Wednesday, November 10, 2021

పదండి వెనక్కు ( సరదాకి ) - కర్లపాలెం హనుమంతరావు

పదండి వెనక్కు ( సరదాకి ) 

- కర్లపాలెం హనుమంతరావు 

మార్నింగ్ గుడ్!

ఏడాదిలో మూడు వందల అరవై నాలుగు రోజులు ముందుకే కదా నడుస్తాం! ఒక్క రోజు కాస్సేపు కాస్త వెనక్కు నడవమంటే ఎందుకలా మిర్రి మిర్రి చూడడం! ఈ కొత్త వెర్రి ఏమిటా అనా?

జనవరి 30 వెనక్కి నడిచే రోజు అమెరికాలో!

మనదగ్గరయితే  ఈ వెనక నడక మరీ కొత్త చోద్యమేం  కాదు! అప్పులోడు ఎదురు పడితే అడుగు ముందుకు పడదు. ఎదురొచ్చిన సందు మరీ పాతబస్తీ మోడల్లో ఉంటే వెనక్కి నడిచి ఏ మలుపులోకి తప్పుకొంటేనే మానం దక్కుదల!

'పదండి ముందుకు!.. పదండి ముందుకు!' అంటూ మహాకవిశ్రీ శ్రీ మరీ కాళ్లకిందలా నిప్పులు ఎందుకు పోస్తారో! 'వెనక చూసిన కార్యమేమోయి/మంచి గతమున కొంచెమేనోయి/మందగించక ముందు అడుగేయి/వెనుకపడితే వెనకే నోయి' అంటూ  గురజాడవారిదీ అదే గత్తర! ఇహ  మన ఏ.పీ చంద్రబాబుగారైతే మరీ విడ్డూరం! పద్దస్తమానం పెద్దానికీ  'అలా ముందుకు పోదాం' అంటూ ఒహటే తొందర ఆయనకు! ముందుచూపుమీదే అందరి చూపైతే మరి  మనకి  వెనక తీసే గోతుల గతి పట్టించుకునే పరంధాముడు ఎవరంట! బొక్కబోర్లా పడ్డా తట్టుకొని లేవచ్చు. వెల్లికిలా పడ్డమంటే మళ్లీ తేలేది కైలాసంలోనే సుమా!

ఎవరెంతమంది వైతాళికులు ముందు నడకకే తాళమేసినా మన శ్రీమాన్ గిరీశంగారు మాత్రం 'అటునుంచి నరుక్కు రమ్మని' దొడ్డిదారి చూపించారు! కొంత నయం! నేటి మెజారిటీకీ ఆ దారే రహదారి! సంతోషం!

మాటవరసకేదో అనుకుంటాం గానీ..  వాస్తవంగా మన నడక ఇప్పుడు వెనక్కికాక ముందుకుందా! ఎప్పుడో వెనక తాతలు తాగిన నేతుల వాసన మనమిప్పుడు  మూతులు ముందుకు చాపి చూపించుకుంటున్నామా లేదా! దేశానికి స్వేచ్చాస్వాతంత్రాలొచ్చిందే  తన వెనక తరం తాతయ్య నెహ్రూ వల్లని ఇటలీ బ్లడ్ రహుల్ బాబు ఇప్పుటికీ డప్పులు కొట్టుకుంటున్నాడు!  పేదల పాలిటి పెన్నిధని అత్త ఇందిర పేరు చెప్పుకొంటూ కోడలుగాంధీ పల్లకీ మోయించుకోడంలా! ఏనాడో  చరిత్రపుటల్లోకి ఎగిరి వెళ్ళిపోయిన.. మహానేత వై ఎస్ పేరు మోసుకుంటూ  జగజ్జేత  కావాలనుకోడంలా జగన్ జీ! ‘అచ్చేదిన్’ వచ్చేదింకా ఎంతో దూరంలో లేదంటూనే.. వెనకటినాటి రామరాజ్యం మళ్లీ తెస్తామంటోంది మోదీ సర్కార్! వెనకచూపును చిన్నచూపు చూస్తున్నదెక్కడ! ముందుకు కదలాలంటే వెనక చూపు ఎంతో అవసరం. 

ఆ చూపు లోపిస్తే బతుకెంత దుర్బరమో ఒక్క రామాయణంలోనే బోలెడన్ని ఉదాహరణలు!   బంగారులేడి మాయదారిదని తెలిసీ   శ్రీరామచంద్రుడు   వచ్చినదారి  పట్టక అష్టకష్టాల పాలయ్యాడు! వ్యాస మహర్షులవారు రాసి పారేసిన అష్టాదశ పురాణాలు, ఇతిహాసాలు, భారత భాగవతాదుల్లో ఒక్కడంటే ఒక్కడికైనా వెనకచూపు లేకపోవడం విచిత్రమే కాదు.. విచారకరంకూడానూ! 

బ్యాక్ టు ఫ్యూచర్ పెద్ద హిట్ పిక్చర్ హాలివుడ్లో! బ్యాక్ టు స్కూలు అమెరిన్  స్కూళ్ళు తిరిగి తెరిచే  సందర్భం! ఎన్నికల వేళ మన ప్రజానిధులు వాడవాడల్లో చెడ తిరుగుతారే.. అదీ ఓ రకంగా ‘బ్యాక్ టు నియోజకవర్గం’ పథకం కిందే లెక్క!  అంగారకుడిమీద పరిశోధనలు చేసే నాసా రోవర్ ‘క్యూరియాసిటీ’  వంద  మీటర్ల దూరం వెనక్కి నడిచినప్పుడు అంతరిక్ష పరిశోధకుల ఆనందం అంతా ఇంతా కాదు!

వెనకనుంచి చదివే లిపి పార్శీ. కలుపు మందులు పిచికారీ చేసేటప్పుడు తప్పనిసరిగా  వెనక్కి నడవాలి! చిన్నబళ్ళో పంతుళ్ళు ఎక్కాలను వెనకనుంచి ఒప్పచెప్పించేవాళ్లు. రాకెట్లు అంతరిక్షంలోకి వదిలేముందు అంకెలు వెనకనుంచి లెక్కిస్తారు! లియొనార్డో డావిన్సీ పేరు విన్నారా! ఆయన వెనకనుంచి ముందుకు రాసుకుపోవడంలో సుప్రసిద్ధుడు!

 రామకృష్ణ విలోమ కావ్యం.. 14వ శతాబ్దంది..  మొత్తం 36 శ్లోకాలు.. ముందు నుంచి చివరికి చదువు.. రామాయణం, వెనకనుంచి మొదటికి రా! భారతం! ‘చిరం విరంచి: న చిరం విరంచి:/సాకారతా సత్య సతారకా సా / సాకారతా సత్య సతారకా సా /చిరం విరంచి: న చిరం విరంచి:’ సాహిత్యంలో కవులు  పద్యాలు ఇలా  వెల్లికిలా వల్లెవేస్తే ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టేస్తాం. కాకతీయులుకూడా విలోమ పద్ధతుల్లో  వివాహాలు చేసుకున్నారయ్యా అంటే విస్తుపోయి చూస్తాం! అన్నయమంత్రని  రుద్రమాంబ రెండో బిడ్డ  చేసుకుంది. ఇంత పాండిత్యం విని తట్టుకోలేనంటే చిన్న ఉదాహరణ ఒహటి తగిలించి వదిలేస్తా! 'దడిగాడువానసిరా'ని తిరగేసి రాసి చూడరా! 'రాసినవాడు గాడిద' అవుతుంది అవుతుందా లేదా! గురుస్వామిలాంటి స్వాములు  సినిమాపాటలు వరస చెడకుండా  వెనకనుంచి పాడితే భలే అర్థమవుతాయి  కదా!  చేతులు నొప్పుట్టేట్లు చప్పట్లు కొట్టికూడా అభినందిస్తావూ! వెనకటి కథలే మళ్ళీ మళ్ళీ తాజాసినిమాలుగా మారి  రీసైకిల్ కిల్ చేస్తున్నా  'ఇదేంట’ని ఈసడించుకోవు  సరికదా.. మొదట్రోజు మొదటాటలోనే తల మోదుకొనేందుకు   తయారయిపోతావ్!  మనదగ్గరంటే ఆసే.తు హిమాచల పర్యంతం  దాదాపు ఒకే సమయం నడుస్తుంది. అమెరికాలాంటి అఖండ ఖండాల్లో  అడుక్కో రకం గడియారంనడక! ఆరునెల్లకి ఓ గంట అటుకో ఇటుకో సర్దుబాటు! గడియారాలే  వెనక్కీ ముందుకీ నడవంగా లేనిది   మనమో నాలుగడుగులు అవసరాన్ని బట్టి వెనక్కి నడిస్తే వెక్కిరింతలెందుకూ! 

ఈ పండితుల గోల మనకెంకుగ్గానీ  మామూలు రాజకీయాలు    చూసుకొందాం.  వెనక చూపంటూ లేకుంటే చొక్కామీద వెనకనుంచి ఎవరు ఎప్పుడు ఏ సిరాచుక్క చక్కా విదిలించి పోతారో ఎలా తెలుస్తుంది! ఒలంపిక్సు పరుగుపందేల్లో ఎలాగూ కప్పులు తెచ్చే ఒకప్పటి  గొప్ప ఆటగాళ్ళు    పిటి ఉష.. అశ్వినీ నాచప్పల ఇప్పుడు లేరు.  కనీసం కంచుకప్పులైనా కొట్టుకు రావాలంటే వెనక్కి పరుగెత్తే  పందేలు పెట్టించి వాటిలో మన కుర్రబ్యేచికి తర్ఫీదివ్వాలి.. తప్పదు మరి! పురచ్చితలైవి జయలలిత.. లాంటి నేతలు మనముందుంటే వెనక్కి తిరిగి నడవడం  వీలుండదుగానీ గుళ్లో అయినా   పృష్టభాగం చూపించకుండా ప్రదక్షిణాలు చెయ్యడం కుదరదు గదా!  వెనక నడకంటే ఇంకా పస్తాయింపులెందుకు!

వెనకనడక వల్ల బోలెడన్ని లాభాలుకూడానూ! కవిసమ్మేళనాలప్పుడు  వెనక బెంచీల్లో కూర్చుంటే కవితాగానం జరిగేటప్పుడు  నిశ్శబ్దంగా బైటికి పోవడం సులభమవుతుంది. పెద్దపెద్దవైద్యులు నొక్కి చెప్పే ప్రకారం పీల్చిన గాలిని  వెనక్కి వదిలేయడమంటే వంట్లోని మలినాలను బయటకు తరిమేయడమే! అదే యోగానిపుణులు చేయమని మొత్తుకొనే విలోమ యోగాసనం! పద్మాసనంలో కుదురుకొని  కుడిముక్కు మూసుకో! ఎడం ముక్కుతో  గాలి  పీల్చి వెనక్కి వదిలేయ్! లోపలికి లాక్కోవడమేగానీ బైటకు వదిల్లేని బలహీనత ఇక్కడా ప్రదర్శిస్తే ప్రమాదం! భీష్మాచార్యులవారికి మల్లే అంపశయ్యమీదే ఆఖరి శ్వాస వదిలేయాల్సొస్తుంది!  

