు.367 - 371)

Saturday, December 14, 2019

వనం, మనం; మధ్యన దైవం కర్లపాలెం హనుమంతరావు




వనం హిందువులకు దైవం. చెట్టులో పుట్టలో దేవుళ్లను దర్శించుకునే తత్వం భారతదేశం అంతటా కనిపిస్తుంది.  వనం మనకు వట్టి వనదేవతేనా.. వరాలు ప్రసాదించే వనలక్ష్మి కూడా. లక్ష్మి సంపదలకు పర్యాయపదం. కాబట్టి ప్రకృతి ప్రసాదాలే అయినా చెట్టూ చేమా మనుషులకు ఆస్తి పాస్తుల కిందనే జమ.
ఆలయం నిర్మాణం తరువాత దేవతా విగ్రహాలు ప్రతిష్టాపనకు ముందు   పరిసరాలలో చెట్టూ చేమా వృద్ధిచెందే అవకాశాలను పరిశీలించే పద్ధతి పురాణేతిహాసాల కాలం బట్టి అనూచానంగా వస్తున్న ఆచారవ్యవహారలలో అంతర్భాగం!  
పంచభూతాలలో ఒకటిగా పరిగణించే పృథ్వి విఘ్నాధిదేవత వినాయకునికి ప్రతిరూపంగా భారతీయుల ఆధ్యాత్మిక భావన . ఆయనకు శమీ, దూర్వ పూజలు ఇష్టం. ఉదకానికి భవానీమాతగా పరిగణన. ఆమెకు అశోక, విష్ణుక్రాంత దళాలతో పూజంటే ప్రీతి. వాయువు విష్ణువు కింద జమ. అశ్వత్థ, తులసీ దళాలతో అభిషేకం అంటే ఆయనకు మోజు. ఆకాశం ఈశ్వరాంశంగా భావించడం హైందవ ఆచారం. బిల్వ, ద్రోణ సంబంధ పూజాదికాలంటే అంబర దేవునికి మహా సంబరం. అగ్ని సూర్యభగవానుడు. ఆయనను అర్క, కరవీర పుష్ప పత్రాలతో పూజిస్తే శాంతిస్తాడని నమ్మకం.
భగవంతునికి ప్రతీకలుగా చెట్లను భావించే అనాది మనస్తత్వం నుంచే నేటి మన ఆలోచనాధారా వికసిస్తో వస్తున్నది.
వేరు నుంచి చిగురు వరకు చెట్టులోని ప్రతీ కణమూ ఏదో ఒక దేవునికి ప్రీతిపాత్రమైనదిగా భారతీయులు భావిస్తుంటారు. ఫల, దళ, పుష్ప సముదాయాల వంటి సరంజామా లేని  పూజావిధానం మనం ఊహించనైనాలేము కదా! శుభకార్యాలలో సైతం చెట్టు చేమల పాత్ర అనివార్యం. దేవీదేవతల చిత్రాలలో మనకు ఏ మూలనో ఓ మూల పిసరంతైనా కాయో, కొమ్మో, పండో, చిగురో కనిపించడం తప్పనిసరి. వృక్ష ప్రమేయం లేని దైవత్వాన్ని ఊహించడం భారతీయులకు మనస్కరించదు.
రామాయణ, భారత, భాగవతాది మహా కావ్య, పురాణాదులు వర్ణించిన వనాల వివరణ వింటుంటే చెవులకు బహు పసందుగా ఉంటుంది. రామాయణంలోని చిత్రకూటం, పంచవటి, అశోకవనం, ఋష్యమూకం, కిష్కింధ, మధువనం వంటి  మనకు తెలిసినవే కాకుండా అనేకానేక ఇతర వన్యదేవాలయాలూ ఉన్నాయి. మహాభారతంలో ఖాండవవనం, , కణ్వాశ్రమం, దైతవనం  దండకారణ్యాలు.. మహాభాగవతంలోని నైమిశారణ్యం, బృందావనం, వంటి వనాలూ ఈ కోవకే చెందే అందాల హరితాలయాలే.
