Showing posts with label Editorial. Show all posts
Showing posts with label Editorial. Show all posts

Tuesday, December 14, 2021

ఈనాడు - సంపాదకీయం ఏరువాకా... అందుకో స్వాగతం రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ఆశల చినుకులు పేరుతో ప్రచురితం - 12-06-2011 )

 


ఈనాడు - సంపాదకీయం 

ఏరువాకా... అందుకో స్వాగతం ! 


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ఆశల చినుకులు పేరుతో ప్రచురితం - 12-06-2011 )  


'ఏరు' అంటే సాగుగిత్తల మెడమీది నేలతల్లిని దున్నే నాగలి కర్రు. ముచ్చి ముమ్మారు మూడు చాళ్ళను బసవన్నలచేత మృగశిరకార్తె మొదటిరోజున దున్నించి అన్నదాత సేద్యయాగం ఆరంభించే ముచ్చటే ఏరువాక. భాగవతంలో బలరామ సోదరుడు భావించినట్లు- గోపాల కూటమికి గిరియజ్ఞమెంత ప్రధానమో, కర్షక లోకానికి ఏరువాకా అంత అవసరం. కసవు దేనుగణానికి, ధేనుసంపద పాడిపంటలకు, పాడిపం టలు బతుకుతెరువుకు ఎంత అవసరమో త్రేతాయుగం నాటికే మనిషి గుర్తించాడు. అందుకే నృపాలురు సైతం పొలం పనుల్లో పాలుపం చుకొనేవారని పురాణాల కథనం. మిథిల మహారాజు జనకుడు ఏరు వాక ఆరంభమయ్యే జ్యేష్ఠ శుద్ధ పున్నమినాడు రాజపురోహితుడు శతానందుడి పవిత్ర మంత్రోచ్ఛారణలూ ప్రజల జయజయధ్వానాల మధ్య  స్వయంగా సీతాయజ్ఞం ఆరంభించిన వైనాన్ని వాల్మీకి రామాయణం పరమాద్భుతంగా వర్ణించింది. విష్ణుపురాణం సీతాయజ్ఞమన్నా, బౌద్ధ జాతక కథలు పప్పమంగల దివసమన్నా, జైమినీ న్యాయమాల ఉద్య షభయజ్ఞమన్నా.... అన్నీ ఆ ఏరువాకమ్మ మారుపేర్లే.  వ్యవసాయానికి సాయమందించే బసవన్న మెడలను  రంగురంగుల పూసదండలతో, పూలదండలతో తనివితీరా అలంకరించి, పొంగలి ప్రసాదాలతో అంగరంగ వైభోగంగా మంగళ వాయిద్యాలమధ్య పూజాదికాలు నిర్వహించి పొలం దున్నుడుతో సాగుపనులు ఆరంభించే ఒకనాటి సంబరాలు ఇప్పుడూ అంతే సంరంభంగా కొనసాగుతున్నాయనలేం. ఆడపడుచులు ముచ్చటపడుతూ పుట్టింటికి పరిగెత్తుకు రావడాలూ, పొగరుగిత్తలను ఊరిమధ్యనుంచి హుషారుగా యువకులు పోటీలు పడి పరుగులెత్తించడాలూ, భారీ బసవన్నలచేత బండ బరువులు లాగించి బహుమా నాలందించడాలూ... ఈనాటికీ కొన్ని గ్రామసీమల్లో ఏరువాక సాగే కాలాన కనిపించే దృశ్యాలే! 


ఆది మానవుడికి మల్లే ఆధునిక జీవుడికీ వ్యవసాయం ఓ జీవ నాధారం. రోళ్లు పగిలే రోహిణీ గండం గడిచి మృగశిరారంభంలో కురిసే తొలకరి చినుకులకు అందుకే అంత ప్రాధాన్యం. 'ఏరువాక పున్నమికి వెండిమబ్బు దారబ్బంతి/ చిక్కులేని పోగులను పుడమికి జారవిడిచే'  ఆ సుందర దృశ్యానికి స్పందించని హృదయం అసలుం టుందా! ' ఏటి ఒడ్డున ఎంకిని తలదన్నే పూబంతి/ దుక్కిదున్నగ పోతున్న బసవమామకి ఎదురొచ్చే'  సన్నివేశం కవితావేశం రగిలించడానికి గుండె నండూరివారిదే కానవసరంలేదు. వానకార్తె దృశ్యాలకు రుగ్వేదమే స్పందించకుండా ఉండలేకపోయింది. గాథా సప్తశతి హాలుడినుంచి 'కృషీవలుడు' కర్త దువ్వూరివారి వరకు తొలకరి చినుకుల కులుకులకు పులకరించని కవులు బహు అరుదు. 'ఆ ఆకుల పమిట చాటున పాల కంకుల రహస్యం/ పొలం మడిగట్టుమీద ఒంటరి బంతిమొక్క ఎదురుచూపు/ పొగరెక్కిన ఆంబోతు రంకెలా ఉరుము/ నింగికేసి చూసే నీరుకాయ తలపాగా' ... ఏ వికారాలకూ లోనుకాని దేవుడూ, పాపం, ఎవరి పరవశంలో పడి ఈ తడి దృశ్యా లంత అందంగా సృష్టించాడోనని నేలభామ ముద్దొచ్చే బురద పూవులా ముసిముసిగా నవ్వుకుంటుందంటాడు ఓ ఆధునిక కవి. మబ్బు పలకరింపే చినుకు. పరిమళం, మట్టి మౌన స్పందన, అందు కేనేమో భగవంతుడు తాను ఆ సుగంధంలోనే దాగి ఉంటానని గీతలో బోధించింది! 

సృష్టికర్త తన సృజనలో ఒక్క చందన పరిమళాలకు, సౌందర్యానికే కాదు... సకల జీవరాశుల యోగక్షేమాలకూ సమప్రాధాన్యం ఇవ్వడాన్ని గతితప్పని రుతుచక్ర క్రమవిధానంలో గమ నించవచ్చు. మృగశిరంతో మొదలయ్యే కార్తె రోజుల్లో ఆకశాన  మూడు తారలతో మృగశిరాన్ని సూచించడం సాగుకు అవసరమయ్యే పశుసంపదను సమాయత్తం చేసుకొమ్మని హెచ్చరించటమేనని ఓ కవి భావించడం ఎంత కమనీయమైన సాంఘిక కల్పన! 


కాలమే ఎందుకో క్రమంగా రుతుధర్మాన్ని సక్రమంగా పాటించడంలేదు. 'ఏరువాక వస్తుందంటే యుద్ధమొస్తున్నంత భయం.... ప్రకృతి ఏ బాంబు వేయబోతుందోనని/ కిసాన్ జవానై కిట్టు సర్దుకుం టంటే... ఇల్లాలు కన్నీళ్లై ఎదురు వస్తోంది' అంటాడో కవి. స్వేదం విత్తితే చావులు మొలుస్తున్న కాలాన్ని ఈ కవికన్నా సహజంగా ఇంకె వరు చిత్రించగలరు! ఏరువాకలన్నీ యముని తాఖీదులవుతు న్నాయి/ సేద్యం శకునితో ఆడే మాయ జూదమైపోయింది' అన్నది నేటి వ్యథార్త  దృశ్యాలకు యథార్థ చిత్రణ! రూకల రాకాసి రెక్కల నీడలో వ్యవసాయమూ వ్యాపారి వేషం వేసుకోవడమే నేటి రైతు భాగవతంలోని విషాదఘట్టానికి అసలైన కారణం. మట్టికీ మనిషికీ మధ్య ముడివడిన పేగుబంధం విడిపోతున్న కొద్దీ- పక్షుల్లేని  ఆకా శంలా పొలం పేలవంగా మారిపోతుంది. సైరన్ కూతల సంగీత కచేరికి క్షేత్రాన్ని వేదికగా మార్చిన క్షణానే అన్నదాత క్షేమం ప్రశ్నార్ధకమనే లోయలో పడిపోయింది. రైతు కదిలే కన్నీటి మేఘంలా మారడానికి కర్ణుడి చావుకన్నా ఎక్కువ కారణాలే ఉన్నాయి. లెక్కల బతుకులోనూ లెక్కకందని అనుభూతులుంటాయని మళ్ళీమళ్ళీ గుర్తు చేసుకోవడమే ఈ కార్తె ప్రస్తుత పరమార్థం. మట్టికి మరణం ఉంటుందా? మొలకై మళ్ళీ మొలకెత్తటమే గదా దాని జీవతత్వం! రైతన్న ఎన్నిసార్లు కూలిపోయిన రథం కాలేదు! బీడు అడుగున దీర్ఘ నిదుర తీస్తున్నా ఆశల చినుకులు నాలుగు రాలితే చాలు... లోక మంతా పచ్చగా పరుచుకునే విత్తనం రైతు. 'అనావృప్లై ఆనాడు వెంట బడినా అతివృష్టిగా పడగవిప్పి ఈనాడు భయపెట్టినా/ తడిసి ముద్దైన కలలు ఎన్ని వందలసార్లు నీటి బాంబులై గుండెలను వేల్చే సినా' - చెక్కు చెదరనిది రైతు ఉక్కు సంకల్పం. మనసును ఆకాశమంత పందిరి చేసుకుని, ఆశకు భూమాత అంత మండపం లేపి ఎప్పటి లాగా రైతు ఏరువాకకు ఎదురేగి మనసారా స్వాగతం చెప్పకపోతే మన పేరున్న గింజలకోసం ఇప్పటికన్నా ఎక్కువగా గింజుకోక తప్పని పరిస్థితి. అందుకే ఏరువాకా... అందుకో ఈ స్వాగతం! ఆదుకో... ఈసారైనా రైతునీ... మా జాతినీ!


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు ఆశల చినుకులు పేరుతో  - ప్రచురితం - 12-06-2011 ) 

Monday, December 13, 2021

ఈనాడు - సంపాదకీయం శృంగార కళాశాల రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం- 11-03-2012 )

ఈనాడు - సంపాదకీయం 

శృంగార కళాశాల 


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం- 11-03-2012 ) 



సభ్యసమాజం దృష్టిలో శృంగారమంటే, నాలుగ్గోడల నడుమ మూడో కంటపడకుండా స్త్రీ పురుషులిద్దరి మధ్య మాత్రమే సాగే ముద్దుము చ్చట. శృంగారానికి అనువైన రసాయనిక తతంగం శారీరకంగా జరగ కపోతే ఎనభైనాలుగు లక్షల జీవకోటిలో ఒక్కటీ మిగలదు. ' బ్రహ్మ కును బ్రహ్మయైన నారాయణుండు/ మొదలుగా సర్వజీవ సమూహ మునకు/ బ్రప్రధానంబు శృంగార రసము గాదె' అంటారు పానుగం టివారు కంఠాభరణంలో. భరతుడి కోరికమీద కైశికీవృత్తి నాట్య ప్రయోగానికని శృంగారాంగనలను సృష్టించింది సాక్షాత్తు ఆ బ్రహ్మదే వుడే. తనకు ప్రదక్షిణ చేస్తున్న తిలోత్తమ అందచందాలు చూసి తల తిప్పుకోలేకే దక్షిణామూర్తి చతుర్ముఖుడయ్యాడని ఒక చమత్కారం. వేయికళ్లతో అనుక్షణం ఊర్వశివంటి అందాలరాశుల ఒంపుసొంపులు చూసే దేవేంద్రుడు సైతం అహల్యమీద కోరిక చంపుకోలేక తిప్పల పాలయ్యాడు! శ్రీరామచంద్రుడు సీతారమణుడు. గోదాదేవి కొప్పులో ముడిచి ఇచ్చిన పూలతో తప్ప అభిషేకాన్ని ఒప్పుకోలేదు శ్రీరంగనాథుడు . ముద్దుపళనివారి మాధవుడైతే రాధికాదేవి శృంగార యౌవన క్షీరాబ్ధి నడుమ 'నజుడొనర్చిన మోహన యంత్రము' లాగ ఎపుడెపుడు కలియతిరుగుదామా అని కలవరించాడు. శృంగారకేళిలో సంతృప్తి చెందితే యజ్ఞం చేసినంత పుణ్యం- అంటుంది బృహదారణ్యకోపని షత్తు. నూరేళ్లు సంసారం చేసినా ఏ పూటకాపూట మరో రోజుకు ఆగమని కండు మహాముని అంతటివాడే ప్రమోచను ప్రాధేయపడ్డాడు (విష్ణుపురాణం). సర్వసంగపరిత్యాగులనే అంతలా అల్లాడించిన ఉల్లాస  వ్యాసంగం మామూలు మానవుల కాలు నిలవనిస్తుందా!