 


 

'ముందు మున్సిపాలిటీ అయినా వెనక పర్శనాలిటీ'  చాలామంది సుందరాంగులకి. మనీ పర్శుకూడా వెనకజేబులోనే కదా దోపుకొనేదీ! ఇక మడమ తిప్పకుండా వెనక్కి తిరిగి చూడకుండా బజారులో బేరాలు చేసేది ఎలా? ఆడవాళ్లను చూసైనా ఇంగితం  తెచ్చుకోవాలి! ముందు.. వెనక బేధం ఉండదు సింగారానికి. నీలవేణుల వెనకున్న వాల్జడలు చూసే చాలామంది కవులు  సంపూర్ణంగా మతులు పోగొట్టుకున్నారు! శ్రీరాములవారి సహాయము కావలెను- అని కాదు రాసుకోవాల్సింది.  కనీసం ఇవాళైనా 'నులెవ కాము యహా సరివాలము రాశ్రీ' అని తిరగేసి రాసి చూడండి!  పట్టించుకోకుండా పోయిన భాగ్య సంపదలు  ఠక్కున వెనక్కి  రాకపోతే  అప్పుడు అడగండి!


ఈ వెనక పండుగ రోజున ఏం చేయాలని సందేహమా! ఊహ ఊండాలేగానీ ఆకాశమే హద్దు! చొక్కా తిరగేసి తోడుక్కో! తొక్కతిని అరటి గుజ్జు వదిలేయ్! చెప్పులు కాళ్లు మార్చి వేసుకొని నడువు! కళ్లజోడు నెత్తికి పెట్టుకొని ఊరేగు! సెల్ఫోన్ రింగవంగానే 'బై' అని మొదలెట్టి 'హాయ్'  అని ముగించు! టీవీని వెనకనుంచి విను! 

గాడిదలకు మాత్రం వెనగ్గా పోవద్దు సుమా! లారీల వెనక నిలబడ వద్దు! ఆడపిల్లల వెనక్కూడా పడవద్దు. బివేరాఫ్ ‘షి’ టీమ్స్! ప్యాంటు పైన అండర్ వేర్ అంటే సూపర మేన్ వరకు ‘ఓ. కే’ నే గానీ  ఎంత ‘వెనక్కి తిరిగే దినోత్సవ’మే అయినా కుక్కలకు ఆ విషయాలేవీ తెలీవు కదా! వెనకబడగలవు! శ్రీకారం చివర్లో.. స్వస్తి మొదట్లోనే చెప్పేవరకూ బాగానే ఉంటుంది..కానీ 'శ్రీ సూర్యనారాయణ మేలుకో హరిసూర్యనారాయణ../..గడియెక్కి భానుడు కంబపువ్వు ఛాయ/కంబపువ్వు మీద కాకారీ పూఛాయ' అంటూ నడిరాత్రి మేలుకొలుపులుగానీ లంకించుకున్నావనుకో .. పండగ స్వారస్యం తెలియని పక్కింటి సూర్యనారాయాణ నిజంగానే గడకర్ర పుచ్చుకొని గడపముందుకొచ్చేయచ్చు! 'పసిడి పాదుకలూని పడతి సీత కేలూని/ పవళింప వేంచేయు సమయము స్వామీ!' అంటూ నిద్రపుచ్చే పాటలకు పరగడుపునే తగులుకుంటే ఎదురింటి పవనకుమారుడుగారు  తన మజిల్ పవరు చూపించగలరు! తస్మాత్ జాగ్రత్త! ‘బేక్ వర్డు డే’ కదా అని యోగా చేస్తూ వెనక్కి వంగితే నడుం పట్టేయచ్చు. భద్రం! 

'మరల నిదేల రామాయణం బన్నచో,/ నీ ప్రపంచకమెల్ల నెల్ల వేళ/తినుచున్న అన్నమే తినుచున్నదిన్నాళ్ళు/ తన రుచి బ్రదుకులు తనివి గాన/చేసిన 

అన్నారు మహాకవి విశ్వనాథ సత్యనారాయన గారుకూడా!  విలోమ దినం విశిష్టతేంటో ప్రభుత్వాలక్కూడా తెలిసొచ్చినట్లుంది! ఆదివారమని కూడా చూసుకోకుండా ప్రచారానికొస్తున్నారు పాపం   ఎన్నికల అభ్యర్థులు!. రోటీనుకి భిన్నంగా ‘గ్రేటరు’ వాళ్లూ రోజంతా వాటరిస్తున్నారు. కరెంటిస్తున్నారు. రోజూ తాగి వచ్చి, భార్యను తంతేగాని నిద్రపట్టని తాతారావుకూడా ‘ఈ ‘వెనక్కి తిరిగే దినోత్సవ సంబరాన్ని పురస్కరించుకొని ఎప్పట్లా కాకుండా  రాత్రినిద్ర బైట కానించి.. పొద్దున్నే వచ్చి  తన్నుడు కార్యక్రమం మొదలు పెట్టాడు!

తెలుగు దేశం మళ్లీ  అధికారంలోకి రావాలని అన్నవరంనుంచి తిరుపతి వరకు వెనక నడకన యాత్ర చేసాడొక తమ్ముడు ఈ మధ్యనే! రొటీన్ కి భిన్నంగా మోదీజీ ప్యారిస్ నుంచి తిరిగొస్తూ కాబూల్ లో దిగిపోయారా మధ్య! రొటీన్ కి భిన్నంగా ఎన్నికలప్పుడు పార్టీలే ఓటర్ల చిరునామాలు వెదుక్కొంటూ తిరుగుతున్నాయి! పురస్కారాలు  ఈ వెనక పండక్కి చాలా ముందునుంచే రివర్సులో తిరిగి ఇచ్చే ఉద్యమం మొదలయింది! ఇప్పుడు మళ్లీ అకాడమీ తిరిగి వెనక్కి ప్రదానం చేసే కార్యక్రమంలో ఉంది. ఇప్పటి వరకు భారత్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో విదేశాలకు తరలి వెళుతున్నారా! ఈ సారే వనక్కి తిరిగి వచ్చేస్తున్నారు! 

‘పీచే ముడ్!.. ఆగే బడ్!’ లలో ఏది ఎప్పటికి  శ్రేష్టమో అదే అప్పటికి అనుసరించడం ఉత్తమ రాజకీయవేత్త లక్షణం.  చైనా, జపాన్లు వెనక్కి నడవడాన్ని ఓ కళగా అఅభివృద్ధి చేస్తున్నాయి!

మనమూ కొన్ని రంగాలలో వెనకబడేమీ లేమనుకోండి! ఇక్కడ  రైళ్లు, బస్సులు  నడుస్తుంటాయి. విమానాలు కూడా వి ఐ పి లు పిలిస్తే ‘ఓయ్’ అంటూ చక్రాలు వెనక్కి తిప్పుకుంటాయి!. రూపాయి వెనక్కి నడుస్తుంది. పాపాయి రూపాయిని చూస్తే వెనక్కి నడుస్తుంది.  వెనక తింటున్న కందమూలాలనే మళ్లీ మనం  తింటున్నది.. ఆరోగ్య స్పృహ మరీ పెరిగిపోయి. వెనక ఆదిమయుగం మానవులు కట్టిన పిక్కల్లోకి వచ్చే దుస్తుల్నే మళ్లీ మన ఆడవాళ్ళు ఇవాళ ఆదరిస్తున్నది!  వెనక వాడిన రుబ్బురోళ్ళు.. రోకళ్ళు.. బుడ్డి దీపాలే మళ్లీ ఆరోగ్యదృష్ట్యా మంచివని ఇళ్లల్లో ప్రత్యక్షమవుతున్నాయి.  ముందుకు పోయే వేగం పెరుగుతుందని వెనకబడిన తరగతుల్లో చేర్చమని కొన్ని వర్గాలు ఉద్యమాలుకూడా జోరుగా చేస్తున్న దేశం మనది. ఐదేళ్లకోసారి ‘మమ’ అనిపించే ఎన్నికల్లో  మనం ఓట్లేసి గెలిపించే  ప్రజాప్రతినిధి ముందుచూపుతో నాలుగురాళ్లు వెనకేసుకొంటున్నాడే అనుకోండి! అతగాడిని  మళ్లీ వెనక్కి పిలిపించేందుకు అవకాశం ఉందా మన ప్రజాస్వామిక పాలనావిధానంలో!  ప్రగతి పథంలొ ముందుకు దూసుకుపోయే ప్రజాస్వామ్య వ్యవస్థకైనా సరే వెనక చూపు అందుకే తప్పనిసరి అనేది!


!గో బ్యాక్!’ అని వూరికే నినాదాలు చేస్తే ఏమొస్తుంది! సమయం సందర్భం చూసుకొని వెనక్కి నడిచినప్పుడే ముందుకు పోయే అవకాశం చేజిక్కించుకొనేది!

ఈ క్షణంనుంచే వెనక్కి నడవడం ఆరంభిద్దాం!

పదండి వెనక్కు!.. సారీ.. క్కునవె డిందప!

***

- కర్లపాలెం హనుమంతరావు 

01 - 03-2021 

 

 


 


దుర్భాషా సాహిత్య ప్రయోజనం - సరదా కథ - కర్లపాలెం హనుమంతరావు




ఉండేలు సుబ్బారెడ్డికి గుండెల్లో కలుక్కుమంది. లేచెళ్ళి కాసిని మంచినీళ్ళు తాగొచ్చి మళ్లీ పనిలో పడ్డాడు. ఐదు నిమిషాలు గడిచాయి. మళ్ళీ గుండెల్లో కలుక్కు! ఈ సారి కాస్త ఎక్కువగా! నొప్పికూడా  పెరుగుతున్నట్లు అనిపిస్తోంది.   కడుపు ఖాళీగా ఉన్నా గ్యాస్ ఎగదన్ని గుండెల్లో పట్టేసినట్లుంటుందని ఎక్కడో విన్నాడు. ఫ్రిజ్ లోనుంచి ఓ అరటిపండు తీసాడు. సగం పండుకూడా తినలేదు..  వళ్లంతా ఒహటే చెమటలు! కళ్ళు బైర్లు కమ్ముతున్నట్లనిపించి  మంచంమీద కూలబడ్డాడు.

గుండెల్లో నొప్పి  తెరలు తెరలుగా వస్తూనే ఉంది.

‘హార్ట్ ఎటాక్?!’ అనుమానంతో  గుండె కొట్టుకొనే వేగం  మరింత హెచ్చింది.

ఇప్పుడేం చేయడం?

సమయానికి ఇంటి దగ్గరా ఎవరూ లేరు. అందర్నీ తానే ఊరికి తరిమేశాడు. ఏదో  పత్రిక్కి పోటీకని నవలేదో రాస్తున్నాడు. గడువు దగ్గర పడుతోంది.. ఇంట్లో పెళ్ళాం.. చంటి పిల్లలిద్దరూ చేసే అల్లరితో.. మూడ్ స్థిరంగా ఉండటం లేదని.. బలవంతాన భార్యని పుట్టింటికి పంపించాడు.. వారం రోజుల తరువాత తిరిగి తనే   తీసుకు వస్తానని వాగ్దానం చేసి మరీ. ఇప్పుడిలా అవుతుందని కల కన్నాడా? ఇంతకు ముందెప్పుడైనా ఇలా జరిగుంటే తగిన  జాగ్రత్తల్లో ఉండేవాడే కదా!