కృష్ణుడు బృందావన సంచారి. వనమాలి, కుంజవిహారి. ఆ హరితప్రేమి  వేణువు ధరించి వేణుమాధవుడయినాడు. కొండను గోటికి ఎక్కించి గిరిధారి, ఆలమందలను వనాల వెంట తిప్పి  గోపాలస్వామి అయిన ఆ నీలమేఘస్వామిని చూసైనా మనిషికి, ప్రకృతి సంబంధమైన చెట్టూ చేమకూ మధ్య ఉన్న అవినాభావ అనుబంధం అర్థమవాలి.  
కృష్ణుని మాదిరే రాముడూ నిత్య సత్యమాలాధరుడు. అవతారమూర్తుల మూల మూర్తి విష్ణువు చేతిలో పద్మం, నాభిన తామర! అతని సహచరి లక్ష్మిదేవిది పద్మాసనస్థితి. రెండు చేతులా రెండు కమల పుష్పాలు ధరించిన ఆ మందస్మిత  దర్శనం కళ్లకు పండువుగా ఉండటం సహజం. 
ఇక ఈశ్వరునిది బిల్వలోకం. ప్రత్యక్ష భగవానుడు సూర్యనారాయణ మూర్తి దర్శన భాగ్యం లభించిన పిదపనే పద్మపత్రాలు వికసించినట్లు.. ప్రకృతి పచ్చగా పలకరించినంత కాలమే మనిషిలోని చైతన్యం ప్రవర్థిల్లేది!
సృష్టి ఆరంభానికి ముందు భగవానుడు బాల దిశమొల స్థితిలో వటపత్రం పైన శయనించినట్లు   భారతీయులు భావించడం మనకు తెలుసు.  బాలశాయి శయనతల్పం రావిపత్రం  అశ్వత్ఠామ వృక్ష ప్రసాదితం. బాలకుడి బొడ్డు నుంచి లేచి నిలిచిన తామర తూడు కొసలు విస్తరించిన భాగమే సృష్టిని ప్రారంభించిన శక్తికి ఆధారభూతమయింది' అన్న ఆ కల్పనల్లో లోతైన ప్రతీకలే ఉన్నట్లు ఆధునిక  తత్వచింతనాపరులూ భావించడం విశేషం. ఆకులలమల బంధంలోనే స్త్రీ-పురుష బంధాల మూలాలు ఉన్నట్లు భావించడంలో  తర్కం ఎంత వరకుందో ఎవరికి వారుగా  విచక్షణాశీలులు తర్కించుకోవలసిన అంశం.
ఆకుల ఆకృతిని బట్టి రావికి పురుషత్వం, వేపకు స్త్రీ తత్వం ఆపాదించిన మేథస్సు మనిషిది.  కళ్యాణం జరిపించిన  ఆ  రావి- వేపల జంట నీడ కింద నాగ'బంధం' ప్రతిష్ఠించి దాని చుట్టూతా   ప్రదక్షిణాలు చేయిస్తే జంటకు నూరేళ్ల పంటగా సంతానం ప్రాప్తిస్తుందని పూర్వీకుల నుంచి ఓ విశ్వాసం.
దశావతారాలలోకి మనం లాగేసుకున్న బుద్ధుడి అవతారమూర్తి గాథల్లో ఈ రావిచెట్టుకు అద్వీతయమైన 'బోధివృక్షం' స్థాయి కల్పించడం హైందవుల గడసరితనానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి. 
విష్ణువుకు తులసీ దళం ప్రీతి. నిత్య తులసీ దళ మాల గళధారి  ఆ లక్ష్మీనాథుడు .  మన్మథుడు తులసీ పత్రాలతో అల్లిన శరాలనే తన లక్ష్యాల పైన ప్రయోగించేది. మదనుడి అమ్ముల పొది వివిధ రకాలైన పుష్పబాణాదులతో నిండి ఉన్నట్లు ప్రబంధ కావ్యాల నిండా వర్ణనలే వర్ణనలు!  
ఆరోగ్య క్షేత్రంలో వృక్షజాతికి అగ్ర తాంబూలం అందించింది ఆయుర్వేదం.  ఆ చికిత్సా విధానం  అంటేనే వృక్ష సంతతికి చెందిన వనరుల ప్రయోజనాల ఏకరువు.  క్షీర సాగర మధన కథనంలో సముద్ర గర్భం నుంచి వెలికివచ్చిన కల్పవృక్షం కథ అందరికీ సుపరిచితమే కదా!