ఛాందోగ్యోపనిషత్ పేర్కొన్న అష్టాదశ విద్యలలోని  దేవజన విద్యా విభాగంలో శృంగారం ఒక ప్రధాన అంగం. కరుణశ్రీ భావించినట్లు 'ఏ ప్రేమ మహిమచే ధారుణి చక్రము ఇరుసు లేకుండగనే తిరుగుచు న్నదో- ఆ మహాప్రేమకు ప్రేరణ శృంగారమే. నిగనిగని మోముపై నెరులు గెలకుల చెదర/ పగలైన దాక చెలి పవళించెను' అంటూ అన్న మయ్య అమ్మ శృంగార సౌందర్యాన్ని వర్ణించి తరిస్తే- 'మగువ తన కేశికా మందిరము వెడలే/ వగకాడ మా కంచి వరద తెలతెలవారెన నుచు' అంటూ క్షేత్రయ్య అయ్య సుమ సురతి బడలికలను తరచితరచి వర్ణించి తరించాడు. వివిధ దేవాలయాలమీద నేటికీ  కనిపించే మిథునశిల్పాలు ఒకనాటి తరానికి ఉద్దేశించిన కామశాస్త్ర కుడ్య పాఠాలు- అని తాపీ ధర్మారావు వంటి పరిశోధకుల వాదం. ఉత్తర భారతంలో హోలీ యువ సమూహాలు నేటికీ ఆడుకునే 'రంగుల క్రీడ' ఒకనాటి కామదేవుడి ఆరాధనోత్సవాల అవశేషమే. మొహంజొదారో తవ్వకాలలో  బయల్పడిన పుష్కరిణి సరస సల్లాపాల కోసం బ్రహ్మ కల్పించిన సరోవరమే అంటూ సశాస్త్రీయంగా రుజువు చేసిన డి.డి. కోశాంబివి వట్టి మాటలని కొట్టి పారేయలేం. శృంగారం బంగారం లాగా మెరుగులీనుతుంటేనే కదా ఏ యువజంటకైనా కళ!  పనిపాటలవేళ శ్రమ తెలియకుండా జానపదులు ఆలపించే పదాల నిండా శృంగార సుమ పరిమళాలు గుప్పుమంటుంటాయి. గోపికా స్త్రీల జలక్రీడలనుంచి గోంగూర పాటలదాకా- జీవితం ఎంత వైవిధ్యమో జానపదుల లొల్లాయి పలుకులూ అంత వైవిధ్యమంటారు డాక్టర్ బిరుదురాజు రామరాజు. సరస రసానికి దేశ కాలాలు ఏముంటాయి?  'మనసు' పుట్టినప్పుడే మనిషికి 'మనసు పుట్టడం' మొదలయింది .


శేషం వెంకటపతి- ' శశాంక విజయం'లో తర్క, శబ్ద, యోగ, సాంఖ్య, మోక్ష, ద్వైత, అద్వైత సిద్ధాంతాలన్నింటినీ కామకళకు జోడించి కనువిందు చేశాడు. 'ఏను నీవని పైకొనుటేను ద్వైతం- ఇరువురొకటైన అద్వైతమిద్ధరిత్రి' అంటూ సిద్ధాంతీకరిస్తే ఎంతటి సిద్ధులకైనా తొలినాటి ముద్దుముచ్చట్లు మదిలో మెదిలి పులకింతలు పుట్టక మానవు . మదన భావమంటే అంత తీపి బాధ మరి! నండూరివారి నాయుడుబావ మధనపడిపో యినట్లు- 'మందో మాకో యెట్టి మరిగించినట్లుంటుందా ఇది. గుండె గొంతుకలో కొట్లాడుతుంటే... వల్లకుందామంటే... గౌరీవల్లభుడి వల్లే కాలేదు మరి . కొనకళ్లవారి 'బంగారి' భామ- 'దారంటపోయే మామ కాలిధూళిగా  మారి రాలిపోయినా చాలు బతుకు పండిపోతుంది' అనుకుం టుంది. వలపు పెంకితనానికి యెంకి, నాయుడుబావ అనే భేదభావ మేమిటి? పానుగంటివారు చూడామణిలో చెప్పినట్లు ' ప్రకృతి నెట జూడు శృంగార రసమె, సర్వ/ సృష్టికి బ్రధాన సూత్రము' సరస రసమే! మొదటి కుళోత్తుంగుడు యుద్ధరంగంలో అంతఃపుర చెలులు నిద్రలో అతడి చిలిపి చేష్టలను తలచుకొనేవారు. మేలుకొని ఆ ' వెడద చన్నుల మీది ఆ విదియ చంద్రుల' కోసం తడుముకొనేవారు! అంత చిత్తచాంచల్యం శృంగారానిది. అదను తప్పినా, అదుపు తప్పినా అది చేసే బతుకు బీభత్సానికి పాండురంగ మాహాత్మ్యం నిగమశర్మే ప్రథమ ఉదాహరణ. అందుకే శృంగార కళను ఓ శాస్త్రంగా అభ్యసిం చవలసి ఉందని కామసూత్రాలను క్రీస్తు శకారంభం నాటికే వాత్సాయనుడు క్రోడీకరించి పెట్టాడు. పడకగది ముద్దుముచ్చట్లు అచ్చంగా ఆ పడుచు జంట గుప్తజ్ఞానమే కావచ్చు.  కానీ తెలియనివి, తెలుసుకోవాల్సినవీ, అడగలేనివీ, బిడియంవల్ల అడగనివీ, ఎవరిని అడగాలో తెలియనివీ బోలెడన్ని సందేహాలు... దేహధర్మం గురించి. అందుకే పండంటి సంసారానికి అత్యంత అవసరమైన ప్రేమబంధంతో శృంగారబంధాన్ని ముడివేయాలన్న సదుద్దేశంతో మరియా థాంప్సన్ శృంగార పాఠశాల ఏర్పాటుకు సిద్ధపడ్డారు. వియన్నాలోనే కాదు, భూమ్మీదే అది తొలిశృం గార కళాశాల. హింసాత్మక ప్రేమస్థానే ఆత్మీయానురాగాలను అది పెంపొందిస్తుందంటే- అందుకు అభ్యంతర పెట్టాల్సింది ఏముంటుంది? చట్టానికి, సభ్యతకు లొంగి ఉన్నంతకాలం శృంగారానికి స్వాగతం పలకవలసిందే!


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం- 11-03-2012 ) 

Sunday, December 12, 2021

అశ్రు నీరాజనం- ఈనాడు సంపాదకీయం - ( సత్యసాయిబాబా నిర్యాణమయిన సందర్భంలో)

 


ఈనాడు సంపాదకీయం: 

అశ్రు నీరాజనం

( సత్యసాయిబాబా  నిర్యాణమయిన సందర్భంలో) 



. దైవం మానుష రూపేణ' అన్నది ఆర్యోక్తి. వేదనకు రోదనకు సాంత్వనగా, అంతకుమించి హృదయ తంత్రులను మెల్లగ మీటే అమృత స్పర్శగా సత్యసాయిని ఆరాధించే భక్తకోటి ఆయన్నే ప్రత్యక్షంగా కొలుస్తోంది. తమ దైవం అవతారం చాలించిందన్న దుర్వార్త  కోట్లాది భక్తజనుల గుండెల్లో విషాదాగ్నులు గుమ్మరించింది.  నేడు ప్రశాంతి నిలయం ఘనీభవించిన అశ్రుజలపాతం. విశ్వ జనీన ప్రేమకు తన పేరునే చిరునామాగా మార్చిన సత్యసాయి మరి లేరన్న పిడుగులాంటి వార్తే కోట్లాది భక్తజనులకు శరాఘాతం. ఎనిమిదిన్నర పదుల వయసులో తీవ్ర అస్వస్థతకు గురైన సత్యసాయి ఆరోగ్య పరిస్థితిపై కొంతకాలంగా తీవ్రాందోళన వ్యక్తమవుతోంది. సాయిబాబా ఆరోగ్యం విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు కొన్నా ళ్లుగా ఆందోళన వ్యక్తీకరిస్తున్నా పూర్తి స్వస్థతతో స్వామి తిరిగి దర్శ నం ఇస్తారన్న విశ్వాసాన్ని భక్తుల్లో పెంచిన భరోసా మరొకటుంది. అది సాక్షాత్తు సత్యసాయే ఇచ్చింది! దశాబ్దాల క్రితంనాటి ప్రవచనాల్లో తాను 2022 దాకా ఈ అవతారంలో కొనసాగి తన జీవన పరమా ర్థాన్ని సాధించగలనంటూ సత్యసాయి చెప్పిన మాటపైనే అశేష భక్తుల గురి. సత్యసాయి చూపుతున్న మహిమలు కేవలం కనికట్టే నని హేతువాదులు కొట్టిపారేస్తున్నా- ఆయన్ను అభిమానించే జన కోటి ఏటికేడు ఎల్లలు దాటి విస్తరిస్తూనే ఉంది. గత జన్మలో షిరిడీ సాయిగా కొలుపులందుకొన్న తాను, వచ్చే జన్మలో ప్రేమసాయిగా అవతరిస్తానని చెప్పే సత్యసాయి పథగమనాన్ని భక్తి ప్రపత్తులతో కొలిచే జనసంద్రం- పదేళ్లముందే ఏమిటీ ఉత్పాతమని కల్లోల తరంగితమవుతోంది! దేశాధినేతలూ భక్తి తత్పరతతో, ముకుళిత హస్తా లతో ప్రణమిల్లే సత్యసాయి- 1940లో తన జీవన లక్ష్యాన్ని నిర్దేశించు కొన్నప్పుడు కేవలం ఒక వ్యక్తి. అదే నేడు- విశ్వమానవ ప్రేమను ప్రబోధిస్తూ ధ్రువతారగా నింగికెగసిన అమేయశక్తి. ఆ మార్గం మలిగిపోదు. ఆ ప్రేమకు మరణం లేదు. 


'కులం ఒక్కటే- అది మానవత్వం... మతమూ ఒక్కటే- అది ప్రేమతత్వం... భాష ఒక్కటే- అది హృదయ సంబంధి... దేవుడూ ఒక్కడే- అతడు సర్వాంతర్యామి!'- ఇదీ సత్యసాయి బోధ . ఓ క్రైస్త వుడు మంచి క్రైస్తవుడిగా, ఓ ముస్లిం మంచి ముస్లిముగా ఎదగాలన్నదే బాబా ఉద్బోధ! సత్యసాయి ఎదుగుదలపై వాద వివాదాలు, తనకు తాను దైవత్వం ఆపాదించుకోవడంపై ఆస్తిక నాస్తిక సంవాదాలు ఎన్నయినా ఉండవచ్చుగాక- తన జీవితాన్నే పచ్చని చెట్టులా మలచి కోట్లమందికి సేదతీర్చిన ధన్యజీవి ఆయన.  సామాజిక అవ సరాల్ని సరిగా గుర్తించి తన ట్రస్టు ద్వారా తాడిత పీడిత శోషిత వర్గాల బతుకుల బాగుసేత లక్ష్యంగా ఆయన పరిశ్రమించిన తీరుకు కళ్లకు కడుతున్న పలు విధాల ప్రాజెక్టులే తిరుగులేని దాఖలా! ఆసుపత్రులు, విద్యాసంస్థలు, తాగునీటి వసతులు, అత్యంత ముఖ్యమైన  సాయి గ్రామాలు- వేల కోట్ల రూపాయలను వ్యయీకరించి ప్రణాళి కాబద్ధమైన కార్యాచరణతో పరమాద్భుతమని ప్రభుత్వాలే అచ్చెరువొం దే స్థాయిలో ఆయా ప్రాజెక్టుల్ని కట్టి, నిలబెట్టిన సత్యసాయి ఆదర్శం ఆయనలోని దైవత్వాన్నే భక్తులకు సాక్షాత్కరింపజేసింది. పదహారేళ్ల నాటి ముచ్చట అనంత దాహార్తితో డస్సిపోతున్న అనంతపురం జిల్లా వాసులకు ఏడాది వ్యవధిలోగా తాగునీటి సేవలందిస్తానని సత్య సాయి ప్రకటించినప్పుడు- అది అమల్లోకి వచ్చినప్పటి సంగతి కదా అని పెదవి విరిచినవారే అందరూ! 3200 కిలోమీటర్ల పైప్ లైన్లు , 2,350 ఓవర్ హెడ్ ట్యాంకులు, 136 ఉపరితల జలాశయాలు, 200 పంప్ హౌస్లు, 250 గొట్టపుబావులు- ఇంత భారీ పథకాన్ని పట్టుమని తొమ్మిదినెలల్లో సాకారం చేసి, దాహార్తి పీడితుల చేరువకు అమృత జలధారల్ని చేర్చిన సత్యసాయి భగీరథ యత్నంలో- మానవసేవే మాధవ సేవ అనే దైవత్వ భావన కనిపించక మానదు. ఉభయ గోదావరి జిల్లాలతోపాటు మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లోనూ వందలకోట్లు వెచ్చించి సత్యసాయి ఏర్పాటు చేసిన తాగునీటి పథకాలు- ఆ పుణ్యజీవి జీవన సార్ధక్యానికి మేలిగురుతులు!


