Showing posts with label Collections. Show all posts
Showing posts with label Collections. Show all posts

Sunday, December 12, 2021

గ్రహం ప్రమాదంలో లేదు; ఉన్నది మనమే ! - సేకరణ : కర్లపాలెం హనుమంతరావు

 గ్రహం ప్రమాదంలో లేదు. ప్రమాదంలో ఉన్నవి  మానవ జీవితాలే ! 

సోర్స్ : అన్ నోన్ 

- సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 


భూమి ప్రమాదంలో ఉందని చాలా మంది పర్యావరణ నిపుణులు ప్రజలకి భోదిస్తూ ఉంటారు. ప్రమాదంలో ఉన్నది ఈ గ్రహం కాదు.. మనమే!  


మననుషుల  మనస్సులు అరలు అరలుగా  కుచించుకుపోయాయి . చెట్లు విషయమే చూడండి. అది మన ఆత్మబంధువు. అవి ప్రసాదించే స్వచ్ఛమైన  ప్రాణవాయువుని మనం లోపలికి తీసుకుంటాం. మనం వదిలే కాలుష్య   బొగ్గుపులుసు వాయువుని అది  తన   లోపలికి తీసుకుంటుంది!మన ఊపిరితిత్తులలోని ఒక భాగమైన చెట్టుని వంటకోసం విరిచి పొయ్యిలో పెట్టేందుకు   సంకోచించం! 


ఇక .. మనది మాత్రమే అనుకునే ఈ శరీరం మనది ఒక్కళ్లదే కాదు. ఇదీ ఈభూగ్రహంలోని ఒక చిన్న ముక్క. ఆధ్యాత్మికత అంటే పైకి చూడ్డమో.. కిందకు చూడ్డమో మనకు అలవాటు. లోపలికి చూసుకోవాలని తెలుసుకోలేము. అంతర్ముఖత్వం సాధన చేసే వారికి అనుకున్నదంతా తన లోపలే లభిస్తుంది. 


ఆధునిక శాస్త్రవిజ్ఞానమూ విశ్వంలోఉన్న అణుబంధమే.  దేహంలోనూ ఓ బ్లూ ప్రింట్ మాదిరిగా ఉంటుందని చెబుతున్నది కదా! ఆ అవగాహనను పెంచుకొని  ప్రపంచాన్ని తనలో చూసుకోవడం  ఆధ్యాత్మికం అయితే .. ప్రపంచంలో తనని చూసుకోవడం విశ్వభావన అవుతుంది. 


ఈ గ్రహం మన మనుషులొక్కళ్లదే కాదు. మనిషికీ స్వార్థ బుద్ధి ఎందుకు పుట్టినట్లోతెలీదు. తననిదేవుడికి ప్రతినిధిగా భావించుకోడం అహంభావం కాక మరేమిటి? సాలెపురుగు కూడా తాను దేవుడికి ప్రతినిధి అనుకుంటుందేమో! ఈ గ్రహం మీది ప్రతి జీవికీ మనకు లాగే తమ జీవితమే ఉత్తమమైనదని ఎందుకు అనిపించకూడదూ! 


శారీరకంగా చిన్నవైనంత   మాత్రాన,  భౌతికంగా  కదలలేని స్థితిలో  ఉన్నంత మాత్రాన వాటి ప్రాధాన్యతను మనకోణంలో నుంచి తక్కువ చేసి చూపించలేం  కదా! అట్లా చూపిస్తే  ముందు మనకే మానవత్వం లేనట్లు లెక్క. వాస్తవానికి ఈ భూగ్రహానికి ఎటువంటి ప్రమాదం లేదు. మానవ జీవితాలకే ఉన్న ప్రమాదం ,అంతా!  


మానవత్వం పెంపొందితే గాని, ఈ పర్యావరణానికి సంబంధించిన ప్రాజెక్టులు జరుగుతాయని నేననుకొను. గవర్నమెంట్ ఎన్నో సిద్ధాంతాలను చేయవచ్చు. కానీ, వారు వీటిని ప్రజాస్వామ్య పద్ధతిలోనే అమలు పరచాలి. ఏదో ఒక నిరంతర ప్రచార  వ్వూహం ద్వారాగానీ, ప్రజలలో తగిన ఎరుకను తీసుకురావడంద్వారాగానీ చేయాలి. 


ప్రభుత్వాలలో ఉన్న వ్యక్తులు ఈ ఆలోచనలను బయటికి తెచ్చే విధానాలను వెతకాలి. ఒక సమయంలో భారతదేశంలో కుటుంబ నియంత్రణ గురించిన ప్రచారం జరిగింది. ఇప్పుడటువంటి ప్రచారం ఎక్కడా కనిపించడం లేదు. కానీ మనకేమీ పరిష్కారం దొరకలేదు కదా! మానవ జనాభాని అదుపులో పెట్టుకోకుండా, పర్యావరణం, భూమి, నీరు – వీటన్నిటి గురించి మాట్లాడటం అన్నది కేవలం శాస్త్ర పరిజ్ఞానం వల్ల ప్రజలు హైపర్-ఏక్టివ్ అవ్వడం వల్ల జరిగింది మాత్రమే! 


మీరు మానవ కార్యకలాపాలను నియంత్రించలేరు, మీరు మానవ జనాభాను మాత్రమే నియంత్రించగలరు. మానవాళి చేసే కార్యకలాపాలను మనం ఆపలేము. ఎందుకంటే ఇది వారి ఆశయాలను నియంత్రించడం అవుతుంది. ఈ రోజుల్లో మన ఆశయాలు ఏమిటంటే, ప్రతీవారూ కూడా అక్షరాస్యులు అవ్వాలనీ, వారికి ఎంతో పెద్ద కలలూ, లక్ష్యాలూ ఉండాలనీ! 


ఇప్పుడు ఉన్న జనాభా స్థాయితో.. వీటిని సాధించడం అన్నది ఎంతో కష్టం. మనం ఎరుకతో దీనిని నియంత్రించాలి. మనం ఎరుకతో దీనిని ఎక్కడ ఆపాలనుకుంటున్నామో నిర్ధారించుకోవాలి. ఇది చెయ్యడం అసాధ్యం అని నేను అనుకోను.


మనకి ఎటువంటి వనరులైతే ఉన్నాయో వాటికి సరిపోయే విధంగా మనం జనాభాను సమతుల్యం చేసుకోవాలి. మనం చేయగలిగినది ఇదే. అన్నిటికంటే సులువైన పని ఇదే. ఇది ప్రతి మానవుడూ  చేయగలదు. వారికి అవసరమైన విద్య, ఎరుక జీవితంలోకి తీసుకుని వస్తే ఇది జరుగుతుంది. 


అప్పుడు, మనం చెట్లని నాటనక్కర్లేదు. మనం ఈ భూమి నుంచి దూరంగా ఉంటే, చెట్లు వాటికవే పెరుగుతాయి. మీరు వాటిని ఆపలేరు. ఇది ప్రతీ మానవుడూ  అర్థం చేసుకోవాల్సిన విషయం. 


భూమి ప్రమాదంలో ఉందని ప్రజలు అంచనాలు వేస్తున్నారు. ఈ గ్రహం ఎటువంటి ప్రమాదంలోనూ లేదు. మానవ జీవితాలే ప్రమాదంలో ఉన్నాయి. మనం ఈ విషయాన్ని అర్థం చేసుకొని, దీనికి, ఏది అవసరమో అది 

సోర్స్ : అన్ నోన్ 

- సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

09 - 10 - 2021 

బోథెల్ : యా . ఎస్.ఎ 

Saturday, December 11, 2021

కవిత: బాలగోపాల్, ఓ బాలగోపాల్ - పి.రామకృష్ణ సేకరణ : కర్లపాలెం హనుమంతరావు

 





మాకులాగే  నీకూ ఒక్క బ్రతుకే ఉన్నా 

ఆ ఒక్క బ్రతుకులో 

వంద బ్రతుకులు జీవించావు కదా బాలగోపాల్ 


మాకులాగే నీకూ రెండు కాళ్లూ,  రెండు కళ్లే ఉన్నా 

దేశంలో నీ కాళ్లు నడవని ప్రదేశం లేదు  

నీ కళ్లకు కనిపించని  హక్కుల అణచివేతలేదు 


చీమంత  పని చేసామేమో  

కొండంత అలసటతో కూచున్నాం మేము  

ఇదిగో.. ఈ మరణం దాకా 

నువ్వెప్పుడైనా అలసిపోయావా బాలగోపాల్ 

సీమవాడినని అనుకోవడానికి సిగ్గేసింది 

సీమనీటి వివరాల గురించి  నువు  చెప్పాక

పల్లం నుంచి మిట్టకు కూడా ప్రవహించావు  గదా బాలగోపాల్ 

నమ్మకాన్నీ, అపనమ్మకాన్నీ అంతే ధైర్యంగా 

అంతే నమ్మకంగా ప్రకటించావు గదా బాలగోపాల్ 

మేమైతే  నమ్మకం  మీద అపనమ్మకం కలిగినా 

నమ్ముతున్నట్లే కనిపిస్తూ వుంటాం 

ఇప్పుడు నీ కోసం ఏడ్వాలా 

మాకోసం ఏడ్వాలా 

నీ కోసం ఏడిస్తే, నువ్వింకా ఏదో చెయ్యాలనుకోవడం 

లేదా , ఏదో చెయ్యలేదు అనుకోవడం, వద్దు . 

నువ్వు చెయ్యవలసినవన్నీ చేశావ్ 

ఏసుక్రీస్తు చెప్పినట్టూ  ఇక మా కోసమే ఏడుస్తాం... 

- పి. రామకృష్ణ 


( పి.రామకృష్ణ రచనలు నుంచి ) 

సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

                 22-09-2021 

                  బోథెల్, యూ. ఎస్.ఎ


( బాలగోపాల్ భౌతికకాయం దగ్గర కూర్చున్నప్పుడు కలిగిన ఆలోచనలతో తను కూర్చిన కవిత ( పి. రామకృష్ణ దృ ష్టిలో ఇది కవితకాదు . బాలగోపాల్ ను ఒక కవితలో ఇమడ్చటం కష్టం అంటారాయన )  

 


సింహళ పాలకుల ఆంధ్రాభిమానం - దురభిమానం -కర్లపాలెం హనుమంతరావు

 సింహళ పాలకుల ఆంధ్రాభిమానం - దురభిమానం 

-కర్లపాలెం హనుమంతరావు


12 , 13 వ శతాబ్దాలనాటి మాట. ఇప్పటి శ్రీలంక అప్పట్లో సింహళం.   పోలన్నరువా దాని రాజధాని.  అప్పటి శిలాశాసనాలు, 'మహావంశ' వంటి  రాజవంశజుల చారిత్రక గ్రంథాలే కాకుండా, బుద్ధుడి దంత చిహ్నాలు సింహళానికి కళింగ నుంచే తరలిన దాఖలాలు  కూడా  వత్తాసుకు రావడం  వల్ల .. సింహళ  పాలకులు కళింగ వంశానికి చెందిన వాళ్లు కావచ్చనే భావన బలపడింది . 

నాటి పాలకుల మొదటి తరపు పాలకుడు ' శ్రీవిజయ'  వంగీయుడు అని  కొన్ని వాదనలు ముందుకు వచ్చినా . . కాదు, కళింగుడేనని  తరువాతి కాలంలో తేలడంతో కళింగ సిద్ధాంతానికి మరింత  ఊతమిచ్చినట్లయింది.

 ఏడో శతాబ్దంలో ఓ కళింగ ప్రభువు యుద్ధంలో ఓడి అశ్రయం కోసం సింహళంలోని  ఒకానొక బౌద్ధవిహారం దాకా వచ్చినట్లు  'మహావంశ' గ్రంథం చెప్పనే చెబుతున్నప్పుడు  పాలకుల కళింగ వంశాన్ని గురించిన వాదనలు కొనసాగడం కాలం వృథాచేసుకోవడమే!     

 పదహారేళ్ళ పాటు ఘనంగా పాలించిన  నాలుగో తరం  నాయకుడు మహీంద్రుడు పెళ్లాడింది కూడా కళింగ కన్యనే. ఆ జంట ఫలం ( ఐదవ)  మహీంద్రుడు అనూరాధపురం రాజధానిగా పాలన చేసినట్లు                          శా సనాల సాక్ష్యం అందుకు తోడుగా ఉంది . 

ఇచ్చిపుచ్చుకోవడాలు ఉన్నప్పటికీ  తొమ్మిదో శతాబ్ద౦ దాకా సింహళ వ్యవహారాలలో ఆంధ్రుల   జోక్యం ఉన్నట్లు కనిపించదు.  పదో శతాబ్దంలో దక్షిణ సింహళంలోని  కొంత భాగం చోళుల అధీనంలోకి  వచ్చినప్పటి నుంచే  ఆ దేశ వ్యవహారాలలో చోళుల చొరవ ఎక్కువయినట్లు చరిత్ర చెప్పే  మాట నమ్మదగ్గదే . 

కళింగులు, సింహళీయులు ఇద్దరికీ ఒకటవ కుళోత్తమ తుంగుడు శత్రువు. ఆ ఉమ్మడి శత్రువును తరిమికొట్టే  నిమిత్తం  కళింగ రాకుమార్తె త్రిలోకసుందరిని  ఒకటవ విజయశ్రీ  పెళ్లాడినట్లు  చెబుతారు.    ఇటు కళింగదేశంలోని 'గంగ' వంశంలో కూడా ఈ తరహా పేర్లే  వినబడతాయి.  కాబట్టి విజయసింహుడికి ఆ వంశజుల   బాలికతో వివాహమైందని ఊహించుకోవడంలో తప్పేమీ  లేదు . యుద్ధాల నిమిత్తం జరిగే పెళ్లిళ్లు  రాచరిక వ్యవహారాలలో మామూలే.  

వధువు త్రిలోకసుందరి తన బంధుబలగంతోనే అత్తారింట్లో అడుగు పెట్టింది.   మనావంశ కథనం ప్రకారం మధుకన్నవ, బాలక్కర, భీమరాజు,  చిన్నచెల్లెలు సుందరి సింహళ దేశంలోకి అట్లా అడుగుపెట్టిన చుట్టాలూ పక్కాలే.    విజయసింహుడి  బిడ్డకు  తాతగారి పేరు  'మధుక మార్నవ' దాఖలవడం కూడా అందుకో ఉదాహరణ .  మధుక మార్నవ   భార్య సుందర మహాదేవి.  మార్నవ మహారాజు   పరిపాలన  క్రీ.శ 1116 నుంచి  17 సంవత్స రాలపాటు  సాగినట్లు చరిత్ర చెబుతున్నది  . 