ప్రాచీన సాహిత్యం మీదనే కాదు సుమా.. ఆధునిక నాగరికత పైన కూడా చెట్టూ చేమకు గల  పట్టు సామాన్యమైనది కాదు. ఉదకమండలం మొదలు, కలకత్తా చండీగఢ్ తాలూకు వృక్ష  సంబంధమైన తోటలు, బెంగుళూర్ లాల్ బాగ్, మైసూర్ బృందావనం, కశ్మీర్ శ్రీనగర్ మొగలాయీ ఉద్యానవనాలు, దిల్లీ రాష్ట్రపతి భవనం ఆవరణలోని అలంకార వనాలు.. ఇట్లా  చెప్పుకుంటూ పోతే అంతూ పొంతూ లేనంత పెద్ద జాబితా భారతదేశంలోని పచ్చదనాల కథా కమామిషూ. 
 ఆంధ్రదేశంలోని తిరుమలవాసుని సేవకై పెరిగే వినియోగపు పూల తోటల కథ మరీ ప్రత్యేకమైనది. దేవతా విగ్రహాల స్థానే దేవతావృక్షాలను స్థాపించే సంప్రదాయానికి దేవాలయ వాస్తు, శాస్త్ర సూత్రాలు ప్రస్తుతం దారి చూపించడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఆచారంలో ఉన్న కొన్ని తోటలు నాటే విధానాన్ని స్థాలీపులాక న్యాయంగా పరిశీలించే ప్రయాస మరో సందర్భంలో చేసుకోడం సముచితం. 
-కర్లపాలెం హనుమంతరావు
13 -12 -2019, బోథెల్, యూ.ఎస్





Monday, February 11, 2019

అమ్మోరు .. రావాలి వన్స్ మోర్!-గ్రామసీమల సంస్కృతి



గ్రామాల రూపం మారినా గ్రామాచారాలు కొనసాగుతున్నాయ్ ! ఊరికో గ్రామ దేవత.. ఊరంతా ఆమె ఇల్లు. పాడిపంటలు, నీటి వనరులు, నీతి అవినీతి ఆమె బాధ్యతలు. దారి తప్పితే  శిక్షతప్పదు.పెద్దా చిన్నా లేదు  ప్రేమాభిమానాలకు. పిల్లలు, స్త్రీలు, ముదుసలులు, వైకల్యం ఉన్న వాళ్ల మీద పిసరంత పక్షపాతం ఎక్కువ. కోపం వచ్చినా, ప్రేమ కలిగినా ప్రకృతి ద్వారానే ప్రకటిస్తుంది. ఆ సూచనలు మాతంగి మాటగా  ముందే  హెచ్చరిస్తుంది. భారతీయ .. ద్రవిడ.. గ్రామీణ సంసృతి ఇది. శతాబ్దాలబట్టి కొనసాగే ఈ విశ్వాసాలను ఏకమొత్తంగా నేలమట్టం చేయడం ఎంత బలమైన ఉద్యమం వచ్చినా  సాధ్యం కాని పని. లౌకిక భావజాలం మీద విశ్వాసం కలిగి ఉన్న రాజకీయ పక్షాలు ఈ భారతీయ ద్రవిడ సంస్కృతి విశిష్టతను అవగాహన చేసుకోక తప్పదు.  గ్రామదేవతల అనుగ్రహాలకని జానపదులు ఏటేటా కొలుపులు చెయ్యడం తప్పనిసరిగా భావిస్తారు. రక్తపానం, ఆసన సేవనం ఆమ్మతల్లులకు  ఇష్టం. అమ్మ కొలుపులకు బ్రాహ్మలు పనికిరారు. కుమ్మరి విగ్రహం చేస్తే, చాకలి బలిపీఠం దగ్గరకు చేరుస్తాడు. ఈడిగ మనిషి పసుపు కుంకుమలతో అలంకరిస్తే, మాల మాదిగలు ఊరేగిస్తూ వేటపోతును బలిస్థలికి చేరుస్తారు. బానల నిండుగా కల్లు అందించే పని ఈడిగలదే. బోనాలు వండి పంపే బాధ్యత ఊరిపెద్దలది. ఆసాదులు అమ్మవారి మీద పాటలు పాడటం, మాతంగి నృత్యాలు చేయడం కాలానుగుణమైన మార్పులతో