'మీ గుండెల్లో ప్రేమజ్యోతులు వెలిగించడానికే వచ్చాను' అని ప్రవచించిన సత్యసాయి- భావితరంలో జ్ఞానజ్యోతుల ప్రకాశానికి చేసిన కృషి అమోఘం. 'విద్యకు పరమార్థం శీలసంపదే'నంటూ నమూనా విద్యావ్యవస్థను సత్యసాయి ఆవిష్కరించిన తీరు అభినందనీయం. ప్రాథమిక, మాధ్యమిక విద్యాలయాలనుంచి మూడు ప్రాంగణాల విశ్వవిద్యాలయందాకా చదువులమ్మ ఒడిని విస్తరించి, ధనిక-పేద వ్యత్యాసాలు లేకుండా , ఫీజుల ప్రస్తావనే రాకుండా వేలమందికి జ్ఞానభిక్ష ప్రసాదిస్తున్న సత్యసాయి- రేపటి పౌరుల భవితకు మేలుబాటలు పరచిన చిర యశస్వి! విదేశాలలో  రెండున్నర వేలకు పైగా సాయి కేంద్రాలుంటే, ఎన్నెన్నో పాఠశాలల్ని సత్యసాయి సంస్ధలే నడుపుతున్నాయి. యాభై ఏడేళ్ల క్రితం పుట్టపర్తిలో కేవలం రెండు పడకలతో ప్రారంభమైన సత్యసాయి వైద్యసేవలు నేడు లక్షలమందికి అత్యాధునిక వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ ప్రాణ జ్యో తులు మలిగిగుండా కాపాడుతున్నాయి. ఆసుపత్రిదాకా రాలేని గ్రామీణ షాంత రోగులకు  సంచార వైద్య సదుపాయాల్ని కల్పిం చడంలోనే సత్యసాయి ప్రేమతత్వం గుబాళిస్తోంది. అందరినీ ప్రేమించు- అందరికీ సేవలందించు' అన్న నినాదాన్ని జీవన విధానంగా మలచుకొని ఎల్లలెరుగని ప్రేమతత్వాన్ని జగమంతా పరచిన సత్యసాయి భౌతికంగా దూరం కావడం- గుండెల్ని పిండే విషాదం.  సాయిబాబా తల పెట్టిన ప్రతి సేవా ప్రాజెక్టులో ప్రేమాస్పద ముద్ర సత్యం; ఆ ప్రేమజీవి పెంచిన, కోట్లాడు భక్తులకు పంచిన సేవా స్ఫూర్తి అజరామరం. 


 

పేగుబంధం - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు, సంపాదకీయం, 03 -08 - 2009 )

పేగుబంధం

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు, సంపాదకీయం, 03 -08 - 2009 ) 

చెయ్యగా చెయ్యగా పనుల్లో సులువు తెలుస్తుందన్నది  లోక నుడి. మనుషులకే కాదు.. దేవుళ్లకూ ఈ సూత్రం వర్తిస్తుంది.'విధినా తావభ్యస్తం యావద్స్పుష్టా మృగేక్షణాఅని  ‘సుభాషిత రత్నమాల’ ముక్తాయించడానికి అదే కారణం. లావణ్యంతో ఓలలాడే లలనామణి సృష్టి కోసం లీలామానుషుడు ఎన్నో మగబొమ్మలను తయారుచేసాడన్నది  ఈ శ్లోకం తాత్పర్యం. ఆడవాళ్లను అందుకే ఫెయిర్ సెక్స్ అనడం! 

 

ఫెయిర్ నెస్ ఎతుంటే ఏం లాభం? చపల చిత్తం మగవాడి బుద్ధి ముందు స్థిత ప్రజ్ఞత పుష్కలంగా ఉన్నా స్త్రీ సునిశిత గ్రహణ శక్తి మొక్కవోతూనే ఉంది. సృష్టి ఆది నుంచి ఇదే బాధమగవాడు ఆవులించక ముందే మగువలు వాడి పేగులు లెక్కెట్టేస్తారు!  ‘అందుకే ఆడదంటే మగవాడికంత బెదురు’ అన్నారు హిల్లరీ క్లింటన్ ఓ  సందర్భంలో! అబలగా అన్నింటా మగవాడు చిన్నబుచ్చే  ఆడది నిజానికి జగద్గురు శ్రీ శంకరాచార్యుని భాష్యం ప్రకారం అపర పరాశక్తి.. అతిలోక సుందరి శ్రీ లలితాదేవి.. కూడా! 

పరమేశ్వరి అనే పదానికి పరమార్థమేదో బుర్రకు  తట్టక ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ అంటూ తనకు తానే సర్దిచెప్పుకునే ‘బుద్ధి’తక్కువ శాల్తీ మగవాడు.  అయ్యగారి దృష్టిలో ముద్దరాలు అంటే ముద్దుపళని రాధికాసాంత్వనం మార్కు రాధాదేవి. ‘కంటికి నిద్ర రాదువినుకాంతుని బాసిన నాటినుండియున్/వంటక మింపు గాదు..’ టైపు విరహబాధలు తెగ పడిపోయే అష్ట శృంగార నాయికల్లో సందర్భాన్ని బట్టి ఎవరో ఒకర్తె. అందుకే  ఆమెను అందాల భరిణ అంటూ ఉన్నవీ లేనివీ ఊరికే ఊహించుకుని మరీ ‘కురులకు వందనములు తెలి గోము మొగంబునకున్ జోహారునీ/ యరుదగు కంబు గంఠమున కంజలినీ కుచ కుంభాళికిన్/ కరముల్ మోడ్చెదన్బెళుకు క్రౌనుకు మ్రొక్కెదబంచబాణ మం/దిరములకున్ సతీమణి! పదింబదిగా పదివేల దండముల్' అంటూ  దండకాలు రాసుకునేది. నడివయసు దాటినా మిడిమేళపు కవిత్వంతో సడీ సప్పుడు లేకుండా తన మానాన తాను తన పని తాను చూసుకునిపోయే చానను కూడా సామాజిక మాధ్యమ వేదికల మీద కీడ్చి కీచకుడికి మించి రచ్చ చేసేది మగవాడే.  కేస్టింగ్ కౌచ్ లు ఉన్నంత వరకు విరుగుడు తంత్రంగా  ‘మీ.. టూ’ లు పుట్టుకురాక తప్పదు. 

నిజానికి మహిళ ఏనాడూ ‘వాల్మీకి రామాయణం’ పట్టించుకోకుండా వదిలెట్టేసిన ఊర్మిళమ్మలా ఊరికే పడి నిద్రపోయిందిలేదుఅర్జనుడి రాక ముందు నుంచే రాజ్యందర్జాగా నడిపించిన   ప్రమీల  ప్రజ్ఞే  ప్రమదలది ఎప్పుడూనేటి లోకవ్యవహారం కూడా ఆ తీరులోనే  తరుణుల ఆధ్వర్యంలో సాగుతుంటే ఇప్పుడీ మహిళా దినోత్సవాలు గట్రా అంటూ ఆర్భాటాల అక్కరే ఉండేది కాదు.  

 

15వ శతాబ్దంలో ఇండియా  పర్యటనకని వచ్చిన నికోలో కోంటీ అప్పటి హిందూ రాజ్యాలలో భర్త చనిపోయిన భర్తతో బతికున్నభార్యనూ చితి పైకి ఎక్కించడం చూసి విస్తుపోయాడు.  ఆ కాల్చడాలు అవీ ప్రత్యక్షంగా ఇప్పుడు కనిపించవు. కానీ..కడుపులో పడ్డ మరుక్షణం నుంచి కాటిచితిలో పడే ఘడియ వరకు ఏదో ఓ దుర్మార్గపు రూపంలో ఆడాళ్లను కాల్చుకు తినడాలు మాత్రం తప్పడంలేదు ఇప్పుడు కూడానూ! 

వేదాల కాలంలో  స్త్రీ పురుషులిద్దరిలో గొప్ప ఎవరన్న  వాదమే వినిపించింది కాదు. జనకుడి  విద్వత్మహాసభలో గొప్ప తర్కతో తనను తలకిందులు చేసినప్పుడు మహాజ్ఞాని యాజ్ఞవల్క్య మహర్షి  మొహమాటం లేకుండా  మైత్రేయి ముందు మోకరిల్లినట్లు  మనకు కథలున్నాయి.  ఎప్పుడు రాజుకుందో గాని ‘అహం’ అనే ఈ నిప్పు రవ్వ.. ఇప్పటి  మగవాడి మనస్సులో  ‘అహం బ్రహ్మోస్మి’ అన్న అగ్నిని తెగ ఎగదోసేస్తోంది. మగవాడి ఆధిపత్య జ్వాలలకు సుకుమారమైన బతుకులు ఎన్నెన్ని  కాలి బూడిదయిపోతున్నాయో ప్రతీ రోజూ! మరి ఉద్యమం వద్దంటే ముద్దరాలు మొద్దులా ఓ మూల పడివుంటుందా?    

 

సృష్టిధర్మ రీత్యా పురుషుడి దేహం స్త్రీ శరీరం కన్న దృఢం అయితే కావచ్చును. అంత మాత్రం చేతనే అన్నింటా అతగాడు అధికుడు ఐపోతాడా? నాగరికత ఆరంభ యుగాలలో ఆడదే కుటుంబానికంతటికీ తిరుగులేని పెద్ద. పితృస్వామ్యవాదం బలిసి పెత్తనం రుచి మరిగిన తరువాత మగవాడో మహారాజు.. ఆడది అతగాడి ఇష్టారాజ్యానికి ఆడి పాడే మరబొమ్మగా మారిపోవడం.

 

బాల్యం నుంచే బాలికల ఊహలు మహా సునిశితంగా సాగుతుంటాయంటారు.  తన మొద్దు బుర్రకు అందని ఊహల  ఆడదాని చేతిలో ఓటమి  అంటే ఊహూఁ మగవాడికి మరి మండదా! సాటి మగవాళ్లల్లోఎంత నామర్దా!  అందుకే అడ్డదారుల్లో అయినా ఆడదానిని మగవాడు  లొంగదీసుకునేది. కానీ ఆడదాని మనసు ఊరుకుంటుందా? ‘జీవితమనే మాయాజూదంలో మగవాడిదేనా ఎప్పుడూ గెలుపు?/ అంటే ఖాయంగా అది కనిపించని శకుని విసిరే పాచికల ఆటే’ అనుకుంటుంది ప్రముఖ  తమిళ స్త్రీవాద రచయిత్రి ఉమా నారాయణ్ ‘కల్చరల్ డిస్లొకేషన్స్: ఐడెంటిటీసి, ట్రెడిషన్స్ అండ్ థర్డ్ వరల్డ్ ఫెమినిజమ్ ‘ చదివిన తరువాత.