ఇప్పుడు ' దిబుంలగాల' గా చెప్పుకునే అప్పటి 'యుదంబగిరి' లో   విజయ  బాహుడు అనే సింహళాధీశుడు  ఒక గుహ కట్టించి దానికి  'కళింగ గుహ' అని పేరు పెట్టినట్లు  శిలాశాసనాల సాక్ష్యం ఉంది. ఆ వంశంలోని రెండవ గజబాహుడికి ఆంధ్రులపై ప్రీతి   జాస్తి అని ప్రతీతి .  అతని   16 ఏళ్ల పాలనాకాలంలోనే  (1137 -53)  ఆంధ్ర, సింహళాల మధ్య  బంధం మరంత.  బలపడినట్లు  చరిత్ర కథనం . అతగాని    ఆంధ్రాభిమానం గిట్టని పరాక్రమబాహుడు అనే మరో రాజు రాజ్యాన్ని కబళించాడు.  తమాషా ఏమిటంటే, నిస్సంతు అయినందువల్ల అంత్యకాలంలో ఆయనే  ఆంధ్రదేశపు విజయబాహువు అనే బంధువుకు రాజ్యాన్ని అప్పగించవలసి రావడం ! ఆ అప్పగింతకు వ్యతిరేకంగా చెలరేగిన వ్యతిరేకత    విజయుడు అనే సేనాని కృషి కారణంగా  సద్దుమణిగింది .   ఆయన  ఓ గొల్లవారిపిల్ల  ప్రేమలో చిక్కి ప్రాణాలు  పోగొట్టుకున్నాడు. ఆ  పిమ్మట   పీఠమెక్కినవాడు    నిస్సమ్మకమల్లుడు. ఆయన తండ్రి జయగోపరాజు. తల్లి పార్వతీమహాదేవి . 

నిస్సమ్మకమల్లుడు పదహారణాల ఆంధ్రుడు. ఆ ఆంధ్రాభిమాని     తొమ్మిది ఏళ్ళ పాలనను  స్వర్ణయుగంగా సింహళ సమాజం ఇప్పటికీ చెప్పుకుంటుంది.  అస్తవ్యస్త  వ్యవస్థకు ఒక కట్టుబాటు ఏర్పాటుచేసి అంకితభావంతో దానిని అమలుచేసిన గొప్ప పాలకునిగా  అతనికి చరిత్రలో  గుర్తింపు ఉంది. 

నిస్సమ్మకమల్లుడు సింహళ దేశీయులకు  సుఖశాంతులు, సుభద్రత అంటే ఎట్లా ఉంటాయో రుచి చూపించిన మొదటి  పాలకుడాయన. అయినా అతని పట్ల 'మహావంశ'   చిన్నచూపు చూసింది .   కేవలం తొమ్మిదంటే తొమ్మిది వాక్యాలతోనే    ఆ రాజు ప్రాశస్త్యం తగు సమాచార లేమి  కారణమని  సమర్ధించుకున్నా ఈ వివక్ష ఆంధ్రుల పాలిటి దురదృష్టమే! ద్రవిడ దేశం మీదకు దాడికి వచ్చినప్పుడు   రామేశ్వరంలో ఆంధ్ర ధ్వజం నాటిన ఆ తెలుగు వీరుడి   ప్రతి పలుకు, ప్రతి  చర్యా  ఆంధ్ర విలక్షణతతో  తేజరిల్లడం గొప్ప విశేషం .  పదహారణాల ఆంధ్రుడయినప్పటికీ   ఆ నిస్సమ్మకమల్లుని  ఆంధ్ర  రికార్డులు సైతం పట్టించుకొనకపోవడాన్ని మనం  ఎట్లా సమర్ధించుకోవడం? ! 


పరాయిగడ్డ పై ప్రముఖ రాజధాని పోలన్నరువును  నాడే  నిర్మించిన ఘనత   నిస్సమ్మకమల్లునిది! దేశం ముమ్మూలలా  విస్తృతంగా సంచారం చేస్తూ  దేవాలయాలు, పూజామందిరాలు ఇబ్బడి ముబ్బడిగా నిర్మించిన ప్రజారంజక పాలకుడా మహారాజు.  రస్తాలూ, తటాకాలు వంటి ప్రజోపయోగకరమైన వనరుల అభివృద్ధి పై  సైతం ఆ ప్రభువుకు నిర్లక్ష్యం లేకపోవడం ఈనాటి పాలకులకు  ఆదర్శనీయం కావాలి. 


బౌద్ధ మతానుయాయిగా బౌద్ధ సంఘాలలోని దురాచార నిర్మూలన కోసమై   యథాశక్తి ఆ రాజు చేసిన కృషి సర్వమతాల సమ్మతం  విశేషంగా సాధించింది .   

 నిస్సమ్మకమల్లుని ప్రతి పలుకూ , ప్రతి చర్యా అతనిలోని  పదహారణాల ఆంధ్రత్వానికి అద్దం పడుతుంది. ఆయనకూ నేటి  మన పాలకుల తరహాలోనే  తన పరిధిలోని  వస్తుసంపదకు  'కళింగ' నామధేయం అద్దడంలో అపరిమిత , శ్రద్ధ. అర్థాంగి సుభద్రను  'కళింగ సుభద్ర'గా ప్రసిద్ధం చేసిన ఆంధ్రాభిమాని  నిస్సమ్మకమల్లుడు.  ఇప్పటి పోలన్నరువా అతని కాలంలో 'కళింగపురం'. నాణేల మీదంటే  'కళింగ లామతేజస' అని ముద్రింపచేశాడు ;  సరే, తోటలను సైతం  కళింగ ఉద్యానవనాలుగా స్థిరపరచడమేమిటి! ఆ ప్రభువుకు   ఆంధ్ర మూలాల పట్ల గల  గాఢాభిమానానికి చెప్పకోదగ్గ  గొప్ప తార్కాణాలు ఇట్లాంటివి ఇంకెన్నో ! 

కళింగాధీశుడు ఉమవర్మ వేయించిన తామ్రశాసనంలో  నిస్సమ్మకమల్లుని ' సింహపురి నివాసం  '  ప్రస్తావన కనిపిస్తుంది .   అమరావతి, నాగార్జున పర్వత ప్రాంతమంతా ఒకనాడు బౌద్ధమత ప్రాభవంతో వెలుగులీనడం అందరికీ తెలిసిన చరిత్రే. సింహళం మొదటి తరం పాలకులలోని ఒకటవ శ్రీ విజయుడు బహుశా కృష్ణాతీరం నుంచే  సింహళ దేశానికి తరలిపోయి ఉండవచ్చని ఒక ఊహ. ఆ సింహపురి ఇప్పటి నెల్లూరు కాదు.  సింహవాహనం పైన దర్శనమిచ్చే బెజవాడ. అదే శ్రీ దుర్గాంబాదేవి కనుసన్నులలో మెలిగే  విజయవాడ అయినా అయే అవకాశం కద్దు. అనంతర కాలంలో కళింగ రాజుల ప్రాభవం చెప్పుకోదగినంతగా లేని కారణంగ  ఆ ఆంధ్రరాజు నిస్సమ్మకమల్లుని చరిత్ర మరుగున పడే అవకాశం కాదనలేనిది! 


ఏది ఏమైనా ఊహపోహలు చరిత్ర కాలేదు కదా !    పరిశోధకులు మాత్రమే ఇతమిత్థంగా  నిగ్గు తేల్చదగ్గ అంశాలు నిస్సమ్మకమల్లుని చుట్టూతా  చాలానే ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్న మాట. 

నిరంతరం స్వయంగా పర్యవేక్షణ పనులలో పాలుపంచుకుంటూ ప్రజలతో మమేకమైన ఆ ప్రభువు   సుపరిపాలనా దక్షత   సింహళ చరిత్ర ఖజానాలో .. తరాలు గడిచినా తరగనంతగా జమపడివున్న ధన సంపద.  విదేశీ గడ్డ అయినా స్వజాతి ఔన్నత్యాన్ని కీర్తించిన ఆ పాలకుని వ్యక్తిత్వం సర్వదా  అభినందనీయం. ఈనాటి మన తెలుగువారందరికీ ఆదర్శనీయం. , ఆచరణీయం కూడా. 


-కర్లపాలెం హనుమంతరావు

బోధెల్ ; యూ.ఎస్.ఎ

21 -06 -2019


Wednesday, December 8, 2021

వేమన పద్యములు కృష్ణశాస్త్రి - ఆంధ్రజ్యతి ( పాతకాలం నాటిది ) సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 14-11-2021

 వేమన పద్యములు

కృష్ణశాస్త్రి

- ఆంధ్రజ్యతి ( పాతకాలం నాటిది ) 

సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

14-11-2021


అర్చనకును రాతి నాచారమి చ్చెను; చచ్చురాత్రి భార్య సంఘమిచ్చె; కరకురాతి కూడు దొరతనం బిచ్చెరా; విశ్వదాభిరామ వినుర వేమ !


గూటిమీద నెక్కి నూటిగా కుక్కపై విసిరినాడు రాయి అసిరిగాడు; కుక్క బొంయిమంటే గొల్లుమన్నాడయా; విశ్వదాభిరామ వినుర వేమ !


వీధిత్రోవ నెపుడు వేంచేయు పంతులు, పెరటిదారి పండు లరుగుదెంచు, తొందరపడి సాని పంది నే వలచెరా, విశ్వదాభిరామ రామ వినుర వేమ సోమయాజిగారి జోలియచూచితే


పొట్టిసాని మనసు పట్ట లేదు, తండులములు లేక తటపటాయించారు విశ్వదాభిరామ వినుర వేమ !


నిదురమత్తులోన నీటుగా నామాలు పెట్టె స్వామివారు పిల్లి నుదుట, పిల్లి భక్తిపుట్టి చెల్లించె పులి హెూర, విశ్వదాభిరామ వినుర వేమ!


ముఘలు పాదుషాలు తుఫలక్ నబాబులు క్క చించి తోలు చెక్కిరంచు కట్టు సాయబయ్య కొట్ట కొట్టు కొట్టు బడాయీలు విశ్వదాభిరామ వినుర వేమ !


తాను ముసలుమాను, తాను తామర్లేను,


మణుకి దూది శత్రుగణము, లింక


ఏకే రెంయి రంయి ఎందరో కాఫర్ల విశ్వదాభిరామ వినుర వేమ !


అప్పుడు విష్ణుభక్తి అప్పుడు శివభక్తి బ్రహ్మభక్తి యిపుడు బయలు దేరె, ఒక్క దేవునికిని చిక్కదు విశ్రాంతి


విశ్వదాభిరామ వినుర వేమ !


సకలమతములన్న చక్కని ఋక్కులు 

ఎన్నో సుకవివాక్కు, లన్ని వచ్చు, 

భక్తవరుని తెలివి బ్రహ్మకు లేదయా

విశ్వదాభిరామ వినుర వేమ !

- కృష్ణశాస్త్రి 

( ఆంధ్రజ్యతి ( పాతకాలం నాటిది ) 

సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

14-11-2021


కవిత: మైత్రీ బంధం - శ్రీ డి. యమునాచార్య

కవిత: 

మైత్రీ బంధం 


- శ్రీ డి యమునాచార్య 

( భారతి - ఏప్రియల్ - 1990 ) 

సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

14 - 11-2021 


ఒక చిగురాకుతో

హిమబిందువు 

చేస్తున్న స్నేహితాన్ని తెంపి 

గాలి నేలపాలు చేసింది.


తెగిపడ్డ ఆ స్నేహితుడు 

ఆ సూర్యునికి చిక్కకుండా 

పుడమి పొరల్లో

 తడి కోసం తపించే 

విత్తుకు తనివితీరా దాహం తీర్చాడు.


విత్తనం గర్భాన్ని ధరించి, 

వృక్షమై జన్మించి, 

రాలే హిమ బిందువులకు 

అర్థతతో ఆకుల అరచేతులు చాచి 

స్వాగత మిస్తోంది.


పరస్పరానురాగ పునీతమైన

వాటి జీవన హేల

నన్ను మురిపిస్తోంది వేళ.

- శ్రీ డి యమునాచార్య 

( భారతి - ఏప్రియల్ - 1990 ) 

సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

14 - 11-2021 

అమ్మమ్మ తల్లి- కథానిక అనుసృజన : కర్లపాలెం హనుమంతరావు

 అమ్మమ్మ తల్లి- కథానిక

అనుసృజన: : కర్లపాలెం హనుమంతరావు

 

మా చిన్నతనంలో మా నాన్నగారి ఉద్యోగరీత్యా కొంతకాలం మేమొక కొండప్రాంతంలో ఉండాల్సివచ్చింది.  ఆ ప్రాంతం పేరు పిచ్చికుంటపల్లిపిచ్చికుంటపల్లికి దగ్గర్లోనే ఒక చిట్టడవి; ఆ చిట్టడవిలో గిరిజనుల ఆవాసాలుండేవి. అడవిలో దొరికే చింతపండు, పుట్టతేనె వంటివి.. ఏ సీజనులో దొరికే సరుకును  ఆ సీజనులో వారానికో సారి జరిగే సంతలకు తెచ్చిఅమ్ముకునేవాళ్ళు. వారానికి సరిపడా కావాల్సిన నిత్యావసర వస్తువులు కొనుక్కుని పోతుండే వాళ్లు.

 పల్లెల్లో తరచూ అంటువ్యాధులు ప్రబలి  ప్రాణహాని జరుగుతుందని జిల్లా కలెక్టరుగారికి ఫిర్యాదులు వెళ్లాయి ఒకసారివాళ్ళకు టీకాలు వేయించే  భాధ్యత మా నాన్నగారి నెత్తిమీద పడింది. ఆయన హెల్త్ డిపార్ట్ మెంట్ లో జిల్లా బాధ్యులు అప్పట్లో.

'ఓస్సోస్! టీకాలే కదా! అదే మంత గొప్ప ఘనకార్యమామనిషి జబ్బ మీద మందులో ముంచిన రొటేటరీ లాన్సెట్ అటూ.. ఇటూ ఓ సారి గిర గిరా తిప్పేస్తేఅని కొట్టిపారేయకండి! పాణిగ్రహణం ఎంత కష్టమో..టీకాలు వేయడానికి ఒప్పించుకుని గిరిజనుల పాణి గ్రహణం చేయడం అంతకన్నా కష్టంఅనుభవించే వాళ్ళకు మాత్రమే తెలిసే అవస్థ అది

 

నౌఖరీ అన్నాక అన్ని రకాల శ్రమదమాదులకూ తట్టుకోక తప్పదు కదాహెల్త్ డిపార్తుమెంటులో పనిచేసే మానాన్నగారూ అందుకు మినహాయింపు కాదు.  