ఆ సందళ్లన్నీ పూర్వం కన్నా ఇప్పుడు పటాటోపంగా జరుగుతున్నాయ్. ఓటు బ్యంకు రాజకీయాల్లో ఊరి దేవతలు సైతం మిగతా అన్నింటి మల్లేనే పావులుగా మారిపోయారు. పోతు వేటతో మొదలయ్యే బలి తతంగం ఊరివాళ్లు తెచ్చిన సన్నజీవాల హతంతో కొనసాగుతుంది చాకళ్ల ఆధ్వర్యంలో. చంపిన పోతు నోట్లోనే దాని కాలు కుక్కి, నెత్తురు బోనాలతో సహా కమ్మరిచేసిన చెక్కబండి మీద ఊరేగింపు జరుగుతుంది. కల్లు తాగి చిందులేస్తూ కొమ్ము బూరాలు, తప్పెట్లు చేసే కోలాహలం  అంతా ఇంతా కాదు. ఎంత సందళ్లు సాగుతున్నా నెత్తురు కలిపిన బోనాన్ని 'పొలి.. పొలి ' అంటూ పొలికేకలు పెడుతూ ఊళ్లో వెదజల్లేటప్పుడు అంతా నిశ్శబ్దం! అమ్మోరి మీద ఉండే భక్తి అలాంటిది మరి! బలి పశువుల పేగులు నోట కరుచుకుని పొలి ఊరంటా జల్లేవారు మాల మాదిగలు. కొన్ని చోట్ల కొన్ని పద్ధతుల్లో కాలాన్ని బట్టి మార్పులు జరుగుతున్నా.. ఈ రకమైన కొలుపులు, జాతర్లలో ఇప్పుడు ముఖ్యమంత్రులు, ముఖ్యమైన మంత్రిపుంగవులు  సైతం నెత్తి మీద  బోనాలు మోస్తూ కనిపిస్తున్నారు. ప్రజాస్వామ్యం.. ప్రజల మనసుల్ని గెలుచుకోవాలంటే ఈ రకం టక్కు టమారా విద్యలు తప్పనిసరి అన్నట్లు సాగుతున్నాయ్  సెక్యులర్ స్టేట్ గా మనం గొప్పలు పోతున్న ఈ దేశంలో! గ్రామదేవతల  మీద భయభక్తులతో అన్ని కులాలవారు అంత ఒద్దికగా గ్రామదేవతలకు పూజాపునస్కారాలు చేసుకునే ఈ నిజమైన సెక్యులర్ సమాజంలో పెద్ద  కులాలవారు(కమ్మ, రెడ్డి .. ఇప్పుడు కొత్తగా కాపులాంటి) తమ తమ కులాల పాలన ఆధిపత్యాల  కోసం నీతి. అవినీతి, సామాజిక న్యాయం.. అన్యాయం, వరసావావి వంటి కట్టుబాట్లలో కూడా చిచ్చు పెడుతున్నారు. దైవదూతలమని భేషజాలకు పోయే బ్రాహ్మల వంటి కులాలు మధ్యదళారులుగా మారి మరింత భ్రష్టు పట్టిస్తున్నారు. తమకు జరిగే అన్యాయాన్ని ప్రతిఘటించాల్సింది పోయి అసలే అనైక్యంగా ఉన్న ఉత్పాదక వృత్తులవాళ్లు తమలో తాము మరింత పేచీలు పెట్టుకుంటో రొట్టె ముక్కను మళ్ళీ పెద్ద కులాలవాళ్ల నోటికి నేరుగా అందిస్తున్నారు. కులాల కుమ్ములాటలకు తోడు ఇప్పుడు అదనంగా మత దుర్రాజకీయాలూ తోడై సామాజిక ప్రజాస్వామ్య పాంచాలికి   బహిరంగ వస్త్రాపహరణ జరుగుతోంది. ప్రజాస్వామ్య పితామహుల మౌనం మరింత చేటు తెస్తోంది. ప్రకృతి ఉత్పాతాలనుంచి రక్షిస్తుందని విశ్వసించే అమ్మోర్లయినా ఇహ కన్నెర్ర చేయాలి కదా! సునామీలు, క్షామాలు , అంటురోగాలకన్నా ఎక్కువ చేటు ప్రజాస్వామ్యానికి వ్యక్తుల వరకే పరిమితం కావాల్సిన ఈ మతం, కులం విశ్వాసాలు! 