కిం కర్తవ్యం? యమకింకరులొచ్చి పడే ముందే..  వైద్యనారాయణాస్త్రం అడ్డమేసెయ్యాలి. డాక్టర్ల నెంబర్లకోసం వెదికితే.. ముగ్గురు ఆపద్భాందవుల ఫోన్ నెంబర్లు దొరికాయి. డాక్టర్ గోవిందు. డాక్టర్ బండ కోదండం. డాక్టర్ దూర్వాసిని.

డాక్టర్ గోవిందు నెంబర్ కి రింగ్ చేసాడు ముందు.

గోవిందో  గోవింద!.. గోవిందో గోవింద!' అంటూ రింగ్ టోన్ అదే పనిగా మోగుతోంది.  అయినా   ఉలుకూ ఉప్పురాయీ లేదు అవతలి వైపునుంచి.  సెల్ కట్ చేద్దామనుకొనే లోపు ‘గుర్.. గుర్’ మంటూ గొంతు వినిపించింది.

హలో!.. ఎవరూ?'

డాక్టర్గారూ!.. అర్జంటర్జంట్సార్!.. గ్గుండెల్లో... న్నొప్పిగా..వ్వుంది.. చ్చా..ల్సే.. ప్ప..ట్నుంచీ'

అవతలి వైపునుంచి బిగ్గరగా నవ్వు! 'సారీ సార్! అందర్లాగా మీరూ నన్ను వైద్యం చేసే డాక్టరనుకున్నారా?'

'కాదా?'

కాదండీ బాబూ! మంది పంగనామం విశ్వవిద్యాలయం నుంచి వచ్చి పడ్డ డాక్టరేట్  ‘బెల్లం సాగుతో అధికాదాయం సాధించే నవీన విధానాలు’ అనే అంశంమీద   పరిశోధన చేసినందుకు..’  సుబ్బారెడ్డి ఫోన్ ఠక్కుమని కట్ చేసేసాడు. ‘ఇప్పుడా సోదంతా వినేందుకు టైమెక్కడేడ్చిందీ?’

రెండో నెంబరుకి డయల్ చేసాడీసారి. అదృష్టం.. నెంబర్ వెంటనే కలసింది.

యస్ ప్లీజ్! ఎవరూ? ఏం కావాలి?'

ఉండేలు సుబ్బారెడ్డి ఉన్న పరిస్థితినంతా గుండెలవిసి పోయేలా  వివరించాడు. ఆసాంతం  తాపీగా విని.. ఓ సుదీర్ఘ ఉఛ్ఛ్వాసం  తీసుకొని మరీ 'సారీ! మిత్రమా! వైద్యం.. వంకాయ.. మన లైను కాదు. నా డాక్టర్ పట్టా సాహిత్యానికి సంబంధించింది బ్రో! ‘ప్రాచీనకాలంలో జంతువుల జీవన  విధానాలు.. ప్రబంధ సాహిత్యంలో వాటి ప్రధాన  పాత్ర' అనే అంశంమీద కుంభకోణం విద్యాపీథం వారిచ్చిన స్నాతకొత్సవానంతర  పట్టా! ‘బండ కోదండం’ అన్న పేరు విన్న తరువాతైనా మీకు నా గురించి  అర్థం కాకపోవడం విఛారకరం..' ఉండేలు  సుబ్బారెడ్డికీ సారి పెద్ద బండరాయితో బాదేసినట్లు  గుండెలు కలుక్కుమన్నాయి.  ఫోన్ కట్ చేసేసాడు.

'మిగిలిందిక డాక్టర్ దూర్వాసిని.  సమయం చూస్తే అర్థరాత్రి దాటి అర్థ గంటయింది. న్యూసెన్సు కేసనుకొని న్యూసెన్సు చేసేస్తే!  సంకోచిస్తూనే నెంబర్ రింగ్ చేసాడు  సుబ్బారెడ్డి మార్గాంతరం లేక.

చాలాసేపు చడీ చప్పుడు  లేదు.. ఊరికే రింగవడం తప్పించి! అదే పనిగా ప్రయత్నించిన మీదట  అవతలవైపునుంచి రెస్పాన్స్ వచ్చిం దీసారి! ఎత్తుకోవడం ఎత్తుకోవడమే సూరేకాంతం గొంతులో సూరేకారం పోసినంత రౌద్రం! సుబ్బారెడ్డి గుండె దుస్థితి వివరణ నివేదిక   సమర్పించడం సగం కూడా కాలేదు అవతలి వైపు  శాల్తీ కాళికా దేవి అవతారమే ఎత్తేసింది.

'ఎవర్రా నువ్వు? నీకు అసలు బుద్ధుందిట్రా? ఇంతర్థ రాత్రి పూటా వెధవా..  కాల్  చేసేది?  కాలూ చెయ్యీ తీసేయిస్తానొరేయ్! ఇవతలున్నది ఓన్లీ లేడీసనుకోకు? ఎక్కడ్రా నీ ఇంటడ్రస్సు? ఏవిఁట్రా నీ ఒరిజినల్ ప్లాటు? నువ్వవసలు పేషెంటేవన్న గ్యారంటీ ఏంటి? నిజంగా నీది గుండె నొప్పేనని రుజువేంటి? నొప్పుంటే మాత్రం నువ్ కాల్ చేసుకోవాల్సింది ఏ ఆసుపత్రికో.. అంబులెన్సుకో!  నేరుగా ఇలా  ఇళ్ళమీదకొచ్చి పడతారట్రా స్కౌండ్రల్స్?  పెట్టేయ్ ఫోన్! మళ్లీ నా సెల్ రింగయిందా నీకు పోలీస్ స్టేషన్  సెల్లే గతి! నీ కొంపకు పోలీసుల్ని పంపిస్తా.. బీ కేర్ ఫుల్!' ఠక్కుమని ఫోన్ కట్టయి పోయింది.

సుబ్బారెడ్డిట్లా  నేరుగా డాక్టర్లనే తగులుకోడానికి కారణం లేకపోలేదు. రాతకోసం  ప్రశాంతత కావాలని వేధిస్తుంటే  ఫ్రెండువెధవ తననీ అడ్రసు తెలీని  అజ్ఞాతంలో వదిలేసి పోయాడు రాత్రి.  మళ్లీ తెల్లారి వాడొస్తేగానీ.. తానున్నది ఎక్కడో.. చిరునామా ఏంటో  తెల్సిచ్చావదు! ఈ బిల్డింగుకి పేరుకో వాచ్ మెన్ ఉన్నా.. అతగాడెక్కడో ఫుల్లుగా  మందుగొట్టి  గొడ్డులా పడున్నాడు.  తనదగ్గర సమయానికే  ఆసుపత్రుల నెంబర్లూ  ఉంచుకోలేదు. ఇప్పటిదాకా ఇట్లాంటి అవసరమేదీ  పడక.

ఉన్న  మూడు నెంబర్లూ  బెడిసి కొట్టేసాయి. ఇప్పుడేం గతి?!

పాలుపోవడం లేదు సుబ్బారెడ్డికి. అంతకంతకూ గుండెల్లో నొప్పి ఎక్కువై పోతోంది. చెమటలూ ధారగా కారి పోతున్నాయి. అక్కడికీ    నొప్పినుంచి దృష్టి మళ్ళించుకోడానికి సెల్ ఫోన్లోని   న్యూస్ చానెలేదో ఆన్ చేసాడు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నిలబడ్డ ట్రంప్.. హిల్లరీల ప్రచారానికి సంబంధించిన వార్తలేవో ధారాపాతంగా వచ్చి పడ్తున్నాయి.  ట్రంపు మహాశయుడు హిల్లరీమ్యాడమ్మీద పడి  అడ్డమైన కారు కూతలూ అడ్డూ ఆపూ లేకుండా కూసేస్తున్నాడు! అదే స్థాయిలో హిల్లరీ అమ్మగారి భాషా ప్రయోగాలు కూడా!

మామూలు సమయాల్లో అయితే మనిషన్నవాడికి రాజకీయాలమీద విరక్తి పుట్టించే దుర్భాషలవన్నీ. కానీ.. కష్టాల్లో ఉన్న సుబ్బారెడ్డికిమాత్రం హఠాత్తుగా  తారక మంత్రం దొరికినట్లయింది.  మెరుపులాంటి ఆలోచనలతో అతగాడు  సెల్ ఫోన్ అందుకున్నాడుమళ్లీ డాక్టర్ దూర్వాసిని  బెడ్ రూంలోని  సెల్ మొరుగుడు మొదలు పెట్టింది అదే పనిగా.  ఎన్ని సార్లు నోరుమూసేసినా   మళ్లీ మళ్లీ మొరుగుతుండటంతో  దూర్వాసనమ్మగారి పక్కనే పక్కలో గుర్రుకొడుతున్న  మొగుడుగారు గయ్యిమని లేచారు మేడమ్గారిమీద 'మీ ఆసుపత్రినుంచీ యమర్జెన్సీ కాలేమో! అటెండవక పోతే ఎట్లా?  ఆనక సమస్యలొచ్చి పడతే సర్ధిపెట్టలేక చచ్చేది నేనే. ముందా ఫోన్ చూడు!' అంటూ.  


భర్త హెచ్చరించరికలతో ఇహ తప్పదన్నట్లు చిరాగ్గా లేచి   సెల్  అందుకొంది డాక్టర్ దూర్వాసనమ్మ.


 …


సూపర్ స్పెషాలిటీ  ఆసుపత్రిలో ఆఖరి నిమిషంలో జరిగిన అర్జంటు చికిత్సతో ఉండేలు సుబ్బారెడ్డి యమగండంనుండి బైటపడ్డాడు  చివరికి ఎట్లాగైతేనేం!


పోలీసులు సమయానికి వచ్చి  కలగచేసుకోక పోయుంటే కాబోయే ప్రముఖ రచయిత   సుబ్బారెడ్డి  ఈ పాటికి పై లోకాల్లో కూర్చుని ప్రశాంతంగా   నవల పూర్తి చేసుకునే పనిలో ఉండేవాడు. డాక్టర్ దూర్వాసిని ఇచ్చిన అర్థరాత్రి 'న్యూసెన్ కాల్' ఫిర్యాదుని  'షి'  టీం సీరియస్ గా తీసుకోబట్టి గుండెనొప్పితో లుంగలు  చుట్టుకుపోయే  సుబ్బారెడ్డిని 'సగం  నిర్మాణంలో ఉన్న ఊరిబైటి భవంతిలో గాలించి మరీ పట్టుకొన్నారు పోలీసులు.   అత్యవసర ఆరోగ్య పరిస్థితిని గుర్తించి.. అప్పటికప్పుడు ఆగమేఘాలమీద పోలీసులే  దగ్గర్లో ఉన్న పెద్దాసుపత్రిలో చేర్పించడం వల్ల సుబ్బారెడ్డి కథ సుఖాంతమైంది.