 

రెండురోజులు అడవిలో వుండేందుకు వీలుగా ఓ క్యాంపు కాట్ఇక్ మిక్ కుక్కరు,  హోల్డాలుథెర్మోఫ్లాస్కుమర చెంబు.. వీటినన్నింటినీ మోసుకు తిరిగేందుకు ఒక మనిషిని ఎర్పాటు చేసుకుని మరీ బయలు దేరారు. ఆ తోడువచ్చే మనిషీ అడవిజాతివాడేపేరు 'రఘువా'.

 

రఘువా మాకా ఊరు వచ్చినప్పటినుంచి పరిచయం. చాలా విశ్వాసపాత్రుడు. అతగాడి గూడెంకూడా ఆ అడవిలోనే ఎక్కడో ఉందిముందు ఆ గూడెంనుంచే పని ప్రారంభించాలని మా నాన్నగారి వ్యూహంవాళ్లను చూసి ధైర్యంతో మిగతా గూడేలవాళ్ళు ముందుకొస్తారని ఆయన ఆలోచన.

 

అడవిలోపలి దాకా వెళ్ళి ఒక చదునైన స్థలంలో టెంట్ వేసుకొని.. క్యాంపుకాట్కుక్కరూగట్రాలు సర్దుకుని 'ఆపరేషన్ టీకాఆరంభించబొయే వేళకి బారెడు పొద్దెక్కింది. వెంట తెచ్చుకున్న కిట్లో మందు చాలినంతగా లేదని అప్పుడు చూసుకున్నారుట మా నాన్నగారుఎలాగూ ఇంకో 'బ్యాచ్మందు  పోస్టు ద్వారా వచ్చి సమీపంలోని  పోస్టాఫిసులో వుందని తెలుసు.. కనక బెంగ పడలేదుక్యాంపుకి  ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందా పోస్తాఫిసు. దాన్ని తీసుకుని రమ్మని రఘువా చేతికి చీటీ రాసిచ్చి పంపించి  మంచం మీద కాస్త నడుం వాల్చారుట మా నాన్నగారు.

 

అలవాటు లేని నడక పొద్దుటునుంచీ. అనుకోకుండా కళ్ళు అలాగే మూతలు పడిపోయాయిట. 

 

మెలుకువ వచ్చేటప్పటికి చుట్టూ చీకట్లు కమ్ముకుంటున్నాయి. 

 

అసలే అడవి ప్రాంతంకొత్త చోటుఎటు వైపునుంచి ఏ జంతువొచ్చి మీద పడుతుందో.. అప్పుడేం చేయాలో తెలీదుఉదయం బయలు దేరేటప్పుడు ఇంట్లొ తీసుకున్న అల్పాహారమే! మధ్యాహ్నం క్యాంపులో రఘువా చేత వండించుకుని తిందామని ప్లాన్ఇప్పుడు ఆ రఘువానే ఆజా ఐపూ లేకుండా పోయాడు. ముష్టి ఐదు కిలో మీటర్ల దూరం  పోయి రావడానికి ఇన్ని గంటలాఅందులోనూ నిప్పుకోడిలాగా దూకుతూ నడుస్తాడు రఘువా.

 

ఏం జరిగిందో అర్థం కాలేదుఏం చేయాలో అంతకన్న పాలు పోలేదు మా నాన్నగారికికడుపులో ఎలుకలు పరుగెడుతున్నాయిముందు ఆత్మారాముడి ఘోష చల్లార్చాలిఆనక ఈ రాత్రికి రక్షణ సంగతి చూసుకోవాలి.

 

దగ్గర్లో ఉన్న గూడానికి పోయి వచ్చీ రాని  భాషలో ఏదో తంటాలు పడి తన వెంట ఇద్దరు కోయ యువకులను తెచ్చుకున్నారుట మా నాన్నగారు. తెల్లార్లూ వాళ్ళు టెంటు బైట కాపలా వుంటే.. లోపల పేరు తెలియని జంతువుల అరుపులు వింటూ  మా నాన్నగారి జాగారం.

 

తెల్లవారంగానే ఆయన ముందు చేసిన పని ఒక యువకుణ్ణి టెంటుకి కాపలా పెట్టి.. ఇంకో యువకుడిని తోడు తీసుకుని వెళ్ళి పోస్టుమాస్టరుగారిని  కలవడం.

"మందు ప్యాకెట్టు నిన్నే మీరు పంపించిన మనిషి తీసుకెళ్ళాడు సార్!" అనేసాడుట పోస్తుమాస్టరుగారు తాపీగా.

 

'మా నాన్నగారి గుండెల్లో రాయి పడింది. నిన్ననగా మందు తీసుకున్నవాడు ఇవాళ్టికి కూడా టెంటుకు చేరలేదంటే అర్థమేంటీకొంపదీసి మధ్యదారిలో ఏదన్నా జరగరానిది జరగలేదుగదా!ముచ్చెమటలు పట్టడం మొదలుపెట్టాయిట మా నాన్నగారికి.

 

ఆయన భయానికి మరో ముఖ్యకారణం కూడా ఉంది. రూల్సు ప్రకారం రఘువా ఆ మందు డెలివరీ తీసుకోరాదుఆ అమాయకుడేమన్నా ఈ మందును  ఇంకేదన్నా అనుకుని  దుర్వినియోగం చేసుంటే.. మొదటికే మోసం. మందు సంగతి అలా ఉంచి ముందు మనిషి ప్రాణానికే ముప్పం.

 

 ఏం చేయాలో పాలు పోక అక్కడి పోస్టాఫీసు బెంచీమీద అలాగే కూలబడి పోయారుట మా నాన్నగారు.  పాపంపోస్టుమాస్టరుగారే కాసిని చాయ్ నీళ్ళు తాగించి.. ఆనక సలహా కూడా ఇచ్చారుట."సాధారణంగా ఇక్కడి గిరిజనులు చాలా నిజాయితీగా ఉంటారండీ! ఇంకేదో జరిగి వుండాలి. ఏం జరిగిందో తెలుసుకోవాలన్నా ముందు మీరు ఆ రఘువా ఉండే గూడేనికి వెళ్ళి వాకబు చేయాలిఅక్కడి పరిస్థితులను బట్టి అప్పుడు ఏం చేయాలో ఆలోచించుకుందురుగాని.. ముందు బైలుదేరండి" అని తొందరపెట్టి మరీ పంపించాడుట.  రఘువా గూడేనికి వెళ్లే దారికూడా  ఆయనే  చూపించాడుట.

 

ఆరు మైళ్ళు.. డొంకదారుల్లో బడి.. ఎత్తులూ పల్లాలూ దాటుకుంటూ.. రఘువా ఉండే గూడేనికి చేరుకొనేసరికి సూర్యుడు నడినెత్తిమీద కొచ్చేసాడుట.

 

గూడెం పొలిమేరల్లోనే ఒక  ఊరేగింపు ఎదురైందిట వాళ్ళకు. ఆడామగా అట్టహాసంగా చిందులేసుకుంటూ  కోలాహలంగా  వస్తున్నారు  బాజాలూ బంత్రీలూ మోగించుకుంటూ. మధ్యమధ్యలో జివాల బలులు. కోళ్ళని గాల్లోకి ఎగరేసి గొంతులను లటుక్కుమని నోటితో కొరకడం.. చిమ్మేరక్తాన్ని ఊరేగింపు మధ్యలో  ఉన్న దున్నపోతుమీదకు చల్లడం! దున్నపోతుకు చేసిన అమ్మోరి వాహనం అలంకారంలో ఈ రక్తం కలగలిసిపోయి చూపులకే పరమ భయంకరంగా ఉందంట అక్కడి వాతావరణం. అన్నింటికన్న విచిత్రమైన విషయం.. ఆ దున్నపోతు మీద ఊరేగుతున్న పెద్దమనిషి ఎవరో కాదు.. సాక్షాత్తూ రఘువానే! 

 

వాహనం మీద అటో కాలూ ఇటో కాలూ వేసుకుని  వళ్లో ఏదో బుట్టతో దేవుడల్లే  కూర్చోని వున్నాడుట. నుదిటిమీద పెద్ద పెద్ద కుంకుమ బొట్లు.. మెళ్ళో పూలుపూసలు కలగలిపి అల్లిన దండలు.. చేతిలో బల్లెం.. చూడ్డానికి సాక్షాత్తూ యమలోకం నుంచి దిగొచ్చిన  కింకరుడు మల్లే ఉన్నాడుట. 

 

చేతులూ రెండూ కట్టుకుని.. ముంగిలా.. ఎప్పుడూ వెనకెనకే వంగి వంగి నడిచే రఘువాలో ఇన్ని కళలున్నాయా!' ఆశ్చర్యంతో మానాన్నగారి నోటంట మాట రాలేదుట. ఆటైములో.

 

అసలేం జరుగుతుందో అర్థం కాలేదుత ముందాయనకు. వెంటవచ్చిన గిరిజనుడిదీ అదే పరిస్థితి. 'కనుక్కొస్తాన'ని అటుగా వెళ్ళిన మహానుభావుడు.. నీరసంతో శోషొచ్చి మా నాన్నగారు  బండమీద వాలి పోయిందాకా తిరిగి రానేలేదుటఅరగంట తరువాత వచ్చి దగ్గర్లోని చెట్టునుంచి రెండు జాంకాయలు  కోసి తినిపించి అప్పుడు తీరిగ్గా వినిపించాడుట తెచ్చిన సమాచార ఆ గిరిజనుడు.

 

 

 అతగాడు తెచ్చిన సమాచారం ప్రకారం ఇంకో గంటలో ఊరిబైట కొత్తగా గుళ్లో అమ్మమ్మ తల్లి ప్రతిష్టాపన జరగబోతుంది.

'అమ్మతల్లితెలుసు గాని.. ఈ 'అమ్మమ్మ తల్లిఎవరూ?" అని అడిగారుట మానాన్నగారు.

"నాకూ తెలీదు దొరాఎప్పుడూ వినలేదుచూద్దాం పదండి" అని అర్థం వచ్చే వాళ్ళభాషలో ఏదో కూసి ఆ దేవాలయం ఎక్కడ కడుతున్నారో అక్కడికి  నడిపించుకుని పోయాట్త ఆ గిరిజనుడు.

 

ఊరికి ఉత్తరంలో కొత్తగా కాల్సిన మట్టి ఇటుకలతో కట్టిన నాలుగు గోడల గుడి అదిదాని మధ్యలో అరగంట కిందటే ప్రతిష్టించినట్లున్నారు అమ్మమ్మతల్లిని.. బైట ఇంకా పచ్చి ఆరని బల్లుల రక్తం మరకలు.. పసుపు కుంకుమల వాసనలు.. సగం కాలిన అగరవత్తులూ..!

 

అప్పటి దాకా సందడి చేసిన గిరిజనులు.. ప్రతిష్టాపన అనంతరం.. సంబరాలు చేసుకుంటూ ఒక దిక్కుకు వెళ్ళిపోవడం చుసారుట మా నాన్నగారు.

'టీకా మందు తెమ్మ'ని పంపించిన నమ్మకస్తుడు.. అలా అన్నీ మరిచి మందుకొట్తి కొత్త దేవుడి అవతారంలో మందతో కలిసి ఇలా ఆడుతూ..పాడుతూ మొహం కూడా చూపకుండా వెళ్ళిపోతుంటే.. అంత లావు ఆఫీసరు సారయివుండీ..ఏం చేయాలో దిక్కుతోచక అలాగే నిలబడిపోయారుట మానాన్నగారు.

 

"అప్పటికింక చేసేదేమీ లేదు.. తిరిగి మళ్ళీ చీకటి పడేలోపు టెంటుకెళ్ళి బబ్బోవడం తప్పమళ్లీ మందు  తెచ్చుకొని  'ఆపరేషన్ టీకాకంటిన్యూ చేయడమెలాగూ తప్పదు. జరిగిందంతా పై అధికారులకు  వివరంగా చెప్పి పడబోయే పనిష్మెంటుకి తలవగ్గడం ఎలాగూ  తప్పదు.అలా అనుకున్న తరువాత ఇంక వర్రీ అవడం మానేసానుఎలాగూ పోతున్నాము కదా.. ఒక సారి ఈ కొత్త దేవత అమ్మతల్లి ఎలాగుంటుందో చూడాలని కుతూహలం పుట్టుకొచ్చింది" అని చెప్పుకొచ్చారు మా నాన్నగారు తరువాత మా కాకథ చెప్పే సందర్భంలో ముక్తాయింపుగా.  గుర్తున్నంత వరకూ ఆయన మాటల్లోనే చెప్పి ఈ కథ ముగిస్తా.

 

"..అప్పటికే నావెంట వచ్చిన గిరిజనుడు గుడిముందు పడి పొర్లుదండాలు పెట్టేస్తున్నాడు. గుడికి ఇంకా పైకప్పు ఏర్పాటు కాలేదుకాస్త ముందుకు వెళ్ళి లోపలికి తొంగి చూసా!

ఆశ్చర్యం! పీఠంమిద  'టీకా మందుల పెట్తె'! అదే రఘువా పోస్తాఫీసునుంచి విడిపించుకొచ్చింది. దానికి అన్ని వైపులా పసుపూ కుంకుమ బొట్లు పెట్టున్నాయి! ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. మెడిసన్ తొ పాటు ప్రచారానికని సప్లై చేసిన  డిస్ ప్లే మటీరియల్లో ఒక సినిమాతార  కుడిచేత్తో సిరెంజి.. ఎడం చేత్తో అభయ హస్తం ముద్ర పట్టి వున్నట్లు ముద్రించిన పోస్టరు ఒకటుంది.. అది ఆ గుడిగోడ లోపల అంటించి ఉందిఆ సినీతార నుదుటనిండా ఇంత మందాన కుంకుమ బొట్లు.. కాళ్ళకి పసుపు పారాణీ!.. టీకాలు సక్రమంగా  వేయించుకుంటే ఆరోగ్యానికి భద్రతఅన్న నినాదం ఇచ్చే సినిమా తార హఠాత్తుగా  ఈ గిరిజనులకు 'అమ్మమ్మతల్లి'ఐపోయిందన్నమాట!  అలా ఎందుకయిందో..ఎలా ఐందో ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థమై చావలేదు.

మర్నాడు తిరిగి వెళుతూ వెళుతూ దారిలో పోస్టుమాస్టరుగారిని మళ్ళా కలిసి విచారించినప్పుడు గానీ ఆ చిక్కు ముడి విడిపోలేదు.