-కర్లపాలెం హనుమంతరావు

Sunday, May 27, 2018

అమరకోశం- కర్త అమరసింహుడు ఎవరు?



పూర్వం సంస్కృతం నేర్చుకోమని బలవంతంగా కుదేస్తే.. ఆ భాష గిట్టని బడుద్ధాయిలు కొందరు 'యస్య జ్ఞాన దయాసింధో' అని గురువుగారు ప్రార్థన మొదలుపెట్టగానే 'గొడదాటితే అదే సందో' అంటూ గోడ దూకి పారిపోయేవారుట. సరదాగా అనుకునేందుకేగానీ ఈ 'అమరకోశం' ప్రథమ కాండం స్వర్గవర్గంలోని మొదటి
ప్రార్థనా శ్లోకానికి సంస్కృత వాఙ్మయంలో చాల కథే ఉంది.  
'యస్యజ్ఞాన దయా సింధోరగాధస్యా నఘా గుణాః।
సేవ్యతా మక్షయో ధీరాసశ్రియైచా మృతాయ॥'
ఇదీ  శ్లోకం పూర్తి పాఠం.
'ఓ! విద్వాంసులారా  జ్ఞానానికి, దయకు  ఆశ్రయభూతుడు, గంభీరుడు దేవుడు. ఆయన గుణాలు, రాగాది దోషాలు లేని నాశనరహితుడు.  ఆ దేవుణ్ణి సంపద, మోక్షాల కోసం సేవించాలి!’ ఇది పరమాత్మ పరమైన అర్థం.
దోషరహితమైన రత్నాలకు ఆలవాలమైన అగాధం సముద్రం. విష్ణువుకు నివాసం. లక్ష్మి(సంపద) కోసం, అమృతం(చిరాయువు) కోసం సముద్రుణ్ణి సేవించాలి' అని మరో అర్థం చెప్పుకోవచ్చు.  
బౌద్ధ విశ్వాసి అమరకోశ కర్త అమరసింహుడు. హిందూవిశ్వాసుల ఇష్టదేవతలను సేవించమని  మంగళాచరణ శ్లోకం ఎందుకు పఠిస్తాడు? అనే సందేహం సహజంగానే వస్తుంది. అమరకోశానికి  వ్యాఖ్యానం రాసిన క్షీరస్వామి తన 'అమరకోశోద్ఘాటనవ్యాఖ్య'లో ఇదే శ్లోకానికి బుద్ధ పరమైన వ్యాఖ్యానం అందిస్తూ.. పై సందేహానికి సమాధానం ఇచ్చాడు. 'గ్రంథారంభేZభీప్సిత సిద్ధి హేతుం జిన మనుస్మృత్య ఇత్యాది వాక్యాణి’ అన్నాడు.  బౌద్ధమంటే గిట్టని హిందూవిశ్వాసులు తన గ్రంథాన్ని దూరం పెట్టకూడదన్న ఆశతో హింధువుల ఇష్టదేవతలను ప్రార్థించాడు- అని ఆయన జవాబు. (సర్వానంద విరచిత ‘టీకాసర్వస్వవ్యాఖ్య’ వివరణలో కూడా  'బౌద్ధదర్శన విద్వేషిణి ఇహ ప్రవృత్తి ర్న స్యా దతో-త్ర బుద్ధపదోపాదానం కృతం కవినా' అన్న సమర్ధన కనపడుతుంది). అమరసింహుడికి హిందూమతంతో ఏ సంబంధం లేదంటే నమ్మబుద్ధికాదు నిజానికి.  అమరకోశంలో ఆయన వివరించిన పదాలన్నీ ఒక నిష్ణాతుడైన హిందూపండితుడి అవగాహనకు సైతం అందనంత ఉన్నతంగా ఉండడమే అందుకు కారణం. తనతో వాదంలో ఓడిన నిస్పృహలో అమరసింహుడు స్వీయవిరచిత గ్రంథాలన్నీ పరశురామప్రీతి చేస్తున్నట్లు విని శంకరుడు ఆ ప్రయత్నం విరమింపచేశాడని ఒక కథ ప్రచారంలో ఉంది. అగ్నికి ఆహుతి కాకుండా మిగిలిన ఈ ఓక్క అమరకోశం ప్రాశస్త్యాన్ని భగవత్పాదులే ‘అమరకోశం చాలా గొప్ప గ్రంథం. హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన పేర్ల విషయంలో ఏ పక్షపాతం లేకుండా చక్కగా శృతి ప్రతిపాదించింది. స్మృతులు, పురాణాలు తీరులోనే తాత్త్విక అంశాల నామధేయాలను, విషయాలను, వాటి అర్థాలను అమరకోశం ప్రతిపాదించింది' అని శ్లాఘించినట్లు ఒక కథ.