 

వాస్తవానికి మానవ జీవనకావ్యంలో స్త్రీ పురుషులిద్దరూ  రఘువంశ కర్త కాళిదాసు బాషలో చెప్పాలంటే వాగర్థాలుఆదిదంపతులకు మల్లే వాళ్లిద్దరూ చెరో సగంగా సమన్వయంతోనిభాయిస్తే తప్ప జగత్ అనే ఈ మహారథం సక్రమంగా ముందుకు సాగదు!  'న శివేన వినా దేవీన దేవ్యాచ వినా శివః' ! అమ్మ లేకపోతే అయ్య లేడు. అయ్య లేని పక్షంలో మ్మ’ఉండదు. వేటూరివారి పాటలో ఇంకా వివరంగా చెప్పాలంటే మానవ జీవితం నర నారీ సంగమ మృదంగం/ గంగమ జంగమ సంగీతం.  ఆమె ధరకు జారిన శివగంగ తరంగం.  ఆడది అంటే ఇహ చిన్నచూపు ఎందుకో మగవాడికి?

 

తరతరాల వెలుగు తాలుపులైనాతరుగెరుగని ఇలవేలుపులైనా నేల మీదకు కాలు మోపే ముందు ఓ అమ్మ కడుపులోనే  ముందు నునుపు తేలేది! లోకాదర్శ జీవనుడు శ్రీరామచంద్రుడు భూమ్మీదకు  అవతరించింది కౌసల్యామాత గర్భంలో నవ మాసాలు రూపుదిద్దుకున్న తరువాత మాత్రమే! స్త్రీ జన్మ మహిమ రహస్యం ఆ త్రిశంకు  స్వర్గ ద్రష్ట  విశ్వామిత్రుల దృష్టి దాటక పోబట్టే బాలరామయ్యను మేలుకొలుపుతూ సుప్రజా రాముడి కన్న   ముందు కౌసల్య’ మాతనుతలుచుకున్నది. అమ్మ కడుపు చల్లంగా ఉన్నంత కాలమే ఏ అయ్య కలలైనా నిండుగా పండేది. మగాడు ఈ సింపుల్ లాజిక్ మరుగున పెడుతున్నందు  వల్లనే  స్త్రీలోకంలో  ఇంతలా అల్లకల్లోలం.

 

కోవెల వంటిదీ లోకం అన్నది కోమలి కోమల భావన.  కానీ ‘మగవాడి దృష్టిలో ఆమె తనువుకు మాత్రమే ఓ వెల! తాను కని పెంచిన మగవాడే  తన పాలిట సైతానుగా మారుతున్నందుకు  ఆ మాత  వెత. ఆ కలత వల్లనే నెలతలంతా  'ఏ జన్మకీ స్త్రీ జన్మ నీ కొద్దు నా చిట్టి తల్లీ!అంటూ అంతలాతల్లడిల్లిపోతున్నది అప్పుడూ.. ఇప్పుడు కూడా! 

 

భారతీయుల దృష్టిలో ఆడవాళ్లకు ఉండే పూజ్యభావన ఎంత  గొప్పగా ఉంటుందో చెప్పడానికని   యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః’ అంటూ ఎప్పుడూ ఒకే శ్లోకాన్ని వల్లెవేస్తాడు బడుద్ధాయి మగవాడు. వేదాలల్లో స్త్రీని దేవతలుగా చూపించడమూ, విద్యధనధైర్యాలకు స్త్రీలనే దేవతామూర్తులుగా చిత్రీకరించుకోవడమూ మహా బడాయిగాఎత్తిచూపిస్తాడు కూడాను. రామాయణంలో రావణాసురుడి కన్న ముందు రాముడిని కష్టాల పాల్చేసింది ఆడవాళ్లే.. కైకేయిమందరశూర్పణఖ.. అంటూ  తన చిన్ని బుద్ధికి తోచిన కుతర్కం ప్రదర్శిస్తాడు కూడాను!మరి కాస్త కావ్య శాస్త్రజ్ఞానం వంటబట్టి ఉంటే ప్రబంధాల నుంచి కూడా ఎంచుకున్న పద్యాలతో లెక్చర్లు  దంచికొట్టచ్చు. ‘సుబ్బరంగా చదువుకోవడానికని వచ్చిన పిల్లోడు చంద్రుడిని చెడగొట్టింది  తార అనే  స్త్రీనే కదా! కృష్టుణ్ని అష్టకష్టాల పాల్చేసిన దుష్టజాతిలో పూతన వంటి స్త్రీ జాతి పాత్రా ఎంతో కొంత ఉంది కదా!  ఆడజాతి అంతా పులుకడిగిన ముత్యాలల్లే బిల్డప్పులు ఇస్తే ఎట్లా?  ఏదో ప్రకృతిని చూసి పరవశించిపోదామని వచ్చిన పిచ్చి బ్రాహ్మడు ప్రవరాఖ్యుడిని వరూధిని వశం చేసుకోడానికి అంతలా  వేపుకుని తినాలా? ఆవటా అంటూ  అంటూ- సొంటూ లేని శుంఠ  ప్రశ్నలు లేవదీస్తాడు. జరిగాయో జరగలేదోజరిగితే ఎంత వరకు నిజంగా నిజాలే  ప్రచారంలోకి వచ్చాయో..ఇతమిత్థంగా నిర్థారణ కాని కట్టు కథలను పట్టుకుని కొట్టుకు చావడం తప్పించి.. వర్తమానం కట్టెదుట ఆడదానికి అన్ని మతాలలో వాస్తవంగా జరుగుతున్న అన్యాయం గురించి నోరు విప్పడు!

కామసూత్రాలను శాస్త్రీకరించి బహిరంగంగా  ప్రబోధించినందుకు మహానుభావుడని  మనం  నెత్తికెత్తుకుంటున్న వాత్సాయనుడు..  ఆయన అదే కామకళల్లో భర్తల పెత్తనాన్ని ఎట్లా భార్యలు చచ్చినట్లు ఒప్పుకుతీరాలో ఉదాహరణలతో సహా నొక్కి చెప్పిన నిజం ఎవరికీ చెప్పరు ఈ మగవాళ్లు. భర్త తినకుండా భార్య తింటే దోషమన్న దుర్మార్గపు సిద్ధాంతం మొదట లేవదీసిన రుషి ఆ మహాశయుడే! దాన ధర్మాల నుంచి ఏ ఇంటి పని (వంట పని తప్పించి) వరకైనా స్వతంత్రించి చేసుకునే హక్కు ఆమెకు చరిత్రలో ఏ దశలోనూ దఖలు పడిందిలేదు . ఒక్క  భర్తనే కాదు భర్త బంధువులనుమిత్రులనుముఖపరిచయస్తులనయినా సరే ఇంటికి వచ్చినప్పుడు నెత్తిన పెట్టుకు సకల సపర్యలతో ఒప్పించని పక్షంలో ఆమె ఉత్తమమైన ఇల్లాలు కానేరదు కదా.. కొండొకచో శాపతాపాలకూ  గురి అయిన  కథలూ పురాణాలలో బొచ్చెడున్నాయ్వాటి ప్రస్తావన ఏ మగవాడూ చెయ్యడు. భర్త మోజుపడి మరో వివాహం చేసుకున్నా .. వివాహం కుదరని పక్షంలో ఇంటికే తెచ్చేసుకుంటే  సవతితో సఖ్యంగా ఉండాలి తప్పించి కయ్యానికి కాలుదువ్వే సాహసం ధర్మపత్ని అయినా చేసిన  పక్షంలో పుణ్యస్త్రీ వంటి  బిరుదులన్నీ  వెనక్కి పీక్కోబడతాయని బెదిరింపులు  ఈ తరహా మొగవాళ్ల   నుంచే!

ప్రపంచంలోని అతి పెద్ద మతం క్రైస్తవానికి సైతం స్త్రీ పట్ల బొత్తిగా సదుద్దేశం లేదు. 'స్త్రీ పుట్టుకతోనే పాపి. పాపహేతువుకేవలం పురుషుడి సుఖ సంతోషాలే ఆ నీచ ప్రాణి  సృష్టి పరమార్థం.స్త్రీని బానిసగా దేవుని వాక్యం భావించిన దానికి ఏ మాత్రం తిసిపోని విధంగా పురుషుడి అన్ని కష్టాలకు మూలకారణం  క్రైస్తవంలో లాగా ఇస్లాం మతమూ గాఢంగా విశ్వసించింది

 

స్త్రీకి బురఖా ఇస్లాం ప్రసాదమే! ప్రార్థనాలయాల ప్రవేశం ఆమెకు నిషిద్ధం. భర్త కోరితే సంగమానికి సిద్ధం కాకపోవడం పాపహేతువు. ఎంత వయసు వచ్చినా భార్యను  శిక్షించే హక్కు భర్తకు ధారాదత్తం చేసింది  ఇస్లాం మతం. భర్త తలాడించకుండా తనకు పుట్టిన బిడ్డకు అయినా సరే పాలిచ్చే అధికారం భార్యకు కల్పించింది కాదీ మతం. విడిపోయినా సరే భర్త అనుమతి తప్పనిసరి అనడం కన్నా ఘోరం ప్రపంచంలో మరొకటి ఉంటుందా

 

ప్రపంచంలోని దాదాపు అన్ని మతాలలో స్త్రీలు వ్యామోహ కారకులు. వారి మీద సదా  ఓ కన్నేసి ఉంచడం పురుషుల  తప్పనిసరి బాధ్యతల్లో ఒకటి. ఆడవాళ్లు దున్నబడే భూములతో సమానం. భూముల మీదుండే హక్కు భుక్కుల నియమాలన్నీ స్త్రీలకీ వర్తిస్తాయి కొన్ని మతాలల్లో. లేబుల్ ఏదైనాకాలం ఎప్పటిదైనాప్రాంతం ఎక్కడిదైనావైవిధ్యాలువైరుధ్యాలుఅంతర్వైరుధ్యాలు ఎన్ని ఉన్నా  స్త్రీలకు అవ్యాయం  చేసే అంశంలో అన్ని మతాలు అన్నదమ్ముల వలెనే సహకరించుకున్నాయి.. సహకరించుకుంటున్నాయి కూడా!

 

హోలీ బైబిల్  రెండో ఛాప్టర్ ప్రకారం నిద్ర పోయే మగాడి డొక్కలో నుంచి ఓ పక్కటెముక పీకి  ది గ్రేట్ లార్డ్ గాడ్ సృష్టించబడినది ఆడజీవి. ఆ తరహా  భావజాలమే మన ముత్తాతలది కూడా. మనువులాంటి మగ మహానుభావులంతా చేరి  'న స్త్రీ స్వాతంత్ర్య మర్హతిఅంటూ  సిద్ధాంతాలు చేయబట్టే  మగవాడు  ఆ చొప్పదంటు సూత్రాలను పట్టుకుని  తోడు నీడుగా ఉందామని వచ్చే సాటి జీవి ఆడదానిని అన్ని ఆటలు ఆడిస్తున్నది! శేషం వేంకటకవి ‘శశాంక విజయం’లో కోరిక తీర్చమని తన దరి చేరిన గురుపత్ని తారతో ‘వికల చరిత్రు డైనముది వెంగలి యైనగురూపి యైననున్త్రికరణ శుద్ధిగా మగడె దేవు డటం చని నిశ్చయించియొండొక డెటువంటివా డయిన నొప్పదు కోరగ నింతికి’ అంటూ చంద్రుడు ద్వారా చెప్పిన నీతి సూక్తులన్న్నీ నిజానికి మగాడి మనసులో యుగాల బట్టి జెండా పాతుకుపోయి ఉన్నవే! ఆడదంటే ఒక్క తనువే అన్నట్లు మనువు  లాంటి దుష్ట మేధావులు ఈ తరహా  ధర్మపన్నాలు పదేపదే వల్లించడ వల్లనే ఆడవాళ్లకు  ఏ దశ లోనూ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు   బొత్తిగా లేకుండా పోయిందన్నది  స్త్రీవాదుల మండిపాటు. 

