Sunday, December 12, 2021

గ్రహం ప్రమాదంలో లేదు; ఉన్నది మనమే ! - సేకరణ : కర్లపాలెం హనుమంతరావు

 గ్రహం ప్రమాదంలో లేదు. ప్రమాదంలో ఉన్నవి  మానవ జీవితాలే ! 

సోర్స్ : అన్ నోన్ 

- సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 


భూమి ప్రమాదంలో ఉందని చాలా మంది పర్యావరణ నిపుణులు ప్రజలకి భోదిస్తూ ఉంటారు. ప్రమాదంలో ఉన్నది ఈ గ్రహం కాదు.. మనమే!  


మననుషుల  మనస్సులు అరలు అరలుగా  కుచించుకుపోయాయి . చెట్లు విషయమే చూడండి. అది మన ఆత్మబంధువు. అవి ప్రసాదించే స్వచ్ఛమైన  ప్రాణవాయువుని మనం లోపలికి తీసుకుంటాం. మనం వదిలే కాలుష్య   బొగ్గుపులుసు వాయువుని అది  తన   లోపలికి తీసుకుంటుంది!మన ఊపిరితిత్తులలోని ఒక భాగమైన చెట్టుని వంటకోసం విరిచి పొయ్యిలో పెట్టేందుకు   సంకోచించం! 


ఇక .. మనది మాత్రమే అనుకునే ఈ శరీరం మనది ఒక్కళ్లదే కాదు. ఇదీ ఈభూగ్రహంలోని ఒక చిన్న ముక్క. ఆధ్యాత్మికత అంటే పైకి చూడ్డమో.. కిందకు చూడ్డమో మనకు అలవాటు. లోపలికి చూసుకోవాలని తెలుసుకోలేము. అంతర్ముఖత్వం సాధన చేసే వారికి అనుకున్నదంతా తన లోపలే లభిస్తుంది. 


ఆధునిక శాస్త్రవిజ్ఞానమూ విశ్వంలోఉన్న అణుబంధమే.  దేహంలోనూ ఓ బ్లూ ప్రింట్ మాదిరిగా ఉంటుందని చెబుతున్నది కదా! ఆ అవగాహనను పెంచుకొని  ప్రపంచాన్ని తనలో చూసుకోవడం  ఆధ్యాత్మికం అయితే .. ప్రపంచంలో తనని చూసుకోవడం విశ్వభావన అవుతుంది. 


ఈ గ్రహం మన మనుషులొక్కళ్లదే కాదు. మనిషికీ స్వార్థ బుద్ధి ఎందుకు పుట్టినట్లోతెలీదు. తననిదేవుడికి ప్రతినిధిగా భావించుకోడం అహంభావం కాక మరేమిటి? సాలెపురుగు కూడా తాను దేవుడికి ప్రతినిధి అనుకుంటుందేమో! ఈ గ్రహం మీది ప్రతి జీవికీ మనకు లాగే తమ జీవితమే ఉత్తమమైనదని ఎందుకు అనిపించకూడదూ! 


శారీరకంగా చిన్నవైనంత   మాత్రాన,  భౌతికంగా  కదలలేని స్థితిలో  ఉన్నంత మాత్రాన వాటి ప్రాధాన్యతను మనకోణంలో నుంచి తక్కువ చేసి చూపించలేం  కదా! అట్లా చూపిస్తే  ముందు మనకే మానవత్వం లేనట్లు లెక్క. వాస్తవానికి ఈ భూగ్రహానికి ఎటువంటి ప్రమాదం లేదు. మానవ జీవితాలకే ఉన్న ప్రమాదం ,అంతా!  


మానవత్వం పెంపొందితే గాని, ఈ పర్యావరణానికి సంబంధించిన ప్రాజెక్టులు జరుగుతాయని నేననుకొను. గవర్నమెంట్ ఎన్నో సిద్ధాంతాలను చేయవచ్చు. కానీ, వారు వీటిని ప్రజాస్వామ్య పద్ధతిలోనే అమలు పరచాలి. ఏదో ఒక నిరంతర ప్రచార  వ్వూహం ద్వారాగానీ, ప్రజలలో తగిన ఎరుకను తీసుకురావడంద్వారాగానీ చేయాలి. 


ప్రభుత్వాలలో ఉన్న వ్యక్తులు ఈ ఆలోచనలను బయటికి తెచ్చే విధానాలను వెతకాలి. ఒక సమయంలో భారతదేశంలో కుటుంబ నియంత్రణ గురించిన ప్రచారం జరిగింది. ఇప్పుడటువంటి ప్రచారం ఎక్కడా కనిపించడం లేదు. కానీ మనకేమీ పరిష్కారం దొరకలేదు కదా! మానవ జనాభాని అదుపులో పెట్టుకోకుండా, పర్యావరణం, భూమి, నీరు – వీటన్నిటి గురించి మాట్లాడటం అన్నది కేవలం శాస్త్ర పరిజ్ఞానం వల్ల ప్రజలు హైపర్-ఏక్టివ్ అవ్వడం వల్ల జరిగింది మాత్రమే! 


మీరు మానవ కార్యకలాపాలను నియంత్రించలేరు, మీరు మానవ జనాభాను మాత్రమే నియంత్రించగలరు. మానవాళి చేసే కార్యకలాపాలను మనం ఆపలేము. ఎందుకంటే ఇది వారి ఆశయాలను నియంత్రించడం అవుతుంది. ఈ రోజుల్లో మన ఆశయాలు ఏమిటంటే, ప్రతీవారూ కూడా అక్షరాస్యులు అవ్వాలనీ, వారికి ఎంతో పెద్ద కలలూ, లక్ష్యాలూ ఉండాలనీ! 


ఇప్పుడు ఉన్న జనాభా స్థాయితో.. వీటిని సాధించడం అన్నది ఎంతో కష్టం. మనం ఎరుకతో దీనిని నియంత్రించాలి. మనం ఎరుకతో దీనిని ఎక్కడ ఆపాలనుకుంటున్నామో నిర్ధారించుకోవాలి. ఇది చెయ్యడం అసాధ్యం అని నేను అనుకోను.


మనకి ఎటువంటి వనరులైతే ఉన్నాయో వాటికి సరిపోయే విధంగా మనం జనాభాను సమతుల్యం చేసుకోవాలి. మనం చేయగలిగినది ఇదే. అన్నిటికంటే సులువైన పని ఇదే. ఇది ప్రతి మానవుడూ  చేయగలదు. వారికి అవసరమైన విద్య, ఎరుక జీవితంలోకి తీసుకుని వస్తే ఇది జరుగుతుంది. 


అప్పుడు, మనం చెట్లని నాటనక్కర్లేదు. మనం ఈ భూమి నుంచి దూరంగా ఉంటే, చెట్లు వాటికవే పెరుగుతాయి. మీరు వాటిని ఆపలేరు. ఇది ప్రతీ మానవుడూ  అర్థం చేసుకోవాల్సిన విషయం. 


భూమి ప్రమాదంలో ఉందని ప్రజలు అంచనాలు వేస్తున్నారు. ఈ గ్రహం ఎటువంటి ప్రమాదంలోనూ లేదు. మానవ జీవితాలే ప్రమాదంలో ఉన్నాయి. మనం ఈ విషయాన్ని అర్థం చేసుకొని, దీనికి, ఏది అవసరమో అది 

సోర్స్ : అన్ నోన్ 

- సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

09 - 10 - 2021 

బోథెల్ : యా . ఎస్.ఎ 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...