 షోలాపూర్ దాస్ రావ్ జీ సఖారామ్ దోనీ తన అమరకోశం పీఠికలో  అమరసింహుడు జినుడని చాలా ఉదాహరణలతో నిరూపించే ప్రయత్నం చేసాడు. లేఖక ప్రమాదాల వల్ల సుమారు వంద శ్లోకాలు కనిపించడం లేదని.. అందులో 'యస్య జ్ఞాన..' శ్లోకానికి ముందు మరో రెండు శ్లోకాలున్నాయని వాటిని బహిరంగపరిచాడు.
'జినస్య లోకత్రయవందితస్య ప్రక్షాళయేత్ పాదసరోజయుగ్మం।
నఖప్రభాదివ్యసరిత్ప్రవాహైః సంసారపంకం మయి గాఢలగ్నమ్॥(1)
'నమః శ్రీశక్తినాథాయ కర్మారాతివినాశినే।
పంచమ శ్చక్రిణాం యస్తు కామస్తస్మై జినేశినే॥' (2).. ఇవీ ఆ రెండు విస్మృత శ్లోకాలు.
లింగయసూరి 'యస్య జ్ఞాన .. ' శ్లోకానికి దైవపరంగా వ్యాఖ్యానం చేస్తే.. మల్లినాథుదు 'సశైవానాం శివః వైష్ణవానాం విష్ణుః జైనానాం జినః బౌద్ధానాం బుద్ధ:’ అంటూ సాధారీకరణం చేసి అందరి సమస్యలు ఒక్క దెబ్బతో తీర్చేసాడు.
ఏదేమైనా
'అమరం నెమరేస్తే కావ్యాలెందుకు కాలరాయనా?'
అష్టాధ్యాయీ జగన్మాతా అమరకోశో జగత్పితా '
'అమరం చదవనివానికి నే నమరను' అని సరస్వతీదేవి పరంగా వినిపించే ప్రచారమూ అమరకోశానికి ఉండే ప్రాముఖ్యం తెలియచేస్తుంది. అమరకోశం మిగతా కోశాలన్నింటికీ మార్గదర్శకంగా మిగిలింది. మరీ కావ్యాలు రాయడానికని కాదు కానీ.. హిందూ సంస్కృతి పారిభాషికా పదాలతొ పరిచయం పెంచుకుంటే సంస్కృతమే కాదు.. తెలుగు పదసంపద మీదా మరింత పట్టు పెరుగుతుందన్న మాట అతిశయోక్తి కాదు. 
కాబట్టి కవి కావాలనుకున్న యువకులు మరీ గతంలోలాగా బట్టీయం వేయకపోయినా ఒకటికి పదిసార్లు  ఆ అమరకోశం పుటలు తిరగేస్తే పోయేదేమీ ఉండదు.. అజ్ఞానం తప్ప!