"మీ రఘువా మందు ప్యాకెట్టూ.. ప్రచార మెటీరియల్ తీసుకుంటున్నప్పుడు 'నన్ను అడిగాడండీ.. ఇదేమిటి దొరా?" అనిఇక్కడి కొండజాతివాళ్ళు 'ఆట్లమ్మా..మశూచికంలాంటి అంటువ్యాధులని 'అమ్మోరుఅని పిలుచుకుంటుంటారుఆ అమాయకుడికి బాగా అర్తమవుతుందన "మీ అమ్మోరుని చంపేసే మందురా" అని చెప్పాసార్!. దాన్నా అమాయకుడు 'అమ్మమ్మ తల్లిగాభావించాడుమీకు తిరిగి తెచ్చిస్తే మిగతా గూడేలకందరికీ పంచేస్తారు కదావాళ్ల గూడెపొళ్ళకి దక్కకుండా పోతుందనుకున్నాడో ఏమో.. నేరుగ్గా గూడేనికే తీసుకెళ్ళి నాయకుడి పరం చేసేసాడు. ఆ నాయకుడూ అంతకన్నా తెలివిమంతుడు లాగున్నాడు. వాళ్ల ఆచారం ప్రకారం ఈ 'అమ్మమ్మ తల్లి'కి ఊళ్ళోనే గుడి కట్టించి పారేశాడు" అని వివరించాడ్దుట పోస్టుమాస్టరుగారు"

 

అదండీ ఆ గిరిజనుల అమాయకత్వం. వాళ్ళంటే అనాగరికులు. చదువుకోని వాళ్ళుఅన్ని చదువులు చదివి ఇంత నాగరీకం వెలగబోసే మనం మాత్రం ఇంతకన్నా తెలివిగా ప్రవర్తిస్తున్నామాఆలోచించుకోవాల్సిన విషయం ఎవరికి వాళ్ళుగా!

అందుకే అప్పటి కథ ఇప్పుడు చెప్పుకొచ్చింది.*

అమ్మమ్మ తల్లి- కథానిక

అనుసృజన : కర్లపాలెం హనుమంతరావు

Tuesday, December 7, 2021

యుగద్రష్ట గురజాడ - ఆధునిక తెలుగు నాటకం - కె. రవివర్మ సేకరణ - కర్లపాలెం హనుమంతరావు

 





యుగద్రష్ట గురజాడ -  ఆధునిక తెలుగు నాటకం

- కె. రవివర్మ

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 


(కేరళనుంచి వెలువడుతున్న హిందీ మాసపత్రిక “సాహిత్య మండర్ పత్రిక" ప్రధాన సంపాదకులు కె. రవివర్మ. తెలుగు సాహిత్యానికి మిత్రులు. ప్రజా సాహితి “గురజాడ కన్యాశుల్కం ప్రదర్శన శతాబ్ది" సంచికను ఆగస్టు 92లో వెలువరిస్తున్నామని వారికి ప్రజాసాహితి తెలియజేస్తో, ఈ నాటకం మళయాళంలోకి అనువాదం జరిగిందా ? అయితే ఓ సరిచయ వ్యాసం హిందీలో రాసి పంపమని కోరింది. మళళంలోకి అనువాదం కాలేదని ప్రజాసాహితికి తెలియజేస్తూ, 'కన్యా శుల్కం' పై హిందీలో పరిచయ వ్యాసం రాసి పంపమని వర్మ ప్రజాసాహితిని కోరారు. 'ప్రజాసాహితి' ఆంధ్ర విశ్వవిద్యాలయం హిందీ లెక్చరర్ కృష్ణ గారిచేత వ్యాసం రాయించి పంపించింది. ఆ వ్యాసాన్ని 'సాహిత్య మండల్ పత్రిక' జూలై 1992 సంచికలో ప్రచురిస్తూ, వర్మగారు ఆదే సంచికలో రాసిన సంపాదకీయం “యుగద్రష్టాః ఏక్ తెలుగు నాటక్” కోసం ఈ క్రింద ప్రచురిస్తున్నాము. తెలుగు అనువాదం ప్రజాసాహితి పాఠకుల కోసం ప్రచురిస్తున్నాం . 


విజయనగరం (ఆంధ్ర) లోని జగన్నాధ విలాసినీ సభ అనేసాంస్కృతిక  సంఘం కేవలం సంస్కృత నాటకాలే ప్రదర్శిస్తూ వచ్చేది. అలాంటిది  అదే సంస్థ ఓ తెలుగు నాటకం ప్రదర్శించి, తెలుగు సాహిత్యంలో, రంగ స్థలంలో ఓ సంచలనం  సృష్టించింది. ఈ నాటకం యధాస్థితివాదులు, సాహిత్య సమాలోచకుల విమర్శకు గురి అయింది. నాటకం పేరు "కన్యాశుల్కం" . 


వివాహం పేరిట యుక్తవయుసు రాని కన్యల్ని, వారి తల్లిదండ్రులకి డబ్బుయిచ్చి  కొనుక్కో వడం. ఈ నాటకం ఇతివృత్తం. ఈ నాటకం ద్వారా  రచయిత గురజాడ వేంకట అప్పారావు తెలుగు త్యంలో శాశ్వత స్థానం పొందారు. 


శ్రీ గురజాడ అప్పారావు విజయనగరం యం. ఆర్. కాలేజీలో ఇంగ్లీషు, సంస్కృత అధ్యాపకులు. అయినప్పటికీ (తెలుగులో) గ్రాంథిక రచనలు చేసే పద్దతికి స్వస్తి చెప్పి, ప్రపథమంగా  తెలుగు నాటకంలో వ్యావహారిక భాషనీ, నుడికారాన్ని ప్రవేశపెట్టారు. అందువల్ల ఈనాడు వారు ఆధునిక తెలుగు సాహిత్యానికి వెలుగుదారి చూపినవారుగా గుర్తింప బడుతున్నారు. 


'కన్యాశుల్కం' ఆధునిక నాటక లక్షణాలని తూ.చ. తప్పకుండా అనుసరించి ఉండక పోవచ్చు. అయినా ఎక్కువ శాతం నిరక్షరాశ్యులు ఉన్న సమాజంలో భావవ్యాప్తికి మాధ్యమంగా నాటక ప్రక్రియని ఎంచుకోవడం ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. చెప్ప దలచుకున్న విషయానికి హాస్యాన్ని జోడించి ప్రేక్షకుల ముందుంచితే అది తన

లక్ష్యాన్ని తక్షణం  సాధించుకుంటుంది . 'కన్యాశుల్కం' నాటకం రాయడంలో శ్రీ గుర జాడ ఉద్దేశం సాంఘిక దురాచారాల మూలాలను  చీల్చి చండాడటం.


కన్యాశిల్కం 1892 ఆగస్టు 13వ తేదీన తొలిసారిగా రంగస్థలం మీ ద ప్రదర్శింపబడింది. 1897 సం॥రంలో గ్రంథరూపంలో వెలువడింది. నాటకానికి రాసిన 'భూమి'క'లో శ్రీ గురజాడ యిలా అన్నారు. "విజయనగరం మహారాజు గారి ఆదేశం ప్రకారం పదేళ్ళ క్రితం నేను బ్రాహ్మణ శుల్క  వివాహాలను గురించిన కొన్ని వాస్తవాలను పోగుచేశాను. విశాఖపట్నం ప్రాంతంలో గత మూడు ఏళ్ళగా (1880–83) ఇలాంటి వివాహాలు 1034 జరిగాయి.  ఈ సంఖ్య పరిపూర్ణ మయినది కాదు. కారణం– తత్సంబంధిత వ్యక్తులు తమ కన్యల్ని కుల్కం తీసు కొని వివాహం జరిపినట్టుగా అందరూ ఎలా ఒప్పుకుంటారు ?"


“పైన ఉదహరించిన అంకెలను గురించి ఒక ఏడాదిలో సగటున కుల్క వివాహాలు 334 జరిగాయి. 99 మంది అల్ప వయసులో, 44 మంది నాలుగేళ్ళ అమ్మాయిలకీ, 36 మంది మూడేళ్ళ అమ్మాయిలకి, ఆరుగురు రెండేళ్ళ అమ్మాయిలకీ, ఏడాది వయసు ముగ్గురమ్మాయిలకి శుల్కం తీసుకొని పెళ్ళిళ్ళు జరిగాయి. అమ్మా యిలకోసం తీసుకొన్న శుల్కం  350 రూపాయల నుంచి 400 రూపాయల మధ్య ఉంటుంది. యుక్త వయసు రాకుండానే శుల్క వివాహాలు జరిపించే ఈ దుష్ట సాంప్ర దాయం ఎంతవరమా పోయిందంటే గర్భంలో ఉన్న శిశువుకి సయితం శుల్కం తీసుకొని పెళ్ళి ఖాయం చేసుకోవటం దాకా వెళ్ళింది. ఇంతకన్నా అవమానకర మయిన విషయం సమాజానికేం ఉంటుంది ? ఇటువంటి సాంఘిక దురాచారాల

నిర్మూలనకు  సాహిత్యం నడుం కట్టాలి. ఈ నాటక రచనకి ప్రేరణ ఈ భావమే. 


" కుల్కం లేక వెలయిస్తే ముసలి వగ్గులకి సయితం ముక్కుపచ్చలారని బాలికలు లభిస్తున్నారు. కౌమార్యంలోనే వైధవ్యం ప్రాప్తించే వీరి చేత యిళ్ళల్లో గొడ్డు చాకిరీ చేయిస్తున్నారు.”


కేరళలో సంబూద్రీల (కేరళ బ్రాహ్మణులు) మధ్య సయితం బాల్య వివా హాలు పరిపాటి. అయితే అవి శుల్కం యిచ్చికాక, వరకట్నం ఇచ్చి జరిగేవి. బహు భార్యా వివాహాలు కూడా సర్వసాధారణ విషయం. డబ్బుల అవసరాన్ని బట్టి ఏకన్య తోనయినా వివాహం జరిపించేసేవారు. ఒక్కో పురుషునికి నలుగురేసి భార్యలు . వాళ్ళ మధ్య కీచులాటలు, తగవులాటలు ,అంతఃపుర సవతి  కలహాలు సాధారణం. స్త్రీ లు పరదా  పద్ధతి  పాటించేవారు. పరాయి మగవాని ఎదుటికి వచ్చేవారు కారు. నంబూద్రీ బ్రాహ్మణుల్లో  యింటి పెద్ద కొడుకు మాత్రమే నంబూద్రీ కన్యలనే వివాహం చేసుకునేవాడు. అందువల్ల కన్యాధారంనుంచి విముక్తి కోసం ఆమె తల్లిదండ్రులు ఎంత వరకట్నమయినా సమర్పించుకొని, కాటికి కాళ్ళు సాచుకొన్న నంబూద్రీ వృద్ధునికి  సయితం తమ కన్యల్ని కట్టబెట్టేవారు. 


ఈ సాంఘిక దురాచారానికి వ్యతిరేకంగా 1930వ దశకంలో నంబూద్రీ యువకులు పెద్ద ఎత్తున ఆందోళనను చేపట్టారు. తెలుగులో 'కన్యాశుల్కం'లా, (మళయాళంలో సయితం) నాటకాలు రాసి ప్రదర్శించేవారు. నవలలూ, కథలూ రాసే వారు. ఈ ఉద్యమం విజయవంతమయింది. సాహిత్యానికి ఉన్న శక్తి ఏమిటో, సంఘసంస్కరణకి సాహిత్యం ఎంతలా దోహద పడగలదో ఋజువయింది.


గిరిజనులలో సయితం ఓలి యిచ్చి కన్యల్ని కొనుక్కొనే ఆచారం ఉందని అంటారు. అయితే చిన్న వయసుగల బాలికల్ని కాదు. వయసు వచ్చిన యువతీ యువకులు పరస్పరం యిష్ట వడ్డ తర్వాతనే గిరిజనులలో వివాహాలు జరుగుతాయి. అంతేగాని 'కన్యాశుల్కం' నాటకంలోలాగ ముక్కుపచ్చలారని పసికందులతో క్రూరంగా చెలగాటం ఆడుకోవటంకాదు.


—అనువాదం : నిర్మలానంద

( ప్రజాసాహితి - జనవరి 1993 ) 

సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 


 

పేరడీ ప్రక్రియ - రుక్మిణీనాథశాస్త్రి - పరిశీలన – కె.వి.ఆర్ - జరుక్ శాస్త్రి పేరడీలు ( P. 19-25 ) కె.వి. రమణారెడ్డి

 




పేరడీ ప్రక్రియ - రుక్మిణీనాథశాస్త్రి


పేరడీ ప్రక్రియమాత్రం తెలుగుకి కొత్తదే. పేరడీ అంటే కోతి కొక్కిరాయి కవిత్వమని నోరి నరసింహశాస్త్రి వర్ణించినట్లుగా ఇటీవల శ్రీశ్రీ రాశాడు. ఏ సాహిత్యంలోనైనా అలాంటిది వుంటుంది. ఎమి తిని కపితము సెపితివి గానీ, అండజ భీము ఉండ గానీ, మేక మెకమేక మెకమేక గానీ నోరివారి కోతికొక్కిరాయి కవిత్వమే. చంద్రరేఖా విలాసాన్ని చంద్రరేఖా విలాపంగా సాంతం మార్చింది. విదూషక తత్వం కాదు. దూషక తత్వమే. పేరడీ కవిత్వం అలాంటిది కాదు. ధూర్జటికవిని తెనాలి రామలింగకవి తెలిసెన్ భువనైక మోహనోద్ధత సుకుమార వార వనితా జనతా ఘనతాపహారి... పద్ధతిలో ఏడ్పించడం పేరడీ అవుతుందా ? దీని దినుసు వేరే. ఇలాంటి ప్రక్రియను తెలుగులో ప్రవచించడానికి ఏ నమూనా దొరికిందో తెలీదు కాని, రుక్మిణీ నాథశాస్త్రి మాత్రం శ్రీశ్రీ విదూషకాంశను పట్టేసినట్టుంది. కుటుంబరావు ఒక మాటన్నాడు.


పేరడీ ప్రక్రియమాత్రం తెలుగుకి కొత్తదే. పేరడీ అంటే కోతి కొక్కిరాయి కవిత్వమని నోరి నరసింహశాస్త్రి వర్ణించినట్లుగా ఇటీవల శ్రీశ్రీ రాశాడు. ఏ సాహిత్యంలోనైనా అలాంటిది వుంటుంది. ఎమి తిని కపితము సెపితివి గానీ, అండజ భీము ఉండ గానీ, మేక మెకమేక మెకమేక గానీ నోరివారి కోతికొక్కిరాయి కవిత్వమే. చంద్రరేఖా విలాసాన్ని చంద్రరేఖా విలాపంగా సాంతం మార్చింది. విదూషక తత్వం కాదు. దూషక తత్వమే. పేరడీ కవిత్వం అలాంటిది కాదు. ధూర్జటికవిని తెనాలి రామలింగకవి తెలిసెన్ భువనైక మోహనోద్ధత సుకుమార వార వనితా జనతా ఘనతాపహారి... పద్ధతిలో ఏడ్పించడం పేరడీ అవుతుందా ? దీని దినుసు వేరే. ఇలాంటి ప్రక్రియను తెలుగులో ప్రవచించడానికి ఏ నమూనా దొరికిందో తెలీదు కాని, రుక్మిణీ నాథశాస్త్రి మాత్రం శ్రీశ్రీ విదూషకాంశను పట్టేసినట్టుంది. కుటుంబరావు ఒక మాటన్నాడు.