అసలు విషయం అర్థం చేసుకున్న డాక్టర్ దూర్వాసిని సైతం న్యూసెన్సు కేసులో మరింక ముందుకు పోదల్చుకోలేదు.

వాస్తవానకి మనం మెచ్చుకోవాల్సిందిక్కడ సుబ్బారెడ్డిని.. అతగాడి సమయస్ఫూర్తినా? అతగాడు అట్లా అర్థరాత్రి ఒక ఆడకూతుర్ని వేధించేందుకు సరిపడా దుర్భాషా సాహిత్యాన్ని సృష్టిస్తోన్న నేతా గణాన్నా?

రాజకీయాల్లో నీతి.. మర్యాదలు అంతరించిపోతున్నాయని వూరికే  దురపిల్లే  ఆదర్శవాదులు.. దుర్భాషా సాహిత్య ప్రయోజనాన్నికూడా గుర్తించాల్సి అవసరం ఉందన్నదే ఈ కథ నీతి!

-కర్లపాలెం హనుమంతరావు


(తెలుగిల్లు- అంతర్జాల పత్రిక ప్రచురితం)


Thursday, October 7, 2021

అనువాద కవిత: అనేకుల కది! - రవీంద్రనాథ్ ఠాగోర్-తెనుగు సేత : శ్రీ విద్వాన్ విశ్వం సేకరణ : కర్లపాలెం హనుమంతరావు

 


క్రొవ్విరులను గూర్చిన 

నీ మువ్వపు  మాలికను

కంఠమందు వైతువా 

పువ్వుంబోణీ!    అయినచో  


క్రొవ్విరులను గూర్చిన 

నీ మువ్వపు  మాలికను

కంఠమందు వైతువా 

పువ్వుంబోణీ!    అయినచో 

ని వ్విరి సరమునకు 

బదులు నే నేమిత్తున్ ? 


నే గట్టిన తో మాలను 

నీ కొక్కర్తుక కె 

యొసగ నెట్లు పొసగు? 

నో రాకా  హిమకర వదన! 

అనేకుల కిది

వారి నెల్ల నెటు వర్జింతున్ ? 


ఉన్నారు భావుకులు : 

మన కన్నుల కగపడని 

చోట్ల గలవారెవరో 

ఉన్నారు; కవుల పాట 

సన్నిహితులు ఉన్నవారు 

చాలమందియె

ఇందరికై ఈ మాలిక 

నందమ్ములు జిలుక కట్టినాడ

గావునన్‌; 

కుందరసమదన ! 

నీకే చెందించుట 

నెట్లు పడును? 

చెప్పుము నీవే. 


నీ యడదకు   

నా  యడద నుపాయనముగ 

నడుగు  సమయ మది 

గతియించెన్; 

తోయజ నయనా 

ఎపుడో పోయిన దా   

కాలమెల్ల  గతియించెన్ 

పూర్వగాథయై.


పరిమళమంతయు 

లోపలి యరలోనె 

దాచు కొన్నయట్టి

మొగ్గతో సరియై , 

నా జీవిత - 

మొక పరియై యుండెను-  

పోయె నట్టి ప్రాప్తము 

పడతీ!  


ఉండిన తావిని 

దిక్కుల నిండా 

వెదజల్లి వేసి

నే  నుంటిని; 

ఏ పండితు డెరుగును 

పోయినదండి వలపు 

మరల చేర్చి, దాచు 

మంత్రమున్ . 

సారస నయనా 

నీ హృన్నీ రేజాతమ్ము 

నొకరి నెయ్యమునుకే

ధారాదత్తము సేయగ నేర! 

ననేకులకు 

దాని నియ్యగ వలయున్ . 

- బెంగాలీ - రవీంద్రుడు 

సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

07 - 10 - 2021 

బోథెల్ ; యూ. ఎస్. ఎ

Friday, October 1, 2021

పచ్చ నాకుల రాణి వాసపు కవిత కృష్ణశాస్త్రిది - కర్లపాలెం హనుమంతరావు



కృష్ణశాస్త్రి కవిత్వం పై శ్రీ శ్రీ స్పందన - 'ఆస్వాదానికి ఆహ్వనం' శీర్షికతో ' అమృత వీణ'  ముందుపుటల్లో కనిపిస్తుంది.

సముద్రం ఎక్కడ ఉందో తెలీదు. కాని కృష్ణశాస్త్రి సృజించిన ఇక్షురస సముద్రం మాత్రం పురాణాల్లో వర్ణితమయిన క్షీరసాగరానికి వెదుకులాడే అగత్యాన్ని తప్పించింది- అంటాడు అందులో శ్రీ శ్రీ . నిజమా? చూద్దాం!

'వేయ బోవని తలుపు తీయమని పిలుపు /

రాధ కెందుకొ నవ్వు గొలుపు /

నీలోన నాలోన నిదురపోయే వలపు /

మేలుకుంటే లేదు  తలుపు'

 ఇది కృష్ణశాస్త్రి 'కృష్ణాష్టమి' కవితా ఖండికలోని కొన్ని  పంక్తులు. ఖండిక మొత్తం చదివితే శ్రీ శ్రీ ఒలకపోసిన అతిశయోలంకారంలో అతిశయం ఆవగింజంతయినా లేదనే అనిపిస్తుంది. 

 కృష్ణశాస్త్రి కవిత్వంలో  కనిపించే రసం మధురంగా ఉంటుందనేది  సర్వే సర్వత్రా వెల్లడయ్యే భావనే. కాని శ్రీ శ్రీ మరో మెట్టు పైకెళ్లి   మాధుర్యం అంటేనే  అసలు  నిర్వచనం  అనిర్వచనీయమైన   కృష్ణశాస్త్రి కవిత్వం'  అనే భావన వెల్లడిస్తాడు.

'అంతరాంతము నీ అమృత వీణే యైన /

మాట కీర్తన మౌను! /

ఈ అనంత పథాన  /

ఏ చోటి కా చోటు నీ ఆలయ్యమ్మగును, నీ ఓలగ మ్మౌను '

 'అమృత వీణ' ఆలపించే ఈ పంచమరాగం కర్ణపుటాలకంత కమ్మని  విందు చేస్తుంటే అవకాశం లభించినప్పుడు  ఎవరిమైనా శ్రీ శ్రీ మాటకు  వంత పాడక ఉండగలమా! 

'తినగ తినగ వేము తియ్యగ నుండు'. కాని, ఇక్షురసానికి ఆ స్వాదు గుణం లేదు. అదే పనిగా సేవించడానికి పూనుకుంటే రెండు లోటాల పరిమితి దాటితే చెరుకు రసపు తీపైనా వెగటనిపిస్తుంది. కృష్ణశాస్త్రి తన ఇక్షురస కవిత్వానికి ఆ అతిపాన దోషం అంటకూడదు అనుకున్నాడేమో! మిరియాల పొడివంటి ఘాటు ప్రయోగాలు, కరక్కాయల కటువు  తలపించే భాషా ప్రయోగాలు అక్కడా ఇక్కడా చేసి మరీ మహాకవి మాట నిలబెట్టాడు.

'పూజ కంటే వస్తిని, ఏ/

మోజు లేని 'చిన్నవిరిని' /

ప్రభువు కొలువున దాసిని శ్రీ/

పదములకు 'తివాసిని'

'పూల జాతర' అనే కృష్ణశాస్త్రి మధుర పాతరలో  ఇక్కడ కోట్స్ రూపంలో కనిపించే పదప్రయోగాలు, భాషలో .. భావంలో  ఘాటుగానో, కటువుగానో  ఉండటం గమనించాలి. కాకపోతే శాస్త్రిగారి  కలం, గళం నుండి ఎన్నడో గాని ఈ మాదిరి వగరు కాయల వరుసలు కురిసింది లేదు. అదృష్టం. చందమామకైనా చిన్న మచ్చ ఉంటేనే కదా అందం చందం! 

శ్రీ శ్రీ మరో చోట అంటాడూ .. 19వ శతాబ్ది తొలి దశాబ్ది వరకు జిమీందారీ వ్యవస్థకు మాత్రమే ' గొడ్డు'  చాకిరీ   చేసిన  తెలుగు కవిత, కృష్ణశాస్త్రి  పూర్వీకులు రాయప్రోలు, అబ్బూరి వంటి అభ్యుదయ కవుల రాకతో  బంధ విముక్త అయింది. అనంతరం కృష్ణశాస్త్రి తరం నుంచి భావకవిత్వం పేరు మీద యువతరాన్ని ఉర్రూతలూగించిందని. ఏ రసపట్టు కనికట్టు లేకపోతే ఎంత నూత్నమైనదైనా అటు బళ్లారి  నుంచి ఇటు బరంపురం వరకు భావకవిత ఊరికే ఊరేగగలుగుతుందా ?

'ఎడబాసి పోకోయి /

 నీ దాసి నీ రేయి /

ఈ ఎదకు నిముసమే/

నెడబాటు విసమే ' అంటూ ఆ 'జులపాల జుట్టు కట్టుతో సహా భావికవికి ఓ ఆహార్యమంటూ గళసీమకు వేళాడు హార్మోనియంతో తన కంటూ  'ట్రెండు' నొకటి సృష్టించుకోగలడు కృష్ణశాస్త్రి! భావకవిగా కవిలోకాన్ని ప్రభావితం చేసిన  అతగాని ప్రతిభా పాటవాలకు జతకాని  మధుర స్వారస్య సారస్వత వచనాలు   మచ్చుకకు మాత్రమే ఎక్కడో ఒకటీ.. అరా .. అక్కడా.. ఇక్కడా!ఈనాటికీ చెక్కుచెదరని  కృష్ణపక్షం  ఒక్కటి  చాలు భావకవి వైతాళికునిగా కృష్ణశాస్త్రి సాధించిన అర్హతలన్నిటి పైనా ఆమోదా ఆముద్ర ప్రమోదపూర్వకంగా పడేటందుకు.

కాకపోతే ప్రతిభావంతులైన ఏ వైతాళికగణ విజయ యాత్రలకయినా ఆదిలో హంసపాదులా ఆరంభంలో ఆటంకాలు తప్పవు. ఆ రివాజు తప్పకూడదని కాబోలు, ఆ కాలం నాటి మహాపండితుడొకాయన  అక్కిరాజు ఉమాకాన్తమ్ కేవలం కృష్ణశాస్త్రిని వెక్కిరించటానికేనా అన్నట్లు 'నేటి కాలపు కవిత్వం' పేరున ఓ దిక్కుమాలిన గ్రంథం వెలువరించింది.   తెలుగు ఉమాకాంతాన్ని సంస్కృత ఉమాకాన్తంగా చెప్పుకునే ఆ పండితుడికి సంస్కృతంలో తప్పించి  మరెక్కడా కవిత్వం కనిపించని హ్రస్వదృష్టి కద్దు. నన్నయను సైతం కవుల పద్దు నుంచి కొట్టిపారవేయగల సమర్థుల  వక్రదృష్టికి సమకాలీన కవికోకిల కాకిలా అనిపించక మానుతుందా? 