-కర్లపాలెం హనుమంతరావు
25 -05 -2018


-

Wednesday, May 23, 2018

ప్రార్థనా స్థలాలు.. చరిత్రలో 1




పుట్టటం.. గిట్టటం తప్పవని ప్రకృతిని చూసి గ్రహించాడు ఆదిమానవుడు. విత్తు నుంచి మొలకెత్తిన పిలక పెరిగి వృక్షంగా మారి కాసే పూలు కాయలుగా పండి రాలిన తరువాత వాటి పొట్టవిప్పి చూస్తే కనిపించేవి మళ్లా ఆ విత్తులే. భర్త తన భార్య కడుపున  పుత్రుడుగా జన్మిస్తాడన్న నమ్మకం పెరగడానికి ఇలాంటి దృష్టాంతాలు  సృష్టిలో చాలా కనిపించాయి మనిషికి. కాబట్టే చనిపోయిన తన మనిషి కళేబరాన్ని భద్రం చేయడం అవసరంగా భావించాడు.
మరీ అతి ముతక కాలంలో మృత శరీరం ఏ కుక్కలు, నక్కలు తినకుండా తామే తినేసేవారు  మృతదేహం పరిశుద్ధత నిలబెట్టడం కోసం. తరువాతి దశలో పార్థివ దేహం నేల మీది చీమల, పురుగుల పాలవకుండా ఎత్తైన ఏ చెట్టు కొమ్మల మీదో వదిలేసేవాళ్లు. 'కాకులకు గద్దలకు' వేయడం అనే సామెత అట్లా పుట్టిందే! (మహాభారతం విరాటపర్వం అజ్ఞాతవాసంలో పాండవులు తమ ఆయుధాలను మూట కట్టి జమ్మి చెట్టు మీద వదిలేసి.. దారే పోయే వాళ్ళను చనిపోయిన తమ తల్లి శరీరమని నమ్మిస్తారు). పక్షులు పీక్కు తినగా మిగిలిన బొమికలను ఏరుకొని ఏ గంగలోనో కలిపే తరువాతి సంస్కారం ఒక పద్ధతైతే.. ఆ అస్తికలను మూటగట్టి ఒక ప్రత్యేకమైన నూతిలో పారేస్తారు. (నేటికీ పార్శీలది ఇదే పద్ధతి). అసలు నేరుగానే శవాలను గంగా ప్రవాహానికి వదిలేయడం మరో విధానంగా ఉండేది. కర్మకాండలలోకెల్లా గంగలో కలపడం ఉత్తమ సంస్కారంగా ఇప్పటికీ భారతీయులు నమ్మడం వల్ల దహనం చేసిన తరువాత ఆ చితాభస్మాన్ని కాశీ వెళ్లి మరీ గంగలో కలిపి వస్తున్నారు సంప్రదాయం నమ్మేవాళ్ళు. నాగరికత అభివృద్ధి చెందిన తరువాత శవదహనం  సంస్కారంగా మారింది. ద్రవిడ సంస్కృతిలో సామాన్యంగా ఖననమే ప్రధాన సంస్కారం.
పూడ్చినా కాల్చినా ఆ కాండ జరిగిన స్థలాన్ని పవిత్రంగా భావించేవాళ్లు బంధువులు. ఆ స్థలానికి గుర్తుగా ఒక రాయి పెట్టడం.. దుష్టశక్తుల కట్టడికి గాను చుట్టూతా రాళ్లు పేర్చడం జరుగుతుండేది. ఆ ప్రదేశాన్ని 'చైత్యం'గా పిలిచేవారు. ఆ చైత్యానికి దగ్గర్లోనే ఒక చిన్న కట్టడం కట్టడం ఒక పద్ధతి. ఆ స్థలం మీదో మొక్కను  నాటడం మరో పద్ధతి. తులసి కోటలు కట్టే ఆచారం ఇప్పటికీ కనిపిస్తుంటుంది. శ్మశానాలను 'పితృవనాలు' గా పిలవడానికి ఇదే కారణం.
ప్రముఖులు మరణిస్తే ఖననం చేసినా, దహనం చేసినా ఆ స్థలాన్ని స్మృతిస్థలాలుగా మార్చే ఆచారం ఎప్పటి నుంచో ఉంది. జనకళ్యాణం కోసం జీవితాంతం కృషిచేసిన వైతాళికులకు, మంది కోసం ప్రాణ త్యాగం చేసిన పరిత్యాగులకు, యుద్ధాలలో వీరమరణం పొందిన యోధులకు (వీరగల్లులు), శీలరక్షణ కోసం ఆత్మాహుతికి పాల్పడ్డ స్త్రీలకు గుర్తుగా  చిన్ని చిన్ని  కట్టడాలు, స్తూపాలు, ఆయతనాలు కట్టే ఆచారం ఉంది. ఆ తరహా  ద్రవిడ సంస్కృతి ఆచరించే ప్రాంతాలన్నింటా ఇప్పటికీ ఆ కట్టడాలు కనిపిస్తాయి.