Long rolling a ruinous red eve And lifting a mutinous lid


To all monarchs and matrons I said" | Would shock them" and did !


మాతృక లాగానే వుంటూ అర్ధాన్ని లఘువు చేస్తూ, అపహసిస్తూ తల్లివేలితో తల్లికన్నే పొడిచేలా రూపొందే రచనా పుత్రికను పేరడీ అనవచ్చు. మాతృకను మక్కీకి మక్కీ అనుసరించనక్కరలేదు. మొక్కట్లు కనిపిస్తే చాలు. రాయప్రోలువారి శైలిని హితోపదేశంలో ఎంత సరసంగా దురుద్దేశరహితంగా హేళనచేశారో(పుట103) తెలుపుతుంది. తల్లి నోట్లోంచి వూడిపడ్డట్టుగా తల్లినే మరిపించేదానికి ఆ పక్క పుటలోని కొత్త ఎంకిపాట చాలు. అబ్సర్డ్ స్థాయిని కొంచెం దించి హాస్యం పుట్టించేది మృత్కణానికీ, మత్కుణానికి సంబంధించింది (పు.113114లు). శుద్ధహేళనకు గొప్ప తార్కాణం, మల్లవరపు విశ్వేశ్వరరావుగారి రచనను యెద్దేవాచేసిన “కఞ-కఞ (పు 126-128లు). నాయని సుబ్బారావు ఖండిక "ఆసురకృత్యము" ముగ్ధప్రణయ విఘాతకుణ్ని గంభీరంగా నిరసిస్తే, పేరడీలోవాడు దగుల్బాజీ అయ్యాడు. విదూషకత్వం పరాకాష్ఠ పొందింది విశిష్టాదైత్వంలో. అక్షింతలు పేరడీ కాదు. ఆ ప్రయోగం విచిత్రమైన హస్తలాఘవంలాటి కూర్పు నేర్పరితనం. వీటన్నిటినీ తలదన్నేది వచన పేరడీలో వున్న ఒక శిలాశాసనం. రుక్మిణీనాథశాస్త్రి వ్యుత్పన్నత ప్రతిభాదీప్తిచేత అసాధారణంగా రాణించింది. నీదు మార్గాన నియంత నేతలేడు అని పేరడీ సందర్భంగా ఆయన మాటలను ఆయనకే అప్పజెప్పవచ్చు. శ్రీశ్రీ దేశచరిత్రలు కూడా పేరడీ అయిందట గాని కనిపించి చావందే ?


ఏ కాకి చరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం ?


ఇలా మొదలైందని శ్రీశ్రీ, ఆరుద్రా చెబుతూన్న యీ పేరడీ విషయంలో చెరో చరణమో అంగులో గుర్తుందిగాని పూర్తిపాఠం ఎవరికీ


కంఠోపాఠం కాలేదు. ఆ లోటుని మాచిరాజు దేవీప్రసాద్ బాగానే భర్తీ చేశాడు. ఏమైనా రుక్మిణీనాథశాస్త్రి హస్తవాసి వేరే, పేరడీశాస్త్రం సారమెరిగి తాను పేరడీశాస్త్రి కాలేదు. శాస్త్ర నిర్వచనాలూ, గట్రా చూదామా?


అలెక్ట్ ప్రేమింజర్ ఎడిట్ చేసిన ప్రిన్స్టన్ ఎన్సైక్లోపీడియా పొయిట్రీ అండ్ పొయిటిక్స్ (1974)లో, PARODIA అనే గ్రీక్ మూలంనుంచి ఇంగ్లీషు శబ్దం పేరడీ ఏర్పడిందని వుంది. ఎదురు పాట (Counter song) అనే కావ్య విశేషం ఒకటి సుప్రసిద్దమే గదా, సదరు ఓడ్ను తలపించే ఎదురు ఓడ్ పేరోడియా అవుతుంది. వెబస్టర్ న్యూ వరల్డ్ డిక్షనరీ" (1956)లో రెండర్థాలిచ్చారు.


1. Literary or musical composition imitating the characteris tic style of some other work or of a writer or composer but treating a serious subject in a nonsensical manner in an attempt at humour or ridicule..


2. A poor or weak imitation.


మనకు కావలసింది పై వాటిలో మొదటిదే. సంగీత సాహిత్యాలలో ఒకానొకని కృతికి విలక్షణమైన శైలిని అనుకరిస్తూనే, గంభీరమైన ఆకృతి విషయాన్ని హాస్యం కోసమో, హేళన కోసమో అర్థరహితమయ్యేట్టు చూపే సాహిత్య సంగీత అనుకృతి పేరడీ.


విషయాన్ని అలాగే వుండనిచ్చి వికృతరూపమిస్తే ట్రేవెస్టీ అవుతుందనీ, నిజానికి మరీ అతిశయంగా, అడ్డూ ఆపూ లేనట్టుగా మూలాన్ని పేరుకి మాత్రమే అనుకరిస్తే బర్ట కాగలదనీ Cassell's Encyclopaedia of Literatureలో అనుకరణ భేదాల వివరణ వుంది. పరమోత్తమమైన పేరడీ, మూలరూపానికి మాత్రం విధేయంగా వుంటూ వస్తువుకేమో చేటు కలిగించేదని కొద్దిలో చెప్పారు. అయితే అలాంటి పరమోత్తమత చాలా అరుదట. ప్రాచీనకాలంలో ఆరిస్టొఫేనీజ్ మొదలు ఆధునిక యుగంలో జేమ్స్ జాయిస్ దాకా గొప్ప పేరడిస్టులుగా పేరు తెచ్చుకున్నవాళ్ళు విడి


విడి కావ్యఖండికలను గాక, కవులనూ, కవితారూపాలనూ అనుకరించారు. ఒకే ఒక కృతిని పేరడీ చేసి సెబాసనిపించుకున్న వారిలో బైరన్ ఒకడు. సౌతీ ఖండిక "ది విజన్ ఆఫ్ జడ్జ్మెంట్ (The vision of judgement) ను అనుకరించాడు. అలాగే వర్డ్స్ వర్త్ రచన పీటర్ బెల్ను షెల్లీ అద్భుతంగా అనుకరించాడు. అనుకరణలో సృజనాత్మకత ఎంత వుంటుందో విమర్శ అంత వుంటుంది పేరడీ ప్రతిసృష్టి.


ఉదాహరణకు సరదాపాట పెట్టినందువల్ల కూడా చిత్రమైన ఫలితం − ( 12\


కేవల విదూషక చర్యకు కోతి చాలు. నోరి నరసింహశాస్త్రి కోతి యిదే. కుశాగ్రబుద్ధి అయిన ప్రతిభాన్వితుడు ఎవరిని అనుకరించాలనుకుంటాడో వారి ఆనుపాను లెరిగి, వాటినేమిచేస్తే తానుద్దేశించిన ఫలితం కలుగుతుందో తెలుసుకోగలగాలి. మహోదాత్త మనిపించే మూలరచన పేరడీకి బాగా పనికిరాగలదు. దాన్ని తెలివిగా కదిపి కుదిపితే ఆ వుదాత్తత వుల్టా సీదా అవుతుంది. సందర్భశుద్ధి తప్పిందా, దాని గంభీరభావం అభావమై హేళనపాత్రమౌతుంది. అసలు శీర్షికను మార్చి తమాషా శీర్షిక కలుగుతుంది. శ్రీశ్రీ నవకవిత యిలా మారింది గాని దాని అర్థపుష్టికి ఏమీ కాలేదు గనక యిలాంటి పేరడీ మేలురక మనిపించుకోదు. పేరడీ అంటేనే అతిశయత్వం. మూలానికి గల సందర్భాన్ని మార్చినందుచేత దానిలో ప్రముఖంగా వుండిన అంశాలను విడగొట్టి వూతమిచ్చి చూపినట్ల వుతుంది. గొప్ప పేరడీలు కొన్ని వేరే సందర్భాలలోనైతే మూల కృతులుగానే చలామణి కావచ్చు. ఏవో కొన్ని మాటలను మాత్రమే అరువు తెచ్చుకుని అనుకృతిలో చేరిస్తే, దాన్ని పేస్టీష్ (Pastiche) అనవచ్చునేమో గాని పేరడీ రూపభేదమనడం సరి కాదు. కాల్పనిక కవిత పేరడీలకు భేషైన సదవకాశం. ద్వాదశి చూడండి. విశిష్టాద్వైతం కూడా ప్రణయం సైతం. దీనికి కారణం, ఆ ధోరణి కవితలోని భావోల్బణం.


హేళనకోసం హేళనే పేరడీ లక్షణం కాదు. దానికో కారణం వుండాలి. సకారణ హేళన పరోక్ష విమర్శ, పేరడీకారుడు తన కాలపు ఆచారు


వ్యవహారాలనూ, రాజకీయ, నైతిక పద్ధతులనూ, విలువలనూ వ్యంగ్యంగా నిరసించడం అవసరమౌతుంది. లేకుంటే పేరడీకి ప్రయోజనం లోపిస్తుందని ఎన్సైక్లోపీడియా బ్రిటానికాలో (14వ ఎడిషన్, 17వ వాల్యూము) ఇ.వి. నాక్స్ రాశాడు. ఇవేవీ లేనిపక్షాన పేరడీ పేరుతో వెలువడుతూ వున్నది క్షుద్రవినోదం అయే ప్రమాదం వుంది. ఛందస్సు, దాని నియమాలు ఎక్కడా భంగపడగూడదు. ఇది కత్తిమీద సామేగాని గారడీ మాత్రం కాదన్నమాట.


ధేసోస్ నివాసి హేజిమాన్ పేరడీ ప్రక్రియకు పితామహుడని ఆరిస్టాటిల్ అభిప్రాయం. హోమర్ మహేతిహాసం ఇలియాడ్ కు ఇఫీనస్ వాస్తవ్యుడైన హిప్పోనార్స్ అద్భుతమైన పేరడీ సృష్టించాడట. ఈస్కిలస్, యూరిపిడీజ్ గొప్ప నాటకకర్తలు. ఆరిస్టోఫేనీజ్ కూడా అంతే ఘనుడు. అయినా మొదటి యిద్దరికీ తాను పేరడీ చేశాడు. మధ్యయుగాల వీరశృంగార గాథాసంప్రదాయాన్ని సెర్వాంటెస్ డాన్ క్విక్సోట్లో చేసింది పేరడీయే. షేక్స్పియరంతటివాడు మార్లోను మర్కటించాడు. ఇంగ్లీషు సాహిత్యంలో పోప్ూ, థామ్సన్నూ, యంగ్నూ అనన్యంగా పేరడీ చేసి వదిలింది ఐజాక్ హాకిన్స్ బ్రౌన్. ఇతనితోటి పేరడీకి స్వర్ణయుగం ప్రారంభమైనట్టు భావిస్తున్నారు. ఇది నేటికీ అనుస్యూత మవుతూంది. ఏమైనా అనుకరణకు లక్ష్యం సంస్కరణ. హేళన మూలంగా ఇది సూచ్యం కావాలి. ఈర్ష్యాసూయలకూ, ద్వేషానికీ ఇది చోటివ్వగూడదు. a critical act of imaginative reproduction అనే నిర్వచనం సార్థకం కావాలి. మరెందుకైనా కాకున్నా, పేరడీ ప్రక్రియను ప్రచురం చేసి తెలుగు కవిత్వంలో దానికి ప్రసిద్ధి చేకూర్చినందుకు రుక్మిణీనాథశాస్త్రి కీర్తి చిరంజీవి.


5


రుక్మిణీనాథశాస్త్రి కావ్యాలు లభించినంతమట్టుకు ఈ సంపుటాని కెక్కుతున్నాయి. ఇది సమగ్రమని అనడం లేదు. సహకరించదగినవాళ్ళు


మాటకు కట్టుబడి వున్నా యిది సమగ్రమయేది కాదు. ఎందుకంటే, అవి మరెన్ని పత్రికలలో పడివున్నాయో నిశ్చితంగా తెలియదు. మారు పేర్లతో రాసే దురలవాటు వుండినందుచేత ఏవి ఆయనవో, ఏవి ఇతరులతో తెలిసే వీలు తక్కువ.


ఈ సంపుటానికి యీ మాత్రం నిండుదనమైనా చేకూరడానికి ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, బంగోరె, అనంతం వంటివారు తలా ఒక చెయ్యి వెయ్యడం కొంతవరకు కారణం. పేరడీలకేగాక సాదా రచనలకు కూడా పూర్వాపరాలు చెప్పి విషయపరిజ్ఞానానికి తోడ్పడినవారు ఇం.హ.శా. ఆరుద్ర నడిగితే దీనికి అక్షింతలు అని పేరెట్టి వుండును. నేనాపని చెయ్యడం లేదు. ఆ పేరైనా రుక్మిణీనాథశాస్త్రి అంగీకారం పొంది వుండేదా? నమ్మకం లేదు.


నిజానికి శరత్పూర్ణిమ (జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి కథల సంపుటి) కంటె ఇది ముందు రావలసింది. బాపు చిత్రరచన వగైరా అవసరమైనందు చేత రెండవదిగా వెలువడుతోంది. నాటికలు, వ్యాసాలు, సమీక్షలు, ఇతర వచన రచనలు మూడో సంపుటిగా వస్తే రచయితగా రుక్మిణీనాథశాస్త్రి పూర్ణవ్యక్తి లోకం ఎదుట అక్షరరూపంలో సాక్ష్యాత్కరిస్తుంది. పెద్దమనస్సు చేసుకున్న నవోదయ పబ్లిషర్సు అభినందనీయులు. గైషామ్స్ వంటిదొకటి తెలుగు సాహిత్యంలో ఇప్పుడు మంచి దాన్ని కిందుజేసి కీతసరుకుని లాభసాటి చేస్తూ బళ్ళకు బళ్ళు దించుతున్న సమయంలో మరుగునపడిన మంచి రచయితలకు మళ్ళీ సూర్యాలోకం కలిగించడం విశేషం కాదా మరి? కనీసధర్మంగా, మధ్యే మధ్యే యిలాంటి మేలిరచనలను ప్రకటించినా ఫర్వాలేదనుకోవచ్చు. వెలలకోసం గాక, విలువలకోసం సాంస్కృతిక పోరాటం సాగుతూంది. సంస్థ నష్టపోగూడదుగాని, లాభాల వేటకు ఉత్తమత్వాన్ని బలిపెట్టనూ గూడదు. 