'పలుక లేను పలుక లేను /

భయము సిగ్గు వొడము దేవ ! /

అలయని దయ నా యందే నిలిపి వదలవోయి దేవ! /

మలిన  మలిన బ్రతు కిది; పలుక లేను నీ నామము' వంటి చిలుక స్వరాలతో రాసి పాడినా నాటి  బ్రహ్మసమాజ ఉద్యమానికి ఊతమిచ్చే వందలాది రసగుళిక పద్యాలు ఎంత హృద్యమయితేనేమి, మడి కట్టుకున్న బధిరాంధ పండితుల చెవులకు దిబ్బెళ్లు  అనిపించవా? 

యువ కవి లోకమంతా ఉత్తమమైనదంటూ సంభావించిన వృక్షరాజపు కొత్త శాఖ భావకవిత. ఆ కొమ్మ నుంచి మొలకెత్తిన మరో కొత్త చివురు చూసి మండిపడే నైజముండే ఏ పండితలోకమైన చిర్రుబుర్రులాడక తప్పదు.వేదుల సత్యనారాయణ వంటి ఎన్నో కవి కోకిలలకు ఆశ్రయమిచ్చిన ఆ నూతన తరుశాఖ మీదనే మొగ్గ పూవైన చందంగా  భావకవి కృష్ణశాస్త్రి అందాల భావలోకం కనులు విప్పార్చింది .  కాబట్టే  'పచ్చ నాకుల రాణి  వాసపు /

పడతినే, సంపెంగనే / 

సరసులను, సామంతులను /

నా స్వాదు  వాసనా పిలుచునే '( పూల జాతర) అని  ఎలుగెత్తి పాడినా  చెల్లించుకోగలిగింది. రస పిపాసువుల హృదయాలకు  అదే కొత్త రాగాల  విందయింది.

'నేటి కాలపు కవిత్వ౦' పుస్తకానికి  కొనసాగింపుగా అనంతపంతుల రంగస్వామి  అనే మరో వెకిలి కవీ 'కృష్ణపక్షం'  పూర్వపక్షంగా 'శుక్లపక్షం' అనే మరో వెక్కిరింత పద్యకావ్యం వెలయించాడు. ఆ రోజుల్లోనే వేదుల  వంటి ఉద్దండ భావకవులు 'సారస్వతారిష్టం అనే శుక్ల నష్టం' గా ఛీత్కరించిన 'శుక్లపక్షం' ఉమాకాన్తమ్ గారి కావ్యం పక్కనే బూజుగూటిలో మగ్గిపోయింది.

'నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?/

నా యిచ్ఛయే గాక నా కేటి వెరపు?/

కలవిహంగమ పక్షముల దేలియాడి/

తారకా మణులలో తారనై మెరసి/ 

మాయ మయ్యెదను నా మధురగానమున!' అన్న కృష్ణశాస్త్రి మాటే  అతని భావకవిత సాధికారతను  అచ్చంగా నిజం చేసింది.   

నాటికే కాదు నేటికీ శాస్త్రిగారి భావకవిత్వపు బాణి తెలుగు సాహితీ రాణి పాదాల పారాణి అనడంలో  అందుకే అతిశయోక్తి రవ్వంతైనా లేదు అనేది!

-కర్లపాలెం హనుమంతరావు

01 - 10-2021

బోథెల్ ; యూ ఎస్.ఎ

ఆంధ్ర శిల్ప కళ - కర్లపాలెం హనుమంతరావు

 


రాళ్ళలో చెక్కినవి, రంగులతో పూసినవి రూపకళ కిందకొస్తాయి,

ఆంధ్రుల రూపకళ ప్రపంచ వ్యాపితం; విశ్వరూపకళతో ప్రభావితమైన భారతీయ రూపకళ ద్వారా  ప్రకటితమవుతుంది కనుక.


మనషి రూపాలను కల్పన చేసే గుహకళకు సుమారు 30 వేల సంవత్సరాల చరిత్ర ఉంటుందంటారు! మధ్యప్రదేశ్ హోషంహాబాద్ గుహకళ ఈ ఊహకు కారణం. అక్కడి రూపకళ స్పెయిన్ దేశపు గుహచిత్రాల ప్రభావితం.


చూసే దానికి నకలు తయారుచేసే తపన మనిషికుండే  స్వాభావిక లక్షణం. ఆ లక్షణం నుంచి పుట్టుకొచ్చిందే రూపకళ. 


ఆదిమానవుడుకి జంతువుల కొవ్వు, రక్తం గోడరాతలకు ఊతంగా ఉపయోగించాయి. ఒక జంతువు రూపం కల్పించి దానిలో బల్లెం గుచ్చినట్లు చిత్రిస్తే అడవిలోని ఆ తరహా జంతువు సులభంగా చస్తుందనే సంకేతం ఇచ్చినట్లన్నమాట.


ఒక ప్రయోజనం కోసం ప్రారంభమైన చిత్రకళ క్రమంగా సౌందర్యకళగా మారిన క్రమం అర్థమయితే అబ్బురమనిపిస్తుంది. కాని, మొహంజొదారో నాగరికతకు ముందున్న ఈ చిత్రకళ క్రమపరిణామానికి చెందిన చారిత్రక ఆధారాలేవీ ఇప్పటి దాకా లభ్యమయ్యాయి కాదు. 


ఆర్యులకు సభ్యత మినహా మరేమీ తెలియని మొహంజొదారో నాగరికత ముందు కాలానికే ద్రవిడులలోని సభ్యత చాల ఉన్నత స్థితి అందుకున్నట్లు చరిత్ర చెబుతున్నది. కాకపోతే ఆంధ్రులు ఆర్యులా, ద్రవిడులా అన్నది ఒక ప్రశ్న. రెండు తెగల సమ్మిశ్రితం అన్న వాదనలోనే నిజం పాలు ఎక్కువ.


ఆంధ్రులుగా భావింపబడిన శాతవాహనులు క్రీ.పూ ఒకటి, రెండు శతాబ్దాల నుండి క్రీ.శ ఒకటి రెండు శతాబ్దాల దాకా భారతదేశాన్ని పరిపాలించారు. వారి పాలన కేవలం ఆంధ్రభూమి వరకే పరిమితం కాదు. మగధ వరకు విస్తరించి ఉంది.


అజంతా గుహలలోని మొట్టమొదటి గుహ ఆంధ్రుల సృష్టే. అట్లాగే సాంచీ స్తూప ప్రాకార నిర్మాణం కూడా. అక్కడి ఆ గుహకళ ఒక దృశ్య సంగీతం. తెలుగు శిల్పుల పోగారింపుపని ప్రతిభ విమర్శకుల వేనోళ్ల పొగడ్తలకు పాత్రమయింది.


శిల్పికి చిత్రకళ ప్రావీణ్యం అవసరం. చిత్రకళకు నాట్యకళ నేర్పరితనం, నాట్యకళకు సంగీత జ్ఞాన నిష్ణాణత, సంగీత జ్ఞానానికి సాహిత్య మర్మం అవసరం. వెరసి శిల్పి కాదల్చుకున్న వ్యక్తి బహుముఖ ప్రజ్ఞ అలవరుచుకోవలసి ఉంది.

 

ఇక్ష్వాకుల కాలంలో నాగార్జున కొండ వెలసింది. ఆ కొండ నిర్మాణంలో ఆంధ్ర శిల్పులదే సింహభాగం. కొందరు అనుకున్నట్లు నాగార్జునుడు ఆంధ్రుడు కాదు. ఇక్కడి విశ్వవిద్యాలయంలో ఆచార్యకత్వం నిర్వహించేందుకు విచ్చేసిన బీరారు ప్రాంతీయుడు.


ఇక్ష్వాకులకు అసలు చిత్రకళ ప్రవేశమే లేదు. వీరి తదనంతరం వచ్చిన పల్లవుల చలవే రూపకళ వికాస దర్శనం. ఆంధ్ర శిల్పుల కళ్లు ఒక్క ప్రాంతానికి పరిమితం కాదనడానికి పల్లవులు నిర్మించిన మహాబలిపురమే ఒక ఉత్కృష్ట ఉదాహరణ. తమ పరిసరాలను, పశుపక్ష్యాదులను శిలలపై చిత్రించిన ఆంధ్రుల శిల్పకళ అపూర్వం.


తదనంతరం వృద్ధిలోకి వచ్చిన ఆదర్శవాదం కాకుండా మహాబలిపుర శిల్పకళలో వాస్తవిక వాదం చోటుచేసుకోవడం విశేషం. ఆంధ్ర శిల్పుల వాస్తవిక వాద చిత్రకళ ఒక్క అజంతా కుడ్య చిత్రాల మీదనే కాకుండా పుదుక్కోట సంస్థాన పితన్న దేవాలయం గోడల మీది బొమ్మలు మీదా కనిపిస్తుంది. కాకపోతే ప్రపంచం దృష్టిని విశేషంగా ఆకర్షించింది మాత్రం అజంతా కుడ్య చిత్రకళ.


స్నాయుపుష్టి(శరీర ఆంతరంగిక నిర్మాణం), దేహయష్టి రెండూ పుష్కలంగా ఉండే గ్రీకో-గాంధార కళ కొట్టొచ్చినట్లు కనిపించే ఈ గుహకళ వాస్తవానికి ఆంధ్రులది కాదు. గ్రీక్ దేశం వెళ్లి మనవాళ్లే నేర్చుకున్నారో, మనవాళ్ల దగ్గరకొచ్చి గ్రీకులే నేర్పారో.. ఆధారాలు దొరకలేదు ఇప్పటి వరకు.

 

కళింగగాంగుల కాలంలో స్థూపకళ విస్తృతంగ వర్ధిల్లింది. వీరి జమానాలో నిర్మితమయిన కోణార్క దేవాలయంలో కూడా ఆంధ్ర శిల్పుల ఉలి చప్పుళ్లే ఎక్కువ. పల్నాడులో కనిపించే గోలిశిల్పం నాగార్జునకొండ, అమరావతి శిల్పాలకు తోబుట్టువు. ఈ విలువైన శిల్పాలన్ని ఇప్పుడు విదేశీయుల అధీనంలో ఉన్నాయి. స్వాతంత్ర్య సంపాదన కాలంలో బ్రిటిష్ దొరలతో   విస్తృతమైన ఒడంబడికలు జరిగాయి. కాని వేటిలోనూ విలువైన మన శిల్పాలు తిరిగి ఇచ్చే విషయం ప్రస్తావనకైనా రాలేదు.  విచారకరం.

 

భారతీయ చిత్రకళకు జహంగీర్, షాజహాన్ పాలనా కాలం స్వర్ణయుగం. షాజహాన్ ప్రత్యేకంగా శిల్పులను రావించి పరిసరాలలోని వస్తువులను  చిత్రించే వాస్తవిక వాదాన్ని ప్రోత్సహించాడు.