బుద్ధుడి మహాపరినిర్యాణం క్రీస్తుకు పూర్వం 498లో. ఆ అస్తికలను భద్రపరిచిన పాత్ర మీద సమాధి నిర్మించి శాసనం వేయించారు బుద్ధుని సగోత్రీకులు శాక్యులు.
'ఇయం సలిల నిధానే బుధవ భగవతే సకియానాం
సుకుతి ఛటినాం సభగినకం సపుత దలనం'
(బుద్ధ భగవానుని ఈ శరీర నిధానం దేవుని సుపుత్ర భగనీకులు శాక్యులచే నిర్మించబడింది) అని ఇప్పటికీ కనిపిస్తుంది. ప్రాచీన కట్టడాల మూలకంగా అప్పటి నాగరికతలను గురించి తెలుసుకొనే అవకాశం పురాతత్వశాస్త్రానికి లభిస్తుంది,
బౌద్ధం, జైనంలో చనిపోయినవారి సమాధులకు సమీపంలో చిన్న ఆరామాలు నిర్మించడం ఆనవాయితీగా ఉండేది ఒకానొకప్పుడు. ఆ ఆరామాలనే విహారాలుగా వ్యవహరించేవాళ్లు. బౌద్ధ సన్యాసులు, జైన సన్యాసులు జనపదాలలో నివాసం ఉండేవాళ్లు కాదు. ఈ తరహా ఆరామాలలో నివాసం ఏర్పాటు చేసుకొని  భిక్షకు మాత్రం గ్రామాలలోకి వెళ్లి వస్తుండేవాళ్లు. ఆ కారణం చేత ఆరామాలు సాధారణంగా జనపదాలకు, వ్యాపార మార్గాలకు దగ్గరగానే ఉండేవి. బౌద్ధుల, జైనుల జీవహింస నిషేధం వల్ల పశుసంపద వృద్ధి అవడం, వ్యవసాయం ఊపందుకోవడం, వ్యావసాయిక ఉత్పత్తుల లావాదేవీలకు నెలవైన వ్యాపారాలు అభివృద్ధి చెందడం జరిగింది.  బౌద్ధులకు, జైనులకు కృతజ్ఞతా పూర్వకంగా తృణమో, ఫణమో సమర్పించుకొనే అలవాటు అప్పుడే మొదలు. భూస్వామ్య వ్యవస్థ పుంజుకొని, పెత్తందార్లు, రాజులు బలమైన వర్గంగా ఏర్పడేందుకు ఈ రెండు మతాలు చాలా దోహదం చేసాయనే చెప్పుకోవాలి. అందుకే రాజులు అప్పట్లో ఆ రెండు మతాల వైపు అధికంగా మొగ్గు చూపించేవాళ్లు.
మత విశ్వాసులు ఇచ్చే కానుకలతో జైనులు, బౌద్ధులు ఆర్థికంగా బలపడ్డారు. వారు నివాసముండే ఆరామాలకు కళ పెరిగింది. మత పెద్దల మెప్పు కోసం రాజులు, వ్యాపారులు ఆరామాలను కళలకు కాణాచిగా ఎంత ఖర్చైనా వెచ్చించి మరీ తీర్చి దిద్దేవాళ్లు. ఆ అలంకరణల్లో భాగంగానే ఆరామాల గోడల మీద అందమైన ప్రకృతి దృశ్యాలు, స్త్రీల చిత్రాలు, ఆనందాన్ని ప్రేరేపించే కామకార్యాలు చిత్రీకరణలు క్రమంగా పుంజుకున్నాయ్. ఆరామాల కుడ్యాల మీద కనిపించే పోర్నోగ్రఫీ క్రమంగా దేవాలయాలకు ఎలా పాకిందో మరో సారి..!
-కర్లపాలెం హనుమంతరావు
***

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...