- పేరడీ ప్రక్రియ - రుక్మిణీనాథశాస్త్రి - పరిశీలన – కె.వి.ఆర్ - జరుక్ శాస్త్రి పేరడీలు ( P. 19-25 ) 


కె.వి. రమణారెడ్డి

జవహర్ భారతి కావలి

జరుక్ శాస్త్రి పేరడీలు

15-4-1982


మనువు చెప్పిన స్త్రీ ధర్మాలు - కర్లపాలెం హనుమంతరావు

 


మనువు చెప్పిన స్త్రీ ధర్మాలు 

- కర్లపాలెం హనుమంతరావు 


మనువు అనగానే నేటితరం ఒంటికాలు పై లేచి నిందలకు పూనుకుంటుంది  . ముఖ్యంగా స్త్రీలు . కారణం లేకపోలేదు. మనువు రాసినట్లుగా బాగా ప్రచారంలో ఉన్న మనుధర్మశాస్త్రం- ఐదవ అధ్యాయం( శ్లో. నెం 147 నుంచి 169 ) లో స్త్రీలకు సంబంధించి ధర్మాల పేరుతో మనువు మహిళల స్వేచ్ఛా స్వాతాంత్ర్యాల మీద కఠినంగా ఆంక్షలు నిర్దేశించాడు . 


న్యాయానికి నేటి సమాజంలో మారుతున్న కాలానికి అనుగుణంగా విముక్తి కోసం స్త్రీలు.. స్త్రీ జానాభ్యుదయవాదులు చేసిన , చేస్తున్న ఉద్యమాల ప్రభావంతో మనువు ధర్మ శాస్త్రంలో విధించిన ఆంక్షలన్నీ దాదాపు ఔట్ డేటెడ్  అయిపోయాయి. 


మనువు సూత్రాలు పాటించడం లేకపోయినా ఆ సూత్రాలను నిర్దేశించిన మనువు మాత్రం నేటికీ నిందల పాలవుతున్నాడు . ఇది గమనించ దగిన చిత్రం. ( నేను మనువును సమర్థించినట్లుగా భావించ వద్దని మనవి ) 


అసలు మనుధర్మ శాస్త్రంలో  స్త్రీకి సంబంధించింనంత వరకు మనువు చేత చెప్పబడిననిగా ప్రచారంలో ఉన్న  ధర్మాలు ఏమిటి? 


ఆ అంశంపై పాఠకుల కోసం ఇక్కడ సంక్షిప్తంగా సంక్లిష్టంగా లేని భాషలో  ఇవ్వడం జరిగింది . . ఆసక్తి గల పాఠకులు  ఒకసారి దృష్టి పెడతారనే ఉద్దేశంతో . 

- కర్లపాలెం హనుమంతరావు 

02 - 12- 2021 

బోథెల్ ; యూ. ఎస్. ఎ 


పంచమ అధ్యాయం


స్త్రీ ధర్మములు 


శ్లో . 147

బాలయా వా యువత్యా వా వృద్ధయా వాzపి యోషితా

న స్వాతంత్ర్యేణ కర్తవ్యం కించిత్కార్యం గృహేష్వపి.


బాలఅయినా, యువతిఅయినా, వృద్ధ అయినా స్త్రీ యింటిలో స్వతంత్రంగా ఏకార్యాన్నీ చేయతగదు.


శ్లో . 148

బాల్యే పితుర్వశే తిష్ఠే త్పాణి గ్రాహస్య యౌవనే

పుత్రాణాం భర్తరి ప్రేతే న భజేత్ స్త్రీ స్వతంత్రతామ్.


బాల్యంలో తండ్రి అధీనంలోను, యౌవనంలో భర్త అధీనంలోను, భర్త  మరణించిన తరువాత పుత్రుల అధీనంలోను ఉండాలి. కాని ఎప్పుడూ స్వతంత్రంగా ఉండటానికి వీలులేదు.


శ్లో 149నుండి శ్లో 151 వరకు 


స్త్రీ ఎప్పుడూ  తండ్రిని, భర్తను, కొడుకులను వదలి ఉండాలని అనుకోరాదు. అలా ఎడబాసి ఉంటే మాతాపితరులవంశాలకు రెంటికీ చెడ్డపేరు తెస్తుంది. ఎల్లప్పుడు భార్య నవ్వుముఖంతో మసలుతు యింటిపనులన్నీ దక్షతతో నిర్వహిస్తూ, ఎక్కువ ధనవ్యయం లేకుండా నడచుకోవాలి. తండ్రి లేక తండ్రి అనుమతితో సోదరులు వివాహం చేసిన భర్తతో జీవితాంతం అతనికి శుశ్రూష చేస్తూ జీవించాలి. ఆయన ఆజ్ఞను ఉల్లంఘించకూడదు.


శ్లో 152నుండి -శ్లో . 155 వరకు 


స్త్రీలకు వివాహ సమయంలో చెప్పే శాంతి మంత్రాలు, ప్రజాపతిహోమము మంగళార్థం చేయబడేవి. కాని మొదట వాగ్దాత్తం జరగటంలోనే భర్తకు భార్యమీద ఆధిపత్యం కలుగుతున్నది. భర్త భార్యకు ఋతుకాలంలోను, యితర సమయాలలోను యిహపర సుఖాల నిస్తాడు. సదాచార శూన్యుడైనా, పరస్త్రీలోలుడైనా, విద్యాదిసుగుణాలు లేనివాడైనా భర్తను పతివ్రత అయిన స్త్రీ నిరంతరం దేవునిలాగా పూజించాలి. పురుషుడు ఒక భార్య కాకపోతే వేరొక భార్యతో యజ్ఞం చేయవచ్చును. కాని స్త్రీకి భర్తతో కాక

వేరొక పురుషునితో యజ్ఞం లేదు. భర్త అనుమతి లేకుండా ఏవ్రతమూ లేదు . ఉపవాసమూ లేదు. ఎందువల్లనంటే భార్య భర్తృశుశ్రూషవల్లనే స్వర్గంలో పూజ్యురాలవుతుంది.


శ్లో .156 నుండి శ్లో. 160 వరకు 

వివాహిత సాథ్వి అయిన స్త్రీ భర్త ఉన్నా గతించినా భర్తకు విరుద్ధంగా ఏకార్యము చేయరాదు. గతించిన భర్త కప్రియమైన దే కొంచం చేసినా పరపురుషునితో కూడటం, శ్రాద్ధం చేయకపోవటంతో సమానమవుతుంది. భర్త మరణానంతరం పతివ్రత అయిన స్త్రీ కందమూల ఫలాలతో జీవించాలి. పరపురుషుని నామం కూడా ఉచ్ఛరించకూడదు. ఓర్పుతో నియమంతో ఏకభర్తకు విధించిన వ్రతాలను ఆచరిస్తూ ఆమరణం బ్రహ్మచర్యంతో ఉండాలి. బాల్యంలోనే బ్రహ్మచారులై వివాహం చేసుకోకుండా సంతానాన్ని పొందకుండా పుణ్యలోకాలను పొందిన బ్రాహ్మణ (సనకసనందన వాలఖిల్యాది) వంశములు వేనవేలున్నాయి. కనుక తనకు సంతానం లేదని దుఃఖించకూడదు. భర్త చనిపోయిన తరువాత పతివ్రత అయిన కాంత పుత్రులు లేనిదైనా పరపురుషసంగమం లేకుండా బ్రహ్మచర్య మవలంబిస్తే పుణ్యలోక ప్రాప్తిని పొందుతుంది.


శ్లో 161 నుంచి శ్లో 164 వరకు 


తనకు పుత్రుడు కలగాలనే కోరికతో పరపురుషసంగమాన్ని పొందే స్త్రీ యిహంలో నిందల పాలవుతుంది. పరంలో పుణ్యావాప్తిని పొందదు. పరపురుషునివల్ల కలిగిన సంతానం శాస్త్రీయసంతానం కాదు. ఇతరుని భార్యవల్ల కలిగిన సంతానం పుట్టించినవాడిది కాదు. పతివ్రతలయిన స్త్రీలకు ఎక్కడా రెండవ భర్త విధింపబడలేదు. దీనిని బట్టి వితంతువుకు పునర్వివాహం అప్రసిద్ధమని తెలుస్తుంది. నికృష్టుడైన భర్తను విడిచి గొప్పవాడైన మరొక భర్తను పొందే స్త్రీ యింతకు ముందే యింకొకడిని పెండ్లాడినది అనే లోకాపవాదుకు పాలవుతుంది. అంతే కాక మరణానంతరం నక్కగా పుడుతుంది లేక కుష్ఠు మొదలయిన నికృష్టమైన రోగాల పాలవుతుంది.


శ్లో 165 నుండి - శ్లో, 168 వరకు 


మనసా వాచా కర్మణా తన భర్తను వీడి పరపురుషుని కోరని స్త్రీ భర్త పొందిన పుణ్యలోకాలను పొందుతుంది. పతివ్రత అని పెద్దల చేత కొనియాడబడుతుంది. మనోవాక్కులచేత కూడా  వ్యభిచారం చేయరాదని దీని భావము. ఇలాంటి సత్ప్రవర్తన కలిగిన సవర్ణ అయిన భార్య తనకంటే ముందుగా మృతిచెందితే భర్త అయిన ద్విజుడు శ్రాతస్మార్తాగ్నులతోను, యజ్ఞపాత్రలతోను దహనం చెయ్యాలి. అలాంటి భార్యకై అంత్యక్రియలలో దక్షిణాగ్ని, గార్హపత్యా హవనీయాగ్నులను సమర్పించి, తనకు ఆమెవల్ల పుత్రులున్నా లేకున్నా, మరొకరిని పెండ్లాడి స్మార్తాగ్నులను గాని, వైది కాగ్నులనుగాని మరల ఆధానముచే ఏర్పరచుకోవాలి.


శ్లో . 169


ఈవిధానముతో మూడవ అధ్యాయంనుంచి చెప్పిన విధంగా పంచయజ్ఞాలను విడువకుండా భార్యతో కలసి రెండవదైన గృహస్థాశ్రమాన్ని డపాలి.


ఇది భృగుమహర్షిప్రోక్తమైన మానవధర్మశాస్త్రసంహితలో పంచమాధ్యాయము.


గమనిక: 

శ్లో 147-శ్లో 148... 9వ అధ్యాయంలో ప్రసిద్ధమైన వివాదగ్రస్తమైన 2, 3, 4 శ్లోకాలలోనూ  యిదే భావం పునరుక్తమవుతున్నది..


( ఆధారం-  మనుస్మృతి కి శ్రీ కె. ఎల్. వై. నరసింహారావు గారి తెనుగు సేత)  


Monday, December 6, 2021

తెలుగు పాత్రికేయం సమానార్థకాలకు ప్రయత్నలోపం - సి. రాఘవాచారి


తెలుగు పాత్రికేయం

సమానార్థకాలకు ప్రయత్నలోపం

- సి. రాఘవాచారి

తెలుగు పత్రికల భాషాసేవ అనన్య సామాన్యమైనది. వివిధ రంగాల్లోని సమాచారాన్ని పాఠకులకు తెలియజేయడంతో పాటు తెలుగుభాషా వికాసం కూడా పత్రికల కర్తవ్యంలో భాగంగా ఉండేది. వార్తాసంస్థలు ఇంగ్లీషులో పంపించే వార్తలను అనువాదంచేసి, ప్రచురించేటప్పుడు  సాధ్యమైనంతవరకు తెలుగు పదాలే వినియోగించాలని ఒకనియమం స్వచ్ఛందంగానే పాటించడం జరిగేది. దానిని నియమం అనడంకన్నా స్వభాషపట్ల అనురక్తిగా చెప్పడం ఇంగ్లీషు పదాలకు సమానార్థకాలు సృష్టించడం, అవి ప్రజలకు సులభంగా అర్థమయ్యేరీతిలో రూపొందించడం ఆరోజుల్లో సంపాదకవిభాగంలో పనిచేసేవారి ప్రాథమ్యంగా ఉండేది. కొత్తపదం వచ్చినప్పుడు మక్కికి మక్కి కాకుండా అర్ధాన్ని బట్టి, తెలుగులో సులభంగా అర్ధంగ్రహించటానికి వీలయ్యే సమానార్థకాన్నే స్థిరపరచి వాడేవారు. తెలుగును అధికారభాషగా ప్రకటించిన తరువాత ఈ ప్రయత్నంపట్ల ఉండాల్సిన శ్రద్ధాశక్తులు ఏ కారణంతో లోపించినా విచారకరం.


తెలుగుపాత్రికేయుల్లో సంపాదకులతోపాటు అనుభవజ్ఞులైనవారు ఈ విషయమై ఆవేదన పడుతున్నారు. ఆందోళన చెందుతున్నారు. ఇంగ్లీషు అనేకాదు, సంస్కృతం, ఉర్దూ పదాల వెల్లువలో తెలుగుభాష తన స్వరూపాన్ని పోగొట్టుకుంటున్నదా అనే బాధ సహజం. అవసరమైనప్పుడు అన్యభాషా పదాలు బాగా ప్రచారంలో ఉన్నవయితే వాటిని తెలుగుభాష విసర్గ సౌందర్య సౌష్టవాలు చెడకుండా వాడడంలో ఆక్షేపణలకు తావుండరాదు. కానీ, ఇప్పుడు జరుగుతున్నది అదికాదు. పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రమున్నట్లు ఇంగ్లీషుపదాలు శీర్షికల్లోనూ, వార్తల్లోనూ విశృంఖల స్వైరవిహారం చేస్తున్నాయి. సమస్యను పరిష్కరించడానికి పాత్రికేయులతోబాటు విశ్వవిద్యాలయాలు, వివిధ అకాడమీలు (ప్రత్యేకించి ప్రెస్ అకాడమీ) కలిసి ప్రయత్నిస్తే సమానార్థకాలసృష్టి అసాధ్యమేమీకాదు. తెలుగుభాష సమయ సందర్భాలనుబట్టి అన్యభాషాపదాలను స్వీకరించడానికి అనువైనది. ప్రాచీన సాహిత్యంనుంచి నేటి పత్రికలభాష వరకు వెయ్యేళ్ళచరిత్ర ఈ విషయాలను నిరూపిస్తోంది. గతంలో తెలుగుపత్రికలకు తెలుగులోనే వార్తలు పంపాలని విధిగా ఆదేశాలున్నరోజుల్లో సమానార్థకాలకోసం విలేకరి కొంత ప్రయాస పడాల్సివచ్చేది. కానీ ఆ ప్రయాస ఫలప్రదంగా

భాషకు, విలేకరి భాషాభివృద్ధికి తోడ్పడుతుండేది. 