చిత్రించే క్రమంలో కన్ను వస్తువును చూపే క్రమాన్ని యథాతథంగా చిత్రించడమే వాస్తవిక వాదం. పెద్ద కొండ అయినా దూరం నుంచి చిన్నదిగాను, చిన్న పూలమొక్క అయినా దగ్గర నుంచి పెద్దదిగాను కనిపిస్తుంది. మన చిత్రకారులు ఈ దృష్టి క్రమాన్ని పట్టించుకోకుండా పెద్ద కొండను ఎప్పుడూ పెద్ద పరిణామంలోనూ, చిన్ని మొక్కనూ అట్లాగే చిన్ని పరిణామంలోనూ చిత్రించే కళకు ప్రాధాన్యమిస్తారు. కాబట్టి, భారతీయ చిత్రకారులకు దృష్టి క్రమం (పెర్ స్పెక్టివ్) తెలియదనే వాదు ఒకటి ఉంది. ఇది పడమటి దేశాలలో అనుసరించే యథార్థవాదానికి విభిన్నమైన ఆథ్యాత్మిక వాదం. పునరుజ్జీవ యుగానికి ముందు పశ్చిమ దేశాలలో కూడా తమ చిత్రాలలో మూడ తలాలు కాకుండా ఒకే తలం చూపించేవారు.


మన దేశంలో కొంతకాలం చిత్రకళ్ల పూర్తిగా స్థంభించిపోయింది. ఆంధ్రుల కళా అందుకు మినహాయింపు కాదు. స్వాతంత్ర్య ఉద్యమంతో పాటు చిత్రకళలో కూడా ఒక ఉద్యమం అలలాగా ఎగిసిపడటంతో తిరిగి ఆంధ్రుల కళకు జీవమొచ్చింది. 


ఆంధ్రదేశంలో మూడు ప్రధాన శాఖలున్నాయి; రెండు బెంగాలీ శాఖలు, ఒకటి బొంబాయి శాఖ. అడవి బాపిరాజు వంటివారిది ఒక శాఖ, శ్రీ దేవీ ప్రసాదరాయ్ వంటివారిది రెండో శాఖ. ప్రసిద్ధ చిత్రకారుడు దామెర్ల రామారావు వద్ద విద్య నభ్యసించిన శిష్యపరంపర ప్రవేశపెట్టిన  బొంబాయ్ శాఖ మూడవ రకానిది.


చిత్రకళకు ఏ కొద్దిగానో ప్రోత్సహమున్నది. కాని, మూర్తికళను పట్టించుకునే నాథుడు ఆంధ్రదేశంలో నాడూ లేడు, నేడూ లేడు. గుంటూరు జిల్లాలోని పురుషత్ గ్రామంలో ఈ మూర్తికళ మీద ఆధారపడి జీవించే ముస్లిం కుటుంబాలున్నా.. అదే ఆదరువుగా జీవితం గడిపే పరిస్థితులు  లేవు. కుడ్య చిత్రకళ  కనుమరుగవుతున్న  అమూల్య సంపదల జాబితాలోకి క్రమంగా జారిపోతోన్నది అనేదే ఆఖరి చేదు సత్యం.


(సంజీవ దేవ్ వ్యాసాలు- ఆంధ్ర శిల్పుల రూపకల్పన ఆధారంగ)

-కర్లపాలెం హనుమంతరావు

02 -10 -2021

బోథెల్;  యూ.ఎస్.ఎ

 

 

Thursday, September 30, 2021

కోపం -కర్లపాలెం హనుమంతరావు

 


ఆలోచన మనిషిని నడిపిస్తుంది. మనసును పరుగులు పెట్టిస్తుంది. పరిపక్వత చెందిన మేథలో పరిణతి  చెందిన ఆలోచనలు ఉద్భవిస్తాయి. మనిషి మనీషిగా మారినా, రాక్షసుడిగా రూపొందినా అది అతని మెదడు పొరలలోని ఆలోచనల నుంచి పెల్లుబికే చైతన్యమే.

 

మావవతను దుర్లభమని ఎంచి, పరమానందమును పొందలేక, మద మాత్సార్యాలు కామ లోభాలకు దాసుడనై తిరిగినట్లు నరాధముల చేరి సారహీన కార్యాలు  తలపడ్డట్లు, నాదయోగి త్యాగరాజస్వామివారు తన పంచరత్న కీర్తనలలో వాపోయారు.

 

కోపం శతృవని, పరనింద మృత్యువని, విషయవాంఛలు ఉరితాళ్లని నమ్మి, తెలుసుకొని,కొలవలేక పోయానని ఆ కొండలరాయని తిరుమల విభువుని శ్రీనివాసును పదకవితపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు సంకీర్తనల ద్వారా స్తుతించి ఆవేదనను వ్యక్తీకరించాడు.

 

రాధమాధవుల శృంగార భావనా ప్రపంచంలో మనలను ముంచెత్తే రచనలు చేసిన క్షేత్రయ్య సైతం తన పదాలలో పెడ ఆలోచనలు చేసే దురింతాలపై వేసిన సందర్భాలూ కద్దు.

 

'అబ్బ తిట్టెనంచు' తన బుద్ధిమాంద్యతను గురించి స్వచ్ఛమైన తేట తెలుగులో రామదాసు ఉటంకించాడు.

 

ఎవరెన్ని అన్నా ఏమి అన్నా తమ మెదడులో కదలాడే దురాలోచనలను గురించి చివరకు  పశ్చాత్తాపం ప్రకటించినవారే. ప్రయోజనం లేని పనికి పాకులాడడం, అర్థం లేని అవసరాలకు వెంపర్లాడడం కేవలం అవివేకుల లక్షణం మాత్రమే.

 

ఇనుప నరాలు, ఉక్కు కండరాలు, వజ్ర సమానమైన మనస్సు ఉండవలసిన యువత ఆలోచనల్లో కూడా విద్యుత్ ప్రవహించాలి. విజ్ఞత ఉండాలి కాని తమస్సు కాదు. వివేకం ఉండాలి కాని విశృంఖలత్వం కాదు. సాహిత్యానికి కూడ సమకాలీన సమాజంలో జరుగుతున్న దురంతాలపై సదాలోచన అనే విల్లు ఎక్కుబెట్టి అక్రమాలకు మూలం ఎక్కడ నుంచి ప్రారంభయిందో కనిపెట్టి, నిరసిస్తూ సంఘానికి పట్టిన మకిలిని రూపుమాపడే  ధ్యేయంగా కృషి చేయాలి. నాన్ ఋషిః కురుతే కావ్యం - ఋషి కానివాడి కావ్య సృష్టి చేయలేడు అనే నానుడి  ఎందుకు పుట్టిందో అంతరార్థం తెలుసుకొని రాతగానిగా తన వంతు కర్తవ్యం నిర్వహించాలి.

-కర్లపాలెం హనుమంతరావు

01 -09 -2021

బోథెల్, యూ.ఎస్.ఎ

తెలుగు భాష ప్రాచీనత విశిష్టతలపై రాజకీయాలు -కర్లపాలెం హనుమంతరావు



రాజ్యాంగబద్ధంగా చూసుకుంటే  రాజ్యాంగంలో పొందుపరిచిన అన్ని భాషలకు ఒకే తరహా హోదా ఉంటుంది. ఒక భాషకు ప్రాచీనత దృష్ట్యానో, మరే ఇతరేతర కారణాలతోనో 'క్లాసికల్' బిరుదు తగిలించబూనుకోవడం రాజ్యాంగ రీత్యానే సమ్మతం కాదు. కాని, ఉత్తర భారతం పెద్దన్న పాత్ర  పెత్తనం కారణంగా హిందీకి లభించే ఆదరణ దక్షిణాదిన ఏ ద్రవిడ భాషకూ దక్కడం లేదు. అందులోనూ తెలుగు భాష పరిస్థితి నానాటికి తీసిపోవు నాగం బొట్లు సామెతలా తయారయింది.

తమిళ భాషకు మాత్రమే క్లాసికల్ హోదా దక్కడం ద్రవిడభాషా రాజకీయాలలోనూగల పక్షపాతం ఇందుకు నిదర్శనం. తమిళనాట రాజకీయాలు ప్రారంభం నుండి భాషతో సమ్మిళితమయివుండటం, కేంద్రంలోని ప్రభుత్వాలను   తమిళ  పక్షాలు ప్రభావితం చేయగలగడం వంటివి ఉపరితలంలో కనిపించే కొన్ని రాజకీయ, సాంస్కృతిక కారణాలు. అందుకు భిన్నమైన పరిస్థితులు తెలుగుభాషకు శాపంగా మారాయి.

తమిళుల తరహాలో తెలుగువారికి స్వీయభాషకు సంబంధించిన భాషాఉద్యమాలు, బలమైన సాంస్కృతిక ఆకాంక్షలు లేవు. పేరులో తెలుగు ఉన్నప్పటికి తెలుగుదేశం ఒక రాజకీయపక్షంగ  తెలుగు భాష సమున్నతి కోసం నిజాయితీతో చేపట్టిన చర్యలు శూన్యం. గతంలో కేంద్రంలో ఎన్.డి.ఎ ప్రభుత్వ పాలనలో తెలుగుదేశం నిర్వహించగల ప్రముఖ పాత్ర వుండీ, భాష కోసమై  చేపట్టిన ఒత్తిడి కార్యక్రమాలు  ఏవీ  లేవు. రాజకీయపార్టీలను తప్పుపట్టి ప్రయోజనం లేదు. ఓటర్ల మనోభీష్టాలకు అనుగుణంగా ఎదగడం ద్వారా అధికారం చేపట్టే లక్ష్యంతో పనిచేయడమే  రాజకీయపక్షాల స్వాభావిక లక్షణం.

 

ఇక్కడగల మరో విచిత్రం గమనించాలి. 'క్లాసికల్ లాంగ్వేజ్' అనే పదాన్ని తెలుగులో ప్రాచీనభాషగా  తర్జుమా చేసుకుని భాషకు సంబంధించిన వయస్సు నిర్ధారణపై పేచీలకు దిగడం చూస్తున్నాము. న్యాయానికి క్లాసికల్ అనే ఆంగ్లపదానికి విశిష్టత, శ్రేష్టత సమానార్థకాలుగా చెప్పుకోవాలి. కాబట్టి ఒక భాష క్లాసికల్ లక్షణం కేవలం ఆ భాష వయసును బట్టే కాక, ఆ భాషకు ఉండే విశిష్టత ఆధారంగా కూడా నిర్ధారించడం ఉచితం.

విశిష్టతకు భాష సుసంపన్నత ఒక్కటే కారణం కాబోదు. అంతకు మించి భాషకు ఉండే స్వతంత్ర ప్రతిపత్తి, మరింత వివరంగా చెప్పాలంటే పునాది కూడా గణనకు తీసుకోవాలి. ఆంగ్లభాష ఎంత సుసంపన్నమైనప్పటికి యూరపులో గ్రీకు భాషతో సమానమైన హోదా సాధించలేకపోవడం గమనార్హం. వేరొక సంప్రదాయం నుండి ఉద్భవించినప్పుడు, ఎంత సుసంపన్నమైనప్పటికి భాషకు స్వతంత్ర ప్రతిపత్తి లభించదు. సంగమ సాహిత్యంలో తమిళభాషకు సుమారు 1000, 1500 సంవత్సరాల వెనుకనే స్వతంత్ర సాహిత్య అస్థిత్వం ఉంది. క్లాసికల్ భాష సరితూగే ప్రమాణమే అది.