మరనుయంత్రాన్ని  కనిపెట్టక ముందే ‘మర-మనిషి’ని కనిపెట్టింది ప్రపంచం. మగప్రపంచం కనిపెట్టిన ఆ మర-మనిషి పేరు ఆడది. ఆడదిగా పుట్టినందుకు, చీరె కట్టడం నేర్చిందాకా పుట్టింటికి గొడ్డులా చాకిరీ చేయడం, ఓ మగాడొచ్చి మెడలో పలుపు కట్టగానే  తలొంచుకొని వెళ్లి అతగాడి వంశానికి   జీతం బత్తెం లేని ఊడిగం ఎల్లకాలం చేసుకుంటూ పడివుండటం!' మల్లాది సుబ్బమ్మగారి వంటి  స్త్రీ జనాభ్యుదయవాదులు పద్దాకా తిట్టిపోసేదీ మగవాడిని తమకు పగవాడిగా మారుస్తున్న ఈ తరహా పెడవాదనలను..   ఇప్పటికీ వాటిని గుడ్డిగా నమ్ముతూ  కఠినంగా అమలుచేస్తూ, ముమ్మరంగా ప్రచారం చేసే మూఢమతులను!

 

'ఎంత రుచి ఆ నిషిద్ధ ఫలానికి/ ఎంత వడి ఆ విముక్త హృదయానికి' అంటారు సినారె  విశ్వంభర ఖండకావ్యంలో నారీ నార సంగమ సుందర దృశ్యాన్ని అభివర్ణిస్తూ! ఇద్దరూ కలసి ఒకే తీరులో  ఆనుభవించే  ఆ సంగమ కార్యపు  తీయని రుచి మగవాడికి  ఒకానొక అనుభూతితో సరి. ఆడదానికి మాత్రం  మంచి.. చెడు..  అనుభవాలన్నీ  అక్కడి నుంచే  మొదలు! గర్భం ధరించింది మొదలు ప్రసవం అయే వరకుకాబోయే అమ్మ 

మగువంటే మగవాడి మర-యంత్రమా?

-    కర్లపాలెం హనుమంతరావు 

( సూర్య దిన పత్రిక సంపాదకీయ పుట వ్యాసం) 

 

 

 

చెయ్యగా చెయ్యగా పనుల్లో సులువు తెలుస్తుందన్నది  లోక నుడి. మనుషులకే కాదు.. దేవుళ్లకూ ఈ సూత్రం వర్తిస్తుంది.'విధినా తావభ్యస్తం యావద్స్పుష్టా మృగేక్షణాఅని  ‘సుభాషిత రత్నమాల’ ముక్తాయించడానికి అదే కారణం. లావణ్యంతో ఓలలాడే లలనామణి సృష్టి కోసం లీలామానుషుడు ఎన్నో మగబొమ్మలను తయారుచేసాడన్నది  ఈ శ్లోకం తాత్పర్యం. ఆడవాళ్లను అందుకే ఫెయిర్ సెక్స్ అనడం! 

 

ఫెయిర్ నెస్ ఎతుంటే ఏం లాభం? చపల చిత్తం మగవాడి బుద్ధి ముందు స్థిత ప్రజ్ఞత పుష్కలంగా ఉన్నా స్త్రీ సునిశిత గ్రహణ శక్తి మొక్కవోతూనే ఉంది. సృష్టి ఆది నుంచి ఇదే బాధమగవాడు ఆవులించక ముందే మగువలు వాడి పేగులు లెక్కెట్టేస్తారు!  ‘అందుకే ఆడదంటే మగవాడికంత బెదురు’ అన్నారు హిల్లరీ క్లింటన్ ఓ  సందర్భంలో! అబలగా అన్నింటా మగవాడు చిన్నబుచ్చే  ఆడది నిజానికి జగద్గురు శ్రీ శంకరాచార్యుని భాష్యం ప్రకారం అపర పరాశక్తి.. అతిలోక సుందరి శ్రీ లలితాదేవి.. కూడా! 

పరమేశ్వరి అనే పదానికి పరమార్థమేదో బుర్రకు  తట్టక ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ అంటూ తనకు తానే సర్దిచెప్పుకునే ‘బుద్ధి’తక్కువ శాల్తీ మగవాడు.  అయ్యగారి దృష్టిలో ముద్దరాలు అంటే ముద్దుపళని రాధికాసాంత్వనం మార్కు రాధాదేవి. ‘కంటికి నిద్ర రాదువినుకాంతుని బాసిన నాటినుండియున్/వంటక మింపు గాదు..’ టైపు విరహబాధలు తెగ పడిపోయే అష్ట శృంగార నాయికల్లో సందర్భాన్ని బట్టి ఎవరో ఒకర్తె. అందుకే  ఆమెను అందాల భరిణ అంటూ ఉన్నవీ లేనివీ ఊరికే ఊహించుకుని మరీ ‘కురులకు వందనములు తెలి గోము మొగంబునకున్ జోహారునీ/ యరుదగు కంబు గంఠమున కంజలినీ కుచ కుంభాళికిన్/ కరముల్ మోడ్చెదన్బెళుకు క్రౌనుకు మ్రొక్కెదబంచబాణ మం/దిరములకున్ సతీమణి! పదింబదిగా పదివేల దండముల్' అంటూ  దండకాలు రాసుకునేది. నడివయసు దాటినా మిడిమేళపు కవిత్వంతో సడీ సప్పుడు లేకుండా తన మానాన తాను తన పని తాను చూసుకునిపోయే చానను కూడా సామాజిక మాధ్యమ వేదికల మీద కీడ్చి కీచకుడికి మించి రచ్చ చేసేది మగవాడే.  కేస్టింగ్ కౌచ్ లు ఉన్నంత వరకు విరుగుడు తంత్రంగా  ‘మీ.. టూ’ లు పుట్టుకురాక తప్పదు. 

నిజానికి మహిళ ఏనాడూ ‘వాల్మీకి రామాయణం’ పట్టించుకోకుండా వదిలెట్టేసిన ఊర్మిళమ్మలా ఊరికే పడి నిద్రపోయిందిలేదుఅర్జనుడి రాక ముందు నుంచే రాజ్యందర్జాగా నడిపించిన   ప్రమీల  ప్రజ్ఞే  ప్రమదలది ఎప్పుడూనేటి లోకవ్యవహారం కూడా ఆ తీరులోనే  తరుణుల ఆధ్వర్యంలో సాగుతుంటే ఇప్పుడీ మహిళా దినోత్సవాలు గట్రా అంటూ ఆర్భాటాల అక్కరే ఉండేది కాదు.  

 

15వ శతాబ్దంలో ఇండియా  పర్యటనకని వచ్చిన నికోలో కోంటీ అప్పటి హిందూ రాజ్యాలలో భర్త చనిపోయిన భర్తతో బతికున్నభార్యనూ చితి పైకి ఎక్కించడం చూసి విస్తుపోయాడు.  ఆ కాల్చడాలు అవీ ప్రత్యక్షంగా ఇప్పుడు కనిపించవు. కానీ..కడుపులో పడ్డ మరుక్షణం నుంచి కాటిచితిలో పడే ఘడియ వరకు ఏదో ఓ దుర్మార్గపు రూపంలో ఆడాళ్లను కాల్చుకు తినడాలు మాత్రం తప్పడంలేదు ఇప్పుడు కూడానూ! 

వేదాల కాలంలో  స్త్రీ పురుషులిద్దరిలో గొప్ప ఎవరన్న  వాదమే వినిపించింది కాదు. జనకుడి  విద్వత్మహాసభలో గొప్ప తర్కతో తనను తలకిందులు చేసినప్పుడు మహాజ్ఞాని యాజ్ఞవల్క్య మహర్షి  మొహమాటం లేకుండా  మైత్రేయి ముందు మోకరిల్లినట్లు  మనకు కథలున్నాయి.  ఎప్పుడు రాజుకుందో గాని ‘అహం’ అనే ఈ నిప్పు రవ్వ.. ఇప్పటి  మగవాడి మనస్సులో  ‘అహం బ్రహ్మోస్మి’ అన్న అగ్నిని తెగ ఎగదోసేస్తోంది. మగవాడి ఆధిపత్య జ్వాలలకు సుకుమారమైన బతుకులు ఎన్నెన్ని  కాలి బూడిదయిపోతున్నాయో ప్రతీ రోజూ! మరి ఉద్యమం వద్దంటే ముద్దరాలు మొద్దులా ఓ మూల పడివుంటుందా?    

 

సృష్టిధర్మ రీత్యా పురుషుడి దేహం స్త్రీ శరీరం కన్న దృఢం అయితే కావచ్చును. అంత మాత్రం చేతనే అన్నింటా అతగాడు అధికుడు ఐపోతాడా? నాగరికత ఆరంభ యుగాలలో ఆడదే కుటుంబానికంతటికీ తిరుగులేని పెద్ద. పితృస్వామ్యవాదం బలిసి పెత్తనం రుచి మరిగిన తరువాత మగవాడో మహారాజు.. ఆడది అతగాడి ఇష్టారాజ్యానికి ఆడి పాడే మరబొమ్మగా మారిపోవడం.

 

బాల్యం నుంచే బాలికల ఊహలు మహా సునిశితంగా సాగుతుంటాయంటారు.  తన మొద్దు బుర్రకు అందని ఊహల  ఆడదాని చేతిలో ఓటమి  అంటే ఊహూఁ మగవాడికి మరి మండదా! సాటి మగవాళ్లల్లోఎంత నామర్దా!  అందుకే అడ్డదారుల్లో అయినా ఆడదానిని మగవాడు  లొంగదీసుకునేది. కానీ ఆడదాని మనసు ఊరుకుంటుందా? ‘జీవితమనే మాయాజూదంలో మగవాడిదేనా ఎప్పుడూ గెలుపు?/ అంటే ఖాయంగా అది కనిపించని శకుని విసిరే పాచికల ఆటే’ అనుకుంటుంది ప్రముఖ  తమిళ స్త్రీవాద రచయిత్రి ఉమా నారాయణ్ ‘కల్చరల్ డిస్లొకేషన్స్: ఐడెంటిటీసి, ట్రెడిషన్స్ అండ్ థర్డ్ వరల్డ్ ఫెమినిజమ్ ‘ చదివిన తరువాత.

 

వాస్తవానికి మానవ జీవనకావ్యంలో స్త్రీ పురుషులిద్దరూ  రఘువంశ కర్త కాళిదాసు బాషలో చెప్పాలంటే వాగర్థాలుఆదిదంపతులకు మల్లే వాళ్లిద్దరూ చెరో సగంగా సమన్వయంతోనిభాయిస్తే తప్ప జగత్ అనే ఈ మహారథం సక్రమంగా ముందుకు సాగదు!  'న శివేన వినా దేవీన దేవ్యాచ వినా శివః' ! అమ్మ లేకపోతే అయ్య లేడు. అయ్య లేని పక్షంలో మ్మ’ఉండదు. వేటూరివారి పాటలో ఇంకా వివరంగా చెప్పాలంటే మానవ జీవితం నర నారీ సంగమ మృదంగం/ గంగమ జంగమ సంగీతం.  ఆమె ధరకు జారిన శివగంగ తరంగం.  ఆడది అంటే ఇహ చిన్నచూపు ఎందుకో మగవాడికి?

 

తరతరాల వెలుగు తాలుపులైనాతరుగెరుగని ఇలవేలుపులైనా నేల మీదకు కాలు మోపే ముందు ఓ అమ్మ కడుపులోనే  ముందు నునుపు తేలేది! లోకాదర్శ జీవనుడు శ్రీరామచంద్రుడు భూమ్మీదకు  అవతరించింది కౌసల్యామాత గర్భంలో నవ మాసాలు రూపుదిద్దుకున్న తరువాత మాత్రమే! స్త్రీ జన్మ మహిమ రహస్యం ఆ త్రిశంకు  స్వర్గ ద్రష్ట  విశ్వామిత్రుల దృష్టి దాటక పోబట్టే బాలరామయ్యను మేలుకొలుపుతూ సుప్రజా రాముడి కన్న   ముందు కౌసల్య’ మాతనుతలుచుకున్నది. అమ్మ కడుపు చల్లంగా ఉన్నంత కాలమే ఏ అయ్య కలలైనా నిండుగా పండేది. మగాడు ఈ సింపుల్ లాజిక్ మరుగున పెడుతున్నందు  వల్లనే  స్త్రీలోకంలో  ఇంతలా అల్లకల్లోలం.