అప్పుడు సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తరువాత కూడా ఇంగ్లీషు పదాల వాడకం పెరగడం ఒక విచిత్రమైన వైవిధ్యం, 

గతంలో వలె పత్రికల్లో రాజకీయాలకు పరిమితం కాకుండా, ఈ రోజు అనేక శాస్త్ర విజ్ఞాన విషయాలకు సంబంధించిన వార్తలను పాఠకులకు అందజేయడం విరివిగా పత్రికల్లో అదాజేయడం జరుగుతున్నది. పత్రికలలో ఉండే సహజమైన వత్తిళ్ల  కారణంగా పారిభాషక పదాలకు సమానార్థకాల ఇబ్బందితో కూడుకున్నప్పటికీ, ఆ కారణంతో అన్యభాషాపదాలను అదేపనిగా ఉపయోగించడం సరైనదికాదు. పరిభాష వెనుకఉండే భావాన్ని - సమానార్థకాలు స్వీకరించే సదవకాశం ఎక్కువ. సోవియట్ యూనియన్ లో గోర్బచెవ్  సంస్కరణలుగా 'గ్లాస్ నోస్త్ ', 'పెరిస్త్రోయికా' అనేపదాలు విరివిగా వార్తల్లో వచ్చేవి.  వాటికి  స్థూలంగా దగ్గరైన  'గోప్యరాహిత్యం', 'పునర్వ్యవస్థీకరణ' అనేపదాలు తెలుగులో వాడినందువల్ల పాఠకులు సులభంగా గ్రహించేపరిస్థితి ఉండేది. ఏదైనా సమానార్థకంకన్నా అన్య భాషా  పదమే పాఠకులకు అర్థమవుతుందనుకుంటే అది వినహాయింపు తప్ప సూత్రం కారాదు.


పారిభాషిక పదాలకు తెలుగులో సమానార్థకాలు రూపొందించడం లక్ష్యంగా తెలుగు అకాడమీవంటి సంస్థలను ఏర్పాటుచేశారు. శాసన, పరిపాలనా సంబంధమైన పదాలకు స్పష్టమైన ప్రసిద్ధమైన సమానార్థకాలు రూపొందించినప్పటికీ వాటివినియోగం పత్రికల ద్వారా ఆశించినంతగా లేకపోవడం బాధాకరమే. ఉదాహరణకు 'టాక్స్'ను తీసుకుంటే దానికి పన్ను' అని రాస్తుంటాం. అంతేగాకుండా సెస్సు, డ్యూటీ, లెవీ అనే బడ్జెట్ పారిభాషిక సాంకేతికార్థం భిన్నంగా ఉంటుంది. అయినా పైసంస్థలు రూపొందించిన పదాలకంటే ఎక్కువగా పాఠకులకు  ఆమోదయోగ్యమైనవాటిని పత్రికలు తమకుగా తాము సృష్టించుకుంటే అభ్యంతరం ఉండరాదు . ఆ ప్రయత్నం లేకపోగా సమానార్థకాలపట్ల అలసత్వం, తేలికభావన చోటుచేసుకోవడం విచారించదగిన విషయం.


జన వ్యవహారంలో అలవాటుపడిన అన్యభాషా పదాలు అన్ని భాషల్లోనూ ఉంటాయి. వాటికి భాషా ఛాందసం జోడించి విశ్వామిత్ర సృష్టితో సమానార్థకాలు రూపొందించాల్సిన పనిలేదు. ఒకవేళ అలా సృష్టించినా అవి ఆమోదయోగ్యత పొందడం కష్టం. తెలుగుమాత్రమేవచ్చి అన్ని రంగాలకు చెందిన సమాచారాన్ని పత్రికలద్వారా తెలుసుకోవాలనుకొనే పాఠకుడు ప్రమాణంగా ఉండాలి. తెలుగు పత్రిక చదవటానికి మరో రెండుభాషల పరిచయం అర్హతగా ఉండాల్సినస్థితి అపహాస్యభాజనం. బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వంలో అధికారభాషాయంత్రాంగం నిర్వహించిన కీర్తిశేషులు పి.వి. నరసింహరావు, పరిపాలనారంగంలో తెలుగు వినియోగంపై శాసనసభలో శ్వేతపత్రం (వైట్‌ పేపర్) ప్రకటించినప్పుడు అందులోని సమానార్థకాలపట్ల పత్రికల్లో పెద్దవిమర్శ సాగింది. 


ఒక ప్రసిద్ధసంపాదకుడు అయితే ధారావాహిక సంపాదకీయాల్లో భూరాజసము (ల్యాండ్ రెవిన్యూ) లాంటి పదాలను ఉటంకించి ప్రత్యాఖ్యానం వెలువరించారు. దీనికి స్పందించి నరసింహారావుగారు తెలుగురాక మరిన్ని భాషలు చదివినవారు తెలుగు భాషాభివృద్ధికి ఆటంకమని చెప్పినదాంట్లో అతిశయోక్తి ఉండవచ్చేమోగానీ ఇప్పటి స్థితినిబట్టి ఎంతో కొంత సరైన ప్రతిస్పందన అనిపిస్తోంది.


ప్రస్తుతం తెలుగు పత్రికల్లో, ప్రసార మాధ్యమాల్లో అవసరంలేకున్నా ఇంగ్లీషుపదాలు వాడటం ఎబ్బెట్టుగా తోస్తోంది. అచ్చమైన తెలుగుమాట దేవుడెరుగు, అసలు ఇంగ్లీషుమాటలు వాడితేనే అదేదో శ్రేష్ఠమన్న భావన చోటు చేసుకున్నది. ఒక పత్రికలో గతంలో పతాకశీర్షికల్లో కూడా భారత్ బదులు ఇండియా అని వాడేవారు. అది అప్పుడు చివుక్కుమనిపించినా ఇప్పటి పరిస్థితుల్లో కొంత మేలేమో అనిపిస్తోంది.  ప్రాంతీయ ప్రత్యేకతలను బట్టి భాషలో అక్కడికక్కడే అర్థమయ్యే పదాలు ఇతరత్రా వాడినందువల్ల గందరగోళం తప్ప మరేమీ

ఉండదు, 

కోస్తా ప్రాంతాల్లో వెలువడే ఎడిషన్లలో 'షురూ' అనే ఉర్దూ పదం కనిపిస్తోంది. ఏమైనా ఏ భాషపట్ల వ్యతిరేకత అక్కర్లేదుగానీ, మనభాషను సుసంపన్నం చేసుకోవడం అభిలషణీయం. ఈ అంశంపై పాత్రికేయుల్లోనే ఆత్మపరిశీలన అవకాశం కల్పించడం ద్వారా మిత్రులు టంకశాల అశోక్ ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో జర్నలిస్టులు, ప్రెస్ అకాడమీ, వివిధ విశ్వవిద్యాలయాల్లోని జర్నలిజం శాఖలు భాగస్వాములైతే ఆ ఫలితం అందరికీ చెందుతుంది.

( ' వార్త' 15-06-05- ఆధారంగా ) 

- సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

                   07-11-2021 


Monday, December 7, 2020

ఓ డోలోడు - కథానిక – రచయిత పేరు తెలియదు)- సేకరణ ః కర్లపాలెం హనుమంతరావు

 చేస్తున్న పని ఆపి కాలుతున్న చుట్టను ఒక దమ్ము లాగి మళ్లా పక్కనే పెట్టాడు సుబ్బులు. నడుముకు వారుతో తగిలించుకున్న వంకీతో డోలుకున్న వారు పట్టెల్ని మరోమారు లాగాడు. నిలబెట్టుకున డోలు కుడి మూతను నాలుగైదు సార్లు తట్టి  శృతి చూసుకున్నాడు. మళ్లా చుట్ట చేతిలోకి తీసుకుని రెండు మార్లు దమ్ములాగాడు. చుట్ట అయిపోవడంతో దూరంగా విసిరేశాడు. అదెళ్లి టెంకాయ చెట్టు మొదట్లో పడి అక్కడున్న నీళ్ల తడికి సుయ్యిమంది.

డోలును ఎడం మూత పైకి వచ్చేటట్లు తిప్పాడు. డోలు పుల్ల తీసుకుని దాని మీదా కొట్టి చూశాడు. అనుకున్నట్లు మోగలేదేమో 'ఛీ! దీనమ్మ' అనుకుంటూ డోలును మళ్లీ వంకీతో లాగడం మొదలుపెట్టాడు. కుడి మూత రంధ్రం నుంచి డోలు కర్ర మీదుగా ఎడం మూత రంధ్రంలోకి దూర్చుతూ డోలు కర్ర పట్టీ చుట్టూ ఉన్న వారుపట్టీలను లూజు లేకుండా బిర్రుగా లాగాడు.

సుబ్బులకు గొంతు కింద పోస్తున్న చెమట గుండె మీద నుంచి నడుం వరకు కారుతోంది. నల్లటి శరీరానికి నిమ్మచెట్ల మీద నుంచి వచ్చే గాలి తగలడంతో హాయిగా అనిపించింది. పక్కనే ఉన్న పై కండువాతో శరీరాన్ని తుడుచుకున్నాడు.

అలా నాలుగు సార్లు శృతి చూసుకున్నాక మిగిలిన వారును డోలు అడ్డకర్రల పట్టీగా నాలుగైదు వరుసలు చుట్టాడు. సొప్ప తీసుకుని ఎడం మూత కడెంలోకి చొచ్చుకొనొచ్చిన పిచ్చులపై ఆనించి గుండ్రాయితో తడుతూ పిచ్చుల్ని ఇంకా లోపలికి కొట్టాడు. ఎండ తగిలేటట్టు ముందు రోజు తయారు చేసి ఏలాడ గట్టిన బొట్టెల్ని తీసుకొనొచ్చాడు.  మంగలి పొదిలో నుంచి గోరుగాలు తీసుకుని గోగుపుల్లల చుట్టున్న బొట్టెల్ని జాగ్రత్తగా గుండ్రంగా కోసి వాటి నుంచి బైటికి తీశాడు. వాటిని ఎడం చేతి బొటన వేలుకు మినహా అన్ని వేళ్లకు పెట్టుకున్నాడు. గోతం పట్టని సరి చేసి డోలు కొట్టడం మొదలు పెట్టాడు.. పాల వరసల నుంచి .

యుద్ధానికి సిధమయ్యే సైనికుడిలా.. కళను సృష్టించబోయే ముందు కళాకారుడి ఆత్మనివేదనలా.. తదేక దృష్టితో సుబ్బులు దానిలో మునిగిపోయాడు.

ఇంటర్మీడియెట్ చదువుతున్న సుబ్బులు చిన్నకొడుకు కాలేజీ ఫీజుల కోసం కావలి నుంచి వచ్చాడు. సిటికేసర చెట్టు కింద, పొయ్యిలోకి కరతమ్మ పుల్లల్ల్ని చిదుగులుగా కొడుతూ తండ్రి వాయించే డోలుకు తలూపుతున్నాడు.

సుబ్బులు కూతురు అత్తగారింటి నుంచి వచ్చుంది. మళ్లా పంపాలంటే చీరన్నా పెట్టాల్సిందే. దారి ఖర్చులూ ఇవ్వాల్సిందే.

సాయబ్బుల పీర్ల పండక్కి వాయిస్తే ఈ దఫాకి మీ ఇద్దరి గొడవా వదిలినట్లే అన్నాడు వారం రోజుల కిందట సుబ్బులు. కానీ ప్రతి ఏడాదిలా ఈ ఏడు పీర్ల పండగ మేళం సుబ్బులుకు ఊరకే రాలేదు. పెద్ద తిరకాసే జరిగింది.

***

ఆ రోజు సుబ్బులు బస్టాండులో ఉన్నాడు. ఎవరో వస్తే గడ్డం చేస్తున్నాడు. సాయబ్బులపాలెం నుంచి మదర్సా హడావుడిగా వచ్చాడు. 'అరేయ్ సుబ్బులూ! ఈసారి పీర్ల పండక్కి మేళాల కోసం పెద్ద రబస జరిగిందిరా! అన్ని సావిళ్లోళ్ళు ఈసారి పక్కూరి నుంచి పిలిపిద్దాం'అన్నారు. 'కొత్తపట్నం, అలకురపాటి నుంచి తెప్పిద్దాం'అన్నారు.

గడ్డం చేస్తున్నోడల్లా ఆ మాటకు ఉలిక్కిపడ్డాడు సుబ్బులు. 'అవున్రా! మనూరోళ్ల కంటే కొత్తపట్నమోళ్ళు బాగా వాయిస్తన్నారని అంటున్నారు. ఎంత చెప్పినా వింటన్లే!'

'అదేందిరా మదర్సా! మీకు ఒడుగులైనా.. గిడుగులైనా మేమే కదరా వచ్చేది. చిన్నప్పట్నుంచి కలసి మెలసి తిరిగాం. గడ్డమైనా.. క్రాఫైనా ఎంతిస్తే అంతే తీసుకున్నాం. మన సాయబ్బులే.. మనోళ్లే.. అనుకున్నాం. ఇప్పుడేందిరా.. ఇదీ!' అన్నాడు.

'అవున్రా! నేనూ అదే చెప్పా! కానీ .. కుర్రోళ్లు .. ఎదిగొఛ్చారు కదా! ఇంటంలా! మిగతా మూడు సావిళ్లు మా చేయి దాటిపోయింది. మా సావిడి మేళం మాత్రం సుబ్బులన్నే అని గట్టిగా చెప్పొచ్చారా!' అన్నాడు.

సాయిబులపాలెం పెద్దలతో మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది. చివరికి ఆ ఒక్క సావిడీ ఒప్పుకుని బయానా తీసుకున్నాడు సుబ్బులు.

అన్నిసావిళ్ల పని ఒప్పుకుని పక్కూళ్ల నుంచి మేళగాళ్లను తెచ్చి పని జరిపిస్తే కాస్త డబ్బు మిగులుతుంది. అది అందరికి తెలిసిందే. పక్కూరోళ్లను మేళానికి పిలిచినా అట్లాగే చేస్తారు. కానీ ఈసారి సుబ్బులుకు ఆ అవకాశం లేదు. అదే అలవాటుగా మారితే ఈ ఊరు మంగలోళ్ల పరిస్థితి ఏమిటి? మేళాలన్నీ పక్కూరికి పోతే ఈ ఊరి మీద పట్టు పక్కూరికి పోద్ది. అది జరక్కూడదంటే పక్కూరోళ్లకంటే ఈ ఊరే మేలనిపించాలి. తమ సత్తా ఏంటో పీర్ల పండక్కి చూపించాలి అనుకున్నాడు.