 

వాస్తవ దృష్టితో పరిశీలిస్తే అసలు ఈ 'క్లాసికల్' అనే పదమే దేశీయమైనది కాదు,  యూరపు సంబంధితం. అక్కడ వారు పైన చెప్పిన కారణాలతో ఆంగ్లానికి కాక గ్రీక్ భాషకు క్లాసికల్ హోదా కట్టబెట్టారు. మనం మన భాషా సంస్కృతులకు వేరే ప్రమాణాలు నిర్ధారిచుకోవలసిన అగత్యం ముందు గుర్తించాలి. ప్రస్తుతమున్న ప్రమాణాలను బట్టి చూసుకున్నా క్లాసికల్ హోదా సాధించిన తమిళ భాషకు మించి వయసు, విశిష్టతల దృష్ట్యా సంస్కృత భాషకు ఈ హోదా దక్కడం సబబు. అందుకు భిన్నంగా తమిళభాషకు ప్రాచీన హోదా పట్టం కట్టడం వెనుక ఇంతకు ముందు చెప్పుకున్నట్లు రాజకీయాలే ప్రధాన కారణం.

 

తమిళానికి మూలం సంగమ సాహిత్యం. దాని వయసు సుమారు క్రీ.శ అయిదో శతాబ్ది వరకు విస్తరించినట్లు పరిశోధకులు చెప్పే మాట. (ప్రముఖ భాషా పరిశోధకుడు డాక్టర్ కె.ఎ. నీలకంఠ శాస్త్రి వాదన ప్రకారం తమిళ భాష ప్రాచీనత క్రీ.శ. 300 శతాబ్ది అయినా కాదు.) అత్యంత ప్రాచీనత తన ప్రత్యేకతగా  చెప్పుకునే తమిళానికి ఉన్న స్వతంత్ర పునాది ఏమిటో, దానికి సమానమైన లేదా మించిన వయసు, విశిష్టతలు తతిమ్మా భాషలకు ఎందుకు లేవో.. ఎక్కడా ప్రమాణపూర్వకమైన ప్రయాగాల ద్వారా నిర్దారణ కాలేదు.  కాని  తమిళభాషకు ప్రాచీన హోదా కల్పించారు! కేవలం రాజకీయ కోణం మాత్రమే దీని వెనుక అన్నది సర్వే సర్వత్రా భాషాపండిత లోకంలో వినవస్తున్న మాట. కాదనగలమా?

(తెలుగు భాష ప్రాచీనత, విశిష్టత - కల్లూరి భాస్కరంగారి పరిశోధన వ్యాసం ఆధారంగ)

-కర్లపాలెం హనుమంతరావు

01 -09 -2021

బోథెల్, యూ.ఎస్.ఎ

 

 

 

Friday, August 27, 2021

వ్యాసం- గురించి సూక్ష్మంగా! -కర్లపాలెం హనుమంతరావు

 తెలుగు సాహిత్యం వరకు 'వ్యాసం' ఆధునిక ప్రక్రియ కిందే లెక్క. పరిణతి, ప్రౌఢి, గభీరత, అగాధత, ప్రగాఢత.. లక్షణాలన్నీ ఏకకాలంలో ప్రదర్శించే నైపుణ్యం కేవలం ఒక్క వ్యాస ప్రక్రియకే సొంతం.  వ్యాసం పేరు తాలూకు పుట్టు పూర్వోత్తరాల చరిత్ర మన దగ్గర ప్రస్తుతానికి లేనట్లే.

శతాబ్దం కిందట బ్రౌన్ దొర, బహుజనపల్లి సీతారామయ్యగారు వంటి విజ్ఞులు తమ పదకోశాలలో ఇచ్చిన వివరాలను బట్టి- విస్తరించి చేప్పేటంత విషయం ఉన్నప్పటికి, సంక్షిప్తంగా పర్యాప్తత లక్షణానికి భంగం రాకుండా ఉపక్రమణ, ఉపసంహరణ వంటి  లక్షణాలతో పద్ధతిగా సాగే ప్రకియగా భావించాలి.  తెలియని విషయాలను తెలిసేలా చెప్పడానికి, తెలిసినవే అయినా మరింత లోతుగా తెలిపేందుకు వ్యాసప్రక్రియను ఉపకరణగా చేసుకోవడం తెలుగు వరకు ఆనవాయితీగా వస్తోవుంది ఇప్పటి దాకా! వ్యాసంలో విషయ పరిజ్ఞానానికే పరిమితమయేవాళ్లు కొందరయితే, అదనంగా కళాత్మకతనూ జోడించే సృజనశీలత ఇంకొందరిది. శాస్త్రానికి శాస్త్రం, కళకు కళా అనుకోవడం ఉభయత్రా శ్రేయస్కరం.

భారతీయ వేదవాజ్ఞ్మయానికి వ్యాసుడు సూర్యుడు వంటివాడని ప్రాచీనులకు అమితగౌరవం.  వేదాలను విషయ విభజన చేసి విశదపరిచినందుకు భారతీయ వాజ్ఞ్మయ సంస్కృతులకు సృజన, ప్రతిభలతో జీవం పోసిన వ్యాసుడిని వ్యాస శబ్దానికి  జోడించే ప్రయత్నం కూడా కద్దు.  కానీ అది వృథా ప్రయాస.  ఆధునిక పాశ్చాత్య ప్రక్రియ ప్రభావం అధికంగా ఉండే సాహిత్య ప్రక్రియ ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న మనం వాడే వ్యాసరూపం.

సాహిత్యభాషగా తెలుగుకు ఒక స్థాయి ఏర్పడి ఇంకా నిండా వెయ్యేళ్లైనా  నిండాయి కాదు. ఆరంభంలో అంతా పద్యమయంగా సాగిన తెలుగు సాహిత్యంలో వచనానికి చొరవగా పాదం పెట్టి నిలదొక్కుకునే  అవకాశం మరో నాలుగొందలేళ్ళకు మాత్రమే వచ్చింది.  ఆంధ్రమహాభారతంలో వచనం ఉంది కదా? అంటారు కొందరు పండితులు. అది చంపూకావ్యంలా సాగిన మాట వాస్తవమే కానీ,   రూపురేఖలు, శైలీ విన్యాసాల పరంగా అందులో కనిపించే వచనానికీ.. అధునాతకంగా మనం వాడుకునే  వచనానికి పోలికే లేదు.

పంథొమ్మిదో శతాబ్ది మూడో దశాబ్దంలోకి అడుగుపెట్టిన తరువాత తెలుగువాళ్లకు పరిచయమయిన అచ్చుయంత్రాల పుణ్యమా అని  వచనంలో మెల్లగా చలనం మొదలయింది. కాలం గడిచే కొద్ది ఎదురయే రకారకాల అరిష్టాలను అధిగమిస్తూ అది చక్కటి, చిక్కటి పాకంలోకి తేలడానికి  వీరేశలింగంపంతులుగారు వంటి చైతన్యమూర్తులు పడ్డ తంటాలు అన్నా.. ఇన్నా? అప్పటికీ పంతులుగారి వచన రచన పూర్తిగా శిష్టవ్యవహారంలోనే సాగిందని చెప్పడానికి మనసొప్పుకోదు.. ఇప్పటి లెక్కల ప్రకారం.

తాటాకుగ్రంథాలు అచ్చుపుస్తకాలుగా మారే క్రమంలో కావ్యకర్తల వివరాలను, కావ్య పరిష్కరణకు సంబంధించిన కడగండ్లను.. అచ్చయ్యే కావ్యానికి చెందిన ముచ్చట్లేవైనా ఉంటే.. ముందు..   'ముందు మాటలు'లోనో, పీఠికలోనో, పరిచయంలోనో, పరామర్శ రూపంలోనో  ఎంతో కొంత సాటి పండితులతో పంచుకోవాలని, చదివే పాఠకులలో ఉపజ్ఞ పెంచాలన్న తపన ఉండటం సహజం. ఆ సదుద్దేశంతో  గ్రంథ ప్రకాశకులు చేసిన ఆలోచనల మూలకంగనే  నేటి వచనం  పురుడుపోసుకుంది.  అచ్చయిన కావ్యాలను గురించి సమకాలీన పత్రికలలో పండితుల మధ్య సాగిన సమీక్షలు, ప్రశంసలు, విమర్శలు, ప్రతివిమర్శలు తరహా ఖండన మండనలు వేటికైనా వచనమే వేదికగా నిలబడిన పరిస్థితి మొదట్లో. ఆ వచనం వాడుక పెరుగుదల  శాస్త్రబద్ధమైన వ్యాస ప్రక్రియ పరిణతికి కూడా బహుధా దోహదం చేస్తూవచ్చింది క్రమంగా. ఇవాళ వార్తా విశేషాలను కూడా మనం అందమైన కథనాల రూపంలో చదువుతున్నాం. అది వ్యాసమనే తరువుకు  తాజా పూలు, కాయలు, పండ్లు కాయిస్తున్న  కొత్తగా పుట్టుకొచ్చిన శాఖ.

స్థూలంగా గమనిస్తే, తెలుగులో పత్రికల పుట్టుక తొలిరోజుల్లో వెలుగు చూసిన వ్యాస ప్రక్రియలో  సింహ భాగం  సాహిత్య సంబంధితాలే. సహజంగానే అవి ప్రచురించే వ్యాసాలు సాహిత్య సంబంధంగానే ఉంటాయి కదా!