 

కోవెల వంటిదీ లోకం అన్నది కోమలి కోమల భావన.  కానీ ‘మగవాడి దృష్టిలో ఆమె తనువుకు మాత్రమే ఓ వెల! తాను కని పెంచిన మగవాడే  తన పాలిట సైతానుగా మారుతున్నందుకు  ఆ మాత  వెత. ఆ కలత వల్లనే నెలతలంతా  'ఏ జన్మకీ స్త్రీ జన్మ నీ కొద్దు నా చిట్టి తల్లీ!అంటూ అంతలాతల్లడిల్లిపోతున్నది అప్పుడూ.. ఇప్పుడు కూడా! 

 

భారతీయుల దృష్టిలో ఆడవాళ్లకు ఉండే పూజ్యభావన ఎంత  గొప్పగా ఉంటుందో చెప్పడానికని   యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః’ అంటూ ఎప్పుడూ ఒకే శ్లోకాన్ని వల్లెవేస్తాడు బడుద్ధాయి మగవాడు. వేదాలల్లో స్త్రీని దేవతలుగా చూపించడమూ, విద్యధనధైర్యాలకు స్త్రీలనే దేవతామూర్తులుగా చిత్రీకరించుకోవడమూ మహా బడాయిగాఎత్తిచూపిస్తాడు కూడాను. రామాయణంలో రావణాసురుడి కన్న ముందు రాముడిని కష్టాల పాల్చేసింది ఆడవాళ్లే.. కైకేయిమందరశూర్పణఖ.. అంటూ  తన చిన్ని బుద్ధికి తోచిన కుతర్కం ప్రదర్శిస్తాడు కూడాను!మరి కాస్త కావ్య శాస్త్రజ్ఞానం వంటబట్టి ఉంటే ప్రబంధాల నుంచి కూడా ఎంచుకున్న పద్యాలతో లెక్చర్లు  దంచికొట్టచ్చు. ‘సుబ్బరంగా చదువుకోవడానికని వచ్చిన పిల్లోడు చంద్రుడిని చెడగొట్టింది  తార అనే  స్త్రీనే కదా! కృష్టుణ్ని అష్టకష్టాల పాల్చేసిన దుష్టజాతిలో పూతన వంటి స్త్రీ జాతి పాత్రా ఎంతో కొంత ఉంది కదా!  ఆడజాతి అంతా పులుకడిగిన ముత్యాలల్లే బిల్డప్పులు ఇస్తే ఎట్లా?  ఏదో ప్రకృతిని చూసి పరవశించిపోదామని వచ్చిన పిచ్చి బ్రాహ్మడు ప్రవరాఖ్యుడిని వరూధిని వశం చేసుకోడానికి అంతలా  వేపుకుని తినాలా? ఆవటా అంటూ  అంటూ- సొంటూ లేని శుంఠ  ప్రశ్నలు లేవదీస్తాడు. జరిగాయో జరగలేదోజరిగితే ఎంత వరకు నిజంగా నిజాలే  ప్రచారంలోకి వచ్చాయో..ఇతమిత్థంగా నిర్థారణ కాని కట్టు కథలను పట్టుకుని కొట్టుకు చావడం తప్పించి.. వర్తమానం కట్టెదుట ఆడదానికి అన్ని మతాలలో వాస్తవంగా జరుగుతున్న అన్యాయం గురించి నోరు విప్పడు!

కామసూత్రాలను శాస్త్రీకరించి బహిరంగంగా  ప్రబోధించినందుకు మహానుభావుడని  మనం  నెత్తికెత్తుకుంటున్న వాత్సాయనుడు..  ఆయన అదే కామకళల్లో భర్తల పెత్తనాన్ని ఎట్లా భార్యలు చచ్చినట్లు ఒప్పుకుతీరాలో ఉదాహరణలతో సహా నొక్కి చెప్పిన నిజం ఎవరికీ చెప్పరు ఈ మగవాళ్లు. భర్త తినకుండా భార్య తింటే దోషమన్న దుర్మార్గపు సిద్ధాంతం మొదట లేవదీసిన రుషి ఆ మహాశయుడే! దాన ధర్మాల నుంచి ఏ ఇంటి పని (వంట పని తప్పించి) వరకైనా స్వతంత్రించి చేసుకునే హక్కు ఆమెకు చరిత్రలో ఏ దశలోనూ దఖలు పడిందిలేదు . ఒక్క  భర్తనే కాదు భర్త బంధువులనుమిత్రులనుముఖపరిచయస్తులనయినా సరే ఇంటికి వచ్చినప్పుడు నెత్తిన పెట్టుకు సకల సపర్యలతో ఒప్పించని పక్షంలో ఆమె ఉత్తమమైన ఇల్లాలు కానేరదు కదా.. కొండొకచో శాపతాపాలకూ  గురి అయిన  కథలూ పురాణాలలో బొచ్చెడున్నాయ్వాటి ప్రస్తావన ఏ మగవాడూ చెయ్యడు. భర్త మోజుపడి మరో వివాహం చేసుకున్నా .. వివాహం కుదరని పక్షంలో ఇంటికే తెచ్చేసుకుంటే  సవతితో సఖ్యంగా ఉండాలి తప్పించి కయ్యానికి కాలుదువ్వే సాహసం ధర్మపత్ని అయినా చేసిన  పక్షంలో పుణ్యస్త్రీ వంటి  బిరుదులన్నీ  వెనక్కి పీక్కోబడతాయని బెదిరింపులు  ఈ తరహా మొగవాళ్ల   నుంచే!

ప్రపంచంలోని అతి పెద్ద మతం క్రైస్తవానికి సైతం స్త్రీ పట్ల బొత్తిగా సదుద్దేశం లేదు. 'స్త్రీ పుట్టుకతోనే పాపి. పాపహేతువుకేవలం పురుషుడి సుఖ సంతోషాలే ఆ నీచ ప్రాణి  సృష్టి పరమార్థం.స్త్రీని బానిసగా దేవుని వాక్యం భావించిన దానికి ఏ మాత్రం తిసిపోని విధంగా పురుషుడి అన్ని కష్టాలకు మూలకారణం  క్రైస్తవంలో లాగా ఇస్లాం మతమూ గాఢంగా విశ్వసించింది

 

స్త్రీకి బురఖా ఇస్లాం ప్రసాదమే! ప్రార్థనాలయాల ప్రవేశం ఆమెకు నిషిద్ధం. భర్త కోరితే సంగమానికి సిద్ధం కాకపోవడం పాపహేతువు. ఎంత వయసు వచ్చినా భార్యను  శిక్షించే హక్కు భర్తకు ధారాదత్తం చేసింది  ఇస్లాం మతం. భర్త తలాడించకుండా తనకు పుట్టిన బిడ్డకు అయినా సరే పాలిచ్చే అధికారం భార్యకు కల్పించింది కాదీ మతం. విడిపోయినా సరే భర్త అనుమతి తప్పనిసరి అనడం కన్నా ఘోరం ప్రపంచంలో మరొకటి ఉంటుందా

 

ప్రపంచంలోని దాదాపు అన్ని మతాలలో స్త్రీలు వ్యామోహ కారకులు. వారి మీద సదా  ఓ కన్నేసి ఉంచడం పురుషుల  తప్పనిసరి బాధ్యతల్లో ఒకటి. ఆడవాళ్లు దున్నబడే భూములతో సమానం. భూముల మీదుండే హక్కు భుక్కుల నియమాలన్నీ స్త్రీలకీ వర్తిస్తాయి కొన్ని మతాలల్లో. లేబుల్ ఏదైనాకాలం ఎప్పటిదైనాప్రాంతం ఎక్కడిదైనావైవిధ్యాలువైరుధ్యాలుఅంతర్వైరుధ్యాలు ఎన్ని ఉన్నా  స్త్రీలకు అవ్యాయం  చేసే అంశంలో అన్ని మతాలు అన్నదమ్ముల వలెనే సహకరించుకున్నాయి.. సహకరించుకుంటున్నాయి కూడా!

 

హోలీ బైబిల్  రెండో ఛాప్టర్ ప్రకారం నిద్ర పోయే మగాడి డొక్కలో నుంచి ఓ పక్కటెముక పీకి  ది గ్రేట్ లార్డ్ గాడ్ సృష్టించబడినది ఆడజీవి. ఆ తరహా  భావజాలమే మన ముత్తాతలది కూడా. మనువులాంటి మగ మహానుభావులంతా చేరి  'న స్త్రీ స్వాతంత్ర్య మర్హతిఅంటూ  సిద్ధాంతాలు చేయబట్టే  మగవాడు  ఆ చొప్పదంటు సూత్రాలను పట్టుకుని  తోడు నీడుగా ఉందామని వచ్చే సాటి జీవి ఆడదానిని అన్ని ఆటలు ఆడిస్తున్నది! శేషం వేంకటకవి ‘శశాంక విజయం’లో కోరిక తీర్చమని తన దరి చేరిన గురుపత్ని తారతో ‘వికల చరిత్రు డైనముది వెంగలి యైనగురూపి యైననున్త్రికరణ శుద్ధిగా మగడె దేవు డటం చని నిశ్చయించియొండొక డెటువంటివా డయిన నొప్పదు కోరగ నింతికి’ అంటూ చంద్రుడు ద్వారా చెప్పిన నీతి సూక్తులన్న్నీ నిజానికి మగాడి మనసులో యుగాల బట్టి జెండా పాతుకుపోయి ఉన్నవే! ఆడదంటే ఒక్క తనువే అన్నట్లు మనువు  లాంటి దుష్ట మేధావులు ఈ తరహా  ధర్మపన్నాలు పదేపదే వల్లించడ వల్లనే ఆడవాళ్లకు  ఏ దశ లోనూ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు   బొత్తిగా లేకుండా పోయిందన్నది  స్త్రీవాదుల మండిపాటు. 

మరనుయంత్రాన్ని  కనిపెట్టక ముందే ‘మర-మనిషి’ని కనిపెట్టింది ప్రపంచం. మగప్రపంచం కనిపెట్టిన ఆ మర-మనిషి పేరు ఆడది. ఆడదిగా పుట్టినందుకు, చీరె కట్టడం నేర్చిందాకా పుట్టింటికి గొడ్డులా చాకిరీ చేయడం, ఓ మగాడొచ్చి మెడలో పలుపు కట్టగానే  తలొంచుకొని వెళ్లి అతగాడి వంశానికి   జీతం బత్తెం లేని ఊడిగం ఎల్లకాలం చేసుకుంటూ పడివుండటం!' మల్లాది సుబ్బమ్మగారి వంటి  స్త్రీ జనాభ్యుదయవాదులు పద్దాకా తిట్టిపోసేదీ మగవాడిని తమకు పగవాడిగా మారుస్తున్న ఈ తరహా పెడవాదనలను..   ఇప్పటికీ వాటిని గుడ్డిగా నమ్ముతూ  కఠినంగా అమలుచేస్తూ, ముమ్మరంగా ప్రచారం చేసే మూఢమతులను!

 

'ఎంత రుచి ఆ నిషిద్ధ ఫలానికి/ ఎంత వడి ఆ విముక్త హృదయానికి' అంటారు సినారె  విశ్వంభర ఖండకావ్యంలో నారీ నార సంగమ సుందర దృశ్యాన్ని అభివర్ణిస్తూ! ఇద్దరూ కలసి ఒకే తీరులో  ఆనుభవించే  ఆ సంగమ కార్యపు  తీయని రుచి మగవాడికి  ఒకానొక అనుభూతితో సరి. ఆడదానికి మాత్రం  మంచి.. చెడు..  అనుభవాలన్నీ  అక్కడి నుంచే  మొదలు! గర్భం ధరించింది మొదలు ప్రసవం అయే వరకుకాబోయే అమ్మ పడే యాతనలేమిటో వాయుపురాణం తిరగేస్తే విశదంగా బోధపడుతుంది. గర్భస్య ధారణే విషమే భూమి వర్త్ముని/ తస్య  నిష్క్రమణార్థాయ మాతృపిండం దదమ్యాహం' (గర్భం ధరించడమే కష్టం. ఎగుడు దిగుడు నేలల మీద నడవడం అందుకు అదనపు కష్టం. ఆ కష్టం కలిగించినందుకు నీ మాతృపిండాన్ని నేను నీకునమస్కరిస్తున్నాను) అంటూ ఎదిగొచ్చిన తరువాత  సంతానం తమ తల్లుల ముందు తోచిన  విధంగా  మోకరిల్లవచ్చు.  తన బిడ్డ పుట్టుక కోసం యమద్వారం ముందుండే మహాఘోరమైన వైతరణీ నదినైనా తరించేందుకు  సాహసించిన స్త్రీ అప్పట్లో నష్టపోయిన జీవితానుభవాలకు పరిహారం చెల్లించేదెవరూ?