గొల్లోళ్ల వెంకన్న దగ్గరికెళ్లి మంచి మేక తోలు తెచ్చి ఆరకొట్టాడు. డోలు కున్న మూతలు విప్పి నానేసి తోలు విప్పాడు. ఆరగొట్టిన కొత్తతోలు కడాలు సైజుకు తగ్గట్లు గోరుగాలుతో కోశాడు. ఎడం మూత రెప్ప కోసం మంచిగా తోల్ని సిద్ధం చేసుకున్నాడు. రెండు రోజులు బక్కెట్లో నానేశాడు. మూడు పూట్ల తొక్కి తోల్ని పొదగడానికి సిద్ధం చేశాడు. చిన్నకొడుకు ఊర్రాముల చిల్లరకొట్టు ఎదురుగా చింతిత్తులు ఏరుకొచ్చాడు. గుండ్రాయితో చిన్నచిన్న ముక్కలుగా చితక్కొట్టి నానేశాడు. సుబ్బులు పెళ్లాం వాటిని మెత్తగా రుబ్బి, వండి, మైదా కలిపి బందన తయారుచేసింది.

సుబ్బులు కడేలుకు బందన పూసి తోలు అతికించాడు. గట్టిగా అతుక్కునేందుకు బిరుసు గుడ్డతో అదిమాడు. ఎడం మూత పొదగడానికి వల్లూరు జగ్గయ్య దగ్గరికెళ్లి మిషను తెచ్చాడు. కడానికి తోలు అతికించి బాగా అత్తుకునేందుకు మిషను బిగించాడు. ఆరపెట్టాడు. రెండు మూతలు ఆరాక చింతగింజలు పెట్టి మధ్య దూరం సమానంగా ఉండేటట్లు చూసి కళ్లు(రంధ్రాలు) కోశాడు. అక్కడ తోలు నానడానికి గుడ్డపీలికతో వాటిని తడుపుతూ రోజంతా ఉంచాడు. ఎడం మూత ఆరాక దానిపై రెప్పను అతికించి మళ్లా పొదిగాడు. డోలు కర్రకు గుడ్డతో నూనె పూసి బాగా సిద్ధం చేసుకున్నాడు. కుడి మూత మధ్యలో నల్లటి బూడిదరాశాడు.

 

సుబ్బులు చిన్నకొడుకు, కూతురు కలసి ఇంట్లో పాత కద్దరు గుడ్డను అంగుళం వెడల్పు ఉండేటట్లుగా పేలికలు పేలికలుగా చించారు. రెండు గోగుపుల్లల్ని జానెడంతవి నరికి సిద్ధంచేసుకున్నారు. సిమెంటు, అన్నం కలిపి మెత్తగా నూరారు. గుడ్డలేలికలకు దానిని పూసి గోగుపుల్లలకి రెండు కొసల దానిని అంటించారు.  వాట్ని ఎండలో ఆరగట్టారు. అవి ఎండాక గోగుపుల్లల్నుంచి విడదీస్తే బొట్టెలు అవుతాయి.

ఆ రోజు సుబ్బులు పొద్దున్నె అన్నిట్నీ ముందేసుకుని కూర్చున్నాడు. డోలు కర్రని నిలబెట్టి కింద కుడి మూత, పైన ఎడం మూత పెట్టి రంధ్రాల గుండా వారు ఎక్కించాడు. మూతలు బిర్రుగా ఉండి, శృతి రావడం కోసం వారు పట్టీలకు వంకీ తగిలించి లాగుతున్నాడు.

లాగుతున్నాడే కానీ, పక్కురోళ్ల గురించి, వాళ్ల డోళ్ల గురించి, సన్నాయిల గురించి,వాళ్లు వాయించే విధానం గురించి ఆలోచిస్తున్నాడు. అంతే కాదు.. సొంతూర్లో పరువు నిలబడాలంటే ఎలా అని ఆలోచిస్తున్నాడు.

వాయించడం అయిపోయాక, అన్నిట్నీ నెమరు వేసుకున్నాక, డోల్ని మరోసారి సరిచూసుకుని పట్టెడ తగిలించాడు. గుడ్డ కప్పాడు. ఇంట్లో దేవుడి మూలనున్న పీటపై పెట్టొచ్చి ప్రశాంతంగా గాలి పీల్చుకున్నాడు. నిప్పెట్టె తీసి చుట్ట అంటించాడు. దమ్ములాగుతూ మార్కెట్లో ఉన్న పంచలోకి వెళ్లి కూర్చున్నాడు.

***

సుబ్బులూ వాళ్ళు నలుగురు అన్నదమ్ములు. పెద్దోడు సన్నాయి, రెండోవాడు .. అదే సుబ్బులు, మూడో వాడు మళ్లీ సన్నాయి, నాలుగోవాడు మళ్లీ డోలు.. వాయిస్తారు. వాళ్లయ్య చస్తూ చస్తూ ఊరిని, వృత్తిని చూపించిపొయ్యాడు. పక్కూరు మంగలోళ్లకు ఈ నలుగురు అన్నదమ్ములంటే హడల్. కాని, డబ్బులు బాగా ఇస్తారని ఈ కొత్తపట్నపోళ్లు, అలకురపోటోళ్లు ఒప్పుకున్నారు. ఈ విషయం నలుగురు అన్నదమ్ములకు తెలుసు. అందుకే వాళ్లు సన్నాయిల్ని కూడా గట్టిగా సిద్ధంచేసుకున్నారు.

పీర్ల పండగ రానే వచ్చింది. మొదట్రోజు సావిట్లోంచి పీర్లను దించడం. మామూలుగానే సాగిపోయింది. సుబ్బులు ఆ ఊరు మంగలోళ్లకున్న పీరు దగ్గరకు వెళ్లి 'మా పరువు నీవే కాపాడాల' అని వేడుకున్నాడు. పెళ్లాంతో కలిసి బొరుగులు, వేగించిన శెనగపప్పు, బెల్లం పీర్లకు ఇచ్చొచ్చాడు. తర్వాతి రోజు గుండం తొక్కడం కూడా అయింది. ఆ తర్వాతి రోజే పీర్ల ఊరేగింపు.

ఆ రాత్రి సాయిబులపాలెంలో ప్రతి సావిడి దగ్గర సినిమాలు, నాటకాలు, రికార్డింగ్ డ్యాన్సులు.. పోటీపడి వేస్తారు. వేకువ జాము మూణ్ణాలుగ్గంటలకు పీర్లు ఊరు చుట్టూ తిరుగుతాయి. ట్రాక్టర్ల మీద డూపు హీరోలు, హీరోయిన్లు ఎగురుతుంటే జనాలకు సందడే సందడి.

పదిగంటలకల్లా పీర్లు ఊరు చుట్టూ తిరుగుతుంటే నీళ్లతో వారు పోసేవాళ్లు పోస్తూనేవున్నారు. అందరు ఇళ్ల నుంచి బయటికొచ్చి చూస్తున్నారు. సాయిబుల పిల్లలు ఎగురుతుంటే దానికి అనుగుణంగా మేళం మోగుతోంది.

పీర్ల ఊరేగింపు తిరుగుతూ తిరుగుతూ ఊరి మధ్యలో ఉన్న రాంసామి మేడ దగ్గరి కొచ్చింది. పీర్లు అన్నీ వరుసగా నిలబడ్డాయి.  ఏ పీరు కాడున్న మేళగాళ్లు ఆ పీరు దగ్గర వాయిస్తున్నారు. సన్నాయిలు శృతిమించి మోగుతున్నాయి. జనాలందరూ విరగబడి చూస్తున్నారు, ఎగిరేవాళ్లు ఎగురుతూనే ఉన్నారు.

అప్పటికే మేళగాళ్లకి మందు సరఫరా అయింది. సుబ్బులుకి, వాళ్లన్నకు మందు అలవాటు లేదు. మిగిలిన పీర్లకాడ వాళ్లు తాగిన మైకంలో వాయిస్తున్నారు. అలకురపాటి ఎంకట్నర్సు రేపు చూసుకుందాం అన్నట్లు సుబ్బుల్ని చూసి తలెగరేశాడు. కొత్తపట్నం సీను సన్నాయిని గుండ్రంగా తిప్పుతూ సై అన్నట్లు చూశాడు. సుబ్బులుకు కోపం నసాళానికి అంటింది.' నా కొడుకులు వాయించేది తక్కువ.. ఊగేది ఎక్కువ' అనుకున్నాడు. నిటారుగా నిలబడి డోలు వాయిస్తున్నాడు. అట్లా పోటీ రంజుగా సాగుతుంటే 'టైం లేదు .. టైం లేదు.. పదండి.. పదండి' అంటూ సాయిబుల్లోని పెద్దలు పీర్లని ముందుకు కదిలించారు.

మరుసటి రోజు గుమ్మటాలు. అదే చివర్రోజు. గుమ్మటాలన్నీ ఊర్లోని పెద్ద బజారుగుండా సముద్రానికి వెళతాయి. అక్కడే వాట్ని కలిపేస్తారు.

ఆరు గంటలకల్లా గుమ్మటాలు సాయిబులపాలెంలో బైలుదేరాయి. ఒక్కో గుమ్మటం దగ్గర జనాలు ఇసకేస్తె రాలనంతగా ఉన్నారు. ఒకచోట ఒకరు చేతిరుమాలును పళ్ల మధ్య బిగించి నాగిని నృత్యం చేస్తుంటే, మరోచోట ఇంకోడు పులి డ్యాన్స్! ఇలా అన్ని గుమ్మటాల దగ్గరా కోలాహలం. ఊరు ఊరంతా కులం, మతం, ఆడ, మగ భేదాల్లేకుండా ల గుమ్మటాల చుట్టూరా ఉంది.

గుమ్మటాలన్నీ జాలమ్మ చెట్టు దగ్గరకు వచ్చాయి. అక్కడ బజారు పెద్దదిగా ఉంటుంది. నాలుగు గుమ్మటాలని వరసగా నిలబెట్టారు. వాటి ముందు మేళగాళ్లు.. వాళ్ల ముందు ఎగిరేవాళ్లు. పోటీ ప్రారంభమయింది అనుకున్నారు చూసేవాళ్లంతా. అప్పటికే వాయించేవాళ్లు తాగున్నారు. ఒక్కొక్కరు మోకాలి దండేసి డోలు కొడుతున్నారు. సన్నాయిని గాల్లోకి తిప్పుతు ఆకాశం కేసి చూస్తూ ఊదుతున్నారు.   రాగాలు, తాళాలు మారుమోగుతున్నాయి. ఎగిరేవాళ్లకు అనుగుణంగా వాయిస్తున్నారు.

సుబ్బులు నిశ్చలంగా నిలబడి ఒక మౌనిలా వాయిస్తున్నాడు. తాళాలన్నీ శృతికి అనుగుణంగా పడుతున్నాయి.

ఎంకట్నర్సు సుబ్బులు వంక చూసి కొత్త తాళం అందుకున్నాడు. అక్కడి సన్నాయిలూ అందుకు అనుగుణంగా మారిపోయాయి. సుబ్బులు కూడా కొత్తతాళం ఎన్నుకున్నాడు. కొత్త కళాసృజన ప్రారంభమయింది.

సుబ్బులు దుమికే జలపాతంలా మారిపోయాడు. జనాలందరూ సుబ్బులు డోలు చూడ్రా! ఎట్టా మోగుతుందో! అంటూ ఆ గుమ్మటం దగ్గరకు వచ్చేస్తున్నారు. వస్తూ వస్తూనే ఊగిపోతూ ఎగురుతున్నారు. డోలు గట్టిగా మోగుతోంది. మోగుతూ మోగుతూ ఒక్కసారిగా శబ్దం ఆగిపోయింది. డోలు కుడి మూత టప్పుమని పగిలిపోయింది. సుబ్బులుఉ నిశ్చేష్టుడైపోయాడు. ముఖాన నెత్తుటి చుక్క లేకుండా పోయింది. గుండె ఆగిపోయిందనుకున్నాడు. యుద్ధం మధ్యలో అస్త్రాలు కోల్పోయిన సైనికుడిలా నిలబడిపోయాడు.

అంతలో సుబ్బులు తమ్ముడు వెంకటేశ్వర్లు తన మెడలో ఉన్న డోలు తీసి సుబ్బులు మెడలో వేశాడు.'నువ్వు ఒక్కడివి చాలు. వాయించన్నా!'అన్నాడు. పక్కనే ఉన్న సుబ్బులు అన్న సన్నాయిలో కొత్తరాగాన్ని ఎత్తుకున్నాడు. సుబ్బులు తనను తాను నిలదొక్కుకున్నాడు. ఎడం మూతపై వేళ్లను సప్తస్వరాలుగా కదిలించాడు. కుడి మూత మీద పుల్లను దానికి తగ్గట్లుగా నర్తింపచేశాడు. ఇప్పుడు మంగలి సుబ్బులు సుబ్బుల్లా లేడు. మ్స్రొ సృష్టి చేస్తోన్న బ్రహ్మలా మారిపోయాడు.

ఆ ధ్వని అందరి మనసుల్లోకి చొచ్చుకునిపోతోంది. వాళ్లల్లో కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తోంది. అందరూ మంత్రముగ్ధుల్లా మారిపోయారు. అన్ని గుమ్మటాల నుంచి జనాలు వచ్చి చూస్తున్నారు. ఎగిరేవాళ్లు కూడా నిశ్చలంగా నిలబడిపోయారు. ఒక తపస్సమాధిలో ఉన్నట్లు సుబ్బులు వాయిస్తూనే ఉన్నాడు.

నిజానికి సుబ్బులు డోలు నేర్చుకోలేదు. తండ్రి వాయిస్తుంటే చూసి నేర్చుకున్నాడు. జవజీవాల్లో నిక్షిప్తమైన కళకు,  నేర్చుకున్న కళకు ఉన్న తేడా సుబ్బుల్ని చూస్తే తెలుస్తుంది.

వెంటనే వెంకట్నర్సు డోలు పక్కన పడేసి సుబ్బులు ముందు కొచ్చి 'అన్నా..' అన్నాడు. మిగతా గుమ్మటాల దగ్గర ఉన్న సాయిబులందరూ కూడా సుబ్బులు దగ్గర కొచ్చారు. మేళం రసపట్టులో ఉన్నప్పుడు ఎదుటివాడు డోలు మీద నుంచి పుల్ల తీయడమే ఒక పెద్ద అవమానం. కానీ, వెంకట్నర్సు 'అన్నా,.. మీ ఊరు మీదే!మా ఊరు మా ఊరే!' అన్నాడు ఉద్వేగంగా.

తర్వాత గుమ్మటాలు నెమ్మదిగా సముద్రం వైపు కదిలాయి. అప్పటికే సమయం రాత్రి తొమ్మిదయింది. సముద్రం నిశ్శబ్దంగా వెన్నెట్లో మెరుస్తోంది.

రచయిత (పేరు - తెలియదు) ;

(ఆంధ్రజ్యోతి ఆదివారం 16,మే, 2010 సంచికలో ప్రచురితం)

సెల్: 9848425039

సేకరణః కర్లపాలెం హనుమంతరావు

07, 12 డిసెంబర్, 2020






*** 

 

 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...