ఆ తరహా సాహిత్య వ్యాసాలను సేకరించి సంకలనాలుగా వెలువరించాలనే సంకల్పం ఏర్పడ్డ తరువాత వెలుగు చూసిన మొదటి వ్యాససంకలనం 'హితసూచని' అంటారు. ఆ పుస్తకాన్ని ప్రచురించింది కీ.శే. శ్రీ సామినేని ముద్దు నరసింహులునాయుడు. ఆ తరువాతి అయిదేళ్ళకు గాని బెంగుళూరు నుంచి జియ్యరు సూరి అనే మరో  తెలుగు ఉపాథ్యాయుడి చొరవతో  రెండు భాగాలలో మహిళలకు సంబంధించిన 'స్తీ కళా కల్లోలిని' అనే వ్యాససంపుటి వెలుగు చూసిందికాదు. అయితే తన వ్యాసాలను ఆ మహానుభావుడూ  వ్యాసాలుగా కాకుండా 'గ్రంథం'గా  పేర్కొనడం  విచిత్రం.  మనం ఘనంగా స్మరించుకునే సంఘసంస్కర్త  కీ. శే కందుకూరి వీరేశలింగంపంతులుగారికి స్ఫూర్తినిచ్చిన మహామహోపాథ్యాయుడు కీ.శే పరవస్తు వేంకట రంగాచార్యులవారు తన కాలంలో విశాల సామాజిక భావజాలం దట్టిస్తూ అతి చక్కని వచనంలో స్ఫూర్తివంతమైన వ్యాసాలు వెలువరించారు. జంటకవులుగా ప్రసిద్ధి పొందిన  తిరుపతి వేంకట కవుల గురువు కీ.శే చర్ల బ్రహ్మయ్యశాస్త్రిగారికీ పరవస్తులవారే పరమ గురువులని చెళ్లపిళ్లవారు తన 'కథలు-గాథలు'లో చెప్పుకొచ్చారు.  అయితే తెలుగు వ్యాసకర్తల తొలితరంలో వందేళ్లు జీవించిన ఈ పండితుడు పత్రికలకు వ్యాసాలను వ్యాసాల పెరుతో కాకుండా 'సంగ్రహం' పేరుతో పంపించేవారుట! వేంకట రంగాచార్యులవారు చూపించిన ఆ వ్యాస జ్యోతుల వెలుగుదార్రిలోనే కందుకూరివారు తన స్వంత పత్రికలలో రాజారామ్మోనరాయ్ మొదలు ఈశ్వరచంద్ర విద్యాసాగర్, మహదేవ గోవింద రానడేల వరకు .. అందరి వ్యాసాలు పరశ్శతంగా ప్రచురించి  తెలుగు సమాజాన్ని చీకటి నుంచి విముక్తం చెయ్యడానికి శతథా ప్రయత్నించింది.  ఆ వైతాళికుడూ ప్రారంభంలో తన వ్యాసాలను వ్యాసాలు అనేవారు కాదు; ఉపన్యాసాలు అనే ప్రస్తావించేవారు. బహుశా తాను ఉపన్యసించిందల్లా అచ్చులో  ప్రచురించడం వల్ల కావచ్చు. విషయ వైశద్యమూ, విజ్ఞాన వైదగ్థ్యంతో పంతులుగారు రాసిన వైవిధ్య ప్రక్రియల పరంపరలో చిట్టచివరిది కూడా 'వ్యాసమేకావడం.. అదో విశేషం. 1919 నాటి ఆంధ్రపత్రిక ఉగాది వార్షిక సంచికలో పోతన జన్మస్థల వివాదం గురించి  రాసిన 'వ్యాసం అది.

తెలుగు సమాజ బహుముఖీన వికాసం ఇరవయ్యవ శాతాబ్ది తొలి దశాబ్ది నుంచి ఆరంభమయిందంటారు చరిత్రకారులు. ఆ వికాసోద్యమంలో  భాగంగా సాహిత్యరంగం తాలూకు ఎదుగుదల బారలు మూరల్లో కాకుండా అంగల్లో ఉండటం తెలుగువాళ్లు చేసుకున్న  అదృష్టం. కృష్ణాపత్రిక ఆవిర్భావంతో ఆరంభమయిన ఆర్భాటం దేశాభిమాని, ఆంధ్రకేసరి లాంటి చిన్నా చితకా పత్రికలతో సరిపుచ్చుకోక అనంతరం కాలంలో అమేయపర్వతంలా ఎదిగిన ఆంధ్రపత్రికకు, మరో దశాబ్దంనర  తరువాత భారతి వంటి సాహిత్య మాసపత్రికలకు  ప్రేరణగా మారటం.. చెప్పుకోదగ్గ విశేషం.  అన్ని పత్రికలలో  కాల్పనిక సాహిత్యానికి రెట్టింపు ఆదరణ విషయ ప్రాధాన్యతకు అధిక గౌరవమిచ్చే 'వ్యాస' ప్రక్రియకు లభించడం సాంస్కృతిక పునరుజ్జీవన కోణంలో విశేషమైన సగుణాత్మక మలుపు.

సాహిత్య ప్రక్ర్రియ ఏదైనా కావచ్చు.. అందులోని విషయ వివరణ పరిచయానికి వస్తే వ్యాసమే ఆలంబన అవుతుంది కదా! అందులోనూ త్రిలింగ, ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక, ప్రబుద్ధాంధ్ర, రెడ్డిరాణి, ప్రతిభ, జయంతి లాంటి పత్రికలకు వ్యాసాలు మాత్రమే అంగీకారయోగ్యం. అందుకే, పంథొమ్మిదో శతాబ్దిని పక్కన పెట్టినా, కేవలం ఇరవయ్యో శతాబ్దపు వ్యాసరచయితల పట్టికను పరిశీలిస్తే ఆంజనేయుడి తోకంత సుదీర్ఘంగా ఉంటుంది. తిరుపతి వేంకట కవుల నుంచి, కట్టమంచి, వేలూరి, విశ్వనాథ, నోరి, నిడదవోలు, మల్లంపల్లి, బండారు తమ్మయ్య, వేటూరి ప్రభాకరశాస్త్రి, భావరాజు వెంకటకృష్ణారావు.. ఇట్లా జాబితాలోని ఉద్దండుల పేర్లు అంతూ పొంతూ లేకుండా సాగిపోతాయి. వ్యాస ప్రక్ర్రియకు పరిణతిని సమకూర్చిన గిడుగు రామ్మూర్తిపంతులు, కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావు వంటివారు ప్రత్యేకంగా ఈ సందర్భంలో ప్రస్తావనార్హులు.

ఎప్పటి కప్పుడు కొత్త నీరు ఊటలెత్తే  వ్యాసజలనిధిలో ఎన్ని పొరలనని మనం తడవగలం? ఎంత మంది ప్రజ్ఞావంతులైన వ్యాసకర్తలకు న్యాయం చేయగలం?! కుతూహలం కొద్ది ఏదో తెలిసిన నాలుగు మాటలు నలుగురు మిత్రులతో పంచుకోవడం తప్పించి. స్వస్తి.

-కర్లపాలెం హనుమంతరావు

నవంబర్, 12, 2020.

బోథెల్, యూ.ఎస్.

పెయిడ్ ఇన్ ఫుల్ -కర్లపాలెం హనుమంతరావు

 సుబ్బుకు పదేళ్లు.  ఐదో తరగతి. బుద్ధిగా చదువుతాడు. లెక్కలు బాగా చేస్తాడని టీచరు బాగా మెచ్చుకుంటారు కూడా.  కూడికలు తీసివేతలు  రెండంకెల వరకు  నోటితోనే  చేసేయగలడు. కానీ ఈ సారి నోట్ బుక్ లోని ఒక కాగితం చించి దాని మీద ఈ విధంగా లెక్క వేసాడు. వీధి చివరి శేషయ్య కొట్టు వరకు వెళ్లి  ఉప్పు, కరేపాకు లాంటి సరుకులు వెంటనే తెచ్చి ఇచ్చినందుకుః  రూ.2

అమ్మ వంట పనిలో ఉన్నప్పుడు చెల్లాయిని ఆడించినందుకుః రూ.3

ఆదివారం నా గది శుభ్రం చేసుకున్నందుకు రూ. 3

అమ్మ పూజకు ఇబ్బంది లేకుండా  మూట్ లో పెట్టి వీడియో గేమ్స్ ఆడుకున్నందుకు రూ.1

బడిలో మంచి మార్కులు తెచ్చుకుంటున్నందుకు.. ప్రోగ్రెస్ రోజుకో కొత్త పద్యం చదివి చూడకుండా అప్పచెబుతున్నందుకు రూ.3

కుట్టుపని శిక్షణా కేంద్రానికి అమ్మకు  తోడుగా వెళుతున్నందుకుః రూ.2

ప్రోగ్రెస్ రిపోర్టులో ఎప్పుడూ తెచ్చుకునే  రెండో ర్యాంకు పోయినవారం కూడా  తెచ్చుకుంటున్నందుకు ఆ వారం  వాయిదాః రూ.10

చిల్లర  పనులుః రూ.10

పోయిన ఆదివారం నుంచి శనివారం వరకు  ఇంట్లో పని కోసం అమ్మకు చేసిన సహాయం బిల్లు మొత్తంః రూ 34

వీడియో గేమ్ కు  లెక్క తక్కువ పడింది. 

సమయానికి నాన్నగారు ఇంట్లో లేరు. ఆఫీసు పని మీద వేరే ఊరికి వెళ్లారు. వారం దాకా రారు. అందుకే వారం మొత్తం తాను అమ్మకు చేసిన సాయానికి బిల్లు వేసి వంట ఇంట్లో పనిలో ఉన్న అమ్మకు అందించాడు.

వంట పని కానించి చేతులు శుభ్రం చేసుకుని పొడి చేత్తో సుబ్బు ఇచ్చిన బిల్లు చదువుకుంది అమ్మ.

అదే కాగితం వెనక సుబ్బు నుంచి పెన్సిలు అడిగి తీసుకుని ఈ విధంగా రాసి ఇచ్చింది అమ్మ.

అమ్మ రాసిన లెక్కః

నిన్ను నా కడుపులో తొమ్మిది నెలలు మోసాను. మోత కూలీః రూ. 0 

రాత్రిళ్లు నీకు భయమేసినప్పుడల్లా నా పక్క వదిలి నీ పక్కనే తోడు పడుకోనేదాన్ని. చల్లగాలి తగిలి జలుబు చేయకుండా నీ మీద దుప్పటి నిండుగా ఉందో లేదో మధ్య మధ్య మంచినిద్రలో కూడా వచ్చి చూసేదానిని. నిద్రలో నీకు తెలియదు. కాపలా పనికిః రూ.0

నీకు జ్వరం వచ్చినప్పుడు వేసిన మందుల ఖర్చు ఇప్పుడు చెప్పడం కుదరదు. మళ్లా నువ్వు మనుషుల్లో పడ్డదాకా దేవుడికి నీ క్షేమం కోసం చేసుకున్న ప్రార్థనలకుః రూ.0

ఇట్లా విడివిడిగా చెప్పడం కుదరదు కానీ నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి దాకా నీ ఆటపాటలకు బొమ్మలు, పుస్తకాలు, చదువు సంధ్యలకు పుస్తకాలు,  ఉల్లాసానికి వెంట తీసుకువెళ్లిన పార్కులు, సినిమాలు, ఆఖరికి నీకు రొంప పడితే సమయానికి చేతిలో ఏ గుడ్డా లేకపోయినా నా చీర కొంగుతో చీదరించుకోకుండా తుడిచేదాన్ని. ఈ మాదిరి  చిల్లర సేవలు చాలా చేసాను. చేస్తున్నాను.  ఆ సేవలకు రూః0

సుబ్బూ! నాకు నీ మీద ఉన్న ప్రేమకు విలువ కట్టడం నాకు చేతకావడం లేదు. ఆ బిల్లూ నువ్వే వెయ్యి. నీ బిల్లుకు ఆ బిల్లు చెల్లు. ఇంకా ఏ మన్నా ఇవ్వాల్సింది  మిగులుంటే అప్పుడు మళ్లా కొత్తగా వేసుకురారా నాన్నా అమ్మకు నువ్వు చేసిన సేవలకు బిల్లు!

అమ్మ ఇచ్చిన ఆ కాగితం చదువుకున్న సుబ్బు కళ్ల వెంట నీళ్లు బొట బొటా కారాయి. పెన్సిల్ వెనక్కు తీసుకుని 

ఈ విధంగా రాసుకున్నాడు ' పైడ్ ఇన్ ఫుల్'ఎక్కడో  

( ఎక్కడో చదివిన బాలల కథానిక నా శైలిలో )  

-కర్లపాలెం హనుమంతరావు 

బోథెల్ , యా ఎస్.ఎ 

***


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...