 

భావుకతను రేకెత్తించే కవిత్వాలకేం గానీ.. వాస్తవంగా చూస్తే దేశంలోని స్త్రీ పురుష జనాభా నిష్పత్తి లెక్కలే ఆడవారి పట్ల మగజాతి ప్రదర్శించే ద్వంద్వవిలువల  వ్యాపార దృక్పథాలకు వికృత ఉదాహరణలు. పుట్టాలంటేనే 'చావు గండంనుండీ గట్టెక్కాల్సిన గడ్డు దుస్థితి ఒక్క ఆడ గుడ్డుకే ఈ గడ్డన ఇప్పటికీ! తప్పీ దారీ భూమ్మీద పడ్డా.. తప్పుదారిలో నడిచే మగప్రపంచాన్నుంచి ఎప్పటికప్పుడు తెలివిగా తప్పించుకునే దారులు దేవులాడుకోవడమే తప్పించి నేటికీ ఇంటా బైటా వయసుతో నిమిత్తం లేకుండా ఆడది ఎదుర్కోక తప్పని దైన్యస్థితులు ఎన్నెన్నో! 

 

తన జీవితాన్ని తనకై  తానుగా అచ్చంగా   మగవాడి హక్కులతో సరిసమానంగా బతికే మంచి రోజులు ఆడదానికి ఎప్పుడు లభిస్తే అప్పుడే ఏటేటా జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు అంతిమ లక్ష్యానికి సార్థకత ! 

 

-    కర్లపాలెం హనుమంతరావు 

( సూర్య దిన పత్రిక సంపాదకీయ పుట వ్యాసం) 

 

  యాతనలేమిటో వాయుపురాణం తిరగేస్తే విశదంగా బోధపడుతుంది. గర్భస్య ధారణే విషమే భూమి వర్త్ముని/ తస్య  నిష్క్రమణార్థాయ మాతృపిండం దదమ్యాహం' (గర్భం ధరించడమే కష్టం. ఎగుడు దిగుడు నేలల మీద నడవడం అందుకు అదనపు కష్టం. ఆ కష్టం కలిగించినందుకు నీ మాతృపిండాన్ని నేను నీకునమస్కరిస్తున్నాను) అంటూ ఎదిగొచ్చిన తరువాత  సంతానం తమ తల్లుల ముందు తోచిన  విధంగా  మోకరిల్లవచ్చు.  తన బిడ్డ పుట్టుక కోసం యమద్వారం ముందుండే మహాఘోరమైన వైతరణీ నదినైనా తరించేందుకు  సాహసించిన స్త్రీ అప్పట్లో నష్టపోయిన జీవితానుభవాలకు పరిహారం చెల్లించేదెవరూ?

 

భావుకతను రేకెత్తించే కవిత్వాలకేం గానీ.. వాస్తవంగా చూస్తే దేశంలోని స్త్రీ పురుష జనాభా నిష్పత్తి లెక్కలే ఆడవారి పట్ల మగజాతి ప్రదర్శించే ద్వంద్వవిలువల  వ్యాపార దృక్పథాలకు వికృత ఉదాహరణలు. పుట్టాలంటేనే 'చావు గండంనుండీ గట్టెక్కాల్సిన గడ్డు దుస్థితి ఒక్క ఆడ గుడ్డుకే ఈ గడ్డన ఇప్పటికీ! తప్పీ దారీ భూమ్మీద పడ్డా.. తప్పుదారిలో నడిచే మగప్రపంచాన్నుంచి ఎప్పటికప్పుడు తెలివిగా తప్పించుకునే దారులు దేవులాడుకోవడమే తప్పించి నేటికీ ఇంటా బైటా వయసుతో నిమిత్తం లేకుండా ఆడది ఎదుర్కోక తప్పని దైన్యస్థితులు ఎన్నెన్నో! 

 

తన జీవితాన్ని తనకై  తానుగా అచ్చంగా   మగవాడి హక్కులతో సరిసమానంగా బతికే మంచి రోజులు ఆడదానికి ఎప్పుడు లభిస్తే అప్పుడే ఏటేటా జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు అంతిమ లక్ష్యానికి సార్థకత ! 

 

-    కర్లపాలెం హనుమంతరావు 

( సూర్య దిన పత్రిక సంపాదకీయ పుట వ్యాసం) 

 

 

పేగుబంధం - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు, సంపాదకీయం, 03 -08 - 2009 )

 పేగుబంధం

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు, సంపాదకీయం, 03 -08 - 2009 ) 


వత్సం అంటే ఆవుదూడ. అది పుట్టినప్పుడు దాని ఒంటినిండా మావి అలముకుని జుగుప్సావహంగా ఉంటుంది. అప్పుడు వత్సల(గోమాత) బిడ్డ దేహంమీద మకిలి అంతటినీ స్వయంగా తన నాలుకతో శుభ్రం చేస్తుంది. ప్రేమగా, ఆత్మీయంగా, శ్రద్ధగా తల్లిగోవు ఆ పని చేస్తున్నప్పుడు వ్యక్తమయ్యే గొప్ప భావాన్నే వాత్సల్యం అంటారు. వాత్సల్యం తల్లుల సొత్తు. మాతృత్వం అనేది సృష్టిలోని ఒకానొక మహత్వపూర్ణమైన అనుభూతి. అది బిడ్డకు జన్మ, తల్లికి పునర్జన్మ! తల్లి అనిపించుకోవడానికి స్త్రీ ప్రాణాల్ని సైతం పణంగా పెడుతుంది. అమితమైన బాధను ఓర్చుకుంటుంది. ప్రసవ వేదన ఎంతటిదో అనుభవిస్తేనే తెలుస్తుంది. రైలు పట్టాలమీద పెట్టిన నాణెం చక్రాలకింద నలిగి వెడల్పవుతుంది చూశారా! కాన్పులో బాధను దానితో పోల్చి చెప్పిందొక కవయిత్రి. దుర్భరమైన నొప్పులను ఓర్చుకున్న అమ్మ నలుసును చూడగానే సంతోషంగా నవ్వుతుంది. అమ్మనొప్పులకు కారణమైన ఆ బిడ్డ మాత్రం ఏడుస్తాడు. అదే సృష్టిలోని చిత్రం! కన్నాక కూడా కొన్నాళ్ళపాటు తన నోటిని కట్టేసుకుని తల్లి పథ్యంచేస్తూ బిడ్డకు మాత్రం తియ్యని పాలిచ్చి పెంచుతుంది. సంతానాన్ని పెంచి పెద్దచేసే క్రమంలో ముఖ్యభూమిక వహిస్తుంది. తల్లి పెంపకంలో గొప్పగొప్ప యోధులైనవారు చరిత్రలో మనకు చాలామంది కనిపిస్తారు. పురాణ కాలంలో పాండవులు మొదలు, ఆధునిక యుగంలో శివాజీ దాకా మహాయోధులైన వారెందరిపైనో తల్లి ప్రభావం స్పష్టంగా కనపడుతుంది. దాన్ని గుర్తించాడు కాబట్టే 'ప్రపంచంలో గొప్పవారంతా తమ తల్లుల లక్షణాలను అధికంగా పుణికిపుచ్చుకున్నవారే' అని నిర్ధారించాడొక తత్వవేత్త. 'ఒడిలో కూర్చొనియుండ, నీవు మమతాయోగమ్ము పాటించి ప్రేముడిమై దేహమునెల్ల తాకునపుడేమో గాఢసంరక్షలో గుడిలో దీపము వోలెనుంటి...' అన్న ఒక మహాసహస్రావధాని మాట- అమ్మ ఒడిలోని భద్రస్థితికి కవితాకర్పూర నీరాజనం.


అమ్మ జన్మదాత అనుకుంటే- నాన్న జీవదాత! దేహం తండ్రి ప్రసాదం అని వేదం స్పష్టంగా చెప్పింది. పురుషేహవా... అనే ఐతరేయమంత్రం- తండ్రి శుక్రం ద్వారా తల్లి గర్భంలో దేహాన్ని పొందడం జీవుడికి మొదటి జన్మగా చెప్పింది. శిశువు రూపంలో భూమిమీద పడటం రెండో జన్మ. అక్కడినుంచి తండ్రి సంరక్షణ మొదలవుతుంది. తల్లీతండ్రీ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ అపురూపంగా పెంచుకుంటారు. వాళ్ళకోసం అవసరమైతే, తాము పస్తులుండటానికి సిద్ధపడతారు. తమ పిల్లలు తమకన్నా అన్నివిధాలా పెద్దస్థాయిలో జీవించాలని కోరుకుంటారు. తపనపడతారు. త్యాగాలు చేస్తారు. పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించడం, పెద్దవాళ్ళను చెయ్యడం తమ బాధ్యతగా భావిస్తారు. ఇష్టంగా నిర్వహిస్తారు. ఊహ తెలియగానే పిల్లవాణ్ని 'నీ బతుకు నువ్వు చూసుకో' అనడానికి భారతీయ తల్లిదండ్రులకు మనసొప్పదు. 'భార్య భర్త అనే రెండు తాళ్ళు ముడివేస్తే- ఆ ముడి సంతానం' అన్నాడు భర్తృహరి. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఆ పేగుముడే- మనిషి అసలైన జీవ లక్షణం. చమురు ఆవిరైతే దీపం ఏమవుతుంది? బంధం శిథిలమైతే బతుకులో ఇక ఏముంటుంది? భార్యాభర్తలు విడిపోవచ్చు, చెడిపోవచ్చు గాని- తల్లిదండ్రులుగా మారాక బాధ్యతగా జీవించవలసిందేనని మన పెద్దల తీర్మానం. భార్యాభర్తల మధ్య ముందు ఏర్పడ్డ దూరం పిల్లలనే ముడితో తరిగిపోతుందంటారు వేటూరి ప్రభాకరశాస్త్రి. 'సంతానం కలగడంతో ఎన్నో సమస్యలు సమసిపోయి భార్యాభర్తలు దగ్గరకావడం మనం చూస్తున్నాం. అలాగే ప్రేమపెళ్ళిళ్లను ఆమోదించలేక విడిపోయిన కుటుంబాలు సైతం కొత్త జంటకు పిల్లలు కలిగేసరికి తిరిగి కలగలసిపోవడం మనం ఎరుగుదుం. అదే 'సుతాకారపు ముడి' అంటే! దాని ప్రభావం తియ్యనిదేకాదు, బలమైనది కూడా!


అనుబంధాలూ ఆత్మీయతలూ లేకుంటే జీవితానికి అర్థమే ఉండదు. తల్లిదండ్రులు పిల్లలకు ప్రేమానురాగాలు పంచి ఇవ్వాలి. పిల్లలు పెద్దయ్యాక తల్లిదండ్రుల్ని సాదరంగా, ఆత్మీయంగా చూసుకోవాలి. ఆ సంప్రదాయ పరంపర తరవాతి తరానికి ఆదర్శం కావాలి. గడపడానికీ, జీవించడానికీ మధ్య తేడా అదే! తన తల్లిదండ్రుల పాదపద్మాలను ప్రీతిగా 'ఏ పాదసీమ కాశీ ప్రయాగాది పవిత్ర భూములకన్నను విమల తరము...' అని స్తుతించాడు పాండురంగడు. స్వతహాగా చదువూసంధ్యా అబ్బకపోయినా- కౌశికుడంతటివానికి జ్ఞానబోధ చేయగలిగే స్థాయి వివేకం తనకు దక్కడానికి కారణం తల్లిదండ్రులకు చేసిన సేవలే అన్నాడు- భారతంలో ధర్మవ్యాధుడు. ఆడపిల్లలు తండ్రిమీద, మగపిల్లలు తల్లిపైన ప్రేమ అధికంగా కలిగిఉంటారని చెబుతారు. మనమూ పిల్లల్ని 'నువ్వు అమ్మ పార్టీయా, నాన్న పార్టీయా' అని ఆరా తీస్తుంటాం. 'వాడు అమ్మ కూచి... ఆమె నాన్న కూచి' అంటూ ముద్రలు వేస్తుంటాం. ఏ రకంగా ముద్రలు వేసినా, ఎటువైపు మొగ్గుచూపినా పిల్లలందరూ తమ తల్లిదండ్రులు ఇద్దరూ కలిసిమెలిసి ఉండాలనే కోరుకుంటారు. అమ్మానాన్నా ఒకరినొకరు మనసారా ప్రేమించడం, గౌరవించడమే పిల్లలకు ఇష్టంగా ఉంటుంది. ఇటీవల హైకోర్టు ధర్మాసనం సైతం ఇదే విషయాన్ని ఒక జంటకు వివరించింది. ఇద్దరు ఆడపిల్లలు పుట్టాక కాపురంలో కలతలు మొదలై ఆ జంట విడిపోయింది. పిల్లలిద్దరూ చెరో చోటా ఉండిపోయారు. అయిదేళ్ళు గడిచాక విడాకుల కేసు కోర్టుకు వచ్చినప్పుడు చిన్నపాపను న్యాయమూర్తి పిలిచి 'నీకు అమ్మానాన్నల్లో ఎవరు కావాలి?' అని అడిగారు. ఆ పిల్ల చేతులు జోడించి 'నాకు అమ్మ, నాన్న, అక్క ముగ్గురూ కావాలి' అని దీనంగా అడిగింది. దాంతో న్యాయమూర్తి చలించిపోయారు. జనం కరిగిపోయారు. తల్లీతండ్రీ కన్నీటితో సతమతమయ్యారు. కరుణ రసాత్మకమైన ఆ ఘటనతో వారిద్దరూ పశ్చాత్తాపానికి లోనయ్యారు. తిరిగి ఒకటవుతామని కోర్టుకు విజ్ఞప్తిచేశారు. పేగుబంధం తన ప్రభావాన్ని చూపించింది. ఆ కుటుంబం ఆనందాశ్రువులతో ఒక్కటైంది. సమాజంలో వస్తున్న గొప్ప మార్పునకు సంకేతంగా నిలిచింది.

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు, సంపాదకీయం, 03 -08 - 2009 ) 

వివాహమే మహాభాగ్యం- ఈనాడు సంపాదకీయం -కర్లపాలెం హనుమంతరావు

 


జన్మతః మనిషి మూడు రుణాలతో పుడుతున్నాడన్నది ఉపనిషత్‌ వాక్యం.

ఋషుల రుణాన్ని బ్రహ్మచర్యంతో,

దేవతల రుణాన్ని యజ్ఞాలతో,

పితృదేవతలరుణాన్ని వివాహంతో తీర్చుకోవాలని పెద్దల ఆదేశం.

తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకునేందుకు వివాహాన్ని ఓ ధార్మిక సంస్కారంగా తీర్చిదిద్దుకున్న  సంప్రదాయం మనది.

'పెళ్లి అనేది ఓ విచిత్ర వలయంలాంటిది. అందులో ఉన్నవాళ్ళు బయటపడాలని తహతహలాడుతుంటే.. బయట ఉన్నవాళ్ళు లోనికి వెళ్లాలని ఉబలాటపడుతారు' అని ఓ మేధావి చమత్కరించాడు. అయినా,  భారతీయ సంస్కృతి ప్రకారం మోక్షగామి పాటించవలసిన నాలుగు ధర్మమార్గాలలో  గృహస్థాశ్రమం  తప్పనిసరిది . ధర్మార్థ కామమోక్షాల సాధనకోసం కలసిమెలసి ప్రస్థానిస్తామంటూ- పెళ్లినాడు చేసిన ప్రమాణాల సాక్షిగా వధూవరులు అడుగు పెట్టే పొదరిల్లు వివాహబంధం! 'సతుల బడయనేల, సుతుల బడయనేల, వెతలు పడగనేల వెర్రితనము..' అన్న వేమన కూడా కామి కానివాడు మోక్షగామి కాలేడు పొమ్మని తేల్చిచెప్పిన మాట మనం మర్చిపోలేం కదా! భారతీయుల సంప్రదాయం ప్రకారం ఆ మూడో పురుషార్థం ధర్మబద్ధంగా సిద్ధించే మార్గం గృహస్థాశ్రమం. సుఖదుఃఖాలలో, కలిమిలేములలో సహభాగస్వాములుగా భార్యాభర్తలు సాగించే సంసారయాత్రకు స్నేహం ఓ  దీపంలా దిక్సూచి ధర్మం నిర్వహించాలన్నది  భారతీయ సమాజంలోని నియమం. 'మాయ, మర్మము లేని నేస్తము/మగువలకు, మగవారికి ఒక్కటె/' అంటూ 'బ్రతుకు సుకముకు సమాన ఫాయిదా 'రాజమార్గము'ను నిర్దేశించిన  వైతాళికుడు గురజాడ. ఆధిక్యతా భావనలను, ఆధిపత్య ధోరణులను దరికి రానీయకుండా- 'మగడు వేల్పన పాత మాటది/ ప్రాణమిత్రుడ నీకు...' అన్న గురజాడ వాక్కుకు వారసుడిగా- తన జీవన సహచరికి ఆత్మీయహస్తం అందిస్తూ, దాంపత్యబంధంలో స్నేహ బాంధవ్యం రుచి చూపించవలసిన చొరవ ఓం ప్రధమంగా  పురుషుడిదే.

 

'జీవితమనే రేడియో సెట్టుకి భర్త ఏరియల్,‌ భార్య ఎర్త్' అంటూ కవిత్వీకరించిన ఆరుద్ర- ఏకాభిప్రాయం అనే విద్యుచ్ఛక్తి లేకపోతే  ఆ సెట్టు పలికే మట  సున్నా అన్నాడు.

భార్యాభర్తల సాహచర్యం సమశ్రుతి చేసిన స్వరవాయిద్యం తీరులో సంసార పేటికలో  ప్రతి నిమిషం పాతలాగా కాగాలి.

దాంపత్యమంటే మూడు ముడులతో పేనిన రెండు ఆత్మలు ఒక్కటై వాగర్థాల వలె విడదీయలేనంత గాఢంగా పెనవేసుకుని ఉండటం! మనుగడకు మూలమంత్రమైన మమతను గుండె నిండుగా నింపుకొని జీవనమనే మహతిపై మహత్వ స్నేహగీతాన్ని పలికించడం! అలకలు-అనునయాలు; విరసాలు-సరసాలు; ఉక్రోషాలు-ఊరడింపులు; పంతాలు-పశ్చాత్తాపాలు; కించిత్‌ కోపాలు-కిలకిల నవ్వులు; గిల్లికజ్జాలు- గిలిగింతలు; సాధింపులు-సర్దుబాట్లు... ఆ వీణ మెట్లపై పల్లవించే గాన మాధుర్యంలో సప్తస్వరాలై ఊపిరులూదడందాంపత్యమంటే- స్త్రీ పురుషుల జంట ఆలుమగలై చెట్టపట్టాలుగా తొలిసారి వేసిన ఏడు అడుగులు. సప్తాశ్వాలు పూన్చిన వారి సంసార రథం మలిసంధ్యలోనూ తొలిసంధ్యలోని తేజరింపు రవంతైనా తరగకుండా సాగిపోవడం! ఆత్రేయ అన్నట్లు 'నేనోడి నీవే గెలిచి నీ గెలుపు నాదని తలచి రాగాలు రంజిలు రోజు రాజీ' రానిమ్మనే ఆకాంక్షలూరే రెండు గుండెల సాహచర్యం. కోరికలన్నీ తీరి,  చివరి మజిలీకి చేరుకున్న తదుపరి 'మన జీవిత పయనంలో చివరి కోర్కె ఏదనీ/ ఒకరికన్న ఒకరు ముందు కన్నుమూసి వెళ్లాలని..' నిరీక్షించే క్షణాలు ఇంకా నిలబడిగాని ఉండుంటే  సార్థకతతో కూడిన  సంసారం ఆలుమగలు నడి మధ్యన ఇన్ని దశాబ్దాలూ సవ్యంగా సాగినట్లు లెక్కే!  శృంగారం అవసరం కాని వయసులోనూ పరస్పరం ప్రేమించుకునే జంటల 'చుట్టూ అల్లుకునే అనురాగమనే రాగలత శోభాయమానంగా ఉంటుంది.  పెనుగాలి వీచినా చెక్కుచెదరని ప్రదీప కళికతో పోల్చదగినది అంటారు ఆ తరహా అన్యోన్య దాంపత్యాన్ని  ముళ్లపూడివారు.

ఇతర దేశాల తరహాలో కాకుండా మన భారతీయ సమాజంలో కుటుంబ వ్యవస్థను అవిచ్ఛిన్నంగా ఉంచుతున్నది ఈ వివాహబంధమే. స్త్రీ, పురుషుల మధ్య అనురాగబంధాన్ని దృఢతరం చేసేది వైవాహిక జీవితమేనన్నది సార్వజనీన సత్యం. మానసిక వ్యాకులతతో, నిరాశా నిస్పృహలతో కుంగిపోయే ప్రమాదం నుంచి మనుషుల్ని వివాహబంధం ఒడ్డున పడేస్తుందని, స్త్రీ, పురుషులిద్దరికీ ఇది వర్తిస్తుందని అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఓ అధ్యయనంలో నిర్ధారణ అయిన నిజం. ఆధునిక సమాజంలో వివిధ కారణాలు, ఒత్తిళ్లు, కౌటుంబిక సంబంధాల్లో వస్తున్న మార్పులు వంటి  వాటి వల్ల వివాహబంధాలు సడలిపోవడం, భార్యాభర్తలు విడిపోవడం పరిపాటయిపోతున్న రోజులివి. కాలానుగుణంగా విలువలూ మారుతుండటంతో, వివాహ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోతున్నవారినీ తప్పు పట్టలేం. అయితే, మనుషులకు మనశ్శాంతి చేకూర్చేది వివాహబంధమేనని శాస్త్రీయంగా తేలడం- అనాదిగా వస్తున్న ఆ వ్యవస్థ ఔన్నత్యానికి  ఆదునిక పరిశోధనలూ పట్టం కట్టడం ఆహ్వానించదగ్గ అంశం. పెళ్లితో ఎక్కువగా మేలు పొందేది మహిళలు మాత్రమేనని గతంలోని  అధ్యయనాలు పేర్కొంటే.   స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఇరువురికీ వివాహబంధం మానసికంగా స్వాస్థ్యత చేకూరుస్తుందని తాజా పరిశోధనల వల్ల వెల్లడవుతున్నదిప్పుడు. విడాకులు, లేదా జీవిత భాగస్వామి కనుమూయడం వంటి కారణాల వల్ల ఆ బంధం తెగిపోతే, మహిళల కన్నా పురుషులే మానసికంగా ఎక్కువ కుంగుబాటుకు లోనవుతున్నట్లు  పరిశోధనల ఫలితాల సారాంశం.  పెళ్ళితో నిమిత్తం లేకుండా సహజీవనం చేస్తున్వారి కన్నా, వివాహబంధంతో ఒక్కటైనవారే ఎక్కువ సంతోషంగా ఉన్నారంటున్నారు ఆధునిక సామాజిక శాస్త్రవేత్తలు కూడా. అంతమాత్రాన- 'మనువేలనయ్యా, మనసు నీదైయుండ' అంటూ ఒకరి మీద ఒకరు నమ్మకంతో, అన్యోన్యంగా జీవనయాత్ర సాగిస్తున్న వారిది భార్యాభర్తల సంబంధం కాకుండా పోదు. ఆనందమయంగా ఉంటుందనుకుంటే, స్త్రీ పురుషులు వివాహబంధంతో నిమిత్తం లేని   బతుకుబాటలో పయనించడంలోను ఇబ్బంది ఉండబోదు. ఏ తీరులో ఉన్నా అది దాంపత్యమే. తాంబూలంలా రాగరంజితమైనదే. మహాకథకులు మల్లాది రామకృష్ణశాస్త్రి అన్నట్లు- తాంబూలమైనా, దాంపత్యమైనా ఆద్యంతం రసవంతంగా ఉండటం ప్రధానం!

కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు, సంపాదకీయం, 03 -01 -2010)

________________________________

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...